breaking news
Chandrababu Naidu government
-
‘రీ సర్వే’పై దోబూచులాట!
సాక్షి, అమరావతి: భూముల తల రాతను మార్చేలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన భూముల రీ సర్వేను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా చేయలేక సతమతమవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఒక్క గ్రామంలోనూ రీ సర్వే పూర్తి చేయలేకపోయింది. గత జగన్ ప్రభుత్వం 8 వేలకుపైగా గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, అక్కడ డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తెచ్చింది. అధికారంలోకి రాకముందు ఆ రీ సర్వేపై ఇష్టానుసారం ఆరోపణలు చేసి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.రీ సర్వే మంచిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో తాను అభాండాలు వేసిన దాన్ని రద్దు చేయలేక కొన్నాళ్లు డ్రామాలతో కాలక్షేపం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ హయాంలో జరిగిన రీ సర్వే దేశానికే రోల్ మోడల్గా ఉన్నట్లు చెప్పడం, రీ సర్వే చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో.. రీ సర్వేలో తప్పులు సరి చేస్తామంటూ చంద్రబాబు కొత్తపాట పాడారు. మరోవైపు జగన్ హయాంలో 8 వేలకుపైగా గ్రామాల్లో పూర్తయిన రీ సర్వేను చూపించి కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.400 కోట్ల నిధులు తెచ్చుకున్నారు. అయినా ఆ నిధులను రీ సర్వే కోసం ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కనీసం రెవెన్యూ శాఖకు కొన్ని నిధులైనా ఇవ్వాలని ఆ శాఖ కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. సౌకర్యాలు లేవు.. సిబ్బందికి ఇతర పనులు రీ సర్వే చేసే బృందాలకు అవసరమైన కంప్యూటర్లు, రోవర్లు ఇవ్వకుండా రీ సర్వే చేయాలని ఒత్తిడి చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి సర్వే చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకుండానే సర్వే చేయాలంటూ మొక్కుబడి తంతు నడిపారు. మరోవైపు వీఆర్ఓలు, సర్వేయర్లకు ఇతర పనులు అప్పగించడంతో రీ సర్వే ముందుకు సాగలేదు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా నిరంతరం చేపట్టే అభిప్రాయ సేకరణ సర్వేలు, పింఛన్ల పంపిణీ తదితర పనుల కోసం వారిని పెద్ద ఎత్తున వినియోగించారు.ప్రధాని పర్యటనలు, యోగా డే ఇతర కార్యక్రమాల పనులన్నీ వారికే అప్పగించారు. ఆ పనుల్ని ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో రీ సర్వే చేయాలని రెవెన్యూ శాఖ చెప్పినా దాంతో తమకు సంబంధం లేదని, తాము చెప్పిన పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తహశీల్దార్లకు సైతం రెవెన్యూ పనులు చాలా ఉండడంతో రీ సర్వే గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఏడాదిన్నరలో ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేకపోయారు.రీ సర్వేలో మొదటి స్థానం ఎవరి ఘనత?గతంలో రీ సర్వే ప్రారంభమైన వెంటనే 19 నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఆయా భూములకు సంబంధించిన రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించే వారు. వారి రికార్డులు చూసేవారు. ఇప్పుడు అలా కాకుండా సర్వే అయిపోయాక రైతుల అభిప్రాయాలు తీసుకోవాలనే విధానాన్ని తెచ్చారు. దీంతో తప్పులు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో ఇటీవలే తప్పులు సరి చేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రీ సర్వేలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంతి పెమ్మసాని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గ్రామంలో కూడా సర్వే పూర్తి చేయకుండా ఏపీ ఎలా నంబర్ వన్గా నిలిచిందన్న దానికి ఆయన వద్ద సమాధానం లేదు. వైఎస్ జగన్ హయాంలో విజయవంతంగా రీ సర్వే జరగడం, 8 వేలకుపైగా గ్రామాల్లో సర్వే పూర్తయి కొత్త డిజిటల్ రికార్డులు అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైంది. రీ సర్వేకు ప్రోత్సాహకంగా వచ్చిన రూ.400 కోట్లు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం రీ సర్వేను మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వ తరహాలో విజయవంతంగా కొనసాగించలేకపోతోంది. -
స్కూల్ ఎంత ఘోరంగా ఉందో చూడండి... ఇప్పటికైనా కళ్లు తెరవండి
-
AP: సెల్ టవర్ ఎక్కిన పాస్టర్ చంద్రబాబుకి దండం పెట్టి అడుకుంటున్న..
-
ఒక్క రూపాయి కూడా రాలేదు... ఎంతో కొంత ఇవ్వండి సార్ ఉల్లి రైతుల ఆవేదన
-
పిల్లల్ని చూడడానికి లండన్ వెళ్తే గోలగోల చేశారుగా... జగన్కు ఒక రూల్... మీకు ఒక రూలా..?
-
మళ్లీ పడిపోయిన ఆదాయం.. ఏమి లెగ్ సార్ అది
-
ఉపాధి కూలీల పొట్టగొట్టిన బాబు
-
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సూపర్ సిక్స్ మోసాల ఖరీదు ఒక లక్ష 42 వేల కోట్ల రూపాయల పైమాటే...కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ ప్రజల డిమాండ్
-
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
⇒ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు. ⇒ తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు.. రెండో ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగనామం. ⇒ దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు.. తొలి ఏడాది రూ.3,218.48 కోట్లు, రెండో ఏడాది రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తంగా రూ.4,700.96 కోట్లు ఎగవేశారు. ⇒ ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేల చొప్పున రెండేళ్లలో రూ.36 వేలు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు ఒక్కపైసా ఇవ్వకుండా రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు చొప్పున ఇవ్వాలి. కానీ, సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా రూ.14,400 కోట్లు బకాయిపెట్టారు. ⇒ అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలే ఇచ్చి.. రూ. 30 వేలు ఎగ్గొట్టారు. తద్వారా రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ఇంటింటికీ బాండ్లు పంచిన టీడీపీ కూటమి నయవంచనకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ..’ అంటూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇంటింటికీ పంచిన బాండ్లు ప్రకారం తమకు రావాల్సిన మొత్తాన్ని లెక్కగట్టి వడ్డీతో సహా కొత్త ఏడాదిలోనైనా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే.. 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రకటించారు.సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. ఐదేళ్లలో చేకూరే లబ్ధిపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా కుచ్చుటోపీ పెట్టారు! చంద్రబాబు ప్రజలకు ఎగ్గొట్టిన ఆ మోసాల ఖరీదు ఏకంగా రూ.లక్షన్నర కోట్లు!!ఆ మోసాలకు సాక్ష్యాలు.. ఇంటింటా బాబు బాండ్లుమహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి, టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్ నంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నంబరును టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్ సిక్స్సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లలో ఒనగూరే ప్రయోజనాలను హోరెత్తించారు.టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో చెప్పారు. కానీ ఇంతవరకు ఆ బాండ్లలో ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో మోసపోయామని ప్రతి ఇంటా ప్రజలు ఆక్రోశిస్తున్నారు. సూపర్ సిక్స్ సహా వివిధ హామీల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఎగవేత..సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఇంతవరకు నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున 2024–25లో రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. 2025–26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అంటే.. ఈ ఏడాది నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినట్లే. ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.72 వేలు! ఇప్పటికే నిరుద్యోగ భృతి కింద యువతకు సీఎం చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయిపడ్డారు. సుఖీభవ బకాయిలు రూ.16,747.52 కోట్లుప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది దీన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. అంటే.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలకుగానూ రూ.పదివేలే విదిల్చి.. ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.ఆడబిడ్డ నిధితో ఎగ్గొట్టింది రూ.64,800 కోట్లు సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం మరొకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఏటా రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. 2024–25, 2025–26 బడ్జెట్లలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేలు చొప్పున చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.36 వేలు! ఆడబిడ్డ నిధి కింద సీఎం చంద్రబాబు మహిళలకు ఇప్పటికి రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే పెన్షన్ల పేరుతో వంచన..50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. తొలి ఏడాది వారికి పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లోనూ ఆ పథకానికి పైసా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాది కూడా ఎగ్గొట్టినట్టే. ఈ వర్గాలకు చెందిన వారికి ఎన్నికల హామీని నెరవేర్చకుండా రెండేళ్లలో పెన్షన్ కింద చంద్రబాబు రూ.96 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద ఇప్పటికే 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం చంద్రబాబు పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.తుస్సుమన్న ఉచిత బస్సు..మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్ల మేర ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26లో ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా.. అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు.తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు.తల్లులకు ఎగ్గొట్టింది రూ.19,848.64 కోట్లకుపైనే!తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు.‘దీపం’లో రూ.4,700.96 కోట్లు ఎగవేత..దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855 ఉంది. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. -
ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు
-
Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు
-
జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
Social Media Activist: జగనన్నపై అభిమానంతో పోస్టులు పెడితే అక్రమ కేసు పెట్టి
-
కొడాలి నాని అరెస్ట్.? పేర్ని నాని రియాక్షన్
-
Putta Shiva: తండ్రీకొడుకుల పర్యటన టూర్ ల జీవోలు సైతం గోప్యం
-
TJR Sudhakar: బాబు, లోకేష్, పవన్ కనబడుట లేదు.. ఏమైనట్టు.. నన్ను చెప్పమంటారా..
-
రియల్ ఎస్టేట్ చరిత్రలో లేదు... ఒక ఎకరం వెంచర్ కు 2వేల కోట్లు..
-
అప్పులో తోపు.. ఆదాయంలో ప్లాపు!
-
షెడ్లలో 108 కుయ్యో.. సమయానికి రాదు.. ప్రాణం నిలవదు!
-
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
-
నాడు రూ.16.. నేడు రూ.20
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులను నిలువునా దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్లో నిత్యావసర సరకుల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే చోద్యం చూస్తూ... మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా... అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి... ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కిలోకి రూ.4 చొప్పున పెంచేసి... వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతోపాటు ఫోర్టీఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి, ఫోర్టీఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్లో కిలో రూ.16కే లబి్ధదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ.20కి ఇస్తున్నట్టు ప్రకటించి అభాసుపాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్ను రూ.27.50కి వినియోగదారులకు ఇస్తే.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కిలో రూ.16కే అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్కు ఏకంగా రూ.4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. అరకొర పంపిణీకే హడావిడి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నెలకు 1,839 టన్నుల గోధుమలను అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1,690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులున్నాయి. వీళ్లందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15 వేల టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండడం... అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.బినామీల కోసమే రేటు పెంచేసి..చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీము సరికొత్త స్కామ్ను తలపిస్తోంది. ఇందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. ప్రభుత్వం ఎఫ్సీఐ నుంచి కిలో గోధుమలు రూ.6.10కి కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి... ఆ పిండిని కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రూ.20కు ఇస్తోంది. వాస్తవానికి నవంబర్ 5న సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలో గోధుమ పిండిని రూ.18కి ఇస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 24 ఇచ్చిన జీవోలో కిలో గోధుమ పిండి రేటును రూ.20గా పేర్కొంది.ఇంతలోనే అంత వ్యత్యాసం రావడం వెనుక బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.16కు అందించిన గోధుమ పిండి ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. అప్పుడు.. ఇప్పుడూ రేషన్ దుకాణ డీలర్ కమిషన్ రూపాయిగానే ఉంది. కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ ఏజెన్సీ తమ దగ్గర ఎంప్యానల్ అయిన కంపెనీలకు మాత్రమే మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలు ఇచ్చింది.ఇందులో విచిత్రం ఏమంటే.. చంద్రబాబు బినామీ, మంత్రి వియ్యంకుడికి చెందిన కాకినాడ జిల్లాలోని ఓ కంపెనీకి గోధుమ పిండి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు దక్కింది. సదరు కంపెనీ సరఫరా విధానంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టిన సర్కార్ నోడల్ ఏజెన్సీ ద్వారా అనుకున్నది చేసింది. ఇక్కడ ఎంప్యానల్ చేసిన మిల్లుల కంటే బహిరంగంగా టెండర్ పిలిస్తే పోటీ పెరిగి మిల్లింగ్, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. -
ఏపీలో అత్యంత దారుణంగా 108 సేవలు
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరి వేస్తోంది! కుయ్ కుయ్ మూగబోతోంది..! నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయ్! 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు! 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం.. సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం.. రోడ్డుపై రయ్ రయ్మంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలో 108 సేవల తీరును ‘సాక్షి’ బృందం రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా మారిన 108వాహనాలు శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ద్విచక్రవాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపైనా రాలేదు. చివరకు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ.. విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. రణస్థలం జాతీయ రహదారి–16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 సేవల నెట్వర్క్ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం.‘ఊపిరి’ ఆగుతోంది..! పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన అబ్బూరి శ్రీనివాసరావు ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా త్రిపురాపురం వద్ద ట్రిప్పర్ ఢీకొని గాయాలపాలయ్యాడు. 108 కోసం ఫోన్ చేయగా 20 నిమిషాలు గడిచినా రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. ఇక్కడ రెండు మండలాలకు ఒకే వాహనం ఉంది. పల్నాడు జిల్లాలోనే జలాల్పురంలో ఇటీవల మరియమ్మ అనే మహిళకు ఊపిరి అందకపోవటంతో మెరుగైన వైద్యం కోసం సీహెచ్సీ నుంచి 108లో గుంటూరు తరలించారు. తిరుగు ప్రయాణంలో బ్యాటరీ చార్జింగ్ లేక వాహనం మొరాయించడంతో రోగి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులు తోయాల్సి వచ్చింది. ఏలూరు జిల్లాలో పాత అంబులెన్స్లకు రంగులేసి నడిపిస్తున్నారు. అవి ఎప్పుడు మొరాయిస్తాయో చెప్పలేని దుస్థితి.ఏలూరు జీజీహెచ్లో మూలపడి ఉన్న 108 వాహనాలు పయ్యావుల ఇలాకాలో ‘హ్యాండ్సప్’.. అనంతపురం జిల్లాలో 108 సేవలు అస్తవ్యస్థంగా మారాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండలో ఇతర ప్రాంతాలకు చెందిన వాటిని బ్యాకప్గా వినియోగిస్తున్నారు. ఉరవకొండ వాహనం పాడవడంతో గుంటూరులో షెడ్డుకు పరిమితమైంది. రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న అనంతపురం జిల్లాలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు అత్యంత కీలకం. కానీ ఇవి మరమ్మతులకు గురవుతున్నాయి. బెడ్డు వద్దకు కాదు.. షెడ్డుకే! వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలో ఇటీవల స్పృహ కోల్పోయిన ఓ వ్యక్తిని కాపాడాలని కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వగా ‘108 వాహనం మరో చోటకు వెళ్లింది. కడపలో వాహనాలు అందుబాటులో లేవు. మరమ్మతులకు గురైన వాహనాలను పాత రిమ్స్లో షెడ్డుకు తరలించారు. చెన్నూరు మండలం నుంచి 108 రావడానికి దాదాపు గంట పడుతోంది. వచ్చే వరకు వేచి చూడాలి. లేదంటే ఆటో తీసుకొని కడపలో ఆస్పత్రికి వెళ్లాలి’ అని సిబ్బంది సలహా ఇచ్చారు. రోగిని తరలిస్తుండగా పేలిన టైరు.. నంద్యాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం బిల్లా బక్కన్న అనే వృద్ధుడిని 108లో తరలిస్తుండగా బండి ఆత్మకూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పేలి రోడ్డు మీద ఆగిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టైర్లు, బ్యాటరీల సమస్యలతో పలు వాహనాలు షెడ్డుకు పరిమితమయ్యాయి. దయచేసి వేచి ఉండండి...! విజయవాడ సిటీ పరిధిలో కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపు అరగంటకుగానీ చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రిఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పనికిరాని (కండెమ్) 108 వాహనాన్ని జీజీహెచ్ ఆవరణలో ఉంచారు. ప్రైవేట్ సేవలకు వేలకు వేలు.. చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు మొరాయిస్తున్నాయి. అరిగిన టైర్లతో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి సైరన్ కూడా పని చేయడంలేదు. ఆపదలో పది మందికి సాయపడాల్సిన 108.. నలుగురు తోస్తేగానీ కదలని దుస్థితి. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరుకు (30 కి.మీ) ప్రైవేటు అంబులెన్స్లో వెళ్లాలంటే కనీసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో తరచూ 18 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజూ 8 నుంచి 10 వాహనాలు షెడ్లకే చేరుతున్నాయి.అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ సంస్థలను కాదని అస్మదీయ సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఈ కాంట్రాక్టును అప్పగించింది. ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వీటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం క్షమార్హం కాదని ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకు బాగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో ఏకంగా నిబంధనలే మార్చేయడం గమనార్హం. – సాక్షి నెట్వర్క్ -
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి.. రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన చంద్రబాబు.. కొత్తగా సంపద సృష్టించగా పోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేసేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.1,785 కోట్లు పడిపోయింది.2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రూ.33,371 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34 శాతం తగ్గి రూ.31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8 శాతం పెరగడం గమనార్హం. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1 శాతం, తమిళనాడు 8.1 శాతం, కేరళ 8.4 శాతం, తెలంగాణ 5.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.నెలనెలా తగ్గుతున్న ఆదాయంరాష్ట్ర జీఎస్టీ ఆదాయం ప్రతినెలా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రూ.4,686 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోవడం.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6 శాతం వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు.చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. రెడ్బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జీఎస్టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలోనే డెంగీ మరణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో అమాయకులు డెంగీకి బలయ్యారని వైద్య, ఆరోగ్యశాఖ అంగీకరించింది. గత ప్రభుత్వంలో 2021 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదని గురువారం అధికారికంగా ప్రకటించింది. 2024లో ఇద్దరు, 2025లో ఐదుగురు చొప్పున రెండేళ్లలో ఏడుగురు డెంగీతో మరణించారని తెలిపింది. ‘డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం’ శీర్షికతో సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైంది. 2024, 2025ల్లో దేశంలో డెంగీ వ్యాప్తి, నమోదైన మరణాలపై ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అందులో పేర్కొన్న మేరకే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉందని సాక్షి పేర్కొంది.దీనికి గురువారం రాష్ట్ర వైద్యశాఖ ఇచ్చిన వివరణలో 2021 నుంచి దేశంలో డెంగీ వ్యాప్తి, మరణాల నివేదికను వెల్లడించింది. దీనిని గమనిస్తే 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా 2021లో 346 మంది, 2022లో 303 మంది, 2023లో 485 మంది డెంగీతో మరణించారు.రాష్ట్రంలో డెంగీ బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు పోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలో 2024లో 297, గతేడాది 95 మరణాలు నమోదయ్యాయి. కాగా.. 2025లో దేశం మొత్తం మరణాలు భారీగా తగ్గాయి. కానీ దేశంలో నమోదైన మరణాల్లో 5 శాతానికి పైగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్రజారోగ్య పరిరక్షణలో బాబు ప్రభుత్వం ఏ మేరకు విఫలమైందో తెలుస్తోంది. -
‘కిక్కు’రేగ్గొట్టింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మందుబాబుల తుక్కురేగ్గొట్టింది. జేబులకు భారీగా చిల్లుపెట్టింది. ‘ఫుల్లుగా తాగండి...తాగి ఊగండి..’ అన్నదే తమ అధికారిక విధానమని మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఎంతగా తాగితే టీడీపీ మద్యం సిండికేట్ ఖజానా అంతగా కాసులతో గలగల లాడుతుంది. అందుకే కొత్త సంవత్సరం వేడుకలను అవకాశంగా మలుచుకుని మద్యం ఏరులై పారించింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులిచ్చి మరీ మందుబాబుల జేబులు గుల్ల చేసింది. చివరి నాలుగు రోజుల్లోనే భారీగా రూ.585.70 కోట్ల విలువైన మద్యాన్ని తాగించేసింది. 2024లో చివరి నాలుగు రోజులతోపోలిస్తే 2025లో చివరి నాలుగు రోజుల్లోనే ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు ఏకంగా 11 శాతం, బీరు అమ్మకాలు 34.4 శాతం పెరగడం విభ్రాంతి కలిగిస్తోంది. సిండికేట్కు ఫుల్ జోష్.. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పాత రికార్డులను తిరగరాయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు తేల్చి చెప్పింది. అందుకే మద్యం విక్రయ వేళలను ఉదయం 6గంటల నుంచి అర్దరాత్రి 1గంట వరకు అధికారికంగా పొడిగించింది. తెల్లవారే వరకు మద్యం విక్రయించినా పట్టించుకోవద్దని ఎక్సైజ్, పోలీసు అధికారులను అనధికారికంగా ఆదేశించింది. ఫలితంగా 2024తో పోలిస్తే 2025 చివరి నాలుగు రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవిగో గణాంకాలు.. ⇒ 2024 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 5,18,844 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 2,42, 351 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.445.22 కోట్లు. ⇒ 2025 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 7,32,658 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,91,082 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.585.70 కోట్లు. ⇒ అంటే 2024లో చివరి నాలుగు రోజుల కంటే 2025లో చివరి నాలుగు రోజుల్లో ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 11.5శాతం, బీరు విక్రయాలు 34.4 శాతం పెరిగాయి. తద్వారా రూ.140.48 కోట్ల అధిక రాబడి వచి్చంది. ⇒ ఇక 2024 డిసెంబర్తో పోలిస్తే 2025 డిసెంబర్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్లో మొత్తం 33,88,275 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 11,25,050 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,568.18 కోట్లు. ⇒ కాగా 2025 డిసెంబర్లో మొత్తం 37,79,446 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 15,11,633 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,767.08కోట్లు. ఈ గణాంకాలన్నీ ఎక్సైజ్శాఖ అధికారికంగా వెల్లడించినవి. ఎమ్మార్పీ కంటే అధిక బాదుడు అదనం కాగా టీడీపీ మద్యం సిండికేట్ ఎమ్మార్పీ కంటే అదనంగా మందుబాబుల నుంచి దండుకుంది ప్రతి క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.50, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.30 అదనంగా వసూలు చేసింది. తద్వారా అనధికారికంగా మరో రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. టాప్లో విశాఖ డిసెంబర్లో మొత్తం 178.6 కోట్ల మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రూ.169.4కోట్ల మద్యం అమ్మకాలతో తిరుపతి జిల్లా రెండోస్థానంలో, రూ.155.4కోట్ల మద్యం అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. రూ.30.7 కోట్ల మద్యం అమ్మకాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ 34.4 శాతం నాలుగురోజుల్లోనే పెరిగిన బీర్ల అమ్మకాలు⇒ 11 శాతంనాలుగు రోజుల్లోనే పెరిగిన లిక్కర్ విక్రయాలు⇒ రూ.178.6 కోట్లు డిసెంబర్లో ఒక్క విశాఖ జిల్లాలో మొత్తం మద్యం అమ్మకాల విలువ⇒ రూ. 169.4 కోట్లు డిసెంబర్లో మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా -
ఏయూ దూర విద్యలో బీఈడీ కోర్సుకు మంగళం?
సాక్షి, అమరావతి: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) అసమర్థ పాలనలో కునారిల్లుతోంది. చంద్రబాబు ప్రభుత్వ స్వార్థ, కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ఉనికి, ప్రగతిని కోల్పోతోంది. దూరవిద్య బీఈడీ కోర్సులకు శాశ్వతంగా స్వస్తి పలికేందుకు సర్కారు పథక రచన చేస్తోంది. ఉపాధ్యాయులకు తీరని అన్యాయం కరోనా సమయంలో బీఈడీ స్టడీ మెటీరియల్కు యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) అనుమతి, ఇతర పరిశీలన కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఏయూలో దూరవిద్య బీఈడీ అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ అధికారులు డెబ్కు లేఖరాశారు. అటువంటి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్కు తన అనుమతి అవసరం లేదని డెబ్ తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని అప్పటి అధికారులు ఎన్సీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2023 డిసెంబర్లో వర్సిటీ అధికారులు సమర్పించిన వివరాలతో ఎన్సీటీఈ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పునఃగుర్తింపు కోసం వర్సిటీ అధికారులు ఎన్సీటీఈకి దరఖాస్తు పెట్టారు. ఇంతలో ఎన్నికల కోడ్, ఆ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసింది. ‘థర్డ్ మెథడాలజీ’పై అనిశ్చితి ఉపాధ్యాయులు తమ రంగంలో సబ్జెక్టు పెంచుకునేందుకు, ప్రమోషన్ల కోసం థర్డ్ మెథడాలజీని అభ్యసిస్తున్నారు. దీనిని దూరవిద్యలోనే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అలాంటిది కొన్నేళ్లుగా ఏయూలో థర్డ్ మెథడాలజీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడలేదు. బీఈడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ మెథడాలజీకి నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే ఆలోచనతో నిలిపివేశారు. తీరా బీఈడీ కోర్సు పరిస్థితి అగమ్యగోచరం కావడంతో.. థర్డ్ మెథడాలజీ విషయంలోనూ అనిశ్చితి ఏర్పడింది. వాళ్లకు ఇచ్చిన అనుమతి.. ఇక్కడెందుకు రావట్లేదు? ⇒ తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఈ ఏడాది సెపె్టంబర్లో ఎన్సీటీఈ నుంచి 500 బీఈడీ సీట్లతో కోర్సుకు అనుమతి తెచ్చుకుంది. ⇒ మైసూర్లోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీ సైతం ఎన్సీటీఈ నుంచి బీఈడీ కోర్సుల నిర్వహణకు అనుమతి పొందింది. ⇒ ఇక వైస్ చాన్సలర్ సహా ఇప్పటివరకు ఏయూ నుంచి ఒక్క అధికారి కూడా ఎన్సీటీఈని సంప్రదించి బీఈడీ కోర్సు పునః గుర్తింపు కోసం అడిగిన పాపాన పోలేదు. ⇒ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. రెండేళ్లలో రూ.3.50 కోట్లు నష్టం ఏయూలో 500 బీఈడీ సీట్ల భర్తీకి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 5–6వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు పోటీపడతారు. రెండేళ్ల కోర్సుకు రూ.35 వేల చొప్పున ఫీజు నిర్ణయించింది. అంటే ఏడాదికి రూ.1.75 కోట్లు ఆదాయం దూరవిద్య సంస్థ ద్వారా ఏయూకు వచ్చేది. రెండేళ్లలో వర్సిటీకి రూ.3.50కోట్లకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. బాబు బంధుప్రీతే కారణం చంద్రబాబు బంధుప్రీతి ఏయూను నిర్వీర్యం చేస్తోంది. విశాఖలోని తమ కుటుంబానికి చెందిన వ్యక్తుల కార్పొరేట్ విద్యా సంస్థకు మేలు చేసేందుకు ఏకంగా శతాబ్దాలు చరిత్ర కలిగిన ఏయూను దెబ్బతీసేందుకు వెనుకాడట్లేదు. ముందుగా దూరవిద్య నుంచి డ్యామేజ్ మొదలెట్టారు. అందులో భాగంగానే బీఈడీ కోర్సుల అనుమతి పునరుద్ధరణను కావాలనే పట్టించుకోవట్లేదని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి. త్వరలో అస్మదీయ కార్పొరేట్ విద్యా సంస్థ దూరవిద్యలోకి బీఈడీ కోర్సు వచ్చి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రభుత్వం దారుణంగా విఫలం
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది పిల్లలు చనిపోవడం చిన్న విషయమేమీ కాదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో పిల్లలు మృతి చెందారని చెబుతున్నారంటే... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో, తగిన వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే!– రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. విద్యార్థులు జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో చనిపోవడం అంటే ముందుజాగ్రత్త చర్యలు, తగిన వైద్యం అందించడంలో దారుణంగా విఫలమైనట్లేనని ఆక్షేపించింది. సంక్షేమ హాస్టళ్లలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో నిర్దిష్ట విధానం ఉందా...? అని ప్రశ్నించింది. ఉంటే దానిని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాస్టళ్లలో నెలలో ఎన్నిసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని, ఇప్పటివరకు సంభవించిన మరణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది. విద్యార్థులు ఏఏ కారణాలతో చనిపోయారో చెబుతూ, అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా అందించాలంది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన ఓ పిల్లో కూడా ఈ వివరాలు అన్నింటినీ పొందుపరచాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. కారణాలు తెలుసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, 45 మంది విద్యార్థులు చనిపోయారని పిటిషనర్ చెబుతున్నారని... అందుకు కారణాలు ఏమిటి? హాస్టళ్లలోని పరిస్థితుల నేపథ్యమా? లేక ఇతర అంశాలు ఉన్నాయా? అన్న విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. పిల్లలు మరణించినప్పుడు అందుకుగల కారణాలపై నివేదికలు ఉంటాయని, వాటిని కూడా కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ప్రతి 15 రోజులకు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని గ్రామాల్లోని ఏఎన్ఎంలకు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు వీలుగా ధర్మాసనం విచారణను 21కి వాయిదా వేసింది. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో పిల్లల బాగోగులు చూసేందుకు హెల్త్ వలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సంక్షేమ హాస్టళ్లలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయన్నారు. హెల్త్ వలంటీర్లను నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
బాపట్లలో టీడీపీ కార్యాలయానికి రెండెకరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బాపట్లలో రెండెకరాల భూమిని కేటాయించుకున్నారు. పశ్చిమ బాపట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1341–ఎ లోని రెండెకరాలను 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో ఆ భూమిని కేటాయించి ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు ధరగా నిర్ణయించారు. రెండు నెలల క్రితం తిరుపతి, మచిలీపట్నం నగరాల్లో కూడా అత్యంత విలువైన స్థలాలను ఆ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నారు. ⇒ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.50 కోట్లకు పైగా విలువైన 1.60 ఎకరాలను సంవత్సరానికి రూ.1,000 చొప్పున 33 ఏళ్లకు లీజుకిచ్చారు. ఆ భూమిని గతంలో రవాణా శాఖకు ఇచ్చినా ఆ కేటాయింపును రద్దుచేసి మరీ టీడీపీ జిల్లా కార్యాలయానికి అప్పగించారు. ⇒ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో రూ.100 కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని కూడా రూ.వెయ్యికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు. ⇒ అలాగే, కడప నగరంలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్నా, కోర్టు పరిధిలో ఉన్నా లెక్కచేయకుండా దాన్ని తన పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఇచ్చేశారు. విశాఖలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాలు ఇదిలా ఉంటే.. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ భూమిని ఎకరాకు రూ.80 లక్షల చొప్పున మొత్తం రూ.14.85 కోట్లు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్ కంపెనీ ఆన్షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం గతంలో ఇచ్చిన 9.88 ఎకరాల భూమి లీజును మరో మూడేళ్లు పొడిగిస్తూ ఇంకో ఉత్తర్వు ఇచ్చారు. ఇక నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు ఉచితంగా కేటాయించారు. ఆ భూమిని హార్టీకల్చర్, సెరికల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పేదలకు ఇవ్వకుండా పార్టీకి కేటాయింపులు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ హామీ గురించి పట్టించుకోలేదు. పైగా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా తన పార్టీ ఆఫీసులకు మాత్రం వందల కోట్ల విలువైన స్థలాలను కేటాయించుకుంటున్నారు. అంతేకాక.. గతంలో లీజుకు తీసుకున్న భూములపై ఇంకా అధికారాలు పెంచుకునేలా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించారు. -
రహస్య పర్యటనలో ఆంతర్యమేంటి?
సాక్షి, అమరావతి: పారదర్శకతకు పాతరేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రహస్యంగా విదేశీ పర్యటనలు చేయడం దుమారం రేపుతోంది. జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండటంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం ఏమిటనే ప్రశ్నకు అటు టీడీపీ నుంచి గానీ, ఇటు ప్రభుత్వం నుంచి గానీ సరైన సమాధానం రావడం లేదు. గత నెల 30న ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారు. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అఖిల భారత సర్వీసు సహా వివిధ స్థాయి అధికారులు అధికారిక విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు వెలువడతాయి. సీఎం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తారు. సీఎం పర్యటన ఉంటే భద్రతా ఏర్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి అందుకోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం జీవోను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం ఏమిటని రాజకీయ, మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు ఏమీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడాన్ని టీడీపీ నేతలు సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ ఐదు రోజుల క్రితమే రహస్యంగా విదేశాలకు వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే వివరాలు కూడా బయట పెట్టలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా గుడ్డిగా సమర్థించుకోవడం తప్ప, తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయి టీడీపీ శ్రేణులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. -
పాలకుల ‘బంగారు’ పిచ్చి
ప్రజా పథకాల అమలులో చిత్తశుద్ధి ముఖ్యం గానీ, పేరు మార్పుతో ప్రజలకు ఒరిగేదేముంది? కేంద్రంలో ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అమలు అధోగతి పాలై, వ్యవస్థ కుప్పకూలుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా చట్టం ద్వారా పథకం పేరు మార్చే క్రమంలో ఆర్డినెన్స్ తేవడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. కొత్త పేరు ‘స్వర్ణ గ్రామం’ ‘స్వర్ణ వార్డు’ అట! ఈ ‘స్వర్ణం’ పిచ్చి ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త కాదు. పాతికేళ్ల కింద ‘స్వర్ణాంధ్ర’ రాగాలు పాడారు. బంగారం ధరలు సామాన్యులకు అందనంత పైపైకి వెళుతుంటే, జనానికి చేరువగా పాలనను తెచ్చే పథకాలకు ఈ ‘బంగారం’ పేర్లేంటో అర్థమే కాదు!ప్రభుత్వ పాలనను పౌరులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో వికేంద్రీకృత ‘సచివాలయ’ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో 2019లో తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా ఏర్పడ్డవే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు. పౌరులకు పెన్షన్ వంటి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు రెవెన్యూ, విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయం, పశుపోషణ, మహిళా భద్రత వంటి వివిధ విభాగాల సేవల్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల్ని ఏర్పరచి, అందులో పది మందికి పైగా ఉద్యోగుల్ని నియమించి ఈ వికేంద్రీకరణ చేపట్టారు. ముందు కన్సాలిడేటెడ్ వేతనాలపై పనిచేసిన ఈ సిబ్బంది ఇప్పుడు పూర్తిస్థాయి స్కేల్–జీత భత్యాలు పొందుతున్నారు. దీనికి తోడు సగటున ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున ‘స్వచ్ఛంద సేవకుల’ను నియమించి, వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం నడిపింది. వాలంటీర్లకు నెలనెలా అయిదువేల రూపాయల గౌరవ భృతి ఇచ్చేది. సచివాలయానికి, గ్రామస్థులు/వార్డు పౌరులకు మధ్య సంధానకర్తగా ఉండే ఈ వాలంటీర్లు పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అప్పగించడం నుంచి పలు సేవలు అందించేది. కుల, జన్మ, మరణ ధ్రువపత్రాలను ఇప్పించడం, వేర్వేరు సేవలకు సంబంధించిన దరఖాస్తుల్ని సచివా లయం ద్వారా సంబంధిత శాఖా కార్యాలయాలకు చేర్చడం, సర్కారు స్పందనల్ని, పరిష్కారాల్ని పౌరులకు అందించడం వరకు వారికి సహాయకారులుగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ రద్దయింది. మొదట మొత్తంగా 15,000 పై చిలుకు సచివాలయాలు ఏర్ప డగా 1.34 లక్షల ఉద్యోగులు, 2.52 లక్షల వాలంటీర్లు ఇందుకోసం నియమితులయ్యారు. 35 విభాగాలకు చెందిన 500 సేవలు సకాలంలో, సజావుగా ప్రజలకు అందాలని, ఏ అంశమైనా గరిష్ఠంగా 72 గంటల్లో పరిష్కారమవ్వాలని ఉద్దేశించారు. అసలీ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే దిశలో సాగుతోంది. ఏపీ మంత్రివర్గంలోని ఒకరు ప్రైవేటు సంభాషణలో అన్నట్టు ‘ఆకాశాన్నంటుతున్న ధరలతో ఒక బంగారు చెవిపోగు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ స్వర్ణ గ్రామమేంటో, స్వర్ణ వార్డేంటో!’ అనే భావన అక్షర సత్యం. ఏపీ సీఎం చంద్రబాబు తొలిదఫా ముఖ్యమంత్రి అయిన కాలంలో ‘స్వర్ణాంధ్ర’ కలలు కనేది! అదే క్రమంలో ‘విజన్ 2020’ విధాన పత్రాన్ని ప్రకటిస్తే నాటి విపక్ష నేత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి దాన్నొక ‘దశాబ్ది ఉత్తమ కాల్పనిక పత్రం’గా విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ‘విజన్–2047’ అంటూ రెండు దశాబ్దాల కలల్ని ఇప్పట్నుంచే ఆమ్మ జూపుతున్నాయి. తక్షణ ఆచరణలో నిబద్ధత, చిత్తశుద్ధి లేకుండా సుదూర భవిష్యత్తుకు గేలాలు వేయడం, ‘బంగారు తాపడం’ పూయడం మాయ కాక మరేమవుతుంది? తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి పదేళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘బంగారు తెలంగాణ’ నినాదం కూడా విమర్శలను ఎదుర్కొంది. చేసేందుకు ఎంతో ఉంది!ఏపీలో పదిహేను వేల వరకున్న గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసం రోజూ ఆఫీస్ ఊడ్చేవారు లేరు. అందుకవసరమైన వ్యవస్థే లేదు. ఏమంటే ‘ఇందుకోసం నిధులు లేవు, జీరో బడ్జెట్’ అని నోడల్ అధికారిగా ఉన్న ఒక డిప్యూటీ ఎంపీడీవోనే చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద లక్ష్యాలతో వస్తే మొదట వాలంటీర్లతో చేయించిన పనులు ఇప్పుడు తమతో చేయిస్తున్నారనే ఆవేదన, తమ సేవలకు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆక్రోశం మెజారిటీ సచివాలయ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.‘సచివాలయ వ్యవస్థ’ తాజా స్థితిపై రాష్ట్రవ్యాప్త అధ్యయనం చేపట్టిన ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ పరిశీలనకు వస్తున్న అంశాలు ఆసక్తికరంగానే కాదు, ఒకింత ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. పెద్దమొత్తంలో ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఇలాగే నడిపిస్తే సమీప కాలంలోనే కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థ సమర్థ నిర్వహణకు సరైన నిఘా, నియంత్రణ, అజమాయిషీ తక్షణావసరమని సర్వేలో వెల్లడవుతున్న అభిప్రాయం. ఈ అధ్యయనం జరుగుతున్న సమ యంలోనే ‘పేరు మార్పు’ మంత్రివర్గ నిర్ణయం వెలువడింది. అవస రానికి మించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనేది ఒక విమర్శ. అందుకే, ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధం చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఇదివరకున్నట్టు అన్ని సచివా లయాల్లో 11 మంది కాకుండా, జనాభాను బట్టి 6, 7, 8 మంది సిబ్బందితో సరిపెట్టడం, ఆ మేర సర్దుబాటు చేయడం అనే ప్రక్రియ మొదలైంది. కానీ అది సవ్యంగా జరగటం లేదు. దాన్ని సరిగా జరిపించి, ఆశించిన లక్ష్యం మేరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో, సులభంగా అందేట్టు చూడాలి. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసే దిశలో ఇదొక మార్గం కావాలి. ప్రభుత్వం నిరంతర ప్రక్రియపాలనలోకి రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రభుత్వమన్నది నిరంతరంగా ఉండే ఒక బాధ్యత, అంతకు మించి జవాబుదారీతనం! నిన్నటి ప్రభుత్వ విధానాలను, పేర్లను నేడు గౌరవించక, గుడ్డిగా మార్చేసే వారికి రెండు, మూడు దశాబ్దాల ‘విజన్ ’ పేరిట కార్యక్రమాలు మొదలెట్టే నైతిక హక్కు ఏముంటుంది? ‘మీరు ఎన్నికైంది అయిదేళ్లకోసమే కదా, మీలాగానే మీ తర్వాత వచ్చినవారు మీ విధానాలను కొనసాగించక, పక్కన పడేస్తే ఏమిటి పరిస్థితి?’ అని అడిగితే ఏం సమాధానమిస్తారు! పైగా ప్రజోపయోగంగా విధానాలను సరిదిద్దకుండా పేరు మారిస్తే ఏమొస్తుంది? ‘ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అన్నట్టుంటే– గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థే కాదు, ఏదీ సవ్యంగా ఉండదు. పౌర సేవల్ని సజావుగా అందిస్తూ, పాలనను ప్రజలకు చేరువ చేసే చిత్తశుద్ధిని ప్రభుత్వాలు ప్రదర్శించాలి. ఇదే ప్రజాస్వామ్య ధర్మం!దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్, సోషల్ ఎనలిస్ట్;డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ -
నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.
-
వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు
-
AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు
-
KSR COMMENT : రాజకీయ అవకాశవాది..!
-
AP: వాట్సాప్ గవర్నెన్స్ కారణంగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
-
London : సింగపూర్, దుబాయ్ లలో చంద్రబాబు పెట్టుబడులనే విమర్శలు
-
KSR Live: బాబు గారి విజన్.. రూ.2.93 లక్షల కోట్లు!
-
వెంటిలేటర్పై... సంజీవని!
ఇప్పుడు ఉచిత వైద్యం కాదు.. రూ.లక్షన్నర వరకు బాదుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైనవారు సింహాద్రిపురం వారు. ఇలాంటి కేసులు ఒకటి రెండు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. – పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మడబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారటడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన స్వామి(65) ఆర్నెల్ల కిందట అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె రక్త నాళాలు పూడుకుపోయాయని.. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. కొద్ది రోజులు మందులు వాడాక సర్జరీ చేస్తామని సూచించారు. అక్టోబర్లో ఆరోగ్యశ్రీ కార్డుతో స్వామి, కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద అడ్మిట్ చేసుకోవాలని కోరారు. ‘ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం. బైపాస్ సర్జరీకి రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంత భరించే స్తోమత లేకుంటే వెళ్లిపోండి’ అని తేల్చిచెప్పారు. ఉసూరుమంటూ వెనుదిరిగిన స్వామి.. గతంలో వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత కోలుకునేవరకు ఆర్థిక ఆసరా.. -ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని భరోసా పేద, మధ్య తరగతికి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు రోజురోజుకు దూరం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛీత్కారం. అడ్మిట్ చేసుకున్నా శస్త్రచికిత్సలకు సకాలంలో అనుమతి రావడం గగనం. ఫలితంగా అప్పోసప్పో చేసి ఆస్పత్రిలో డబ్బు కట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిన దుస్థితి..! -ఇదీ ప్రస్తుతం చంద్రబాబు సర్కార్లో దుస్థితిమూడు ఆస్పత్రులు తిరిగినా...గుంటూరుకు చెందిన రమేశ్ ప్రైవేట్ ఉద్యోగి. కొన్నేళ్లుగా పైల్స్తో సతమతం అవుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ సూచించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స కోసం గుంటూరులోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రిని ఆశ్రయించాడు. ప్రభుత్వం నిధులివ్వడం లేదని, ఉచిత చికిత్సలు చేయడం లేదని, రూ.45 వేలు చెల్లిస్తే సర్జరీ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అంత స్థోమత లేని రమేశ్ మరో రెండు, మూడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లాడు. అక్కడా ఉచిత సర్జరీ చేయలేమని చెప్పడంతో రమేశ్ ఇంటికి వెనుదిరిగాడు. తీవ్రమైన పైల్స్ సమస్యతో బాధపడుతున్నాడు.సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, కడప/నెట్వర్క్: ఏ క్షణంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలకు జబ్బు చేసింది. ‘ఎన్టీయార్ వైద్య సేవ’ అంటూ పేరు మార్పులో ఉన్న శద్ధ్ర... పథకం అమలులో కొరవడింది. పేద, మధ్య తరగతికి కార్పొరేట్వైద్యం ఉచితంగా అందించే మహోన్నత లక్ష్యంతో దివంగత మహా నేత వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత సమర్థంగా అమలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఈ పథకంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడంతో వైద్యసేవలు వెంటిలేటర్పైకి చేరాయి. ఫలితంగా రాష్ట్రంలో అనారోగ్యం బారిన పడిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.⇒ 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. గద్దెనెక్కిన వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వ నిధులను దోచిపెట్టే బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసే పన్నాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా, పథకం అమలును గాలికి వదిలేశారు. ప్రభుత్వం తీరుతో ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచిత వైద్యం కోసం వచ్చినవారిని నిర్దాక్షిణీయంగా తిప్పి పంపుతున్నాయి.బకాయిల కోసం పోరుబాట పట్టినా...రాష్ట్రవ్యాప్తంగా 600పైగా ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులున్నాయి. వాటికి రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిని సాధించేందుకు అక్టోబర్లో వైద్యులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసి పెద్దఎత్తున ఉద్యమించారు. ఉద్యోగ భద్రత కోరుతూ ఆస్పత్రుల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆ సమయంలో బ్యాంక్ల నుంచి అప్పు తెచ్చి బకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తామని (వన్టైమ్ సెటిల్మెంట్) చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. కానీ, ఉద్యమం విరమించాక మెలిక పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చే పరిస్థితి లేదని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయానికి వచ్చాయి.రూ.లక్షల్లో గుంజేస్తున్న వైనంబిల్లుల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ ఆస్పత్రులకు అవకాశంగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెబుతున్నా పట్టించుకోకుండా డబ్బు కడితేనే వైద్యం అని రోగులకు తేల్చి చెప్పేస్తున్నాయి. ఓపీ ఫీజు, రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో, ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి వివిధ డయాగ్నస్టిక్స్, మందులు రాసి అందినంత గుంజేస్తున్నాయి. డెలివరీ, కంటి శుక్లాలు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మొదలు మెదడు, కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బుల బాధితుల వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదు. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందిస్తామని తొలుత నమ్మబలికి... రోగిని అడ్మిట్ చేసుకుని, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాక మరో సమస్య బయటపడిందని, దానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటూ దోచేస్తున్నాయి.ఈ ప్రభుత్వంలో పేదలను దోచుకుంటున్నారుకాలు ఫ్రాక్చర్ అయిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినవారి వద్ద ఏకంగా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల దాక వసూలు చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వర్మ సంచలన విషయం బయటపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలు దోపిడీకి గురవుతున్న తీరుకు వర్మ వ్యాఖ్యలే పెద్ద నిదర్శనం. వాస్తవానికి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ దగ్గర నుంచి వైద్య పరీక్షలు, ఇన్పేషెంట్ కింద సర్జరీలు, ఇతర సేవలన్నింటినీ అందించాలి. అంతేకాక డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే రోజున మందులను కూడా పూర్తి ఉచితంగా రోగికి ఇవ్వాలి. వైఎస్సార్సీపీ హయాంలో రోగి కోలుకునేదాక నెలకు రూ.5 వేల వరకు ఆరోగ్య ఆసరా కూడా అందించేవారు. ఈ ఆసరా సాయాన్ని బాబు ప్రభుత్వం అటకెక్కించింది.ఉన్నతాధికారి విన్నవించినా దిక్కు లేదుబకాయిల విషయంలో బాబు ప్రభుత్వం హామీలివ్వడం, అమలు చేయకుండా మొండిచేయి చూపిస్తుండడంతో విసిగిపోయిన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీనే కాదు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ (ఈహెచ్ఎస్) కింద ఉచిత వైద్య సేవలు అందించబోమని తేల్చి చెప్పేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర సచివాలయం ఉద్యోగి భార్య కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. తాడేపల్లిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి... ఈహెచ్ఎస్ కింద చికిత్స చేయాలని కోరారు. ఉచిత వైద్యం చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని, ముందు డబ్బు చెల్లించి, తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకోమని ఉద్యోగికి ఆస్పత్రికి యాజమాన్యం సూచించింది. చేతిలో అంత డబ్బు లేకపోవడంతో సదరు ఉద్యోగి సమస్యను సచివాలయం ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులకు సమస్య వివరించారు. స్పెషల్ కేస్ కింద పరిగణించి, ఉచిత వైద్యం చేయాలని ఆరోగ్య శ్రీ సీఈవోను కోరినా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్య వైద్యానికి రూ.లక్షల్లో సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు.రూ.60 వేలు అప్పు చేసి చికిత్సనెల కిందట అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లా. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని విజయవాడలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తామని చెప్పి చేర్చుకున్నా మూడు రోజులైనా సర్జరీ చేయలేదు. అదేమంటే... ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి రాలేదని చెప్పారు. రోజురోజుకు నొప్పి ఎక్కువ కావడంతో రూ.60 వేలు అప్పు చేసి సర్జరీ చేయించుకున్నా. పేదింటికి చెందిన నాకు అప్పు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సకాలంలో అనుమతిచ్చి ఉంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. –లాజరస్, తాళ్లపాలెం, మచిలీపట్నం.జగన్ హయాంలో పూర్తి భరోసా..ఆరోగ్యశ్రీ పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించి రాష్ట్రంలో పేదలందరికీ చేరువ చేశారు. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందేలా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. వైద్య ప్రక్రియలను ఏకంగా 3,257కు పెంచారు. రూ.వెయ్యికి పైగా ఖర్చయ్యే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేదలకు పూట గడవడం కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే వరకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున సాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు. 108, 104 వ్యవస్థలను గాడిన పెట్టారు. ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు వైద్యుల చొప్పున నియమించి గ్రామాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నడవలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో తీసుకున్న చర్యలు యావత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇంటింటి సర్వేలు, క్వారంటైన్ సెంటర్లు, వైద్యుల నియామకాల కోసం వాకిన్ ఇంటర్వ్యూలు, టెలి మెడిసిన్ తదితర సేవల పట్ల నాడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగాన్ని ఇంత సర్వోన్నతంగా మార్చేసిన స్థితి నుంచి.. చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గుండె ఆపరేషన్కు రూ.3.5 లక్షలు ఖర్చు చేశానాకు అక్టోబరులో గుండెపోటు వచ్చింది. ఒంగోలు కిమ్స్కు వెళ్తే వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లింపులు లేవని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయలేమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంగా చెప్పింది. సొంతంగా రూ.3.5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతోమంది పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకున్నారు. మందులు, ఆస్పత్రి ఖర్చులతో పాటు, కోలుకునేవరకు రోజుకు రూ.225 చొప్పున చెల్లించింది. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు.– కుక్కల వెంకటేశ్వర్లురెడ్డి, రాజుబంగారుపాలెం, చినగంజాం మండలం, బాపట్ల జిల్లాపేదవారికి దక్కని భరోసానేను చిన్నాచితక పనులతో జీవనం సాగిస్తున్నా. గుండె నొప్పితో బాధపడుతూ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి పంపారు. పరీక్షలన్నింటికీ డబ్బు చెల్లించాలని చెప్పారు. చేతిలో డబ్బు లేదు. అనారోగ్యంతో ఉన్నా చేసేదిలేక వెనుదిరిగా. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు మాలాంటి పేదలకు భరోసా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – వెంకటరెడ్డి, బొమ్మలసత్రం. నంద్యాలవైద్యం అందక మంచంపైనే..మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెళ్లి చేశాను. కొడుకు లారీ డ్రైవర్. అతడి సంపాదనే మాకు జీవనాధారం. నాకు మూడేళ్ల కిందట పక్షవాతం రాగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందా. కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో 15 రోజులకోసారి గ్రామానికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ఏడాదిన్నరగా ఊరికి వైద్యులు రావడం లేదు. మందులు కొనలేకపోయాను. మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స కుదరదంటున్నారు. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యా. – మేరమ్మ, గండేపల్లి, ఎన్టీఆర్ జిల్లా.డబ్బులు పడలేదని పంపించేశారునా భర్త పేరు శరవణరెడ్డి. వెనుకభాగంలో ఎముక అరిగిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాం. 20 రోజులు ఉన్నాం. ఆరోగ్యశ్రీ డబ్బులు పడలేదని చెప్పి.. ఆపరేషన్కు రూ.50 వేలు కట్టాలన్నారు. మా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాం. దీంతో మందులు రాసి డిశ్చార్జి చేశారు. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డుతో భరోసా దక్కడం లేదు. – దీపా, జంభూగోళంపల్లె, చిత్తూరు జిల్లా.ఆపరేషన్కు ముందే రూ. 8 వేలు ఖర్చునాకు కాలు విరగడంతో ప్రొద్దుటూరు నెట్వర్క్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి... ఎక్స్రే రాశారు. కట్టు కట్టారు. రూ.8 వేలు తీసుకున్నారు. మందులు కూడా డబ్బు పెట్టి కొన్నాం. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఇవ్వాలి కదా అని అడిగితే.. మీ ఫైల్ అప్రూవల్ కాలేదు. అన్నింటికీ డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అదనపు ఖర్చులు ఉండేవి కావు. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగానే ఆపరేషన్ చేసేవారు. కానీ, ఇప్పుడు దోపిడీ జరుగుతోంది. అడిగినా పట్టించుకునే నాథుడు లేడు. – రామరాజు, తొండూరు మండలం, వైఎస్సార్ కడప జిల్లాఅదనంగా చెల్లించాల్సి వచ్చింది...మా నాన్నకు తుంటి ఎముక విరిగింది. నెల్లూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే ఖరీదైన మందులంటూ రూ.20 వేలు అదనంగా వసూలు చేశారు. రశీదు కూడా ఇవ్వలేదు. మా అత్తకు కూడా కాలు విరిగి ఆస్పత్రికి వెళ్లాం. తొడ ఎముక చీలిపోయిందని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భయపెట్టారు. ఆరోగ్యశ్రీలో గిట్టుబాటు కావడం లేదంటూ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాయి. – బీబీజాన్, నెల్లూరు -
బాబు సర్కారు అప్పులు రూ.2.93 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పు...! భారీగా రుణాలు తీసుకుంటూ ప్రజలపై పెనుభారం..! సంపద సృష్టించడం దేవుడెరుగు... ఉన్న ఆస్తులు ప్రైవేటుపరం...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వ పనితీరు..! ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.93 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మంగళవారం బడ్జెట్ లోపల 7.54 శాతం వడ్డీతో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపలే బాబు సర్కారు రూ.1,65,637 కోట్లు అప్పు చేసినట్లయింది. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,27,632 కోట్లు అప్పు చేశారు. ఇందులో కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.80,245 కోట్లు రుణం తీసుకున్నారు. మరోపక్క రాజధాని పేరుచెప్పి ప్రపంచ బ్యాంక్, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ, హడ్కో, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్), నాబార్డు నుంచి ఏకంగా రూ.47,387 కోట్లు అప్పు చేసింది.సంపద లేదు అప్పే..!చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర సంపద పెంచడంలో, కొత్త సంపద సృష్టించంలో విఫలమైంది. భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై కొత్తగా అప్పుల భారాన్ని మోపుతున్నారు. బడ్జెట్ లోపల, బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించకపోగా... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేస్తోంది. వాస్తవానికి అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే నొక్కిచెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ రంగంలో ఆస్తులను కల్పించగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్పరం చేస్తోంది. మరోవైపు చేసిన అప్పులను మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు.కళ్లు మూసుకుపోయిన ఎల్లోమీడియా...కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లేని అప్పులను కూడా ఉన్నట్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసింది పచ్చ మీడియా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ సర్కారు అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించకపోతుండడం గమనార్హం. -
అనంతపురంలో పోలీసుల అత్యుత్సాహం
-
బాబు ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలపై పెను ఆర్థిక భారం
-
Medical Colleges: ప్రజామోదం లేని విధానాన్ని మార్చుకోవాలని YSRCP నేతలు డిమాండ్
-
బాబు.. బాదుడే బాదుడు
విద్యుత్ చార్జీల వీర బాదుడు...భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ చార్జీల అదనపు మోత... తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ చార్జీల భారం! ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝళిపించారు. తన మార్కు బాదుడుకు ఇదే నిదర్శనం అని చాటారు. సాక్షి, అమరావతి: అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. ‘‘రహదారి భద్రత సెస్’’ పేరిట ఏటా ఏకంగా రూ.270 కోట్లు బాదేయనుంది. యథాప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెరవెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రత సెస్ వేయాలని బాబు సర్కారు నిర్ణయించింది. వాహనాల లైఫ్ ట్యాక్స్లో ఈ సెస్ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా వాహనాల లైఫ్ ట్యాక్స్లో 28 శాతం జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట ప్రజలు భావించారు. కానీ, ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్తో చంద్రబాబు పన్నుల కొరడా ఝళిపించారు.⇒ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారు. వాటిపై లైఫ్ ట్యాక్స్లో 10 శాతం సెస్ వేస్తే నెలకు రూ.22.50 కోట్లు కానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా రూ.270 కోట్లు పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగినట్లే పన్ను భారం పెరుగుతుంది.రహదారి భద్రత ముసుగే... దోపిడీయే అసలు కథచంద్రబాబు ప్రభుత్వం వేసిన రహదారి భద్రత సెస్ అనేది దోపిడీ ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే... సెస్ బాదుడు ద్వారా వచ్చిన నిధులను ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే, సెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారిమళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్యఆరోగ్య, ఆర్అండ్బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా, ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్ పేరిట ఏటా వసూలు చేసే రూ.270 కోట్లను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు అడ్డదారిలో కాంట్రాక్టు పనుల పేరిట దోచిపెడతారని ఆరోపిస్తున్నారు.రిజిస్ట్రేషన్ల చార్జీలు 50 శాతం పెంపుచంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు రూ.వెయ్యి కోట్ల భారంపడింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలను 50 నుంచి 60 శాతం పెంచారు. అర్బన్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలు దండుకుంటున్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకుండా విలువను పెంచారు. ఫలితంగా అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారిపై భారంపడింది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం భూముల క్లాసిఫికేషన్లను మార్చేశారు. దీంతో ఏరియాను బట్టి కాక స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. గతంలో చార్జీలు రూ.2 లక్షలు ఉండగా, రూ.50 వేల వరకు పెరిగాయి.బాబు వస్తూనే బాదుడు మొదలు‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదు. అవసరమైతే తగ్గిస్తాం. వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం’’ అంటూ ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. ఇంతలా నమ్మబలికిన ఆయన అధికారం చేతికి రాగానే అసలు స్వభావం బయటపెట్టుకున్నారు. బాబు వస్తూనే రూ.15,485.36 కోట్ల భారీ భారాన్ని ప్రజలపై వేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్సీ అనుమతి లభించింది. అంటే, బాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.17,349 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు, సరికదా ఇంకా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వాడిన విద్యుత్కు సమానంగా అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇంతలేసి బిల్లులు కట్టలేం బాబూ అంటూ జనం గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.తాగునీటిపై యూజర్ చార్జీలు అనుకున్నప్పుడు అమలు!గ్రామాల్లో ప్రజలు తాగేందుకు రక్షిత పథకాల ద్వారా సరఫరా చేసే నీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ.1680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, అందులో రూ.1,036.97 కోట్లను ప్రజల నుంచి యూజర్ చార్జీలుగా పిండుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపి, ‘ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ రూపొందించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిప్రకారం రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగేచోట ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.26.66 చొప్పున ఏడాదికి రూ.320 భారం మోపనున్నారు. గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.20 వంతున ఏడాదికి రూ.240 యూజర్ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’’ పాలసీకి యూజర్ చార్జీల వసూలు ఎప్పటినుంచి అన్నది ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, నోటిఫికేషన్ ప్రభుత్వ జీవో రూపంలో జారీ అయినందున ఎప్పుడనుకుంటే అప్పటినుంచి యూజర్ చార్జీల వసూలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
-
రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం
-
అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు
-
Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం
-
బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి
-
టీటీడీ భూములు ప్రైవేట్ హోటల్స్ కు అప్పగింత బాబుపై శ్రీనివాసానంద సరస్వతి ఫైర్
-
Nagarjuna Yadav: రియల్ ఎస్టేట్లకు బంపర్ ఆఫర్ ప్రభుత్వమే భూములు దొంగతనం
-
రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్
-
హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి సైలెంట్ గా పోస్టింగ్
-
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
-
ఏపీ హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి బాబు సర్కార్ పోస్టింగ్
సాక్షి, విజయవాడ: హైకోర్టు చెప్పినా లెక్క చెయ్యని చంద్రబాబు ప్రభుత్వం.. హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి పోస్టింగ్ ఇచ్చింది. మార్టూరు సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు.. హైకోర్టు డ్రైవర్పై దాడి చేశాడు. అదే కేసులో గతంలో సీఐని ప్రభుత్వం వీఆర్కు పంపింది. సీఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. అదే సీఐకి చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్గా మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. సీఐకి పోస్టింగ్ ఇవ్వడంపై పోలీసు, హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. -
అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!
-
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
-
ఒక్కప్పుడే బాగుంది.. ఈ ప్రభుత్వంలో తిరుమల దర్శనం అంటే నరకమే
-
కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం 'గ్రామాలకు గ్రహణం'
సాక్షి, అమరావతి: గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు సర్కారు గ్రహణం పట్టిస్తోంది! పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను అడ్డుకుని దొడ్డిదారిన మళ్లించే కుతంత్రానికి తెర తీసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు విడుదలైన రూ.వందల కోట్ల నిధులను ఆయా స్థానిక సంస్థలు అక్కడ అవసరాలకు ఖర్చు పెట్టనివ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు ఇవ్వకుండా తొక్కిపెడుతున్న బాబు సర్కారు తాజాగా మరో అడుగు ముందుకేసి వాటిని తాము చెప్పిన పనులకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించడం ద్వారా గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచింది. బాబు సర్కారు కర్ర పెత్తనం..! 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా రూ.1,026 కోట్ల నిధులను ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం గరిష్టంగా కేంద్రం నుంచి నిధులు విడుదలైన పది రోజుల్లో వాటిని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి మూడు నెలలకు పైగా ఇతర అవసరాలకు వాడుకుంది. తప్పనిసరి పరిస్థితి కావడంతో ఎట్టకేలకు డిసెంబరు 18న ఆ నిధులను విడుదల చేసినా మరో మెలిక పెట్టింది. ఈ నిధులకు సంబంధించి తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఖర్చు చేయవద్దని ఎంపీడీవోలను ఆదేశించింది. వాటిని తాము చెప్పిన ప్రకారమే వినియోగించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇలా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై చంద్రబాబు సర్కారు కర్ర పెత్తనం చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుని గ్రామీణ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. గ్రామ పంచాయతీల పీక నులుముతూ చంద్రబాబు సర్కారు నిరంకుశంగా వ్యవహరించడం పట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తాజాగా జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియచేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సర్పంచుల పదవీ కాలం మరో మూడు నెలలే.. – నిధుల వినియోగంపై సర్క్యులర్ యోచనలో సర్కారు ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం మరో మూడు నెలలో ముగియనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2 కల్లా సర్పంచుల కాలం పూర్తవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా ఇచ్చిన రూ.1,026 కోట్లతో పాటు రానున్న మార్చి నెలాఖరులోగా రెండో విడతగా మరో రూ.1,000 కోట్లు కేంద్రం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు రావాల్సి ఉంది. ఇలా దాదాపు రూ.రెండు వేల కోట్లకుపైగా కేంద్రం నిధులిస్తున్నప్పటికీ బాబు సర్కారు స్థానిక సంస్థలకు అందకుండా అడ్డుపడుతోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా కాకుండా తాము చెప్పిన ప్రకారం వాడాలని ఆంక్షలు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేంద్రమిచ్చిన 15వ ఆర్థిక నిధులను సర్పంచులు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల అవసరాలకు అనుగుణంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచించే పనులకే ఖర్చు పెట్టేలా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఓ సర్క్యులర్ జారీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కరుణించినా.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు సర్కారు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఇస్తున్న నిధులను తొక్కిపెడుతూ తీవ్ర జాప్యం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను కేంద్రం గతేడాది సెపె్టంబరులో రూ.988.76 కోట్లు విడుదల చేయగా.. దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో ఆయా స్థానిక సంస్థల ఖాతాలకు చేరాయి. ఇక గతేడాదికి సంబంధించి రెండో విడతగా రూ.1,121 కోట్లను 2024 డిసెంబరులో కేంద్రం విడుదల చేస్తే.. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ ఏడాది సెపె్టంబరులో వాటికి మోక్షం లభించింది. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా రూ.998 కోట్ల కేంద్ర నిధులు 2024 మార్చి నెలాఖరులో విడుదలయ్యాయి. అయితే అప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమలులోకి రావడంతో అప్పటి అధికారులు ఆ నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్ 12వ తేదీనే బాధ్యతలు చేపట్టినప్పటికీ 2024 ఆగస్టు దాకా ఆ నిధులను ఆయా స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడం గమనార్హం. జగన్ హయాంలో..సర్పంచుల ఆధ్వర్యంలోనే చెల్లింపులు15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ప్రత్యేకించి గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వైఎస్సార్ సీపీ హయాంలో అడుగులు ముందుకు పడ్డాయి. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల ప్రభుత్వాలు వారి పరిధిలో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను ఖర్చు చేసుకునే కొత్త విధానం గత ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ట్రెజరీ ఆంక్షలు లేకుండా, ఆ నిధులను ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకు ముందు టీడీపీ హయాంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులపై నియంత్రణను సీఎఫ్ఎంఎస్ పరిధిలో ఉంచడంతో గ్రామ పంచాయతీలు మొక్కుబడి కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. కళ్ల ముందు కేంద్రం ఇచ్చిన నిధులున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ వద్ద బిల్లులు పాస్ కాకుండా అడ్డంకులు సృష్టించడంతో గ్రామీణ స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ఇది .. బ్లాక్ మెయిల్ చేయడమే! రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం దారుణం. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్థానిక సంస్థలు ఆ నిధులు వినియోగించకూడదని ఆదేశించడం గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి వ్యతిరేకం. విజయనగరం జడ్పీ సీఈవో ఈమేరకు సర్క్యులర్ జారీ చేయడం అంటే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేయడమే. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటి? స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలసి ఉద్యమానికి సమాయత్తం అవుతాం. –వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు ఉపసంహరించుకోకుంటే ఉద్యమమే.. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆక్షేపణీయం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వినియోగించుకోనివ్వకుండా అడ్డుపడుతూ సర్క్యులర్ జారీ చేయడం శోచనీయం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 15 ఆర్థిక సంఘం నిధులను ఖర్చు పెట్టకూడదని పంచాయతీరాజ్ కమిషనర్ ఆంక్షలు విధించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన సర్చార్జీ, స్టాంప్ డ్యూటీ నిధులు ఇవ్వడం లేదు. మినరల్ సెస్ రూపంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సీనరేజ్ నిధులను కూడా ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతూ వస్తోంది. సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం కూడా చెల్లించకుండా వారిని అగౌరవ పరుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులపై సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమించక తప్పదు. –మామిడి అప్పలనాయుడు, లోకల్ గవర్నమెంట్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు. -
పసుపు పోస్టింగులు
సాక్షి, అమరావతి: ఓ నిరుపేద వృద్ధురాలికి పింఛను ఇవ్వడానికి చేతులు రావు.. ఓ వికలాంగుడికి పింఛను మంజూరు చేయడానికి మనసొప్పదు.. పేద విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బులుండవు.. రైతుకు మేలు చేసే ఆలోచనే ఉండదు.. కానీ, తన ప్రచారం కోసం.. తన కుమారుడి రాజకీయ లబ్ధి కోసం ఉన్నవీ లేనివీ కల్పించి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రత్యర్థులపై గోబెల్స్ ప్రచారం చేయడం కోసం నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తూ పార్టీ వారికి రకరకాల పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. సోషల్, డిజిటల్ మీడియా పేరుతో వందల మందిని నియమించారు. చేసే పని చంద్రబాబును, ఆయన కుమారుడిని కీర్తించి, ప్రత్యర్థులపై రాళ్లేయడమే అయినా, వారికి చెల్లించేదంతా ఖజానా నుంచే. అంటే ప్రజాధనమే. ఇక కన్సల్టెంట్ల పేరుతో తన వారిని ఇబ్బడిముబ్బడిగా నియమించేస్తూ వారికీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, యువ నిపుణులు, కన్సల్టెంట్ల పేరుతో చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికి ఖజానా నుంచి భారీ వేతనాలతో పోస్టులు కట్టబెడుతున్నారు. నెల నెలా రూ.కోట్లలో చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలా వందల మందిని నియమించారు. తాజాగా సోషల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్టు విధానంలో నియామకానికి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నెలకు రూ.75 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్లు.. మొత్తం 48 పోస్టులను సృష్టించి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. తొలుత ఏడాది పాటు అంటూ ఆదేశాలు జారీ చేసి, ఇటీవల మంత్రులు ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు కొనసాగుతారని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో భారీ వేతనాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో 85 మందిని నియమించారు. తాజాగా వారిని మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 58 మందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్కు నెలకు రూ.1.20 లక్షలు, 12 మంది కంటెంట్ డెవలపర్స్కు నెలకు రూ.75 వేల చొప్పున, 30 మంది సోషల్ మీడియా ఎనలిస్ట్లకు నెలకు రూ.30 వేల చొప్పున, 15 మంది డిజిటల్ ప్రచారకులకు నెలకు రూ, 25 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో నియమితులైన మరో 27 మందిలో డిజిటల్ డైరెక్టర్కు నెలకు రూ.1.75 లక్షల వేతనం చెల్లిస్తారు. క్రియేటివ్ కన్సల్టెంట్కు నెలకు రూ.1 లక్ష చొప్పున, మిగతా వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ. 74 కోట్లు ఖర్చు చేసేశారు. మరోపక్క పీ–4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి భారీగా డబ్బు ముట్టజెపుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12.60 కోట్లు చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50.40 కోట్లు ప్రజాధనం చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలు ఇస్తూ నియమించారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించి, రూ.3.28 కోట్లు చెల్లిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి బోర్డులో ఆరుగురు కన్సల్టెంట్లను రూ.3.66 కోట్లతో నియమించారు. మంత్రుల పేషీల్లో, డిజిటల్ కార్పొరేషన్లో, మిగతా చోట్ల నియమితులైన వారంతా టీడీపీకి చెందిన వారే. టీడీపీ ప్రచార దళమే. -
ఊరు చేరని యూరియా! మళ్లీ ‘కట్ట’ కట..
పల్నాడు జిల్లా జమ్మలమడక గ్రామంలో టీడీపీ నాయకులు సోమవారం అక్రమంగా యూరియా తరలించేందుకు యత్నిస్తుండగా అన్నదాతలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతపల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం 240 యూరియా బస్తాలొచ్చాయి. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 50 మంది రైతులకు వంద బస్తాలు పంపిణీ చేయగా.. మిగిలిన 140 బస్తాలను స్థానిక టీడీపీ నేతలు దారి మళ్లించారు.సాక్షి, అమరావతి: ఖరీఫ్లో కట్ట యూరియా కూడా దొరకక అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. పొలం పనులు వదిలేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరుగులు తీశారు. ఒకపక్క సీజన్లో పెట్టుబడి సాయం అందక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోయి.. దిగుబడులు దిగజారి.. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు దక్కక.. మరోపక్క కనీసం ఎరువులు కూడా సమకూర్చలేని చంద్రబాబు సర్కారు అసమర్థతతో నిలువు దోపిడీకి గురయ్యారు. ఇంత జరిగినా ఈ ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం.. కనీసం ఈ సీజన్లో అయినా తగిన ప్రణాళికతో యూరియా పంపిణీ చేయాలన్న ఆలోచన లేకుండా పోవడం రైతన్నలను కలవరపరుస్తోంది. ప్రస్తుతం రబీలో కూడా యూరియా కష్టాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కట్ట యూరియా బ్లాకులో రూ.350 నుంచి రూ.500 పెట్టి కొనాల్సిన అగత్యం దాపురించిందని రైతులు వాపోతున్నారు. పైగా యూరియా ఇవ్వాలంటే.. నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు బలవంతంగా అంటగడుతున్నారు. సరిహద్దు జిల్లాలకు చెందిన రైతులైతే రవాణా చార్జీలు పెట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లి యూరియా కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు. సొసైటీలకు చేరే అరకొర నిల్వలను అధికార టీడీపీ నేతలు దొడ్డిదారిన పక్కదారి పట్టిస్తున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబీ సీజన్లో యూరియా కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు ఇదీ..! వరి, జొన్న, మొక్కజొన్నకే ఎక్కువగా.. రబీ సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడిచింది. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం 51.75 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 25.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. డిసెంబర్ 23 నాటికి వరి 5.60 లక్షల ఎకరాల్లో సాగవగా, శనగ 6.67 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 4 లక్షల ఎకరాలు, మినుము 3.77 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి, జొన్న, మొక్కజొన్న పంటలకే యూరియా ఎక్కువగా అవసరం. ఈ సీజన్లో వరికి ఎకరాకు 125 కేజీలు, మొక్కజొన్నకు 200 కేజీలు, జొన్నకు 80 కేజీల చొప్పున యూరియా అవసరం. మూడు నాలుగు దఫాల్లో దీన్ని మొక్కలకు అందించాల్సి ఉంటుంది. సీజన్ ఆరంభం నుంచి యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. రబీ సీజన్కు 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం 5.83 లక్షల టన్నులు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 3.93 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు మొదటి విడతగా యూరియా వేయాల్సి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. ఈ సీజన్లోనూ యూరియా కోసం రైతులకు తప్పని పాట్లు టోకెన్లతో తిప్పలుఖరీఫ్లో మాదిరిగా రబీలో కూడా యూరియా దొరకకపోవడం రైతన్నలను కుంగదీస్తోంది. సొసైటీలు, రైతు సేవా కేంద్రాలకు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఖాళీ అయిపోతుందో అంతుబట్టని దుస్థితి నెలకొంది. కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్టాక్ వచ్చిందని తెలియగానే పెద్ద ఎత్తున రైతులు సొసైటీలకు చేరుకోవడంతో సీరియల్ నంబర్లతో టోకెన్లు ఇచ్చి పంపించేస్తున్నారు. చెప్పిన సమయానికి వెళ్లినా సరే ఇంకా రాలేదు.. రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. దారి మళ్లిస్తున్న టీడీపీ నేతలునంద్యాల జిల్లా పాములపాడులో వారం క్రితం రెండు లారీల యూరియా వచ్చింది. ఒక్కో రైతుకు రెండు బస్తాలిచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు యూరియా రాలేదు. దీంతో అదునుకు యూరియా దొరక్క రైతులు బ్లాకులో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.500 చొప్పున కొంటున్నారు. పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులు, నానో యూరియాను బలవంతంగా అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. యూరియాతో సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేటు వ్యాపారుల వద్దకే చేరుకుంటున్నాయి. బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. ఏపీలో యూరియా పెద్దఎత్తున దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం, అధికార పార్టీ నేతల అండదండలతో యూరియా దారి మళ్లుతోంది. సారా, బీర్ల తయారీతో పాటు పెయింట్, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో యూరియాను విచ్చలవిడిగా వాడుతున్నారు.పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలి స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ కోరారు. జేసీలు, వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులతో బుధవారం ఆయన మంగళగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అధిక వినియోగం, పంట కాలానికి మొత్తంగా ఒకేసారి కొనుగోలు చేయటం, అవసరానికి మించి ముందుగా కొని నిల్వ చేసుకోవడం వంటి విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు ద్వారా యూరియా వినియోగం తగ్గించేలా చూడాలన్నారు. పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో యూరియా అధిక ధరలకు అమ్మటం మొక్కుబడి తనిఖీలు వంటి అంశాలపై వార్తలు వస్తున్నాయన్నారు. ఎకరానికి 10 బస్తాలు నష్టపోయా.. వరి కోశాక నెల క్రితం మూడు ఎకరాలు జొన్న సాగు చేశా. ప్రస్తుతం 15 బస్తాలు యూరియా అవసరం. అడిగితే రేపు మాపు అంటున్నారు. ఖరీఫ్లో సక్రమంగా యూరియా వేయకపోవడంతో ఎకరానికి దాదాపు 10 బస్తాలు దిగుబడి తగ్గిపోయింది. రబీలో కూడా యూరియా అందకపోతే జొన్న దిగుబడి తగ్గుతుంది. – తాడికొండ శ్రీనుబాబు, కుచ్చెళ్ల్లపాడు, వేమూరు మండలం, బాపట్ల జిల్లాపలుకుబడి ఉన్న వారికే.. 10 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. మండలంలో నాలుగు సొసైటీలు ఉన్నాయి. ఏ సొసైటీకి వెళ్లినా రేపు రావాలంటున్నారు. మాలాంటి వాళ్లు క్యూలైన్లో గంటల తరబడి నిల్చున్నా యూరియా దొరకడం లేదు. మార్కెట్లో కట్ట రూ.450–500కు అమ్ముతున్నారు. ఖరీఫ్లోనూ ఇలాగే ఇబ్బంది పడ్డాం. – తాడిబోయిన శ్రీనివాసరావు, కంఠంరాజు కొండూరు, గుంటూరు జిల్లాఏడాది మొత్తం అవస్థలే.. యూరియా బస్తా రూ.260.50కు అమ్మాల్సి ఉండగా మార్కెట్లో రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఆర్బీకేల్లో ఎలాగూ ఉండడం లేదు. సొసైటీల్లో కూడా లేదంటున్నారు. బ్లాక్లో అమ్మేవాళ్లకు మాత్రం ఎక్కడ నుంచి వస్తుందో తెలియడం లేదు. యూరియా కోసం ఏడాదంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. – పగడాల నరేష్, కె.ఒడ్డిపల్లి, తిరుపతి జిల్లా రైతుకు ఏమిటీ దుస్థితి! నేను 4 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నా. 20 బస్తాల యూరియా అవసరం. పట్టాదారు పాస్ పుస్తకంపై బస్తాకు మించి ఇవ్వడం లేదు. బ్లాక్లో బస్తా రూ.500–600 వరకు అమ్ముతున్నారు. రైతులకు సరిపడినంత యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ఒకటే. –బూటు అప్పారావు, బాతువ, జి.సిగడాం మండలం, శ్రీకాకుళంరెండు బస్తాలిస్తే ఏం చేయాలి? నేను 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. 25 బస్తాల యూరియా అవసరం. రెండు బస్తాలిస్తే ఎలా సరిపోతుంది? బహిరంగ మార్కెట్లో కొందామంటే రూ.350 నుంచి రూ.500 వరకు చెబుతున్నారు. తమిళనాడు వెళ్లి కొనుక్కోవాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం రూ.10 వేలు దాకా అదనంగా పెరిగింది. – రామ్రమేష్, ముడిపల్లి, నగరి మండలం. తిరుపతి జిల్లా అంతా బ్లాక్ మార్కెట్కే..సీజన్లో సాగయ్యే పంటలను బట్టి 5.5–6 లక్షల టన్నులకు మించి యూరియా అవసరం ఉండదు. 9.38 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇప్పటికే 3.93 లక్షల టన్నుల అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. యూరియా పెద్దఎత్తున బ్లాక్ మార్కెట్కు వెళ్తోంది. పంటల వారీగా డిమాండ్, అమ్మకాల వివరాలను ప్రకటించాలి. –ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ -
మెడికల్ కాలేజీల భూములు ప్రైవేటుకే.. చంద్రబాబు ఆఫర్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలేజీల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలకు సరైన సంఖ్యలో బిడ్డర్లు ముందుకు రాకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో, ప్రైవేటు సంస్థలకే నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రాజెక్టులు ఆర్థికంగా సాధ్యసాధ్యాల పరంగా ముందుకు సాగేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని సీఎం ఆదేశించారు. మెడికల్ కాలేజీల భూములను ప్రైవేటు సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ఇప్పటికే వచ్చిన సింగిల్ బిడ్కే టెండర్ను అప్పగించాలని ..మిగిలిన కాలేజీలకు మాత్రం మళ్లీ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. మరిన్ని ప్రైవేటు సంస్థలను పోటీకి ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. -
ఎంత తిరిగినా పింఛన్ ఇవ్వడం లేదు
‘మేడం.. మా నాన్న మహబూబ్బాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. మా అమ్మ హమిదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్లు పని చేయక మంచం పట్టింది. గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో రాడ్లు వేశారు. అయినా అతి కష్టంగా ఇన్నాళ్లూ పాలిష్ కటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం.. మా అమ్మా నాన్నలకు పింఛన్ అయినా ఇప్పించండి.. లేదా నా కిడ్నీలు అమ్ముకుని మా అమ్మనాన్నలను పోషించుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన అన్వర్బాషా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నాడు. ఎంపీడీఓ సావిత్రి అతని నుంచి అర్జీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరుకు కృషి చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదని, కనీసం ఇలాంటి వారిపట్ల అయినా కనికరం చూపడం లేదనే విషయం అక్కడ చర్చకు వచ్చింది. – దొర్నిపాడు -
బాబు స్కామ్ల రోత.. కేసుల మూత 'కేసులు కంచికి'!
నిధులు కొల్లగొట్టారు.. నిగ్గు తేల్చిన ఈడీ.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్లు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. సాక్షి, అమరావతి: బరితెగించి అవినీతికి పాల్పడటంలోనే కాదు.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేయడంలోనూ చంద్రబాబు తన ‘స్కిల్’ ప్రదర్శిస్తున్నారు! నాడు ఆధారాలున్నాయన్న సీఐడీ వాదనతో ఏకీభవించి న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధిస్తే.. నేడు అసలు ఆధారాలే లేవంటూ కోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు తెగబడుతున్నారు! 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసుకు అర్ధ్ధంతరంగా తెరదించేందుకు టీడీపీ కూటమి సర్కారు కుతంత్రానికి సిద్ధపడింది. ఇప్పటికే చంద్రబాబుపై ఫైబర్ నెట్, మద్యం కేసులను అడ్డగోలుగా మూసివేసిన ప్రభుత్వం.. తాజాగా స్కిల్ స్కామ్ కేసుకు గురి పెట్టింది. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’.. పేరిట ఆ కేసును క్లోజ్ చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నింది. తానే దొంగా.. తానే పోలీసూ!!తాను ప్రధాన నిందితుడిగా ఉన్న అవినీతి కేసులను ఏడాది క్రితం ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించినప్పుడే చంద్రబాబు ఈ కుతంత్రానికి తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించారు. అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్తోపాటు యావత్ పోలీసు, న్యాయ శాఖలను లూథ్రా గుప్పిట్లో పెట్టారు. ఆ కేసుల్లో చార్జ్షీట్లను అటకెక్కించారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ కార్పొరేషన్ పూర్వ ఎండీ మధుసూదన్రెడ్డి, అసైన్డ్ భూదోపిడీపై న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇలా అందరినీ బెదిరించి లొంగదీసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్కు తెచ్చింది. ఈ పన్నాగానికి పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం ‘స్కిల్’ కుంభకోణం అడ్డగోలుగా మూసివేత కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. స్కిల్ కుంభకోణంలో ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన తీరు ఇదీ.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కానే కాదు... బాబే ‘స్కిల్’ క్రిమినల్..! స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ అనే పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పొరపాటుగా అభిప్రాయపడ్డాం...! కానీ అసలు అవినీతే లేదు..! అని సీఐడీ పచ్చ పాట పాడుతోంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లోనే సీఐడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో సహా నిగ్గు తేల్చడం గమనార్హం.రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి..సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. అయితే చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించలేదు. ఇక అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసింది. ఈ కుంభకోణానికి రాచబాట పరుస్తూ మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు కూడా చేశారు. డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఆ కుంభకోణం బయటపడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చింది. సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆ అవినీతి ఆధారాలతో సహా నిగ్గు తేలింది.సీమెన్స్ కంపెనీ ముసుగులో...2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ కనికట్టు చేశారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీవో జారీ చేశారు. అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టేందుకు కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మభ్యపుచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్తో తమకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంటూ సిట్కు సీమెన్స్ కంపెనీ పంపిన ఈ–మెయిల్ అవినీతిని నిర్ధారించిన కాగ్..రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) సైతం చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.కాగితాలపై ప్రాజెక్టు చూపించి...జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని చంద్రబాబు కొల్లగొట్టారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి, సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని చంద్రబాబు ప్యాలస్కు తరలించారు. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ పక్కా ఆధారాలతో ఛేదించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షీట్ కూడా నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యలు సాకుగా చూపడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు.అవినీతి సొమ్ము.. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకే!స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారానే బదిలీ చేసినట్లు కూడా ఆనాడు సీఐడీ నిగ్గు తేల్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం తమ బ్యాంకు ఖాతాల్లో భారీస్థాయిలో నోట్లను మార్పిడి చేయడం గమనార్హం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలలో టీడీపీకి బ్యాంకు ఖాతాలున్నాయి. ఆ బ్యాంకు ఖాతాలను సీఐడీ అధికారులు విశ్లేషించడంతో అసలు విషయం బయటపడింది. 2016–18లో ఆ ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం పెద్ద నోట్లను డిపాజిట్ చేయాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్లకు సంబంధించి అయితే రూ.20 వేలకు మించిన డిపాజిట్లపై కేవైసీ నిబంధలను పాటించడం తప్పనిసరి. డిపాజిట్ చేసినవారి పేరు, పాన్ నంబరు, ఫోన్ నంబరు, ఐడీ ప్రూఫ్ మొదలైన వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసినా సరే... కేవైసీ నిబంధనలను పాటించలేదు. అసలు ఎవరు ఆ నోట్లను ఇచ్చారో ఆ వివరాలు ఏవీ బ్యాంకులకు సమర్పించనేలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ స్కామ్కు పాల్పడటం గమనార్హం. అంటే స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు స్పష్టమవుతోంది. సీఐడీ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. అయినా సరే ఆధారాల్లేవు..! మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్..! అంటూ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో సీఐడీ వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది.‘స్కిల్’ స్కామ్ కేసు మూసివేతకు పక్కా పన్నాగం..‘స్కిల్’ స్కామ్ మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకోసం టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ను సీఐడీ వల్లె వేస్తోంది. ఆ కేసులో ఆధారాలు లేవని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా ముద్రవేసింది. ‘ఆ కేసును ఇక క్లోజ్ చేయాలని భావిస్తున్నాం.. మీ అభిప్రాయాన్ని వారం రోజుల్లో చెప్పండి..’ అంటూ అప్పటి ఏపీఎస్ఎస్డీసీ కార్పొరేషన్ ఎండీ బంగార్రాజుకు సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంటే అప్పటికే బంగార్రాజును తమదైన శైలిలో బెదిరించి దారికి తెచ్చుకున్నట్లు స్పష్టమైంది. సీఐడీ నోటీసులు ఇవ్వడమే తరువాయి.. ఆ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తారన్నది సుస్పష్టం. మరి ఇదంతా టీడీపీ పెద్దల స్క్రిప్టే కదా!! స్కిల్ స్కాం కేసును ముసివేస్తామని అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజుకు ప్రస్తుతం సీఐడీ పంపిన నోటీసులు ఫిర్యాదుదారు బంగార్రాజు కాదు... చైర్మన్ అజయ్ రెడ్డిచంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసివేయాలన్న ఆతృతలో సీఐడీ అసలు వాస్తవాలను విస్మరిస్తోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు ఫిర్యాదు చేసింది ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు కాదు. అప్పుడు చైర్మన్గా ఉన్న కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరి ఆ కేసును మూసివేయాలని ప్రస్తుతం సీఐడీ భావిస్తే... అందుకు నోటీసులు జారీ చేయాల్సింది కూడా ఆయనకే కదా!! సీఐడీ అధికారులు అందుకు విరుద్ధంగా అప్పటి ఎండీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎందుకంటే ఆయన్ను బెదిరించి... బెంబేలెత్తించి ఇప్పటికే తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం.. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల కుట్ర. చంద్రబాబు స్కిల్ స్కాంపై ఫిర్యాదు చేసింది అప్పటి ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్ రెడ్డి అని పేర్కొన్న కాపీ -
రూ.350 కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు
మామిడి రైతులంటే ఎందుకింత చులకన? మామిడి రైతుల పట్ల బాబు ప్రభుత్వానికి చులకన భావం తగదు. కష్టాన్ని నమ్ముకుని చెమటోడ్చి పంటలు పండించే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణం. మామిడి రైతులకు పరిశ్రమలు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించకపోవడం ఎంతవరకు సబబు? వెంటనే నగదును చెల్లించేలా చర్యలు చేపట్టాలి. – మునిరత్నంనాయుడు, మామిడి రైతుచిత్తూరు కలెక్టరేట్: ‘‘ఆశించిన స్థాయిలో పంట చేతికొస్తే గిట్టుబాటు ధర లేకుండా చేశారు. తోతాపురి కిలోకు ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున మొత్తం రూ.12 చెల్లిస్తామని మాటిచ్చాయి. 4.30 లక్షల టన్నుల పంటను ఫ్యాక్టరీలకు పంటను తోలి ఏడు నెలలవుతోంది. ఇంకా బకాయిలు చెల్లించలేదు. నాయకులకు చెప్పినా, ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయిలు అడుగుతుంటే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి గొడవలు పెట్టుకునేలా చేస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం చంద్రబాబూ?’’ అని మామిడి రైతులు మండిపడ్డారు. వెంటనే బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘం నాయకులు, రైతులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు.మిన్నంటేలా నినాదాలు చేశారు. సమస్య చెప్పుకొనేందుకు ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయతి్నంచడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మైక్ పెట్టకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం రైతులు మాట్లాడుతూ... మళ్లీ మామిడి సీజన్కు పెట్టుబడుల సమయం వచ్చిందని, పరిశ్రమలు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా ఇవ్వకపోవడం దుర్మార్గంగా అభివరి్ణంచారు. కిలోకు రూ.8 ఇవ్వని ఫ్యాక్టరీలను సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారని గుర్తుచేశారు. ఇప్పటికి ఆరుసార్లు కలెక్టర్కు వినతిపత్రాలు సమరి్పంచామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని 40 మామిడి ఫ్యాక్టరీలకు కొమ్ముకాస్తూ 40 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడేసిందని రైతులు నిప్పులు చెరిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు కచ్చితంగా కిలోకు రూ.8 ఇస్తాయని చిత్తూరు కలెక్టర్ ఉత్తర్వులిచ్చారని, అవి అమలుకు నోచుకోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. 40 ఫ్యాక్టరీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయా? అని నిలదీశారు. తమను మోసగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు.. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు పలు ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునీశ్వరరెడ్డి, మురళీ, ఉపాధ్యక్షులు హేమలత, నాయకులు రామానాయుడు రైతులతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. పరిశ్రమల వద్ద నిల్వ ఉన్న మామిడి పల్ప్ను టీటీడీ, విద్యార్థులు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సూచించారు. రైతులను మోసగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి వినతిపత్రం అందజేశారు.సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నాం ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.8 నగదు చెల్లించేందుకు సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నామని రైతులు తెలిపారు. ఆలోపు డబ్బు వేయకపోతే గ్రామాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తామని హెచ్చరించారు. ‘‘మామిడి పంటను నమ్ముకున్న మేము దారుణ స్థితిలో ఉన్నాం. పంటను అమ్ముకోలేక, అమ్మిన పంటను డబ్బు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ ఏడాది గిట్టుబాటు ధర పొందలేకపోయాం. ఫ్యాక్టరీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అజమాయిషీ చేయడం లేదు?రూ.350 కోట్లకు పైగా ఉన్న ఫ్యాక్టరీల బకాయిలపై ఎందుకు నోరు మెదపడం లేదు. పంటను తోలాక 15 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించాలి. దానిని పాటించకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారు’’ అని వాపోయారు.నగదు ఎందుకివ్వరు..? ఫ్యాక్టరీ యజమానులు నగదును ఎందుకు చెల్లించరు? ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ఫ్యాక్టరీల యజమానులు డబ్బు వేయలేదు. మరి ఇంకెప్పుడు ఇస్తారు...? మొదట్లో ఒక మాట మామిడి పంట ఫ్యాక్టరీలకు తోలిన తర్వాత మరో మాట చెప్పి మోసగించడం దారుణం. ఏటా ఇదే తంతు. పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కలెక్టర్ చొరవ తీసుకోవాలి. – త్యాగరాజులురెడ్డి, మామిడి రైతు నెలలు గడుస్తున్నా స్పందించరా? కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారంరైతులకు ఫ్యాక్టరీ యజమానులు కిలోకు రూ.8 ఇచ్చి తీరాల్సిందే. తక్కువైతే సహించేది లేదు. నెలలు గడుస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో ఆందోళన చేపడుతున్నాం. సంక్రాంతిలోగా బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం. – మురళి, మామిడి రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరుకునేది లేదు రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. మాకు ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా రూ.8 చొప్పున ఇవ్వాలి. ర్యాంపులలో అతి తక్కువగా రేట్లు ఇచ్చారు. వాటన్నింటినీ పరిశీలించి రూ.8 చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. జిల్లాలోని 40 ఫ్యాక్టరీల యజమానులు నగదు చెల్లించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. – ఉమాపతినాయుడు, మామిడి రైతు -
పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్’!
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బత్తులవారిపాలెంలో నివసించే చిమటా మార్క్కు సర్వే నెంబర్ 351/9 లో 1.26 ఎకరాలు, 314/6 లో 22 సెంట్లు కలిపి మొత్తం 1.48 ఎకరాల పొలం ఉంది. డాక్యుమెంట్లు అన్నీ ఆయన పేరుతోనే ఉన్నా తటవర్తి సాయి, పందరబోయిన శ్రీను అనే వ్యక్తులు ఆ సర్వే నంబర్లలో 1.22 ఎకరాలను ఆక్రమించుకున్నారు. మార్క్ను భూమిలోకి రానివ్వడం లేదు. తన భూమిని ఆక్రమించారని.. సమస్య పరిష్కరించాలని డాక్యుమెంట్లు చేత పట్టుకుని మార్క్ ఏడాదిన్నరగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించామంటూ రసీదు చేతిలో పెట్టడం మినహా సమస్య పరిష్కరించే నాథుడే లేడని మార్క్ వాపోతున్నాడు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: తప్పుడు పేర్లతో ఆన్లైన్లో రికార్డులు మాయం చేయడం.. పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం.. భూ కొలతల్లో తిమ్మిని బమ్మిని చేయడం.. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తమ గోడు పట్టించుకునే దిక్కులేక లక్షలాది మంది సతమతమవుతున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తోంది. చలానాలు కట్టినా.. స్వయంగా న్యాయస్థానాలు ఆదేశించినా.. భూములు సర్వే చేసే దిక్కులేక అల్లాడుతున్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతుల్లో సింహభాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. ఈ నెల 15న చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు 293 అర్జీలు వస్తే రెవెన్యూ సమస్యలే 204 ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 70–80 శాతం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉదాశీనత, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బృందాలు ఈ నెల 15న సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ను ఆసాంతం పరిశీలించాయి. మొత్తంగా ఆయా జిల్లాల్లో ఒక్క రోజులో ఎన్ని సమస్యలు వచ్చాయి..? వాటిలో రెవెన్యూ సమస్యలు ఎన్ని..? అని ఆరా తీశాయి. ఆ తర్వాత మంగళ, బుధవారాల్లో పీజీఆర్ఎస్కు హాజరైన కొందరు బాధితుల గ్రామాలకు వెళ్లి సమస్య మూలాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడాయి. వెళ్లిన ప్రతి చోటా సమస్యల పరిష్కారంలో లెక్కలేనితనం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, అవినీతి స్పష్టంగా కనిపించాయి. ఒక్క రోజులో పరిష్కరించగలిగే చిన్న సమస్యలను సైతం నెలల తరబడి పట్టించుకోకపోవడం లేదని తేటతెల్లమైంది. చలానాలు కూడా కట్టించుకుని సర్వేలు చేయడం లేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో కళ్లకు కడుతోంది. గత ప్రభుత్వం పరిష్కరించినా.. మళ్లీ అసైన్ ఉచ్చు ఏళ్ల తరబడి పొలాలు సాగు చేసుకుంటున్నా 22–ఏ నిషేధిత జాబితాలో అసైన్డ్ భూములు ఉండటంతో బ్యాంకు రుణాలు అందక, అవసరాలకు భూములు విక్రయించుకోలేక సుదీర్ఘకాలంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలను గుర్తిస్తూ, 20 ఏళ్లుగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను 22–ఏ జాబితా నుంచి తొలగించి వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు హక్కులు కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పేద రైతులు ఎంతో సంతోషపడ్డారు. కానీ 2024లో చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఫ్రీహోల్డ్ అయిన భూములను తిరిగి 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రుణాల నుంచి క్రయవిక్రయాల వరకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాదారు పుస్తకాలు ఎక్కడ? గత ప్రభుత్వంలో రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనే సాకుతో వాటిని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ప్రభుత్వ ఎంబ్లమ్తో పాసు పుస్తకాలను ఇస్తామని ప్రకటించింది. ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పాసు పుస్తకాల జాడలేదు. పాత పాస్ పుస్తకాలు రద్దు కావడం, కొత్తవి ఇవ్వకపోవడంతో రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాసు పుస్తకాలు ఇవ్వాలని పీజీఆర్ఎస్కు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. మొక్కుబడిగా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు భూముల సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం జనవరిలో 10 రోజులు గ్రామ సభలు నిర్వహించింది. అనంతరం మరో 15 రోజులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించింది. కర్నూలు సహా పలు జిల్లాల్లో ఈ సభల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదు. రికార్డుల్లో మాత్రం సమస్యలు పరిష్కారమైనట్లు నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో రెవెన్యూ సదస్సులకు వచ్చిన వారు తిరిగి పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత అధ్వానంగా జరిగాయో స్పష్టమవుతోంది. మ్యుటేషన్లు బంద్.. రీ సర్వేలో మిగులు భూముల మ్యుటేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కఠినతరం చేసింది. ఆ భూముల్లో అనుభవదారులున్నా, వాటిని వారి వారసులకు మ్యుటేషన్ చేయడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా రైతులు వాటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చుక్కల భూములపై హక్కులు ఇచ్చారు. అయితే ఆధారాలు చూపలేని కొందరు రైతులకు సంబంధించిన భూములు పెండింగ్లో ఉన్నాయి. ఆ రైతులంతా తమ భూములను డాటెడ్ జాబితా నుంచి తొలగించాలని ఆధారాలతో రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకుంటున్నా ఆలకించడం లేదు. రీసర్వేలో జాయింట్ ఎల్పీఎంలను తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీని కోసం గ్రామాల్లో రైతుల నుంచి లంచాలు వసూలు చేస్తూ టీడీపీ నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. వీటిపై కూడా పీజీఆర్ఎస్కు అర్జీలు భారీగా వస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లిలో ఇంజా లక్ష్మీరెడ్డికి వారసత్వంగా వచ్చిన 65 ఎకరాల ఉమ్మడి పొలం ఉంది. నలుగురు అన్నదమ్ములు కావడంతో లక్ష్మీరెడ్డి వాటాగా నాలుగో వంతు రావాలి. సజ్జలదిన్నె గ్రామంలో సర్వే నెంబర్లు 44, 602, 581, 612, 467–డి, 270–ఎం, 270–ఓ, 33, 390–బిలో తొమ్మిది ఎకరాల పొలం వివాదంలో ఉంది. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి పోలీసు భద్రతతో సర్వే చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. సర్వే కోసం బాధితుడు చలానా కట్టినా వీఆర్వో సర్వే చేయించడం లేదు. ‘మేం చేయించం.. నీకు దిక్కున్న చోట చెప్పుకో..’ అని బెదిరిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి ఇప్పటివరకు 31 సార్లు అర్జీలు ఇచ్చినా భూమిని సర్వే చేయడం లేదు. రెవెన్యూ వ్యవహారాలు ఇంత అధ్వాన్నంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన వాపోతున్నారు. విచారిస్తూనే ఉన్నారు...! ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరంలో ముప్పరాజు పాపయ్య పేరుతో 11.93 ఎకరాల భూమి ఉండగా ఆయన ఇద్దరు కుమారులు, పెద్దకోడలు కూడా చనిపోయారు. చిన్న కోడలు శేషమ్మ మాత్రమే మిగిలి ఉంది. ఈ భూమిని ఒంగోలుకు చెందిన రియల్టర్ మారం వెంకటేశ్వరరెడ్డి తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. శేషమ్మ భూమిని కొట్టేయాలని యత్నిస్తున్నాడు. దీంతో శేషమ్మ రెవెన్యూ అధికారులను సంప్రదించగా ఈ వివాదాన్ని ఎంతకీ తేల్చడం లేదు. ఈ భూమిపై హక్కుదారులెవరో విచారణ చేస్తున్నామని తహసీల్దార్ చెబుతున్నారు.ఎన్ని సమస్యలో..!⇒ మదనపల్లెవాసి మురళీకి కురబలకోట సర్వే నెంబర్ 1913/2ఎలో 3.39, 1913/3లో 1.50 ఎకరాలు భూమి ఉంది. 1958లో మురళి తాత దువ్వూరి రామన్న పేరుతో ఉన్న భూమి ఆయన మృతి తర్వాత 1994లో వారసత్వంగా మురళి పేరుతో రికార్డుల్లోకి ఎక్కింది. దీనికి పక్కనే ఉన్న మరో యజమాని మురళి భూమిని ఆక్రమించాడు. సర్వే చేసి తన భూమికి హద్దులు తేల్చాలని రెండేళ్లుగా మురళి సబ్ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ⇒ చిత్తూరు రూరల్ దిగువమాసాపల్లికి చెందిన తులసికి సర్వే నెంబర్ 183లో ఇంటి స్థలం ఇచ్చారు. ఆమె స్థలాన్ని రెవెన్యూ అధికారులు మరొకరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. తన స్థలం మరొకరికి ఎలా ఇస్తారని బాధితురాలు ప్రతి వారం తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకపోవడంతో పీజీఆర్ఎస్ను ఆశ్రయించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.⇒ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు వాసి షేక్ ఆదాం షరీఫ్ ఇంటి స్థలం, ఇల్లు తొలగించి 2015లో రైవస్ కాలువపై వంతెన నిర్మించారు. ఆయనకు నష్ట పరిహారం చెల్లిస్తామని స్థలం తీసుకున్నారు. పీజీఆర్ఎస్తో పాటు మంగళగిరిలో ప్రజా దర్బార్కు వెళ్లినా షరీఫ్కు పరిహారం దక్కలేదు. ⇒ కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వాసి విజయభాస్కరరావుకు 3 ఎకరాల పొలం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చుక్కల భూముల జాబితాలోకి చేర్చడంతో బ్యాంకు రుణాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. అనంతరం జగన్ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ వాటికి చుక్క పెట్టింది. కళ్లెదుట మూడు ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఎందుకూ ఉపయోగ పడటం లేదని, నిషేధ జాబితా నుంచి తొలగించాలని బాధితుడు మొర పెట్టుకుంటున్నాడు.⇒ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం వాసి ప్రభాకర్కు సర్వే నంబర్ 201–7లో వారసత్వంగా సంక్రమించిన 27 సెంట్ల స్థలం ఉంది. ఉపాధి కోసం ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉండటంతో ప్రభాకర్ సమీప బంధువు ఆ భూమిని తన పేరుతో ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. అక్కడ సెంటు రూ.6 లక్షలు వరకు ఉంది. రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి రూ.1.62 కోట్ల ఆస్తిని కబ్జా చేశారు. తన భూమిని ఇవ్వాలని ఏడాదిన్నరగా ప్రభాకర్ రికార్డులతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ నెల 15న శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి గానూ ఇటీవల తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా హాజరైన ప్రజలు ఐవీఆర్ఎస్ కాల్స్, ఆడిట్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిసాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికం.. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. పట్టా ఇచ్చారు.. భూమి ఎక్కడ? నా భర్త సింహాచలం కల్లుగీత కార్మీకుడు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం సర్వే నెంబర్ 23పీలో నాకు 0.80 ఎకరాల భూమి ఇచ్చింది. పట్టాదారుపాసు పుస్తకం ఇచ్చారు. అడంగల్లో కూడా నా పేరు ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించి హద్దులు తేల్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. కలెక్టరేట్లో కూడా అర్జీలు ఇస్తున్నా నా సమస్య తీరడం లేదు. – అప్పమ్మ, ఏవో అగ్రహారం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లాఊరికి దూరంగా బతుకుతున్నా నాకు మా గ్రామంలోని సర్వే నెంబర్ 203లో 16 సెంట్ల స్థలం ఉంది. అందులో ఇల్లు కూడా ఉంది. ఈ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి నన్ను రానివ్వడం లేదు. నాలుగు నెలల క్రితం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి చేసి చంపాలని చూశారు. అప్పటి నుంచి ఊరికి దూరంగా బతుకుతున్నా. గ్రామసభలో చెప్పినా ఫలితం లేదు. నా పేరుతోనే స్థలం డాక్యుమెంట్లు ఉన్నా ఏమిటీ అన్యాయం? అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – వారి పెద్దిరెడ్డి, ఏట్రవారిపాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లాకలెక్టర్కు చెప్పినా.. మా నాన్న మంగలి నారాయణ పేరుతో సర్వే నంబర్ 893లో 1.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏడాది క్రితం నుంచి ఈ పొలం తమదంటూ 892 సర్వే నంబర్లో ఉంటున్న జగదీష్ గొడవ పడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో మేం సాగు చేసిన పంటను దౌర్జన్యంగా తొలగించాడు. పొలం సర్వే చేసి సమస్య పరిష్కరించాలని ఏడాదిగా తహసీల్దార్, ఆర్డీవోతో పాటు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – మంగలి తిరుపతయ్య, బేతంచెర్ల, నంద్యాల జిల్లా -
‘కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పేకాట డెన్లు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘2014-19లో కాల్ మనీ రాకెట్తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
భూములిస్తాం.. భవనాలూ కట్టిస్తాం! సర్కారు భూములు ‘సత్వాకు’ సొమ్ములు!
సాక్షి, అమరావతి: అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.కోట్లు పలికే భూమి ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? డబ్బులు అవసరమనుకుంటే బహిరంగ మార్కెట్ ధరకు విక్రయిస్తారు. లేదంటే డెవలప్మెంట్కు ఇవ్వడం ద్వారా మరింత ప్రయోజనం పొందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ప్రజా ధనానికి కాపలాదారుగా ఉండాల్సిన చంద్రబాబు సర్కారు ఏం చేస్తోందో తెలుసా..? ఐటీ కార్యకలాపాల అభివృద్ధి ముసుగులో తమకు నచ్చిన సంస్థలకు అప్పనంగా 99 పైసలకే భూములు కేటాయిస్తోంది. అంతేకాదు.. అందులో 50 శాతం భూముల్లో వాణిజ్య, గృహ సముదాయాలు నిర్మించి సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తోంది. చ.అడుగుకు రూ.4 వేలు నిర్మాణ వ్యయం అయితే అందులో రూ.2 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భవనాన్ని నిర్మిస్తే అందులో సగం అంటే ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వ్యయాన్ని చదరపు అడుగుకు రూ.రెండువేలు చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ తరువాత అద్దెలు మాత్రం భూములు పొందిన కంపెనీలే వసూలు చేసుకుంటాయి. పోనీ ఆ కంపెనీలేమైనా ఉద్యోగాలు ఇస్తాయా? అంటే అదీ లేదు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించే వాణిజ్య సముదాయాల్లో ఒక్క ఐటీ ఉద్యోగం కూడా నేరుగా ఇవ్వవు. అవి నిర్మించే భవనాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. కారుచౌకగా ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని.. ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు, విద్యుత్తు లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ప్రభుత్వ డబ్బులతోనే భవనాలను నిర్మించి వేరే కంపెనీలకు అమ్ముకుంటారు. ఉద్యోగాల కల్పనకు బాబు సర్కారు నిర్వచనం ఇదీ!! భూములు ప్రభుత్వానివి..! మౌలిక వసతులు కల్పించేది ప్రభుత్వమే..! భవన నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వానిదే..! పలు రాయితీలు ఇచ్చేదీ ప్రభుత్వమే.. చివరకు లబ్ధి పొందేది మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలు! అంటే.. సర్కారు భూముల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల భూ దందా! విశాఖలో విచ్చలవిడిగా సాగుతున్న బాబు సర్కారు భూ దోపిడీ ఇలా ఉంది.కంపెనీలకు నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున ఎదురు చెల్లించడంతో పాటు పలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో భూములిచ్చి.. ఎదురు డబ్బులు కూడా! వాణిజ్య భవనాలను నిర్మించుకుని భారీ ధరలకు విక్రయించుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ ముసుగులో చంద్రబాబు సర్కారు భూములు అప్పగిస్తూ చేస్తున్న ‘‘రియల్’’ దందా ఇప్పుడు జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పేరిట కె.రహేజా, సత్వా, కపిల్ గ్రూపు సంస్థ బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములను కేటాయించడమే కాకుండా అందులో 50 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతిస్తోంది. ఇంతటితో ఆగకుండా ప్రోత్సాహకాల రూపంలో ఎదురు చెల్లిస్తోంది. నిర్మిస్తున్న చదరపు అడుగుకు గరిష్టంగా రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎదురు డబ్బులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కారుచౌకగా భూములు.. పలు రాయితీలు బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసింది. బ్లాక్ స్టోన్ వంటి పీఈ, వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తుంది. 2017లో సత్వా గ్రూపు హైదరాబాద్లో హైటెక్ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈ సంస్థకు విశాఖలో 30 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు కారుచౌకగా కట్టబెట్టింది. విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్ నెం.4పై ప్లాట్ నంబర్లు యూడీఎల్ 1, యూడీఎల్ 2, యూడీఎల్ 3 వద్ద 30 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల సబ్సిడీ ధరకే ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సత్వా కంపెనీకి 30 ఎకరాల భూమిని ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులుప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్లో ఎకరం రూ.50 కోట్లకుపైనే పలుకుతోంది. అంటే రూ.1,500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించడం విస్తుగొలుపుతోంది. కారుచౌకగా భూమిని కేటాయించడమే కాకుండా ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్ సబ్సిడీ లాంటి అనేక అదనపు రాయితీలను సత్వాకు కల్పిస్తున్నారు. సత్వాకు అత్యంత కారుచౌకగా భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిబంధనల ప్రకారం సత్వా సంస్థ గత నెల 5వ తేదీలోగా ఏపీఐఐసీకి డబ్బులు చెల్లించాలి. అయితే ఎటువంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లించేందుకు 60 రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సత్వా సంస్థ కోరిందే తడవుగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశానికి తీసుకెళ్లడం.. వడ్డీ, జరిమానా లేకుండా డబ్బులు చెల్లించేందుకు ఈ నెల 4 వరకు గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ కావడం చకచకా జరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూములిస్తూ అదికూడా వడ్డీ లేకుండా చెల్లించడానికి గడువు ఇవ్వడం ఏమిటని విస్మయం వ్యక్తమవుతోంది. రహేజా సంస్థకు రూ.1375 కోట్ల విలువైన 27.10 ఎకరాలను ఎకరా కేవలం 99 పైసలకే ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రహేజాకు రూ.1,375 కోట్ల భూమి కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ కె.రహేజా హైదరాబాద్లో వేలంలో భూములు కొనుగోలు చేసి వాణిజ్య సముదాయాలు నిర్మిస్తుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం రూ.వేల కోట్ల విలువైన భూమిని ఎటువంటి టెండర్లు, దరఖాస్తులు ఆహా్వనించకుండా అప్పనంగా అప్పగించేసింది. రహేజా గ్రూపునకు విశాఖలో సుమారు రూ.1,375 కోట్ల విలువైన 27.10 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయించింది. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్ 3లో 27.10 ఎకరాలను ఏపీ లాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ ప్రకారం ఇచ్చింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్లో ఎకరా ధర రూ.50 కోట్లపైనే ఉంది. అంతేకాదు కేటాయించిన 27.10 ఎకరాల్లో 45 శాతం భూమిని ఐటీ కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. కపిల్ గ్రూప్ బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ సంస్థకు 30 ఎకరాలను ఇచ్చేందుకు జారీచేసిన ఉత్తర్వులు వీటికి అదనంగా రూ.91.2 కోట్లతో రహదారులు, నీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కూడా కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఇక ఇక్కడ ఉద్యోగాలు కూడా రహేజా గ్రూపు సొంతంగా ఇవ్వదు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఐటీ బిల్డింగ్లో వచ్చే ఐటీ కంపెనీలే ఉద్యోగాలను కల్పించాలి. ఉద్యోగాలు ఐటీ కంపెనీలు కల్పిస్తుంటే ఆ పేరుతో ప్రోత్సాహకాల రూపంలో రహేజాకు దోచిపెడుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పెట్టుబడి రాయితీ కింద 50 శాతం, చదరపు అడుగుకు రూ.2,000, నైపుణ్య శిక్షణ స్టయిఫండ్, విద్యుత్, జీఎస్టీ లాంటి అనేక రాయితీలను ప్రభుత్వం అందిస్తోంది. కపిల్ చిట్ ఫండ్కు.. తెలుగు రాష్ట్రాల్లో చిట్ఫండ్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించిన కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు పనోరమా హిల్స్ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్ఎంటీవీ లాంటి మీడియా సంస్థలున్న కపిల్ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే కేటాయించారు. ఇక బెంగళూరుకు చెందిన ఏఎస్ఎన్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు మధురవాడ ఐటీ హిల్ నెం. 3పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాల భూమిని, హిల్ నంబర్ 4పై ప్లాట్ నంబర్ యూడీఎల్ 6వద్ద 7.79 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టింది. ఇలా విలువైన భూమిని పప్పుబెల్లాలుగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుండటాన్ని న్యాయస్థానం ప్రశి్నంచడంతో రాష్ట్రంలో విచ్చలవిడి భూ పందేరం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.ఐటీ డెవలపర్స్కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన రాయితీలుతెలంగాణలో ఆదాయం.. ఏపీలో ఆల్ ఫ్రీ..!ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు పప్పు బెల్లాలు మాదిరిగా అప్పగిస్తోంది. ఒకపక్క హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలకు వేలం ద్వారా భూములను విక్రయిస్తూ పోటీతత్వాన్ని పెంచి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే.. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు అత్యంత ఖరీదైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. ఎటువంటి వేలం లేకుండా, భూ కేటాయింపులకు దరఖాస్తులు ఆహా్వనించకుండా నచ్చిన సంస్థలకు ఇష్టమొచ్చిన రేటుకు భూములు కేటాయిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అన్ని కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు భూములను ఎలా కేటాయిస్తున్నారంటూ కె.రహేజాకు భూ కేటాయింపుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని ప్రశి్నంచింది. -
Appalaraju: అధికారుల ముందు తప్పు ఒప్పుకున్న బాబు
-
Gudivada : ముందు మీ ఎమ్మెల్యేకు చెప్పండి ప్రతిదానికి ఉన్నాం అంటూ..
-
పాతాళానికి ఏపీ ఆర్థిక వ్యవస్థ బాబు కుట్ర బయటపెట్టిన ఎల్లో మీడియా
-
ఇది అంతం కాదు ఆరంభం.. ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
-
YSRCP Leaders: కోటి సంతకాల ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్
-
Hari Gopala : అదేమైనా నీ అయ్యా సొమ్మా.. నీ ఇష్టం వచ్చినట్టు పంచడానికి
-
కేంద్ర హోంమంత్రి సాక్షిగా.. చంద్రబాబు బండారం బట్టబయలు
-
బాబు, పవన్, లోకేశ్ జిల్లాల్లో పెరిగిన దాడులు, హత్యలు
-
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేత
-
కూటమి ప్రభుత్వాన్ని కూడా బాబు ప్రైవేటుకు అప్పగించాలి: సీపీఐ రామకృష్ణ
-
YS Jagan: మోదీ, పుతిన్ వస్తే ఎక్కడ ఉంచుతావ్ బాబు
-
AI ని అడిగినా చార్ట్ GPT ని అడిగినా చంద్రబాబు స్కామ్ ల బాగోతం చెబుతాయి
-
YS Jagan : విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు
-
YS Jagan: గ్రాఫ్ పడిపోతుందా..? బాబుపై నాన్ స్టాప్ పంచులు
-
Monditoka Arun: నీ సొంత ఊరిలోనే జగన్కు మద్దతిచ్చారు..
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపుతాం
-
కూటమి కుట్రను ఎడమ కాలితో తన్నిన ఏపీ ప్రజలు
-
బేరం కుదిరితేనే బిల్లు!
సాక్షి, అమరావతి: అక్రమార్జనే పరమావధిగా ప్రభుత్వ పెద్దలు, చినబాబు, పలువురు మంత్రులు, కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. లాభాపేక్ష లేకుండా పేదలకు పక్కా ఇళ్లను నిరి్మంచే ఏజెన్సీలను సైతం వదలడం లేదు. దీంతో గత వైఎస్ జగన్ హయాంలో తలపెట్టిన ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే టీడీపీ కూటమి నేతలు ఆదాయార్జన మార్గాలపై కన్నేశారు. ఇందులో భాగంగా జగనన్న కాలనీల్లోని ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై వాలిపోయారు. వాటిని నిరి్మంచే ఏజెన్సీల నుంచి అందినంత వరకూ దండుకునేందుకు ముందుగా వాటిపై ఆరోపణలు చేశారు. దీంతో విజిలెన్స్ విచారణ పేరిట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు ఆపేశారు. ఫలితంగా రూ.80 కోట్లకు పైనే ఏజెన్సీలకు నిధులు ఆగిపోయాయి. ఇక ఈ బిల్లుల విడుదలకు ఏజెన్సీల యజమానులతో టీడీపీ నాయకులు రాయ‘బేరాలు’ మొదలుపెట్టారు. వీరు డిమాండ్ చేసినంత కమీషన్లు ఇవ్వడానికి సిద్ధమైన వారి బిల్లులే విడుదల చేయాలంటూ అధికారులకు సిఫార్సు చేస్తున్నారు. విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, గుంటూరు సహా పలు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆప్షన్–3 ఇళ్ల పెండింగ్ బిల్లుల మంజూరుకు ఏకంగా 20 శాతానికి పైగా కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. మంత్రి సారథి సిఫార్సులు.. నిజానికి.. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ దశల వారీగా బిల్లులు చెల్లిస్తుంది. ఆప్షన్–3కు సంబంధించి లబ్ధిదారులు, నిర్మాణ ఏజెన్సీ, బ్యాంకు కలిపి త్రైపాక్షిక (ట్రై పార్టీ బ్యాంకు) అకౌంట్లు తెరిచారు. పునాది, లెంటెల్, శ్లాబ్ ఇలా వివిధ దశల నిర్మాణం ఆధారంగా స్థానిక గృహ నిర్మాణ సిబ్బంది బిల్లు మంజూరుకు ప్రతిపాదిస్తారు. వివిధ దశల్లో స్రూ్కటినీ అనంతరం ఆటోమేటిక్గా బిల్లులు బ్యాంకు ఖాతాలో జమకావాలి. గత ప్రభుత్వంలో ఇదే విధానం కొనసాగింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాగానే కొత్త సంస్కృతికి తెరలేపారు. ఏజెన్సీల నిర్వాహకులు నాయకులను ప్రసన్నం చేసుకుని మంత్రిని కలిస్తే ఆయన బిల్లుల మంజూరుకు సిఫార్సు చేస్తున్నారు. ఇలా తనను కలిసిన వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశిస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా ఆన్లైన్లో నిష్పక్షపాతంగా జరగాల్సిన బిల్లింగ్ ప్రక్రియకు కూడా ఓ మంత్రి సిఫార్సు చేయడం చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కమీషన్ల బాగోతం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. బెదిరించడమే ఆ సీనియర్ ఎమ్మెల్యే పని.. మరోవైపు.. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేస్తున్న వారిని టార్గెట్ చేసి, బెదిరించి డబ్బు వసూలుచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పరంపరలో భాగంగా ఆ జిల్లాలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలపై అనేక ఆరోపణలు చేసి, చివరకు వాటితో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఉత్తరాంధ్రకు చెందిన ఇంకో టీడీపీ నాయకుడికి గృహ నిర్మాణ శాఖలో నామినేటెడ్ పోస్టుని కట్టబెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కూడా ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు, ఇతర జిల్లాల్లోని ఏజెన్సీల యజమానులతో ఆయన డీల్ కుదుర్చుకుని వారికి బిల్లులు మంజూరుచేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
సర్కారు తీరుపై గురువులు గుర్రు
‘మేము సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు డఏలు వచ్చేవి.ఇప్పుడు ఏడాదికి రెండమెగా పీటీఎంలు వస్తున్నాయి’.మా సర్వీసులో విద్యార్థులు నోట్సులు సరిగా రాశారో లేదో చెక్ చేసేవాళ్లం.., ఇప్పుడు చిక్కీలు, కోడిగుడ్లు లెక్కలు చూడడం, యాప్ల్లో వివరాల నమోదుకే సమయం సరిపోవడం లేదు’..ఉపాధ్యాయుల సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి పోస్టులు చంద్రబాబు పాలనపై గురువుల ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి.సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. టీచర్లకు యాప్ల భారం ఉండదు, కేవలం బోధనకే పరిమితం చేస్తామన్న మాట నీటి మూటైంది. మరోపక్క ఇన్ సర్వీస్ టెట్ రద్దు చేస్తామని, దీనిపై తమ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న హామీని సైతం అమలు చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బకాయిల సంగతేంటి?పెండింగ్ బకాయిలు, ఐఆర్, డీఏలు ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పీఆర్సీ ప్రకటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పాఠ్యాంశాలకు సంబంధం లేని వివరాలు పదుల సంఖ్యలో యాప్ల్లో నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బడుల నిర్వహణపై ఇతర శాఖల పెత్తనంపదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచడానికి 75 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం రెండో శనివారం, ఆదివారాలు, పండగ సెలవుల్లో సైతం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరగతులను పరిశీలించే బాధ్యతను ఎంపీడీవోలు, మండల వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించింది. వాస్తవానికి మండలానికి ఇద్దరు ఎంఈవోలు, డీవైఈవోలు, జిల్లా స్థాయిలో డీఈవో ఉన్నారు. వీరిని కాదని ఇతర శాఖలకు పెత్తనం అప్పగించడంపై టీచర్లు మండిపడుతున్నారు. గతేడాది మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, విద్యార్థుల రేషనలైజేషన్ వంటి విధులకు రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వం వినియోగించింది.ఒత్తిడి పెంచి.. ప్రయోజనాలు ఎగ్గొట్టాలని..చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటినా ఉపాధ్యాయులకు ఒక్క ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదు. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న హామీని కూడా విస్మరించింది. నాలుగు డీఏలకు కేవలం ఒక్క డీఏతో సరిపెట్టింది. పదవీ విరమణ పొందినవారికి ఏడాదిన్నరగా గ్రాట్యుటీ, లీవ్ఎన్క్యాష్మెంట్ ఇవ్వలేదు. ప్రతి నెలా మెడికల్ బీమా డబ్బులు చెల్లిస్తున్నా ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందడం లేదు. అప్పుచేసి బిల్లులు చెల్లించినా తర్వాత రీయింబర్స్మెంట్ చేయడం లేదు. దీంతో ఆర్థిక బకాయిల కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో సర్కారు రివర్స్ గేర్ వేసింది. ఒత్తిడి పెంచితే ఆర్థిక అంశాలు తెరపైకి రావనే భావనతో వ్యవహరిస్తోంది. ఇందులో ఇన్ సర్వీస్ టెట్ అంశం కీలకంగా మారింది. దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. రాష్ట్రంలో మాత్రం టెట్ నిర్వహించడం, ప్రత్యేక శిక్షణ, నివేదికల పేరుతో ఇబ్బంది పెట్టడం వేధింపుల్లో భాగమేనని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలతో పాటు ఇతర శాఖల అధికారుల పెత్తనంపై గురువులు పోరుబాటకు సిద్ధమయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నేడుఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు యూటీఎఫ్తో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి.బదిలీ అయి పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని.. టీచర్లపై ఇతర శాఖల పెత్తనం ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్నారు. -
చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ
-
Gorantla: నీ ప్రభుత్వ పతనానికి పునాది రాళ్లు గుత్తుపెట్టుకో చంద్రబాబు..
-
Gudivada: ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే..
-
కలెక్టర్ల సాక్షిగానే తమ పాలన సరిగాలేదన్న చంద్రబాబు
-
TJR : సంపద సృష్టి నిజమే.. కానీ రాష్ట్రానికి కాదు నారా కుటుంబానికి
-
రాష్ట్ర భవిష్యత్తుతో బాబు చెలగాటం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినవారు ఒక సంగతి చెబుతుంటారు. ఏదైనా చేయకూడని, లేదా విమర్శలకు ఆస్కారమిచ్చే కార్యక్రమం చేయదలచుకుంటే ముందుగా దానిని తన ప్రత్యర్దులకు చుడుతుంటారు. తాను తప్పు చేసేందుకు ప్రత్యర్ధి రాజకీయ పార్టీనే కారణమన్న భావన కల్పిస్తారు. ఆ తర్వాత తనకు అనుకూలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చి పని ముగించుకుంటారు అని. కొద్ది రోజుల క్రితం నల్లజర్లలో జరిగిన ఒక సభలో అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు కొద్ది రోజులకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సజావుగా ఉందన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విధ్వంసమని విమర్శించారు. జగన్ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకువచ్చిందని అన్నారు. అధిక వడ్డీకి అప్పు చేసిందని ఆరోపించారు. తన ప్రభుత్వం 18 నెలలు కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసిందని చెప్పుకొచ్చారు. సహజంగానే ఈ వివరాలను ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతులు భజన చేశాయి. దాంతో ఆయన లక్ష్యం నెరవేరినట్లు అయ్యింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. కొత్తగా మరో సుమారు రూ.13 వేల కోట్ల అప్పు చేసేశారు. దీనికోసం ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నమాట. ఆ క్రమంలో చంద్రబాబు సర్కార్ మద్యంపై వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసింది. ఎక్సైజ్ బాండ్ల ద్వారా 9.15 శాతం వడ్డీకి సుమారు రూ.5500 కోట్ల అప్పులు చేసినట్లు ‘సాక్షి’ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రాజధాని పేరుతో మళ్లీ అప్పులు చేశారని సమాచారం వచ్చింది. ఈ రకంగా వేలకు వేల కోట్ల అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, దానివల్ల సమకూరుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు తెలియకుండా కథ నడిపిస్తున్నారు. ఇన్నివేల కోట్ల అప్పులు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏవో అరకొర తప్ప పూర్తిగా నెరవేర్చడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వం రెగ్యులర్గా అమలు చేసే స్కీముల బకాయీలు తీర్చడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలే రూ.35 వేల కోట్ల వరకు ఉంది. ఈ మధ్య చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. గతంలో జగన్ టైమ్ లో మద్యం అమ్మకాల ఆధారంగా రుణాలు తీసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్లు చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా విస్తారంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం కిమ్మనడం లేదు. వారికి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినట్లు అనిపించదు. చంద్రబాబు అప్పు చేస్తే అమెరికా అవుతుందని ప్రచారం చేయడమే ఎల్లోమీడియాకు తరువాయి అన్నమాట. అంతేకాదు.మైనింగ్ కార్పొరేషన్ కు చెందిన సుమారు రూ.రెండు లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టుపెట్టి తొమ్మిదివేల కోట్ల అప్పు చేయడమే కాకుండా, ఆ రుణం చెల్లింపులో సమస్య వస్తే, ఏకంగా ఆర్బీఐ నుంచే డ్రా చేసుకునేలా కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పినట్లు కనబడదు. ఆర్థిక నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తాను ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కోసం ముందుగా గత ప్రభుత్వంపై అవే ఆరోపణలు చేశారన్నమాట. అంటే ఎవరైనా ఏమిటి ఈ వడ్డీలు అని అడిగినా, గతంలో కూడా ఇలాగే జరిగిందని అనుకోవాలన్న మాట. అందులో నిజానిజాల ఎంత అన్నది వేరే విషయం. అప్పులు ఒక సమస్య అయితే, ఏపీ ప్రజలను పచ్చి తాగుబోతులుగా మార్చడానికి వెనుకాడకపోవడం ఇంకో సమస్య. మద్యం ద్వారా 2024-2025లో రూ.24 వేల కోట్ల ఆదాయం వస్తే 2025-2026లో రూ.35 వేల కోట్లకు పెంచాలని ఆదేశించారట. మీడియా కథనం ప్రకారం గతేడాది కన్నా రూ.11 వేల కోట్లు మద్యం ద్వారా ప్రభుత్వం అదనంగా సంపాదిస్తుందని చెప్పి రూ.5500 కోట్లు రుణం తీసుకున్నారన్న మాట. అంతేకాదు. ఆపై ఏడాది ఈ ఆదాయం రూ.50 వేల కోట్లు చేస్తారట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇలా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించడంలో ఏ హిందూమత ధర్మం, ఏ సనాతన ధర్మం కనిపిస్తుందో ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణే చెప్పాలి. మద్యం మత్తులో మోటారు సైకిల్ నడుపుతూ ఒక బస్ తగలబడిపోయేందుకు కనీసం 19 మంది మరణించేందుకు కారణమైన విషయం జనం మదిలో నుంచి ఇంకా పోలేదు. ఆ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకోకపోగా, ఎవరైనా మద్యం బెల్టు షాపుల గురించి, నకిలీ మద్యం గురించి మాడ్లాడితే వారిపై వీర విధేయులైన కొందరు పోలీసు అధికారులతో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని యత్నిస్తున్నారు. స్వర్ణాంధ్ర సాధిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చుతున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి. రుణాలపై వడ్డీ గురించి చూస్తే గరిష్టంగా ఏడు శాతం వరకు ఉంటుంది. అలాంటిది 9.5 శాతం వడ్డీ అంటే ఆ మేరకు ప్రజలపై భారం పడినట్లే. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ చేస్తూ ఇప్పటికి రూ.2.66 లక్షల కోట్ల రుణం తీసుకుని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచి అప్రతిష్టను మూటకట్టుకుంది. రాజధాని పేరుతో తీసుకునే అప్పులపై కూడా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరో రూ.7387 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. నాబార్డు ద్వారా తీసుకుంటున్న ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అంటే దీని అర్థం ఏపీ ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెల్లించాల్సిందని అనేగా! ఈ తాజా అప్పుకూడా కలుపుకుంటే రాజధాని రుణం రూ.47387 కోట్లకు చేరిందన్నమాట. రాజధానిలో ఎన్ని పనులు చేస్తారో తెలియదు కాని రుణాలకు మాత్రం కొదవలేదు. దీనివల్ల రాజధాని చుట్టుపక్కల గ్రామాలకు ఏమైనా కాస్తో, కూస్తో లాభం ఉంటుందేమో కాని ఏపీ ప్రజలందరికి కలిసివచ్చేది ఎంత ఉంటుందన్నది ఎవరికి తెలియదు. అప్పుల భారం మాత్రం అన్ని ప్రాంతాల వారు భరించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, ప్రభుత్వం సొంత వనరుల నుంచి రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని చంద్రబాబు గతంలో ఒక పాట మాదిరి పాడేవారు. కాని ప్రభుత్వం వచ్చాక అసలు విషయం బయటపడింది.సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నది ప్రజలను మభ్యపెట్టడానికే అని తేలిపోతోంది. పోనీ తెచ్చిన డబ్బును పొదుపుగా ఖర్చు పెడుతున్నారా అంటే అదేమీ కనిపించడం లేదు. దుబారాకు ఆకాశమే హద్దుగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. అలాగే చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి రూ.10 వేల వ్యయం చేయడానికి సిద్ధపడ్డారు. సీఎం నివసించే కరకట్ట రోడ్డుపై మంచి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తారట. అందుకు రూ.ఐదున్నర కోట్లు వ్యయం చేస్తారట. ఇది దుబారా కాదా?మరో వైపు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఈ భూమి చాలదని ఇంకో 44 వేల ఎకరాలకు టెండర్ పెడుతున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ల విమాన, హెలికాఫ్టర్ ప్రయాణాలకు తడిసి మోపెడు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రబాబు పర్యటనల ఖర్చు రూ.40 కోట్లు దాటిందట. నాలుగు వేల రూపాయల ఫించన్ పంపిణీకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఏపీ భవిష్యత్తును ఎంతగా విధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన కలుగుతుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విధ్వంస పాలన.. ఏపీపై చంద్రబాబు నెత్తుటి సంతకం
-
బాబు, లోకేష్ ను రఫ్ఫాడించిన వైఎస్ జగన్
-
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
జగన్ ను కలిసిన తరువాత భవానీపురం బాధితుల రియాక్షన్
-
MASS WARNING : 42 కుటుంబాలను నడిరోడ్డున పడేస్తావా?
-
YS Jagan: స్థలం వీళ్లది కాకపోతే.. పర్మిషన్స్ ఎలా ఇచ్చారు?
-
సుప్రీంకోర్టులో కేసు ఉండగానే JCBలతో కూల్చేశారు జగన్ ఫైర్
-
YSRCP తరఫున చర్చలో పాల్గొన్న పార్టీ పక్షనేత మిథున్ రెడ్డి
-
YSRCP Leaders: ఈ జన సునామీని చూశావ్..! దమ్ముంటే ప్రైవేటీకరణ చేసి చూడు
-
చంద్రబాబు రాజకీయ సమాధి ఖాయం ఇప్పటికైనా PPP ఆపేయ్
-
ఈ రోజు ప్రతి ఒక్కరు కోటి సంతకాలతో.. బాబు పై బియ్యపు మధుసూదన్ రెడ్డి ఫైర్
-
కొత్త పింఛన్లు ఎప్పుడో?
చంద్రబాబు.. హామీలు ఇవ్వడంలో చూపిన స్పీడు అమలులో కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా.. 19 నెలలైనా నేటి వరకు ఒక్క పింఛన్ మంజూరు చేయాలేదు. చివరకు దరఖాస్తు ప్రక్రియనూ ప్రారంభించక పోవడంపై అర్హులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త పింఛన్ కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్తవి ఇవ్వకపోగా..ఉన్న వాటిని తొలగిస్తుండటంపై లబి్ధదారుల్లో ఆందోళన నెలకొంది.ఆలూరు రూరల్: కొత్త పింఛన్ల మంజూరుకు చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్ల మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లకే ఎసరు పెడుతున్నారు. విచారణ పేరిట పింఛన్లకు క్రమం తప్పకుండా కోతలు పెడుతున్నారు. మరో వైపు నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రదక్షిణలు చేస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అ«ధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదాలు నిట్టూర్తూ వెనుదిరుగుతున్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని సైతం చంద్రబాబు సర్కారు విస్మరించింది. 2 వేల మందికి పైగా ఎదురుచూపులు.. ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలాల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా మంది అర్హులు కొత్త పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కార్యలయాల చుట్టూ, మరి కొందరు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో సులభంగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. వలంటీర్లు అర్హుల ఇంటికి వెళ్లి వారే దరఖాస్తు చేసి పింఛన్ మంజూరు చేయించే వారు. ఆ సమయంలో ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూనత పింఛన్ల కోసం ఎదురుచూపులే మిగిలుతున్నాయి.కొత్త పింఛన్లు మంజూరు చేయాలిగత ప్రభుత్వంలో మాదిరిగానే దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ల మంజూరు ప్రక్రియ కొనసాగించాలి. అధికారం చేపట్టి 19 నెలలు పూర్తవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పింఛన్ మంజూరు చేయకపోవడం దారుణం. మరో పక్క వెరిఫికేషన్ పేరుతో ఉన్న పింఛన్లు తొలగించే కుట్రలు పన్నుతోంది. వికలాంగులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమివ్వాలి. – రామాంజనేయులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
బాబు కుట్రలపై జన'కోటి' గర్జన
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని్పంచింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదనిమెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎనీ్టఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అరి్పంచి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. వైద్య విద్యపై నీచరాజకీయం వైఎస్సార్సీపీ పాలనలో పేదలకు మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉ న్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను స్థాపించారు. అవి పూర్తి అయితే ఉచిత వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. తద్వారా వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దురాలోచనతో వైద్య విద్యపై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ, ప్రజాద్రోహిగా నిలిచారు. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
బాబు దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్.. అధికారికంగా టీడీపీ ప్రకటన
-
'రియల్'.. సీన్ రివర్స్!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి విజయవాడ, నెట్వర్క్: అభివృద్ధికి చిరునామా..! మంచి ప్రభుత్వం..! విజనరీ పాలన..! సంపద సృష్టిస్తానంటూ అంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ, అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసే పట్టించుకోకుండా.. అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చినవారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడ లేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్లో ప్రయాణిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయవిక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కళకళలాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేనివిధంగా పడిపోవడమే ఇందుకు ఉదాహరణ. 2023–24లో రూ.12 వేల కోట్లుగా ఉన్న రిజి్రస్టేషన్ల టార్గెట్ తాజాగా 2025–26 ఏడాదిలో రూ.10,169 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు టార్గెట్ను పెంచుకుంటూ వెళ్లి అందుకనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రివర్స్లో టార్గెట్ను తగ్గించుకుంటూ వెళుతోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్థారించేసింది. 2023–24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజి్రస్టేషన్ జరగగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. కాగా దివంగత వైఎస్సార్ హయాంలో గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగ్ వరకు ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంతోపాటు బుడమేరుపై ఫ్లైఓవర్లతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులను 2014–19 మధ్య టీడీపీ హయాంలో పట్టించుకోలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన అవుటపల్లి నుంచి వెస్ట్ బైపాస్ పనులను 96 శాతం మేర పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరకుపైగా అవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. రిజిస్ట్రేషన్ల టార్గెట్లు రివర్స్ చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ పాలన, విచ్చలవిడి అవినీతితోపాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. కనీసం వసూళ్ల లక్ష్యాన్ని కూడా సరిగా నిర్దేశించుకోలేని స్థాయికి రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం కంటే కూడా ప్రస్తుతం తక్కువ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా స్థిరాస్తి క్రయవిక్రయాలపై చంద్రబాబు సర్కారు ఆశలు వదిలేసుకుంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ.12 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూ.9,546 కోట్లు రాబట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. 2024–25లో రూ.11,997 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుని రూ.8,843 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. అంతకుముందు సంవత్సరం వచ్చి న ఆదాయాన్ని కూడా చంద్రబాబు సర్కారు తొలి ఏడాది సాధించలేకపోయింది. ఇక 2025–26లో లక్ష్యాన్ని రూ.10,169 కోట్లుగా పెట్టుకుని అక్టోబర్ నాటికి రిజి్రస్టేషన్ల ద్వారా రూ.7 వేల కోట్లు వసూలు చేయగలిగింది. వరుసగా రెండేళ్లపాటు లక్ష్యాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి స్థిరాస్థి రంగంలో ఏమాత్రం వృద్ధి లేదని ఈ ప్రభుత్వమే బయటపెట్టింది. దీంతో తన హయాంలో పడిపోయిన ఆదాయాలనే కొలమానంగా తీసుకుని ప్రస్తుత ఆదాయాలను పోల్చుతుండడం విశేషం. ఆదాయాన్ని 2023–24 సంవత్సరంతో పోల్చకపోవడం, తక్కువ లక్ష్యాన్ని పెట్టుకుని దాంతో పోల్చడం ద్వారా ప్రజలను మభ్యపుచ్చేందుకు యత్నిస్తోంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు సర్కారు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను సగటున 50 శాతానికిపైగా పెంచింది. దీంతో ప్రజలపై భారం పడి రిజిస్ట్రేషన్ల సొమ్ము ఎక్కువగా కట్టాల్సి వస్తోంది. చార్జీలు పెంచడం ద్వారా ప్రజలను బాది ఆదాయాన్ని పెంచుకున్నా రిజి్రస్టేషన్లు మాత్రం అమాంతం తగ్గిపోవడం గమనార్హం. లేదంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇంకా భారీగా పడిపోయేదని స్పష్టంగా తెలుస్తోంది. రాజధానిలో ‘రియల్’ షాక్..! రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగడంలేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావడంలేదు. అపార్టుమెంట్లలో ప్లాట్లు పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థలాలు, ప్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారు. స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్లు చెబుతున్నా అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. రెండు, మూడు విడతల భూసమీకరణ ద్వారా మరింత భూమిని తీసుకుంటామని ప్రకటించడం, పూలింగ్కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. చంద్రబాబు సర్కారు భూదాహంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. పట్ణణాలు, నగరాల్లోనూ డీలాచంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాయలసీమను పట్టించుకోకపోవడం, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకపోవడంతో రియల్ రంగం కుదేలైంది. వైఎస్ జగన్ హయాంలో సీమలో పరుగులు తీసిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడు కుదేలయ్యాయి. ప్రధానంగా తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు తగ్గిపోయాయి. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలు, భూములపై పెత్తనం చేస్తుండడంతో కొనాలనుకున్న కొద్దిమంది కూడా జంకుతున్నారు. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాల్లోనూ రియల్ వ్యాపారం మందకొడిగా ఉంది. నగరాల్లోనూ అమ్మకాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ–మచిలీపట్నం రహదారికి ఇరువైపులా గతంలో కళకళలాడిన వ్యాపారం ఇప్పుడు పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం, ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని చంద్రబాబు ప్రభుత్వం బడాయి పోతున్నా భూముల కొనుగోళ్లు మాత్రం లేకపోవడం గమనార్హం. 2019–24 మధ్య విశాఖలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన రియల్ వ్యాపారం ఏడాదిన్నరగా దిగజారిపోయింది. పెద్ద ప్రాజెక్టులు చాలా వరకూ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. నిర్మాణ రంగం విలవిలఒకపక్క రియల్ రంగం తిరోగమనంలో ఉండడంతో మరోపక్క దానిపై ఆధారపడిన నిర్మాణ రంగం కూడా కుదేలైంది. భవన నిర్మాణ కారి్మకులకు పనులు తగ్గిపోయాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కార్మికులకు గతంలో చేతి నిండా పని ఉండేది. ఇప్పుడు పని దొరకడం కష్టంగా మారింది. నిర్మాణ రంగంలో కీలకమైన ఇటుక, సిమెంట్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇనుము. ఎలక్ట్రిసిటీ, విక్రయాల వ్యాపారాలు క్షీణించాయి. ఇలా చంద్రబాబు సర్కారు అస్తవ్యస్థ విధానాల వల్ల కీలక రంగాలు చతికిలపడ్డాయి. వ్యాపారాలు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గిపోవడంతో అన్ని వ్యాపారాలు తగ్గిపోయాయి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ హయాంలో మంచి రోజుల్లో సగటున రోజుకు 150, ఇతర రోజుల్లో 100–120 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు మంచి రోజుల్లోనూ 70–80 దాటడం లేదు. సాధారణ రోజుల్లో 50 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా ఉంది. 2019కి ముందు మచిలీపట్నం శివారులో సెంటు రూ.3 లక్షలు ఉంటే 2024లో రెట్టింపై రూ.6 లక్షలకు చేరుకుంది. తరువాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ధరలు పెరగలేదు. 2022–23లో తూర్పు గోదావరి జిల్లాలో 1,29,355 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా 2025–26 నవంబర్ చివరి నాటికి కేవలం 61,597 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. విజయనగరం పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.10 లక్షలు ఉన్న 200 గజాల ఇంటి స్థలం 2019 తరువాత వైఎస్ జగన్ హయాంలో రూ.25 – రూ.30 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి. మూడు నాలుగేళ్ల క్రితం కొన్న ధరకు అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వ్యాపారులు చెబుతున్నారు. కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో రోజుకు సుమారు 250–300 రిజి్రస్టేషన్లు జరగగా ప్రస్తుతం 50–60 మించడం లేదు. ప్రొద్దుటూరు సబ్ రిజి్రస్టార్ కార్యాలయ పరిధిలో రోజుకు 80–90 రిజిస్ట్రేషన్లు నుంచి ప్రస్తుతం 30కి తగ్గిపోయాయి. ఆదోని మెడికల్ కాలేజీ పరిసరాల్లో గతంలో ఎకరం రూ.5 కోట్లు పలకగా ఇప్పుడు అడిగే నాథుడే కరువయ్యారు. 2023–24 వైఎస్ జగన్ హయాంలో ఇలా..1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.12,000 కోట్లు 2) రాష్ట్రంలో భారీగా పెరిగిన భూముల ధరలు 3) రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు.. 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ 4) రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, 30 లక్షలకుపైగా గృహ నిర్మాణాలు - ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం - తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు - గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణాలతో స్థానికంగా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు సంపద సృష్టిస్తూ అడుగులు 5) భవన నిర్మాణ కార్మికులకు సమృద్ధిగా పనులు 6) సంక్షేమ పథకాల అమలుతో పెరిగిన పేదల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు 7) రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు కళకళ. జోరుగా గృహ నిర్మాణాలతో సిమెంట్, పెయింట్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యాపారాల జోరు 2025–26 బాబు ప్రభుత్వంలో.. 1) రిజిస్ట్రేషన్ల ఆదాయం టార్గెట్ రూ.10,169 కోట్లకు కుదింపు 2) భూముల ధరలు ఒక్కసారిగా పతనం.. రాజధానిలోనూ మందగమనం 3) రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యకే పరిమితం.. అక్టోబర్ దాకా 13.92 లక్షలే 4) కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న వ్యవస్థలే నిర్వీర్యం. 5) పొట్ట కూటి కోసం కార్మికుల అవస్థలు 6) పథకాలు అందక, అభివృద్ధి జాడ లేక పేదల దీనావస్థ 7) రియల్ ఎస్టేట్ వెలవెల. ఆగిన ఇళ్ల నిర్మాణాలు. వ్యాపారులు బేజార్కృష్ణాలో కుప్పకూలింది..! కృష్ణా జిల్లాలో ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 20 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింట్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. వైఎస్సార్ సీపీ హయాంలో బందరు పోర్టుకు శంకుస్థాపన చేసి పనులను పరుగులు పెట్టించింది. మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. గిలకలదిండి íఫిషింగ్ హార్బర్, పలు కొత్త హైవేలు రావడంతో జిల్లా పునర్విభజన సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. బందర్ హైవే వెంట నిడుమోలు, పామర్రు, ఉయ్యూరు. కంకిపాడు ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. కత్తిపూడి–ఒంగోలు హైవేతో పెడన, అవనిగడ్డ నియోజక వర్గాల్లో సైతం రియల్ భూమ్ అందుకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వేగం మందగించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంది. బాపట్లలో భవన రంగం బాధలు బాపట్ల జిల్లాలో ఏడాదిన్నరగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనమైంది. గత ప్రభుత్వంతో పోలిస్తే రిజి్రస్టేషన్లు సగం తగ్గాయి. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల జిల్లాలో 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 76,215 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 50,983 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గిపోగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులకు తగ్గకుండా పనులుంటే ఇప్పుడు పది రోజులు కూడా దొరకడం లేదని భవన నిర్మాణ కారి్మకులు వాపోతున్నారు. సిమెంట్, ఐరన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. తీరప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించడంతో రోడ్లు ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా జరిగాయి. బాపట్ల కేంద్రంగా గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. దీంతో 2019 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అప్పటివరకూ తీర ప్రాంతంలో ఎకరం రూ.30 లక్షలు పలికిన భూమి తరువాత రూ.3 నుంచి 5 కోట్లకు చేరింది. గత ఏడాదిన్నరగా పరిస్థితి తారుమారైంది. వైఎస్ జగన్ హయాంలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రాంతంలో రూ.కోటిన్నర పలికిన ఎకరం భూమిని ప్రస్తుతం రూ.20 లక్షలకు కూడా కొనేవారు లేరు. అద్దంకి, రేపల్లె ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎకరం రూ.కోటి దాకా పలికిన భూముల ధరలు తిరిగి రూ.20 లక్షలకు పతనమయ్యాయి.పల్నాడులో ధరలు పతనం.. పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రాకతో పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజుపాలెం, మాచవరం తదితర మండలాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. రైతుల భూములు రెట్టింపు ధరలు పలికాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆదాయం అమాంతం పడిపోయింది. పల్నాడు జిల్లావ్యాప్తంగా 2023–24లో రిజి్రస్టేషన్ల ద్వారా రూ.472.38 కోట్ల ఆదాయం సమకూరగా 2024–25లో ఆదాయం రూ.396 కోట్లకు పడిపోయింది. 2025–26లో ఇప్పటిదాకా రూ.200 కోట్లు కూడా రాలేదు. గతంలో ఏటా సగటున 32 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా ప్రస్తుతం అది 14 వేలకు పడిపోయింది. దీంతో మధ్యవర్తులు ఉపాధిలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. గతంలో వెంచర్ల ఏర్పాటుతో ఉపాధి పొందిన వేలాది మంది కూలీలు, ట్రాక్టర్, జేసీబీ, ట్రక్కు డ్రైవర్లు ప్రస్తుతం పనుల కోసం అడ్డాలలో ఎదురు చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరువలోని కామేపల్లి గ్రామ పరిధిలో 2019కి ముందు ఎకరం పొలం రోడ్డు పక్కన సుమారు రూ.30 లక్షలు ఉండగా స్థానికంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏకంగా ఎకరం రూ.కోటిన్నర దాకా పలికింది. 2024లో వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి ఎకరం రూ.2 కోట్ల దాకా వెళ్లింది. అదే ఇప్పుడు కనీసం రూ.60 – రూ.80 లక్షలు కూడా పలకడం లేదు. కనీసం ధర గురించి అడిగే వారు లేరని రైతులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. నరసరావుపేటలోనూ వెంచర్లు వేసిన వ్యాపారులు స్థలాలు అమ్ముకోలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో నీరసించిన వ్యాపారం నెల్లూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగుంటుందని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన రియల్టర్లు లేఅవుట్లు వేశారు. అన్ని సదుపాయాలతో అధునాతనంగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేశారు. ఇప్పుడు వాటిని కొనేవారు లేరు. గత 9 నెలలుగా ఖాళీగా ఉన్నారు. కొందరు బిల్డర్లు నూతనంగా నిర్మించిన ఇళ్లను బాడుగలకు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. భారీగా వడ్డీలు కట్టలేక లబోదిబోమంటున్నారు. ఇక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రకటన చేసినా రియల్ ఎస్టేట్ ఏమాత్రం ఊపందుకోలేదు. ఏడాదిలో ఒక్కటీ అమ్ముడుపోలేదుటీడీపీ అధికారంలోకి వచ్చాక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. గత ఏడాది కాలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడు పోలేదు. పెట్టుబడులు మొత్తం ప్రాజెక్టులపై పెట్టాం. వ్యాపారం దివాలా తీస్తోంది. తెచి్చన పెట్టుబడులకు వడ్డీలు కట్టడమే సరిపోతోంది.– షేక్ కిరణ్బాబు, బిల్డర్, ఈడుపుగల్లు, కంకిపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా వలసలు పోతున్నారు ఏడాదిన్నరగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. స్థలం అమ్మేవారు ఉన్నా.. కొనేవారు లేరు. అందుకే రిజి్రస్టేషన్లు ఆగిపోయాయి. ఇల్లు కట్టించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఓపెన్ ప్లాట్లు కూడా అమ్ముడు పోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కారి్మకులు తమ పనులను వదిలేసి బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. – నాగరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు, కదిరి, సత్యసాయి జిల్లాపూర్తిగా పతనమైన రియల్ ఎస్టేట్ ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌనైపోయింది. మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమ్మే వారు ఉన్నాగానీ కొనేవారు లేరు. నేషనల్ హైవే పక్కన కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. సంతనూతలపాడు మండలంలో రియల్ ఎస్టేట్ భూం ఇప్పుడు పూర్తిగా పతనమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నమోదవుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇక్కడ 2022–23లో 6,029 రిజిస్ట్రేషన్లు జరిగాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25లో ఆ సంఖ్య 3,972కు పడిపోయింది. – కుంచాల ఆంజనేయులు, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లాపూట గడవడమే కష్టంగా ఉందిరియల్ ఎస్టేట్ కుదేలైంది. భవన నిర్మాణాలు భారీగా తగ్గిపోయాయి. గతంలో నెలలో 20 రోజులకుపైగా పనులుంటే ప్రస్తుతం 10–15 రోజులు కూడా దొరకడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా ఉంది. – జి.హరికృష్ణారెడ్డి, ఎనీ్టఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడునెలలో సగం రోజులే పనిరియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ నిలిచి పోయాయి. దీంతో నిర్మాణ పనులపై ఆధారపడి ఇక్కడ జీవిస్తున్న వేల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాజధాని వస్తుందన్న సమయంలో భవనాల పనులు మొదలు పెట్టారు. అందరికీ చేతినిండా పని ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు దొరకడం లేదు. రోజుకో బ్యాచ్కి పని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. అంటే ఒక కార్మికుడికి నెలలో 15 రోజులు కూడా పని లేకుండా పోయింది. దీంతో కారి్మకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరకకపోవడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. – వైఎస్ మూర్తి, శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మధురవాడ, విశాఖపని దొరకడం లేదు.. గత ప్రభుత్వంలో నెలకు 22 రోజులు పనులు దొరికేవి. ఈ ప్రభుత్వం వచ్చాక నెలకు పది రోజులు కూడా పనులు ఉండడం లేదు. ఉదయమే సెంటర్కు వచ్చి పడిగాపులు కాస్తున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. – నాగూర్బాషా, భవన నిర్మాణ కార్మికుడు, ఉప్పరపాలెం, బాపట్ల జిల్లా. -
పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు.. వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేదలకు వైద్య విద్యను దూరం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.చంద్రబాబు నిర్ణయం వల్ల 2450 మెడికల్ సీట్లు పేదలు దూరమవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు తన జేబు సంస్థల్లా మార్చుకున్నారన్న ఆక్షేపించారు. మరోవైపు కేంద్ర స్థాయీ సంఘం పేరుతో పచ్చి అబద్ధాలు రాస్తున్న ఈనాడు.. పీపీపీ విధానమే ముద్దు అంటూ బాబుకి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ద్వారా.. ఆ ఘనత మీ ఖాతాలోనే వేసుకొవాలని చంద్రబాబుకు సూచించారు. అంతే తప్ప ప్రైవేటీకరణ పేరుతో పేదల నోట్లో మట్టికొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ కూటమి విధానమైతే.. అందుకు వైఎస్సార్సీపీ పూర్తి విరుద్ధమన్న సుధాకర్ బాబు దీనిపై రాజీనామా చేసి ప్రజల రెఫరెండంకు సిద్ధమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ఏర్పాటు చేస్తే.. మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ రద్దు చేస్తామని బీరాలు పలికి.. ఇవాళ పూర్తిగా కాలేజీలనే ప్రైవేటు పరం చేయడంపై ధ్వజమెత్తారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాజకీయంగా కాక సామాజిక కోణంలో చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాదని పేద బిడ్డల చదువుల మీద ఉక్కుపాదం మోపాలని చూస్తే.. అప్పుడు కోటి కాస్తా పదికోట్ల సంతకాలవుతాయని తేల్చి చెప్పారు. పీపీపీకి వ్యతిరేకంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న సుధాకర్ బాబు, మా తలలు పగిలినా వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 15వ తేదీన జిల్లాల నుంచి కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. 18న జగన్ నాయకత్వంలో గవర్నర్ దగ్గరకు వెళ్తాయన్న ఆయన... ఈలోపు చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..చంద్రబాబు జేబు సంస్థల్లా వ్యవస్థలుఈ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేయబడుతున్నాయని.. చంద్రబాబునాయుడికి జేబు సంస్థలుగా మారిపోతున్నాయని, ఆయన మాఫియా డాన్లా మారిపోయాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాం. ఇవాళ ఆది మరోసారి సుస్పష్టం అయింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం లేదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవచ్చని, వారి చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందుతుందని.. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లుగా.. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో బ్యానర్ ఐటం రాశారు.ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదాన్ని ఎత్తుకుంది. కానీ చంద్రబాబు అనుకూలమైన జేబు సంస్థ అయిన ఈనాడు మాత్రం పీపీపీ విధానమే ముద్దు అని రాసింది. చంద్రబాబుకి డబ్బు కొట్టడంలో ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు ఏం చేసినా రైట్, ఆయన ఏం మాట్లాడినా అదే కరెక్ట్ అని రాస్తుంది. ఇంతమంది ప్రజలు వద్దు అంటే.. కాదు అదే ముద్దు అంటూ ఈనాడు రాయడాన్ని వైఎస్సార్సీపీ ఖండిస్తోంది.మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ.. చంద్రబాబు జేబు సంస్థలా వ్యవహరిస్తున్నారు కాబట్టే.. మీరు చంద్రబాబుకి బాకా ఊదుతున్నారు కాబట్టే మిమ్మల్ని ఎల్లో మీడియా అని వ్యవహరిస్తున్నాం. చంద్రబాబుకి, మీకు ఆర్థికపరమైన, వ్యాపారపరమైన లావాదేవీలున్నాయి. అందుకు నిదర్శనమే ఇవాళ మీరు రాసిన వార్తలు.మెడికల కాలేజీలపై చర్చకు సిద్ధమా?1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఏపీలో 12 మెడికల్ కాలేజీలుంటే.. ఇవాళ అవి 29కు చేరాయి. ఒక్క వైఎస్ జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే.. మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకి ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న స్పృహ వచ్చిందా? వైఎస్ జగన్ విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు ఇద్దరి సిద్ధాంతాలు, సంస్కరణలపై ఒక రోజంతా చర్చ నిర్వహిద్దాం. మీకు నచ్చిన టెలివిజన్ చానెల్స్ అధినేతలంతా విజయవాడ తీసుకురండి. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులంతా వస్తాం. చంద్రబాబునాయుడు సిధ్ధాంతమేంటో, ఆయన సిద్ధాంతం పునాదులేంటో చర్చిద్దాం.బలహీనమైన రాజకీయ పునాదులతో ఉన్న చంద్రబాబు... భయం, అభద్రతా భావంతో తనను కానీ పార్టీని ఓన్ చేసుకునే విధానంలో.. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరికీ తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు. తాను దోచుకున్న డబ్బులనే మీ అందరికీ పంచుకుంటూ వచ్చాడన్నదే ప్రధానమైన అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి.. మీరు కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, రామోజీ రావు చనిపోతే రూ.5 కోట్ల ప్రజాధనాన్ని ఆయన సంస్మరణ సభ నిర్వహించడం కోసం ఖర్చు చేయడాన్ని ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు జేబు సంస్థ అనడానికి నిదర్శనం.పీపీపీ- దెబ్బతిన్న మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తిపీపీపీ విధానం వల్ల 17 మెడికల్ కాలేజీల నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజారోగ్యం కొరకు వైఎస్ జగన్ సామాజిక స్పృహతో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలను స్థాపించి.. వందలాది ఎకరాలను ఈ కాలేజీల పరిధిలోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్యం అందించాలని ఆశించాడు. అందులో 7 కాలేజీల నిర్మాణం పూర్తైంది. 2023-24 విద్యాసంవత్సం నాటికి 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలను పూర్త చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? గత ప్రభుత్వంలోనే ఏ పైనానా పూర్తి కాకుండా నిల్చిపోతే... ఏ ప్రజాపరిపాలకుడైనా దాన్ని పూర్తి చేసి ఆ ఘనత తన ఖాతాలో వేసుకుంటాడని భావిస్తాం.ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి.. వీటిని నేనే కట్టానని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటాడని భావించాం. కానీ చంద్రబాబు నికృష్టరాజకీయాలకు, నిరంకుశరాజకీయాలకు తెరలేపాడు.ఏ మాత్రం జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించాడు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. వందలాది ఉచిత మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. ఉచిత వైద్య సేవలు ఆశించిన పేదలు, ఆ కాలేజీలదగ్గరకు వచ్చి వైద్యం ఆశించిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది.పీపీపీపై నిస్సిగ్గుగా అనుకూల ప్రచారంఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108 నాశనం చేశాడు. 104 అయితే అస్సలు కనబడ్డం లేదు. ఆ రోజు 104 అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి చారిత్రాత్మక పథకాలు మచ్చుకైనా రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ దఫా చంద్రబాబు బరితెగించాడు. ఈ రాష్ట్రంలో 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తీసుకుందామనుకుని ఆశపడ్డ వాళ్ల నోట్లో మట్టికొట్టాడు. పైగా వాళ్ల పత్రికతో బాకాలు ఊదించుకుంటూ.. పీపీపీ విధానమే బాగుంటుందని, ఇదే సరైన నిర్ణయమని నిస్సిగ్గుగా ప్రచారం చేయించుకుంటున్నాడు.పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వైఎస్సార్సీపీ బద్ద విరుద్దం. మీరు, ఈనాడుతో పాటు మీ అనుకూల పత్రికలు పీపీపీ విధానానికి సానుకూలం. తక్షణమే చంద్రబాబును రాజీనామా చేయమనండి. లోకేష్, పవన్ కళ్యాణ్లను కూడా రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం. ప్రజలను రిఫరెండెం కోరుదాం. ప్రజలకు ఏది అవసరమో వారి ముందుకే వెళ్దాం.స్థాయీ సంఘం పేరుతో అబద్దాలుకేంద్ర ప్రభుత్వ స్థాయీ సంఘం పీపీపీ విధానం సిఫార్సు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. స్థాయి సంఘం పన్ను రాయితీలు ఇమ్మని, స్కాలర్ షిప్పులు ఇమ్మని చెప్పింది. సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించమని చెప్పిందే తప్ప.. పీపీపీ విధానం బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయండని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆయా కాలేజీల నిర్వహణకు వీలుగా కన్వీనర్ కోటాతో పాటు సెల్ఫ్ పైనాన్స్ సీట్లను పెట్టాలని ఆలోచన చేస్తే.. వైఎస్ జగన్ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నాడు.వైఎస్ జగన్ ప్రభుత్వ విధానం తప్పు అని.. ఈ పార్టీలు, పత్రికలే దుమ్మెత్తి పోశాయి. ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ.. వార్తలు రాశాయి. అక్కడితే ఆగకుండా మేం ఆధికారంలోకి వస్తే.. 100 రోజుల్లో సెల్ఫ్ పైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. పీపీపీ పేరుతో పూర్తిగా ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పంపించే పనిలో పడ్డారు.పైగా ఆ పీపీపీ విధానంలో కూడా ఉచితాలు ఉంటాయని.. పచ్చి అబద్దాలు చెబుతూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉచితమని చెబుతున్నారు. ఓపీలో ఏం సేవలు అందుతాయి. వీళ్లు చెబుతున్న ఉచితం.. జ్వరం, పన్నో, కన్నూ, కడుపో నొప్పి వస్తే.. ఓపీ ఫ్రీ. అలా కాకుండా కాళ్లూ చేతులు విరిగితేనో, ఇంకేవైనా జబ్బులు వస్తేనో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు పేదలు కట్టుకోలేదు.చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆ విషయం అర్థం కాదు. మేం భారీ ఫీజులు కట్టి ఆ వైద్యాన్ని పొందలేరని.. ప్రభుత్వం వైపు చూసే ఆనాథల కోసమే ఈ కళాశాలలు వస్తే.. దాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. పైగా ప్రైవేటీకరణ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ పేదలకు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది నమ్మవచ్చా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిపై ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందా? ఇవాళ కడుతున్న మెడికల్ కాలేజీలో 100 పడకలు ఉంటే.. రిజర్వేషన్ ప్రకారం 70 పేదలకు, మిగిలినవి ఇతరులకు పెట్టగలిగే అవకాశం ఉంటుందా? మరి అలాంటప్పుడు ఈ రకమైన అబద్ధాలు ఎలా చెబుతారు?కాలేజీలు ప్రైవేటీకరణ - జీతాలు ప్రభుత్వ ఖజానాప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడమే ఒక పెద్ద స్కామ్ అయితే.. వారికి ప్రభుత్వం మరొక పెద్ద బొనాంజా ప్రకటిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఆసుపత్రులు ఇచ్చి.. అక్కడ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మీ అరాచాకాలను గమనిస్తున్నారన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో.. రూ.140 కోట్లు ప్రవైటు వ్యక్తుల చేతులకి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూడ్డం ఎంతవరకు సహేతుకం? పైగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యప్రసాద్ అవును నిజమే ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని చెబుతున్నాడు. ఈయనా మంత్రి? అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు అంటోంది.పీజీ మెడికల్ సీట్లకు ఒక్కోదానికి రూ.29 లక్షలు వసూలు చేసే విధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కెచ్ వేశారు. ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వంలో ఆయా కాలేజీల నిర్వహణకు.. స్వతంత్రంగా భరించే విధంగా... కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించారు. దాన్ని విమర్శించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. తీరా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉచిత సీటు వస్తే రూ.30వేలు ఫీజు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.9 లక్షలు, ఎన్నారై కోటా అయితే రూ.29 లక్షలు రేటు ఫిక్స్ చేశారు. ఆ రోజు మీరు చెప్పినట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచినట్లైతే... ఇవాళ మీరు చెప్పినట్లు రూ.9, రూ.29 లక్షలు ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు?5 కొత్త మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగు పీజీ కోర్సులలో 60 సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు ఉందా? తొలివిడత 4 కాలేజీల్లో 50 శాతమే కన్వీనర్ కోటా, పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.. వాటిలో 50 శాతం సీట్ల మాత్రమే ప్రభుత్వ కోటాలో ఉంచుతున్నారు. ఇంతకంటే ద్రోహం ఉంటుందా? ఈ ఒక్క చర్య ద్వారానే ప్రభుత్వ విధానం, చిత్తశుద్ధి తేటతెల్లమైందిమెడికల్ కాలేజీల భూములు కౌరుచౌకగా అప్పగింత..మరోవైపు ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైయస్.జగన్ ప్రభుత్వం 50 ఎకరాల స్ధలం కేటాయిస్తే.. వందలదాలి కోట్ల ఖరీదు చేసే ఆ భూములను ప్రభుత్వం.. రూ.100 కే ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా ధారాధత్తం చేస్తోంది. 33 ఏళ్ల లీజు పేరుతో కేవలం రూ100 కే అప్పగిస్తోంది. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడమే. పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక్కా కాలేజీకి 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఇవాళ 191.71 ఎకరాలకే వచ్చింది. ఈ మధ్యలో భూమి సుమారు 50-60 ఎకరాలు మాయమైపోయింది. ఇది ఘోరమైన, బాధాకరమైన విషయం.ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించడం వల్ల.. తొలి ఏడాది ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 కలిపి మొత్తం 2450 సీట్లను కోల్పోయాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు జపం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల 2450 సీట్లలో మన ఆంధ్రరాష్ట్రంలో పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయారు.మనస్సుతో చూడండి. ఆ గొప్ప మాకు వద్దు. ఆ 17 కళాశాలల క్రెడిట్ మీరే తీసుకుని, మీరే ప్రారంభించండి. రూ.1000 కోట్లు కేటాయించి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయండి. 2450 సీట్లు కోల్పోయిన వారందరూ ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు చెందిన పేదలే ఉంటారు. దయచేసి ప్రైవేటీకరణను ఆపి, ఆ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచండి. ప్రైవేటీకరణ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక కోణంలో చూడాల్సిన ఆవశ్యకత ఉంది.కోటి సంతకాలు పది కోట్లవడం ఖాయంరాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాలివ్వాలని వైఎస్ జగన్ భావిస్తే.. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తే రాజధాని ప్రాంతంలో డెమొగ్రాఫికల్ ఇంబేలన్స్ వస్తుందన్న మహా ఘనుడివి.. అదే విషయాన్ని కోర్టుకు చెప్పిన ఘనుడివి నువ్వు చంద్రబాబూ. అలాంటి నువ్వు మా బిడ్డల చదువులు మీద ఉక్కుపాదం మోపుతుంటే.. ఈ కోటి సంతకాలు పదికోట్లవుతాయి. ఎలాంటి త్యాగాల చేసైనా.. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచేందుకు పోరాటం చేస్తాం. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కడం ఖాయం.15వ తేదీనాటికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల కోటి సంతకాలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. 18వ తేదీన ఈ సంతకాలన్నీ గవర్నర్కి చేరుతాయి. ఈ లోగా నీ నిర్ణయం మార్చుకో చంద్రబాబూ?. కేసులు పెట్టి, తలలు పగలగొట్టి మమ్నల్ని భయపట్టాలని చూసే మీ ప్రయత్నాలు మమ్నల్ని ఆపలేవు. ప్రజా సమస్యల పోరాటంలో వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అలు పెరగని పోరాటం చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే మీ సిద్ధాంతం అయితే.. పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందించడం, ఇళ్ల పట్టా ఇవ్వడం, వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మీ సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకూ జరుగుతున్న పోరాటంలో మేం ఏ పోరాటానికైనా, త్యాగాలకైనా సిద్ధమేనని సుధాకర్ బాబు హెచ్చరించారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 31 సీట్లే.. IITians సంచలన సర్వే రిపోర్ట్!
-
అప్పుల కోసం కొత్త కిక్కు.. ఎల్లో మీడియాపై బుగ్గన ర్యాగింగ్
-
బాబుగారి తాలూకా.. కక్షకట్టి.. పొట్ట కొట్టి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పాలన గాడితప్పింది. దశాబ్దాలుగా పారిశుధ్య పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులపై ‘పద్మావతి ఏజెన్సీ’ కత్తిగట్టింది. వయసు, విద్యార్హత ఆంక్షల పేరుతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 50 ఏళ్లు వయసు పైబడిన వారు ఉద్యోగాలకు అవసరం లేదని తెగేసి చెప్పింది. జీవనాధారం కోల్పోతే కుటుంబ పోషణ ఎలా అన్న మానసిక క్షోభ కార్మీకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో కార్మీకులు తమ జీవనాధారాన్ని దెబ్బ తీయొద్దంటూ ఏజెన్సీ నిర్వాహకులను ప్రాధేయపడ్డారు. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ వారియర్స్గా పనిచేసిన తమకు ఇదేనా మీరిచ్చే గుర్తింపు అని ప్రశ్నిస్తే.. కర్కశంగా సమాధానమిచ్చారు. మీరెటైనా చావండి.. మేము ఇతరులను పనిలోకి తీసుకుంటున్నాం అని తెగేసి చెప్పడంతో గుండె ఆగినంత పనైంది. ఎప్పుడు తమకు డ్యూటీ చివరి రోజు అవుతుందోనని భయం భయంతో విధులకు హాజరవుతూ రెండు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకుల బెదిరింపులతో మనస్తాపం చెందిన పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. చేతులెత్తేసిన అధికార యంత్రాంగం.. పారిశుధ్య కార్మీకుల సమస్యతో సర్వజనాస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన పారిశుధ్యంపై అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. నిబంధనల మేరకు కార్మీకులపై చర్యలుంటాయని, స్టేట్ పాలసీ అంటూ మాట దాటవేస్తున్నారు. దీనికి తోడు ఏజెన్సీ నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రులని, ఈ విషయంలో తామేమి చేయలేమని అధికారులే బహిరంగంగా చెబుతుండడం దుమారం రేపుతోంది. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవ్వరూ కార్మికుల సమస్యను పట్టించుకోలేదు. దుర్వాసన వెదజల్లుతున్న వార్డులు.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శనివారం పారిశుధ్య కార్మీకులు విధులకు గైర్హాజరయ్యారు. రోజుకు మూడు, నాలుగుసార్లు శుభ్రం చేయాల్సిన వార్డులను ఒక్కసారి కూడా శుభ్రం చేయలేదు. ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్, ఐసీసీయూ, పీఐసీయూ, గైనిక్, లేబర్, ఆర్థో, మెడిసిన్, ఈఎన్టీ, ఆపరేషన్ తదితర వార్డులన్నీ దుర్వాసన వస్తున్నాయి. ఇప్పటికే శానిటేషన్ నిర్వాహకులు కనీసం డస్ట్బిన్లు, కవర్లను ఇవ్వలేదు. దీంతో రోగికి వినియోగించిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. పారిశుధ్యం నిర్వహణకు గాను ప్రతి నెలా రూ.70 లక్షలు ఏజెన్సీకి చెల్లించేలా ఒప్పందంలో ఉంది.జీవనాధారం పోతే ఏం కావాలి? ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాం. పారిశుధ్య పనులు చేస్తూ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇప్పటికే నా భర్త కృష్ణా నాయక్, బిడ్డ కవిత, అల్లుడు నాగరాజు చనిపోయారు. మనవడు, మనవరాలు గంభీర్ (డిగ్రీ), గంగోత్రి (9వ తరగతి) ఆలనా, పాలన నేనే చూసుకోవాలి. ఇప్పుడేమో ఏజెన్సీ వాళ్లు పని నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. నాకుటుంబానికి ఆధారమంతా ఇదే సార్. వచ్చే డబ్బులతోనే వారిని చదివించుకుంటున్నా. ఇప్పటి వరకు ఐదారు ఏజెన్సీలు వచ్చాయి. పద్మావతి ఏజెన్సీ అంత ఘోరంగా ఎవరూ సతాయించడం లేదు. – కాంతమ్మ, పారిశుధ్య కార్మికురాలుఇంతలా అంగలాపిస్తే ఎలా..? నేను, నా భర్త సిరాజ్ ఉంటున్నాం. ఆయన ఏ పనీ చేయలేని పరిస్థితి. 12 ఏళ్లుగా సర్వజనాస్పత్రిలో పని చేస్తున్నా. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కుటుంబం గడుస్తుంది. ఈ వయసులో ఉద్యోగం లేదని, పనికి రావొద్దని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేశాం. ఇప్పుడు ఉన్నఫళంగా వెళ్లిపొమ్మంటే ఏం చేయాలి. ఇంత అంగలాపిస్తే ఎలా? ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు మాతోటి స్వీపర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీళ్లు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? – షమీమ్, పారిశుధ్య కార్మీకురాలు ఏజెన్సీ ముసుగులో దురుసు ప్రవర్తన..ఈ నెల 12న పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలి పట్ల పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజరెడ్డి దురుసుగా మాట్లాడారు. చస్తే చావు అంటూ కర్కశంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన పద్మావతి చిన్నపిల్లల విభాగం అంతస్తుపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ⇒ సర్వజనాస్పత్రిలో ఏజెన్సీ నిర్వాహకులు, పారిశుధ్య కార్మీకులకు మధ్య 20 సార్లకుపైగా వాగ్వాదం జరిగింది. పదుల సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు. నెల రోజులుగా కార్మీకులు తమకు న్యాయం చేయాలంటూ రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ⇒ పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికే 50 మంది వరకు సూపర్వైజర్లు, పారిశుధ్య కార్మీకులను విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారిని విధుల్లోకి పురమాయించినట్లు తెలుస్తోంది. దీనికితోడు పారిశుధ్య కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఏజెన్సీ మేనేజర్లు ఆస్పత్రిలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నా రు. ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అనే ఆలోచనలో నిమగ్నమయ్యారు.కార్మీకురాలికి పరామర్శ ఏజెన్సీ మేనేజర్లు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు పరామర్శించారు. కార్మీకులందరికీ యూనియన్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, కార్యదర్శి బి.రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి అనిల్కుమార్గౌడ్, నగర కార్యదర్శి రామాంజి రాయల్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హుస్సేన్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటియన్స్ సర్వేలో బయటపడ్డ బాబు బండారం
-
నారా అప్పారావు దెబ్బకు దివాలా దిశగా ఏపీ
-
చెయ్యిదాటి పోతున్న విశాఖ ఉక్కు.. ఇక ఆంధ్రుల హక్కు కాదా ?
-
బాబు పాలనపై సంచలన సర్వే
-
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
-
ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
-
టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !
-
అమరావతికి.. మరో రూ.7,387 కోట్లు అప్పు
-
రైతులను మళ్లీ నట్టేట ముంచిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఖరీఫ్లో రైతులకు పంటల బీమా వర్తింపజేయకుండా నిండా ముంచేశారు. దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా రాలేదు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 3.77 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రాష్ట్రం నుంచి నివేదిక అందినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద రాష్ట్రంలో రైతులకు ఎటువంటి బీమా పరిహారం చెల్లించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎంఎఫ్బీవై కింద తన వాటాను చెల్లించలేదని తెలిపారు. పైగా ఈ ఏడాది ఖరీఫ్లో పీఎంఎఫ్బీవై–పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఏపీలో కేవలం 5.3 లక్షలమంది రైతులు మాత్రమే నమోదైనట్లు చెప్పారు. ఈ నమోదైన రైతులకు కూడా ఎటువంటి బీమా క్లెయిమ్లను చెల్లించలేదని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల కోసం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేశారు. రైతులే తమ పంటలకు బీమా చేసుకోవాలనే ధోరణిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్లో రాష్ట్రంలో కేవలం 5.3 లక్షలమంది రైతులే బీమా కింద నమోదయ్యారు. అదే 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖరీఫ్లోనే ఏకంగా 30.09 లక్షలమంది రైతులకు చెందిన 50.63 లక్షల ఎకరాల్లోని పంటలకు బీమా సౌకర్యం కల్పించింది. చంద్రబాబు నిర్వాకం కారణంగా కేవలం 5.3 లక్షలమంది రైతులకే బీమా పరిమితం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం వాటా చెల్లించకపోవడంతో వారి పంటలకు కేంద్ర బీమా పరిహారం చెల్లించలేదు. -
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
హార్బర్లోనూ ప్రైవేట్ పాగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులు వేట కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడకూడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫిషింగ్ హార్బర్లోనూ ప్రైవేట్ సంస్థ పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరిట ప్రైవేట్కు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు షిప్యార్డ్ నిర్మాణం పేరిట ఫిషింగ్ హార్బర్లోకి సైతం ప్రైవేట్ సంస్థకు రెడ్కార్పెట్ వేసింది. మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో షిప్యార్డ్ ఏర్పాటు చేసేందుకు 29.58 ఎకరాలను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్కు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలవేట కోసం నిర్దేశించిన ఫిషింగ్ హార్బర్ల వద్ద షిప్యార్డు నిర్మిస్తే మత్స్య సంపదకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జగన్ నిర్మించారు.. చంద్రబాబు ప్రైవేట్కు ఇస్తున్నారురాష్ట్రంలోని మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో రూ.1,522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె హార్బర్ను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టు 30న వర్చువల్గా ప్రారంభించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం అప్పటి నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అక్కడ షిప్యార్డ్ నిర్మించేందుకు సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు 29.58 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాలు హార్బర్ ల్యాండ్ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ సాగర్ డిఫెన్స్ సంస్థ ఆటానమస్ మారిటైమ్ షిప్యార్డ్, సిస్టమ్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మార్కెట్ విలువలో 6 శాతం అద్దె చెల్లించే విధంగా ఈ భూమిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా 5 శాతం చొప్పున లీజు ధరను పెంచుతామని తెలిపారు. అదే 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్పై 50 శాతం అదనపు ప్రీమియం విధిస్తామని, ఈ మేరకు ఏపీ మారిటైం బోర్డు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆగని అప్పుల పరుగు.. బాబు గారి లిక్కర్ బాండ్లు
సాక్షి, అమరావతి: ఎడాపెడా అప్పులు చేయడంలో ఎన్నో డిగ్రీలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్న చంద్రబాబు సర్కార్... ఇప్పుడు రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరో భారీ అప్పు చేసింది. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెడుతూ ఎక్సైజ్ బాండ్ల ద్వారా ఏకంగా రూ.5,490 కోట్ల అప్పు సేకరించింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ బాండ్ల సేకరణ జరిగింది. అది కూడా 9.15శాతం భారీ వడ్డీకి ఈ అప్పు చేయడం గమనార్హం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లకు (ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పులు, కొత్తగా చేయడానికి అనుమతించిన అప్పులతో కలిపి) చేరుకున్నాయి. ప్రభుత్వ గ్యారెంటీతో రాజధాని కోసం మరో రూ.7,387.70 కోట్లు అప్పు చేస్తున్నట్లు శుక్రవారం పొద్దుపోయిన తర్వాత వెల్లడించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు మళ్లీ చంద్రబాబు పదేపదే అప్పులకు అర్రులు చాస్తుండడం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. ఈ 18 నెలల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 80శాతాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాటేసిందంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తేనే వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం దివాళా తీస్తోందని, శ్రీలంక అయిపోతోందని పెడ»ొబ్బలు పెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు అధిక వడ్డీలకు చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే రాష్ట్రం ఏమౌతుందని శ్రీలంక అవుతున్నట్లా.. లేక సౌత్ సూడాన్ అవుతున్నట్లా.. అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అధిక వడ్డీతో రూ.5,490 కోట్ల రుణం రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే రాబడిని హామీగా చూపిస్తూ భారీ రుణ సేకరణకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎక్సైజ్ శాఖ బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.5,490 కోట్ల అప్పు చేశారు. అది కూడా త్రైమాసికానికి అత్యధికంగా 9.15శాతం వడ్డీతో బాండ్లు జారీ చేయాలని నిర్ణయించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ భారీ రుణం సేకరించారు. 9.15శాతం వడ్డీ రేటుతో బాండ్లను జారీ చేసి రుణాన్ని సేకరిస్తున్నారన్న విషయం బయటకు పొక్కితే ఆరి్థక నిపుణులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తారన్న కారణంవల్లే దీనిని గోప్యంగా ఉంచారు. ఎంత తాగిస్తే.. అన్ని అప్పులు.. ‘మద్యం అమ్మకాలు పెంచండి.. ఈ ఏడాది రూ.35వేల కోట్ల రాబడి తేవాలి..’ అని సీఎం చంద్రబాబు ఇటీవల ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఊరూవాడా బెల్టు షాపులు పెరిగిపోతున్నా, ఎక్కడబడితే అక్కడ పర్మిట్ రూమ్లు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనడం లేదు. వీటి వెనక ఉన్న మర్మం ఇపుడు అందరికీ బోధపడింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే తమకు అంత సంతోషం అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు విధానం. ఎందుకంటే మద్యం విక్రయాలపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్లో రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 5,490 కోట్ల రుణం సేకరించారు. దీనినిబట్టి రాబోయే రోజుల్లో అనివార్యంగా మద్యం ఆదాయాన్ని భారీగా పెంచాల్సి ఉంటుంది. 2024–25లో మద్యం విక్రయాల ద్వారా రూ.24వేల కోట్ల రాబడి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో మద్యం విక్రయాల ద్వారా పన్నుల ఆదాయం రూ.35 వేల కోట్లకు చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. తరువాత ఏడాది మరింతగా అంటే రూ.50వేల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అంటే ప్రస్తుత మద్యం విక్రయాలను ఏకంగా 100శాతం పెంచాలన్నది ప్రభుత్వ విధానమని స్పష్టమవుతోంది. ఎంతగా మద్యం తాగిస్తే...తాము అంతగా అప్పులు చేయడానికి వీలౌతుంది అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. నిబంధనలకు విరుద్ధంగా.. అధికవడ్డీకి... ఎక్సైజ్ బాండ్ల ద్వారా రుణ సేకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం పరిమితి ఎప్పుడో దాటిపోయింది. అయినా సరే ఎక్సైజ్ బాండ్ల ద్వారా రూ.5,490 కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా 9.15శాతం చొప్పున అత్యధిక వడ్డీకి కూడా వెనకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని నిపుణులంటున్నారు. ఎందుకంటే ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్స్) రూపంలో రుణసేకరణ జరిగితే అందుకు వర్తించే వడ్డీ భారం 6.5 శాతం లోపే ఉంటుంది. కానీ అత్యధిక వడ్డీ రేట్లతో ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుండటం సందేహాస్పదంగా ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోయి ఆర్థికంగా దివాళా తీస్తుందని అంటున్నారు. నాడు తక్కువ వడ్డీకి తక్కువ అప్పులు చేస్తున్నా శ్రీలంక అయిపోతుందని విమర్శించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ వడ్డీకి ఎక్కువ అప్పులు చేస్తుండడాన్ని ఎలా సమర్థించుకుంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.నాడు తీవ్ర స్థాయిలో దుష్ప్రచారంనాడు వైఎస్ జగన్ హయాంలో మద్యం ఆదాయంపై రుణాలు చేయడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వానికి రుణం ఇవ్వవద్దని జాతీయ బ్యాంకులు, స్టాక్ ఎక్సేంజ్లకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారు. భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఎన్నికల ప్రచారాస్త్రంగానూ వాడుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల పేరుతో హైడ్రామా సృష్టించి అవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్, సూపర్ సెవన్లకు ఎగనామం పెట్టేశారు.బాబుగారి అప్పులు చూస్తే.. శ్రీలంక కాదు సౌత్ సూడానే.. 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లు. అంటే జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పుల్లో 80శాతం అప్పులు ఈ 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసేసిందన్నమాట. రానున్న 42 నెలల్లో ఈ లెక్కన అప్పులు చేసుకుంటూ పోతే... శ్రీలంక సంగతి దేవుడెరుగు.. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సౌత్సూడాన్ కన్నా ఆంధ్రప్రదేశ్ దిగజారిపోవడం ఖాయమని ఆరి్థక నిపుణులంటున్నారు. అప్పుల వేగంలో బాబుగారికి సరిలేరెవ్వరూ.. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు అన్నీ కలుపుకుంటే రూ.1,40,717 కోట్లుగా ఉన్నాయి. ఆ అప్పులు కాస్తా 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రూ. 3,90,247 కోట్లకు ఎగబాకాయి. దానర్థం చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ. 2,49,350 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 22.63శాతంగా ఉంది. అదే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 3,90,247 కోట్లు ఉన్న అప్పులు ఐదేళ్ల కాలంలో రూ. 7,21,918 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 3,32,671 కోట్లు. అప్పుల సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే కావడం గమనార్హం. కానీ చంద్రబాబు సీఏజీఆర్ మాత్రం 22.63శాతంగాఉంది. 2014–19లో అధిక వడ్డీలకు అధిక అప్పులతో సంచలనం సృష్టించిన చంద్రబాబు ఇపుడు జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులలో 80శాతం అప్పులను ఈ 18 నెలల కాలంలోనే అధిగమించి రాష్ట్రాన్ని సౌత్ సూడాన్ దిశగా నడిపిస్తుండడం ఆందోళనకరమని ఆరి్థక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి 2024 మార్చి 31 వరకు అప్పుల వివరాలు ఇవీ...కాగ్, రాష్ట్ర బడ్జెట్ కాపీలు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు 1,40,717 కోట్లు కాగా, 2014 నుంచి 2019 మార్చి 31వరకు ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.2,49,350 కోట్లు అప్పు చేసింది. ఆ ఐదేళ్లలో పెరిగిన అప్పులు 22.63 శాతం. అదే జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, పెరిగిన అప్పు కేవలం 13.57 శాతమే. -
Ravi Chandra: విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?
-
Manohar : చంద్రబాబు.. నకిలీ మద్యంపై దమ్ముంటే లెక్కలు తేల్చండి
-
Rachamallu : రాసిపెట్టుకోండి..! జరగబోయేది ఇదే
-
Baburao: విజయవాడను చంద్రబాబు అమ్మేస్తున్నాడు
-
సీఐడీ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోంది :గౌతమ్ రెడ్డి
-
బాబు హయాంలోనే పట్టు వస్త్రాల స్కామ్.. విజిలెన్స్ నివేదికలో బయటపడ్డ సంచలన నిజాలు
-
జైల్లో పెట్టుకుంటూ పోతే భయపడే ప్రసక్తే లేదు: YSRCP నేతలు
-
ఇట్లు... పుట్టా సంస్థకు రూ.4.40 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ సంస్థ పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)పై ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తోంది. పోలవరం ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో అడుగు (బెడ్) భాగం వెడల్పు పెరగడం వల్ల 2016–19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని, అందుకు రూ.4.40 కోట్లను అదనంగా చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చేసిన పనులకు అదనపు బిల్లులు చెల్లించాలని పుట్టా సంస్థ పోలవరం సీఈకి ప్రతిపాదించగా... అధికారి ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ఈ ఏడాది జూలై 30న స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్టీసీ) ఆమోదం తెలిపింది. అనంతరం ఎస్ఎల్టీసీ సిఫార్సుతో పుట్టా సంస్థకు అదనంగా చెల్లించాలని సెప్టెంబరు 7న పోలవరం సీఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.⇒ పోలవరం ఎడమ కాల్వలో ఐదో ప్యాకేజీ (93.7–111.487 కి.మీ.) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. అయితే, 5.754 కి.మీ. కాల్వ తవ్వకం, 11.001 కి.మీ. లైనింగ్, 33 కాంక్రీట్ పనులను ఆ సంస్థను నుంచి తప్పించి రూ.142.88 కోట్లకు పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)కి నామినేషన్ పద్ధతిపై 2016 నవంబర్ 30న చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది.⇒ 100.3 కి.మీ. నుంచి 102.5 కి.మీ., 110.5 కి.మీ. నుంచి 111.487 కి.మీ. వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేయాలని, 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని దీనికి రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న నాటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో ఆ సంస్థకు రూ.180 కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లైంది.⇒ 2019 అక్టోబర్ 3 నాటికి పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థ రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. కాగా, పుట్టా సంస్థకు నామినేషన్పై అప్పగించిన పనులను రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలన్న నిపుణుల కమిటీ చేసిన సూచనను గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ, మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. పుట్టా సంస్థ ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో 100.3 కి.మీ. నుంచి 102.50 కి.మీ. వరకు 2016–19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్లో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టిపని చేశారని చూపి క్యూబిక్ మీటర్కు అదనంగా రూ.78 చొప్పున రూ.13,25,59,128 చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టు 6న ఎల్ఎస్సీ (డిస్ట్రిక్ లెవల్ శాంక్షన్ కమిటీ) ప్రతిపాదన మేరకు చెల్లించిన రూ.9,94,19,274 పోగా మిగిలిన రూ.3,31,39,854 మంజూరు చేయాలని పేర్కొంది. గతంలో డీఎల్ఎస్సీ చేసిన ప్రతిపాదనపై ఈ ఏడాది జూన్ 25న అంటే ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో ఎస్ఎల్టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆమోద ముద్ర వేసిందని, ఆ మేరకే అదనపు బిల్లులు చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. -
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ఆర్కే రోజా తీవ్ర విమర్శలు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటి సంతకాల ఉద్యమం గురించి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా పోరాటాన్ని మొట్టమొదటి సారిగా రాష్ట్రం చూస్తోందని రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే వాటిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఈ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.ప్రజల్లో అసహనం పెరిగిపోతుందని, ఇది తిరుగుబాటుకు నాందిగా మారిందని రోజా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి తీసుకురాలేదు. అందుకే ప్రజలు విసుగుతో సంతకాల ఉద్యమానికి ముందుకొస్తున్నారు.ఎన్నికలకు ముందు పోర్టులు, మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దోచుకోవడం దాచుకోవడమే వారి పనిగా చేసుకుంటున్నారని రోజా విమర్శించారు.జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే వాటిని నిలిపివేసిందని రోజా ఆరోపించారు. గాడిద పాలు కడవెడు ఉన్నా,గంగిగోవుపాలు గరిటెడు చాలు అన్న చందంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. రెండు లక్షల అరవైవేల కోట్లు అప్పులు చేసిన నీకు, నాలుగు వేల కోట్లతో హైదరాబాద్ కట్టిన వాడికి నాలుగువేల కోట్లు లేవా. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు అంటూ చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమీషన్లు ఇస్తామంటే బినామీలకు అంటగట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారు. జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇంకా నిస్సిగ్గుగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అవుతుందని రోజా మండిపడ్డారు. -
మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
-
Buggana: ప్రతి నెల 9వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేస్తున్నారు
-
ఇది ఆరంభం మాత్రమే..! చంద్రబాబుకి పెద్దిరెడ్డి వార్నింగ్
-
KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?
-
Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ
-
జీతాల కోసం నిరీక్షిస్తున్న లక్ష మంది ఉద్యోగులు
-
Karumuri Nageswara: మీ ఎల్లో మీడియా కాదు .. అది నేషనల్ మీడియా
-
పేద కూలీలపై చంద్రబాబు కక్ష.. ఉపాధికి ఎసరు!
కడప సిటీ: చంద్రబాబు సర్కారు రోజుకో రూల్తో ఉపాధి కూలీలను ఇబ్బంది పెడుతోంది. మొన్న కుంటి సాకులు చెబుతూ నిర్దాక్షిణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. నిన్నేమో ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులంటూ ఏకంగా జాబ్ కార్డుల్నే తీసేసింది. తాజాగా ఫొటో క్యాప్చర్ అంటూ కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను అందిస్తుంది. కేవలం పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయినా బాబు సర్కారు పెత్తనం చెలాయిస్తోంది. రోజుకో కొర్రీలు పెడుతూ పేద కూలీల మీద కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. వారికి నిరాశే.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈకేవైసీ చేస్తోంది. అంటే ప్రతి ఉపాధి హామీ కూలీని ఫొటో క్యాప్చర్ (ఫేస్ రీడింగ్) చేస్తోంది. ఈ వి«ధానం వల్ల ఒకరికి బదులు మరొకరు పనికి వెళ్లేందుకు వీలుండదు. ఉద్దేశం మంచిదే అయినా ఈ ఫోటో క్యాప్చర్ విధానం వల్ల కొంతమందికి ఫేస్ రీడింగ్ కావడం లేదు. ప్రధానంగా కంట్లో శుక్లం ఉన్నవారికి, ఆపరేషన్ చేయించుకున్న వారికి, ఆధార్ అప్డేట్ చేయని వారికి ప్రధాన సమస్యగా మారింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆప్షన్ లేదు ఫోటో క్యాప్చర్ కాని వారు ప్రస్తుతానికి పనులు వెళుతున్నారుగానీ, భవిష్యత్తులో జాబ్కార్డు ఉంటుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వీరికి మాత్రం ఆప్షన్ ఇవ్వకుండా ఉండడంతో మరింత భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి వీరిని కూడా ఈకేవైసీ చేయిస్తే వారి ఆందోళన తగ్గే అవకాశం ఉంది.11 వేల జాబ్కార్డుల తొలగింపుజిల్లాలో ఉపాధి హామీ పథకంలో 308387 మంది యాక్టివ్ కూలీలుగా ఉన్నారు. ఇందులో ఈకేవైసీ పూర్తయిన వారు 2,53,792 మంది ఉన్నారు. దీంతో 82.31 శాతం ఈకేవైసీ అయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్ 26లోపు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తుల జాబ్కార్డులు కావాలని తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు జిల్లాలో 11 వేల జాబ్కార్డులు తొలగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకంపై కూడా తమ ప్రతాపాన్ని చూపుతూ పేద కూలీలపై తన కక్షసాధింపు ధోరణిని కొనసాగిస్తోంది. ఫొటో క్యాప్చర్ చేస్తున్న ఉపాధి సిబ్బంది 82.31 శాతం ఈకేవైసీ జిల్లాలో ఇప్పటివరకు 82.31 శాతం ఈకేవైసీ పూర్తయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో కొంతమంది జాబ్కార్డులను తొలగించిన విషయం వాస్తవమే. వివాహమై ఊరు విడిచి వెళ్లిన వారివి మాత్రమే తొలగించాం..అంతేగానీ మిగతా వారిని తొలగించలేదు. – ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప ఫేస్ రీడింగ్ కారణంగా ఇబ్బందులు ఉపాధి పనులకు సంబంధించి ఫేస్ రీడింగ్ విధానం అమలు చేస్తున్న కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఫేస్ రీడింగ్ కాకపోతే పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కంటి సమస్యలున్న వారికి సమస్య మరింత అధికంగా ఉంది. ఈ విషయంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – వెంకట సుబ్బయ్య,లింగారెడ్డిపల్లె, సీకే దిన్నె జాబ్ కార్డుల తొలగింపు సరికాదు సరైన కారణాలు లేకుండా కూలీల జాబ్కార్డులను తొలగిస్తున్నారు. రోజువారి కూలీ సంపాదనతో జీవించే వారికి రాజకీయాలు అంటూ తెలియవు. కొన్ని ప్రాంతాల్లో కక్షసాధింపు ధోరణి కొనసాగుతోంది. జాబ్ కార్డులు ఇలా ఏకపక్షంగా కొనసాగితే పనుల కోసం వలసలు తప్పవు. పేదల ఇబ్బందులు గుర్తించి ఉపాధి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. –బాబయ్య, కొలుములపల్లె, సీకే దిన్నె మండలం -
నిరుపేదల పొట్ట కొడతారా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18.63 లక్షల నిరుపేద ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులు తొలగించిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వారి పొట్ట కొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జూలై 27 నుంచి డిసెంబర్ వరకు పెండింగ్ ఉపాధి కూలీల వేతన బకాయిలు రూ.381 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 18.63 లక్షల జాబ్ కార్డుల తొలగింపుపై పంచాయతీరాజ్ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంపీడీవోలకు డీడీఎల్వోలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ పదోన్నతి కల్పించి వారికి ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేస్తే, ఆ పేరుని డీడీవోలుగా మార్చి తానే ప్రమోషన్ ఇచ్చినట్టు పవన్ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పవన్ కూడా చంద్రబాబు నుంచి క్రెడిట్ చోరీ నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు యూరియా కూడా సరఫరా చేయకుండా వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరికి ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వకుండా వేధిస్తోందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పల్లెల్లో బెదిరింపుల పర్వానికి తెరదీసిందని, అందులో భాగంగానే టీడీపీ మద్దతుదారులకే జాబ్ కార్డులు ఉంచి మిగతా వారి కార్డులను రకరకాల కారణాలతో ఏరివేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు అడిగినంత పని కల్పించగా.. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి పని దినాలు కల్పించడంలోనూ విఫలమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాలు కల్పించగా, చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్ నుంచి డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించిందన్నారు. సినిమా టికెట్ రేట్ల మీద ఉన్న శ్రద్ధ పేదల మీద ఏదీ? ఒకపక్క 7.4 లక్షల కుటుంబాలకు 18.63 జాబ్ కార్డుల తొలగింపు.. మరోవైపు ఐదున్నర కోట్ల పనిదినాల కోత.. ఇంకోవైపు ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలకు వేతనాలు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్నా డిప్యూటీ సీఎం పవన్ నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు. తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉపాధి హామీ కూలీలపై పెట్టడం లేదన్నారు. ఉపాధి కూలీలు అని పిలవొద్దని కల్ల»ొల్లి మాటలతో పవన్ సరిపుచ్చుతున్నారని విమర్శించారు. -
గళమెత్తిన విద్యార్థి దళం
సాక్షి,అమరావతి/తాడేపల్లి రూరల్: కర్కశ సర్కారుపై విద్యార్థి దళం గళమెత్తింది. రహదారులపై రణన్నినాదమై గర్జించింది. ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని కదంతొక్కింది. చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతిపై కన్నెర్రచేసింది. ఖబడ్దార్ అంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్íÙప్పులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా స్పందించలేదు. దీంతో సోమవారం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు.పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎనీ్టఆర్ జిల్లాల నుంచి భారీగా తరలివచి్చన విద్యార్థులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యాలయం వద్ద నుంచి ప్లకార్డులు, బ్యానర్లు, జెండాలు చేతబట్టి ర్యాలీగా పెట్రోల్ బంక్ మీదుగా సాంఘిక సంక్షేమ కార్యాలయ రోడ్డులోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు లాఠీలను అడ్డుపెట్టి విద్యార్థి నేతలను, విద్యార్థులను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బారికేడ్లను నెట్టేసి విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేరుకుని అక్కడ ధర్నాకు దిగారు.‘ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు గేట్ బయటకు నెట్టేయడం అన్యాయం, విద్యార్థులను వేధించటం తగదు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు తక్షణమే చెల్లించాలి, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి, లేకుంటే విద్యార్థుల సత్తా ఏమిటో సర్కారుకు చూపిస్తాం.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల నినాదాలతో తాడేపల్లి హోరెత్తింది. అనంతరం పోలీసులు ఐదుగురితో కూడిన విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని అధికారుల వద్దకు పంపుతామనటంతో విద్యార్థినేతలు, విద్యార్థులు ఒప్పుకోలేదు. ప్రభుత్వమే దిగివచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు తాము ఎక్కడికీ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. విద్యార్థి నేతలను ఈడ్చిపడేసిన పోలీసులు ఆందోళన తీవ్రం కావటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (జోనల్) ఎ.రవిచంద్రతో పాటు మరికొంతమంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. వారిని తీసుకెళ్లి ముందే సిద్ధంగా ఉంచిన లారీలోకి ఎక్కించారు. అనంతరం వారిని తెనాలి మార్గంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. చివరికి దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు. వారి వెంట భారీగా విద్యార్థులు వాహనాల్లో తరలివెళ్లారు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో చక్కర్లు కొడతారా? అంతకు ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య నేతృత్వంలో గుంటూరు నుంచి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రవిచంద్ర నేతృత్వంలో విజయవాడ వైపు నుంచి విద్యార్థులు బైక్లు, ఇతర వాహనాల్లో భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను ఉద్దేశించి చైతన్య, రవిచంద్ర మాట్లాడారు. దాదాపు ఎనిమిది క్వార్టర్స్ బకాయిలు రూ.7,800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాలని, ఇందులో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.5,600 కోట్లు, స్కాలర్ షిప్ బకాయిలు రూ.2,200 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు.వీటిని చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రంలో విద్యార్థులు కష్టాల్లో ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, నరేందర్ రెడ్డి, బాజీ, రవి తదితరులను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ధర్నాలో స్టూడెంట్ యూనియన్ నాయకులు నరేంద్రరెడ్డి, గంటి, రవి, పేటేటి నవీన్, వినోద్, కోమల సాయి, రవీంద్రారెడ్డి, సందీప్, రవి, కరీం, కిరణ్, రాజే‹Ù, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్, శ్రీనివాస్, నవీన్, కోమల్ సాయి, సురేష్ పాల్గొన్నారు. విద్యార్థులపై కేసు నమోదు తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి విద్యార్థి సంఘ నాయకులు పానుగంటి చైతన్య, నరేంద్రరెడ్డి, అనిల్ కుమార్, రవీంద్ర, రవిచంద్ర విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. వీరిని మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం 8 గంటల సమయంలో మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం. తక్షణం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు, స్కాలర్íÙప్పులూ మంజూరు చేశారు. ఈ సర్కారు వచ్చాక అసలు చెల్లింపులు నిలిపేసింది. విద్యార్థులను చిత్రహింసలు పెడుతోంది. ఈ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతాం. – పానుగంటి చైతన్య, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పార్ట్ టైం ఉద్యోగాలకు విద్యార్థులు చంద్రబాబు సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో కాలేజీల యాజమాన్యాల వేధింపులను విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. హాల్టికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది పరీక్షలకు దూరమయ్యారు. దీంతో కొందరు విద్యార్థులు పార్ట్టైం ఉద్యోగాలుచేస్తూ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కాలేజీల ఫీజులు చెల్లించేందుకు అప్పులుచేయాల్సి వస్తోంది. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
జీతమో.. రామ‘చంద్ర’!
సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. వెయ్యి కాదు.. రాష్ట్రంలో ఏకంగా లక్ష మంది ఉద్యోగులు జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. ఒకటో తేదీ వెళ్లిపోయి ఇప్పటికే వారం దాటిపోయింది. అయినా చంద్రబాబు సర్కారు కనికరించడం లేదు. గతంలో సమస్యల పరిష్కారం.. ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాలు కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు అందుకుని ఎన్ని నెలలో అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. 8వ తేదీ వెళ్లినా..రాష్ట్ర ప్రభుత్వంలోని 18 శాఖలతోపాటు జలవనరులు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, పబ్లిక్ హెల్త్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లోని సుమారు లక్ష మంది ఉద్యోగులకు ఈ నెల 8వ తేదీ వచ్చినా చంద్రబాబు సర్కారు జీతాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చడం లేదు. ఈ నెల 8వ తేదీ వచ్చినా పౌర సరఫరాలు, ప్రజారోగ్యం, చక్కెర–డైరెక్టరేట్, సర్వే విభాగం, వ్యవసాయం, ప్రణాళిక, పరిశ్రమలు, సహకార, రవాణా, సమాచార, ఈఎస్ఐ, ఆర్ అండ్ బీ, గనులు–భూగర్భ, ఎన్సీసీ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమ, బీసీ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో ఇలా ఎదురుచూడలేదువైఎస్సార్సీపీ హయాంలోనే ఉద్యోగులకు వేతనాలు మెరుగ్గా వచ్చాయని, 8వ తేదీ వరకు వేతనాల కోసం ఎదురు చూడలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. గతంలోని చంద్రబాబు పాలనలో ఉద్యోగులపై ఎప్పుడూ సానుకూలత ఉండేది కాదని.. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని శాఖలకు ఈ నెల 3న వేతనాలు చెల్లించారని, 8వ తేదీ వచ్చినా 18 శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం ఉద్యోగుల పట్ల వివక్ష చూపడం కాదా అని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులను విభజించి కొంతమంది ఉద్యోగులకు ముందుగా.. మరికొందరికి ఆలస్యంగా జీతాలు చెల్లించడం చంద్రబాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామని వాపోతున్నారు.ఈఎంఐలు కట్టేందుకు ఇబ్బందులే..జీతాలు అందకపోవడంతో పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు.. ప్రతి ఖర్చుకూ ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఉద్యోగులు, ఉపాధ్యాయులు మధనపడుతున్నారు. ఒకటో తేదీ జీతం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది రుణ వాయిదాలను ప్రతినెలా 5వ తేదీలోపే పెట్టుకున్నారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో వాయిదాలకు వడ్డీ కింద ప్రతినెలా రూ.600 నుంచి రూ.1,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మందులు కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులను బ్యాంకులు డిఫాల్టర్లుగా చూస్తాయని, భవిష్యత్లో రుణాలు ఇవ్వడానికి ఇది మచ్చగా మిగులుతుందని ఆందోళన చెందుతున్నారు. రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చి ఏం లాభంరాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న రూ.3 వేల కోట్లను అప్పు చేసినప్పటికీ 8వ తేదీన కూడా జీతాలు ఇవ్వకపోతే ఏం లాభమని, ఆ డబ్బంతా ఏమైందని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత నెల వరకు ఉపాధ్యాయులకు ఏ నెలలోనూ 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులు వేతనాల కోసం పలుసార్లు రోడ్లెక్కాల్సి వచ్చింది. దీంతో ఈ నెల 3న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ.. మిగతా ఉద్యోగులకు విడతల వారీగా 10వ తేదీ వరకు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిరుద్యోగులకూ ఎదురుచూపులేచంద్రబాబు ప్రభుత్వంలో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతినెలా ఎదురు చూపులే మిగులుతున్నాయి. 104 ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్ఏలు, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. వారంతా జీతాలు చెల్లించాలని ప్రతినెలా ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. డీఏ బకాయిల సంగతేమిటో మరి2019 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం డీఏలకు పోస్టు డేటెడ్ జీవోలను జారీ చేసిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. డీఏలకు పోస్ట్ డేటెడ్ జీవోలను జారీ చేసే ఆనవాయితీని చంద్రబాబు ప్రభుత్వమే తీసుకువచ్చిందని, అప్పటివరకు ఏ ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ జీవోలు ఇవ్వలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. వచ్చే జనవరితో కలిపి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం 5 డీఏలు బకాయిలుంటే ఎట్టకేలకు ఒక డీఏను మంజూరు చేసి ఆ బకాయిలను మూడు వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పేర్కొనడాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఈ హామీల సంగతేమిటో!ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏడాదిన్నరైనా అమలు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తానని, పీఆర్సీ వేస్తానని, బకాయిలన్నీ వీలైనంత త్వరగా చెల్లిస్తానని, ఓపీఎస్ను–జీపీఎస్ను సమీక్షించి మెరుగైన సీపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాదిన్నరైనా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించలేదు. పీఆర్సీ వేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి కమిషనర్ను కూడా నియమించింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిషనర్తో రాజీనామా చేయించారు. ఇప్పటికీ పీఆర్సీని ఏర్పాటు చేయకుండా.. కమిషనర్ నియమించకుండా కాలయాపన చేస్తున్నారు. మరోపక్క ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిలను చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారు.జీతాలు రాక ఈఎంఐలు కట్టలేకపోతున్నారుఅప్పుడే ఎనిమిదో తేదీ వచ్చేసింది. ఇంతవరకు జీతాలు రాక చిరుద్యోగులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో ఈఎంఐలు చెల్లించాలి. అవి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా మొదటి వారమే జీతాలు విడుదల చేయాలి. – గుద్దటి రామ్మోహనరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీజీఓ, కాకినాడవేతన కష్టాలు మొదలయ్యాయిఉద్యోగులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. దాదాపు అన్ని శాఖల్లో ఈ నెల ఇప్ప టి వరకు జీతాలు పడలేదు. 5వ తేదీలోగా వేతనం అందకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. లోన్ల ఈఎంఐలు ప్రతినెలా 5వ తేదీలోగా కచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. – ఎన్.దివాకర్రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ ఉద్యోగులపై చిన్నచూపు తగదుప్రభుత్వ ఉద్యోగులతో సర్కారు ఆటలాడుకుంటోంది. వారిని చిన్నచూపు చూస్తోంది. సమయానికి జీతాలు వేయకపోతే ఉద్యోగుల జీవనం సాగేదెలా? ఇప్పటివరకు నాకు తెలిసి 15 డిపార్ట్మెంట్లకు జీతాలు పడలేదు. గతంలో 1వ తేదీనే జీతం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 8వ తేదీ వచ్చినా జీతాలు జమ చేయకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే జీతాలను జమ చేయాలి. – గిరి కుమార్ రెడ్డి, ఏపీజేఏసీ మాజీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు -
వైద్య విద్య ప్రవేశాల్లో పారదర్శకతకు పాతర
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకతకు చంద్రబాబు ప్రభుత్వం పాతర వేసింది. బీడీఎస్ సీట్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో ప్రకటించకుండానే విద్యార్థులకు కేటాయింపు చేపట్టింది. మూడో విడత బీడీఎస్ కనీ్వనర్ సీట్ల కేటాయింపు ప్రొవిజనల్ లిస్ట్ను సోమవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. వాస్తవానికి రెండో విడత కౌన్సెలింగ్లో విద్యార్థులు చేరని, వదులుకున్న సీట్ల వివరాలను తొలుత ప్రకటించాలి. ఇలా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో విద్యార్థుల ముందుంచాకే తదుపరి కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.ఈ ఏడాది అక్టోబర్ 23న విశ్వవిద్యాలయం రెండో విడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించింది. విద్యార్థులకు ఫ్రీ–ఎగ్జిట్ అవకాశం కల్పించింది. నవంబర్ 20తోనే దేశంలో మెడికల్ యూజీ ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఎంబీబీఎస్ ప్రవేశాలను తప్పుల తడకగా చేపట్టి వాటిని సరిదిద్దుకోవడంలోనే వర్సిటీ కాలయాపన చేసింది. దీంతో తుది దశ బీడీఎస్ కౌన్సెలింగ్ చేపట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఇదిలా ఉండగా, రెండో దశ కౌన్సెలింగ్ ముగిసిన నెలన్నర అనంతరం నేరుగా మూడో దశ కౌన్సెలింగ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు జాబితాను సోమవారం వర్సిటీ విడుదల చేసింది. ఖాళీల వివరాలు ప్రకటించకుండా సీట్ల కేటాయింపు చేపట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రొవిజనల్ సీట్ల కేటాయింపులో అభ్యంతరాలుంటే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు. -
ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ
-
వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా
-
జగనన్న పేరంటేనే ఝడుపా!
సామర్లకోట: ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీకి ఇంకా ఎన్నికల కోడ్ ముగిసినట్టు లేదు. కోడ్ నిబంధనల మేరకు వేసిన రంగులు నేటికీ తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలనీ పేరును పునరుద్ధరించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం లే అవుట్లో సుమారు 50 ఎకరాల్లో అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జగనన్న కాలనీ పేరిట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2023 అక్టోబరు 12న ప్రారంభించారు. ప్రత్తిపాడు రహదారికి ఇరువైపులా ఉన్న ఈ కాలనీకి రెండు వైపులా రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేసి కౌన్సిల్ తీర్మానంతో జగనన్న కాలనీగా పేరు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖద్వారాలపై ఉన్న జగనన్న పేరుపై నలుపు రంగు వేశారు. నాడు వేసిన రంగులు నేటికీ తొలగించపోవడం విమర్శలకు తావిస్తోంది. జగనన్న పేరు పునరుద్ధరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మున్సిపల్ కమిషనర్కు వివరించినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ కాలనీకి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి యతి్నస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. పేదలకు ఎంతో విలువైన స్థలాలు ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం రహదారుల కూడలిలో రోడ్డు మార్జిన్లో ఈ కాలనీలో ఇప్పటికే అనేక మంది ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా పార్కులతో కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతుందనే కక్షతో ముఖద్వారాలపై పేర్లు రాయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడంతో ఆయన పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది. అటువంటి ముఖ్యమంత్రి పేరును రాయించడానికి మున్సిపల్ అధికారులకు ఎందుకు చేతులు రావడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏపీ బీసీఎల్ వైపు ఉన్న కాలనీ ముఖద్వారంపై పేరు కనపడకుండా పూర్తిగా వేసిన రంగు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం ఈటీసీ లే అవుట్లోని వైఎస్సార్ జగనన్న కాలనీ ముఖద్వారంపై ఉన్న పేరుకు రంగులు తొలగించాల్సిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అనేక కౌన్సిల్ సమావేశాలలో అధికారులను ప్రశ్నించాం. గతంలో తాను పని చేసిన ప్రదేశాల్లోని భవనాలకు రంగులు వేయలేదని, కేవలం పేపర్లు అతికించామని కమిషనర్ చెప్పారు. గతంలో ఉండేలా పేర్లు రాయిస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన స్వయంగా పరిశీలించి కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోటజగనన్న కాలనీపై కుట్ర జరుగుతోంది జగనన్న కాలనీపై ఏదో కుట్ర జరుగుతోంది. ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా చేయడం లేదు. ఎన్నికల కోడ్ సమయంలో జగనన్న కాలనీ ముఖద్వారానికి వేసిన రంగుల స్థానంలో పేర్లు రాయించాలని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య దృష్టికి తీసుకు వెళ్లాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కాలేదు. మా నాయకుడు దొరబాబుతో చర్చించి ఏంచేయాలో ఆలోచిస్తాం. – ఉబా జాన్మోజెస్, మున్సిపల్ వైస్ చైర్మన్, సామర్లకోట -
టెన్షన్.. టెన్షన్.. విజయవాడలో ఉద్రిక్తత


