breaking news
Chandrababu Naidu government
-
చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది
-
గల్లా మాధవి, పెమ్మసానికి YSRCP కాపు నేతల స్ట్రాంగ్ వార్నింగ్
-
ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు
-
అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త
-
అప్పుడు గేట్లు, గోడలు దూకి రెచ్చిపోయావ్.. గీతం భూకబ్జాపై వార్నింగ్
-
ఇరికించబోయి అడ్డంగా ఇరుకున్నారు తప్పుడు ప్రచారమే బాబుకి ఉరితాడు..
-
బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI
-
‘లిఫ్ట్’ తాకట్టుపై ‘సీమ’ కన్నెర్ర
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు ‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు 40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ ఏకతాటిపై పోరాడుదాం 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. – దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది ‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఓటుకు కోట్లు కేసుకు భయపడే.. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు లిఫ్ట్తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం. – రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాబు కుట్రలను అంతం చేద్దాం రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్షీట్లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు. నిన్నటి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. -
చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
-
నడి రోడ్డుపై టిప్పర్లు పెట్టి కుట్రలు.. జగన్ సునామీని ఆపడం ఎవరివల్ల కాదు
-
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతని ఇంటెలిజెన్స్ రిపోర్టు!
-
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు
-
కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్
-
మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?
-
YS Jagan: ముగ్గురూ లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి..లేదంటే
-
ఇసుకేస్తే రాలనంత జనం. ఈ వీడియో చూస్తే చంద్రబాబు ఏమైపోతాడో
-
టీడీపీ హయాంలోనే తిరుమల నెయ్యిలో కల్తీ!
-
జంగిల్ రాజ్ పై జనాగ్రహం
-
ఆరోగ్యశ్రీ ఉద్యోగులూ ప్రైవేటుపరం!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకటిన్నర దశాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయడానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్ర, టీం లీడర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజెప్పేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది ఆరోగ్య మిత్రలు, వంద మంది టీం లీడర్లు క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులందరు కలిపి 2,500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. అందరిలో కలవరపాటు2019–24 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసిన వైఎస్ జగన్ సర్కారు.. ఈ పథకం అమలులో కీలకమైన ఉద్యోగులకు ఆరి్థకంగా భరోసా ఇచి్చంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నవంబర్లో ఆరోగ్య మిత్రలకు రూ.12 వేలు, టీం లీడర్కు రూ.15 వేల వరకూ వేతనాలను పెంచారు. ప్రభుత్వ రంగంలో నిశ్చింతగా పని చేసుకుంటూ, ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని కోరుకుంటున్న ఉద్యోగుల గుండెల్లో 2024లో చంద్రబాబు బీమా బాంబు పేల్చారు. ప్రీమియంలో వీలైనంత మిగుల్చుకోవాలనే లాభాపేక్షతో పనిచేసే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యాన్ని పెట్టడమే కాకుండా, 2500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పొగ పెట్టడానికి సిద్ధం అయ్యారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాభాపేక్షే పరమావధిగా పనిచేసే ప్రైవేటు బీమా కంపెనీల్లో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని చిరుద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్షీట్లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో సమావేశమై చార్జ్షీట్లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్కు చీఫ్గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
‘గీతం’ యూనివర్సిటీ భూముల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: ఏ హక్కుతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాదులపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.మంగళవారం ఈ పిల్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. -
తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు
-
ఇదే విద్వాంస పాలన మీరు కోరుకుంటే.. సినిమా స్టైల్ లో అనిల్ కుమార్ వార్నింగ్
-
MAGAZINE STORY: బండబూతుల దండుపాళ్యం
-
ఏపీలో అరాచక పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్ను పెంచండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు మోసం.. పథకాలన్నీ బంద్! గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్ను, కోల్డ్ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. -
జంగిల్రాజ్పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్రాజ్కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్
-
Jogi Ramesh: నన్ను చంపాలనే ప్లాన్
-
సిగ్గన్నా లేకపాయే.. TDP ఎంపీలు.. ఏకిపారేసిన శైలజానాథ్
-
Jada Sravan: ఏపీకి కేంద్రం వరాల జల్లా..? ఫ్లైట్ ఎక్కడం... ఫ్లైట్ దిగడం...
-
YSRCP నేతల ఇళ్లపై దాడులు రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్
-
Kakani: రాషాన్ని ఒక అగ్నిగుండంగా మార్చేశావయ్యా చంద్రబాబు
-
Vangaveeti: ఆరోజు రంగా... ఈరోజు అంబటి.. దమ్మున్న కాపు నాయకులే నీ టార్గెటా
-
కొనసాగుతున్న జంగిల్రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
జంగిల్ రాజ్.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జంగిల్ రాజ్ సృష్టిస్తోంది. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. పక్కా స్కెచ్తో దాడులుశనివారం ఉదయం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవునా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందన.. అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి అంబటి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేసినా, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈలోగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నల్లపాడు సీఐ వంశీధర్ అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి నోటీసు ఇవ్వడానికి వచ్చానని చెప్పి కొద్దిసేపు అక్కడి పరిస్థితులు గమనించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లంక మాధవి అంబటి ఇంటి ముందుకు వచ్చి చెప్పు చూపించి దుర్భాషలాడారు. రండి తేల్చుకుందాం అంటూ బూతులు తిడుతూ రెచ్చగొట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సంఅప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూటీడీపీ నాయకుడు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కొంత మంది వికలాంగులను సైతం తీసుకొచ్చి మైక్లో బూతులు తిట్టారు. ‘నా కొడకా.. అంబటీ బయటికి రారా..’ అంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం లంకించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ బీభత్సం రాత్రి 10 గంటలు అయినప్పటికీ కొనసాగింది. ఫోన్లు చేసి గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అక్కడికి రప్పించారు. హిజ్రాలను, దివ్యాంగులను కూడా తీసుకువచ్చి గొడవ చేయించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా జనాన్ని అక్కడికి తరలించారు. అంబటి రాంబాబు కార్యాలయంలో అప్పటికే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆళ్ల కిరణ్, పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా ఖాన్ తదితరులు అంబటి కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. గొడవ విషయం తెలియగానే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని సర్వత్రా చర్చఅంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్న గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్లెదుటే ఫర్నీచర్ను ధ్వంసం చేస్తుంటే.. కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకొచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పని తీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు మాజీ హోం మంత్రి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ సమన్వయకర్తలు బలసాని కిరణ్కుమార్, వనమా బాలవజ్రకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాలేదు. గంటకు పైగా నాయకులు ఎస్పీ ఇంటి ముందు నిలబడే ఉన్నారు. చివరికి ఎస్పీ లైన్లోకి వచ్చి తాను గుంటూరులో లేనని, అడిషనల్ ఎస్పీని కలవాలని చెప్పారు. ఐజీ కూడా ఫోన్కు అందుబాటులోకి రాలేదు. అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతపై టీడీపీ గూండాల దాడిఅంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్పై విరుచుకు పడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని కారును సైతం ధ్వంసం చేశారు. తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన అశోక్ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తమకు అడ్డువచ్చిన ఎవరినైనా చంపేస్తాం రండిరా అంటూ టీడీపీ గూండాలు తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అశోక్ వాపోయాడు.అర్ధరాత్రి దాటినా..టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగులగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యాలయంపై విసురుతున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్ టీవీ కెమెరామెన్తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు. కాగా, అంబటి రాంబాబుపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదునగరంపాలెం (గుంటూరు వెస్ట్): సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాను ఏ వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, 24 గంటల్లో ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పి తాను వచ్చేశానని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లింది ఫ్లెక్సీలు చించేందుకు కాదని, వాటిని తొలగించాలని చెప్పేందుకు మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ఒక్కసారిగా తన కారుపైకి తెగబడ్డారని చెప్పారు. టీడీపీకి చెందిన ఓ మహిళ అసభ్యకరంగా మాట్లాడటంతో తాను ప్రతిస్పందనగా వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈలోగా చంద్రబాబూ దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం తనకు లేనేలేదని స్పష్టం చేశారు. తనపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడానికి టీడీపీ గూండాలు కారు డోరు తీశారని, తాను ప్రాణ రక్షణ నిమిత్తం అక్కడున్న వారిపై మాట్లాడానని చెప్పారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ టీడీపీ నాయకురాలు (లంకా మాధవి) సిద్ధార్థనగర్లోని తన ఇంటి వద్దకు వచ్చి చెప్పు పట్టుకుని నానాయాగీ చేసినా పోలీసులు ఆమెను ఆపలేదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ల రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తేలేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. తాను అరెస్ట్కు భయపడేదే లేదని, ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్కు కూడా దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. తన ఇంటి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్పై, తనపై అభిమానంతో వచ్చారని.. అంతేతప్ప తన అరెస్ట్ను అడ్డుకునేందుకు కాదని స్పష్టం చేశారు.రారా చూసుకుందాం.. ఇక్కడే పాతేస్తాంగోరంట్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘రారా చూసుకుందాం.. నిన్ను ఇక్కడే పాతేస్తాం’ అంటూ రాయలేని పదాలతో టీడీపీ గూండాలు బూతు పురాణంతో విరుచుకుపడటంతో భక్తులు హడలిపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలియుగదైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అసత్యమని సీబీఐ సిట్ నివేదికలో వెల్లడి కావడంతో శనివారం అంబటి రాంబాబు గోరంట్లలోని శ్రీవేంకటేశ్వరాలయంలో పాపపరిహార పూజల్లో పాల్గొన్నారు. ఇది తెలిసిన టీడీపీ గూండాలు కర్రలు, ఇనుపరాడ్లు తీసుకుని అంబటిపైకి దూసుకొచ్చారు. వేలాది మంది భక్తులు చూస్తుండగా.. పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. టీడీపీ మహిళా గూండాలు సైతం అసభ్య పదజాలంతో రోడ్లపై కర్రలు, రాడ్లతో హల్చల్ చేశారు. టీడీపీ గూండాలను అడ్డుకోవాల్సిన పోలీసులు.. అక్కడ నుంచి వెళ్లాలని అంబటి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ముందుకు కదులుతున్న అంబటి కారుపై టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి దిగి కారు అద్దాలను పగలగొట్టి హత్య చేయడానికి యత్నించారు. టీడీపీ గూండాల హడావుడికి అమరావతి రోడ్డులో ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. -
Ambati : టీడీపీ నేతలు నన్ను తిట్టడంతోనే నేను ఆవేశంలో మాట్లాడాను
-
Ambati : చంద్రబాబును తిట్టలేదు.. బూతులతో నన్నే తిట్టారు..
-
Sailajanath: గుర్తుపెట్టుకోండి.. మీరు గెలిచింది EVMల వల్లే
-
Margani : తిరుపతి ప్రెస్టేజ్ పోయింది YSRCP పాప ప్రక్షాళన పూజలు
-
Kannababu : ఇంతమందికి నిద్రలేకుండా చేస్తున్న..
-
ఇంకా ఎన్ని చేస్తారో చెయ్యండి.. మా వెనుక జగనన్న ఉండు...
-
Jupudi: దౌర్భాగ్యమైన నాయకుల పాలనలో ఉన్నాం
-
బాబు హయాంలోనే.. భోలే బాబా డెయిరీ కాంట్రాక్ట్ !
-
జీవీఎంసీలో రౌడీ రాజ్యం... గీతం కబ్జాకు పచ్చజెండా... కనీస చర్చ లేకుండానే భూముల క్రమబద్దీకరణకు ఆమోదం
-
ఫ్లెక్సీలు పెడతావా? బాబుపై అంబటి ఫైర్
-
Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?
-
Perni Nani: చిన్న లేదు పెద్ద లేదు.. అమ్మ.. అమ్మ.. అంటాడు..
-
మైలవరంలో జోగి రమేష్ గెలుపు ఆపేంత దమ్ముందా.. బాబు,లోకేష్ ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
కేటుగాళ్లు లడ్డూలా దొరికేశారు..
-
Gadikota: రగులుతున్న ఆంధ్రా.. నీకు దమ్ముంటే
-
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
-
Jada Sravan : అల్లాడిపోతున్న నాలుగు ప్రాణాలు ఎంత లాగితే అంత నష్టమే..
-
3 హత్యలు, 6 మానభంగాలు.. మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?
-
Biyyapu: మైకులు పట్టుకుని పద్యాలు, సినిమా డైలాగులు చెప్పటం తప్ప
-
లడ్డూ కల్తీపై CBI కీలక రిపోర్ట్.. ప్లాన్ ప్రకారమే కుట్ర
-
పథకాలకు డబ్బులు లేవు.. లూథ్రాకు మాత్రం కోట్ల వర్షం
-
ఉపేయ్.. కుదిపేయ్ అంట.. వీళ్లు ఎమ్మెల్యేలా..?
-
ఎవడు చెప్పాడు జంతు కొవ్వు ఉందని.. బాబు సర్కార్ కు CBI చెంపచెళ్ళు..!
-
లూథ్రాకు డబ్బే డబ్బు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ రూ.50 వేల బిల్లు కూడా చెల్లించకుండా గుత్తేదారులను ముప్పుతిప్పలు పెడుతూ వారిని హైకోర్టుకొచ్చేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెడుతోంది. ఆన్లైన్ లేదా భౌతికంగా కోర్టుకు అలా వచ్చి ఇలా వెళ్తే చాలు లూథ్రాకు కోట్లకు కోట్లు ఫీజుగా చెల్లిస్తోంది. వాదనలతో సంబంధంలేకుండా కోర్టుకు హాజరైతే చాలు కోట్లకొద్ది ప్రజాధనం ఆయన ఖాతాలో ఫీజుల రూపంలో జమ అవుతోంది. ఇలా ఇప్పటికే లూథ్రాకు రూ.8.62 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఆయనకు మరో రూ.1.92 కోట్లు చెల్లించింది. తద్వారా ఆయనకు ఇప్పటివరకు రూ.10.54 కోట్లు చెల్లించినట్లయింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టిన కేసులకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది లూథ్రాకు ఫీజుల చెల్లింపుల్లో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఒక్కరోజు వాదనలకు రూ.10 లక్షలు..ఇక మద్యం అక్రమ కేసుల్లో సీఐడీ సిట్ తరఫున సిద్దార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 11425/2025)లో గత ఏడాది నవంబరు 25న ఒక్కరోజు వాదనలు వినిపించినందుకు లూథ్రాకు రూ.10 లక్షలను చంద్రబాబు ప్రభుత్వం ఫీజుగా చెల్లించింది. అలాగే, రిట్ పిటిషన్ నెంబర్ 32915/2025లో నవంబర్ 26, 27 తేదీల్లో వాదనలు వినిపించినందుకు రోజుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. సంబంధంలేని కేసులో రూ.20 లక్షలు చెల్లింపు..రిట్ పిటిషన్ నెంబర్ 12190/2025లో నవంబరు 28న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. వాస్తవానికి.. ఈ పిటిషన్ మద్యం కేసుకు సంబంధించింది కాదు. ఇది ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన కేసు. ఈ కేసుతో సీఐడీకి ఎలాంటి సంబంధంలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దార్థ లూథ్రాకు రూ.20 లక్షలు చెల్లించడం విశేషం. మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 10012/2025)లో సీఐడీ తరఫున వాదనలు డిసెంబరు 2న హాజరైనందుకు రూ.20 లక్షలు చెల్లించింది. ఇలా మొత్తం ఆయనకు రూ.70 లక్షలు చెల్లించింది. ఈ రూ.70 లక్షలకు 10 శాతం క్లర్కేజీ అంటే రూ.7 లక్షలు కలిపి మొత్తంగా రూ.77 లక్షలను లూథ్రాకు ధారబోసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ–102 జారీచేసింది.ఐదు కేసులకు రూ.1.10 కోట్లు చెల్లింపు..మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 6892/2025)లో సెప్టెంబరు 19న సీఐడీ తరఫున హాజరైనందుకు బాబు సర్కారు లూథ్రాకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇదే కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ (సీఆర్ఎల్పీ 9365/2025)లో సెప్టెంబరు 23న హాజరైనందుకు రూ.10 లక్షలు.. ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 10012/2025)లో సెప్టెంబరు 24న హాజరైనందుకు రూ.50 లక్షలు.. చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 9369/2025)లో సెప్టెంబరు 26న హాజరైనందుకు రూ.20 లక్షలు.. బాపనపాడు మైనింగ్ కేసులో పోలీసుల తరఫున సెప్టెంబరు 22న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇలా లూథ్రాకు రూ.కోటి చెల్లించింది. దీనికి 10 శాతం క్లర్కేజీ కలిపి రూ.1.10 కోట్లు చెల్లించింది. ఆ మేర జీఓ–104 జారీచేసింది. అదే రీతిలో కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్లో సీఐడీ తరఫున నవంబరు 18న వాదనలు వినిపించినందుకు రూ.5 లక్షలు చెల్లించింది. ఆ మొత్తానికి 10 శాతం క్లర్కేజీ రూ.50 వేలు కలిపి మొత్తంగా రూ.5.50 లక్షలు చెల్లిస్తూ జీఓ–103 జారీచేసింది. -
తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపై అసంతృప్తి..చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్షీట్ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్షీట్ను సమర్పించింది. -
ఎన్నడూ లేనట్టుగా బహిరంగంగానే.. సంక్రాంతి సంబరాలుపై జగన్ రియాక్షన్
-
Ys Jagan: తాగరా.. తాగి చిందేయరా..! ఇదే కూటమి పాలన
-
అరవ శ్రీధర్పై నో యాక్షన్.. కూటమి మరో డైవర్షన్ రెడీ
-
ఫేజ్ 1 అట్టర్ ఫ్లాప్ మరోసారి అమ్మకానికి అమరావతి
-
AP: పంచాయతీ నిధులపై ప్రభుత్వం కన్ను
-
'పవర్' ఢమాల్!
సాక్షి, విశాఖపట్నం: విభిన్న సంస్కరణలతో ఏడాదిన్నర కిందటి వరకు విద్యుత్ రంగంలో ఆదర్శంగా నిలిచిన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ప్రస్తుతం తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 13వ వార్షిక సమీకృత గ్రేడింగ్ నివేదికలో సంస్థ పనితీరు భారీగా దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో మెరుగైన స్థానంలో నిలిచిన ఈపీడీసీఎల్, 2024–25 నాటికి తన స్థానాన్ని కోల్పోయి ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. కేంద్రం విడుదల చేసిన ‘రెడ్ కార్డ్ మెట్రిక్స్’ జాబితాలో సంస్థ చేరడం అంతర్గత ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతోంది. డిస్కంల నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడం, ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఎవరికి వారే పెత్తనం చెలాయించడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. పడిపోయిన స్కోరు కేంద్రం నిర్ణయించిన 100 మార్కుల మూల్యాంకనంలో ఏపీఈపీడీసీఎల్ సాధించిన మార్కులు చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. 2023–24లో 65.12 మార్కులతో ఉన్న సంస్థ.. ఇప్పుడు కేవలం 50.46 మార్కులకే పరిమితమైంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ఇతర డిస్కంలతో పోలిస్తే ఈపీడీసీఎల్ అగ్రభాగంలో ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంస్థలో రాజకీయ నియామకాలు పెరగడం, ప్రతి విషయంలోనూ ప్రజాప్రతినిధులు తలదూర్చడంతో ఈపీడీసీఎల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు పెరుగుతున్న నష్టాలు, పేరుకుపోతున్న అప్పులు కూడా గ్రేడింగ్ తగ్గడానికి కారణమయ్యాయి. ఆడిటర్ల ప్రతికూల నివేదికలు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించడం వల్ల కేంద్రం ఈ సారి కఠినంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా 8 డిస్కంలకు రెడ్ కార్డ్ జారీ చేయగా, అందులో ఈపీడీసీఎల్ ఉండటం దురదృష్టకరం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థల పనితీరు ఎంతలా దిగజారాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెడ్ కార్డ్ మెట్రిక్ జారీ చేయడం.. రాష్ట్ర విద్యుత్ రంగ నిర్వహణతో పాటు ఈపీడీసీఎల్పై మాయని మచ్చగా మారింది. కార్పొరేట్ కార్యాలయంలో పెత్తనాలు ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా పేరొందిన ఏపీఈపీడీసీఎల్, నేడు కేంద్రం నుంచి హెచ్చరికలు పొందే స్థాయికి పడిపోవడం పాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా కార్పొరేట్ కార్యాలయంలో ఒక ఈఈ స్థాయి ఉద్యోగి అనధికారికంగా ఉన్నతాధికారిగా వ్యవహరిస్తూ.. ఆర్థిక, పరిపాలన, బదిలీలు, పదోన్నతులు వంటి కీలక అంశాల్లో తలదూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎండీ పేషీలో పరిపాలన క్రమశిక్షణ లోపించిందని, ఏ విషయాన్నైనా సీఎండీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పేషీ స్థాయిలోనే నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది సంస్థ ‘సీ’గ్రేడ్కు పడిపోయినా ఆశ్చర్యం లేదని వారు అంటున్నారు. విశాఖ సర్కిల్ పరిధిలో స్థానిక టెండర్ల విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయని, నామినేషన్ పద్ధతిలో తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సామాన్యుడిపై పడనున్న భారం?గ్రేడింగ్ పడిపోవడం కేవలం గణాంకాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఈపీడీసీఎల్ పరిధిలోని లక్షల మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది. సంస్థ ఆర్థికంగా దివాలా తీసే స్థితికి చేరుకోవడం వల్ల, ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం, డిస్కంలు వినియోగదారులపై భారం మోపే ప్రమాదం ఉంది. గ్రేడింగ్ తగ్గడం వల్ల ఈపీడీసీఎల్కు మార్కెట్లో కొత్త రుణాలు లభించడం కష్టమవుతుంది. ఒకవేళ రుణాలు దొరికినా అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు భారాన్ని ‘టారిఫ్ సవరణ’లేదా ‘ట్రూ–అప్’ చార్జీల రూపంలో సామాన్య వినియోగదారుడిపైనే రుద్దే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాజకీయాలకు అతీతంగా విద్యుత్ రంగ నిపుణులతో సమీక్ష జరిపి, ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించకపోతే డిస్కం మనుగడ ప్రశ్నార్థకమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.నష్టాల ఊబిలో ఈపీడీసీఎల్ సంస్థ వార్షిక నష్టం రూ.7,155 కోట్లుగా నమోదవగా, మొత్తం రుణాలు రూ. 20,693 కోట్లకు చేరాయి. జెన్కో, ట్రాన్స్కో వంటి సరఫరా సంస్థలకు నిర్ణీత 60 రోజుల్లోపు బిల్లులు చెల్లించడంలో విఫలం కావడం వల్ల స్కోరింగ్లో భారీగా కోత పడింది. సరైన ఆర్థిక నిర్వహణ వ్యవస్థ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి రావాల్సిన రూ. కోట్లాది బకాయిలను వసూలు చేయడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. సాంకేతిక, వాణిజ్య నష్టాలను(ఏటీ అండ్ సీ) తగ్గించడంలో ఆశించిన పురోగతి లేకపోవడం కూడా గ్రేడింగ్ పతనానికి మరో కారణంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
సేవలు పూర్..అయినా టాప్ స్కోర్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా మారడంతో వార్డులు కంపుకొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్ఎస్ సర్వేలోనే డీఎంఈ ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై 47.37 శాతం... అంటే దాదాపు సగం మంది రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్ట్ సంస్థలకు పనితీరుకు 100కు 96 స్కోర్లు ఇచ్చేస్తోంది. అధ్వానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు సంస్థలకు భారీ స్కోర్లు ఇచ్చి, కాంట్రాక్ట్ నిబంధనలు సైతం తుంగలో తొక్కి 100 శాతం బిల్లులు చెల్లించడం ద్వారా కమీషన్లు దండుకోవడానికి అధికార పార్టీ నేతలు, అధికారులు మాయ చేస్తున్నారు. సీఎం బంధువు సంస్థ సేవల్లో ఘోరం.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గతేడాది ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ నిర్వహణకు టెండర్లు పిలిచారు. కోరినంత కమీషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చిన, పక్క రాష్ట్రాల్లో టెర్మినేట్ అయిన సంస్థలకు సైతం ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్ట్లు కట్టబెట్టేశారు. డీఎంఈలో జోన్–3 (రాయలసీమ)లోని ఆస్పత్రుల పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ను సీఎం బంధువుకు చెందిన పద్మావతి సంస్థకు ఇచ్చారు. తొలుత శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణకు ఉమ్మడి టెండర్ పిలిచారు. అయితే, దానికి పద్మావతి సంస్థ దాఖలు చేసిన బిడ్కు అర్హత లేదని తేలింది. దీంతో ఏకంగా టెండర్నే రద్దు చేసి పారిశుద్ధ్యం, సెక్యూరిటీకి వేర్వేరుగా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.ఇప్పుడు పద్మావతి సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై ఏకంగా 45 శాతం మంది వరకు రోగులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినా సీఎం బంధువు సంస్థ కావడంతో సేవలు ఎలా ఉన్నా సరే పనితీరుకు ఏకంగా 96 స్కోర్లు ఇచ్చేస్తున్నట్టు వెల్లడైంది. గత డిసెంబర్ నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అనంతపురం జీజీహెచ్లో పరిశుభ్రతపై 43.8 శాతం రోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అయినా ఆ నెల పద్మావతి సంస్థ పనితీరుకు 96 స్కోర్ ఇచ్చారు.ఇంత స్కోర్ దక్కించుకున్న సంస్థ అటెండెన్స్ పర్సంటేజ్ గమనిస్తే డిసెంబర్ నెలలో 58.71 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రోగుల సంతృప్తి, కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది హాజరు 60 శాతం దాటకపోయినా... సీఎం బంధువు సంస్థ కావడంతో అధ్వాన పనితీరుకు కూడా 96 మార్కులు ఇచ్చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే నెలలో తిరుపతి రుయా, కడప మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో 40 శాతం చొప్పున, కడప జీజీహెచ్లో 42.31 శాతం మంది రోగులు పద్మావతి పనితీరును చీదరించుకోగా, ఆ సంస్థ పనితీరుకు ప్రభుత్వం మాత్రం ఏకంగా 90 నుంచి 96 స్కోర్లు ఇచ్చేసింది. జోన్–2లోనూ అదే దుస్థితి.. ఏపీలో టెండర్లు కొనసాగుతున్న సమయంలోనే పక్క రాష్ట్రంలో టెర్మినేట్ అయిన ఆల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వం జోన్–2 ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్ట్ను కట్టబెట్టింది. ఇప్పుడు ఆ సంస్థ సేవలు అందిస్తున్న నెల్లూరు జీజీహెచ్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని 36 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తంచేయగా, ప్రభుత్వం మాత్రం అద్భుతంగా పని చేస్తోందని 96 స్కోర్ ఇచ్చింది. విజయవాడ జీజీహెచ్లో 37 శాతం మంది రోగులు పారిశుద్ధ్య నిర్వహణ బాగాలేదని తెలియజేసినా 93 స్కోర్ ఇవ్వడం గమనార్హం.నిబంధనలు తుంగలో తొక్కి శానిటేషన్లో 20, సెక్యూరిటీలో 9 ప్రమాణాలకు 100 చొప్పున స్కోర్లు ఉంటాయి. వీటికి 95 మేర స్కోర్లు ఉండటంతోపాటు ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టం) అటెండెన్స్ 95 శాతం చొప్పున ఉంటేనే కాంట్రాక్ట్ సంస్థలకు 100 శాతం బిల్లులు ఇవ్వాలని నిబంధనలున్నాయి. వీరికి వంద శాతం బిల్లులు వస్తేనే తమకు ఎక్కువ కమీషన్ ఇస్తారని ముఖ్య నేతల ఒత్తిళ్లతో ఆస్పత్రుల్లో అధికారులు శానిటేషన్, సెక్యూరిటీపై పర్యవేక్షణ గాలికొదిలేసి, అధ్వానమైన పనితీరుకు కూడా ఏకంగా 96 శాతం మేర స్కోర్లు ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.మరోవైపు బిల్లుల చెల్లింపుల్లో టెండర్ నిబంధనలను సైతం ఉన్నతాధికారులు తుంగలో తొక్కేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థలు ఆస్పత్రుల్లో పనులు మొదలు పెట్టిన రోజు నుంచే ఎఫ్ఆర్ఎస్ 95 శాతం సహా ఇతర నిబంధనలు అమలవ్వాలి. అయితే గతేడాది జూన్, జూలైలో కొత్త కాంట్రాక్ట్ సంస్థలు పనులు మొదలు పెట్టాయి. వీరికి బిల్లుల చెల్లింపుల్లో గతేడాది డిసెంబర్ వరకు ఉన్నతాధికారులు నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చారు. ఇది టెండర్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని విమర్శలు వినిపిస్తున్నాయి. -
పోగు బంధం అంధకారం
‘మేం అధికారంలోకి వస్తే చేనేత బతుకుల్లో వెలుగులు నింపుతాం.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇదీ నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ.. గద్దె నెక్కిన తరువత ఆ హామీ తూచ్ అన్న చందంగా మారింది. బాబు హామీల అమలుకు ప్రతిపక్షాల ఒత్తిడితో తూతూ మంత్రంగా చేనేతకు ఉచిత విద్యుత్ జీఓ.. ఏడాదిగా అమలులోకి రాని గవర్నమెంట్ ఆర్డర్. వెరసి నెలానెలా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో చేనేత బతుకుల్లో చీకట్లు అలుమున్నాయి. పెట్టుబడులు భరించలేక నేత పనులు సాగక.. పండుగపూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వెంకటగిరి(సైదాపురం): ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఏడాది కావస్తున్నా అమలు కాకపోవడంతో కాంతి లేని సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని నేతన్నలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్ లూమ్స్కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. అయితే ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఓ అమలుపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు వినతులు ఇచ్చిన నేత కార్మికులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. ఉచిత విద్యుత్ జీఓతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్మాతాయనుకుంటే గాఢాందకారం అలుముకుంది. కొత్త ఏడాదిలోనైనా చంద్ర కాంతులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్న నేతన్నలకు నిరాశే మిగిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. లయబద్ధంగా వినడే పవర్లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతుంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. చాలీ చాలని కూలీలతో తమ జీవితాలు అప్పుల పాలవుతన్నాయనని నేత కార్మీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీఓ నంబర్ 44కు ఏడాది కావస్తున్న అమలు కాలేదు. ఒత్తిడి తెచ్చినా... అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జీఓను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్యను పవర్ లూమ్ యానిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్లు చూపారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవ్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ. 125 కోట్లు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కామ్ సంస్థలు బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించాయి. అయితే నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ జీఓ అమలకు నోచుకోలేదు. ప్రతి నెలా యథావిధిగా పెరిగిన విద్యుత్ చార్జీలు బిల్లును అందుకుంటున్న నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఇంధన శాఖకు తగిన బడ్జెట్లో నేత కార్మీకులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతోపాటు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏడాది గడిచినా జీఓ అమలు కావడంలేదు. దీనిపై అధినేతను అడగలేక అడుగుతున్నవారికి సమా«ధానాలు చెప్పలేక స్థానిక నేతులు తికమక పడుతున్నారు.గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేగాకుండా విద్యుత్చార్జీలు నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కలి్పంచింది. గత ఎన్నికల సమయంలో ప్రతి పక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బహిరంగ సభల్లో చేనేత పవర్లూమ్స్ కార్మీకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూహామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మీకులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాలపేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మీకుల నడ్డి విరుస్తున్నారు.ఉచిత విద్యుత్ అమలు చేయాలి ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 15 ఏళ్లుగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఉచిత విద్యుత్ జీఓను వెంటనే అమలు చేయండి. – బాలాజీ, నేత కార్మీకుడు, వెంకటగిరినేతన్న నేస్తం అమలు చేయాలిగత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలుచేయాలి. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ. 24వేలు ఆర్థిక సాయం అందడంతో మా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఉచిత విద్యుత్తోపాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి. –రవి, నేత కార్మీకుడు, వెంకటగిరిప్రత్యేకపోరాటానికి సిద్ధం ఉచిత విద్యుత్పై గత ఏడాది మార్చిలో జీఓ విడుదల చేసినప్పటీకీ పథకం అమలు చేయకపోవడం నేత కార్మీకుల ను మోసం చేయడమే. దీనిపై ఇప్పటికే పలుచోట్ల అధికారులకు వినతి పత్రం సమర్పించాం. అయినా ఫలితం శూన్యం. విధిలేక అన్నీ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పారీ్టలతో కలసి ప్రత్యక్ష పోరాటానికి నేత కార్మికులు సిద్ధమవుతున్నారు. – కూన మల్లిఖార్జునరావు -
నమ్మక ద్రోహం.. రూ. 20 వేల కోట్ల భారం
సాక్షి, అమరావతి: ‘ఓట్లేసి గెలిపించండి.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. అవసరమైతే తగ్గిస్తాం’ అని ఎన్నికల ముందు నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు ఆనక మాట తప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ బిల్లులు పెంచి, జనం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పదవి చేపట్టిన 18 నెలల్లోనే ఏకంగా రూ.20,136 కోట్ల భారం వేశారు. బాబు నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడింతలు పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారు. బాబు నమ్మించి నిండా ముంచారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అసలు విద్యుత్ చార్జీలే పెంచలేదని, పైగా తగ్గించామని సీఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు కూడా బుకాయిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తప్పు పట్టింది. ఇందులో రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతిస్తూ, మిగతా రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. దానినే యూనిట్కు రూ.0.13 పైసలు చొప్పున వినియోగదారులకు వెనక్కు ఇస్తున్నారు. అంతేగానీ ఇదేమీ చంద్రబాబు ప్రభుత్వం ఊరకే ఇస్తున్నది కాదు. ప్రభుత్వం దానం చేస్తున్నదీ కాదు. అయితే ఇదంతా కూడా తమ దయాదాక్షిణ్యమేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఎల్లో మీడియా ద్వారా తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్కు అదనంగా రూ.0.40 పైసలు చొప్పున వసూలు చేసేస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం.. మరో రూ.14,186 కోట్ల భారం మార్కెట్లో విద్యుత్ తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు అంతకన్నా తక్కువ ధరకు తీసుకుంటే తప్పా? లేక తక్కువ ధరకు వచ్చేదానిని కాదని ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయడం తప్పా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున సౌర విద్యుత్ కొనడం మంచిదా.. లేక ప్రైవేటు రంగ సంస్థ యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ రూ.4.60 చొప్పున తీసుకోవడం మంచిదా? సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) చెప్పినా, సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల్చినా చంద్రబాబుకు పట్టలేదు. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) స్పష్టం చేసినా చెవికెక్కలేదు. చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోలేదు. కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లాలి.. జగన్పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం కక్కాలి.. ఇవే అజెండాగా రోజుల తరబడి టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాశాయి. కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల పాతికేళ్ల పాటు 400 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ద్వారా ఏకంగా రూ.14,186 కోట్ల భారం పడుతుంది. సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు వస్తుంది. కానీ యాక్సిస్తో పీపీఏలకు ఆ మినహాయింపు కూడా రాదు. పైగా పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ ఇప్పుడు మార్కెట్లో యూనిట్ రూ.2.90 కంటే తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60కి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చంద్రబాబు సర్కారే చెప్పాలి. జగన్ హయాంలో రూ.5,448.93 కోట్ల ప్రయోజనం⇒ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచి్చన వినూత్న విధానాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కు కూడా ఇచ్చి, మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తప్పింది. ⇒ 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) 2020–21 నుంచి 2023–24 వరకు రూ.1400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవిన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. ⇒ 2019–20 నుంచి 2023–24 మధ్య నాలుగవ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో)కు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో రూ.247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్ (యాన్యువల్ రెవిన్యూ రిక్వైర్మెంట్)లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో రూ.818.43 కోట్లు ఆదా అయినట్లు ఏపీఈఆర్సీ తాజాగా తేల్చింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో రూ.1,878.18 కోట్లు మిగిలాయి. ఆ మేరకు డిస్కంలకు ఏపీ ట్రాన్స్కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలా వరకూ ‘సర్దుబాటు’ చేయగా, మిగిలిన రూ.134.08 కోట్లను వెనక్కు ఇచ్చేందుకు ఏపీఈఆర్సీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలు ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.196 కోట్లను ట్రూ డౌన్ చేసి వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు మొత్తంగా రూ.5,448.93 కోట్ల ప్రయోజనం చేకూరింది. -
పంచాయతీ నిధులపై సర్కారు కన్ను..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఏటా వచ్చే దాదాపు రూ.2,500 కోట్లను మళ్లించేందుకు చంద్రబాబు సర్కారు కుటిల పన్నాగం పన్నుతోంది. ఆ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రాధాన్యత అవసరాలకు మళ్లించే కుట్రకు తెర లేస్తోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం రెండు నెలల్లో ముగిసిపోనుండగా.. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు లేదా పర్సన్ ఇన్చార్జిల పాలన తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీల ఆదాయంపైనే గురి పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరిగి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు ఎనుకున్న సర్పంచ్, వార్డు సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటైతే.. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోపాటు స్థానికంగా పన్నుల ద్వారా వసూలైన సొమ్మును కూడా పూర్తిగా గ్రామ అవసరాలకు వినియోగించుకునే అవకాశం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఉంది. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించే అవకాశం మాత్రమే అధికారులకు ఉంటుంది. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల)కు కేంద్ర ప్రభుత్వం ఏటా నేరుగా రూ.2,100 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తోంది.ఇందులో 70 శాతం అంటే రూ.1,500 కోట్లు, గ్రామ పంచాయతీలకే కేటాయించాలనే నిబంధన ఉంది. దీనికి తోడు పంచాయతీలు ఏటా ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే దాదాపు మరో రూ.1,000 కోట్లు సైతం పంచాయతీ పాలకవర్గాలు స్థానిక అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఇలా ఏటా రూ.2,500 కోట్లను పంచాయతీ తీర్మానాల మేరకు సర్పంచ్ల ఆధ్వర్యంలో స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తుంటారు. పాలకవర్గాలు లేకుండా చేసి.. రాష్ట్రంలో ప్రస్తుత సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగిస్తుంది. అంటే సుమారు 2 నెలలు మాత్రమే పంచాయతీ పాలకవర్గాలు మనుగడలో ఉంటాయి. ఆ తరువాత పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించి.. కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేకాధికారుల పాలన.. లేదంటే పర్సన్ ఇన్చార్జిలను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారులు/పర్సన్ ఇన్చార్జిల పాలన తెచ్చేందుకు సన్నద్ధమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 13 వేలకు పైగా పంచాయతీ సర్పంచ్, లక్షన్నర వార్డు పదవులకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత ఏడాది సెపె్టంబర్లోనే ప్రణాళిక రూపొందించి జనవరి నాటికే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేలా సూచనలిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ప్రభుత్వం ఆ ప్రక్రియను చేపట్టకకుండా కాలయాపన చేస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లు సైతం తేల్చలేదు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు. సర్పంచ్ పదవులకు మండల ప్రాతిపదికన, వార్డు సభ్యుల పదవులకు పంచాయతీల ప్రాతిపదికన ఏ గ్రామ సర్పంచ్ పదవి, ఏ వార్డు పదవి ఎవరి కేటాయించాలన్నది ఇప్పటికే ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయాలంటే.. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ఇంతవరకు పంచాయతీల వారీగా ప్రభుత్వానికి ఆ నివేదిక కూడ అందలేదు.రిజర్వేషన్ల ప్రక్రియను ఏప్రిల్ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తే తప్ప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఆ లోగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే ఏప్రిల్ 2 తర్వాత సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారులను కూర్చోబెట్టి పంచాయతీల్లోనూ ప్రభుత్వమే పాలన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తద్వారా పంచాయతీల నిధులను ఇష్టానుసారం ఖర్చుచేసే కుటిలయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 2018లో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు 2019 జూన్ వరకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళ్తున్నారు.ఉన్న నిధులూ ఖర్చు పెట్టకుండా ఆంక్షలుకేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రస్తుత పాలకవర్గాలు గ్రామాల అవసరాల నిమిత్తం ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా అక్టోబర్లోనే రూ.1,026 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు మరో రూ.1,000 కోట్ల వరకు రెండో విడత నిధులు ఈ మార్చిలోపే విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్లో కేంద్రమిచ్చిన నిధులను 10 రోజుల్లోనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గడచిన డిసెంబర్ 18 వరకు తన అవసరాలకు వాడుకుంది. ఆ తరువాత నిధులను గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.అంతకుముందు కూడా 8 నెలలపాటు ప్రభుత్వ అవసరాలకు నిధులను మళ్లించి.. ఆ తరువాత ఆలస్యంగా ఆ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ఆలస్యంగా విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ రూపంలో తెలియజేసిన పనులకే ఖర్చు పెట్టేలా చర్యలు చేపట్టాలంటూ డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసుకునే పంచాయతీ సాధారణ నిధులపైనా సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా ఆంక్షలు అమలు చేస్తోందని సర్పంచ్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, ఆ శాఖ అధికారులను కలిసి సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు సమరి్పంచినా.. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని సర్పంచ్ల సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
‘కంది’పోతున్న రైతు
సాక్షి, అమరావతి: కందిరైతు కందిపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటుధర లేక కుదేలవుతున్నాడు. మద్దతుధరకు కొనేవారులేక రైతులు దళారులకు అడిగినకాడికి అమ్ముకుంటున్నారు. రిటైల్ మార్కెట్లో కందిపప్పు నాణ్యతను బట్టి కిలో రూ.130 నుంచి రూ.150కి పైనే పలుకుతోంది. కానీ పండించే రైతుకు మాత్రం కనీస మద్దతుధర దక్కడం లేదు. గత ఖరీఫ్ సీజన్లో 10 లక్షల ఎకరాల్లో కంది సాగవుతుందని, 3.54 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది.2023–24 సీజన్లో మార్కెట్ ధర గరిష్టంగా క్వింటాకు రూ.9,400–రూ.9,800 పలికింది. 2024–25 సీజన్లో కేంద్రం కనీస మద్దతు ధర రూ.7,550 ప్రకటించగా మార్కెట్లో రూ.6,500 నుంచి రూ.7,200 వరకు కొనుగోళ్లు జరిగాయి. కేంద్రం ఈ ఏడాది క్వింటాకు రూ.8,000 మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది పూత, పిందె దశలో భారీవర్షాలతో దిగుబడులు పడిపోయాయి.ఆరేడుసార్లు మందులు పిచికారీ చేయాల్సిరావడంతో ఎకరాకు రూ.2 వేలకుపైగా అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచి్చంది. ఎకరాకు 8–9 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 3–4 క్వింటాళ్లకు మించలేదు. తీరా పంట చేతికొచ్చేసరికి ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులకు దిక్కుతోచటంలేదు. మద్దతుధర క్వింటాకు రూ.8 వేలు కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.6,500 నుంచి రూ.7 వేల మధ్య కొంటున్నారు. వ్యాపారులు సిండికేటై ధర పెంచడంలేదు.కర్ణాటకలో 9.67 లక్షల టన్నుల సేకరణకు అనుమతి కంది రైతులకు మద్దతుధర దక్కకపోయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. పక్కనున్న కర్ణాటకలో 9.67 లక్షల టన్నుల కందిని కనీస మద్దతుధరకు సేకరించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం కేవలం 1.17 లక్షల టన్నుల సేకరణకే అనుమతి ఇచి్చంది. కందులతో పాటు మొక్కుబడిగా 28,440 టన్నుల మినుములు, 903 టన్నుల పెసల సేకరణకు ఓకే చెప్పింది. మార్క్ఫెడ్ జనవరి రెండోవారంలో కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పంట లేనిచోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దతు ధర కల్పనలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు అయినకాడకి దళారులకు అమ్ముకుంటున్నారు. పొగాకు, మామిడి, ఉల్లి రైతులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూసిన అన్నదాతలు పంటలను ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకోవాలంటేనే భయపడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించుకుంటూ నష్టపోతున్నారు. కంది రైతులను ఆదుకోవాలి.. నేను 20 ఎకరాల్లో కంది సాగుచేశా. కౌలుతో సహా ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాలతో చీడపీడలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఒకసారి మందు కట్టలు వేయాలి. ఆరుసార్లు నీలిమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. సాధారణంగా 8–9 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 3 క్వింటాళ్లు మాత్రమే వచి్చంది. ప్రభుత్వం క్వింటా రూ.8 వేలు ప్రకటించగా, మార్కెట్లో రూ.6,500కు మించి కొనడం లేదు. – వెంపరాల నరసింహారావు, గనిఆత్కూరు, కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా మద్దతు ధర కల్పనలో విఫలం ఈ ఏడాది ఒకటి రెండు తప్ప ప్రధాన పంటల్లో ఆశించిన దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. మద్దతుధర కల్పనలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. మొక్కజొన్న, సజ్జల పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే కంది రైతులూ పంటను కూడా క్వింటా రూ.6,500 నుంచి రూ.7 వేలకు అమ్ముకుని నష్టపోతున్నారు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ -
‘వీసీ’ 420 వేషాలు!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యా వ్యవస్థను సైతం భ్రష్టు పట్టిస్తోంది. అస్మదీయులకు అడ్డగోలుగా వైస్ చాన్సలర్ పదవులు కట్టబెట్టి యూనివర్సిటీలను సర్వ నాశనం చేస్తోంది. 420గా ముద్రపడిన మోసగాళ్లు, అత్యంత వివాదాస్పదులను వీసీ పోస్టులో కూర్చోబెట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. విద్యా వేత్తలకు ఇవ్వాల్సిన ఉన్నత పదవిని ఓ నేర చరితుడికి ఇవ్వడం విస్తుగొలుపుతోంది. కాకినాడ జేఎన్టీయూ వీసీ నియామకమే దీనికి నిదర్శనం. డాక్టర్ అల్లం అప్పారావు లాంటి ప్రముఖ విద్యావేత్తలు సారథ్యం వహించిన కాకినాడ జేఎన్టీయూ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్ను గతేడాది ఫిబ్రవరిలో కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయనపై అవినీతి, ఫోర్జరీ లాంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ వీసీగా ఎంపిక చేయడం చంద్రబాబు సర్కారు బరితెగింపునకు తార్కాణం. ఫోర్జరీ పత్రాల నిందితుడికి వీసీ పోస్టు!కాకినాడ జేఎన్టీయూ వీసీగా నియమించిన సీఎస్ఆర్కే ప్రసాద్పై తెలంగాణలోని పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల్లో పలు సెక్షన్ల కింద కుప్పలు తెప్పలుగా కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాలతో కోర్టును ఉద్దేశపూర్వకంగా మోసం చేశారనే అభియోగంతో ఇటీవలే హనుమకొండ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏకంగా 415, 416, 418, 420, 464, 468, 469, 471 సెక్షన్ల కింద సమన్లు ఇవ్వడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సెక్షన్లను పరిశీలిస్తే.. దారుణమైన మోసం, వేరొకరిలా నటించి మోసం చేయడం, ఎదుటి వ్యక్తికి నష్టం కలుగుతుందని తెలిసీ మోసానికి పాల్పడటం, నకిలీ సంతకాలతో మోసగించడం, తప్పుడు పత్రాలు సృష్టించడం, ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఫోర్జరీ పత్రాలు తయారీ, నకిలీ పత్రాలను నిజమైనవిగా నమ్మించి వినియోగించడం వంటి నేరాల్లో నిందితులుగా లెక్క. వీటిల్లో అధిక సెక్షన్లలో నేరం రుజువైతే ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎంపికలో దారుణ వైఫల్యం..విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. విద్యావంతులు, భవిష్యత్తు సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే మేధావులకు పెద్దపీట వేయాలి. కానీ టీడీపీ పెద్దలు తమ అస్మదీయుడనే ఒకే ఒక అర్హతతో కొందరికి వీసీ పోస్టులు కట్టబెట్టేశారు. ఇందులో భాగంగానే అవినీతి, ఫోర్జరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎస్ఆర్కే ప్రసాద్ను కాకినాడ జేఎన్టీయూ వీసీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. దీంతో వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీల పాత్ర మరోసారి ప్రశ్నార్థకమైంది. సెర్చ్ కమిటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన పేర్లతో సెర్చ్ కమిటీ జాబితా సిద్ధం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపుతోంది. ఇక వీసీల నియామకాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక తూతూమంత్రంగా మారింది. ఇవీ సీఎస్ఆర్కే ప్రసాద్ నిర్వాకాలు..!వరంగల్ నిట్ ప్రొఫెసర్గా ఉన్న సమయంలో సీఎస్ఆర్కే ప్రసాద్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ఐటీ వరంగల్ ఆలూమ్ని అసోసియేషన్ (నిట్వా) అందించిన నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆ తప్పును కప్పిపుచ్చేందుకు యత్నించారు. ప్రతిభావంతులకు మేలు చేసేందుకు నిట్లోని ఓ భవనాన్ని లీజుకు తీసుకుని ప్రస్తుత, పూర్వ విద్యార్థులను అనుసంధానించేందుకు నిట్వా రూ.1.30 కోట్లు సమీకరించింది. అయితే భవనం ఆధునికీకరణలో రూ.40 లక్షలు దారి మళ్లాయని, సీఎస్ఆర్కే ప్రసాద్కు అత్యంత సన్నిహితులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక సీఎస్ఆర్కే ప్రసాద్ ఒత్తిడితో అప్పటి ఐఆర్ఏఏ డీన్ 2022లో నిట్వా ఎన్నికల్లో తమ అనుకూల వర్గాన్ని గెలిపించేందుకు అక్రమంగా ఓట్లు జొప్పించారు. ఈ కేసు ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో ఉంది.కోర్టు కళ్లు గప్పేందుకు యత్నించి..!ఎన్నికల్లో అక్రమాలపై నిట్వా మాజీ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సీఎస్ఆర్కే ప్రసాద్ అప్పటి డైరెక్టర్పై ఒత్తిడి చేసి ఇందులో చేర్చారు. అనంతరం ఆ డైరెక్టర్ బదిలీపై వెళ్లిపోగా సీఎస్ఆర్కే ప్రసాద్ న్యాయస్థానాన్ని మోసం చేసే కుట్రకు తెర తీశారు. గత డైరెక్టర్ సంతకాలు, పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) లేకుండానే ఆయన అథారిటీ ఇచ్చినట్లుగా కేసును నడిపించారు. పాత న్యాయవాది నుంచి నో అబ్జెక్షన్ లేకుండానే మరో న్యాయవాదితో వకాలత్ వేయించి మరో తప్పు చేశారు. ఈ విషయం బయటపడటంతో తాను ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వలేదని అప్పటి డైరెక్టర్ రాత పూర్వకంగా కోర్టుకు నివేదించారు. సీఎస్ఆర్కే ప్రసాద్ ఫోర్జరీ, అవినీతి బాగోతంపై ‘నిట్వా’ మాజీ అధ్యక్షుడు ఎన్ఐటీ డైరెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు.ఇక 2025 ఫిబ్రవరిలో ఖాజీపేట పోలీసు స్టేషన్లో సీఎస్ఆర్కే ప్రసాద్పై ఫిర్యాదు చేయగా సివిల్ కేసుగా పరిగణించారు. దీంతో గత ఆగస్టులో కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం స్వీకరించి నిందితుడు సీఎస్ఆర్కే ప్రసాద్కు 8 రకాల ఐపీసీ సెక్షన్లు కింద సమన్లు జారీ చేసింది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కరెస్పాండెంట్ అనుమతి లేకుండా సీఎస్ఆర్కే ప్రసాద్ దొంగ సంతకాలతో నడిపించడం గమనార్హం. ఎన్ఐటీ పూర్వ విద్యార్థి, నిట్వాలో సభ్యుడు అయినప్పటికీ అసోసియేషన్కు నష్టం చేకూర్చేలా వ్యవహరించారు. ఆయన జేఎన్టీయూ కాకినాడ వీసీగా వచ్చినప్పటి నుంచి పాలనా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టి అనర్హులకు పెద్దపీట వేయడం, అవినీతిని ప్రోత్సహిస్తుండడంపై వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
‘వెలిగొండ’నూ కొట్టేద్దాం!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీ సర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో రెండు టన్నెల్స్ పనులన్నీ పూర్తయినప్పటికీ, నల్లమలసాగర్కు నీటిని తరలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు గత ప్రభుత్వం కృషినంతటినీ తన ఘనతగా చెప్పుకునేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో సీఎం చంద్రబాబు వెలిగొండ సందర్శించి.. పూర్తయిన పనులన్నీ తన ఘనతేనని చాటుకునేందుకు సిద్ధమైపోయారు. వాస్తవానికి దశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి, రూ.992 కోట్లు వ్యయం చేసి, పునరావాసం కల్పించి 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 20 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఆది నుంచి సీఎం చంద్రబాబుకు ఉన్న కపట ప్రేమ మరోసారి నిరూపితమైందని ఎత్తిచూపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం వచ్చి.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా పనులు వైఎస్సార్సీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2025 ఖరీఫ్ సీజన్లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఒడిసిపట్టి.. నల్లమలసాగర్కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షం అయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2025లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్కు కట్టబెట్టడం గమనార్హం. వెలిగొండ టన్నెల్స్ నుంచి నల్లమలసాగర్కు నీటిని తరలించే కాలువ చంద్రబాబు సర్కార్ దోపిడీని కడిగేసిన కాగ్ ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా, పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించక పోవడమే చంద్రబాబు సర్కార్ చేసిన దోపిడీకి నిదర్శనం. జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింç³#)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తుతో సుంకేశుల డ్యామ్.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తుతో గొట్టిపడియ డ్యామ్.. 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తుతో కాకర్ల డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపు దిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగు నీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవి్వ.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవి్వన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద నీటి పారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
కూటమిపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్
-
చంద్రబాబు చేసిన పనికి కౌలు రైతులు కకావికలం
-
కౌలు రైతు కకావికలు
సాక్షి, అమరావతి: కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటినా ఏ ఒక్క కౌలు రైతునూ ఆదుకున్న పాపాన పోలేదు. కనీసం గుర్తింపు కార్డులు లేవు. పంటల బీమా లేదు. నష్టపరిహారం అసలే లేదు. ఉచిత బీమాకు మంగళం పాడారు. పంట రుణాల నుంచి పెట్టుబడి సాయం వరకు ఏదీ అందక సాగు వేళ వారు పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనే వారూ లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వారికి ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో సైతం కౌలు రైతులకు చోటు లేకుండా పోయింది. ఇటీవల ‘పీపుల్స్ పల్స్’ సంస్థతో కలిసి కౌలు రైతు సంఘాలు నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కౌలు రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టాయి. 87.7 శాతం మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేదని వెల్లడైంది. 92.7 శాతం మందికి పంట రుణాలు, 91.4 శాతం మందికి మద్దతు ధర లభించడం లేదని సర్వేలో తేలింది. కనీసం 14 శాతం మంది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంట ఉత్పత్తులను అమ్ముకోలేక పోయారని స్పష్టమైంది. పైగా ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడం వల్ల నూరు శాతం కౌలు రైతులకు రక్షణ లేకుండా పోయిందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండేళ్లలో ఎరువులు.. ప్రధానంగా యూరియా కొరత, పురుగు మందుల కొరత వేధించిందని తేటతెల్లమైంది. యూరియా కోసమైతే రైతులు ఊరూరా ఆందోళనకు దిగారని స్పష్టమైంది. పెట్టుబడి సాయం రూపాయి కూడా లేదుభూ యజమానుల ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేసేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త కౌలు చట్టాన్ని తెస్తామని నమ్మబలికి.. కౌలు రైతుల ఓట్లు దండుకున్న చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత కొత్త చట్టం కోసం కొద్దిరోజులు హంగామా చేశారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఉన్న సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్) చట్టానికి తూట్లు పొడుస్తూ.. వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అందకుండా మోకాలొడ్డారు. భూ యజమానులతో పాటే ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో దీన్ని పూర్తిగా అటకెక్కించిన ప్రభుత్వం.. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెడుతూ.. రూ.30 వేలు ఎగ్గొట్టింది. కౌలు రైతుల విషయానికి వస్తే ఆ రూ.10 వేలు కూడా ఇవ్వకుండా సాంకేతిక కారణాలంటూ మొండి చేయి చూపుతోంది. ఇప్పటి దాకా రెండేళ్లకు సంబంధించి ఏ ఒక్క కౌలు రైతుకు కూడా రూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. పంట రుణాల కోసం ఎదురు చూపుచంద్రబాబు ప్రభుత్వం 2024–25, 2025–26 సీజన్లలో కౌలు రైతులకు కనీసం సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వడం లేదు. 2024–25లో 30 లక్షల మంది కౌలు రైతుల్లో కనీసం 2.58 లక్షల మందికి వ్యక్తిగతంగా రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇచ్చింది కేవలం 41,205 మందికి మాత్రమే. 2025–26 సీజన్లో కనీసం 5 లక్షల మంది కౌలు రైతులకు రూ.8 వేల కోట్ల పంట రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. లక్ష్యం మేరకు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేక పోయామని ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీసీఎల్సీ సమావేశంలో బ్యాంకర్లే అధికారికంగా ప్రకటించారు. దీంతో రుణాల కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అధిక వడ్డీలు కట్టలేక, ప్రభుత్వ ఆసరా లేకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 19 నెలల్లో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టగా, వారిలో 90 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారంటే పరిస్థితి ఎంత దనీయంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.ఆ ఐదేళ్లూ అన్నదాతలకు అన్ని విధాలా భరోసాభూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో కౌలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో సీసీఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో గ్రామ స్థాయిలో సీసీఆర్సీ మేళాలు నిర్వహించి, నిర్ధేశించిన లక్ష్యం మేరకు కార్డులు జారీ చేసేవారు. పైగా భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు గుర్తింపు కార్డులిచ్చేవారు. ఇలా ఏటా అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేశారు. వీటి ప్రామాణికంగా సకాలంలో పంట రుణాలు, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్ట పరిహారం వంటి సంక్షేమ ఫలాలు నేరుగా అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేసేవారు. పైగా వారు పండించిన వంట ఉత్పత్తులను కల్లాల నుంచే కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి అండగా నిలిచారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయం అందలేదని.. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుందని.. తమ పాలిట అది స్వర్ణయుగమని కౌలు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.ఇలాగైతే వ్యవసాయం మానేయాల్సిందే..ఇతని పేరు గుప్తాల సూర్యనారాయణ. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం స్వగ్రామం. ఇతనికి సొంతంగా సెంటు భూమి కూడా లేదు. ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఖరీఫ్లో బొండాలు (స్వర్ణ రకం వరి) వేశాడు. తుపాను దెబ్బకు ఎకరాకు 15 బస్తాలు కూడా దిగుబడి రాలేదు. తేమ శాతం అధికంగా ఉండడంతో మద్దతు ధర కూడా దక్కలేదు. కనీసం పెట్టుబడి మేర కూడా చేతికందలేదు. ఇప్పుడు సీసీఆర్సీ కార్డు ఇవ్వలేదు. దీంతో పంట రుణమూ ఇవ్వడం లేదు. పంట దెబ్బతిన్నా పైసా పరిహారం అంద లేదు. 19 నెలలైనా పైసా పెట్టుబడి సాయం అందలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. బ్యాంకులో రుణం ఇవ్వక పోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో అప్పు తెచ్చుకుని పంట సాగు చేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తివేయడంతో బీమా పరిహారం అందకుండా పోయింది. తనలాగే ఎంతో మంది కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ఇలాగైతే వ్యవసాయం మానేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు.పెట్టుబడి సాయం పైసా అందలేదు మాకు వ్యవసాయమే జీవనాధారం. సొంత భూమి లేదు. రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఖరీఫ్లో 1061 రకం వరి సాగు చేశాను. తుపాను, అధిక వర్షాల వల్ల 75 సెంట్లల్లో పంట పూర్తిగా నేలవాలింది. మిగిలిన 1.25 ఎకరాల్లో పంట నిలబడినప్పటికీ ఎకరాకు 26 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. వ్యాపారులకు క్వింటా రూ.1,600 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. దెబ్బతిన్న పంటకు పైసా పరిహారం రాలేదు. 19 నెలల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కౌలు కార్డులున్న వాళ్లకు సైతం బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమా ఎత్తివేయడంతో ఆర్థిక భారం తట్టుకోలేక బీమా కూడా చేయించుకోలేక పోతున్నాం. ఈ ప్రభుత్వంలో కౌలు రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. – వెంట్రప్రగడ మరియదాసు, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లాసర్కారు సాయం కాగితాలకే పరిమితంనా సొంత భూమి 20 సెంట్లతో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. షావుకార్ల దగ్గర రూ.3 వడ్డీకి అప్పు చేసి, ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి.. ఖరీఫ్లో 1061 రకం వరి సాగు చేశా. తుపాను దెబ్బకు పూత పూర్తిగా రాలిపోయి పంట పాలిపోయింది. అధికారులు వచ్చినప్పుడు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఎంతగా బతిమిలాడినా వినిపించుకోలేదు. ఎకరాకు 30 బస్తాలకు పైగా దిగుబడి వస్తాదని ఆశిస్తే, కేవలం 18 బస్తాలే వచ్చింది. 16 బస్తాలు కౌలు కింద ఇచ్చేశా. కనీసం పెట్టుబడి కూడ మిగల్లేదు. ఈ 19 నెలల్లో పెట్టుబడి సాయం కాదు కదా.. పంట నష్ట పరిహారం కూడా పైసా అందలేదు. బ్యాంకులకు వెళ్తే రుణాలు ఇచ్చే వారు కూడా లేరు. వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. సాయం చేస్తామన్న ప్రభుత్వం మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. – బద్దా రమేష్, పాండువ గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లాపంట రుణాలివ్వడంలో విఫలంఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా కొత్త కౌలు చట్టం కార్యరూపం దాల్చలేదు. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం కూడా లేదు. కౌలుదారులకు పంట రుణాల మంజూరు కాగితాలకే పరిమితమైంది. 2025–26 సీజన్లో 8 వేల కోట్ల పంట రుణాలిస్తామని ప్రకటించారు. కానీ డిసెంబర్ నాటికి రూ.1,490 కోట్లు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇంతకంటే వేరే చెప్పనవసరం లేదు. ష్యూరిటీతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలివ్వాలి. ఉచిత పంటల బీమాను అటకెక్కించడంతో పూర్తిగా నష్టపోతున్నది కౌలు రైతులే. – పీ.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
RK Roja : మరుగుదొడ్లపై ఫోటోలు వేసుకునే మీరా జగన్ గురించి మాట్లాడేది
-
బుద్దుందా పట్టాభి.. అందరి ముందు క్లాస్ పీకిన బాబు
-
Perni Nani: రాళ్లు రాళ్లు అని మొరుగుతున్నారు.. అవే మీకు రాజకీయ సమాధికి..
-
నాడు ఎన్టీఆర్ పై బూతు బొమ్మలు వేసి నేడు 1700 కోట్లు తో విగ్రహం
-
Trimurthulu : టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు కచ్చితంగా రైతులు బుద్ది చెప్తారు
-
నారా లోకేష్ తోడల్లుడికి బాబు గిఫ్ట్
-
గీతంకు బాబు గిఫ్ట్.. రూ.5,000 కోట్ల కానుక..!
-
బాలయ్య అల్లుడి కోసం 54 ఎకరాల ప్రభుత్వ భూమి!
-
AIYF Leaders: మీ మెడలు వంచి.. మిమ్మల్ని గద్దె దింపుతాం
-
చంద్రబాబు పాలనంతా అబద్దాలు.. మోసాలు.. పాలనపై కరణం ధర్మ శ్రీ ఫైర్
-
చంద్రబాబుకు బిగ్ షాక్ YSRCPలో టీడీపీ నేతల చేరిక
-
40 ఏళ్ల టీడీపీ... 12 ఏళ్ల YSRCP..అందుకే భయంతో చంద్రబాబు, పవన్..
-
ఉద్యోగుల ఉసురు తీస్తున్న ప్రభుత్వ ఒత్తిళ్లు, వేధింపులు
-
ఏపీ ప్రజలకు బాబు కరెంట్ షాక్.. మళ్లీ బాదుడు!
-
నాడు దుష్ప్రచారం.. నేడు క్రెడిట్ చోరీ
సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మా నాన్నకు సమకాలికుడు. ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు. నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా. రీ సర్వే ప్రక్రియ చేపట్టడానికి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో 2020 డిసెంబర్ 9న ఒప్పందం చేసుకున్నాం. యూరప్, అమెరికాలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీ సర్వేలో వినియోగించాం. రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా సీవోఆర్ఎస్లు (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్) పెట్టాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి 3,640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అందుబాటులోకి తెచ్చాం. కచ్చితత్వం కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడిన ప్రభుత్వం మాది.సమగ్ర రీ సర్వే కోసం రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కు పైగా హైఎండ్ డ్రోన్స్ను తొలిసారిగా వినియోగించాం. దీని మీద అవగాహన కోసం సచివాలయాల్లోని 40 వేల మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇదెప్పుడూ గతంలో జరగలేదు. ఇంత గొప్ప యజ్ఞం చేశాము కాబట్టే 5 సెంటీమీటర్లు కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. అందుకే దీన్ని మహా యజ్ఞం అంటున్నాం.చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. సాధారణంగా ఆయనకు అవగాహన తక్కువ. సర్వే మీద కూడా అవగాహన తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇలాంటి సర్వే చేయాలని తపన, తాపత్రయ పడలేదు. సర్వే రాళ్లు లేకుండా సర్వే ఎలా పూర్తవుతుంది? కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించారని బుద్ధి, అవగాహన, జ్ఞానం లేకుండా మాట్లాడారు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అలా చేస్తే కథ మళ్లీ మొదటికి రాదా? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు ృ భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు. మేం సంకల్పంతో పని చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు రైతులు, భూ యజమానులకు అందకూడదని, జగన్కు మంచి పేరు వస్తుందని రాక్షసులకన్నా దారుణంగా చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్ వ్యవహరించారు. యజ్ఞం భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాన రాక్షసుడు.. ఆయన లెఫ్ట్, రైట్లో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్ల రాక్షసుల పాత్ర పోషించారు. మీ భూమి మీది కాదు.. కాళ్ల కింది నేల కదిలిపోతోంది! అంటూ అబద్ధాలు, వక్రీకరణలు చేశారు. 2024 మే 13న పోలింగ్ అయితే మే 10వ తేదీన ఈనాడులో ‘మీ భూమి మీకు కాకుండా పోతుంది’ అంటూ ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గుర్గావ్ నుంచి లక్షలాదిగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని విషపూరిత, తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొంది ఉండొచ్చు. కానీ, అబద్ధాలు ఎంతో కాలం దాగవు. నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. భూముల సర్వే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులు, రైతులకు జరిగే మేలు భూములు ఉన్నంత వరకూ నిలిచిపోతాయి. రీ సర్వేలో ఏపీ ప్లాటినమ్ గ్రేడింగ్ సాధించిందని డిసెంబర్ 2023లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రూ.400 కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 2025 ఫిబ్రవరి 19న వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనికి కేంద్రం ఈ డబ్బులు ఇచ్చిందని క్రెడిట్ చోరీకి పాట్లు పడుతున్నారు. మాకు నాలుగేళ్లు సమయం పడితే.. చంద్రబాబు ఆరు నెలల్లో చేసిన పనికి ప్లాటినమ్ గ్రేడింగ్ ఇచ్చారట! మరి ఎన్నికల ముందు వరకు ఆయన చేసిన ఆరోపణలు ఏమైపోవాలి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహోన్నత సంకల్పంతో మేం సమగ్ర భూ రీసర్వే మహా యజ్ఞాన్ని చేపడితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాక్షసుడిలా విషం చిమ్మి.. ఇప్పుడు ఆ రీసర్వే నీ ఘనతే అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడతావా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భూ మండలంలో అత్యంత దారుణంగా క్రెడిట్ చోరీకి పాల్పడే వారు నిన్ను మించి ఎవరైనా ఉంటారా.. నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర భూ రీ సర్వేపై చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వెనుక దాగిన నిజాలను సాక్ష్యాధారాలతో వివరించారు. ‘‘జగనన్న భూ హక్కు – భూరక్ష’’ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడింగ్ ఇవ్వడాన్ని.. ఈ సర్వే దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందంటూ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ స్పష్టం చేయడాన్ని, వివిధ రాష్ట్రాలు భూ సర్వేను ప్రశంసిస్తూ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఉద్ఘాటించడాన్ని, నీతి ఆయోగ్ అత్యంత పారదర్శకంగా కచ్చితత్వంతో భూ రీ సర్వే చేశారంటూ కితాబు ఇచ్చిన అంశాలను సాక్ష్యాధారాలతో గుర్తు చేశారు. అప్పట్లో ఈ మహాయజ్ఞంపై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చిమ్మిన విషాన్ని.. నాడు చేసిన భూసర్వేను ప్రశంసిస్తూ కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే అది తన ఘనతేనని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏనాడైనా రీసర్వే ఆలోచనైనా చేశావా? ఈ మధ్య కాలంలో భూముల రీ సర్వేపై చంద్రబాబు మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీ సర్వే క్రెడిట్ అంతా తనదేనంటూ చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ భూ మండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉంటారా.. అనిపిస్తోంది. చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి బహుశా సిగ్గు పడుతుందేమో! అంతటి దారుణమైన మోసాలు.. అబద్ధాలు. నాలుగుసార్లు సీఎం అని చెప్పే చంద్రబాబుకు భూములు రీ సర్వే చేయాలనే కనీస ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని ఏనాడైనా తపన పడ్డావా? ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తూ మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఈ పెద్దమనిషి సిగ్గుపడాలి. 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి మా ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించి, డ్రోన్ సర్వే కూడా పూర్తి చేశాం. ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్ (ఓఆర్ఐ) అన్ని జిల్లాలకు పంపేశాం. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి చేసేశాం. రైతుల భూ సరిహద్దులను ఖరారు చేశాం. సర్వే రాళ్లను పాతడం పూర్తయింది. ఈ గ్రామాల్లో రికార్డులన్నింటినీ అప్డేట్ చేసి, సబ్ డివిజన్స్, మ్యుటేషన్లు పూర్తి చేసి, ప్రతి భూ కమతాకు విశిష్ట నంబర్ (యూనిక్ నంబర్) ఇచ్చాం. భూ కమతా మ్యాప్ను కూడా జియో ట్యాగింగ్ చేసి, పాస్బుక్లో పొందుపరిచి, 30 లక్షల మంది రైతుల సమస్యలు మొబైల్ మెజిస్ట్రేట్లతో పరిష్కరించాం. వివాదాలు లేని విధంగా క్యూ ఆర్ కోడ్తో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఈ క్యూ ఆర్ కోడ్ ప్రజలు స్కాన్ చేస్తే మొత్తం భూమి, యజమాని వివరాలు కనిపిస్తాయి. మీ భూమి పోర్టల్ అప్గ్రెడేషన్ పూర్తి చేశాం. జియో ట్యాగింగ్ చేసిన క్రమంలో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం భూమి వివరాలు వచ్చేస్తాయి. రియల్ టైమ్ అలర్ట్లతో.. మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, భూ రికార్డులపై ఆటోమేటిక్గా మీకు అలర్ట్లు వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చాం. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పథకం ఇది. ఇందులో 40 వేల మంది ఉద్యోగుల నాలుగేళ్ల శ్రమ, కష్టం ఉంది. అందుకే ఈ పథకానికి ‘జగనన్న భూ హక్కు – భూరక్ష’ అని పేరు పెట్టాం. ఇలా ఏనాడైనా చేశావా బాబూ? చంద్రబాబూ.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చేశారా? రైతు, భూ యజమాని నష్టపోకూడదని, అన్ని రకాలుగా మంచి జరగాలని మీరెప్పుడైనా తాపత్రయ పడ్డారా? ఇంత చేసిన మా గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు దొంగలో ఇప్పుడు చెప్పండి. ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని అనుకునే ఎవరైనా ప్రత్యేక (డిస్టింక్ట్) రాళ్లు పాతి, భూ కమతాల నలుమూలలా జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తారా? చెడు ఉద్దేశాలుంటే ఈ విధంగా మంచి చేస్తారా? అబద్ధాలకు ఒక హద్దు ఉండాలి. మాపై బాబు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఒకసారి పాత, కొత్త పాస్ పుస్తకాలను అందరూ గమనించాలి. పాత వాటిలో భూ వివరాలన్నీ చేతితో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకంలో ఎక్కడా మ్యాప్లు లేవు. అక్షాంశాలు, రేఖాంశాలతో జియో ట్యాగింగ్ లేదు. మేం సబ్ డివిజన్, మ్యూటేషన్ చేశాక, విశిష్ట భూ కమతా నంబర్, ఏ మాత్రం తేడాలేని కొలతలతో కూడిన జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. పాస్బుక్ చివరలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి, రైతుల వివరాలు అప్డేట్ చేసి, రియల్ టైమ్ అప్డేట్స్తో అందుబాటులోకి తెచ్చాం. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. దాన్ని పూర్తిగా వదిలేశారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఎందుకంత ముఖ్యమంటే.. కళ్ల ఎదుటే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ, రికార్డులు అప్డేట్ అవుతున్నప్పుడు, మోసాలకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు కాబట్టి. నీతి ఆయోగ్ కొనియాడింది.. మేం చేపట్టిన రీసర్వే గొప్పగా జరిగింది కాబట్టే నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర వచ్చి ప్రశంసలు కురిపించింది. అసోం బృందం ఏపీలో పర్యటించి, ఏపీ ప్రభుత్వ సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ మా ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. (వీడియో ప్లే చేసి చూపించారు). క్రెడిట్ కోసం పడరాని పాట్లు సమగ్ర భూ సర్వేతో భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని నాడు చంద్రబాబు విష ప్రచారం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామిగా ఉండీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా మా ప్రభుత్వంలో సర్వే చేశామని కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్ చేయడం, చంద్రబాబు థ్యాంక్యూ అని రీ ట్వీట్ చేయడం ఆశ్యర్యంగా ఉంది. క్యూ ఆర్ కోడ్ తానే తెచ్చానంటూ చంద్రబాబు సొల్లు మాటలు చెబుతున్నారు. సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. మేమిచ్చిన పుస్తకాలకే రంగు మార్చి.. మేం ఇచ్చిన 30 లక్షల పాస్ బుక్లు వెనక్కి తీసుకొని, వాటికే చంద్రబాబు రంగు మార్చి ఇస్తున్నారు. రంగు మార్చి ఇస్తున్న వాటిలో తేడా ఏముందో చూస్తే.. అదే క్యూ ఆర్ కోడ్, అదే ఫార్మాట్. జీయో కో ఆర్డినేట్స్తో భూ కమతా నంబర్, జియో కో ఆర్డినేట్స్ ల్యాండ్ మ్యాప్ ఇలా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. చివరి పేజీల్లో చూస్తే వైఎస్సార్సీపీ హయాంలో అప్గ్రేడ్ చేసిన మీ భూమి పోర్టల్ను కాపీ కొట్టి ముద్రించారు. మేం ఇచ్చిన పుస్తకాలకు రంగు మార్చడం తప్ప ఈ 19 నెలల్లో చంద్రబాబు చేసిందేమీ లేదు. రంగు మార్చి ఇచ్చే పుస్తకాల్లోనూ తప్పుల తడకలే. పేర్లు, ఫొటోలు, ఐడీ నంబర్లు, విస్తీర్ణం అన్నింట్లో తప్పులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి రైతులు మళ్లీ లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. పేర్లు చెరిపేయడానికి రూ.15 కోట్లు రీ సర్వే చేసి కొన్ని కోట్ల సర్వే రాళ్లను మేము పాతాం. ఆ రాళ్ల మీద ఉండే వైఎస్సార్, జగనన్న భూ హక్కు – భూ రక్ష పేరును రూ.15 కోట్ల డబ్బు ఇచ్చి మెషీన్లు పెట్టి తుడిచేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము వెచ్చించి, ఇంత పనికిమాలిన పని ఎవరైనా చేస్తారా? ఈయన కొత్తగా రాళ్లు ఇవ్వకపోగా, మేం పాతిన రాళ్లపై పేర్లను చెరిపేస్తున్నారు. అంటే అవి భూ రక్ష రాళ్లు కాదని చూపడానికి, అందులో ఉండే ప్రత్యేకతను(డిస్టింక్ట్) దగ్గరుండి తీసివేసే కార్యక్రమం చేస్తున్నాడు. పనికి మాలిన పని కాకపోతే ఇదేంటి? బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర కూడా ఇంతే. విగ్రహం నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేసి, ఆవిష్కరించిందీ నేనే. అదే పనిగా అధికారులను పంపి నా పేరును తీయించారు. ఇటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. నా పేరు తీసేస్తే మాత్రం ఆ అంబేడ్కర్ విగ్రహం ఎవరు కట్టారో తెలియదా? రీ సర్వే ఎవరు చేయించారో తెలియదా? ట్యాంపర్కు వీల్లేని పాస్ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో తెలియదా? చంద్రబాబు వయసేమో 80 ఏళ్లు. మా నాన్నతో సమకాలికుడు. మా నాన్నతో పోటీ దేవుడెరుగు, ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీకి అవస్థ పడుతున్నారు. కమీషన్ కోసం దేన్నీ వదలడం లేదు⇒ మా హయాంలో రూ.55.79కు పట్టాదారు పాస్బుక్ ఇచ్చాం. కలర్ మార్చి రూ.76కు చంద్రబాబు ఇస్తున్నారు. అంటే రూ.20 కమీషన్. కమీషన్ కోసం దేనినీ వదలడం లేదు. ఇంకో ఆశ్చర్యం చంద్రబాబు 22–ఏ గురించి మాట్లాడటం. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, నిషేధిత జాబితా కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆయనది. తప్పులన్నీ ఆయన చేసి, బురద మాత్రం వేరేవాళ్ల మీద చల్లుతారు. ⇒ మేం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా 20.24 లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44 లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద పూర్తి హక్కులు కల్పించిన ఘనత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి. ⇒ చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు మేం హక్కులు కల్పించాం. షరతులు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద హక్కులు వచ్చాయి. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు కలిగిస్తూ హక్కులు కల్పించాం. ⇒ చంద్రబాబు సృష్టించిన కష్టాల నుంచి మేము పేదలను, రైతులను బయటకు వేశాం. ఇప్పుడేమో ఆ పెద్ద మనిషి 22–ఏ మా హయాంలో పెట్టామని మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క సెంటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వ హయాంలో 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేశాం. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కు కల్పించాం. చంద్రబాబు క్రెడిట్ చోరీలో భాగంగా, 22ఏ మేము పెట్టామని అంటున్నాడు. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ దేశంలో తొలిసారిభారత్లో భూ రికార్డులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. గ్రామాల్లో పట్వారీ ఉపయోగించే మ్యాప్స్ను నిజంగా మ్యాప్లు అని కూడా అనలేం. అవి కచ్చితత్వం లేని, తప్పులతో కూడిన మ్యాప్స్. ఈ పరిస్థితిని సరిచేయడానికి 2008లో ఎన్ఎంఎల్ఆర్పీ అనే ఒక పథకం వచ్చింది. కానీ ఆ పథకం ద్వారా జరగాల్సిన స్థాయిలో సంస్కరణలు జరగలేదు. ఏపీలో దూరదృష్టి కలిగిన సీఎం వైఎస్ జగన్ సంస్కరణల దిశగా అడుగులు వేశారు. భూ రికార్డులను సంపూర్ణంగా సరిచేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చారు. మొదటగా 10 వేల మందికిపైగా గ్రామ సర్వేయర్లను నియమిస్తూ అడుగులు వేశారు. రీసర్వే అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూఏవీలు, డ్రోన్స్, హెలికాప్టర్లు, విమానాల సహాయంతో గ్రామాల మ్యాపింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న మ్యాప్స్తో పోలిస్తే, ఇకపై రైతులకు లభించే వివరాలు, మ్యాప్లు అత్యంత కచ్చితంగా ఉంటాయి. ఇది దేశంలోనే ఒక మైలు రాయి. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ను రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. 17 వేల గ్రామాలకుగాను ఇప్పటికే 7 వేలకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న పథకాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. – 2022 నవంబర్ 23న నరసన్నపేటలో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ (ఈ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు) -
కూటమి ప్రభుత్వం స్కెచ్.. గీతం విద్యా సంస్థలకు భూ నజరానా..?
సాక్షి, విశాఖపట్నం: గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం సంస్థకు కట్టబెట్టే ప్రతిపాదనను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో 15వ అంశంగా చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనపై అధికారిక చర్చ జరగనుంది. గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఇప్పటికే ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. భూ నజరానా రూపంలో ఈ భూములను కట్టబెట్టే ప్రక్రియకు రూపకల్పన చేశారు. కౌన్సిల్ ఆమోదం లభిస్తే ఈ భూములు అధికారికంగా గీతం సంస్థకు బదలాయింపు కానున్నాయి. -
బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు
-
YS Jagan: ఏంటి బాబు ఈ పనికిమాలిన పనులు
-
YS Jagan: నీకు కొడుకు వయసులో ఉన్నా.. నాతో కూడా పోటీ పడలేకపోతున్నావ్
-
సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు బాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్
-
బుద్ధి జ్ఞానం అయిన ఉండాలి... అబద్ధాలు చెప్పడానికి సిగ్గయినా ఉండాలి
-
YS Jagan: మా కార్యకర్తను రాడ్లతో కొట్టి చంపుతారా?
-
బాబు గారి విజన్ కలర్ మార్చడానికి 20 రూపాయల కమీషన్!
-
Survey Stone: 30 లక్షల మంది రైతులకు ఇదొక వరం..
-
Ys Jagan: పట్టాదారు పుస్తకాలపై QR కోడ్ ఆయనే తెచ్చాడంట!
-
రాక్షసుడు... ఎల్లో మీడియా వార్తలపై జగన్ ఫైర్
-
YS Jagan : 5 CM తేడా లేకుండా కొలతలు వేశాం.. ఇది మన విజన్..
-
మా డబ్బులు కోసం వస్తే.. పోలీసులతో కొట్టిస్తావా? నిన్ను వదిలిపెట్టము
-
మరోసారి బాదుడు.. ఫిబ్రవరి1 నుంచి అమలు
-
1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు..
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఆ పని చేయలేకపోగా ప్రజల నడ్డి విరుస్తూ పెను భారాలను మోపడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను మరోసారి భారీగా పెంచి జనం నెత్తిన బండ మోపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్థిరాస్తుల మార్కెట్ విలువలు సవరించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి మెమో జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం ఖరారైంది. ఎంత మేర పెంచుతున్నారనే దానికి సంబంధించిన లాంఛనాలు మాత్రమే మిగిలాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కనీసం 40 నుంచి 50 శాతం మేర పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విలువలు దాదాపుగా ఖరారైనట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆమోదం తీసుకోవడమే మిగిలి ఉంది. దీనిపై డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు తుది కసరత్తు చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం ఇదే పని మీద వారిపై ఒత్తిడి తెస్తోంది. రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో మార్కెట్ విలువల సవరణ ప్రతిపాదనలకు అధికారుల కమిటీలు ఆమోదం తెలపనున్నాయి. వాటి ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్కెట్ విలువలు పెరగనున్నాయి. అదే రోజు నుంచి పెరిగిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ముసుగుకేవలం అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే మార్కెట్ విలువల సవరణ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా దాని వెనుక కుయుక్తి కనబడుతోంది. అర్బన్ ప్రాంతాలు అంటే కేవలం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో మాత్రమే విలువలను సవరించాలి. అధికారికంగా జారీ చేసిన మెమోలో అదే విషయాన్ని పేర్కొన్నా వాస్తవానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో విలువలు సవరిస్తున్నారు. అంటే దాదాపు 90 శాతం ఏరియాపై పెంపు ప్రభావం ఉండనుంది. ప్రభుత్వం చెబుతున్న అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే పెంపు ఉంటే సీఆర్డీఏ పరిధిలో కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విజయవాడ, గుంటూరు, తెనాలి, గుడివాడ లాంటి పట్టణాల్లో మాత్రమే పెంపు ఉండాలి. కానీ సీఆర్డీఏ పరిధి అంతటా మార్కెట్ విలువలు సవరిస్తుండడంతో పెద్దగా ఆదాయం రాని మారుమూల గ్రామీణ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్ విలువలు పెరగనున్నాయి.రాష్ట్రంలో 90 శాతం ప్రాంతంపై ప్రభావం..సీఆర్డీఏ పరిధిలో ఉన్న 27 నియోజకవర్గాల్లో మార్కెట్ విలువలు పెంచుతున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలో విశాఖ నగరంతోపాటు భీమునిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలున్నాయి. ఆ ఏరియా మొత్తం మార్కెట్ విలువలను సవరించనున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరితోపాటు చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు జిల్లా కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో మార్కెట్ విలువలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతంలో, అది కూడా ఆదాయం వచ్చే ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరిస్తుండటం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లో మార్కెట్ విలువలు సవరించినా, సవరించకపోయినా ఒకటే. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాలను వదిలేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంచలేదని ప్రచారం చేసుకోవడానికి దీన్ని వినియోగించుకుంటున్నారు.జగన్ హయాంలో ఒక్కసారి సాధారణ రివిజన్చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2014–19 మధ్య వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక ఒకసారి మాత్రమే సాధారణ రివిజన్ చేసింది. 2020లో మాత్రమే మార్కెట్ విలువలను రాష్ట్రమంతా సవరించింది. 2022లో కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో అక్కడ చాలా నామమాత్రంగా, 2023లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేకంగా విలువల సవరణ జరిగింది. ఆ ఐదేళ్లలో ఒకసారి మాత్రమే రాష్ట్రమంతా సాధారణ రివిజన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి సాధారణ రివిజిన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడంతో స్థిరాసుల క్రయవిక్రయాలపై ప్రభుత్వానికి వచ్చే రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. దాన్ని కవర్ చేసుకునేందుకే వరుసగా రెండో ఏడాది కూడా మార్కెట్ విలువల్ని సవరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
Karumuri :జగన్ పేరు వింటే వాళ్ళ గుండెల్లో హడల్
-
బాబు, లోకేష్ దావోస్ టూర్పై శైలజానాథ్ అదిరిపోయే సెటైర్లు
-
Ys Jagan : సీఎం కుర్చీ కూడా.. ప్రైవేటు ఇచ్చెయ్యవయ్యా!
-
AP: APIIC వద్ద 100 మంది.. పారిశ్రామికవేత్తల ధర్నా
-
చిక్కుల్లో చంద్రబాబు.. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం..
-
చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖలో మహిళలు నిరసన
-
కొత్తవలస-కిరండూల్ లైన్ కోల్పోయిన విశాఖ రైల్వే జోన్!
-
ఆదాయాన్నిచ్చే కొత్త వలస-కిరండోల్ లైన్ లేకుండానే విశాఖ రైల్వేజోన్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
మల్లయ్య కొండలపై మైనింగ్ బాబుల కన్ను
మదనపల్లె: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ప్రఖ్యాత మల్లయ్య కొండలను ఐరన్ ఓర్ పేరుతో కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పథకం వేసింది. వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని దోచుకునేందుకు రహస్యంగా పావులు కదిపింది. ముందుగా కాంపోజిట్ లైసెన్స్కు అత్యంత రహస్యంగా టెండర్లు పిలిచింది. ఆ తర్వాత మైనింగ్కు అనుమతించాలనేది ప్రభుత్వ వ్యూహమని సమాచారం. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచి్చంది. ప్రభుత్వ చర్యపై శివ భక్తుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగనివ్వబోమని గతంలో చెప్పిన చంద్రబాబే ఇప్పుడు మాట తప్పి, ఆ కొండలపై ఉన్న మల్లికార్జున స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సాధుకొండను తొలిచి అమ్ముకొనేందుకు తన అనుంగులకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగిస్తుండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐరన్ ఓర్ దోపిడీకి వ్యూహం తంబళ్లపల్లె సమీపంలో మల్లయ్య కొండల సమూహంలో సాధుకొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండ ఉన్నాయి. ఇవి 6,079 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. మల్లయ్య కొండపై పురాతన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. నిత్యం అనేక మంది భక్తులు కొలిచే ఈ ఆలయం ఉండటం వల్ల ఈ కొండలపై మైనింగ్ చేయడంలేదు. 1893లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ కొండల ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఈ కొండల్లో 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉందని 2006 నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపట్టరాదని ఈ ప్రాంత ప్రజలు గతంలో తీవ్రస్థాయిలో ఉద్యమించారు. గత ప్రభుత్వాలు కూడా భక్తుల మనోభావాలను గౌరవించి ఈ కొండల జోలికి వెళ్లలేదు. దీన్ని లీజు పేరుతో దక్కించుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జియో మైసూర్ సంస్థ పావులు కదిపింది.అప్పట్లో 89 సంస్థలు పోటీ పడినప్పటికీ, జియో మైసూర్ సంస్థకు ఎక్స్ప్లరేషన్ లైసెన్స్ మంజూరయింది. దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. ఆ సంస్థ మొక్కుబడిగా పరిశీలన జరిపి, ఆ తర్వాతి చర్యలు నిలిపివేసింది. 2009 ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రచారానికి వచి్చన చంద్రబాబు మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగనివ్వబోమని, భక్తుల మనోభావాలను గౌరవిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దీన్ని విస్మరించి కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. భక్తుల మనోభావాలను పక్కన పెట్టి వేల కోట్ల రూపాలయ విలువైన ఇనుప ఖనిజాన్ని అనుకూల కంపెనీలకు దోచి పెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది.అనుకూల సంస్థలకు ముందుగా కంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసి..ఆ తర్వాత మైనింగ్ లైసెన్స్ జారీ చేసేలా వ్యూహం పన్నినట్టు అర్థమవుతోంది. దీనికోసం గత ఏడాది నవంబర్ 27న మల్లయ్య కొండల సమూహంలోని సాధుకొండలో 900 హెక్టార్లు, శివపురం పరిధిలోని ఇదే కొండకు చెందిన 626 హెక్టార్లలో (మొత్తం 3,815 ఎకరాలు) ఐరన్ ఓర్ కోసం పరిశోధనలు జరపడం, అంచనాలు వేసుకునేందుకు తొలి విడతలో కాంపోజిట్ లైసెన్స్ పొందేందుకు సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్ల స్వీకరణ జనవరి 16న ముగిసింది. టెండర్ల ఆహా్వనం, బిడ్ల స్వీకరణ మొత్తం అత్యంత గుట్టుగా సాగిపోయింది. బిడ్ల దాఖలు చేసిన సంస్థలు ఏవి అన్న విషయం కూడా రహస్యంగానే ఉంచారు.భక్తుల మనోభావాలు గౌరవించి సౌకర్యాలు కల్పించిన వైఎస్ జగన్మల్లయ్య కొండల్లో వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం ఉన్నప్పటికీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా భక్తుల మనోభావాలకే గౌరవమిచ్చారు. మైనింగ్ కంపెనీలు వీటిపై దృష్టి పెట్టకుండా చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ఆలయానికి జీరో్ణద్ధరణ పనులు చేశారు. భక్తులకు తాగునీరు, రహదారి సహా అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ మైనింగ్కు సిద్ధమవుతోంది. -
ఎన్డీఏలో భాగస్వామి.. కాంగ్రెస్తో రహస్య కాపురం!
సాక్షి, అమరావతి: టీడీపీని దెబ్బ తీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి అలా మాట్లాడుతున్నారంటే హైకమాండ్, రాహుల్ ఆశీస్సులు లేకుండా సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ను ఆపించానని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించటాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్తో, రాహుల్గాందీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయాన్ని రేవంత్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు – రాహుల్ బంధంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి.. టీడీపీని వెనకేసుకురావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి.. టీడీపీ ప్రయోజనాల కోసం తహతహలాడటం, బాధపడటం ఏమిటని విస్తుపోతున్నారు. ‘తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన బీఆర్ఎస్ను, కేసీఆర్ను సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. బీఆర్ఎస్ వాళ్లు గద్దెలు దిగాలి... ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి..’ అని ఖమ్మం జిల్లాలో రేవంత్రెడ్డి సోమవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యల ద్వారా రాహుల్గాంధీ ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్లో ఉంటున్నట్లు నిరూపితమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటునే మరోవైపు కాంగ్రెస్తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారనేందుకు ఇవన్నీ నిదర్శనాలని విశ్లేషిస్తున్నారు. ఇక దేశంలో ఓట్ల చోరీ గురించి పదేపదే ఆందోళనకు దిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీ.. 2024 ఎన్నికల సమయంలో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రి వేళ భారీగా పోలింగ్, భారీగా దొంగ ఓట్లు గురించి ఏనాడూ కనీసం నోరు విప్పిన పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇబ్బంది కాకూడదనే ఈ అంశాన్ని ఆయన ఏనాడూ ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు. బాబు అనైతిక బంధం! రాజకీయ ఊసరవెల్లి నారా చంద్రబాబు మళ్లీ రంగులు మార్చుతున్నారు. ఒక్కోసారి ఒక్కో రంగు మారుస్తూ వచి్చన ఆయన ఈసారి... ఏకకాలంలో విభిన్న రంగులు మారుస్తూ ఊసరవల్లికే అసూయ కలిగిస్తున్నారు. సొంతంగా ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ప్రతి ఎన్నికకు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసగించడం బహిరంగ రహస్యమే. ఈసారి ఆయన తన రాజకీయ అవకాశవాదాన్ని పరాకాష్టకు తీసుకువెళుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అక్రమ సంబంధం నెరుపుతుండటం విస్మయపరుస్తోంది. భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాందీతో తెరచాటు మైత్రి కొనసాగిస్తున్నారని టీడీపీ వర్గాలు సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్తో చంద్రబాబు తెరచాటు రాజకీయ మంత్రాంగంపై బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్తో అక్రమ సంబంధం కోసం చంద్రబాబు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. మరోవైపు కాంగ్రెస్తో అంటకాగుతుండటం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా నిలుస్తోందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 2018లో బీజేపీతో విడిపోయి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ... మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టినా సరే కాంగ్రెస్తో తెరచాటు మైత్రికి ఏమాత్రం భంగం కలగకుండా జాగ్రత్త పడుతోంది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు సహకరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. ఇక రేవంత్రెడ్డి తెలంగాణ సీఎం అయిన తరువాత కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరింత బలపడింది. ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని గ్రహించి అనివార్యంగా 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంతమాత్రాన కాంగ్రెస్తో బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకోలేదు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు ఏపీ ప్రభుత్వంలోనూ బీజేపీ, టీడీపీ భాగస్వాములుగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ శ్రేణులు కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ తెరచాటు మైత్రి తెలంగాణకే పరిమితం కాలేదు. ఢిల్లీలో కూడా టీడీపీ ప్రత్యేక ప్రతినిధులు రాహుల్గాందీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తోపాటు టీడీపీ ఎంపీలు ఎవరూ కూడా కాంగ్రెస్ను విమర్శించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రాజకీయ డ్రామా సాగుతోందన్నది సుస్పష్టం. ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టి..చంద్రబాబు ఇటు బీజేపీతో బహిరంగ మైత్రి... అటు కాంగ్రెస్తో తెరచాటు బంధం కొనసాగిస్తే కొనసాగించుకోవచ్చు. టీడీపీ రాజకీయ వైఖరి ఆ పార్టీ ఇష్టం. కానీ అందుకోసం ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమకు అత్యంత ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు నిలిపివేయడమే అందుకు నిదర్శనం. ఆ విషయాన్ని స్వయంగా రేవంత్రెడ్డి తెలంగాణ శాసనసభలోనే వెల్లడించారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని చంద్రబాబును క్లోజ్డ్ డోర్ మీటింగ్లో కోరా.. ఆయన ఆ పనులను నిలిపివేశారు..’ అని రేవంత్రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఆయన చెప్పింది నిజం కాదని చంద్రబాబు కనీసం ఖండించకపోవడం గమనార్హం. పైగా రాయలసీమ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదంటూ చంద్రబాబు, మంత్రులు దారుణంగా మాట్లాడటం నివ్వెరపరుస్తోంది. తద్వారా రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేశామని చంద్రబాబు ఒప్పుకున్నట్లైంది! -
కేకే లైన్ పాయే!
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రైల్వే జోన్ అభివృద్ధికి పురిట్లోనే సంధి కొట్టింది! ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల సాధనలో మరోసారి చేతులెత్తేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ప్రాజెక్టుల సాధనలో దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టం హామీ కూడా అయిన విశాఖ రైల్వే జోన్ అందుకు తాజా తార్కాణం. కీలకమైన కొత్తవలస– కిరండూల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖ రైల్వే జోన్ను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఒడిశా ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. రాబడికి భారీగా గండి..అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ లేకుండానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్రం ఖరారు చేసింది. ఈమేరకు గతంలో వెలువడిన ప్రకటనను ధృవీకరిస్తూ రైల్వే శాఖ ఈ నెల 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ సహా అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ను ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్లో చేర్చింది. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖ రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడినట్టే. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వైఎస్సార్సీపీ హయాంలోనే రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.వాల్తేర్ విభజన...విశాఖ, రాయగడ డివిజన్లు2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్ రైల్వే డివిజన్ను తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే కేకే లైన్తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఉన్న చోట డివిజన్ కేంద్రం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా జోన్లో చేరిస్తే ఆ రెండు జిల్లాలకు రైల్వే ప్రాజెక్టుల్లో తగిన న్యాయం జరగదని స్పష్టం చేశారు. కేకే లైన్ను కోల్పోతే విశాఖ జోన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగించాలని.. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని పట్టుబట్టింది. వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు కూడా అదే డిమాండ్ చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో పేర్కొంది. అయితే వాల్తేర్ రైల్వే డివిజన్ స్వరూపం ఎలా ఉండబోతుందన్న దానిపై సందిగ్ధత తొలగిపోలేదు.ఒడిశా ఒత్తిడికే తలొగ్గిన కేంద్రం...చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలన్న ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్ను నిర్లక్ష్యం చేసింది. దాంతో ఒడిశా ఒత్తిడికి తలొగ్గుతూ కేంద్ర రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, రాయగడ కేంద్రాలుగా రెండు వేర్వేరు రైల్వే డివిజన్లను ఏర్పాటు చేయనుంది. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస–కిరండోల్ సెక్షన్తోపాటు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించింది. వాటిని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో విశాఖ డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది.మొద్దునిద్రలో బాబు ప్రభుత్వంకీలకమైన కేకే లైన్ విశాఖ డివిజన్కు దూరం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ స్వయం సమృద్ధికి కేకే లైన్ అత్యంత కీలకమని గుర్తు చేస్తున్నారు. కేకే లైన్ను విశాఖపట్నం డివిజన్లోనే కొనసాగించాలని ఉత్తరాంధ్రవాసులు, వివిధ ఉద్యోగ, కార్మిక, వ్యాపార, వాణిజ్య వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొర పెట్టుకుంటున్నా కూటమి ప్రభుత్వం ఏడాదిగా మొద్దు నిద్ర వీడలేదు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కేకే లైన్ రాయగడ డివిజన్లోనే ఉండాలని ఢిల్లీ స్థాయిలో పట్టుబట్టింది. దీంతో కేకే లైన్ను ఒడిశాకే కేటాయిస్తూ రాయగడ డివిజన్ పరిధిలో ఉంటుందని ఈ నెల 6న మరోసారి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో విశాఖ, రాయగడ డివిజన్లు ఇలా...విశాఖపట్నం డివిజన్: పలాస– విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపాడ జంక్షన్– పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్ – సాలూరు, సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్, వదలపూడి– దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ప్లాంట్ – జగ్గయ్యపాలెం సెక్షన్లు రాయగడ డివిజన్: కొత్తవలస– కిరండోల్, బచ్చెలి / కిరండోల్, కూనేరు– తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్– కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముడి – గుణుపూర్ సెక్షన్లుదక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఇదీ...విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఖరారైంది. అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్.. ఇటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను విభజించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తేనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. దక్షిణ కోస్తా రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్ల స్వరూపం ఇలా ఉండనుంది... -
Kannababu : స్కామ్ బాబు.. లులు మాల్ అంటే ఎందుకంత ప్రేమ..?
-
AP: విద్యుత్ కొనుగోలులో నిజమేంటి?
-
రాధాకృష్ణపై బాబు ప్రేమ రూ.15 కోట్ల విలువైన భూమి
-
బాబుగారి విజన్ బ్లాక్ లిస్ట్ లో ఏపీ!
-
పంటల బీమా ఫట్!
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామానికి చెందిన శేఖర్రెడ్డి గత ఖరీఫ్లో 8 ఎకరాల్లో మొక్కజొన్న, 4 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అప్పులు చేసి రూ.4.40 లక్షలు పెట్టుబడి పెట్టారు. అధిక వర్షాలకు తోడు మద్దతు ధరలు లేకపోవడంతో రూ.3 లక్షలకు పైగా నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పత్తికి రూ.6 వేలు బీమా ప్రీమియం చెల్లించినా ప్రభుత్వం తన వాటా డబ్బులు కట్టకపోవడంతో రైతుకు పైసా కూడా పరిహారం అందలేదు. ఇదే రైతు పైసా ప్రీమియం చెల్లించకపోయినా వైఎస్సార్సీపీ హయాంలో రూ.50 వేల వరకు బీమా పరిహారం అందిందని, సీజన్ ముగియకుండానే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయామని ఆక్రోశిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జాప్ల తండాకు చెందిన నారాయణ నాయక్ 8 ఎకరాల్లో వేరుశనగ, కంది, మిరప, ఉల్లి పంటలు సాగు చేశారు. ప్రీమియం భారం కావడంతో ఏ ఒక్క పంటకూ బీమా చేసుకోలేకపోయారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. బీమా పరిహారం కాదు కదా.. కనీసం నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) కూడా అందలేదు. ఉచిత పంటల బీమా పథకం పుణ్యమాని జగన్ ప్రభుత్వంలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా ఐదేళ్లలో రూ.1.50 లక్షల వరకు లబ్ధి పొందానని చెబుతున్నారు. తమ గ్రామంలో 60 శాతం మంది రైతులకు రూ.2 లక్షలకు పైగా ప్రయోజనం పొందారని వెల్లడించారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడంతో సీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతోందని మండిపడుతున్నారు. సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను ఎగరగొట్టిన చంద్రబాబు సర్కారు.. ఏడాది తిరగకుండానే ’స్వచ్ఛంద పంటల బీమా’ పథకానికి సైతం మంగళం పాడేసింది! ప్రీమియం బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు సర్కార్ చేతులెత్తేయడంతో జాతీయ స్థాయిలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు కనీసం స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించేందుకు కూడా అనుమతించడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్ను ఓపెన్ చేసేందుకు సైతం నిరాకరించాయి. దేశవ్యాప్తంగా ఏపీ పరువును మంటగలిపిన చంద్రబాబు సర్కారు రైతులకు పంటల బీమాను పూర్తిగా దూరం చేసింది.ఉచిత పంటల బీమాను అటకెక్కించి..వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు పైసా కూడా భారం పడకుండా రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు సర్కారు అధికార పగ్గాలు చేపట్టగానే అటకెక్కించేసింది. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టేసి.. 2024 రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు బీమా పథకాన్ని తెరపైకి తెచ్చింది. రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన రీతిలో పంటల బీమా అమలు కోసమే ఈ పథకాన్ని తెచ్చామంటూ నమ్మబలికింది. అయితే ప్రీమియం భారం భరించలేక 80 శాతానికి పైగా రైతన్నలు పంటల బీమాకు దూరమైపోయారు. రబీ 2024–25 సీజన్ నుంచి శ్రీకారం చుట్టిన స్వచ్ఛంద బీమా పథకంలో చేరేందుకు ప్రీమియం భారం కారణంగా రైతన్నలు ఆసక్తి చూపకపోవడంతో 48 లక్షల ఎకరాలకు గానూ 9.92 లక్షల ఎకరాలలోసాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ దక్కింది. 40 లక్షల మంది రైతులకుగానూ 7.64 లక్షల మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. ఇక ఖరీఫ్ 2025 సీజన్లో దాదాపు 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా 19.58 లక్షల ఎకరాలకే బీమా కవరేజ్ లభించింది. దాదాపు 50 లక్షల మంది రైతులు పంటలు సాగు చేయగా కేవలం 19.40 లక్షల మంది మాత్రమే పంటలకు బీమా ప్రీమియం చెల్లించగలిగారు.ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో.. ఉచిత పంటల బీమాకు సంబంధించి ఖరీఫ్–2024 సీజన్లో రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం రూ.834.44 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఇక స్వచ్ఛంద బీమా అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వాటా కింద రబీ–2024 సీజన్లో రూ.88.07 కోట్లు. ఖరీఫ్–2025 సీజన్కు రూ.172.60 కోట్లు చెల్లించాలి. అంతేకాదు.. 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి జూన్ 2024 తర్వాత చెల్లించాల్సిన రూ.1,324.33 కోట్ల ప్రీమియం బకాయిలు చంద్రబాబు సర్కార్ ఎగనామం పెట్టింది. ప్రభుత్వ వాటా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం దక్కని దుస్థితి నెలకొంది. రూ.3,500 కోట్ల బీమా పరిహారానికి దూరం.. చంద్రబాబు గద్దెనెక్కింది మొదలు ప్రతి సీజన్లోనూ కరువు కాటకాలు సంభవించడంతో పాటు మద్దతు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరొకవైపు అకాల వర్షాలు, ముంచెత్తిన వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. అదే.. ఉచిత పంటల బీమా పథకం అమలులో ఉండి ఉంటే... సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వాటా కట్టి ఉంటే 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతలకు అంది ఉండేది. ఫసల్ బీమా జాబితాలో ఏపీ ఔట్..! చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం బకాయిలు చెల్లించని కారణంగా ప్రస్తుతం రబీ సీజన్లో కనీసం బిడ్డింగ్లో పాల్గొనేందుకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రాలేదు. ఏపీలో తాము ఫసల్ బీమాలో చేరబోమని తెగేసి చెప్పాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఏపీని పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో ఫసల్ బీమా పరిధిలోకి వచ్చే రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగించాయి. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో కనీసం పోర్టల్ కూడా తెరవలేదు. చంద్రబాబు సర్కారు నిర్వాకాల ఫలితంగా.. రుణాలు పొందని రైతులే కాదు, రుణాలు తీసుకునేవారు కూడా పంటలకు ప్రీమియం చెల్లించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గడిచిన రబీ సీజన్లో తెరపైకి తెచ్చిన స్వచ్ఛంద నమోదు పంటల బీమా పథకం ఏడాది తిరక్కుండానే అటకెక్కినట్లైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను పంటల బీమా పరిధిలోకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది. కనీసం ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో ఇచ్చిందా.. అంటే అదీ లేదు. 19 నెలల్లో కరువు బకాయిలతో సహా రూ.1,100 కోట్లకు పైగా ఎగనామం పెట్టింది.వైఎస్ జగన్ హయాంలో పైసా భారం పడకుండా.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాదు.. ఏ సీజన్కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమచేసి అండగా నిలిచింది. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ – క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పించింది. ఈ – క్రాప్ ప్రామాణికంగా ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించింది. ఏటా సగటున 50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో రెండున్నర కోట్ల మంది రైతులకు బీమా రక్షణ దక్కింది. ప్రభుత్వ వాటాతో పాటు రైతుల తరపున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మందికి కేవలం రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం మాత్రమే అందిస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేసి ఆదుకుంది. ఇక వైపరీత్యాల వేళ పంటలు దెబ్బతిని నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు మరో రూ.3,261.60 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) జమ చేసింది. ఏ సీజన్లో జరిగిన నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని అదే సీజన్ ముగిసేలోగానే జమ చేసి అన్నదాతలకు ప్రతి అడుగులో తోడుగా నిలిచింది.జగన్ ప్రభుత్వంలో రూ.50 వేల నష్టపరిహారం వచ్చింది 2022–23లో సుమారు 10 ఎకరాల్లో మిర్చి, పత్తి సాగు చేశా. అప్పట్లో వచ్చిన తుపాన్తో పంటలు దెబ్బతిని దిగుబడులు రాలేదు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలులో ఉండటంతో అదే సీజన్లో నా అకౌంటులో సుమారు రూ.50 వేలు పంట నష్టపరిహారం అందింది. దీంతో నేను కోలుకుని మళ్లీ పంటలు సాగు చేసుకోగలిగా. – రామిరెడ్డి, రైతు, బొడిచర్ల, మార్కాపురం మండలం,మార్కాపురం జిల్లాబాబు ప్రభుత్వం నిలిపేసింది... 20 ఎకరాల్లో వేసిన మిరప పంట అధిక వర్షాలతో దెబ్బతినగా వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.80 లక్షల బీమా పరిహారం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. రైతులే కట్టుకోవాలన్నారు. ప్రీమియం భారం కావడంతో చెల్లించలేదు. ఖరీఫ్–24లో మిరప పంట దెబ్బతింది.. కానీ పైసా పరిహారం రాలేదు. – గరికిపాటి పున్నారావు, చిననందిపాడు, పర్చూరు మండలం, బాపట్ల జిల్లాఉచిత పంటల బీమాతో భరోసా.. నాకు 2.50 ఎకరాలు పొలం ఉంది. వరి సాగు చేస్తున్నా. రెండేళ్లుగా వరుస వైపరీత్యాల వలన పంట దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో పైసా ప్రీమియం చెల్లించ కుండానే బీమా పరిహారం జమ చేసేవారు. ఉచిత పంటల బీమాతో భరోసాగా ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో రైతులకు బీమా దూరమైంది. ఆర్థిక భారం తట్టుకోలేక నేను ప్రీమియం చెల్లించలేదు. ప్రీమియం చెల్లించిన రైతులకు సైతం రెండేళ్లుగా పరిహారం అందలేదు. ఆర్థికంగా చాలా నష్టపోయా. –కె.పెంచలయ్య, నెల్లిపూడి గ్రామం, వాకాడు మండలం, తిరుపతి జిల్లా జగన్ హయాంలో రూ.2 లక్షల బీమా పరిహారం 2021లో అధిక వర్షాలకు పంట నష్టం జరగడంతో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా పథకం కింద పెద్ద మొత్తంలో పరిహారం అందించారు. ఐదు ఎకరాల్లో మిరప దెబ్బ తినడంతో ఉచిత పంటల బీమా కింద రూ.2 లక్షల పరిహారం జమ అయ్యింది. అంత మొత్తంలో పరిహారం వస్తుందని ఊహించలేదు. దీంతో పాటు అంతో ఇంతో పంట కూడా చేతికివచ్చింది. నాతో పాటు మా మండలంలోని మిరప రైతులకు లక్షలాది రూపాయల పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా ఎత్తేసి ప్రీమియం భారం మోపడంతో రైతులు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు బీమా పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదు. – అశోక్రెడ్డి, రైతు, గడేకల్లు, విడపనకల్లు మండలం, అనంతపురం జిల్లా -
బకాయిలు ఇవ్వరు.. గౌరవ వేతనం పెంచరు!
సాక్షి, అమరావతి: సర్పంచ్ల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ 2024 ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వారికి మొండిచెయ్యి చూపించాయి. కనీసం వేతనాలు కూడా చెల్లించలేదు. ఫలితంగా రూ.కోట్లలో వారి బకాయిలు పేరుకుపోయాయి. ఎంపీటీసీలకు ప్రభుత్వం నెలవారీగా ఇచ్చే గౌరవ వేతనమే రూ.మూడు వేలైతే, ఆ చిన్నమొత్తాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేక చతికిలపడుతోంది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 9,500 ఎంపీటీసీలకు సుమారు రూ.56 కోట్లు బకాయి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో ఎంపీటీసీకి ప్రభుత్వం 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. అలాగే, జెడ్పీటీసీల నెలవారీ గౌరవ వేతనం రూ.6,000ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 660 మందికి దాదాపు రూ.11 కోట్లు బకాయి పడింది. కూటమి నేతల కక్షసాధింపు.. 2021లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం స్థానాలను నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెలుచుకుంది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతన బిల్లులు పెట్టే విషయంలో కూటమి పార్టీల నేతలు కక్షసాధింపు ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పేరుకు బడ్జెట్లో వీరికి నిధుల కేటాయిస్తున్నప్పటికీ వాటి మంజూరు దగ్గరకొచ్చేసరికి మోకాలడ్డుతున్నట్లు ప్రజాప్రతినిధుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఎంపీటీసీల గౌరవ వేతన బిల్లులను ప్రతినెలా ఆయా మండల ఎంపీడీఓలు.. జెడ్పీటీసీలకు సంబం«ధించినవి జెడ్పీ సీఈఓలు సీఎఫ్ఎంఎస్లో నమోదుచేయాల్సి ఉంటుంది. కానీ, మార్చిలోపు ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన నగదు విడుదల చేయకుంటే అవి మురిగిపోతాయి. మళ్లీ కొత్త బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓలపై ఒత్తిడి తెచ్చి బిల్లులు పెట్టనీయకుండా అడ్డుపడుతున్నారు. మరికొన్నిచోట్ల అధికారులు నమోదుచేసిన బిల్లులకు సకాలంలో నిధులు విడుదలకాక ఆరి్థక ఏడాది చివరిలో అవి మురిగిపోయే పరిస్థితి తలెత్తుతుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.గౌరవ వేతనం పెంచి బకాయిలు విడుదల చేయాలి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానాని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ఖజానా ఖాళీ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి చెప్పిన సమాధానమే ఇందుకు నిదర్శనం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం ప్రజాప్రతినిధులకి జీతాలివ్వడానికి కూడా డబ్బుల్లేకుండా చేసింది. ఎన్నికల్లో హామీ ఇచి్చనట్లుగా చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంచడంతో పాటు వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ ,పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు -
బలవంతపు భూసేకరణ ఆపాలి హిందూపురంలో రైతుల ధర్నా
-
AP: దూసుకెళ్లిన TSRTC ఢమాల్ అన్న APSRTC
-
కోడిని కోస్తే తప్పు అన్నారు.. ఏకంగా రికార్డింగ్ డాన్సులే పెట్టారు
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి
-
రికార్డు క్రియేట్ చేసిన సంక్రాంతి లిక్కర్ సేల్.. టాప్ లో తిరుపతి
-
డ్వాక్రా మహిళలకు బాబు మోసం
-
‘పొదుపు’.. కుదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలను హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కారు మోసాలు నాబార్డు నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను రద్దు చేసిన బాబు సర్కారు.. ఆడబిడ్డ నిధి, సున్నా వడ్డీ హామీలను సైతం ఎగరగొట్టడం తెలిసిందే. ఈ మోసాలకు బలై పోయిన స్వయం సహాయక పొదుపు సంఘాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో వైఎస్సార్ సీపీ హయాంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024–25లో పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు ఏకంగా రూ.16,607.57 కోట్లు తగ్గిపోయినట్లు తాజాగా నాబార్డు నివేదిక వెల్లడించింది. తాము అధికారంలోకి వస్తే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ మేరకు రెండేళ్లలో ఒక్క సున్నా వడ్డీ పథకం ద్వారానే సుమారు రూ.7,500 కోట్ల మేర చంద్రబాబు సర్కారు పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉంది. ఇక ఆడబిడ్డ నిధి ద్వారా ఏటా రూ.18 వేలు చొప్పున రాష్టంలో ప్రతి మహిళకూ ఇస్తామన్న హామీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు. అటు బ్యాంకు రుణాలు భారీగా తగ్గిపోవడం, ఇటు సున్నా వడ్డీ అమలు కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు అప్పుల్లో కూరుకుపోతున్నట్లు నాబార్డు నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాలకు రుణాల మంజూరు భారీగా తగ్గిపోయినట్లు నివేదిక వెల్లడించడం గమనార్హం.డ్వాక్రా మహిళలకు బాబు మోసం..‘ఆసరా’తో ఆదుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. సున్నా వడ్డీ పథకాన్ని సైతం నిలిపివేశారు. ఫలితంగా పొదుపు సంఘాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్పీఏలు (నిరర్థక ఆస్తులు)గా మారాయి. దీంతో నాడు చంద్రబాబు హయాంలో ఒక దశలో 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా ముద్రపడ్డాయి. అనంతరం వైఎస్ జగన్ హయాంలో పొదుపు సంఘాలు పునరుజ్జీవమయ్యాయి. నాడు వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు.. 2019 పోలింగ్ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న అప్పు మొత్తం రూ.25,571 కోట్లను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మహిళలకు నేరుగా చెల్లించడంతో పాటు సున్నా వడ్డీ పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. ఒక్క సున్నా వడ్డీ ద్వారానే మహిళలకు దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర చెల్లించి ఆదుకున్నారు. దీంతో పొదుపు మహిళలు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించడంతో నాడు ఎన్పీఏల సంఖ్య కేవలం 0.17 శాతానికి పరిమితమైంది. అప్పట్లో దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ ఉన్న పొదుపు సంఘాలుగా నిలిచాయి. ఇక చేయూత పథకం ద్వారా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చింది. -
ఏపీఎస్ ఆర్టీసీకి దండగ.. టీఎస్ ఆర్టీసీకి పండుగ!
సాక్షి, అమరావతి: పండుగ ముసుగులో ఓవైపు టీడీపీ నేతలు కోడిపందేలు, కేసినోలు, గుండాట, కోత ముక్కలాట ఆడిస్తూ పండుగ నాలుగు రోజులు రూ.వేల కోట్లు దండుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్కు పెద్దపీట వేసింది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తుంటే పట్టించుకోకుండా యాజమాన్యాల నుంచి రూ.వందల కోట్లు దండుకుని అవినీతికి కొత్తదారులు తెరిచింది. ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా అందినకాడికి టీడీపీ నేతలు దోచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది. మరోవైపు సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ముఖం చాటేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడీకి కొమ్ము కాసింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ మాత్రం సంక్రాంతి సీజన్ను సది్వనియోగం చేసుకోవడం గమనార్హం. టీఎస్ ఆర్టీసీ 6 వేల సర్విసులు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే బయలుదేరుతారు. అందువల్లే హైదరాబాద్ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు బస్సు సర్విసులు నడపటంపై నిర్వాహకులు దృష్టి సారిస్తారు. ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విస్మయపరిచింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 2 వేలకుపైగా స్పెషల్ బస్ సర్విసులను తిప్పిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది మాత్రం కేవలం 200 సర్విసులకే పరిమితం చేసినట్లు ప్రకటించడం గమనార్హం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కుమ్మక్కు కావడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్లో టికెట్ రేట్లను ఏకంగా ఐదారు రెట్లు అదనంగా పెంచేసి ఏకంగా రూ.2 వేల కోట్ల దోపిడీకి ప్రైవేటు ట్రావెల్స్ పన్నాగం పన్నింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేత ఒకరు వత్తాసు పలికారు.ఆయనకు భారీగా ముడుపులు ముట్టజెప్పడమే దీనికి కారణం. దాంతో ఈ ఏడాది ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులకు భారీగా కోత పెట్టింది. కేవలం 200 స్పెషల్ సర్వీసులతో చేతులు దులుపుకొంది. దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో ఏటా మాదిరిగానే హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు సర్విసులను నిర్వహిస్తామని తూతూమంత్రంగా ప్రకటన చేసి పక్కకు తప్పుకుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు ఎన్ని సర్విసులు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలికింది. మరోవైపు సంక్రాంతి సీజన్ను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుంటూ టీఎస్ ఆర్టీసీ ఏపీకి పెద్ద ఎత్తున బస్సు సర్విసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు టీఎస్ ఆర్టీసీ ఏకంగా 6,430 సంక్రాంతి స్పెషల్ సర్విసులను తిప్పడం గమనార్హం. -
తీరని యూరియా కష్టాలు
ఉదయగిరి/తవణంపల్లె: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తొలగేటట్లు లేవు. అదునుకు ఎరువులు అందక రాష్ట్రంలోని రైతన్నలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం తిరుమాపురం పంచాయతీ గుడినరవ తదితర గ్రామాల రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నామంటూ శనివారం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారం రోజులుగా యూరియా కోసం తిప్పలు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరిలోని కొట్టాయపల్లి సొసైటీ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఆందోళన చేశారు. అలాగే, చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో శనివారం యూరియా కోసం రైతులు వేకువజాము నుంచే నిరీక్షించారు. మండలంలోని పుణ్యసముద్రంలో శనివారం యూరియా కోసం క్యూలో పడిగాపులు కాశారు. చివరికి అధికారులు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్కార్డులను తీసుకొని రైతుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం పంపిణీ చేస్తామని చెప్పడంతో.. మళ్లీ సోమవారం క్యూ కట్టాల్సిందేనా అంటూ రైతులు నిరాశతో వెనుదిరిగారు. -
బాబు యూ టర్న్ ‘రీ సర్వే’పై దొంగాట
సాక్షి, అమరావతి: తనకు సంబంధం లేని వాటిని కూడా తానే చేసినట్లు నిర్భీతిగా, నిస్సిగ్గుగా చెప్పుకునే చంద్రబాబు.. జగన్ హయాంలో ప్రారంభమైన భూముల రీ సర్వే క్రెడిట్ను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రీ సర్వేపై అదే పనిగా దుష్ప్రచారం చేసి, దానివల్ల రైతుల భూములు కబ్జా అవుతాయని చెప్పిన నోటితోనే ఇప్పుడు దాన్ని తానే ప్రారంభించినట్లు చెప్పుకుంటూ బహిరంగంగా మరో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. లక్షల ఎకరాలను 22–ఎ జాబితాలో పెట్టిన బాబు.. ఇప్పుడు వేల ఎకరాలను 22–ఎ జాబితా నుంచి తొలగించినట్లు బరితెగించి ప్రచారం చేసుకోవడం గమనార్హం. బ్రిటీషర్ల తర్వాత ఏ రాష్ట్రంలో, ఏ పాలకుడూ తలపెట్టని అతి పెద్ద భూముల సర్వేను గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంత మంది రెవెన్యూ సిబ్బందిని నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రమంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా, సుమారు 6,800 గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికిపైగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దులో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చి వేసే దీనిపై చంద్రబాబు లేనిపోని నిందలు, అభాండాలు వేశారు.సర్వే రాళ్లపై ముద్రించిన లోగోపై తప్పుడు ప్రచారంసర్వే చేసి, హద్దులు నిర్ణయించి, ఆ హద్దులో ప్రభుత్వమే రాళ్లు పాతి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తే దానిపై ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేశారు. ఆ రాళ్లపై జగన్ ఫొటో ఉందని చంద్రబాబు బురదజల్లారు. నిజానికి ఆ రాళ్ల మీద ఉన్న ఫొటో నవరత్నాల వాటర్ మార్క్ లోగో. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉన్నాయి. ఆ నవరత్నాల ఫొటోను 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించారు. అధికారంలోకి వచ్చాక సీఎం కార్యాలయం నుంచి ప్రతి పంచాయతీ కార్యాలయంలోనూ ఆ ఫొటో పెట్టి దాని ప్రకారం పరిపాలన నడిపిన చరిత్ర జగన్ది. అయితే మేనిఫెస్టోలో ఉన్న ఆ ఫొటోపైనే చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. నవరత్నాల కేంద్రంగానే మొత్తం పరిపాలన సాగించి, ఇచ్చిన ప్రతిని హామీని అమలు చేసి చూపిస్తే దాన్ని తప్పు పట్టిన వ్యక్తి చంద్రబాబు. అప్పుడు అడ్డుకుని.. ఇప్పుడు తనదేనని..రీ సర్వేను అడ్డుకుని, దానిపై దుష్ప్రచారం చేసి, మీ భూములు పోతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా దాన్ని తన ఖాతాలో వేసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను తెచ్చిన సంస్కరణల వల్లే రీ సర్వే జరుగుతోందని, దానికి రూ.400 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ రీ సర్వేకు అంకురార్పణ చేసి నిర్వహించారు. సర్వే పూర్తి చేసే క్రమంలో 14 లక్షల పట్టా సబ్ డివిజన్లు, దాదాపు 10 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 3 లక్షలకు పైగా రైతుల పేర్లు తొలిసారి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం వెళితే పట్టే సమయం, ఏర్పడే తిప్పలు ఎన్నో తెలిసిందే. రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. జగన్ హయాంలోనే క్యూఆర్ కోడ్.. జియో హద్దులు క్యూ ఆర్ కోడ్ ముద్రించడం ఒక్కటే కాదు.. సర్వే పూర్తయిన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం అక్షాంశాలు, రేఖాంశాలుతో గత జగన్ ప్రభుత్వం జారీ చేసింది. అంటే శాటిలైట్ హద్దులన్నమాట. వాటిని మార్చడం సాధ్యం కాదు. క్షేత్ర స్థాయిలో భూమి హద్దులు మారినా శాటిలైట్ హద్దులు మాత్రం అలాగే ఉంటాయి. పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్, జియో హద్దులు ఇవ్వడం జగన్ హయాంలో వచ్చిన అతి పెద్ద భూ సంస్కరణల్లో ఒకటి. అసలు ఇవేమీ వద్దని.. వాటి ద్వారా రైతుల నుంచి భూములు లాక్కుంటారని అడ్డగోలు దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా అవన్నీ తాను తెచ్చినవేనని డప్పు కొట్టుకోవడం చూసి రెవెన్యూ యంత్రాంగం ఆశ్చర్యపోతోంది. జగన్ చేసిందాన్నే మళ్లీ చేస్తూ తనదిగా ప్రచారంరీ సర్వేలో ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ కూడా ఇచ్చారు. వాటన్నింటితో కలిపి ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజకీయ ముద్ర వేసి అధికారంలోకి వచ్చాక బాబు ఏకపక్షంగా రద్దు చేశారు. ఏడాదిన్నర తర్వాత తప్పుల తడకలుగా కొత్త పాస్పుస్తకాలు ముద్రించి గతంలో జగన్ హయాంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్, జియో కోఆర్డినేట్స్నే అందులో పెట్టి అవి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి రీ సర్వే తర్వాత జగన్ ప్రభుత్వం ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నంబర్) కూడా ఇచ్చింది. వీటన్నింటి వల్ల రికార్డుల ఆధునికీకరణ జరిగి వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేని వ్యవస్థ సృష్టించి భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు, భూ అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ తెచ్చిన ఈ విధానంపై చంద్రబాబు జగమంత విషం కక్కారు. కానీ ఇప్పుడు తాను గతంలో చేసిన దుష్ప్రచారాన్ని మరచిపోయి అది ఘనతేనని చెప్పుకుంటున్నారు. దీన్ని చూసి ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదని రెవిన్యూ విభాగం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో రీ సర్వే రీ సర్వే కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యాధునిక సర్వే టెక్నాలజీని వినియోగించింది. 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో సర్వే ప్రారంభించింది. అప్పటి నుంచి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్), జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వే చేశారు. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని డ్రోన్ల ద్వారా సర్వే (కొలిచారు) చేశారు. భూ హక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడమే లక్ష్యంగా రీ సర్వే నిర్వహించారు. అభ్యంతరాలు, వినతులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించి 40 వేల వివాదాలను పరిష్కరించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇక్కడ జరుగుతున్న రీ సర్వే మోడల్పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న రీ సర్వే అద్భుతమని కితాబిచ్చింది. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. నిలిపివేసిన చంద్రబాబునాటి ప్రభుత్వంలో సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే క్రమంలో దాన్ని నిలిపివేశారు.ఎన్నికలప్పుడేమో ఇలా విషప్రచారం.. సర్వే రాళ్లపై ఆ ఫొటో ఎందుకంటే..రీ సర్వే చేయక ముందు, చేసిన తర్వాత ఉన్న తేడా స్పష్టంగా తెలియడం కోసమే రాళ్లపై ఆ నవరత్నాల లోగోను ముద్రించారు. కేవలం సరిహద్దులు నిర్ణయించి వదిలేస్తే మళ్లీ గొడవలు వస్తాయని, ఎవరికి వారు రాళ్లు పాతుకోవాలంటే కష్టమవుతుందని, ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వమే రాళ్లు పాతించింది. ఆ రాళ్లపై నవరత్నాల లోగో ముద్రిస్తే అందులో జగన్ ఫొటో ఉందని తప్పుడు ప్రచారం చేశారు. ఆ ఫొటో ఉండడం వల్లæ తప్పేంటి? ఇప్పుడు పింఛన్ల ఫొటోల్లో చంద్రబాబు ఫొటో ఉండడం లేదా? అయిన దాంట్లో, కాని దాంట్లో తన పాంప్లెట్లపై పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్న చంద్రబాబు.. చరిత్రలో తొలిసారి సాహసోపేతంగా రీ సర్వే చేసి, హద్దు రాళ్లపై లోగోను ముద్రించడం తప్పెలా అవుతుందో చంద్రబాబుకే తెలియాలి.రీ సర్వేలో ఏపీ నంబర్ వన్ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని కితాబుఇటీవల టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూముల సర్వేలో ఏపీ దేశంలో నెంబర్ వన్గా నిలిచిందని చెప్పారు. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేదు. సర్వే చేయకుండానే రాష్ట్రం ఎలా నంబర్ వన్గా నిలిచింది? జగన్ హయాంలో ఒక యజ్ఞంలా జరిగిన రీ సర్వే వల్లే ఏపీ అందులో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది. రోల్ మోడల్గా నిలిచిన కార్యక్రమంపై అడ్డగోలుగా అభాండాలు వేసిన చంద్రబాబు ఇప్పుడు రంగు మార్చి అది తన గొప్పేనని చెప్పుకోవడాన్ని ఏమనాలి? -
ఈ–పంటకు నిర్లక్ష్యం చీడ!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా, విజయవంతంగా అమలైన ‘ఈ–క్రాప్’ నమోదును ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దీని నమోదు విషయంలో సర్కారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ, ఈ–పంటలో నమోదైంది కేవలం 11.35 లక్షల ఎకరాలే.ఈకేవైసీ అయితే ఒక్క రైతు నుంచి కూడా నమోదుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. మరోవైపు.. ఈ సీజన్ నుంచి రైతులు సాగుచేసిన పంటలను రైతులే నమోదు చేసుకోవాలంటూ చెప్పడం వల్ల ఈ–క్రాప్ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.లక్ష్యానికి దూరంగా ఈ–పంట నమోదు..వాస్తవానికి.. ఏటా రబీ సీజన్లో నవంబరు మొదటి వారంలో ఈ–క్రాప్ నమోదు ప్రారంభించి జనవరి 31కల్లా పూర్తిచేసేవారు. కానీ, ఈ ఏడాది డిòసెంబరు 17న శ్రీకారం చుట్టారు. డిజిటల్ క్రాప్ సర్వే ప్రకారం నూరు శాతం ల్యాండ్ పార్శిల్స్ నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏడు శాతానికి మించి నమోదు చేయలేకపోయారు. 11.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 47వేల ఎకరాల్లో ఉద్యాన, 670 ఎకరాల్లో పట్టు, 5,962 ఎకరాల్లో సామాజిక అటవీ పంటలు నమోదు చేశారు. అలాగే, ఈ సీజన్లో దాదాపు 45 లక్షల మంది రైతులు రబీ పంటలు సాగుచేస్తుండగా, ఇప్పటివరకు కేవలం 5.57 లక్షల మంది సాగుచేసిన పంటల వివరాలను మాత్రమే నమోదుచేశారు. ఇక డిజిటల్ క్రాప్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.93 కోట్ల ల్యాండ్ పార్సిల్స్ ఉండగా, ఇప్పటివరకు కేవలం 11 లక్షలు మాత్రమే నమోదుచేశారు. నిర్వీర్యమే లక్ష్యంగా స్వీయ నమోదు..ప్రస్తుత సీజన్ నుంచి తాము సాగుచేసిన పంట వివరాలను భౌగోళిక సరిహద్దులతో సహా నేరుగా రైతులే ఈ–పంట యాప్లో స్వయంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి.. రైతులు పొలంలో ఉన్న సమయంలో ఆర్బీకే సిబ్బంది వెళ్లి రైతుతో పాటు పంట ఫొటోలను తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. అయితే, తాము వెళ్లినప్పుడు వారు ఉండడంలేదనే సాకుతో ఈ–పంట నమోదు, ఫొటోల అప్లోడ్ బాధ్యతను రైతులకే అప్పగించారు. అలాగే, గతంలో సామాజిక తనిఖీ కింద ఆర్బీకేల్లో ప్రదర్శించిన తర్వాత, గ్రామసభల ద్వారా అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించే వారు.అలాంటిది ఇక నుంచి www.karrhak.ap.gov.in/ ecsop, www.africuture.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి తమ ఆధార్ నెంబర్తో ఈ–పంట నమోదు వివరాలను రైతులే పరిశీలించుకోవడమే కాక.. స్వీయ ధృవీకరణతో పాటు తప్పొప్పులపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు. అయితే, ఎంతమంది రైతులకు అండ్రాయిడ్ మొబైల్ ఫోన్లున్నాయి? ఎంతమంది రైతులకు స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన ఉందనేది ఆలోచించకుండా ఈ బాధ్యతను రైతులకు అప్పగించడంపట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.ఈ–క్రాప్ స్ఫూర్తిని దెబ్బతీసేందుకే..ఇక రైతులు తాము ఎంత విస్తీర్ణంలో ఏ పంటసాగు చేయబోతున్నామో ముందుగా సమీప ఆర్బీకే సిబ్బందికి తెలియజేయాలి. వెబ్ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా సీజన్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఏ రైతు ఏయే పంటలు ఏ పద్ధతుల్లో సాగుచేస్తున్నారో జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు క్షేత్రస్థాయి పరిశీలనలో నమోదు చేయాలి. అలాగే..⇒ రైతును పంట పొలం వద్ద నిలబెట్టి ఫొటోలు తీసి జియో కోఆర్డినేట్స్తో అప్లోడ్ చేయాలి. ⇒ ఆ తర్వాత ఈ వివరాలను ఆర్బీకే, రెవెన్యూ అధికారులు ధృవీకరించి రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకున్నాక మొబైల్ ఫోన్లకు మెస్సేజ్ పంపాలి. ⇒ ర్యాండమ్గా 5–10 శాతం విస్తీర్ణంలో సాగైన పంట వివరాలను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరించిన తర్వాత రైతులకు భౌతిక రశీదులివ్వాలి. ⇒ ముసాయిదా జాబితాలను తొలుత సామాజిక తనిఖీ కింద ఆర్బీకేల్లో ప్రదర్శించి గ్రామసభల ద్వారా రైతుల అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించాలి. ⇒ ఇలా పక్కాగా ఈ–పంట నమోదు జరిగితే ఏదైనా విపత్తు వేళ ఎంత విస్తీర్ణంలో ఏ పంట దెబ్బతిన్నదో క్షణాల్లో గుర్తించొచ్చు. నేరుగా సదరు రైతుకు నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ)తో పాటు పంటల బీమా పరిహారం అందించొచ్చు. పండించిన పంట ఉత్పత్తులను దళారీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. అలాగే, సాగువేళ అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి ఉత్పాదకాలను అందించే అవకాశం ఉంటుంది. ఏపీలో అమలుచేసిన ఈ–క్రాప్ స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్రం డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్)కు శ్రీకారం చుట్టింది. డీసీఎస్ నిబంధనల ప్రకారం ప్రతీ ల్యాండ్ పార్సిల్ను విధిగా నమోదుచేయాలనే నిబంధన ఉంది. ఇది భారం కావడంతో ఈ–పంట నమోదు బాధ్యత నుంచే ప్రభుత్వం తప్పించుకోవాలన్న ఎత్తుగడ వేస్తున్నట్లు కన్పిస్తోంది.ఈ–పంట నమోదును నిర్వీర్యం చేశారుఅత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం చేపట్టిన ఈ–పంట నమోదు ప్రక్రియను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వాస్తవ సాగుదారులైన కౌలుదారుల వివరాలను నమోదు చేయడం లేదు. భూ యజమానుల పేరిట నమోదు చేస్తున్నారు. తాజాగా.. స్వచ్ఛందంగా రైతులకే స్వీయ నమోదుకు అవకాశం ఇవ్వడంవల్ల అవకతవకలు చోటుచేసుకునే అవకాశముంది. – ఎం. హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!
-
TDP Leader: సొంత నేతలపైనే దాడులు
-
CPI Narayana: రైతుల నోట్లో మట్టికొట్టి ఇది ప్రభుత్వ హత్యే..
-
మూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్లు దోచుకున్న కూటమి నేతలు
-
Vidadala Rajini: దళితులను బతకనివ్వరా? అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది
-
బాబు, నీ గుండా ప్రభుత్వానికి ఎవడూ భయపడడు YSRCP నేతల మాస్ వార్నింగ్
-
Tirupati : బాబు సీఎం అయినా ప్రతిసారి దళితులే బలవుతున్నారు


