breaking news
Chandrababu Naidu government
-
మందుల్లేవు.. మాస్కుల్లేవు..
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతోపాటు మరణాలూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేసుల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యం పట్ల అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, వైద్య పరీక్షల నిర్వహణ, బాధితులకు మెరుగైన వైద్య సేవల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆస్పత్రుల్లో కనీస సన్నద్ధత లేకుండాపోయింది. గత నెలలో వైఎస్సార్ కడప జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదు, బా«ధితుల మృతి ఘటనలను వైద్య శాఖ తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాన్ని మీడియా బటయపెట్టడంతో ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పరీక్ష కేంద్రాలెక్కడ? దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానిత లక్షణాలున్న వృద్ధులు, వివిధ జబ్బుల బాధితులు వైద్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని దురదృష్టకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎక్కడా కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. బాధితులు తీవ్ర అనారోగ్యంపాలై ఐసీయూ, వెంటిలేటర్పై చికిత్స చేయాల్సిన సందర్భాల్లో మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే కోవిడ్, ఇతర పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అప్పటికే బాధితుల ఆరోగ్యం విషమించి వైరస్ కబళిస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోగా, రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు బయటకు రాకుండా కప్పెట్టింది.అయితే, కరోనా మరణాలు, వైరస్ వ్యాప్తి మీడియాలో రావడంతో హడావుడిగా వార్డులు, ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశామని వైద్య శాఖ ప్రకటించింది. అదీ పెద్దాస్పత్రుల్లో మాత్రమే. అంతకు మించి మరే సన్నద్ధతా లేదు. వైరస్ వ్యాపించకుండా కనీస చర్యలు లేవు. కోవిడ్ రోగులకు చికిత్సలో అవసరమయ్యే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కనీస నిల్వలు కూడా ఆస్పత్రుల్లో లేవని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గతంలో కొన్న ఇంజెక్షన్లకు గతేడాది డిసెంబర్తో కాలం చెల్లినట్టు సమాచారం. వైరస్ సోకి తీవ్ర ఇన్ఫెక్షన్కు గురైన వారికి ప్రాణాధారమైన ఈ ఇంజెక్షన్ కనీస నిల్వలను అందుబాటులో ఉంచాలనే సోయ, ముందస్తు జాగ్రత్త బాబు సర్కార్కు లేకుండా పోయింది. మరోవైపు వైరస్ బాధితులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బందికి ఎన్ 95 మాసు్కలు కూడా ఆస్పత్రుల్లో కనీస సంఖ్యలో లేవని సూపరింటెండెంట్లు ఫిర్యాదు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి భయానికి తోడు, సీజనల్ వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. కరోనా బాధితులతో పాటు, సీజనల్ వ్యాధుల బాధితులకు చికిత్సల్లో అవసరమైన అత్యవసర మందులకూ ఆస్పత్రుల్లో తీవ్ర కటకట నెలకొంది. కరోనా కాలంలోనూ మరణాలు రేటు ఇంత లేదు గత నెల 26 నుంచి రాష్ట్రంలో దాదాపు 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన నలుగురు బాధితులు మరణించారు. అంటే 20 శాతం మరణాల రేటు నమోదైంది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఇంత భారీ మొత్తంలో మరణాల రేటు లేదని వైద్య శాఖ లెక్కలే చెబుతున్నాయి. ఒక్క వైఎస్సార్ కడప జిల్లాలోనే ఆరు పాటివ్ కేసులు నమోదవగా ముగ్గురు మరణించారు. కాకినాడ జిల్లాలో రెండు కేసులు రాగా ఒకరు ప్రాణాలు విడిచారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, బాపట్ల, నెల్లూరు ఇలా పలు జిల్లాల్లో అధికారికంగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏడుగురు ఆస్పత్రిలో, నలుగురు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. -
డాక్యుమెంట్ రైటర్ల సమ్మె.. స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది. డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలన్నింటినీ నిలిపివేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో నిత్యం కిటకిటలాడే కార్యాలయాలు జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. పలుచోట్ల డాక్యుమెంట్ల రైటర్లు తమ కార్యాలయాల వద్దే నల్ల రిబ్లన్లతో నిరసన తెలిపారు. ఈ సమ్మె కారణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగేవి. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఆదాయం కూడా రూ.4 కోట్ల కంటే తక్కువ వచ్చినట్లు సమాచారం. ఈ 500 రిజిస్ట్రేషన్లలో కూడా ఎక్కువగా రెండు, మూడు రోజుల క్రితం మొదలుపెట్టిన ప్రక్రియకి సంబంధించినవిగా చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాధారణ ప్రజానీకంలోనూ రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలకు ఈ వ్యవస్థను అప్పగిస్తే రాష్ట్రంలోని ఆస్తుల డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లి భూముల కబ్జాలు, మోసాలు విచ్చలవిడిగా జరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా సరే సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరణను కొనసాగిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బోధనాస్పత్రుల నిర్వహణకు నిధులు లేవు
సాక్షి, అమరావతి: ఒక్క రోజు యోగా ఈవెంట్ కోసం గతేడాది రూ. 130 కోట్లు.. ఈ ఏడాది రూ.10 కోట్లు.. మొత్తం రెండేళ్లలో రూ.140 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. ఎమ్మెల్యేల ఆటపాటలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. విజన్ డాక్యుమెంట్ విడుదల వంటి ఈవెంట్లకు భారీ నిధుల వెచ్చింపు. స్పెషల్ ఫ్లైట్స్లో ప్రభుత్వ పెద్దల తిరుగుళ్లు.. హంగులు.. ఆడంబరాలు.. ఆర్భాటాలు.. ప్రచారాల కోసం ఖజానా నుంచి నేరుగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. అయితే పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వారి ఆరోగ్య రక్షణ విషయానికి వచ్చే సరికి మాత్రం ప్రభుత్వం దగ్గర నిధుల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపునకు అప్పుల బాట పట్టిన బాబు సర్కార్ తాజాగా బోధనాస్పత్రుల నిర్వహణ, చిన్న చిన్న మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. 2014–19లోనూ ఇంతే..2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆస్పత్రుల నిర్వహణ కోసం రూ.34.07 కోట్లు, అత్యవసరంగా చిన్న చిన్న మరమ్మతులు చేపట్టడానికి రూ.16.92 కోట్లు చొప్పున దాదాపు రూ.51 కోట్ల బడ్జెట్ మంజూరు చేయాలని వైద్య శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తప్పించుకుంది. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ, ఆరోగ్యశ్రీ నిధుల నుంచి నిర్వహణ, మరమ్మతుల ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలని సలహా ఇచ్చింది.2014–19 మధ్య ఇదే తరహాలో నిర్వహణ, మరమ్మతుల బడ్జెట్కు చంద్రబాబు కోత పెట్టారు. దీంతో ఆసుపత్రుల్లో డ్రైనేజీ లీకేజీలు, కరెంట్ వైరింగ్ సమస్యలు, వైద్య పరికరాల స్వల్ప మరమ్మతులు, పారిశుధ్య నిర్వహణ వంటి నిత్యావసర పనులకు కూడా నిధుల్లేక అప్పట్లో ఆస్పత్రులు అధ్వాన్నంగా మారిపోయాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించడం మొదలు పెట్టారు. చంద్రబాబు తిరిగి గద్దెనెక్కగానే మళ్లీ బడ్జెట్ను ఎత్తేశారు.సూపరింటెండెంట్లు గగ్గోలుబోధనాస్పత్రుల నిర్వహణ,మరమ్మతులకు ఆరోగ్యశ్రీ నిధులు వాడుకోమని ప్రభుత్వం సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడంతో సూపరింటెండెంట్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బోధనాస్పత్రులకు దాదాపు రూ.700 కోట్ల ఆరోగ్యశ్రీ బిలు్లలు బకాయి పడినట్టు సమాచారం. బిల్లులు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల కోసం ఇంప్లాంట్స్, మందులు, సర్జికల్స్ చేసిన కొనుగోళ్ల బిల్లులే ఆస్పత్రుల వారీగా పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో మందులు, ఇంప్లాంట్స్ సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులు ఎత్తేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి నిర్వహణ, మరమ్మతులకు కూడా నిధులివ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటే రోగులకు కనీస సౌకర్యాల కల్పన ఎలా సాధ్యమవుతుందని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది. -
కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విత్తనాలు నేలలోనే నిద్రపోతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. మెట్ట, మాగాణి అని తేడా లేదు. వర్షాధారం..బోర్ల కింద వ్యత్యాసం లేదు. ఎటు చూసినా భీతావాహ వాతావరణమే కన్పిస్తోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులను కరువు నుంచి ఎలా బయట పడేయాలన్న ఆలోచన చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికొదిలేసింది. రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం, కరువు సహాయక చర్యలకు ఉపక్రమించడం వదిలేసింది. ఇలాంటి సమయంలో రైతుకిచ్చే సలహాలు, సూచనలను మార్చి కొత్త సలహాలివ్వాలని యూనివర్సిటీ వీసీలను ఆదేశిస్తూ సోమవారం చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి కష్ట కాలంలో ప్రభుత్వం స్పందించే విధానం ఇదేనా అని వ్యవసాయ నిపుణులు కూడా విస్తుపోతున్నారు. అత్యంత తీవ్రమైన కరువు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్లో 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో 62 శాతం లోటు ఉంటుందని తొలుత అంచనావేశారు. కానీ 15వ తేదీ నాటికే ఏకంగా 82శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో –60 నుంచి –99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో –20 నుంచి–50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షాభావం కాదు. గత రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితి రానుందని నిపుణులంటున్నారు. కరువు ఉపశమన చర్యలెక్కడ? ఇలాంటి విపత్తు వేళ ప్రభుత్వాలు సాధారణంగా కరువు ఉపశమన చర్యలు ప్రారంభిస్తాయి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తాయి. కంటిజెన్సీ ప్లాన్ కింద ఉచితంగా విత్తనాలు, ఇతర సాగు ఉత్పాదకాలను పంపిణీ చేస్తాయి. ఇన్పుట్ సబ్సిడీలు ప్రకటిస్తాయి. సాధ్యమైనంత త్వరగా పంటల బీమా పరిహారాన్ని అందించే ఏర్పాటు చేస్తాయి. రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానిస్తాయి. పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. తాగునీటి చర్యలు చేపడతాయి. కానీ వీటన్నిటినీ వదిలేసి కరువు ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనల్లో మార్పు తీసుకు రావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోందని వ్యవసాయ నిపుణులంటున్నారు. సాయం వదిలేసి ఉచిత సలహాలెందుకు? వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం కరువు తీవ్రతను అంచనా వేస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో సలహాలు సూచనలు ఇవ్వడం పరిపాటి. ఇందుకోసం పంటల వారీగా సీజన్కు ముందుగానే ప్రత్యేక బులిటెన్లు జారీ చేస్తారు. అయితే ఇవన్నీ చాలా సాధారణంగా ఉన్నాయని పేర్కొంటూ విధిగా వాటికయ్యే ఖర్చు–లాభాల లెక్కలను జతచేయాలంటూ యూనివర్శిటీ వీసీలను ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 50 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్ 2026 సీజన్ కోసం మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను పునఃసమీక్షించాలంటూ జీవో ఇచ్చింది.జోన్ల వారీగా, నీటి లభ్యత వారీగా, భూ స్వామ్యత/భూమి పరిమాణం వారీగా కొత్త సలహాలు, సూచనలతో పాటు ఖర్చులు, లాభనష్టాలతో కూడినసమగ్ర నివేదిక పదిరోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ఈ జీవోలో ఆదేశించారు. లాభసాటి కాకపోతే ప్రత్యామ్నాయ సాగు పద్దతుల జోలికి పోవద్దంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఈజీవో చూస్తుంటే కరువు పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర ప్రణాళిక కంటే, కేవలం సలహాలు, సూచనలు ఇస్తూ కాలయాపన చేయాలన్న ఆలోచన కన్పిస్తోందని రైతులు మండిపడుతున్నారు.ఇలాంటి కరువు వేళ ఒకటి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పంటలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదంతా రైతులకు భారమే. ఇలాంటి విపత్తు వేళ ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప లాభసాటి కాకపోతే మానేయండంటూ సలహాలివ్వడమేమిటని రైతులు మండిపడుతున్నారు. -
ఎర్రబుక్కు దారిలో... దిగజారిన ఖాకీ
సాక్షి, అమరావతి: పనితీరు నాసిరకం... పరిపాలనా సంస్కరణలు చేతకాదు.. దర్యాప్తు ప్రమాణాలు దారుణం.. సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు.. ఇతర శాఖలతో సమన్వయం సున్నా.. ఇవన్నీ ఏమనుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు, మాణిక్యాలు... తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసుల పనితీరును స్పష్టంగా నిర్ధారించింది. అన్ని విషయాల్లోనూ తీసికట్టు అని తేల్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు.. 26వ స్థానానికి దిగజారినట్లు కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడించింది. కానీ రెడ్బుక్ అమలులో ఏపీ పోలీసులు అద్భుతమైన నైపుణ్యం సంపాదించారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, అమాయకులపైనా, సోషల్ మీడియా కార్యకర్తలపైనా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోకపోవడం.. ఇలాంటి వాటిలో ఆరితేరిపోయారు.. ఈ విషయాల్లో పాయింట్లు ఇస్తే.. దేశంలో నెంబర్ ఒన్గా నిలిచేవారేమో..! దిగజారిన ఏపీ పోలీసు శాఖ ర్యాంకు ప్రజలకు భద్రత, సత్వర న్యాయం అందించడంలో ఏపీ పోలీసు శాఖ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పోలీసు సంస్కరణలు, నేర న్యాయ చట్టాల అమలులో దేశంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష సాధింపు కుట్రలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న పోలీసు శాఖ సామాన్యులకు న్యాయం అందించాలన్న తన విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా విస్మరించింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీసు శాఖల పనితీరుపై కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ 26వ స్థానంలో నిలవడమే అందుకు నిదర్శనం. ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మెరుగైన పనితీరుతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. పోలీసు సంస్కరణలలో భాగంగా ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎన్ఎస్), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టాల అమలుపై కేంద్ర హోమ్ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. నాలుగు విభాగాలుగా దేశంలో పోలీసుల పనితీరును మదించింది. పరిపాలన సంస్కరణలకు 20 శాతం, నిర్వహణపరమైన సమర్థతకు 45 శాతం, సమాచార – సాంకేతికత అమలు (ఐసీటీ అప్లికేషన్స్)కు 25 శాతం, పోలీసు – వైద్య – ఆరోగ్య – న్యాయ శాఖల మధ్య సమన్వయానికి 10 శాతం చొప్పున పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు పోలీసు శాఖల పనితీరును మదించింది. అన్ని విభాగాల్లోనూ దారుణమే ఏపీ పోలీసు శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోమ్ శాఖ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. టాప్ 10లో ఉన్న రాష్ట్రాల్లో పోలీసు శాఖ పనితీరు బాగున్నట్టుగా పరిగణిస్తారు. ఏపీ పోలీసు టాప్ 25లో కూడా స్థానం సాధించలేకపోయింది. దేశంలో 26వ స్థానానికే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు విభాగాల్లోనూ ఏపీ పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. సంస్కరణల అమలు సక్రమంగా లేదు పరిపాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు 14.84 పాయింట్లు వచ్చాయి. కేసుల దర్యాప్తులో దర్యాప్తు అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తీసుకువచ్చిన సంస్కరణలను ఇందులో నిర్దేశించారు. ఉదాహరణకు గతంలో ఏదైనా నేరం సంభవిస్తే... అక్కడికి చేరుకున్న దర్యాప్తు అధికారి ఘటనా స్థలంలో స్కెచ్ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని.. ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. స్కెచ్ వేస్తున్న సమయం, సీడీ ఫైల్లో అప్లోడ్ చేసిన సమయం కూడా రికార్డు అవుతాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, ఇతరులకు ట్యాబ్లు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్కు కేవలం ఒక ట్యాబ్ను మాత్రమే అందించింది. అర్బన్ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఒక్క ట్యాబ్ మాత్రమే ఉంది. అధికార పార్టీ నేతలు రాజకీయ కక్ష సాధింపుతో పాల్పడిన నేరాలు, అత్యాచారాల దర్యాప్తునకు ట్యాబ్లు తీసుకువెళ్లడం లేదు. సమగ్ర దర్యాప్తు ప్రమాణాల్లో వీక్ కీలకమైన శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పనితీరు తీసికట్టుగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు ఏపీకి 29.88 పాయింట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ నేరాల దర్యాప్తు విధానంపై పోలీసులకు శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల దర్యాప్తు ప్రమాణాలు పెంపొందించే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రాదు సమాచార – సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అంశాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందుకే ఐటీసీ విభాగంలో మొత్తం 25 మార్కులకు ఏపీ పోలీసు శాఖ సగం మార్కు కూడా దాటలేకపోయింది. 12.75 మార్కులకే పరిమితమైంది. ఈ విభాగంలో పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర కీలక అంశాల పనితీరును కేంద్ర హోమ్ శాఖ మదించింది. నిందితులను పోలీస్ స్టేషన్కు ఎప్పుడు తీసుకువచ్చారు?.. లాకప్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి...? నిందితుడిని న్యాయస్థానానికి ఎప్పుడు తీసుకువెళ్లారు.. మొదలైనవి సీసీ కెమెరాల్లో రికార్డు కావాలి. కానీ రాష్ట్ర రాజధాని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే లాకప్ హత్య చేసి...సీసీ కెమెరాల వీడియో ఫుటేజీని మాయం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. అంత దారుణంగా ఉంది ఏపీ పోలీసు శాఖ పనితీరు. ఇతర శాఖలతో సమన్వయం లేదు నేరాలను సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులకు శిక్షలు పడేలా చేయడం కోసం పోలీసు, ఫోరెన్సిక్, వైద్య – ఆరోగ్య, జైళ్ల శాఖల మధ్య సమన్వయం అవసరం. అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏపీ పోలీసు శాఖ 7.06 పాయింట్లకే పరిమితమైంది. ఏపీ కన్నా చిన్న రాష్ట్రాలే భేష్పోలీసు సంస్కరణల అమలులో ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. మొత్తం 100 పాయింట్లకు ఏకంగా 95.58 పాయింట్లతో హర్యానా దేశంలో మొదటి స్థానం సాధించగా... 92.86 పాయింట్లతో గోవా రెండో స్థానంలో, 88.37 పాయింట్లతో అస్సాం మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు, అయిదో స్థానంలో దాద్రానగర్ హవేలీ, ఆరో స్థానంలో చండీగఢ్ ఏడో స్థానంలో రాజస్థాన్, ఎనిమిదో స్థానంలో మహారాష్ట్ర, తొమ్మిదో స్థానంలో పంజాబ్, పదో స్థానంలో త్రిపుర ఉన్నాయి. ఏపీ మాత్రం ఎక్కడో అట్టడుగున 26వ స్థానానికే పరిమితమైంది. -
జేబులో పచ్చ బిల్లేసుకుని టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి
-
మహిళలకు రక్షణ లేదా! ఎక్కడ దాక్కున్నావ్ హోంమంత్రి?
-
పంటలకు నీరివ్వలేని దద్దమ్మా.. చంద్రబాబు పై పేర్చి కిట్టు ఫైర్
-
ఆడవాళ్లను నడిరోడ్డుపై వివస్త్రను చేయడమేనా వాళ్లకు మీరిచ్చే భద్రత
-
దుశ్శాసన పర్వం.. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నచోటే మహిళలకే రక్షణ లేదు..
-
బాబు పాలనపై మంత్రి సంధ్య రాణి సంచలన కామెంట్స్
-
రామాయపట్నంలో భారీ స్కామ్... ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
ముడుపుల మతలబు..ఆయకట్టు తగ్గింపు.. కాంట్రాక్టు వ్యయం రెట్టింపు
సాక్షి, అమరావతి: ఆయకట్టు పది వేల ఎకరాలు తగ్గితే ఆ మేరకు పనుల అంచనా వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపు అయింది. అందువల్ల చేతులు మారిన ముడుపుల బరువూ పెరిగింది. ఈ మాయాజాలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో 36ఏ ప్యాకేజీలో మిగిలిన పనులు వేదికయ్యాయి. ఇంజినీరింగ్ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్న ఆ కథకమామిషూ ఇలా ఉంది. అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా 36ఏ ప్యాకేజీలో పేరూరు బ్రాంచ్ కెనాల్, హగరి బ్రాంచ్ కెనాల్, మాల్యం బ్రాంచ్ కెనాల్, ఉరవకొండ నియోజకవర్గంలో 55,608 ఎకరాలకు నీళ్లందించే పనుల్లో మిగిలిన పనులకు ఇటీవల రూ.440.89 కోట్ల అంచనా వ్యయంతో జల వనరుల శాఖ టెండర్లు పిలిచింది. ఈ పనులను 4.86 శాతం అధిక ధరకు అంటే రూ.462.32 కోట్లకు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. సీనరేజీ, జీఎస్టీ వంటి పన్నుల రూపంలో రూ.160.61 కోట్లు రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఆ పనుల మొత్తం కాంట్రాక్టు విలువ రూ.622.93 కోట్లన్నమాట. ఇంతై.. ఇంతింతై.. ⇒ హంద్రీ–నీవా తొలి దశలో 36ఏ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ 6.07 కిలోమీటర్లు, హగరి బ్రాంచ్ కెనాల్ 27.50 కి.మీ, మాల్యం బ్రాంచ్ కెనాల్ తవ్వి.. వాటి కింద 80,600 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.93.29 కోట్లకు ఓం–రే(జేవీ) సంస్థ 2005 ఫిబ్రవరి 10న దక్కించుకుంది. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్లలోగా ఆ పనులు పూర్తి చేయాలి. రూ.39.16 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. ⇒ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. ఏపీడీఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీడెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో సెక్షన్–61 కింద ఓం–రే(జేవీ)పై వేటు వేసింది. ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ రూ.54.13 కోట్లు. కానీ.. 2014లో దానిని రెండుగా 36ఏ, 36బీ ప్యాకేజీలుగా విభజించి 2015–16 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసింది. ⇒ 36ఏ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ను 1.8 కి.మీ నుంచి 3.27 కి.మీ వరకు హగరి, మాల్యం బ్రాంచ్ కెనాల్లలో మిగిలిన పనులు పూర్తి చేసి, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 65,600 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.244.72 కోట్లకు 2017 జూలై 28న సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు అప్పగించింది. 36బీ ప్యాకేజీలో 11వ పంపింగ్ స్టేషన్ కింద కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.19.29 కోట్లకు 2017 జూలై 13న ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించింది. ఈ రెండు ప్యాకేజీల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది నిబంధన. ⇒ 2019 నాటికి 36ఏ ప్యాకేజీలో సీఎం రమేష్ సంస్థ రూ.35.17 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. అంటే.. ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ రూ.209.55 కోట్లే.రాయదుర్గం ఆయకట్టు కట్.. అంచనా వ్యయం రెట్టింపుచంద్రబాబు సర్కార్ 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక 36ఏ ప్యాకేజీలో మిగిలిన పనులకు ఇటీవల టెండర్లు పిలిచింది. 36ఏ ప్యాకేజీలో మిగిలిన పనులు పూర్తి చేసి, ఉరవకొండ నియోజకవర్గంలో 55,608 ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ.440.89 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. అంటే.. రాయదర్గం నియోజకవర్గం పరిధిలో పది వేల ఎకరాల ఆయకట్టును తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 4.86 శాతం అధిక ధరకు రూ.462.32 కోట్లకు ఎన్సీసీకి కట్టబెట్టింది. జీఎస్టీ, సీనరేజీ పన్నుల రూపంలో రూ.160.61 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.622.93 కోట్లు.. కాంట్రాక్టు వ్యయం రూ.413.38 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ.. 2019 నాటికి ఆ ప్యాకేజీలో మిగిలిన పనుల విలువ రూ.209.55 కోట్లే. ఈ పనుల్లో అధిక భాగం మట్టి పనులే. బ్రిడ్జిలు, ఇతర కాంక్రీట్ నిర్మాణాల పనులు తక్కువే. ఆయకట్టు కూడా పది వేల ఎకరాలు తగ్గింది. అయినా సరే కాంట్రాక్టు విలువ రెట్టింపు అవడంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్య నేతకు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
దోపిడీకి బలైన సీమ జీవనాడి
అనంతపురం: ప్రాణాలైనా అర్పిస్తాం.. సీమ రైతన్నను కాపాడుకుంటామని వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. రాయలసీమకు మరీముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సిమెంట్ రంగు వేసి.. లైనింగ్ పూర్తి చేసినట్లు రూ.3,500 కోట్లకుపైగా ఖర్చు చూపించి.. వందల కోట్లను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు దోపిడీ చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు ఆదివారం హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిరక్షణ పోరుబాట నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం చోళసముద్రం గ్రామ సమీపంలో హంద్రీ–నీవా కాలువను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. టాస్్కఫోర్స్ కమిటీ కనీ్వనర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైఎస్సార్సీపీ అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘హంద్రీ–నీవా లైనింగ్ పట్టుకుంటే ఊడిపోయే పరిస్థితిలో ఉంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కుప్పంకు నీరు తీసుకెళ్లే క్రమంలో అన్నదాతకు శాశ్వత సమాధి కట్టారు. లైనింగ్ వల్ల ఈ ప్రాంత రైతుల బోర్లు ఎండిపోయాయి. చీనీ, మామిడి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ సీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఖండించకపోవడం, రాయలసీమ ప్రజల ప్రయోజనాల పట్ల ఆయన వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపకపోవడం దారుణం’’ అని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ అనంతపురం జిల్లా కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిఎం చంద్రబాబు సొంత జిల్లాలో దివ్యాంగులకు కరువైన రక్షణ
సాక్షి, చిత్తూరు: సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దివ్యాంగులకు రక్షణ కరువైంది. చిత్తూరు జిల్లాలో దివ్యాంగులపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐరాల మండలం ఎర్రిపల్లి పంచాయితీ కంపల్లె గ్రామంలో ఈనెల 8న దివ్యాంగురాలు సుమతిపై రాజేంద్ర రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన 48 సెంట్ల స్థల వివాదం నేపథ్యంలో చోటుచేసుకుంది. తహశీల్దార్ పోలీసు బందోబస్తు ఇవ్వమని కోరినా పట్టించుకోకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. బాధితురాలు సుమతి దివ్యాంగుల జె.ఏ.సి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కాగా, తోటి దివ్యాంగురాలు విజయకు జరుగుతున్న అన్యాయంపై మద్దతుగా వచ్చిన ప్రతినిధుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. దివ్యాంగులపై ఇంత దాష్టీకమా?!... రక్షణ కల్పించాల్సిన సిస్టమ్ ఎక్కడుంది? 😡👇సమాజంలో అణగారిన వర్గాలకు, దివ్యాంగులకు అండగా నిలవాల్సిన చట్టాలు, రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలు ఎటు పోయాయి? చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతం చూస్తే చట్టాలు ఎవరికోసం పని చేస్తున్నాయనే… pic.twitter.com/b9IYHsOta6— MA-VI-GUN KAREEM (@ysrcp_vjw) July 19, 2026ఐరాల పోలీస్ స్టేషన్లో దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈనెల 11న రాజేంద్ర రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 8 మంది దివ్యాంగులపై కేసు నమోదు చేయడం బాధితులను మరింత కలవరపెట్టింది. రేపు(సోమవారం) దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలవనున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో దివ్యాంగులకు రక్షణ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. -
జత్వానీ కేసులో బాబు సర్కార్ కుట్రలు బట్టబయలు
సాక్షి, విజయవాడ: జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే, జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సీఐడీ తేల్చింది. జత్వానీపై నమోదైన కేసులో సిఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని.. బెదిరించి పెద్ద ఎత్తుల డబ్బులు వసూలు చేసినట్టు సీఐడీ నిర్థారించింది. కుక్కల విద్యాసాగర్ నుండి డబ్బులు గుంజినట్టు వెల్లడించింది.1.31 కోట్లు బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని.. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా సీఐడీ నిర్ధారించింది. గతంలో పారిశ్రామిక వేత్త జిందాల్ని బ్లాక్ మెయిల్ చేసిన జత్వానీని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెనకేసుకొచ్చారు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించిన ప్రభుత్వం.. స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీని ట్రీట్ చేసింది. దుర్గ గుడిలో ప్రోటోకాల్ దర్శనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయించింది.జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధించిన ప్రభుత్వం.. డీజీ పీఎస్ ఆర్ ఆంజనేయులు, సీపీ క్రాంతిరాణా టాటాలపై కేసులు పెట్టి.. సస్పెన్షన్ చేసింది. డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపైన కూడా కేసులు పెట్టి సస్పెన్షన్ చేసింది. జత్వానీ పేరుతో పోలీస్ అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలింది. సాక్షాత్తూ హోంమంత్రి అనిత దగ్గరుండి కేసు పెట్టించిన సంగతి తెలిసిందే. జత్వానీని వీఐపీలా ట్రీట్ చేసి కూటమి నేతలు అభాసుపాలయ్యారు. -
మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో దుశ్శాసన పర్వం
-
రెచ్చిపోతున్న MLA మాధవి
-
హోంమంత్రికి సిగ్గుంటే.. బయటపడ్డ వీడియోలు
-
TDP ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు చంద్రబాబు షాక్
-
ఎండ నుంచి యూరప్ ను రక్షించిన చంద్రబాబు
-
నడిరోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన పచ్చమూక
-
గుంటూరు నడిబొడ్డున..మహిళపై 9 మంది
-
సిగ్గుతో తలదించుకో చంద్రబాబు.. గుంటూరు ఘటనపై జగన్ కన్నెర్ర
-
రెడ్ బుక్ వేధింపులు..ఏపీకి గుడ్ బై
-
నడిరోడ్డుపై మహిళను.. ఛీ..ఛీ.. టీడీపీపై రాయన భాగ్యలక్ష్మి ఫైర్
-
విద్యార్థుల కోసం బాబు సర్కార్ పై YSRCP ఉద్యమ బాట
-
2 నెలల్లో ఏడుగురు బలి.. కథ మొత్తం నడిపిస్తున్నది లోకేశ్
-
'నాడు' నంబర్ 1.. 'నేడు' నంబర్ 8
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటూ రెండేళ్లుగా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు! వందల పరిశ్రమలను రప్పించాం.. లక్షల మందికి ఉపాధి కల్పించేశాం.. ఉద్యోగాలిచ్చేశాం..! ఇంకా నిరుద్యోగ భృతితో ఏం పనంటూ దబాయించారు! అయితే సీఎం చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం.. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు.. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు.. అంతా బూటకమేనని నీతి ఆయోగ్ నివేదిక సాక్షిగా తేలిపోయింది. తాజాగా సులభతర వాణిజ్యం (ఈవోడీబీ) ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా మూడేళ్ల క్రితం నంబర్ వన్ ర్యాంకు నుంచి ఇప్పుడు అథఃపాతాళానికి దిగజారిపోవటం రాష్ట్రానికి దూరమవుతున్న పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వాతావరణానికి నిదర్శనమనే చర్చ పారిశ్రామికవర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, రెడ్బుక్ వేధింపులు, వాటాల వసూళ్లు, పారిశ్రామికవేత్తలపై రౌడీయిజానికి నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్నదల్లా.. ఊరూ పేరూ లేని అనామక కంపెనీలను సృష్టించి అత్యంత విలువైన ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం.. వాటాలు వసూలు చేసుకోవడమేనని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి ఆజాద్ ఇండియా మొబిలిటీ, జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులను రద్దు చేసుకుని ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం అవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని తాజాగా నీతి ఆయోగ్ పేర్కొనడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఏపీ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏకంగా 35 శాతానికి చేరుకున్నాయని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది.పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయంటూ...చంద్రబాబు సర్కారు పెట్టుబడుల పిట్ట కథలను నీతి ఆయోగ్ బట్టబయలు చేసింది. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని, దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం ఆంధ్రప్రదేశ్కే వచ్చాయంటూ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకులను నీతిఆయోగ్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 36 రాష్ట్రాలకుగాను గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా టాఫ్ ఫెర్ఫార్మెన్స్ రాష్ట్రాల్లో నిలవగా ఫ్రంట్ రన్నర్స్ రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇన్ఫ్రా, వ్యాపార అనుకూల వాతావరణం, వనరుల లభ్యత, ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణ పటిష్టత లాంటి ఎనిమిది అంశాలను నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది. ఎనిమిది రంగాలలో డేటాను విశ్లేషించడం ద్వారా ఏపీకి 26.5 పాయింట్లు దక్కగా, సర్వేలో 22.2 పాయింట్లు లభించినట్లు వెల్లడించింది. చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో నిజం ఉంటే పారిశ్రామికవేత్తలు అంత ఘోరమైన ర్యాంకు ఎందుకు ఇస్తారనే చర్చ జరుగుతోంది.ర్యాంకుల వారీగా ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు వెల్లడిస్తున్న నీతి ఆయోగ్ నివేదిక 17 పెద్ద రాష్ట్రాల్లో 6వ స్థానం.. దేశంలో 17 పెద్ద రాష్ట్రాల ర్యాంకుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీల అమలులో చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం అవుతున్నాయని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం దెబ్బతింటోందని పేర్కొంది. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ పాలసీలు, ఆర్థిక పటిష్టత రంగాల్లో ఏపీ బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడైంది.అధ్వాన్నంగా ఆర్థిక పరిస్థితి..వ్యాపార అనుకూల వాతావరణ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంత వెనుకంజలో ఉండటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ప్రధాన కారణమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35 శాతానికి చేరుకున్నాయని పేర్కొంది. ఇది పెద్ద రాష్ట్రాల జీఎస్డీపీ అప్పుల సగటు నిష్పత్తితో పోలిస్తే ఏకంగా 13 శాతం అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో 17 రాష్ట్రాల సగటు అప్పుల నిష్పత్తి 22 శాతం మాత్రమే కావడం గమనార్హం.నాడు కోవిడ్లోనూ నంబర్ 1..కోవిడ్ లాంటి మహమ్మారిని సైతం తట్టుకుని కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏకంగా 8వ స్థానంలోకి పడిపోయింది. దారుణం ఏమిటంటే గోవా, ఒడిశా లాంటి చిన్న రాష్ట్రాల కంటే కూడా ఏపీ వెనుకబడి పోవడం!కప్పం కట్టలేక పారిపోతున్న కంపెనీలు...!రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వదిలేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వంలో మొదటి ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, 6వ ఎస్ఐపీబీలో ఆమోదించిన జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏడో ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు రాష్ట్రం నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను విరమించుకుని వెనక్కి వెళ్లిపోయాయి. హైదరాబాద్కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్ నిర్మాణ ప్రతిపాదనలను సైతం ఉపసంహరించుకుంది. 2025 నవంబర్ 12న మధురవాడలో రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని రద్దు చేసుకొని వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ రూ.6,215 కోట్లకుపైగా ఉండటం రాష్ట్రంలో దిగజారిన పారిశ్రామిక వాతావరణం, టీడీపీ పెద్దల కప్పం వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. -
మత్స్యకారులకు మరో వెన్నుపోటు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. వారి జీవనోపాధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.306.29 కోట్లతో అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేస్తోంది. వేలాది బోట్లు అక్కడ నిలుపుకునే అవకాశం కల్పించడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టేస్తోంది.ఇప్పటికే ఈ హార్బరులో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన బాబు సర్కారు.. తాజాగా మిగిలిన స్థలాన్ని కూడా ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేయడానికి బరితెగించింది. తద్వారా మత్స్యకారుల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయంతో ఒక్క జువ్వలదిన్నె ప్రాంతంలోనే 6 వేలకు పైగా మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బ తీయనుంది. హార్బర్ను ప్రైవేట్కు దోచిపెట్టి.. మీకింత–నాకింత అని దోచుకునేందుకే ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది.ఈ క్రమంలో గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఈ హర్బర్ను ఐదేళ్ల కాలానికి ఆపైన మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం కల్పించేలా చంద్రబాబు సర్కారు బిడ్లను పిలిచింది. ఈ హార్బరు పనులు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యి.. 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటికీ, రెండేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.తీరా రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హార్బర్ను నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థలు సెపె్టంబర్ 2వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ఈ హార్బరుకు రోడ్డు, రైలు, పోర్టుతో కనెక్టివిటీతో పాటు అన్ని రకాల మౌలిక వసతులున్నట్లు పేర్కొంది. వైఎస్ జగన్ హయాంలో తీర ప్రాంత అభివృద్ధి పరుగులు పెట్టింది. రూ.26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టి.. మత్స్యకారుల జీవనగతి మారేలా అడుగులు ముందుకు వేశారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. ఏపీ తీరాన్ని చంద్రబాబు సర్కారు దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో ప్రైవేటు వాళ్లకు పంచి పెట్టేస్తోంది. దండుకున్న దాంట్లో మీకింత–మాకింత విధానాన్ని అవలంబిస్తోంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ సర్కారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేసేస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టును ప్రైవేటు వాళ్లకి అప్పగించడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి టెండర్లు ఆహ్వానించింది.అంతేకాకుండా కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల పరిధులను తగ్గించేసింది. ఇలా పరిధిని తగ్గించిన తర్వాత ప్రైవేటు సంస్థల కోసం ఏకంగా 6,248 ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజు కింద సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చేసింది.తీర ప్రాంతం అభివృద్ధి పేరిట ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్–2026 విడుదల చేసి.. వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను అభివృద్ధి పేరిట కావాల్సిన వారికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు అయితే ఏకంగా తన దగ్గర లేని భూమిని.. ఇంకా ఏర్పాటు కాని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్కుకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చేసిందంటే దోపిడీ ఏవిధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.ఎడాపెడా నిర్మాణ వ్యయం పెంపు⇒ రెండేళ్లయినా కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టకపోగా, నిర్మాణంలో ఉన్న వాటిని నిలిపి వేసి.. ఇప్పుడు కమీషన్ల కోసం ఏకంగా టెండర్ల విలువను భారీగా పెంచేసి నిలువు దోపిడీకి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు.⇒ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించి.. రెండో దశలో బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ టెండర్లు పిలిచింది. ⇒ చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా ఓడరేవు వంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ఆపేయడమే కాకుండా బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేసి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయం రూ.1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే.. ఇప్పుడు దానికి అదనంగా ఏకంగా రూ.436.41 కోట్లు పెంచేసి రూ.1,586.63 కోట్లకు చేర్చింది.⇒ ఇందులో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బరు నిర్మాణ వ్యయం రూ.365.81 కోట్ల నుంచి రూ.444.75 కోట్లకు, కొత్తపట్నం హార్బర్ నిర్మాణ వ్యయం రూ.392.41 కోట్ల నుంచి రూ.441.88 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ⇒ పూడిమడక హార్బర్ను ప్రభుత్వం ద్వారా కాకుండా, పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392 కోట్ల నుంచి ఏకంగా రూ.700 కోట్లకు పెంచేయడం హార్బర్ల పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న నిలువు దోపిడీకి అద్దం పడుతోంది.⇒ రూ.417.55 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణ పనులు 25 శాతం లోపే ఉన్నాయంటూ 2024 సెప్టెంబర్ 27న ఆ టెండర్లను రద్దు చేస్తూ పనులను అర్ధంతరంగా ఆపేసింది. -
కూటమి నేతల చెవుల్లో తుప్పు వదిలేలా చెప్తున్నా..
-
కొందరికే తల్లికి వందనం.. చంద్రబాబు సర్కార్ కొత్త రూల్స్!
-
ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోతే ముద్రగడ ఫ్యామిలీపై కేసు పెడతారా..
-
ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోతే ముద్రగడ ఫ్యామిలీపై కేసు పెడతారా..
-
కనిగిరి పొగాకు రైతులకు అండగా దీక్ష.. మాస్ వార్నింగ్ బాబుకి
-
చంద్రబాబు మాట లెక్క చేయని టీడీపీ ఎమ్మెల్యేలు
-
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం
మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట రానంతగా భావోద్వేగం కలుగుతోంది. ఇసుక వేసినా రాలనంతగా కంటి చూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. చంద్రబాబు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మార్చాలని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలను. మన హయాంలో ప్రతి రైతును అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించాం. ఈ రోజు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. ఈ రోజు ఇలా చంద్రబాబు సానుభూతిపరుల సిండికేట్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆక్వాలో సిండికేట్దే పెత్తనమని మండిపడ్డారు. ఆయన అనుయాయ వర్గీయులే ఏవో కారణాలు, సాకులు చెప్పి అడ్డగోలుగా మేత ధరలు పెంచడంతోపాటు పంట ధరలను తగ్గించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆక్వాలో ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలించేసి.. అప్సడాకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వాతో 15 లక్షల మందికి ఉపాధి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే లక్షన్నరకు పైగా రైతులు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 15 లక్షల మందికి ఆక్వా రంగం ఉపాధి కల్పిస్తోంది. కానీ ఈ రంగంలో పరిస్థితులు చూస్తే, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. అంత దయనీయమైన పరిస్థితిలో ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి «ఫీడ్ ధరల పెంపు అనేది రైతుల అంగీకారంతోనే జరగాలి కానీ, ఏకపక్షంగా కాదు. ఫీడ్ ధరలు పెంచాలంటే సమీక్ష నిర్వహించాలి. దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. ధరల పెంపుపై సమీక్షించాలంటే.. ఫిష్ మీల్ సమృద్ధిగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలల్లో హేతుబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ రేట్లపై ఇష్టానుసారం రివ్యూ చేయకూడదు. దీనిపై ఇటీవల ఆక్వా రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంది. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం జారీ చేశాం. సిండికేట్ చేతుల్లో నలిగిపోతున్న రైతు చంద్రబాబు చర్మం కొంచెం మందం. మీ అందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలనం ఉండదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే తయారైందని చెప్పడానికి బాధపడుతున్నాను. మన ఖర్మ ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లయి చేసే ఫీడ్ కానీ, ఆ పంట కొనుగోలులో కానీ, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా మొత్తం సిండికేట్గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. అలా చంద్రబాబునాయుడు సానుభూతిపరుల సిండికేట్ ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. చంద్రబాబు సీఎం సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా)ను ఏర్పాటు చేస్తూ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఆ అప్సడాకు ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించేలా ఆ చట్టంలో నిర్దేశించాం. ఆక్వా రంగంలో అలా ఒక రెగ్యులేటరీ బాడీ ద్వారా సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్ ప్రక్రియ, కొనుగోలు ధరలతో పాటు, మార్కెటింగ్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, రైతాంగానికి నేరుగా తోడుగా ముఖ్యమంత్రి ఉండేలా ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకువచ్చి రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ముష్టి వేసినట్లు రూ.2 తగ్గించారు మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి జూన్ లో పెంచారు. అంటే నాలుగు నెలలు కూడా తిరక్కముందే రెండుసార్లు రేటు పెంచారు. ఏకంగా కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, వారి గోడు వినకుండానే ‘అప్సడా’ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. అలా దారుణంగా పెంచి, ఆ తర్వాత తూతూ మంత్రంగా చంద్రబాబు చెప్పారంటూ కేజీకి రూ.2 తగ్గించారు. నాలుగు నెలలు తిరక్కుండానే కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంపు ఎక్కడ? ముష్టి వేసినట్లు కేవలం రూ.2 తగ్గించడం ఏమిటి? ఇది చంద్రబాబు భాషలో చెప్పాలంటే 100 కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అని చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబును నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఆక్వా పంట సాగులో 60 శాతం ఫీడ్ ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇష్టానుసారం ఫీడ్ రేటు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బతుకుతుంది? ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్లు, అందుకోసం వాడే సోయా, ఫిష్ మీల్, ఇతర మినరల్ మిక్సర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నామని, రేటు పెంచక తప్పడం లేదంటున్నారు. ఆ రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ రేటు పెంచుతున్నప్పుడు మరి ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా.. అని నేను అడుగుతున్నా. రేట్లు పెంచడానికైనా.. రేట్ల మీద నిర్ణయం తీసుకోవడానికైనా ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి హేతుబద్ధత అనేది ఉండాలి కదా.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్లో తక్కువ రేటుకు వాళ్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉందంటూ.. ఒక కారణం తర్వాత మరో కారణం చెప్పి, ఇష్టం వచ్చినట్లు రేట్ పెంచుకుంటూ పోతారు. ఇలా ఇప్పుడు సిండికేట్ రాజ్యం నడుస్తోంది. సభా వేదిక వద్ద అశేష జనవాహినికి చిరునవ్వుతో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ వైఖరి మార్చుకోండి నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో ఫీడ్ కంపెనీలు మూడుసార్లు ధరలు పెంచితే, అప్సడా ద్వారా ఆ రేట్లు పూర్తిగా తగ్గించామని నేను గర్వంగా చెప్పగలను. అది రైతులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుతోంది. ఇంకా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర.. ఏ రైతుకు తగ్గకుండా ఆ ఐదేళ్లలో రైతాంగానికి తోడుగా నిలుచుంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతన్నలకు అండగా నిలబడి కనీస మద్దతు ధర 100 కౌంట్ రూ.230కి తగ్గకూడదని చెప్పి ఏకంగా చట్టం చేసి మరీ రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగింది. అదే ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటని చూస్తే, ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.275కు పెరిగింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు సీడ్, ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. కానీ, పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి రూ.230 దాటని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుందని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై మీకు ఇంత, నాకు ఇంత అని చెప్పి మీరు చేస్తున్న వైఖరి మార్చుకోవాలని గట్టిగా కోరుతున్నా. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం, మోసం, మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసాలతో అడుగులు ముందుకు వేశాడు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేసి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు. అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడు. అవసరమైన జిల్లాల్లో 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్లు అన్నాడు.. (చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ప్రస్తావిస్తూ) మరి కట్టాడా? జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు సబ్సిడీపై కరెంటు ఇస్తానని హామీ ఇచ్చాడు.. మరి ఇచ్చాడా? ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తానన్నాడు.. మరి తగ్గించాడా? ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు.. మరి ఇచ్చాడా? (ఏవీ ఇవ్వలేదంటూ రైతులు పెద్దఎత్తున చేతులు ఊపారు) ఇవన్నీ ఇవ్వకపోగా, మనం అమలు చేసిన రూ.1.50కే యూనిట్ విద్యుత్ను కూడా చంద్రబాబు కత్తిరించే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకోసం తాజాగా జీవో 169 జారీ చేశారు. దీని ప్రకారం ఆక్వా సాగులో ఉపయోగించే మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) 0.90 నుంచి 0.95 మధ్య మెయింటైన్ చేయాలని చంద్రబాబు రైతులకు రూల్ పెట్టాడు. ఆక్వా రైతులు సాధారణంగా వాడే మోటార్లలో పీఎఫ్ 0.78 మాత్రమే ఉంటుంది. ఆ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే మళ్లీ ఆ రైతులు కెపాసిటర్లు కొనాలి. అవి కొంటే తప్ప, పీఎఫ్ పెరగదు. 12 వేల కనెక్షన్లు పెండింగ్ కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. దీంతో కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలా 12 వేల వరకు కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు త్రీఫేస్ కరెంట్ కాకుండా, కేవలం సింగల్ ఫేస్ కరెంటు ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడేలా చేస్తున్నాడు. దీంతో జనరేటర్లు పెట్టుకుని సాగు చేయాలంటే, ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పనేనా చంద్రబాబూ? రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తున్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటూ, చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు.. ఏ పంటకు చూసినా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేలు నిరీ్వర్యం.. ఉచిత పంటల బీమా లేదు.. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లేదు.. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ రోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వంలో రూ.1.50కే యూనిట్ విద్యుత్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతాంగానికి అండగా నిలుస్తూ అడుగులు పడ్డాయి. అంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకోసం మన ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు ఏకంగా రూ.3,306 కోట్లు సబ్సిడీ భారం భరించాం. అదే అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జరిగిందని చూస్తే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్పై రూ.3.85 వసూలు చేసి బాదారు. ఆ తర్వాత నా పాదయాత్రలో అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చెప్పాము. ఆ వెంటనే 2019లో ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబునాయుడు, ఆక్వా రైతులకు సరఫరా చేసే యూనిట్ విద్యుత్ రేటు రూ.2కు తగ్గిస్తూ జీవో జారీ చేశారు. కానీ, ఆ సబ్సిడీ ఇవ్వలేదు. దాన్ని కూడా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక భరించింది. అందుకోసం రూ.451 కోట్లు చెల్లించామని గర్వంగా చెబుతున్నా. 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు నాడు మన హయాంలో ఆక్వా రైతన్నలకు తోడుగా ఉండేలా సీడ్, ఫీడ్.. వాటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ.. వాటన్నింటి కోసం ఏకంగా 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేల్లో ఏకంగా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు అంటే.. ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను నియమించి, వారితో పాటు ఆక్వా ల్యాబ్ల ద్వారా ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించాం. మన హయాంలో ఏకంగా 120 రోజులు, 150 రోజుల పాటు ఉండే సీడ్ తీసుకొచ్చాం. అదే ఈరోజు కేవలం 90 రోజులకు మించి బతకని పరిస్థితి ఉంది. వీటన్నింటి ద్వారా ఆక్వా రైతన్న అల్లాడిపోతున్నాడు. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబు అవసరమైన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారు. భీమవరంలో తనను చూడటానికి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 51 లక్షల టన్నులకు పెరిగిన ఉత్పత్తి చంద్రబాబు గత హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షల టన్నులు కాగా, మన ప్రభుత్వంలో అది ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు చంద్రబాబు పాలనలో చివరి ఏడాది.. అంటే 2018–19లో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ రూ.13,855 కోట్లు కాగా, మన ప్రభుత్వంలో 2023–24 నాటికి అది రూ.20 వేల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు హయాంలో 86 శాతం ఉన్న యాంటీ బయోటిక్స్ అవశేషాలను మన ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 శాతం లోపునకు తగ్గించామని కూడా గర్వంగా చెప్పగలను. అందుకే మన ప్రభుత్వ హయాంలో రెండుసార్లు.. 2021–22, 2023–24లో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. భీమవరంలో వైఎస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజలు ఆక్వా రైతుల సభలో ముద్రగడకు జగన్ ఘన నివాళిభీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలుత.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. అనంతరం ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మీ కష్టాలు నాకు తెలుసు మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతా. మళ్లీ ‘అప్సడా’ పూర్వ వైభవంలోకి వస్తుంది. ఆ సంస్థకు సీఎం చైర్మన్గా ఉంటాడు. ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి, ప్రతి పంటకు, పంట వేసిన ప్రతి రైతు చేయి పట్టుకుని నడిపిస్తూ.. వారికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నా. -
YS Jagan: నువ్వు మారుతావా.. నన్ను మార్చమంటావా..?
-
రూ.2 ముష్టి వేస్తున్నావా.? బాబు పై జగన్ ఉగ్రరూపం
-
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
చంద్రబాబుకు తెలియని నిజం, అమరావతికి లక్ష ఎకరాలు!
-
ఏపీలో నయా స్కీమ్.. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
-
పోలవరానికి చంద్రబాబు ఉరి...!
-
Exclusive Visuals: పోరాటం ఆపను... యనమల నాగార్జున యాదవ్
-
Magazine Story : రాజధానికి భూములిచ్చిన రైతులను నిలువునా ముంచేశారు
-
బాబు సభ నుంచి వెళ్ళిపోతున్న జనం వైరల్ అవుతున్న వీడియో
-
పవన్ తో పైసా పని లేదు.. బాబు మాఫియా
-
పల్నాడు కల.. జగన్ సాకారం
సాక్షి, అమరావతి: వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు జారీ చేసింది. వైఎస్ జగన్ పిడుగురాళ్లలో ప్రభుత్వ నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద రూ.500 కోట్లతో అధునాత వసతులతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలోనే 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే బోధనాస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరోవైపు మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేశారు. ప్రాజెక్ట్ వ్యయంలో రూ.300 కోట్ల విలువైన పనులు ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందే ఆస్పత్రి భవనాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రారంభించింది. అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.బాబు సర్కార్ బ్రేకులు..ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీంతో పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. తొలుత ఈ వైద్య కళాశాలను సైతం పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. మరోవైపు కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడంపై వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడంతో పిడుగురాళ్ల వైద్య కళాశాలను ప్రైవేట్కు కట్టబెట్టే నిర్ణయాన్ని చంద్రబాబు విరమించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కళాశాల ఏర్పాటుకు 19 నెలల అనంతరం చర్యలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషిని చంద్రబాబు కొనసాగించి ఉంటే 2024లోనే బోధనాస్పత్రి అభివృద్ధి అయిపోయి, గత విద్యా సంవత్సరంలోనే మన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు సమకూరి ఉండేవి. చంద్రబాబు చేసింది శూన్యంవాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తే పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యమేనని బోధపడుతుంది. వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం, భూ సేకరణ, టెండర్ పిలవడం, పనులు ప్రారంభించడం, మెజార్టీ శాతం పనులు పూర్తి చేయడం.. ఇలా కీలక అడుగులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పడ్డాయి. మరోవైపు కళాశాల, బోధనాస్పత్రి కోసం పోస్టులను సైతం ఈ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందే లేదు. గత ప్రభుత్వంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు కొత్తగా మంజూరు చేసిన 837 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం పిడుగురాళ్ల వైద్య కళాశాల, బోధనాస్పత్రికి సర్దుబాటు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే మెడికల్ కాలేజీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనతే అనే రీతిలో హడావుడి చేస్తుండటం గమనార్హం.మన విద్యార్థులకు తీరని ద్రోహం..ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని వేల మంది విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిలో పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్కు కట్టబెడుతోంది. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేయగా, లేఖ రాసి మరీ ఆ అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. ఇలా పది వైద్య కళాశాలలకు బాబు అడ్డుపడటంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. ఫలితంగా తెలంగాణ విద్యార్థులతో పోలిస్తే నీట్లో ఉత్తమ ర్యాంక్లు సాధించినప్పటికీ కన్వీనర్ కోటాలో సీట్ దక్కక నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్య తరగతి వర్గాలకు చెందిన మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వైద్య విద్య కలను చంద్రబాబు సర్కారు ఛిద్రం చేయడంతో వారి జీవిత ఆశయం తలకిందులైంది. -
ఎక్స్గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి
సాక్షి, అమరావతి: నిత్యం నడిసంద్రంలో జీవనపోరాటం సాగించే గంగపుత్రులను చంద్రబాబు సర్కారు నట్టేట ముంచేసింది! మత్స్యకార కుటుంబాలను ఆదుకోకుండా దగా చేస్తోంది. మృత్యువుతో పోరాడి త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. తమకు ప్రాణప్రదమైన పడవలను కోల్పోయామని ఆక్రోశిస్తున్న మత్స్యకారులను ఆదుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరుగురు సహచరులను కళ్లెదుటే కోల్పోయిన బోటు డ్రైవర్, మత్స్యకారుడు కారి చిన్నా... మరో బోటులో ఒడిశా తీరానికి ప్రాణాలతో చేరుకున్న 9 మంది మత్స్యకారులు.. ప్రాణాలు దక్కించుకున్నా విలువైన బోట్లను కోల్పోయామని విలపిస్తున్నారు.గల్లంతైన, దెబ్బతిన్న బోట్లకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సర్కారు ఏ ఒక్క బోటుకు పైసా సాయం అందించిన పాపాన పోలేదు. మరోవైపు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు సాయం పెంచాల్సింది పోయి సగానికి పైగా కోతలు పెడుతూ పొట్టగొడుతోంది. వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం సాయం పంపిణీలోనూ రాజకీయాలు చేస్తూ మత్స్యకారులను తామేదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రచారార్భాటానికి తాపత్రయపడుతోంది.బోట్లకు సైతం పరిహారం ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్ తుపానులు లాంటి వైపరీత్యాల వేళ వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే బోట్ల పునర్నిర్మాణానికి సాయం అందించడం చాలా ముఖ్యం. విపత్తుల వేళ గల్లంతైన, ప్రమాదానికి గురైన సందర్భాల్లో ప్రత్యేక బృందాల ద్వారా ఎన్యూమరేషన్ చేసి బోట్ల నిర్మాణం, సామర్థ్యాన్ని బట్టి పరిహారాన్ని అంచనా వేస్తారు.ఆ మేరకు మత్స్యశాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి బోట్ల పునర్నిర్మాణానికి పరిహారం ఇస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అలా విపత్తుల్లో దెబ్బతిన్న బోట్లకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చి ఆదుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. 2014–19 మధ్య విపత్తుల వేళ బోట్లు కోల్పోయిన వారికి చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన పరిహారంతో పాటు 2019–24 మధ్య ప్రకృతి వైపరీత్యాల్లో గల్లంతైన బోట్లకు సంబంధించి దాదాపు రూ.1.80 కోట్ల సాయం అందించారు.2023లో విశాఖ హార్బర్లో సంభవించిన అగ్నిప్రమాదంలో దాదాపు 49 బోట్లు కాలి బూడిదైపోగా ఒక్కో బోటుకు పరిహారం కింద రూ.25 లక్షల నుంచి రూ.39 లక్షల వరకు పరిహారం అందించి ఆదుకున్నారు. అంతేకాదు.. వాటిపై ఆధారపడి జీవించే 400 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందించారు. ఈ ఒక్క ఘటనలోనే దాదాపు రూ.7.11 కోట్ల మేర పరిహారం ఇచ్చి మత్స్యకారులకు అండగా నిలిచారు. వేటకు పనికిరాని బోట్లకు సైతం రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకున్నారు.పరిహారం రూ.10 లక్షలకు పెంచి...ప్రమాదవశాత్తు మృతి చెందే మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఎన్నికల హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచింది. నాడు ఐదేళ్లలో అలాంటి ఘటనల్లో క్షణం ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలకు పరిహారం అందించి అండగా నిలిచారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన పరిహారంతో సహా 175 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.17.50 కోట్ల మేర పరిహారాన్ని అందించి మత్స్యకారుల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.మరొక వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిరాగానే వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10 వేలకు పెంచడమే కాదు.. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9లకు పెంచారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 5.38 లక్షల మంది గంగపుత్రులకు రూ.538 కోట్ల వేట నిషేధ భృతితో పాటు డీజిల్ సబ్సిడీ కింద రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూరింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పైపులైన్ నిర్మాణం వలన జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల ఉపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.647.44 కోట్ల సాయాన్ని అందించింది. ఐదేళ్లలో 50 ఏళ్లు నిండిన 69,741 మంది మత్స్యకారులకు సామాజిక పింఛన్ల రూపంలో రూ.759.47 కోట్లు లబ్ధి చేకూర్చారు.నష్ట పరిహారం కుదించి.. సాయం ఎగ్గొట్టివేటకు వెళ్లి దురదృష్టవశాత్తూ మృతి చెందిన మత్స్యకారులకు వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన రూ.10 లక్షల పరిహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షలకు కుదించింది. 63 క్లెయిమ్లకు సంబంధించి రూ.10 లక్షల చొప్పున రూ.6.30 కోట్లు జమ చేయాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షలకు కోత వేసి రూ.3.15 కోట్లకు సరిపెట్టింది. ఈ రెండేళ్లలో వేటకు వెళ్లి 160 మంది మృతి చెందినట్టు నిర్ధారించగా కేవలం 113 మందికి రూ.5లక్షల చొప్పున రూ.5.65 కోట్ల ప్రతిపాదనలతో సరిపెట్టారు.వేట నిషేధ భృతి కింద ఇస్తామన్న రూ.20 వేలు తొలి ఏడాది ఎగ్గొట్టారు. సామాజిక పింఛన్లలో కోతపెట్టి 68,632 మందికి కుదించారు. ఇలా అన్ని విధాలుగా మత్స్యకారులను వంచించిన చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఘటనపై స్పందించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ వైఎస్ జగన్ హయాంలో నేరుగా మత్స్యశాఖ నుంచే పరిహారం ఇచ్చేవారని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. రెండేళ్లలో మృతి చెందిన వారికి రూ.10 లక్షల చొప్పున ఎందుకు సాయం ఇవ్వడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు.బోట్లకు పరిహారంపై నోరుమెదపని బాబు సర్కారుఅధికారంలోకి వచ్చింది మొదలు ఆక్వా రైతులతో పాటు మత్స్యకారులను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం సాయంలోనూ కోతలు పెడుతోంది. 2024 ఎన్నికల వేళ కాకినాడ ఫిషింగ్ హార్బర్లో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురికాగా దాదాపు రూ.50 లక్షల విలువైన ఈ బోటుకు పరిహారం కోసం నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత చెల్లించాల్సిన పరిహారం రెండేళ్లు గడిచినా బాబు సర్కార్ చెల్లించలేదు. అంతేకాదు ఈ రెండేళ్లలో దాదాపు 20కిపైగా బోట్లు వివిధ వైపరీత్యాల్లో దెబ్బతిన్నా ఏ ఒక్క బోటుకు పైసా పరిహారం చెల్లించిన పాపానపోలేదు.తాజాగా విశాఖ ఘటనలో మృత్యుంజయుడుగా బయటపడిన కారే చిన్నాకు సాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. సహచర మత్స్యకారులను పోగొట్టుకున్న చిన్నాకు చెందిన దాదాపు రూ.50 లక్షల కుపైగా విలువైన బోటు ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఆర్థికంగా కుదేలైన చిన్నాకు జీవనోపాధి లేకుండా పోయింది. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పరామర్శల పేరుతో పబ్లిసిటీ చేసుకుంటున్నా చిన్నాను ఆదుకునే విషయంలో మాత్రం నోరుమెదపడం లేదు. జీవనాధారమైన బోటు పోయిందని, ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది.మత్స్యకారులంటే బాబుకు చిన్నచూపు మత్స్యకారులంటే చంద్రబాబుకు చిన్నచూపు. ఇలాంటి విపత్తు వేళ ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఏ విధంగా సాయం ఎగ్గొడదామా? అని చూస్తున్నారు. కారే చిన్నాతో పాటు ఒడిశా తీరానికి చేరుకున్న తొమ్మిది మంది మత్స్యకారులకు కూడా ఆర్ధిక సాయం అందించాలి. గల్లంతైన, పూర్తిగా దెబ్బతిన్న బోట్ల పునర్నిర్మాణం కోసం తక్షణమే రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలి. – వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, వంచించడమే లక్ష్యం విశాఖ ఘటనలో ఈ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు అలక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. బోటు కోల్పోయి ఆర్థికంగా కుదేలైన చిన్నాను ఆదుకోవాలి. బోటుకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి. వైఎస్ జగన్ హయాంలో రూ.10 లక్షల పరిహారం ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షలకు కుదించింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లలో చనిపోయిన, గల్లంతైన మత్స్యకారులందరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. – వాసుపల్లి జానకీరామ్, ఈస్ట్కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -
రెండేళ్లు ‘గుండు’ సున్నా
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు. అలవిమాలిన హామీలిచ్చి అందరినీ బుట్టలో వేసుకున్నారు. ఎన్నికల తర్వాత షరా మామూలే.. హమీలన్నీ తూచ్.. హామీలన్నీ అటకెక్కించడం, మేనిఫెస్టోలు మాయం చేయడం చంద్రబాబుకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. బాబుగారి సూపర్సిక్స్, సూపర్ సెవన్ మోసాలకు అన్ని వర్గాలూ లబోదిబోమంటుంటే.. ఉద్యోగులు మాత్రం గుక్కపట్టి మరీ... విలవిల్లాడుతున్నారు.. ఎందుకంటే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రెగ్యులర్గా రావాల్సినవి కూడా రాకుండా పోవడంతో.. ఈ రెండేళ్లలో చివరకు తమకు ‘బోడిగుండు’ మిగిలిందని వాపోతున్నారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన ఐదు డీఏలు, పీఆర్సీ, ఐఆర్, సరెండర్ లీవులన్నీ నిలిచిపోయాయి. చంద్రబాబు తమను నిలువునా మోసం చేశారనే ఆవేదనతో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సోమవారం అందరిముందు బోడిగుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆయనతోపాటు మరో ఇద్దరు నేతలు బోడిగుండు చేయించుకుని చంద్రబాబు పాలనలో తమకు మిగిలింది ఇదేనని చూపించారు. వారికి గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా ఎప్పటికప్పుడు పెంచి ఇవ్వాల్సిన వాటికి కూడా చంద్రబాబు ఎగనామం పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులే కాదు పోలీసులు కూడా బాబు గారి బాధితులే. ఈ రెండేళ్లలో ఒక్కో ఉద్యోగి సగటున రూ.5.15 లక్షలు.. ఒక్కో పోలీసు రూ.7 లక్షలకుపైగా నష్టపోయారని లెక్కలు తెలియజేస్తున్నాయి. తమకు ఈ స్థాయిలో నష్టం చేసిన ముఖ్యమంత్రి మరెవరూ లేరని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.పెన్షనర్లకూ భారీ నష్టమే.. జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపిన పెన్షనర్లపైనా సర్కారు కనికరం చూపలేదు. ఈ రెండేళ్లలో ఓపీఎస్ పెన్షనర్లు ఒక్కొక్కరు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టపోయారు. ఇక సీపీఎస్ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోవడంతో ఒక్కో సీపీఎస్ పెన్షనర్ నెలకు రూ.10 వేల చొప్పున రెండేళ్లలో రూ.2.50 లక్షలు కోల్పోయాడు.రాష్ట్రవ్యాప్తంగా లెక్కిస్తే.. రూ.37 వేల కోట్లకు గండిరాష్ట్రంలో సుమారు 5.6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపి), 2 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, 3.4 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్కో రెగ్యులర్ ఉద్యోగికి సగటున రూ.4–5 లక్షల చొప్పున లెక్కిస్తేనే ఉద్యోగుల నష్టం సుమారు రూ.25 నుంచి రూ.27 వేల కోట్లు. పెన్షనర్ల నష్టం మరో రూ.10 వేల కోట్లు. అంటే చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఉద్యోగ, పెన్షనర్ కుటుంబాల నుంచి నిలిపివేసిన సొమ్ము అక్షరాలా రూ.37 వేల కోట్లకు పైమాటే. ఈ సొమ్ము ఉద్యోగుల చేతికి అంది ఉంటే మార్కెట్లో చలామణి అయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ ఊతమిచ్చేది. అంటే ఉద్యోగులకు జరిగిన నష్టం సమాజంలోని అన్నివర్గాలకూ జరిగిన నష్టంగానే భావించాలి.రెండేళ్లలో ఒక్కో ఉద్యోగికీ రూ.5.15 లక్షలు నష్టం!పదేళ్ల సర్వీసు, రూ.51,140 మూలవేతనం, 12 శాతం హెచ్ఆర్ఏతో ఒక ఉద్యోగిని ఉదాహరణగా తీసుకుంటే రెండేళ్లలో అతనికి జరిగిన నష్టం ఇలా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అతనికి ఐదు డీఏలు పెండింగ్లో పడ్డాయి. ఈ ఐదు డీఏల నష్టమే రూ.1,10,480. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఆర్సీకి ముందు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. చంద్రబాబు సర్కారు మాత్రం 24 నెలలుగా ఐఆర్ ఊసే ఎత్తడం లేదు. ఆ ఉద్యోగికి రెండేళ్లలో రూ.3,27,013 ఆవిరైంది. దీనికి తోడు రెండేళ్లలో ఇవ్వాల్సిన రెండు ఎర్న్డ్ లీవ్ సరెండర్ బిల్లులు రూ.77,967 నిలిచిపోయాయి. మొత్తం నష్టం రూ.5,15,460. ప్రమోషన్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ పే, ఏఏఎస్ ఇంక్రిమెంట్లు ఇందులో కలపలేదు. అవి కూడా కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది.ఖాకీకి మరింత శరాఘాతం..ప్రజల భద్రత కోసం పండగలు, సెలవులు లేకుండా పనిచేసే పోలీసుల పరిస్థితి మరీ దారుణం. సాధారణ ఉద్యోగులకు రెండేళ్లలో రెండు సరెండర్ లీవులైతే పోలీసులకు ఏడాదికి మూడు చొప్పున ఆరు సరెండర్ లీవ్లు ఇవ్వా లి. వాటిని ప్రభుత్వం పూర్తిగా తొక్కిపెట్టింది. అదనంగా వారికి రావాల్సిన 15 టీఏలు (ఒక్కోటి రూ.2,100) కూడా పెండింగ్లోనే ఉన్నాయి. రూ.51,140 మూలవేతనం ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ నష్టం లెక్క ఇదీ.. -
ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే మా నాన్న మరణించారు
తాడేపల్లి రూరల్: ‘ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేయడం వల్లే మా నాన్న మృతి చెందారు’ అని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ చెప్పారు. బతుకుదెరువు నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఉజ్వల్ తండ్రి పద్మనాభరెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారనే సమాచారం తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సోమవారం నేరుగా విజయవాడలోని ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే తండ్రి మరణించడంతో భోరున విలపించారు.ఉజ్వల్ను ‘సాక్షి’ పలకరించగా.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూసమీకరణలో మా పొలం తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటినుంచి మా నాన్న తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉండవల్లిలో ఏం జరుగుతోందో ప్రతిరోజూ నాతో చెబుతున్నారు. సీఆర్డీఏ అధికారులు రెండ్రోజుల క్రితం కొందరి భూములను బలవంతంగా లాక్కున్న విషయం నాతో చెప్పి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 1951 నుంచి పండించుకుంటున్న పంట పొలాల్ని ప్రభుత్వం లాక్కుంటుంటే ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. నా తండ్రిలాగా ఉండవల్లిలో ఎంతోమంది రైతులు ఉన్నారు.ఇన్నిరకాల పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం రైతుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. ఐదేళ్ల క్రితం నా తల్లి చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్న పొలం చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. డయాలసిస్ పేషెంట్ అయినప్పటికీ మా నాన్న ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. భూములు లాక్కున్న నాటినుంచి ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చేరి గుండెపోటుతో నాన్న మృతి చెందారు. నా తండ్రిలా ఏ రైతూ ఇబ్బంది పడకూడదు. ఆయన పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు’ అని ప్రార్థించారు. -
కళ్లముందే పంటలు ధ్వంసం.. ఆగిన రాజధాని రైతు గుండె
నా కళ్లముందే పొలాల్లోంచి రైతుల్ని బలవంతంగా ఈడ్చేశారు. రేపు మన పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటుందని భయమేస్తోంది. ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను. పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలచుకుంటే మనందరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. – ఉండవల్లిలో ప్రభుత్వ దాషీ్టకం అనంతరం పద్మనాభరెడ్డి ఆవేదనతాడేపల్లి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ చర్యల కారణంగా రాజధాని ప్రాంతమైన అమరావతిలో సోమవారం ఓ రైతు గుండె ఆగింది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు గుంటక పద్మనాభరెడ్డి (58) తనకున్న భూమి అమ్ముకుని వైద్యం చేయించుకుందామంటే ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది. దీంతో సరైన వైద్య సేవలు అందక పద్మనాభరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.ఆదివారం రాత్రి డయాలసిస్ చేయించుకునేందుకు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. హార్ట్బీట్ పెరిగినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. ఆయనను తక్షణమే ఆస్పత్రిలో చేరాలని, సోమవారం గుండెకు సంబంధించిన వైద్యచికిత్సలు కూడా అందిస్తామని చెప్పారు. దీంతో పద్మనాభరెడ్డి వెంటనే ఆస్పత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున విపరీతమైన గుండెనొప్పి రావడంతో వైద్యసేవలు అందించేలోపే ఆస్పత్రిలోనే మరణించారు. రూ.కోట్ల విలువైన ఆస్తి ఉన్నా.. పద్మనాభరెడ్డికి ఉండవల్లి–అమరావతి రోడ్డులో 1.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ల్యాండ్ ఫూలింగ్ పరిధిలో ఉండటంతో ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బలవంతపు భూ సేకరణకు నోటీసులు అందజేసింది. ఈ భూమిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పద్మనాభరెడ్డి నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మరింత కుంగిపోయారు.‘వైద్యం చేయించుకోవడానికి నావద్ద డబ్బులు లేవు’ పద్మనాభరెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కిడ్నీ సమస్య ఉండటంతో ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. రాజధానిలో అందరికీ ఎనీ్టఆర్ భరోసా కింద ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అదీ చేయడం లేదు. నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి డబ్బులు కూడా లేవు. భూమిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో వైద్యం చేయించుకుందామంటే.. అమ్ముకోవడానికి వీల్లేకుండా రిజిస్ట్రేషన్లు ఆపేశారు. నేనేం చేయాలి’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు. పోలీసుల్ని దించి.. రైతుల్ని ఈడ్చేయడంతో మనస్తాపం కొద్దిరోజుల క్రితం ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్ కోసం 11మంది రైతులకు చెందిన 2.40 ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. పొలాల్లో వందలాది పోలీసులను దించింది. అక్కడి పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతు కుటుంబాలను బయటకు ఈడ్చేసి దౌర్జన్యంగా పంటలను ధ్వంసం చేయడంతోపాటు భూమిని చదును చేసి రోడ్లు వేశారు. ఈ ఘటనతో పద్మనాభరెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందాడు. తోటి రైతులకు ఫోన్లుచేసి ‘నా కళ్లముందే పొలాల్లోంచి రైతుల్ని బలవంతంగా ఈడ్చేశారు. రేపు మన పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటుందని భయమేస్తోంది. ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను. పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలచుకుంటే మనందరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’ అని వాపోయినట్టు పలువురు రైతులు తెలిపారు. భూముల్ని బలవంతంగా లాగేసుకుంటున్నారన్న ఆందోళనతోనే పద్మనాభరెడ్డి మృతి చెందాడని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వారంతా చెబుతున్నారు. -
కోతలు కోసి.. వాతలు వేసి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని మోపి బాదుడుకు శ్రీకారం చుట్టింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. ఇక 2025– 26లో రాష్ట్ర ప్రజల నుంచి రూ.2,800.28 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన ఇప్పటి వరకూ వేసిన భారం రూ.21,072.82 కోట్లు. ఇది కాకుండా మరో రూ.555.30 కోట్ల భారం వేసేందుకు రంగం సిద్ధంగా ఉంది. ఈ లెక్కన మొత్తం రూ.21,628.12 కోట్ల విద్యుత్ చార్జీల షాక్లిచ్చింది. ఇందులో రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించడంతో గత్యంతరం లేక యూనిట్కు 0.13 పైసలు చొప్పున వెనక్కు ఇస్తూ అదేదో ఊరికే ఇస్తున్నట్లు చంద్రబాబు సర్కారు మభ్యపెడుతోంది. మరో పిడుగు.. విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు... అబ్బే పెంచలేదని ఎన్నికల తరువాత చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మరోవైపు ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు ఛార్జీలు (ఎఫ్పీపీసీఏ) పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపే యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తూ ర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్పీపీసీఏ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సోమ వారం సమర్పించాయి. డిస్కంలు చెబుతున్న లెక్కల ప్రకా రం.. ఇప్పటికే యూనిట్కు రూ.0.40 పైసల చొప్పున రూ.2,800.28 కోట్లు వసూలు చేశా యి.కానీ వాస్తవంగా ఏపీఈఆర్సీ అనుమతించిన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.1,918.32 కోట్లు మాత్రమే. అంటే వినియోగదారుల నుంచి రూ.881.96 కోట్లు ఎక్కువ వసూలు చేసేశారు. క్యారీయింగ్ కాస్ట్ రూ.58.11 కోట్లతో కలిపి సర్దుబాటు రూ.940.07 కోట్లు అదనంగా లాగేశారు. న్యాయంగా అయితే దీనిని ప్రజల కు తిరిగి ఇవ్వాలి. అయితే మూడు డిస్కంలలో తూర్పు డిస్కం మాత్రమే క్యారీయింగ్ కాస్ట్తో కలిపి రూ.1,495.37 కోట్లు వసూలు చేసిందని... దక్షిణ డిస్కం (ఏపీఎస్పీడీసీఎల్)లో రూ.532.78 కోట్లు, మధ్య డిస్కం (ఏపీసీపీడీసీఎల్)లో రూ.22.52 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉందని లెక్కల్లో చూపించారు. అంటే ఈ మొత్తం రూ.555.30 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడనుంది. అభ్యంతరాలు కోరిన ఏపీఈఆర్సీ.. నెలకు 150 నుంచి 300 యూనిట్లు వినియోగించే కుటుంబాలకు విద్యుత్ బిల్లు ఇప్పటికే భారీగా వస్తోంది. దానికి అదనంగా ఎఫ్పీపీసీఏ, ట్రూఅప్, ఇతర సర్దుబాటు చార్జీలు చేరడంతో బిల్లులు మరింత పెరుగుతున్నాయి. ప్రతి నెల బిల్లు ఎందుకు మారిపోతోందో సాధారణ వినియోగదారుడికి అంతుబట్టని పరిస్థితి నెలకొంది. విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేయడంలో విఫలమవడం, మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం, ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటి కారణాలతో డిస్కంల వ్యయం పెరుగుతోందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.కాగా డిస్కంల ప్రతిపాదనలపై వినియోగదారులు, ప్రజాసంఘాలు, పరిశ్రమలు తమ అభ్యంతరాలు, సూచనలను ఏపీఈఆర్సీకి పంపవచ్చని కమిషన్ తెలిపింది. ఆగస్టు 3వ తేదీలోగా కర్నూలులోని కమిషన్ కార్యాలయానికి నేరుగా, పోస్టు ద్వారా లేదా ఈ–మెయిల్ రూపంలో తెలియజేయాలని ఏపీఈఆర్సీ సూచించింది. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేయనుంది.మూడు డిస్కంల విద్యుత్ అమ్మకాలు : 70,884.71 మిలియన్ యూనిట్లు వసూలుకు అనుమతి : రూ.1,918.32 కోట్లు ఇప్పటికే వసూలు చేసిన మొత్తం : రూ.2,800.28 కోట్లు అదనంగా వసూలు చేసింది : రూ.881.96 కోట్లు క్యారీయింగ్ కాస్ట్ : రూ.58.11 కోట్లు మొత్తంగా అదనపు వసూలు : రూ.940.07 కోట్లు2024 నవంబర్ బిల్లుల నుంచి రూ.6,072.86 కోట్లు వసూలు ప్రారంభం 2025 జనవరి బిల్లుల నుంచి రూ.9,412.50 కోట్లు వసూలు మొదలు 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు వసూలు (ఇందులోరూ.923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది) 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.2,800.28 కోట్లు వసూలుడిస్కంల వారీగా సర్దుబాటు లెక్కలుఏపీఎస్పీడీసీఎల్విద్యుత్ అమ్మకాలు : 28,678.57 మిలియన్ యూనిట్లు వసూలుకు అనుమతి: రూ.1,630.90 కోట్లు ఇప్పటికే వసూలు : రూ.1,112.04 కోట్లు ఇంకా వసూలు చేయాల్సింది : రూ.518.86 కోట్లు క్యారీయింగ్ కాస్ట్ : రూ.13.92 కోట్లు మొత్తం అదనపు భారం : రూ.532.78 కోట్లుఏపీసీపీడీసీఎల్విద్యుత్ అమ్మకాలు : 15,587.68 మిలియన్ యూనిట్లు వసూలుకు అనుమతి : రూ.645.42 కోట్లు ఇప్పటికే వసూలు : రూ.623.51 కోట్లు ఇంకా వసూలు చేయాల్సింది : రూ.21.91 కోట్లు క్యారీయింగ్ కాస్ట్ : రూ.0.61 కోట్లు మొత్తం అదనపు భారం : రూ.22.52 కోట్లుఏపీఈపీడీసీఎల్విద్యుత్ అమ్మకాలు : 26,618.45 మిలియన్ యూనిట్లు 2024–25లో ఎక్కువ వసూలు : రూ.358.00 కోట్లు 2025–26లో ఇప్పటికే వసూలు : రూ.1,064.74 కోట్లు అదనంగా వసూలు చేసింది : రూ.1,422.74 కోట్లు క్యారీయింగ్ కాస్ట్ : రూ.72.64 కోట్లు మొత్తంగా అదనపు వసూలు : రూ.1,495.38 కోట్లు -
కూటమి అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ను నిర్వీర్యం చేశారు
-
వైసీపీ అయితే లోపలేస్తావా..? నీకు టైమ్ దగ్గరపడింది లోకేశ్..! మాస్ వార్నింగ్
-
ఏపీ ఉద్యోగులకు మరో ఎదురుదెబ్బ..?
-
చేతకానోడివి హామీలేందుకు ఇచ్చావ్.. చంద్రబాబు పై ఉద్యోగుల ఆగ్రహం
-
బాబు కొత్త పథకం.. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
-
బాబు మరో పేరు కరువు చంద్రబాబు ఉంటే కరువు ఉండాల్సిందే..
-
రాజధాని రైతులపై వేధింపుల పర్వం... రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
-
రాజధాని రైతులపై వేధింపుల పర్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారని చెప్పారు.. మరి ఇవ్వని రైతులను ఏం చేస్తున్నారు? రకరకాలుగా వేధిస్తున్నారు? భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి పొలాలకు దారి లేకుండా చేయడం, వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేయడం, మోటార్లు, పైపులు మాయం చేయడం... ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా? రైతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేయడం లేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతం.. అసలక్కడ ఏం జరుగుతోంది..? ప్రభుత్వం రైతులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తోంది.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అక్కడకు వెళుతుంటే ఎందుకు నానా రభస చేశారు? కార్లు ధ్వంసం చేసి చివరకు హత్యాయత్నం వరకూ ఎందుకు వెళ్లారు..? ఉండవల్లి, పెనుమాకలలో భూములివ్వని రైతుల పరిస్థితి ఏమిటి? సాక్షి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ఆ ప్రాంతంలో జరుగుతున్నదేమిటో రైతులు స్వయంగా చూపించారు. వారి గోడు వెళ్లబోసుకున్నారు.. ఆ వివరాలతో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్... తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది మంది రైతులు భూ సమీకరణకు తమ భూములను ఇవ్వలేదు. దాంతో వారి భూములను భూ సేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉండటంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్ష సాధిస్తోందని రైతులు చెబుతున్నారు. అంతకు ముందు బ్యాంకు రుణాలు వచ్చేవని, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపివేశాయని రైతులు పేర్కొన్నారు. తమ పొలాలకు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందని, చనిపోయిన రైతుల పేర్లు కూడా నోటిఫికేషన్లో వచ్చాయని, కుటుంబంలో ఆస్తి పంపకాలు చేసుకున్నా అవేవీ ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. రైతుల పొలాల్లో ఇసుక డంపింగ్ చేస్తున్న అరాచకమిది వేధింపులు రకరకాలు... సమీకరణ, భూసేకరణకు భూములు ఇవ్వని రైతులను చాలా రకాలుగా వేధిస్తున్నారు. కొండవీటి వాగుపై పెనుమాక వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పక్క పొలాలకు వెళ్లే విద్యుత్ స్తంభాలను లారీలతో గుద్ది పడిపోయేలా చేశారు. రైతుల పొలాల్లో ఉండే విద్యుత్ మీటర్లు, మోటార్లు మాయం చేసేశారు. దొంగలు మోటార్ల వరకే ఎత్తుకెళ్తారని, బోర్లు పైపులతో సహా తీసుకువెళ్లిపోవడంతో ఇది ప్రభుత్వ పెద్దల దన్నుతో కాంట్రాక్టర్లు చేసిన పనే అని రైతులు అభిప్రాయపడుతున్నారు. రోజూ ఇన్ని లారీలు, ఇన్ని జేసీబీలు, వందలాది మంది మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో మోటార్లు, పైపులు ఎవరు ఎత్తుకువెళతారు? కావాలనే ప్రభుత్వం ఈ చోరీలు చేయించిందనే అనుమానాలను స్థానిక రైతులు వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బోరు పైపులు దొంగిలించారని తాడేపల్లి పోలీస్స్టేషన్లో మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడ వేసిన మొక్కజొన్న, మునగ తోటలు ఎండిపోయాయి. ఉండవల్లి పొలాల్లో మోటార్ షెడ్ను కూల్చేసి.. పొలాల్ని కంకరతో పూడ్చివేయిస్తున్న దాష్టీకానికి నిదర్శనమిదిగో.. భూములు ఇవ్వని రైతులు పంట పండించుకోనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా కొండవీటి వాగుకు ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లోకి చేరి ఈ రైతుల పొలాల చుట్టూ నీరు చేరింది. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోతోంది. పది అడుగుల లోతు తీయగానే భారీగా నీటి ఊట వస్తోంది. ఇందులో డ్రెడ్జింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ఇసుకను భారీగా బయటకు తీస్తున్నారు. నీటిని, ఇసుకను బయటకు తీసి వచ్చిన బుసకను లారీ మూడు నుంచి ఆరు వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెనుమాకకు చెందిన రైతు మేక సాంబిరెడ్డి పొలం పక్కనే కొండవీటి వాగు వెళుతుంది. అరటి తోటను జేసీబీతో ధ్వంసం చేస్తున్న రాక్షసత్వానికి రుజువిదిగో.. అతని పొలానికి మూడువైపులా రిజర్వాయర్ కోసం మట్టి తీశారు. ప్రస్తుతం ఆ పొలంలో మట్టి పెళ్లలు విరిగి కిందపడడంతో ఆ పొలం కూడా రిజర్వాయర్లోకి కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా బెదిరిస్తే భూములు ఇస్తారని ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మరో రైతు పంటపొలంలో కరెంటు స్తంభాలను లారీలతో గుద్దించి వైర్లు తెంచేశారు. పిల్లల పెళ్లికి పొలాలను రాసి ఇచ్చినా వాటిని అమ్ముకునే పరిస్థితి లేదు. వారికి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. తాము పడుతున్న కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని వేసి రైతుల బాధలు వినేందుకు పెనుమాక పంపితే తెలుగుదేశం గూండాలు వారిని మధ్యలోనే అడ్డుకుని దాడికి దిగారని రైతులు వివరించారు. పైపులతో సహా ఎత్తుకెళ్లారు పెనుమాక గ్రామంలో మా కుటుంబ సభ్యులకు చెందిన ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్నాను. మూడు నాలుగు నెలల నుంచి కరెంటు స్తంభాలను పడిపోయేలా చేసి కరెంట్ లేకుండా చేశారు. తర్వాత కరెంట్ మోటార్లు, పైపులతో సహా ఎత్తుకు పోయారు. దీనిపై తాడేపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేదు. కరెంట్లేక నీరందక ఈ పొలంలో వేసిన మునగ, అరటి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. భయపెట్టి భూములు ఇచ్చేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. – పొలిశెట్టి వెంకట శ్రీనివాసరావు, రైతుపూలింగ్కు ఇవ్వని భూమిలో రిటర్నబుల్ ప్లాట్లు నాకు పెనుమాకతో పాటు లింగాయపాలెంలో పొలం ఉంది. లింగాయపాలెంలో 43, 44 సర్వేనెంబర్లలో ఆరు ఎకరాల పొలాన్ని ఇద్దరు కూతుళ్లకు ఇచ్చాను. మేం పూలింగ్కు ఇవ్వకపోయినా అందులో 4,300 గజాలు రిటర్నబుల్ ప్లాట్లుగా వేశారు. వీటిని 12 మందికి కేటాయించారు. ఇందులో ఇద్దరు వేరే వారికి అమ్ముకున్నారు. అసలు మేం ఇవ్వని భూములను కేటాయించడానికి, అమ్ముకోవడానికి వారికేం హక్కు ఉంది. దీన్ని ప్రశి్నస్తే ఇప్పుడు భూసేకరణ నోటీసులు ఇచ్చారు. పెనుమాకలో కూడా పది ఎకరాల పొలం ఉంది. ఇందులోతోట వేశాం. దీనికి కూడా నోటీసు ఇచ్చారు. వీటిపై కోర్టుకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నాను. – మేకా వెంకటరెడ్డి, రైతురెండో విడత ఇవ్వాలంటే భయంగా ఉంది తొలి విడతలో పూలింగ్ కింద 1.30 భూమిని ఇచ్చాను. తుళ్ళూరు రెవెన్యూ పరిధిలో నాకు రిటర్నబుల్ ప్లాటు ఇచ్చారు కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. 12 ఏళ్ళు అవుతున్నా అభివృద్ది చేసి ఇవ్వలేదు. అమ్ముకుందామంటే కాగితాలపై తప్ప నేలపై కనబడటం లేదు. ఇప్పుడు రెండో విడతలో ఇవ్వాల్సింది 20 ఎకరాల భూమి ఉంది. ఇస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. – చుండు వెంకటరెడ్డి, రైతు వడ్డమాను గ్రామంరెండో విడతలో భూములిచ్చి ఇబ్బందులు పడుతున్నాంఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఉందా లేదా... ఉంటే ఏఏ గ్రామాల కింద ఏఏ సర్వే నెంబర్లలో పోతుంది? ఎప్పుడు శంఖుస్థాపన చేస్తారు? త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు ఇస్తే మీకు ఇబ్బంది ఏమిటి? వైకుంఠపురం వంతెన ఎప్పుడు నిర్మిస్తారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఉంటే కదా రెండో విడత చురుగ్గా రైతులు భూములిచ్చేది. రెండో విడత పూలింగ్కు భూములిచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. – చుండు నర్సిరెడ్డి, రైతుపొలం చుట్టూ చెరువు తవ్వేశారు భూసేకరణ చట్టం ప్రయోగించి మా నుంచి బలవంతంగా భూములు సేకరించాలని ప్రభుత్వం రెండు నెలల క్రితం నోటీసు ఇచ్చింది. మేం దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని చెప్పి, పోరాడుతున్నాం. మేం ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి భూములు ఇవ్వలేదని రిజర్వాయర్ పేరుతో మా పొలాల పక్కన 30 అడుగుల లోతులో చెరువు తవ్వేశారు. దీనివల్ల మా పొలం మట్టిగెడ్డలు చెరువులో విరిగి పడుతున్నాయి. పొలానికి రెండుపక్కల తవ్వేశారు. కొంతమంది రైతులకైతే పొలంలోకి వెళ్లేందుకు దారి కూడా లేదు. మా పక్క రైతుకు నాలుగు వైపులా తవ్వేశారు. మేమైతే భూసమీకరణకి భూములు ఇవ్వదలుచుకోలేదు. 12 సంవత్సరాల క్రితం పూలింగ్లో భూమి ఇచ్చిన రైతే ఇంతవరకు అతని రిటర్న్ ఫ్లాట్లోకి అడుగు పెట్టలేకపోయాడు. ఇవన్నీ కళ్లారా చూస్తూ కూడా భూములు ఎలా ఇవ్వాలి. – కళ్ళం శ్రీకాంత్రెడ్డి, రైతుపొలంలో మోటారు వైర్లు కట్ చేసి పైపులైన్లు తీసేశారుసీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి నాకున్న 29 సెంట్లు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. నా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధపడి 9.3 ఫారాన్ని అందజేశాను. నాకు వచ్చే కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఉండవల్లిలోని పెద్దడొంక, చిన్న డొంక వెంట ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులను కోరాను. నాకు ప్లాట్లు కేటాయించిన తరువాత నా భూమిపై పూర్తి హక్కు కల్పిస్తానని ఉండవల్లి సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలో గ్రామసభ జరుగుతున్న రోజు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించే కాంట్రాక్టర్లు నీటి వాటా వచ్చే పూలింగ్ పొలంలో ఉన్న నా మోటారు వైర్లు కట్ చేసి పైపులైన్లు తీసేశారు. అదేరోజు గ్రామ సభలో నేను ప్రశ్నించగా మోటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి నేటికీ ఇప్పించలేదు. నా పొలానికి రెండు వైపులా సీడ్ యాక్సెస్రోడ్ నిర్మాణం చేపట్టారు. నా అరటితోట చుట్టూ మెరకచేసి రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారుల మాటలు నీటిపై రాతల్లాంటివి. అందుకే ఉద్యమబాటతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నాం. – అనంత శివరావు, రైతుమా పొలానికి దారి లేకుండా చేశారు పెనుమాకలో మాకు తాతల హయాం నుంచి పొలం ఉంది. మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపేశాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారు. ఆస్తుల పంపకాల కోసం మంగళగిరి సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే మీ పొలంలో నుంచి రోడ్డు వెళ్తుందని చెప్పారు. సర్వే కోసం పెడితే వారు ఎటువంటి రోడ్డు వెళ్లడం లేదని చెప్పారు. దీనిపై రాతపూర్వకంగా ఇమ్మంటే ఇవ్వడం లేదు. నువ్వు కోర్టుకు వెళ్తే మా ఉద్యోగాలు పోతాయంటున్నారు. ఈ అంశంపై సీఆర్డీఏ కమీషనర్ను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మాకు పంట నష్ట పరిహారం గాని, క్రాప్లోన్లు గాని ఇవ్వడం లేదు. రైతులకిచ్చే సబ్సిడీలు, ఫర్టిలైజర్స్ మీద ఇచ్చే సబ్సిడీలు ఏమీ ఇవ్వడంలేదు. కరెంట్ ఉండదు, కరెంట్ స్తంభాలు పడిపోయాయి అంటారు. రోడ్లన్నీ తవ్వేశారు. ఈ చుట్టుపక్కల చెరువులన్నీ తవ్వేశారు. వెళ్లడానికి దారి లేకుండా చేసేశారు. మేము రైతులు కాదని కొంతమంది అంటున్నారు. పర్లేదు, మేము రైతులు కాకపోతే మాకు భూసేకరణ నోటీసు ఎందుకు ఇచ్చారు. మేము ఇంకా పొలాలు ఇవ్వనే లేదు. అప్పుడే మాపై దాడులు జరుగుతున్నాయి. అదే పొలాలు ఇచ్చి ఉంటే అసలు మమ్మల్ని ఊర్లో కూడా ఉండనిచ్చేవాళ్లు కాదేమో. ఇవన్నీ కూడా తలుచుకుంటేనే భయమేస్తుంది. – నవీన్, రైతు, పెనుమాక -
భూమి ఇవ్వకపోతే ఉరి తీస్తారా... నీ చేతులతోనే ఇవ్వు ఆ 30 రూపాయలు...
-
ఆంధ్రప్రదేశ్లో మరో కుంభకోణానికి తెరతీసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... ల్యాప్టాప్ల కొనుగోలులో దోపిడీకి స్కెచ్
-
రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు?
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు సర్కార్ సాగించిన దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా.. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను కనీసం పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసులను మోహరించి.. బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి.. సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడ్డారు.రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి.. భయభ్రాంతులకు గురిచేసి.. భూములను స్వా«దీనం చేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వా«దీనం చేసుకోవడం సరికాదని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. అయినా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వా«దీనం చేసుకోవడం దారుణం. ⇒ బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు ‘మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?’ అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?⇒ రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచి్చన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వా«దీనం చేసుకోవడం న్యాయమేనా? ⇒ ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములివి. మార్కెట్లో భారీ ధరలు పలికే ఈ భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబి్ధదారులు రైతులా? లేక చంద్రబాబు అస్మదీయులా?⇒ రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బ తీస్తామంటే సహించేది లేదు. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చి పారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ⇒ ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు గారూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. -
ల్యాప్‘టాప్’గా దోపిడీకి స్కెచ్
సాక్షి, అమరావతి: మీ అమ్మాయికో.. అబ్బాయికో అవసరమైన ల్యాప్టాప్ను కొనివ్వాలంటే మీరేం చేస్తారు? అత్యాధునిక ఫీచర్స్తో పేరెన్నికగన్న సంస్థ తయారు చేసిన ల్యాప్టాప్ కొనాలని చూస్తారు. నాలుగైదు దుకాణాల్లో ఆ ల్యాప్టాప్ ధరను వాకబు చేసి.. తక్కువ ధరకు నాణ్యమైనది కొనుగోలు చేస్తారు. మీరే కాదు, ఎవరైనా అదే పని చేస్తారు. కానీ.. చంద్రబాబు సర్కార్ మాత్రం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల కోసం బహిరంగ మార్కెట్ ధర కంటే ఒక్కో ల్యాప్టాప్ను అదనంగా రూ.38,500 నుంచి రూ.40,500 ధరకు అస్మదీయుని సంస్థ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 27,672 ల్యాప్టాప్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా రూ.106.53 కోట్ల నుంచి రూ.112.07 కోట్ల మేర అస్మదీయునికి ప్రయోజనం చేకూర్చి, నీకింత–నాకింత అంటూ పంచుకు తినేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి.. మేకిన్ ఇండియా స్ఫూర్తిని మంటగలుపుతూ అక్రమాల పర్వం కొనసాగింది. దేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సమగ్ర శిక్ష అభియాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు అవసరమైన ఏ వస్తువులు కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్లో టెండర్ ద్వారా సేకరించాలని నిర్దేశించింది. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశంలో తయారైన వస్తువులను మాత్రమే సేకరించాలని నిబంధన పెట్టింది. రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ ల్యాబ్లకు అవసరమైన 27,672 ల్యాప్టాప్లు (హెచ్పీ క్రోమ్బుక్ జీ1ఎం–8జీబీ ర్యామ్/64జీబీ మెమొరీ) సరఫరా చేయాలని కోరుతూ జీఈఎం ద్వారా మార్చి 19న ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ టెండర్ నోటిఫికేషన్(జీఈఎం/2026/బీ/7353884) జారీ చేశారు. నిబంధనల మార్పు వెనుక లోగుట్టు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మాత్రం ల్యాప్టాప్లు దేశంలోనే తయారైనట్లుగా మేకిన్ ఇండియా సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలని నిబంధన పెట్టారు. కానీ.. ఆ తర్వాత టెండర్లో పాల్గొనే సంస్థ ఆ ల్యాప్టాప్లను దేశంలోనే తయారు చేసినట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందంటూ నిబంధన సడలించారు. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డివైజ్ లాగ్లు, సెక్యూరిటీ డేటాను దేశీయంగా భద్రపరచాలన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిబంధనను తుంగలో తొక్కారు. దీనివల్ల మన విద్యార్థుల వ్యక్తిగత, కీలక సమాచారాన్ని విదేశీ శక్తులు చౌర్యం చేసే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్మదీయులు మాత్రమే టెండర్లో పాల్గొనేందుకు అర్హత సాధించేలా చేయాలనే ముఖ్యనేత ఒత్తిడి మేరకే అధికారులు ఈ నిబంధనలను సడలించారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తుంగలోకి మార్గదర్శకాలు ముఖ్యనేత నిర్దేశించినట్లుగానే ఈ టెండర్లో పాల్గొనేందుకు సెల్కాన్ ఇంపెక్స్, శాన్బే నెట్వర్క్స్, ది జిగ్మా టెక్నాలజీస్ ఇండియా అర్హత సాధించాయి. 27,672 ల్యాప్టాప్లను సరఫరా చేసేందుకు శాన్బే నెట్వర్క్స్ సంస్థ రూ.246,39,70,224 (ఎల్–1), సెల్కాన్ ఇంపెక్స్ రూ.254,02,89,600 (ఎల్–2), ది జిగ్మా టెక్నాలజీస్ ఇండియా రూ.279,48,72,000 (ఎల్–3)కు కోట్ చేశాయి. తక్కువ ధరకు కోట్ చేసిన శాన్బే నెట్వర్క్స్ సంస్థ ఎల్–1గా నిలిచింది. కానీ.. 70 శాతం ల్యాప్టాప్లు శాన్బే సంస్థ, మిగతా 30 శాతం లాŠయ్ప్టాప్లను సెల్ కాన్ సంస్థ సరఫరా చేసేలా రాష్ట్ర సమగ్ర శిక్ష శాఖ ఒప్పందం చేసుకుందని సరఫరా సంస్థలు చెబుతున్నాయి. ఇది కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కడమేనని.. దీన్ని బట్టి సరఫరా సంస్థలు కుమ్మక్కై అధిక ధరకు బిడ్లు దాఖలు చేశాయన్నది స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.అస్సాం.. రూ.38,501.. ఏపీ.. రూ.89,042 ⇒ కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) ద్వారా టెండర్ (బిడ్ నెంబరు జీఈఎం/2025/బీ/6920488) నిర్వహించి.. హెచ్పీ క్రోమ్బుక్ జీ1ఎం11(8జీబీ ర్యామ్/32జీబీ మెమరీ) ల్యాప్టాప్ను ఒక్కొక్కటి రూ.38,501.81 చొప్పున అస్సాం విద్యా శాఖ సేకరించింది. ⇒ అదే జీఈఎం ద్వారా రాష్ట్ర సమగ్ర శిక్ష శాఖ 27,672 హెచ్పీ క్రోమ్బుక్ జీ1ఎం (8జీబీ ర్యామ్/64జీబీ మెమరీ) ల్యాప్టాప్లను రూ.246,39,70,224కు సరఫరా చేసేలా కాంట్రాక్టర్కు అప్పగించింది. అంటే ఒక్కో ల్యాప్టాప్ను 89,042కు కొనుగోలు చేసినట్లు స్పష్టవుతోంది. బహిరంగ మార్కెట్లో ఈ ల్యాప్టాప్ రూ.43 వేల నుంచి రూ.45 వేల లోపు లభ్యమవుతోంది. క్రోమ్ ఎడ్యుకేషన్ అప్గ్రేడ్, యూఈఎం లైసెన్స్ను ఇన్స్టాల్ చేసేందుకు రూ.3 వేలు, అండ్రాయిడ్ ఎంటర్ప్రైజస్ సిఫార్సు చేసే డీఎంఎస్, డివైజ్ మేనేజ్మెంట్ లేయర్ వంటి సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసేందుకు రూ.2,500 వ్యయం అవుతుందనుకున్నా ఒక్కో ల్యాప్టాప్ ధర రూ.48,500 నుంచి రూ.50,500 లోపే ఉంటుంది. ⇒ వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో ల్యాప్టాప్ను రూ.38,500 నుంచి రూ.40,500 అధిక ధరకు కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. దీని వల్ల వాటిని సరఫరా చేసే కాంట్రాక్టు సంస్థకు రూ.106.53 కోట్ల నుంచి రూ.112.07 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోందని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్...!
-
మేమెంటో కూడా నీకు చూపిస్తాం బాబుకు అమరావతి రైతు స్టాంగ్ వార్నింగ్
-
రైతులను కొట్టి లాక్కోవడమేనా... అమరావతికి మీరు చేసే భూసేకరణ
-
చంద్రబాబు ఇంటి ముందే.. రైతులను తాళ్లతో బంధించి అక్రమంగా రోడ్లు..
-
వీడొక ఎదవ.. వాడొక దున్నపోతు.. క్యాబినెట్ లో పనికొచ్చే చర్చలు చేయండి...
-
చేతులెత్తి మొక్కుతున్నాం... మమ్మల్ని చంపేసి షాపులు తీయండి..!
-
నిలబెట్టుకోలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?.... ఆంధ్రప్రదేశ్లో కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు... భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం
-
AP కేబినెట్ చెత్త నిర్ణయం: ప్రశ్నిస్తే బొక్కలో వేయండి..
-
చంద్రబాబు కు పిచ్చి పట్టింది.. CPI రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
-
ఎందుకు మీకా పదవులు... చంద్రబాబు, పవన్ పై అంగన్వాడీల ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తిష్టవేసిన సమస్యలు... 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇపుడు 30 లక్షలే..
-
సమస్యలతో చతికిల 'బడి'
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ పాఠశాల. గత విద్యా సంవత్సరంలో ఈ స్కూల్లో 723 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 606కు తగ్గిపోయింది. మరో 40 మంది విద్యార్థులు టీసీలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, టీచర్లు బలవంతంగా ఆపారు. విద్యార్థుల్లో సగానికిపైగా పుస్తకాలు అందలేదు. బ్యాగులు, బూట్లు లేవు. కొద్ది మందికే ఇటీవల యూనిఫాం ఇచ్చారు. తాగునీటి కోసం ఇచ్చిన ఆర్వో ప్లాంట్ బిగించలేదు. దాంతో పిల్లలు చేతిపంపు నీళ్లు తాగుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా తయారయ్యాయి. బడులు తెరిచి నెలరోజులవుతున్నా విద్యార్థులను ఇంకా సమస్యలు వెక్కిరిస్తున్నాయి విద్యార్థి మిత్ర కిట్లకు మంగళం పాడేశారు. పాఠ్య పుస్తకాలు చాలా చోట్ల అందలేదు. నోటు పుస్తకాలు కొనుక్కోమంటున్నారు. బూట్లు లేవు. బెల్టులు గత ఏడాది ఎక్కడన్నా మిగిలితే టీచర్లు సర్దుబాటు చేస్తున్నారు. తాగునీటి కోసం గత ప్రభుత్వ హయాంలో అందించిన యంత్రాలను బిగించకుండా మూలన పడేశారు. బిగించిన చోట్ల మరమ్మతులుంటే చేయించడం లేదు. విద్యార్థులు చేతిపంపు నీళ్లే తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పచ్చడి మెతుకులైనా పర్లేదనుకుంటూ పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. రెండేళ్లక్రితం వరకు నిగనిగలాడిన నాడు–నేడు గదులు ఇపుడు రంగులు వెలిసిపోయాయి. పట్టించుకునే నాథుడు లేడు. ఇన్ని సమస్యల మధ్య సర్కారీ బడుల్లో చదువులు అథ:పాతాళానికి చేరుకున్నాయి. 2024లో 43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య గతేడాది 32 లక్షలకు పడిపోయింది. ఈ ఏడాది 30 లక్షల మందికి తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ‘సాక్షి’ బృందం పరిశీలించగా విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అరకు... విద్యార్థిమిత్ర కిట్లు లేవు..అరకులోయ మండల కేంద్రంలోని కంఠ»ౌంషుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 417 మంది విద్యార్థులుండగా ఒక్కరికీ విద్యార్థి మిత్ర కిట్ ఇవ్వలేదు. పాఠశాల ప్రారంభం నుంచి చిక్కీల పంపిణీ లేదు. బూట్ల ఊసేలేదు. జీవీఎంసీ 39వ వార్డులోని ఎంవీడీఎం, క్వీన్మేరి పాఠశాలల్లో 1100 మంది విద్యార్థులున్నారు. ఒక్కరికీ విద్యార్ది మిత్ర కిట్ రాలేదు. పుస్తకాలు కూడా అరకొరగా ఇచ్చారు. ఎంవీడీఎం పాఠశాలలో మరుగుదొడ్లు సమస్య ఉండడంతో విద్యారి్ధనులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం తర్వాత చేతులు కడుక్కునే వసతి కూడా లేదు. అవనిగడ్డ.. ఇంటి నుంచే భోజనం..అవనిగడ్డలోని ఏడో వార్డులో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల చాలా ముఖ్యమైనది. ఇది క్లస్టర్ పాఠశాల, అలాగే, హైసూ్కల్ ప్లస్ కూడా ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి వరకు 186 మంది విద్యార్థులున్నారు. ఇందులో సగం మంది మధ్యాహ్న భోజనం ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. ఇక్కడా పుస్తకాల కొరత ఉంది. కిట్లు ఇవ్వనేలేదు. నాడు–నేడు పనులు పూర్తయినా రంగులు వేయించకపోవడంతో సిమెంటు మచ్చలు వెక్కిరిస్తున్నాయి. ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు టీసీలు తీసుకోకుండా ఉండేందుకు ప్రతినెలా రూ.8 వేలు సొంత డబ్బులు ఖర్చుచేసి పిల్లల తరలింపునకు టీచర్లే ఆటో నడుపుతున్నారు. ఇక్కడి ఆర్వో ప్లాంట్ పాడైపోయి రెండేళ్లవుతున్నా రిపేరు చేయించలేదు. కడప... భోజనం బాగోదుకడప నగరంలోని గాందీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 770 మంది విద్యార్థులుండగా, 8వ తరగతిలో 15 మందికి యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, లైన్ నోట్ బుక్స్ను అందలేదు. 10వ తరగతిలో 25 మందికి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోగా, మరికొందరు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకున్నారు. ప్రభుత్వం పెట్టే భోజనం బాగోవడం లేదని చెప్పారు. కడపలో మధ్యాహ్న భోజనం బాగోకపోవడంతో ఇంటి నుంచి తెచ్చిన భోజనం చేస్తున్న విద్యార్థులు పాడేరు... పాత బ్యాగులు.. యూనిఫాంలు..అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 330 మంది విద్యార్థులున్నారు. గతేడాది మిగిలిన స్టాక్లో సాక్సులు, బూట్లు ఇచ్చారు. యూనిఫాం క్లాత్, పుస్తకాల బ్యాగులు, బెల్టు ఇవ్వలేదు. 6,7 తరగతుల విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు గతంలో ఇచ్చిన బెంచీలు పాడైపోతే బాగుచేయించలేదు. పిల్లలంతా చెక్క ముక్కలపై కూర్చుంటున్నారు. చాలీచాలని మరుగుదొడ్లతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఎం కార్యాలయం భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి. చిరిగిపోయిన బ్యాగును చూపిస్తున్న పాడేరు పాఠశాల విద్యార్థి భీమిలి.. అసంపూర్తిగా గదులు..భీమిలి మండలం తాటితూరు జడ్పీ హైసూ్కల్లో 218 మంది విద్యార్థులుండగా, పుస్తకాలు, గత ఏడాది మిగిలిన యూనిఫాం క్లాత్, బెల్టులు విద్యార్థులకు సర్దుబాటు చేశారు. బూట్లు, బ్యాగులు ఒక్కరికీ ఇవ్వలేదు. ప్రభుత్వం ప్రారంభించిన మన బడి– మన భవిష్యత్తుతో చేపట్టిన అదనపు తరగతి గదులు, వంటగదుల నిర్మాణం నిలిచిపోయింది. స్కూల్లోని 10 యూనిట్ల టాయిలెట్లు వినియోగంలో లేకుండా పోయాయి. భీమిలి పాఠశాలలో అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణం తెనాలి.. ఇంకా పుస్తకాలు రాలేదు..తెనాలి పట్టణం, రూరల్ మండల పరిధిలో 77 ఎలిమెంటరీ, రెండు ప్రాథమికోన్నత, 18 ఉన్నత పాఠశాలల్లో 8,890 మంది విద్యార్థులున్నారు. వీరిలో 1200 మందికి పాఠ్య, నోటు పుస్తకాలు ఇవ్వలేదు. బూట్లు, బెల్టులు గతేడాది మిగిలిన స్టాక్లో కొందరు విద్యార్థులకు సర్దుబాటు చేశారు. వాటర్ ప్లాంట్ పాడై ఏడాది అవుతున్నా బాగు చేయలేదు. దీంతో చేతి పంపు నీటినే పిల్లలు తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం లోప భూయిష్టంగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల నుంచి లంచ్ బాక్స్లు తెచ్చుకుని తింటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రధానోపాధ్యాయులు తమ వేతనం నుంచి డబ్బు ఖర్చుచేసి వారానికి ఒకసారి బయట వ్యక్తులతో శుభ్రం చేయిస్తున్నారు.డబ్బులివ్వరు.. కిట్లు రావు... 2024–25 విద్యా సంవత్సరంలో 36 లక్షల మంది విద్యార్థులకు రూ.911 కోట్లతో గత ప్రభుత్వమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో∙2024 జూన్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి 35 లక్షల కిట్లు సరఫరా కోసం రూ.910 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 2024–25 బిల్లులు చెల్లించలేదని, అది చెల్లిస్తేనే వస్తువులు సరఫరా చేస్తామని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. దాంతో సమగ్ర శిక్షలోని కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.352 కోట్లు చెల్లించి, మిగిలిన మొత్తం చెల్లించేందుకు గడువు తీసుకోగా వస్తువులు సరఫరా చేశాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ముగిసేనాటికి ఇంకా 20 శాతానికి పైగా విద్యార్థులు కిట్లు లేకుండానే చదువులు పూర్తిచేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి కూడా 35 లక్షల మంది విద్యార్థులకు రూ.910 కోట్లతో కిట్లు కొనుగోలుకు టెండర్లు పిలవగా, రెండేళ్ల బాకీ రూ.1,372 కోట్లు ఇస్తేనే బిడ్డింగ్లో పాల్గొంటామని ఆయా కంపెనీలు చెప్పాయి. దీంతో నిధుల విడుదలకు ప్రభుత్వం జీవోలు ఇచ్చినా, డబ్బులు ఇవ్వలేదు. దీంతో కిట్లు సరఫరా కాలేదని తెలిసింది. నాడు బడి తెరిచిన రోజే కిట్లు పంపిణీ...ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా బడులు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు ఇవ్వాలి. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీల నుంచి బిడ్లు ఆహా్వనించి టెండర్లు అప్పగిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరు నెలల ముందే కిట్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యేది. కంపెనీలకు నిధుల చెల్లింపు సకాలంలో జరిగేది.. కిట్లు సకాలంలో పంపిణీ అయ్యేవి. సర్కారు బడిలో 1–10 తరగతులు చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు రూపాయి ఆరి్థక భారం ఉండకూడదని ‘జగనన్న విద్యా కానుక’ను 2020–21 విద్యా సంవత్సరం నుంచి అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే రూ. 2900 విలువైన కిట్లు పంపిణీ చేశారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ(హైస్కూల్), మూడు జతల యూనిఫాం క్లాత్, బెల్టు, టై అందించారు. వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్ధతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. నాలుగు విద్యా సంవత్సరాలు రూ.3366.53 కోట్లతో జగనన్న విద్యా కానుకలను అందించారు. -
బాబు చిర్రు.. బుర్రు మహిళపై అనుచిత ప్రవర్తన వీడియో లీక్
-
అన్నీ ప్రైవేట్ పరం.. ప్రజలకు బూడిద . బాబు ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
బాబు పాలనపై పద్యం పాడిన లక్ష్మి పార్వతి.. ఈ వీడియో చూస్తే బాబు నిద్రపోడు
-
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
రామాయపట్నం రాసిచ్చేస్తాం..
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ ఖాతాలో తాజాగా రామాయపట్నం పోర్టు చేరిపోయింది. గత ప్రభుత్వ హయాంలోనే 95 శా తానికిపైగా పూర్తయిన పోర్టును అడ్డగోలుగా ప్రైవేట్ చేతికి అప్పగిస్తోంది. దాదాపు రూ.ఐదు వేల కోట్ల విలువైన ఈ పోర్టును అత్యంత కారుచౌకగా రూ.1,500 కోట్లకే అది కూడా ఇప్పుడు సగం చెల్లిస్తే చాలనే షరతుతో అప్పనంగా ఇచ్చేస్తోంది. అనంతరం పోర్టు విస్తరణకు కేవలం ఎకరం రూపాయికే అత్యంత విలువైన భూములను కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది. ఈమేరకు రామాయపట్నంపోర్టును ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు తాజాగా బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. ఆస్పత్రులు.. ఫిషింగ్ హార్బర్లు.. పోర్టులు.. బీమా పేరుతో ఆరోగ్యశ్రీ సేవలు..! ఇలా అన్నింటినీ కారుచౌకగా ప్రైవేట్కు అప్పగించి చంద్రబాబు సర్కారు దోచి పెడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సృష్టించిన రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులన్నీ ప్రైవేట్కు పప్పు బెల్లాలకు అప్పగిస్తూ ఖజానాకు గండి కొడుతోంది. కొత్తగా సంపద సృష్టించకపోగా గత ప్రభుత్వం సమకూర్చిన విలువైన ఆస్తులను సైతం ఊడ్చేస్తోంది. 50 ఏళ్ల దీర్ఘకాలానికి.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను ప్రారంభించడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను కూడా సమకూర్చింది. గత ప్రభుత్వంలోనే 95 శాతానికిపైగా పనులు పూర్తై వాణిజ్య కార్యకలాపాలు సైతం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కారు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు తిలోదకాలిస్తోంది. పూర్తయిన తొలి దశ పోర్టును నిర్వహించడంతో పాటు పోర్టు విస్తరణ పనుల కోసం 30 ఏళ్ల దీర్ఘకాలానికి ఆపైన మరో 20 ఏళ్లు మొత్తం 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనున్నారు. తొలిదశలో మొత్తం 850.79 ఎకరాల్లో రూ.4,929.39 కోట్లతో (భూమి విలువతో కలిపి) గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టును కేవలం రూ.1,500 కోట్ల అప్ఫ్రంట్ ప్రీమియం ధరకు ఇచ్చేస్తున్నట్లు టెండర్ డాక్యుమెంట్లో చంద్రబాబు సర్కారు పేర్కొంది. అదికూడా తొలుత రూ.750 కోట్లు చెల్లించి, మిగిలిన మొత్తం పోర్టు వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత ఇస్తే సరిపోతుందంటూ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలోనూ పోర్టు పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఇక మిగిలిన కొద్దిపాటి పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం పూర్తి చేయకుంటే ఆ విలువను అప్ ఫ్రంట్ విలువ నుంచి తగ్గించుకుంటారు. దీంతో రూ.1,500 కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు పూర్తిగా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. నాలుగు బెర్తులతో 34 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న పోర్టును ఇలా అప్పనంగా ఇచ్చేస్తుండటం చూసి సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. బ్రేక్ వాటర్ పనులు, బెర్తులు, భవనాలు అన్నీ పూర్తయ్యి.. రోడ్డు, రైల్వే కనెక్టివిటీ కూడా కలిగిన రామాయపట్నం పోర్టును కారుచౌకగా కట్టబెడుతుండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పోర్టును అభివృద్ధి చేయడం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకున్న రుణం రూ.2,079 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే కేవలం రూ.750 కోట్లు చేతిలో పట్టుకొని వస్తే అన్ని హంగులతో ఉన్న పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. పోర్టు విస్తరణకు ఎకరం ఏడాదికి రూపాయి లీజుకే కట్టబెడతామని, పోర్టును రూ.1500 కోట్లకే అప్పగిస్తామని, అదీ ఇప్పుడు సగం చెల్లిస్తే చాలు అంటూ టెండర్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలు బంగారు బాతు లాంటి పోర్టు బలి! పోర్టు ఆదాయంలో ఎవరు ఎక్కువ శాతం వాటా ఇస్తారో వారికి ఈ పోర్టును అప్పగించనున్నట్లు బిడ్లో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇప్పుడు ప్రైవేటు సంస్థ చూపించే మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే రాష్ట్ర ఖజానాకు చిల్లు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు వివిధ కార్యకలాపాల కోసం ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేసి ఆదాయాన్ని దారి మళ్లించేస్తాయని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసిన పోర్టుల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో గతంలో ఇలాంటి మోసాలు వెలుగు చూసిన విషయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు గుర్తు చేశారు. ఒకసారి దీర్ఘకాలిక ఒప్పందం కుదిరిన తర్వాత నిబంధనల్లో మార్పుకు వీలుండదని, ప్రైవేటు సంస్థలు నిర్ణయించే టారీఫ్లపై కలగచేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండదని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు సర్కా రు తీరు చూస్తుంటే బంగారు గుడ్లు పెట్టే బాతు కథ గుర్తుకొస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దురాశతో బాతును చంపినట్లుగా కేవలం రూ.1,500 కోట్ల కోసం రూ.వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చే పోర్టును బలి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎకరం రూపాయికే... రామాయపట్నం పోర్టును 850.79 ఎకరాల్లో అభివృద్ధి చేసినందుకుగానూ కేవలం 12 శాతం ఈక్విటీని చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఇంత తక్కువ ఈక్విటీ కలిగి ఉండటం వల్ల ఈ పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు. అంతేకాదు.. మలిదశలో పోర్టును అభివృద్ధి చేసేందుకు ఎకరం ఏడాదికి రూపాయి లీజు చొప్పున కావాల్సినంత భూమిని ఇచ్చేస్తామని టెండరు డాక్యుమెంట్లో పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సుమారు 2,000 ఎకరాలను సమీకరించింది. రామాయపట్నం పోర్టు పక్కనే బీపీసీఎల్ లాంటి అతిపెద్ద రిఫైనరీ రావడమే కాకుండా ఇప్పటికే ఈ పోర్టులో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఒక బెర్తు తీసుకుంది. పక్కనే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అతిపెద్ద భారీ సోలార్ ప్యానల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇన్ని హంగులున్న పోర్టును చంద్రబాబు సర్కారు ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నువ్వు సౌత్ కొరియా వెళ్ళకు! బాబు అప్పులు.. కొడుకు ట్రిప్పులు..
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఉద్రిక్తత
-
చంద్రబాబు చెప్పాడా.. రిపోర్టర్ ప్రశ్నకు పెద్ది రెడ్డి అదిపోయే కౌంటర్
-
బాబు సర్కార్ పై అయ్యన్నపాత్రుడు ఫైర్
-
ఆ 8 గంటలే కొంప ముంచాయి
ఈ నెల 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు ప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే మరుసటి రోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించాం. – మీడియా సమావేశంలో మెరైన్ ఐజీ గోపినాథ్ జెట్టిమాకు 5వ తేదీ ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. – మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్ నాయక్ఈ నెల 4న శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బోటు బోల్తా పడింది. 12 గంటల పాటు సముద్రంలో ఈది.. ఈది.. అలసిపోయాం. తెల్లారే వరకూ ఊపిరి బిగపట్టుకొని ఉన్నాం. రావాల్సిన బోటు ఎందుకు రాలేదనే అనుమానంతో గాలించేందుకు వస్తారు.. అప్పటి వరకు బతికే ఉండాలని అందరం అనుకున్నాం. కానీ.. ఎవరూ రాలేదు. దూరంగా కనిపించిన చైనా షిప్ వద్దకు నేను చేరుకునే సరికి ఆదివారం ఉదయం 9 గంటలైంది. కనీసం ఉదయం 6–7 గంటలకు మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే నలుగురైదుగురం బతికేవాళ్లం. – బోటు ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన కారి చిన్నా సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట: సముద్రపు అలల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల పాలిట అత్యంత ప్రమాదకరంగా మారిందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆపదలో ఉన్నామని, తమ వారి జాడ దొరకడం లేదని రాత్రి గొంతు చించుకుని మొత్తుకున్నా.. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించక పోవడం వల్లే విషాద తీవ్రత పెరిగిందని వాపోతున్నారు.వేటకు వెళ్లిన వారు ‘గంటలో వస్తాం’ అని చెప్పిన గంటకే.. ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో గుండెలు పగిలిన కుటుంబ సభ్యులు రాత్రి 11.30 గంటలకే అధికారులకు సమాచారం అందించారు. బోటు గల్లంతైన విషయం రాత్రే తెలిసిందని సాక్షాత్తూ విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టీ మీడియా సమావేశంలోనే వెల్లడించారు. అయినా సరే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం.. ఉదయం 8 గంటల వరకూ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టకుండా యంత్రాంగం నిద్ర నటించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ 8 గంటలే తమ కొంప ముంచాయని బాధిత మత్స్యకార కుటుంబాలు నిప్పులు చెరుగుతున్నాయి. రెవెన్యూ విభాగానికి ముందే తెలుసా? మెరైన్ విభాగానికి రాత్రి 11.30 గంటలకు సమాచారం అందితే.. రెవెన్యూ విభాగానికి అంతకు ముందే ప్రమాద సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 8.30 గంటలకు రెవెన్యూ విభాగానికి మత్స్యకారులు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. ముందు రోజు రాత్రి సమాచారం వస్తే.. మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టలేదన్న సందేహాలు నెలకొన్నాయి.ఆ అత్యంత కీలకమైన 8 గంటల కాలాన్ని విపత్తులో చిక్కుకున్న ప్రాణాలను రక్షించడానికి కాకుండా ఎందుకు వృథా చేశారు? చీకట్లో సైతం గాలింపు చర్యలు చేపట్టే అత్యాధునిక రాడార్, హెలికాప్టర్ వ్యవస్థలు, కోస్ట్గార్డ్ దళాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు ఆ సమయంలో గాలింపు చర్యలు చేపట్టలేదు? వెంటనే రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగి ఉంటే.. ఆ ఏడుగురూ ఇప్పుడు వారి ఇళ్లలో సురక్షితంగా ఉండేవారు కాదా అనే ప్రశ్నలు మత్స్యకారుల నుంచి దూసుకొస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రమాదం నుంచి బయటపడిన చిన్నా కూడా స్పష్టం చేశారు. మత్స్యకార కుటుంబాల ఆగ్రహ జ్వాల ప్రభుత్వ చేతకానితనం, అధికారుల ఘోర వైఫల్యమే తమ వారిని సముద్రం పాలు చేసిందంటూ మత్స్యకార కుటుంబాలు మత్స్యశాఖ జేడీ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. తమ వారి ఆచూకీ తెలియక పోవడానికి కారణమైన ఆ 8 గంటల నిర్లక్ష్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళ్లెదుటే జరిగిన ఈ ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం హడావిడి మొదలుపెట్టింది. మత్స్యకారుల ఆచూకీ తెలిసేంత వరకు గాలింపు చర్యలు చేస్తామని చెప్పారు. ముగిసిన గాలింపు చర్యలు గాలింపు చర్యలు మొదలు పెట్టిన రోజు మత్స్యకార కుటుంబాలతో కలెక్టర్ అభిషేక్త్ కిశోర్ మాట్లాడుతూ.. గల్లంతైన వారు దొరికే వరకు గాలింపు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ.. మంగళవారం ఉదయం బాధిత కుటుంబాల్ని పరామర్శించిన మత్స్యశాఖ కమిషనర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన 72 గంటల తర్వాత ఆపేస్తామని, తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయం, పునరావాస చర్యలు మొదలు పెడతామని ప్రకటించడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.మంగళవారం అర్థరాత్రి వరకూ రెండు కోస్ట్గార్డ్ నౌకలు, 3 నేవీ హెలికాప్టర్లు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. కోస్టు గార్డు రీజినల్ ఆపరేషన్ సెంటర్ నుంచి ఐజీ గోపీనాథ్ జెట్టి ఈ ఆపరేషన్ని పర్యవేక్షించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినా, ఏ ఒక్క మత్స్యకారుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అన్వేషణ కొనసాగించాలని, తమ వాళ్లు దొరికే వరకూ ఆపొద్దని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.కానీ.. నిబంధన ప్రకారం 72 గంటల పాటు రెస్క్యూ చేపట్టామని, దీనికి అదనంగా మరో 6 గంటలు నిర్వహించామని.. ఆచూకీ దొరకనందున రెస్క్యూ ఆపరేషన్ నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బతికున్న వారినైనా కనిపెట్టండి.. లేదా చివరి చూపు కోసం వారి మృతదేహాలనైనా అన్వేషేంచి అప్పగించండని వేడుకుంటున్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ భరోసా ఇచ్చారు. మంగళవారం ఫిషింగ్ హార్బర్లోని మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలింపు చర్యలు పూర్తయ్యాక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.రెవెన్యూ, కార్మీక, మత్స్యశాఖల సమన్వయంతో సహాయం అందిస్తామని చెప్పారు. మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులతో కూడా చర్చించి, కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి కల్పించే చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని తెలిపారు. ఏడుగురిలో ఒకరే ప్రాణాలతో బయట పడ్డాడని, మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారని చెప్పారు. చిన్నా ఆరోగ్యం మెరుగు పడిందని వైద్యులు ప్రకటించారు. రెస్క్యూ జరిగిందిలా.. సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరుగురు గల్లంతవ్వగా.. ఒకే ఒక్క మత్స్యకారుడు చిన్నా మృత్యువుతో 12 గంటల పాటు పోరాడుతూ చైనా షిప్లోకి చేరుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. చైనా వాణిజ్య నౌక నుంచి కారి శ్రీనుని తీసుకొచ్చేందుకు నౌకాదళం, కోస్ట్గార్డ్ బృందాలు అష్టకష్టాలు పడ్డాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా షిప్ వద్దకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో హెలికాఫ్టర్ సాయంతో చిన్నాను తీసుకొచ్చారు. ఈ దృశ్యాల్ని భారత రక్షణ దళ అధికారులు విడుదల చేశారు. -
అప్రూవర్ తంత్రం.. సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. తాము చెప్పినట్లు విని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే అరెస్ట్ చేయకుండా, ముందస్తు బెయిల్కు సహకరిస్తామని ప్రలోభపెట్టిన సిట్.. ఆ మేరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్య ప్రసాద్తో తమకు అనుకూలమైన విధంగా పేర్లు చెప్పించుకుని.. ఆపై ముందస్తు బెయిల్ను వ్యతిరేకించక పోవడం ఈ కుట్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వం తీరు మొదటి నుంచి ఇలానే ఉంది. సిట్ ద్వారా ప్రలోభ పెట్టడం.. అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకోవడం.. టార్గెట్ చేసిన వ్యక్తుల పేర్లు చెప్పించడం.. తద్వారా కక్ష సాధింపే లక్ష్యంగా అడుగులు వేయడం పరిపాటిగా మారింది. తన కుట్రకు అనుకూలంగా వ్యవహరిస్తే అరెస్ట్ చేయకుండా వదిలేయడం.. బెయిల్ వచ్చేలా సహకరించడం.. లేదంటే అరెస్ట్ చేసి వేధించడమే పనిగా పెట్టుకుంది. వాస్తవానికి మద్యం అక్రమ కేసులో నిందితుడైన సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్కు వెళ్లినప్పుడు సిట్ తీవ్రంగా అభ్యంతరం చెప్పాలి. అయితే అందుకు విరుద్దంగా చూసిచూడనట్లు మిన్నకుండి పోవడం ప్రభుత్వ పెద్దల కుతంత్రాన్ని బట్టబయలు చేస్తోంది. ఇలాగైతే న్యాయం, ధర్మం ఎక్కడుంటుందని సర్వత్రా ఆవేదన, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్టానికి పాతరేసి ఇష్టానుసారం కేసును నడిపించడం ముమ్మాటికీ కుతంత్రమేనని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్ను సిట్ మాట మాత్రంగానైనా వ్యతిరేకించక పోవడమే నిదర్శనమని ఎత్తి చూపుతున్నారు. కనీస ఆధారాలు కూడా లేకుండా నమోదు చేసిన ఈ కేసులో పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే చంద్రబాబు ప్రభుత్వం ఆధార పడిందన్నది ఇప్పటికే స్పష్టమైంది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాజకీయ వేధింపుల కోసం ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీసింది. కూటమి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులు సూత్రధారులుగా సాగుతున్న ఈ పన్నాగంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఉద్యోగి సత్య ప్రసాద్ తదితరులు పాత్రధారులుగా మారారన్నది తేటతెల్లమవుతోంది. అవాస్తవాలు, అభూత కల్పనలతోనే కుట్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ మూడు నెలలపాటు దర్యాప్తు చేసి, ఏమీ ఆధారాలు లేవని చేతులెత్తేయగా.. టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది. అనంతరం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతోనే ఈ కేసులో తమ కుట్రను అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ను లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. అందుకు వాసుదేవరెడ్డి మొదట్లో సమ్మతించ లేదు. దాంతో డిప్యూటేషన్ కాల పరిమితి ముగిసినా సరే ఆయన్ను రిలీవ్ చేయకుండా, కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన్ను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మూడు రోజులపాటు వేధించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, సిట్ వేధింపులు తట్టుకోలేక వాసుదేవరెడ్డి లొంగిపోయారు. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అదే బాటలో సత్య ప్రసాద్ కూడా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఈ కేసులో పలు డిస్టిలరీల ప్రతినిధులను విచారణ పేరుతో పిలిపించి వేధించారు. ఓ డిస్టిలరీ ప్రతినిధి కుటుంబ సభ్యులు సిట్కు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. రిటైర్డ్ కానిస్టేబుల్ను కూడా అక్రమంగా నిర్బంధించి వేధించారు. ఆయన కొడుకుతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలని ఒత్తిడి తెచ్చారు. మద్యం విధానంతో సంబంధంలేని వారూ అరెస్ట్ ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కసిరెడ్డి చెప్పని వాంగ్మూలాన్ని చెప్పినట్టుగా న్యాయ స్థానానికి నివేదించారు. కాగా, ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం లేకపోవడంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది. ఇక అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలజీ గోవిందప్ప చెప్పని విషయాలు చెప్పినట్టుగా వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సిట్ కుతంత్రం బయట పడింది. మద్యం విధానంతో ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి తదతరులను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసి వేధించింది. ఈ విధంగా లేని ఆధారాలు సృష్టించేందుకు పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలపైనే సిట్ ఆధారపడి బరితెగించింది. అరెస్ట్ లేకుండానే ముందస్తు బెయిల్.. ముమ్మాటికీ అప్రూవర్ కుట్రే – తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లతో అప్రూవర్ కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. నిందితులుగా ఉన్న వారిద్దరినీ అప్రూవర్లుగా మార్చి, ఈ కేసు నుంచి తప్పించాలని ఎత్తుగడ వేసింది. కాగా అరెస్టు కాకుండా అప్రూవర్గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గతంలో తోసిపుచ్చింది. ఈ విషయంలో సిట్ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ముందస్తు బెయిల్ ఇస్తే తప్ప.. అప్రూవర్లుగా మారలేమన్న వారి ఉద్దేశం న్యాయ వ్యవస్థతో బేరసారాలు సాగించడమే అని వ్యాఖ్యానించింది. సిట్కు వారికి మధ్య బేరం కుదిరినట్టు ఉందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అప్రూవర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యే వరకు వారు కస్టడీలోనే ఉండి తీరాలని చెప్పింది. – అనంతరం హైకోర్టు కూడా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిట్ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసింది. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్ను సిట్ తరపు న్యాయవాదులు పెద్దగా వ్యతిరేకించక పోవడం గమనార్హం. – తాజాగా సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో కూడా సిట్ అదే తంత్రాన్ని అనుసరించింది. ఇక్కడ అరెస్ట్ అనే మాటకు తావే ఇవ్వలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పట్ల సిట్ చిత్తశుద్ధితో వ్యవహరించ లేదు. ఈ నేపథ్యంలోనే సత్య ప్రసాద్కు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లను అధికారికంగా అప్రూవర్లుగా మార్చి.. వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు నమోదు చేయించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తర్వాతి అంకం అన్నది స్పష్టమవుతోంది. – అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన కేసు పూర్తిగా అక్రమమేనన్నది తేటతెల్లమవుతోంది. ఎటువంటి అవినీతి లేని ఈ విధానంలో లేని ఆధారాలు సృష్టించేందుకే సిట్ ద్వారా ప్రభుత్వం కుట్రకు బరితెగిస్తోందన్నది సుస్పష్టమవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు సిట్.. చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని విమర్శిస్తున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపు కోసం అక్రమ కేసునే ఆయుధంగా చేసుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. -
నిజం ఒప్పుకున్న చంద్రబాబు 2029 లో జగనే సీఎం..!
-
APSRTC జేఏసీ నేతల ఆందోళన.. ప్రభుత్వ విద్యుత్ బస్సులే ముద్దు
-
గ్రామాల్లో మంచినీటికీ మీటర్లే
సాక్షి, అమరావతి: విద్యుత్తు వాడకానికి స్మార్ట్ మీటర్లను అనుమతించేది లేదని ఎన్నికల ముందు గంభీరంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తాగునీటికి సైతం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. గ్రామీణ ప్రాంత తాగునీటి వ్యవస్థలోనూ నీటి పరిమాణాన్ని నిర్ధారించే మీటర్ల ఏర్పాటుతో పాటు మంచినీటి పథకాల నిర్వహణకు నిధుల సమకూర్చుకునేందుకు యూజర్ చార్జీల వసూలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. ఈ జీవోలో ప్రభుత్వ నిర్ణయాలు, వాటి అమల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, అధికారుల బాధ్యతలను నిరా్ధరించారు. గ్రామాల్లో ఇళ్లకు తాగునీరు సరఫరా చేసే ప్రతి డెలివరీ పైపుపై తప్పనిసరిగా కాలిబ్రేటెడ్ ఫ్లో (సరఫరా చేసే నీటి పరిమాణం కొలిచే) మీటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ మీటర్ల ద్వారా ఎంత పరిమాణంలో నీటిని వినియోగించారన్నది కూడా ఖచ్చితంగా కొలవాలని మరోచోట నిర్దేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఆధ్వర్యంలో నీటి పరిమాణ నిర్ధారణ మీటర్లను ఏర్పాటు చేయాలని.. పంపు ఆపరేటర్లు ప్రతి నెలా 1, 15వతేదీలలో ఆయా మీటర్లలో వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల చుట్టూ 15 మీటర్ల పరిధిని ‘నో–యాక్టివిటీ జోన్’గా ప్రకటించి బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం, చెత్త వేయడం పూర్తిగా నిషేధించాలని సూచించారు. బోర్లకు 50 మీటర్ల పరిధిలో సెప్టిక్ ట్యాంకులు లేదా మురుగునీటి గుంతలు ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. -
బరితెగించిన బాబు సర్కార్
తన రాజకీయ జీవితంలో ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం అలవాటు లేనట్టే... అందలం ఎక్కినప్పుడల్లా సాధారణ పౌరులకు ఆటవిక పాలన రుచిచూపించే ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది.‘హే రామ్... సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు బాబు దుష్ట పోకడలకు అద్దం పట్టింది. గూండాలకూ, రౌడీలకూ పార్టీ ముద్రేసి మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించటం, చివరకు బాధితుల్నే అరెస్టు చేయటం ఏపీలో మాత్రమే కనబడే వింత పోకడ. అలాగే, నిలదీస్తున్నవారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టడం, బెయిలొచ్చినపక్షంలో మళ్లీ మళ్లీ అరెస్టు చేయటం రివాజుగా మారిన తంతు. ఈమధ్య ఏకంగా పోలీసులే యమ కింకరుల పాత్ర పోషిస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీస్తున్నారు. బూడిద కూడా మిగలకుండా చేస్తున్నారు. ముగ్గురు మహిళల అనుమానాస్పద మరణాలు, ఒక దళిత యువకుడి ఆత్మహత్య ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ పోస్టు పెట్టారు. ‘ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. అవి మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయి’ అంటూ జగన్ చేసిన నిశిత విమర్శ చాలా కీలకమైనది. ఇది చంద్రబాబు పాలన తాలూకు డీఎన్ఏ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయనది ఇదే మార్కు ఏలుబడి. ఆ కాలంలో లాకప్ డెత్లు, ఎన్కౌంటర్లతోపాటు నయీంవంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచిన ప్రైవేటు ముఠాలు పాల్పడిన హింసాత్మక ఉదంతాలకు అంతులేదు. వీటన్నిటి వెనకా చంద్రబాబు సర్కారు ప్రమేయం ఉందన్న ఆగ్రహానికితోడు... పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు తెగనమ్మడం, కరవుతో బక్కచిక్కిన రైతుల్ని పీడించుకు తినటంవంటి కారణాలతో 2004లో ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించారు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో గాయపడి, ఆ కట్టుతోనే ఎన్నికల ప్రచారసభల్లో తిరిగినా ఆయనకు సానుభూతి దక్కలేదు. తన నిజస్వరూపం తెలియని ఈ తరానికి తానేమిటో ఇప్పుడు ఆయనే చెప్పక చెబుతున్నారు. గతానికి మించిన అరాచకాన్ని పెంచి పోషిస్తున్నారు. ఎంతో హేతుబద్ధంగా ప్రశ్నించే ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోలు సైతం సహించలేని దుఃస్థితికి కూటమి సర్కారు చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీనుంచి గోల్డ్మెడల్ అందుకున్న జర్నలిస్టు కేవీఆర్ అనని మాటల్ని అన్నట్టుగా చిత్రించి, ఆ నెపంతో హైదరాబాద్లో అర్ధరాత్రి ఆయన ఇంటిపైబడి అరెస్టు చేశారు. వచ్చినవారు పోలీసులో,గూండాలో తెలియక ఆందోళనపడిన ఆయన భార్యను నెట్టేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్న రావణ్ని సైతం ఈ మాదిరిగానే అరెస్టు చేసి తీసుకెళ్లారు. వరసబెట్టి నాలుగు చోట్లా బెయిల్ రావటంతో దిక్కుతోచని కూటమి సర్కారు, ఏకంగా ఉపా చట్టాన్ని ప్రయోగించింది. పోలీస్స్టేషన్లపై జనసేన పేరిట గూండాలు దాడిచేయటం మరో ప్రహసనం.సరిగ్గా రెణ్ణెల్ల క్రితం విజయవాడ పోలీసులు అరెస్టుచేసి, మాయం చేసిన సాయికృష్ణ కేసులో సర్కారీ పోకడలు మానవతకే మాయని మచ్చ. ఆ యువకుణ్ణి మే 6న అరెస్టు చేశాక అతని తల్లి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతూనేవున్నా ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోలేదు. కనీసం బూడిద ఇస్తే అంతిమసంస్కారం చేసుకుంటామని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతున్నా అది అరణ్యరోదనే అయింది. పోలీస్స్టేషన్ డాబాపై ఎముకలు, బూడిద దొరికాయని హైకోర్టుకే కట్టుకథలు చెబుతున్నారు. సాయికృష్ణ తల్లి డీఎన్ఏతో పోల్చిచూడకుండానే ఇంత బాధ్యతారహితంగా చెప్పడం ఆశ్చర్యకరం. అతని హత్య మాత్రమే కాదు... దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్యతోపాటు మే, జూన్ నెలల్లో గంగమ్మ, తిరుపతమ్మల లాకప్ డెత్, మరో మహిళ కళావతి ఆత్మహత్య ప్రజానీకాన్ని దిగ్భ్రాంతిపరిచాయి. రాష్ట్రంలో చట్టం చట్టుబండలైన తీరుపైనా, ఈ హత్యోదంతాలపైనా సీబీఐ దర్యాప్తే సరైంది. ఈ విషయంలో న్యాయస్థానాల్లోనూ, వెలుపలా పోరాడితే తప్ప న్యాయం దక్కదు. -
ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..
-
TDP ఆఫీసుల్లో టీ, కాఫీకి బదులు బీర్లు, మద్యం ఇస్తారా!
-
సర్ సర్వేతో సచివాలయ ఉద్యోగులకు.. చంద్రబాబు సర్కార్ చుక్కలు..
-
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
-
ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం.. CPI రామకృష్ణ సీరియస్
-
సాయికృష్ణ తల్లిని చంపేందుకు జైలు నుంచే CI మర్డర్ ప్లాన్
-
ఇంకో 50 వేల ఎకరాలు కావాలా..? సిగ్గులేదా అడగడానికి...?
-
కూటమి సర్కార్కు జూనియర్ లాయర్ల గట్టి హెచ్చరిక!
-
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు
-
పవన్ కళ్యాణ్ కు హోంమంత్రి పగ్గాలు..?
-
ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్
-
ముళ్ల కంపలు.. నీళ్ళు తోడుకోవడం తప్ప అమరావతిలో ఏ ఒక్క పనైనా చేశావా?
-
చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
హే రామ్..సేవ్ ఆంధ్ర
‘‘సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి.’’‘‘సాయికృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణ వాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్లను చిన్న చిన్నోళ్లకు పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ’’‘‘18 నెలల సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రిమాండ్ రిపోర్టులో రాశారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యం? ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడమేమిటి? ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే... కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు?’’ ‘‘అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439.’’ ‘‘రెండేళ్ల క్రితం ఏ ఇంట్లో అయినా సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది.’’‘‘జంగిల్ రాజ్ అంటే బిహార్లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా వారిని నిందితులుగా చూపిస్తూ కేసులు పెట్టిన ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టం) పక్కకు పోయి మొత్తం ‘రూల్ ఆఫ్ ఫియర్’(భయం) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఇక్కడ జంగిల్రాజ్ పాలన సాగుతోంది.’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎదురు లేదని, తామేం చేసినా చెల్లుతుందన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, తాను మోసం చేసిన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లపై ప్రశ్నించేవారి గొంతు నొక్కడం కోసం చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారని ఎత్తిచూపారు. సాయికృష్ణ లాకప్డెత్, శవాన్ని మాయం చేయడం, పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడతాయని అన్నారు. చివరకు తాను వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలిసే వరకు, ప్రభుత్వంలో చలనం రాలేదని, దాదాపు 46 రోజుల పాటు గోప్యంగా ఉంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే అంటున్నాం.. ‘‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’’ అని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ ఆయుధంగా మార్చుకుని.. వ్యవస్థలను దిగజార్చి సాగిస్తున్న భీతావహపాలనను సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. రాష్ట్రంలో భయం రాజ్యమేలుతోంది.. ‘‘రెండేళ్ల క్రితం వరకు ఏ ఇంట్లో అయినా.. సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే? చట్టం, న్యాయం (రూల్ ఆఫ్ లా) పక్కకు పోయి భయం(రూల్ ఆఫ్ ఫియర్) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోయాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.... ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయివ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలే. రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పింది. పాలించే వారిలో భయమనేది పోయింది. మనం మనుషులమేనన్న సంగతి మరిచిపోయి, ఒక మనిíÙని మనం ఏం చేసినా అడిగే వాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పు కాదా? విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు గురై క్రాంతికుమార్ అనే అబ్బాయి వీడియో చేసి మరణవాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు, తెనాలిలో తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం సంతకవిటికి చెందిన కళావతి కేసు రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దంపడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిíÙని దారుణంగా కొట్టి చంపి, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ లేకుండా చేసి, చివరికి శవం కూడా మాయం చేసి ఆ శవం ఎక్కడ ఉందో ఏం చేశారో ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు కూడా బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగింది. ఇది రాజధానిలో.. చంద్రబాబు ఇంటికి ఆమడదూరంలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోయిన ఘటన ఇది. ఒక్కొక్కటిగా ఇలాంటి ఘటనలు బయటకొస్తున్నా చంద్రబాబును ఎవరూ నిలదీయకూడదట. వీటి కోసం ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ ఎదురు దాడి చేయడమే కాకుండా.. తమకు తానా తందానా అనే ఎల్లో మీడియాలో ఇదే మాదిరిగా రాతలురాయిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ఫోర్స్ పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు అప్పగించిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా రాశారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? ఈ ఘటన మే 6వతేదీన జరిగింది. తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోవాలని సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు ఇదే విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. కానీ సీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?మరో ఘటనలో దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణవాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చావుకు కారణం ఇదే కృష్ణ లంక పోలీస్ స్టేషన్, ఇదే సీఐ కారణమని చెబుతూ మరణవాంగ్మూలం ఇచ్చిన ఘటన కూడా ఇదే సీపీ పరిధిలో జరిగినా సీపీ, డీజీపీలు ఏం చేస్తున్నారు? క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? తనకొడుకు సాయి కృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకుంటే విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణవాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్ల్లో కూడా చిన్న చిన్నోళ్లను పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ఇంతగా బరితెగించి సీఐ నుంచి డీజీపీ వరకు అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును కవరప్ చేస్తున్నారని అడుగుతున్నా ? అసలు ఈ ఘటన ఇంత పెద్దది కాకపోయినా, జగన్ వెళ్లకపోయినా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చేది కాదు.. పూర్తిగా కవరప్ చేసేవారు. ప్రశ్నిస్తే ఎన్టీఆర్ను కూడా రౌడీషీటర్ అనే వారు.. నిజంగా విలన్లను ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం. కానీ చంద్రబాబు రూపంలో ఇక్కడే మన కళ్లెదుటే మనకు విలన్లు కన్పిస్తున్నారు. ఇవన్నీ దారుణాలు కావా? దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు రౌడీషీటర్లట..రౌడీలను పెట్టుకుంది నువ్వు. దాడి చేసింది, కొట్టించింది, కారు అద్దాలు పగలు కొట్టింది నువ్వు. తిరిగి మా వాళ్లను రౌడీలంటావా? నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే.. చంద్రబాబును ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండి ఉంటే.. ఆయన్ని కూడా రౌడీషీటర్ అనే వారు. ఎన్టీఆర్ అయినా, లక్ష్మీపార్వతి అయినా అంతే. చంద్రబాబును ప్రశ్నిస్తే రౌడీషీటర్ అంటారు. చంద్రబాబు పాలనలో ఎవరికైనా ఎక్కడైనా రక్షణ ఉంటుందా? అని అడుగుతా ఉన్నా. వీడియోలలో.. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్.. ధ్వంసమైన కారు.. రాయి పట్టుకుని ఉన్న టీడీపీ నేతలు పెంచలయ్య, మట్టిమాఫియా నేత నాగరాజు.. టీడీపీ గూండాలను దాడికి పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ.. కనిపిస్తున్నారు.. పోలీసుల సమక్షంలోనే రాళ్లు పట్టుకొని దాడులు చేస్తున్నారు. కారు పగలగొడుతున్నారు. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్కు దెబ్బలు తగిలాయి. మా వాళ్ల మీద ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేమైనా పాకిస్థాన్ బోర్డరా? కొంతమంది పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటి వరకు మా వాళ్లు పెట్టిన ఫిర్యాదులపై కేసులు పెట్టలేదు. ఏ తెలుగుదేశం వాళ్లను అరెస్ట్ చేయలేదు.. నిజంగా రైతులు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా భూములు ఎందుకయ్యా అని ఆ రైతులు అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు తమ బినామీలకు, నాయకులకు ఆ భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. నీ స్వార్థం కోసం భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి వెళ్లగొడతారా? అని రైతులు నిలదీస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టనర్ అధికారిక ప్రకటన చేయగలరా?అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్ర పూరితంగా సీసీ ఫుటేజ్, శవం మాయం చేయడం, చివరకు ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటనపై ఎల్లోమీడియాలో అక్షరం ముక్క రాయరు. పైగా తానా తందానా అంటూ చంద్రబాబుకు భజన చేస్తారు. రౌడీ షీటర్కు సపోర్ట్ చేస్తారా అంటూ ఎదురుదాడి చేస్తారు. ఈ టాపిక్ను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగా తెరపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతుల్లో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని దొంగ కేసులు పెడతామని, చంపుతామని, శవాలు మాయం చేస్తామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? అని చంద్రబాబును, ఆయన పార్టనర్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కవరప్లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీషీటర్ అన్నారు. రౌడీషీటర్ను వెనకేసుకొస్తారా అని ఎదురు దాడి చేశారు. జనం ఎప్పుడైతే ఛీ కొట్టడం మొదలు పెట్టారో వెంటనే యూ టర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు సాయికృష్ణ కుటుంబ సభ్యులను సెక్రటేరియట్కు పిలిపించుకుని పక్కన కూర్చో పెట్టుకొని చేయి పట్టుకుని న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు.. ఏకంగా 46 రోజుల పాటు బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ ఘటనతో యావత్ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.నేను వెళ్లాకే అరెస్టులునేను వెళ్లిన నాలుగు రోజుల తర్వాత అరెస్ట్లు ప్రారంభించారు. 46 రోజుల పాటు ఈ కేసును ఎందుకు తొక్కిపెట్టారు, అసలు ఏం జరిగింది? దీనికి వెనుక ఉన్న పెద్దల మీద చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిపైన లేదా అని అడుగుతున్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ చంద్రబాబులో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఎక్కడా ఏ కోశానా పశ్చాత్తాపం కన్పించలేదు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే.. సాగుతున్న దర్యాప్తును ఒక్కసారి గమనిస్తే కేసును నిర్వీర్యం చేసేందుకు, పైవాళ్లను కాపాడేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఆధారాలతో సహా చాలా స్పష్టంగా కన్పిస్తుంది.18 నెలలుగా సీసీ ఫుటేజ్ లేదంటున్నారు.. ఇంకెన్ని హత్యలు జరిగాయోమోసపూరిత కుట్ర ఎంత లోతుగా ఉందో మరో ఉదాహరణ... కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్లు ఫైల్ చేసిన మొదటి రిమాండ్ రిపోర్టులో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వీడియో ఫుటేజ్ లేదని రాశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ల రిమాండ్ రిపోర్టులో 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రాస్తారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యమని అడుగుతున్నా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడానికి ఎలా కుదురుతుంది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే.. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు? ఒకచోట డిలీట్ చేస్తే మరొక చోటైనా ఉంటుంది కదా? సీపీ, డీజీపీ కార్యాలయాల్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. స్టేషన్లో ఫుటేజ్లో లేదంటున్నారు. విజయవాడలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్ జంక్షన్లు, పబ్లిక్ ప్లేస్లలో సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఏమైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా సాయికృష్ణ శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో? ఏం చేశారో కనుక్కోవచ్చు కదా.. కానీ సిట్ ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని అడుగుతున్నాం. మ్యాట్రిక్ సిస్టమ్, క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ అందుబాటులో ఉంటుందని తెలిసినా దాన్ని సిట్ ఎందుకు స్వాదీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా. సీఐతో పాటు సంబంధిత పోలీస్ బాసుల ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల పరిశీలించే కార్యక్రమం ఎందుకు చేయడంలేదు? ఆశ్చర్యమేమిటో తెలుసా ఆర్థిక ఇబ్బందుల వలన కానిస్టేబుళ్ల ఫోన్లు నాగపూర్లో అమ్మేశారని చెబుతున్నారు. మనిషిని చంపేశారు. శవాన్ని కన్పించకుండా చేశారు. వీడియో ఫుటేజ్ మాయం చేశారు. ఫోన్లు నాగపూర్లో అమ్మేశారు. రాజధాని ప్రాంతంలోనే సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మానవ హక్కులకు విలువ లేదా? యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు..చంద్రబాబు పాలనలో వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్లు ఈ విధంగా కుమ్మక్కవడం కొత్తేమీ కాదు. ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు ఇవ్వొచ్చు. సీసీ ఫుటేజ్ మాయంతో సహా ఆధారాలు నాశనంచేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, న్యాయ స్థానాలను పక్కదోవపట్టించడం, చివరకు కొన్ని కేసుల్లో పోలీసులే స్వయంగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టి మరీ కేసులు పెడుతున్నారు. ఈ స్థాయిలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. రెండేళ్లుగా రెడ్ బుక్ పాలనలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎన్నో చూశాం. ఒకర్ని పిన్ పాయింట్గా గుర్తించడం, వాళ్లను బలవంతంగా కేసుల్లో ఇరికించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా నైతికత, విలువలు లేకుండా పోయాయి. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదు. ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు. చంద్రబాబు ముఖంలో సంతోషం చూడాలి. అదొక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగిల్ రాజ్ అనక ఇంకేమనాలి. జంగిల్ రాజ్ అంటే బిహార్లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుల బృందం ఆ గ్రామాలకు వెళ్తే ఏం జరిగిందో మనమంతా చూశాం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను, రాజధాని ప్రాంత రైతులు పడుతున్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు..రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా బాధితులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నేతలనే నిందితులుగా చూపిస్తూ కేసులు పెడుతున్న ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఇదే మీటింగ్ హాలులో ఇటీవలే రాజధాని గ్రామాలకు చెందిన రైతులు నన్ను కలిశారు. తమ గోడు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు ఒక కమిటీని, లీగల్ టీమ్ను ఏర్పాటు చేశాం. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు చూపుతాం.. మీరు రండి అని రైతులు అడిగితేనే మా పార్టీ బృందం అక్కడకు వెళ్లింది. ఆ బృందంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్ల అద్దాలు పగలకొట్టారు. రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మళ్లీ తిరిగి మా వాళ్లే దాడులు చేసినట్టుగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. భూములివ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరిట వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం, ఇంకా దారుణంగా కొండవీటి వాగును వీరి భూముల్లోకి మళ్లించి వాళ్ల భూములు చుట్టూ నీళ్లు నింపేసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్లు భూములు వదిలేసుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేస్తోంది.అమరావతిలో ప్రతీ పనిలోనూ దోపిడీయే..అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పక్కన తెలంగాణ సెక్రటేరియట్ 10 లక్షల ఎస్ఎఫ్టీలకు మించి లేదు. ఇది దోపిడీ కాదా ? అని అడుగుతున్నా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏ నగరం తీసుకున్నా 5స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. చివరికి జాతీయ రహదారి నిర్మాణం కిలోమీటర్కు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్వయంగా ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కానీ అమరావతిలో ఎంతో తెలుసా ? కిలోమీటర్కు సగటున రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే డబుల్ కంటే ఎక్కువ. ఇవన్నీ బయటకు రాకూడదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి చేస్తున్న అన్యాయం, మోసం, అమరావతి పేరిట చేస్తున్న దోపిడీ బయటకు రాకూడదనే ఈ దాడులకు పాల్పడుతున్నారు. -
బాబు సభలో హైడ్రామా.. ఈడ్చేసిన పోలీసులు
-
రగిలిన రైతన్నలు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు దగాపై దద్ధరిల్లిన విజయవాడ ధర్నాచౌక్
-
రాష్ట్రం రావణ కాష్టం కావాలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అడ్మినిస్ట్రేషన్ ఏ మాత్రం సక్రమంగా లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణకాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి, సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగే వారు లేరనుకుంటున్నారా? లేక మీరే తెలివైన వాళ్లు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా?’ అంటూ మంగళవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి పోలీసు శాఖపై నిప్పులు చెరిగింది.ఒక నేత దాఖలు చేసిన పిటిషన్లో పూర్తి వివరాలను హైకోర్టు ముందుంచేందుకు సమయం తీసుకున్న పోలీసులు, దానిని అడ్డం పెట్టుకుని ఆ వెంటనే కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘వివరాలు సమర్పించేందుకు సమయం తీసుకుని చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారు? ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమే. పోలీసులు, కలెక్టర్కు గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది.పోలీసులు, కలెక్టర్ను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వివరాల సమర్పణ కోసం పోలీసులు సమయం కోరినప్పుడు, కోర్టు సమయం ఇవ్వడం పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. పోలీసులు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అధికారులు ఇల్లు కూల్చి వేస్తున్నారంటూ కక్షిదారుడు పిటిషన్ దాఖలు చేస్తే.. వివరణ సమర్పణ కోసం గడువు తీసుకుని ఆ ఇల్లు కూల్చేసినట్లుగా ఉంది పోలీసుల తీరు’ అని హైకోర్టు మండిపడింది. ఫలితంగా ప్రత్యర్థులే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీపీ ప్రభుత్వ మౌత్పీస్ కాకూడదు హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) జయంతి తీరుపై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాదికి కొన్ని ప్రమాణాలు ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వ ప్రతినిధిగా (మౌత్పీస్) వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది ఉన్నది కోర్టుకు సహకరించేందుకే తప్ప ప్రభుత్వానికి పోస్టు మ్యాన్గా ఉండేందుకు కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమిల్లి జయంతి స్పందిస్తూ.. కేసును విచారణకు స్వీకరించాలా? లేదా అన్నది కింది కోర్టు పరిధిలోని వ్యవహారమన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రయల్లో తేల్చాల్సి ఉంటుందని తెలిపారు. అధికరణ 226 కింద హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అధికరణ 226 కింద హైకోర్టు అధికారాలకు ఆకాశమే హద్దని స్పష్టం చేసింది. మూడేళ్లు శిక్షపడే కేసుల్లో మూడేళ్ల తర్వాత ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించడంపై చట్ట ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది.ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషనా?2021 పంచాయతీ ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి హోదాలో కొడాలి నాని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి గుడివాడ పోలీసులకు 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అప్పటి కేసుపై ఇప్పుడు ప్రాసిక్యూషన్కు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిని కొట్టేయాలని కోరుతూ నాని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.నాని తరఫున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు మంగళవారం వాదనలు వినిపించారు. 2021లో కేసు నమోదైతే ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడం కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనన్నారు. నానిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణకు స్వీకరించే గడువు ఎప్పుడో ముగిసిందని తెలిపారు. అందువల్ల సీఆర్పీసీ ప్రకారం కొడాలి నాని ప్రాసిక్యూషన్ చెల్లదన్నారు. వివరాల సమర్పణకు మొన్న (28వ తేదీ) గడువు తీసుకున్న పోలీసులు, నిన్న (29న) చార్జిషీట్ దాఖలు చేశారని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. నానిపై నమోదైన కేసులో మూడేళ్ల శిక్ష మాత్రమే పడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మూడేళ్లు దాటిన తర్వాత ఆ కేసును కోర్టులు విచారణకు స్వీకరించలేవని స్పష్టం చేసింది.మూడేళ్ల తరువాత కేసును విచారణకు స్వీకరించడంపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టమైన నిషేధం ఉందని తెలిపింది. 2021లో జరిగిన ఘటనపై తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, ఆ చార్జిషీట్ను కోర్టు విచారణకు స్వీకరించడానికి వీలు ఉండదని గుర్తు చేసింది. నాని ప్రాసిక్యూషన్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18న జారీ చేసిన జీవో 801, తదనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జూన్ 25న జారీ చేసిన ప్రొసీడింగ్స్కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నిలిపేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రగిలిన రైతన్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. సీజన్లో యూరియా, విత్తనాలు అందించకుండా యాప్ పేరుతో ఇక్కట్లకు గురి చేయడం.. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం.. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టడం.. సున్నా వడ్డీ రాయితీ పథకం డబ్బులివ్వకుండా రెండేళ్లుగా తొక్కిపెట్టటాన్ని నిరసిస్తూ రైతన్నలు చంద్రబాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, రైతుల పొట్టగొట్టిన ఈ రాక్షస పాలనను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని గర్జించారు. ‘సీఎం డౌన్ డౌన్’... ‘రైతు వ్యతిరేక పాలన నశించాలి’.. ‘కష్టం రైతులది.. లాభం దళారులదా..!’ అంటూ పిడికిళ్లు బిగించారు. బాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతో విజయవాడ ధర్నాచౌక్ ప్రాంతం దద్దరిల్లింది. ధర్నాచౌక్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు వైపు కదం తొక్కారు. బూటుకాళ్లతో తొక్కుతూ.. పిడిగుద్దులుఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా రైతన్నలు ఉద్యమ కెరటాల్లా ఎగసిపడ్డారు. అలంకార్ సెంటర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి మూడు అంచెల బారికేడ్లతో దిగ్బంధించారు. పిడిగుద్దులు, బూటుకాళ్లతో తొక్కుతూ వారిని నిరోధించేందుకు యత్నించారు. పలువురు రైతులను పోలీసులు ఈడ్చేశారు. ధర్నాచౌక్ నుంచి లెనిన్ సెంటర్ వైపు ర్యాలీగా తరలి వెళ్లిన అన్నదాతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకంబారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. దాదాపు గంటకుపైగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకానికి పలువురు రైతులకు కాలి వేళ్లు చితికిపోయి రక్తపు గాయాలయ్యాయి. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా కొదమ సింహాల మాదిరిగా బారికేడ్లను తోసుకుంటూ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. దారిపొడవునా రైతులను అడ్డగిస్తూ బలవంతంగా ఈడ్చి పారేయగా, మరి కొంత మంది రైతులను పోలీసులు బూటుకాళ్లతో అడ్డగించే యత్నం చేశారు. అలంకార్ సెంటర్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బ్యారికేడ్ల పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు బుజ్జగించడంతో రైతులు కొద్దిగా శాంతించారు. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద 2 గంటల పాటు ధర్నా చేశారు. రైతులు ప్లకార్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేతబట్టి తలపై ఆకుపచ్చ కండువాలు కట్టుకుని ముందుకు సాగారు. ధర్నా చౌక్ వద్ద బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు..చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒక్కరైనా సంతృప్తికరంగా ఉన్నారని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా సంక్షోభంలో కూరుకుపోయేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు. ధర్నాచౌక్లో జరిగిన సభలో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ఏపీ, కౌలు రైతుల సంఘ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఏ.కాటమయ్య, ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.రైతుల పరిస్థితి దారుణం400 ఎకరాల్లో మొక్కజొన్న వేశాం. కొనేవారు లేరు.. ఐదుసార్లు కలెక్టర్ చుట్టూ తిరిగాం. పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల వెంటపడ్డాం. పట్టించుకోలేదు. చేసేది లేక క్వింటాల్ రూ.1,600కు తెగనమ్ముకున్నాం. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. – డి.మల్లిఖార్జునరెడ్డి, వీరపునాయనపల్లి, వైఎస్సార్ కడప జిల్లాఏ పంటకూ మద్దతు ధరలేదుఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, మినుము సాగు చేశా. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1,600కు అమ్ముకుంటే.. ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,350కు అమ్ముకున్నాం. జొన్న క్వింటాల్కు రూ.1,800 మాత్రమే దక్కితే మినుము పూర్తిగా దెబ్బతింది. ఐదెకరాలకు రూ.3 లక్షల మేర నష్టపోయా. – కూరపాటి శింగయ్య, చిర్రావూరు, గుంటూరు జిల్లా -
చంద్రబాబు ‘ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 2,600 కోట్ల అప్పును తీసుకుంది. ఈ తాజా రుణంతో కలిపి, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడిచిన 25 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రం చేసిన మొత్తం అప్పుల విలువ ఏకంగా రూ. 3,55,000 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు ఆర్థిక రంగాన్ని, రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం అధికారిక బడ్జెట్ ద్వారానే కాకుండా, వివిధ కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బడ్జెట్ వెలుపల కూడా భారీగా నిధులను సమీకరిస్తోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చంద్రబాబు పాలనలో జరిగిన అప్పుల అంతర్గత వివరాలు పరిశీలిస్తే.. బడ్జెటరీ అప్పులు రూ. 1,97,000 కోట్లు కాగా, బడ్జెట్ వెలుపలి అప్పులు రూ. 1,12,504 కోట్లుగా ఉన్నాయి. వీటికి తోడు అమరావతి పేరిట మరో రూ. 47,387 కోట్ల మేర రుణాలను సేకరించారు. -
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
-
High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు
-
పేదల పొట్ట కొట్టి.. కార్పొరేట్లకు కట్టబెట్టి!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు భూముల సంతర్పణ చేసే కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తోంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేస్తోన్న మెగా ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 2,467.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని నమ్ముకుని దశాబ్దాలుగా సాగు చేసుకుంటోన్న 195 మంది పేద శివాయి జమేదార్లకు 233.91 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే ఎకరాకు రూ.5 లక్షల చొప్పున అరకొర ఎక్స్గ్రేíÙయా ప్రకటించింది. అది కూడా నష్టపోతున్న మొత్తం భూమికి కాకుండా కేవలం కొంత భాగానికే పరిహారాన్ని పరిమితం చేసింది. టీడీపీ ఆఫీసుకు 2 ఎకరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 2.002 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఈ భూమిని, కేవలం ఏడాదికి ఎకరాకు రూ.1,000 నామమాత్రపు లీజు ధరతో 66 ఏళ్ల పాటు (99 ఏళ్లకు పొడిగించేలా) టీడీపీ జిల్లా అధ్యక్షుడి పేరుతో కేటాయించింది. అలాగే, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని కంగుంది రెవెన్యూ గ్రామంలో ఉన్న 529.34 ఎకరాల అడవి పోరంబోకు భూమి స్వభావాన్ని ఏడబ్ల్యూడీ (అసెస్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్)గా మారుస్తూ మరో జీవో జారీ చేసింది -
మల్లన్నకూ మోసం!
సాక్షి, అమరావతి: ఏరు దాటేదాకా.. ఓడ మల్లన్న! ఏరు దాటాక.. బోడి మల్లన్న! ఇదీ సీఎం చంద్రబాబు తీరు! సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా.. గతంలో ఉన్న పథకాలను సైతం ఎగరగొట్టి రాష్ట్ర ప్రజలను నిత్యం మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ఆ శివయ్యను సైతం వదలకుండా నిర్భీతిగా వంచనకు పాల్పడుతున్నారు! తిరుమలకు ఏడుకొండలు ఎంత పవిత్రమో రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండను సైతం అంతే పవిత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి మల్లయ్యకొండపై మైనింగ్ జరగనివ్వబోనని గతంలో నమ్మబలికిన చంద్రబాబు తాజాగా అక్కడ ఐరన్ ఓర్ మైనింగ్కు పచ్చజెండా ఊపారు. మల్లయ్యకొండను, రిజర్వు ఫారెస్టును తవ్వేసి యథేచ్ఛగా మైనింగ్కు చంద్రబాబు సర్కారు అనుమతించడంపై భక్తులు, పర్యావరణవేత్తలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండ సముదాయంలో భాగమైన సాధుకొండ, శివపురం కొండల్లో ఐరన్ ఓర్ మైనింగ్కు కాంపోజిట్ లైసెన్స్ కోసం చంద్రబాబు సర్కారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. మరోవైపు సమీపంలోని శివపురం ఐరన్ ఓర్ బ్లాక్ను ప్రైవేట్ సంస్థకు కేటాయించడం ద్వారా ఆ ప్రాంతం మొత్తాన్ని మైనింగ్ జోన్గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.రెండు బ్లాకులుగా విభజించి కాంపోజిట్ లైసెన్సులు సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్గా విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం అత్యధికంగా బిడ్ దాఖలు చేసి ప్రిఫర్డ్ బిడ్డర్గా నిలిచింది. ప్రభుత్వం ఆ సంస్థ నుంచి రూ.1.50 కోట్ల పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కట్టించుకుని ఖనిజ అన్వేషణకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. అదే కొండల సముదాయంలోని 626 హెక్టార్లలో శివపురం ఐరన్ ఓర్ బ్లాక్ కాంపోజిట్ లైసెన్స్ను సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్కు కేటాయించింది. ఈ సంస్థ 11.80 శాతం ఫైనల్ బిడ్ వేసి ఎల్ 1గా నిలవడంతో రూ.1.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ కట్టించుకుని ఎల్ఐఓ జారీ చేసింది. దీంతో మల్లయ్యకొండపై అధికారికంగా మైనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఆధ్యాత్మిక, జీవ వైవిధ్యానికి ప్రతీక మల్లయ్య కొండ ప్రభుత్వం రెండు బ్లాకులుగా విభజించి టెండర్లు ఖరారు చేసినా నిజానికి అది మూడు కొండల సముదాయం. సాధుకొండ, మల్లయ్యకొండ, ఇనుముకొండ కలిసి ఒకే పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ పురాతన మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. రాయలసీమలో శ్రీశైలం, శ్రీకాళహస్తి తర్వాత అత్యంత విశిష్టమైన శైవక్షేత్రంగా మల్లయ్యకొండ ప్రసిద్ధి చెందింది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. మల్లయ్యకొండ సముదాయం సుమారు 6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో విస్తరించి ఉంది. ఇందులో 1,550 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు అనుమతించింది. ఈ కొండలు జీవవైవిధ్యానికి ప్రతీక. మైనింగ్ జరిగితే ఇక్కడ కొండల స్వరూపం, అటవీ సంపద, వన్యప్రాణులు, జలవనరులు దెబ్బ తింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోచుకునే యత్నాలను ఏళ్లుగా అడ్డుకున్న స్థానికులుఈ కొండను తొలిచి ఖనిజాన్ని దోచుకోవాలని జరిగిన యత్నాలను స్థానికులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు. ఈ కొండల్లో వందల టన్నుల ఇనుప ఖనిజం ఉందని గతంలో కేంద్రం ప్రకటించింది. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ చేయడానికి ప్రయత్నించింది. అప్పట్లో జియో మైసూర్ సంస్థకు ఖనిజ అన్వేషణ కోసం లైసెన్స్ మంజూరు చేసింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, ఆందోళనలు వెల్లువెత్తడంతో ఆ సంస్థ పూర్తిస్థాయిలో అన్వేషణ చేయకుండా వెనుతిరిగింది. కొండలను రక్షిస్తానని నమ్మబలికిన బాబు మల్లయ్యకొండలో మైనింగ్ జరగనివ్వబోనని చంద్రబాబు గతంలో ప్రకటించారు. భక్తుల విశ్వాస్వాలకు అనుగుణంగా ఈ కొండను రక్షిస్తానని నమ్మబలికారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు అత్యంత రహస్యంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఇటీవలే కాంపోజిట్ లైసెన్సులు మంజూరు చేశారు. స్థానికులు ఆందోళనకు దిగుతారని పసిగట్టి గుట్టుగా టెండర్లు పిలిచి ఖనిజాన్వేషణకు అనుమతివ్వడం గమనార్హం. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకే కాకుండా మల్లికార్జునస్వామికి సైతం శఠగోపం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనింగ్ను వ్యతిరేకిస్తూ స్థానికులు, శివభక్తులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మల్లయ్యకొండపై మైనింగ్కు అనుమతి ఇవ్వడం అంటే పవిత్ర శైవక్షేత్రం, రిజర్వ్ ఫారెస్ట్పై, భక్తుల విశ్వాసాలపై దాడి చేయడమేనని మండిపడుతున్నారు.ప్రకృతి ఒడిలో పరమ శివుడుతంబళ్లపల్లె: రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేసిన రాయలవారు తంబళ్లపల్లె కొండల మధ్య కొలువైన ఈ ఆలయాన్ని ప్రత్యేక నిధులతో జీర్ణోద్ధరణ చేసినట్లు ప్రతీతి. చుట్టూ పచ్చని లోయలు, దట్టమైన అడవులు, మేఘాల అందాల మధ్య ఈ ఆలయ శిల్పకళా చాతుర్యం విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. విజయనగర రాజుల కాలంలో ఈ స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను దేవాలయ మాన్యాలుగా కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే శతాబ్దాలుగా ఆలయ ధూపదీప నైవేద్యాలు సాగుతున్నాయి.స్వయంభువు..ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జునస్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఇక్కడి ప్రధాన శివలింగం కొండల మధ్య స్వయంభువుగా వెలిసింది. ఆలయ జీర్ణోద్ధ్ధరణ సమయంలో క్షేత్ర సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు జరిగాయి. కాలభైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కొలువై ఆలయాన్ని రక్షిస్తున్నట్లు భక్తుల నమ్మకం. భక్తులు కొండ అడుగున వెలిసిన వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. పైకి వెళ్లే మార్గంలో నెలమల్లేశ్వరస్వామి, ఏనుగు మల్లమ్మ, యేలక తీర్థం లాంటి పవిత్ర కోనేరులు, స్థలాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కొండపై ప్రధాన ఆలయం వద్ద గౌరీ అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. ప్రతి సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. -
సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ సర్వీస్ నుంచి రిలీవ్
సాక్షి,విజయవాడ: సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీయస్ అధికారి పీవీ సునీల్ కుమార్ను ప్రభుత్వం సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది. జూన్ 30న సూపర్ యాన్యువేషన్తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే,సస్పెన్షన్లో ఉండగానే పీవీ సునీల్ పదవీ కాలం ముగిసిపోవడం గమనార్హం.గత రెండేళ్లుగా పీవీ సునీల్పై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపునకు పాల్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టి చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. చివరికి సస్పెన్షన్ కాలంలోనే ఆయన పదవీ కాలం కూడా ముగిసిపోయింది. పీవీ సునీల్ కుమార్ సర్వీస్ నుండి రిలీవ్ అయినప్పటికీ, ఆయనపై పెండింగ్లో ఉన్న వివిధ శాఖాపరమైన, క్రిమినల్ విచారణలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఉద్యోగుల కష్టాలు తీరతాయి అనుకున్నాం.. మమ్మల్ని నట్టేట ముంచారు
-
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
-
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మారవా చంద్రబాబు... నీకు ఇదే మా లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ అయితే..!
-
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
-
ప్రజలకు చిప్ప..? బినామీలకు కాసుల కుప్ప.. ప్రైవేట్ రాజ్యం
-
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
-
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్
సాక్షి, అమరావతి: రానున్న మూడు నెలలకు సంబంధించి మంగళవారం చేసే అప్పుల క్యాలెండర్ను చంద్రబాబు సర్కారు విడుదల చేసింది. సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్ లేదు గానీ అప్పుల క్యాలెండర్లో సర్కారు దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక ఏడాది క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్ను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 2026–27 రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో రూ.21,800 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. అంటే నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈమేరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది.ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.29,663 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు. తాజాగా వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.2,600 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. -
అమ్మకానికి రాష్ట్రం.. ప్రభుత్వ ఆస్తి.. ‘ప్రైవేట్’ పార్టీ!
సాక్షి, అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు..! నిన్న ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్పరం..! ఖరీదైన ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు, బంధు గణానికి పందేరం..! నేడు కొత్త పోర్టుల వంతు..! కొత్తగా సంపద సృష్టించకపోగా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సాకారమైన విలువైన ఆస్తులన్నింటినీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్పరం చేసేస్తూ సన్నిహితులకు దోచిపెడుతోంది. ప్రజల సంపదకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే పప్పుబెల్లాలకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. గత ప్రభుత్వం నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కారు కన్ను తాజాగా మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులపై పడింది. గత రెండేళ్లుగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పరిధిని తగ్గించడమే కాకుండా వీటి నిర్వహణ, విస్తరణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు పచ్చజెండా ఊపింది. వైఎస్సార్సీపీ హయాంలో పోర్టులు, హార్బర్లు, ఆస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో రూ.వేల కోట్ల విలువైన శాశ్వత ఆస్తులు ప్రభుత్వ రంగంలో సమకూరితే చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ పేరిట తన అనుయాయులకు పంచిపెడుతోంది. రామాయపట్నం హరీ..! మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.4,929.39 కోట్లతో చేపట్టి దాదాపు 95 శాతం మేర పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ చేస్తోంది. పోర్టు పరిధిని 51 కి.మీ. నుంచి ఏకంగా 15 కి.మీ.కి తగ్గించడమే కాకుండా పోర్టు నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో రామాయపట్నం పోర్టు పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించగా 2024 నాటికి దాదాపుగా పూర్తయ్యాయి. మల్టీ ప్రోడక్ట్ కార్గో నాలుగో బెర్తు పనులు కూడా పూర్తయి ప్రారంభించాల్సిన తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు గడిచినా గంప ఇసుక కూడా ఎత్తలేదు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నిర్వహణ కోసం టెండర్లు పిలవడంపై వ్యాపార, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ అంటే? అనే చర్చ జరుగుతోంది. దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టును అప్పనంగా ప్రైవేట్కు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.26,501 కోట్లతో చేపట్టిన మూడు పోర్టులు, 10 షిషింగ్ హార్బర్ల పనులను చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేకపోగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. ప్రైవేటుకు తీరప్రాంతం.. తూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా విలసిల్లే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తినుకో.. దోచుకో.. పంచుకో విధానంలో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లకు తగ్గించేయడమే కాకుండా ఇప్పటికే పోర్టు సమీపంలో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు కోసం బిడ్లను ఆహ్వానించింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుపై ‘సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదించింది. అంతేకాకుండా ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాంట్మెంట్ గైడ్లైన్స్ 2026 పేరుతో వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను కావాల్సిన వారికి కేటాయించనున్నారు. మత్స్యకారులకు దగా.. కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా చేపట్టకపోగా నిర్మాణంలో ఉన్నవాటిని నిలిపివేసి, టెండర్ల విలువను భారీగా పెంచేసి చంద్రబాబు సర్కారు మత్స్యకారులకు ద్రోహం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలిదశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించి.. రెండో దశలో బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచింది. రెండేళ్లుగా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా, ఓడరేవు లాంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ఆపేయడమే కాకుండా బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే ఇప్పుడు ఈ విలువను రూ.436.41 కోట్లు పెంచేసి ఏకంగా రూ.1,586.63 కోట్లకు చేర్చడం గమనార్హం. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బరు నిర్మాణ వ్యయం రూ.365.81 కోట్ల నుంచి రూ.444.75 కోట్లకు పెంచగా.. కొత్తపట్నం హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392.41 కోట్ల నుంచి రూ.441.88 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పూడిమడక హార్బర్ను ప్రభుత్వం నిర్మించకుండా పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఈ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392 కోట్ల నుంచి ఏకంగా రూ.700 కోట్లకు పెంచేయడం హార్బర్ల పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న నిలువు దోపిడీకి నిదర్శనం. మరోవైపు రూ.417.55 కోట్లతో గత ప్రభుత్వ హయంలో పనులు ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణ పనులు 25 శాతం లోపే ఉన్నాయంటూ 2024 సెపె్టంబర్ 27 టెండర్లను రద్దు చేసి పనులను అర్థంతరంగా నిలిపివేసింది.బాబు సర్కార్ ప్రైవేట్ పందేరం ఇలా..!ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు ఉరి.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ ఫీజులను ఖరారు చేసింది. ఎన్నికల ముందు టీడీపీ దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విధానం రద్దు చేయకపోగా, ఏకంగా కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. ఇప్పటికే పది కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూములను ఎకరం రూ.వందకే లీజుకు ఇవ్వడంతో పాటు కళాశాలలు, బోధనాస్పత్రిపై ఏకంగా 66 ఏళ్ల పాటు సర్వ హక్కులు కల్పిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసే అధికారాన్ని కల్పించి అప్పనంగా ప్రభుత్వాస్పత్రులను ప్రైవేట్ పరం చేస్తోంది.‘ప్రైవేట్’ దారిలో ఆర్టీసీ..ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని సైతం ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఈ–బస్సులను ప్రైవేట్ సంస్థల ద్వారానే నిర్వహించాలనే విధానం ముసుగులో ఈ కుతంత్రానికి తెర తీసింది. ఆర్టీసీయే స్వయంగా ఈ–బస్సులు నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్ను బేఖాతర్ చేస్తోంది. ఆర్టీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో 8 వేలు ఆర్టీసీకి చెందినవి కాగా 3 వేల బస్సులను అద్దె విధానంలో నిర్వహిస్తున్నారు. ఆ మొత్తం బస్సుల స్థానంలో 2029 నాటికి 9 వేల ఈ–బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 2 వేల బస్సుల స్థానంలో కూడా ప్రైవేటు ఈ–బస్సులను 2031 నాటికి ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. అంటే 2031 నాటికి మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయనున్నారు. అందుకే కొత్తగా డీజిల్ బస్సుల కొనుగోలును నిలిపివేసింది. సగటున రెండు రోజులకు ఒక బస్సు చొప్పున సర్వీసుల నుంచి తొలగిస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్ డిపోలు, బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. ఇప్పటికే రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ఈ–బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లను ఖాళీ చేయించి షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది.టూరిజం పేరిట లూటీ!పర్యాటక శాఖకు చెందిన సుమారు రూ.10 వేల కోట్ల విలువైన ఏపీ టీడీసీ హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం ఏకంగా 33 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇస్తోంది. పర్యాటకాభివృద్ధి పేరుతో ప్రభుత్వానికి చెందిన 3,913.96 ఎకరాల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది.రాష్ట్రవ్యాప్తంగా సెంటు భూమిని కూడా వదలకుండా ప్రైవేటు పరం చేసేందుకు ‘ల్యాండ్ బ్యాంకు’ రూపొందించింది. జిల్లాల వారీగా ఏ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఎంత భూమి ఉందనే వివరాలను సర్వే నంబర్లతో సహా వెబ్సైట్లో పెట్టింది. 2024–29 పర్యాటక విధానం, పర్యాటక భూ పంపిణీ విధానాన్ని అనుసరించి ఎటువంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. విశాఖలోని రుషికొండ, ఆనందపురం, మధురవాడ, కాపులుప్పాడ, యండాడ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములను పందేరం చేసింది. రాయలసీమలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో 1,200 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు తహతహలాడుతోంది. ఓర్వకల్లు రాక్ గార్డెన్ సమీపంలో 200 ఎకరాలు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 550.59 ఎకరాల భూమిని (ఒక్క ఆత్మకూరులోనే 210.4 ఎకరాలు) భూమిని దోచిపెడుతోంది. జల వనరుల ప్రాజెక్టుల సమీపంలోని భూములతోపాటు లంక భూములను సైతం వదిలి పెట్టడం లేదు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, తిరుపతిలోని కల్యాణి డ్యామ్, రామాయపట్నం పోర్టు ప్రాంతాల్లోని ఖరీదైన భూముల దోపిడీయే లక్ష్యంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విజయవాడలో 230 ఎకరాల భవానీ ద్వీపాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. కూటమి పార్టీల నాయకులు, ముఖ్యనేత బంధువులకు యథేచ్ఛగా విలువైన ప్రభుత్వ భూములను పంచిపెడుతోంది. -
అంబటి కేసులో ఇద్దరు CIలకు నోటీసులు.. రెచ్చిపోతున్న ఖాకీలు
-
తాడిపత్రి లో నీకు దమ్ముంటే.. బాబుకు వార్నింగ్..
-
ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
-
అక్కచెల్లెమ్మలకు మరో మోసం
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన సర్కార్ తుంగలో తొక్కి.. అక్కచెల్లెమ్మకు మరో మోసం చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్హెచ్జీలకు రుణాలు ఇవ్వడం అత్యంత కీలకమని, మహిళలకు రుణాలు ఇస్తే.. స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రుణాలు తగ్గించడం, వడ్డీ రాయితీ ఇవ్వక పోవడం వల్ల పెట్టుబడులు తగ్గాయని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం తగ్గడమే అందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ–జనసేన కూటమి ఇచ్చిన హామీలు.. వడ్డీ లేని రుణాలకు బడ్జెట్లో కేటాయించినా నిధులు ఇవ్వకపోవడం.. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతుండటాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. ఎస్ఎల్బీసీ, బడ్జెట్ ప్రతులు, ఎన్నికల మేనిఫెస్టోను జత చేస్తూ గురువా రం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేస్తోంది ‘‘స్వయం సహాయక సంఘాలకు(ఎస్హెచ్జీ) రుణాలు ఇవ్వడం అత్యంత కీలకం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిది. మహిళలకు ఇచ్చే రుణాలు పెరిగితే ఉత్పాదకత పెట్టుబడులు పెరుగుతాయి. ఇది ఎస్హెచ్జీల ఆదాయాన్ని పెంచే సామర్థ్యాన్ని బలోపేతం చేసి, వాటి ఆర్థిక సుస్థిరతకు దోహద పడుతుంది. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతే పెట్టుబడులు తగ్గి.. తద్వారా ఆదాయాలు తగ్గి.. ఫలితంగా వినియోగం కూడా తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్హెచ్జీలకు రుణాల వృద్ధిని ప్రోత్సహించడానికి ఆ రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వడం అత్యంత కీలకం. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం వడ్డీ రాయితీ ద్వారానే ప్రభుత్వం ఎస్హెచ్జీ మహిళలకు రూ.4,969 కోట్లు ప్రత్యక్ష మద్దతు అందించింది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఆసరా’, ‘చేయూత’ వంటి కార్యక్రమాల ద్వారా ఎస్హెచ్జీ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అపారమైన మద్దతును అందించింది. ఎస్హెచ్జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుతామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి. చంద్రబాబు పాలనలో గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ కింద ఏటా రూ.100 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో చెప్పినా, తుదకు ఇచ్చింది సున్నానే , పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఈ రెండేళ్లలో ఏమీ ఇవ్వని చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన వడ్డీ రాయితీ రూ.6,000 కోట్లు ఎప్పటిలాగే అధికారం చేపట్టిన తర్వాత, టీడీపీ కూటమి ఇచ్చిన హామీని విస్మరించి అక్కచెల్లెమ్మలను మోసం చేసింది. పెంచిన రుణ పరిమితిపై వడ్డీ రాయితీ ఇవ్వడం పక్కనపెడితే.. ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ కార్యక్రమానికి కూడా ఎలాంటి నిధులు విడుదల చేయకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. 2024–25లో వడ్డీ రాయితీ కింద విడుదల చేసిన మొత్తం ‘సున్నా’. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా, విడుదల చేసింది మాత్రం ‘సున్నా’. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మళ్లీ రూ.100 కోట్లు కేటాయించినా, ఇప్పటికి విడుదల చేసింది ‘సున్నా’నే. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.6,00,000 అప్పు ఉందని భావించినా.. టీడీపీ హామీకి అనుగుణంగా వడ్డీ రాయితీ మొత్తం రూ.3,000 కోట్లు అవుతుంది. అంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్హెచ్జీ మహిళలకు వడ్డీ రాయితీ కింద ఎగ్గొట్టిన మొత్తం రూ..6,000 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2019–24 మధ్య ఎస్హెచ్జీలకు రుణ వృద్ధి గణనీయంగా పెరిగింది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మద్దతు ఇవ్వక పోవడం వల్ల రుణ వృద్ధి తగ్గిపోతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జీలకు రూ.49,626 కోట్ల రుణాలు ఇస్తే.. అవి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.41,105 కోట్లకు పడిపోయాయి. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.16,505 కోట్ల నుంచి 2024లో ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.49,626 కోట్లకు పెరిగిన స్వయం సహాయక సంఘాల రుణాలు.. ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలో రూ.41,105 కోట్లకు తగ్గిన రుణాలు -
‘అమరావతి’లో ఆగని దందా!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో సిండికేట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. టెండరు నోటిఫికేషన్కు ముందే సిండికేటులో ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు వాటిని పంచేసి.. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీచేసి.. అధిక ధరకు ఆ సంస్థకే అప్పగించేలా ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఆది నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఐదు ప్యాకేజీల పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తూ గురువారం ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు వాటికి బలం చేకూరుస్తున్నాయని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. సిండికేట్లోని ఎన్సీసీకి మూడు ప్యాకేజీలు.. ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు రెండు ప్యాకేజీల పనులు కట్టబెట్టారు. ఈ ఐదు ప్యాకేజీల పనులు అధిక ధరకు కట్టబెట్టడంవల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.34.70 కోట్ల భారంపడింది. అదే జ్యుడీషియల్ ప్రివ్యూ.. రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి సంస్థలు ముందుకొచ్చేవని.. దీనివల్ల ఖజానాకు రూ.70 కోట్ల మేర ఆదా అయ్యేవని చెబుతున్నారు.అన్ని పనులూ అధిక ధరకు కోట్..రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చేందుకు ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ అభివృద్ధి పనులకు రూ.409.78 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువ కంటే 4.07 శాతం అధిక ధరకు అంటే రూ.426.46 కోట్లకు కోట్చేసిన ఎన్సీసీ సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థకు వాటిని అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనివల్ల ఖజానాపై రూ.16.68 కోట్ల భారం పడింది. వాటితోపాటు పన్నుల రూపంలో రూ.86.08 కోట్లను రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.512.54 కోట్లు. అలాగే.. – పిచ్చుకలపాలెంలో జ్యుడీషియల్ అకాడమీ భవనాల నిర్మాణ పనులకు రూ.125.49 కోట్ల కాంట్రాక్టు విలువతో ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే 3.89 శాతం అధిక ధరకు అంటే రూ.130.38 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు ఆ పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనివల్ల ఖజానాపై రూ.4.89 కోట్ల భారం పడింది. – కరకట్ట పటిష్టీకరణతోపాటు కరకట్టపై ఈ–1 రోడ్డు నిర్మాణ పనులకు మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ టెండర్లు పిలిచింది. కరకట్టను బలోపేతం చేయడం, దానిపై ఈ–1 రోడ్డును 0.3 కిమీ నుంచి 2.48 కిమీ వరకూ నిర్మించే పనులకు రూ.105.78 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ఇందులో 4.02 శాతం అధిక ధరకు అంటే రూ.110.03 కోట్లకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు వాటిని అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.4.25 కోట్లు భారం పడింది. – అంతేకాక..2.48 కి.మీ నుంచి 4.990 కి.మీ వరకూ రోడ్డు నిర్మించే పనులకు రూ.103.50 కోట్ల కాంట్రాక్టు విలువతో నిర్వహించిన టెండర్లలో 4.72 శాతం అధిక ధరకు అంటే రూ.108.38 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించింది. దీనివల్ల కూడా ఖజానాపై రూ.5.12 కోట్ల భారం పడింది. – ఇక 4.99 కి.మీ నుంచి 7.20 కి.మీ వరకూ రోడ్డు నిర్మించే పనులకు రూ.104.09 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, నిర్వహించిన టెండర్లలో 4.04 శాతం (108.09 కోట్లు) అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు వాటిని కట్టబెట్టింది. దీనివల్ల ఖజానాపై రూ.4 కోట్లు భారం పడింది.నీకింత.. నాకింత..ఇలా మొత్తమ్మీద ఐదు ప్యాకేజీల్లో రూ.751.3 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులను ఎన్సీసీకి.. 218.12 కోట్ల విలువైన రెండు ప్యాకేజీలను ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు కట్టబెట్టింది. ఈ ఐదు ప్యాకేజీల విలువ రూ.969.42 కోట్లు. ఇందులో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా కాంట్రాక్టర్లకు ముట్టజెప్పి.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకోనున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
‘యాప్’.. యాతన
ఓటీపీ.. ‘దైవాధీనం’! మా గ్రామంలో దాదాపు 120 ఎకరాలకు పైగా దేవదాయ భూమిని 40 ఏళ్లుగా 150 మంది రైతులు సాగు చేస్తున్నారు. చాలా మందికి కౌలు కార్డులు లేవు. యూరియా కోసం వెళితే ఓటీపీ ఎవరి పేరిట వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఆర్ఎస్కేకు వెళ్తే రెండ్రోజులు ఆగండి.. మాట్లాడి చెబుతాం అంటున్నారు. –కలారి రామారావు, పెదకల్లేపల్లి, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: వర్షాలు వచ్చేశాయ్.. సీజన్ మొదలైంది.. ఏరువాక వచ్చేస్తోంది.. కానీ దుక్కి దున్నాల్సిన రైతన్న దిక్కు తోచక దిక్కులు చూస్తున్నాడు. అదునులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి ఏరువాక సాగేలా రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కాడి వదిలేసింది. ఎరువుల సరఫరా, వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు తెచ్చిన ‘యాప్’తో వ్యవసాయదారులు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేయాలని అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా గ్రామంలోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలతోపాటు సాగు ఉత్పాదకాలను అందించి ఆదుకున్నారని రైతన్నలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్పుట్ సబ్సిడీ అందక.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతుంటే.. చంద్రబాబు సర్కారు ఎరువుల పంపిణీ బాధ్యతను సైతం గాలికొదిలేసి యాప్ల పేరుతో తమను యాతనకు గురి చేస్తోందని మండిపడుతున్నారు. సర్వర్ డౌన్.. యాప్ హ్యాంగ్ ఎరువుల పంపిణీని డిజిటలైజ్ చేసేందుకు జాతీయ సమీకృత ఎరువుల నిర్వహణ మాడ్యూల్ (ఐఎఫ్ఎఫ్ఎం) యాప్ ద్వారా కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎరువుల పంపిణీని చేపట్టగా.. మిగిలిన 26 జిల్లాల్లో ఏపీ వ్యవసాయ ఇన్పుట్స్ నిర్వహణ వ్యవస్థ (ఏఐఎంఎస్) యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. యాప్ల వినియోగంపై నూటికి 90 శాతం మంది రైతన్నలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా యాప్లో సాంకేతిక, పరిపాలనా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రైతుల మొబైల్ నెట్వర్క్ అంతంత మాత్రంగా ఉండగా ఆర్ఎస్కేల్లో (రైతు సేవా కేంద్రాలు) సర్వర్ డౌన్/యాప్ హ్యాంగ్ సమస్యలతో రేపు రండి.. మాపు రండి అంటూ పంపేస్తున్నారు. యాప్లో రైతు వివరాలు, ఈ–క్రాప్, వెబ్ల్యాండ్, ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడం, సకాలంలో ఓటీపీలు రాక, వేలిముద్రలు మ్యాచ్కాక తరచూ ఓటీపీలు, వేలిముద్రలు విఫలమవడం, బిల్లింగ్ ఆలస్యమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఓటీపీ, ఎంపిన్, ఫొటో, జియో ట్యాగింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్ లాంటి దశలు రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సొంత భూమి ఉన్న రైతులకు రికార్డుల్లో చిన్న పొరపాటు ఉన్నా ఎరువుల కొనుగోలు ఆగిపోతోంది. ఫలితంగా కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కౌలు రైతుల పాట్లు వర్ణనాతీతం యాప్ ద్వారా ఎరువులు పొందేందుకు కౌలు రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సీసీఆర్సీ కార్డు, ఈక్రాప్ లింక్ కాకపోవడం, సరైన సాగు వివరాలు నమోదు కాకపోవడం, భూ యజమాని అనుమతి లేకపోవడం, రికార్డుల్లో భూ యజమాని పేరు సరిగ్గా లేకపోవడం, మ్యుటేషన్ కాకపోవడం, భూ రికార్డులలో మ్యాపింగ్ కాకపోవడం లాంటి సమస్యలు కౌలు రైతులను వేధిస్తున్నాయి. ఓటీపీలు భూ యజమానుల ఫోన్కు వస్తుండటం, వారు అందుబాటులో లేకపోవడం, ఓటీపీ అప్లోడ్కు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం ఉండడం పెద్ద సమస్యగా మారింది. దీంతో 2–3 సార్లు ఓటీపీ జనరేట్ అవుతున్నా సకాలంలో అప్లోడ్ చేయలేకపోవడంతో చివరికి బుకింగ్ రద్దై మళ్లీ మొదటి నుంచి రైతు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. మరోవైపు రైతులు ఎంచుకున్న డీలర్ పాయింట్ల వద్ద భౌతికంగా ఎరువులు ఉన్నా యాప్లో స్టాక్ అప్డేట్ కాకపోవడంతో ‘నో స్టాక్’ అని బుకింగ్ సమయంలో వస్తోంది. మొబైల్ నెట్వర్క్ పెద్దగా లేని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కత్తిమీద సాములా తయారైంది. సర్వర్ డౌన్ అయింది.. తరువాత రండి అంటూ తిప్పి పంపేస్తున్నారు. దేవదాయ, అటవీ, వక్ఫ్, అసైన్డ్, సొసైటీ లంక భూములు సాగుచేసే రైతులైతే బుకింగ్ కోసం అల్లాడుతున్నారు. ఎవరి పేరిట ఓటీపీ జనరేట్ అవుతోందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియా బస్తా రూ.350 నుంచి రూ.500, డీఏపీ రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, జీ.సిగడం మండలాల్లో పలువురు డీలర్లు గురువారం రోజు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరపడమే కాదు.. రసీదులు అడిగితే రైతులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా కొడమూరు మండలం రాజుపాలెంలో సుమారు 50 మంది రైతులు స్థానిక ఆర్ఎస్కేకు వెళ్తే సర్వర్ డౌన్ అనే సాకుతో తిప్పి పంపేశారు. తంటాలు పడి ఎరువులు బుక్ చేసుకున్నా మాగాణి, మెట్ట ప్రాంతాలు, పంట రకాలతో సంబంధం లేకుండా ఎకరాకు యూరియా, డీఏపీ రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. ఏ పంటకు, ఏ దశలో, ఏ ఎరువు ఎంత మోతాదులో అవసరమవుతుందో పంటల వారీగా అంచనా వివరాలను యాప్లో పొందుపరిచారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా అదనంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. నాట్లు వేసిన 15–20 రోజుల్లో యూరియా అవసరం. కానీ అదునుకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఈ దురవస్థ ఏమిటని వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల మోత.. రైతన్నలకు వాత కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. 2023–24 సీజన్తో పోలిస్తే బస్తాపై రూ.750కి పైగా పెరిగాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే డ్రిప్ ఎరువుల ధరలు గతేడాది 25–50 శాతం మేర పెరిగాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఈ ఏడాది మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల సీజన్లో కనీసం రూ.700 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.నాడు.. ఇంటికే ఎరువులువైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య రైతన్నలకు వ్యయప్రయాసలు లేకుండా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరఫరా చేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేసింది. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులను గ్రామం పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగిటికే సరఫరా చేసింది. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. ఇలా ఐదేళ్లలో అన్నదాతలకు మొత్తం రూ.వంద కోట్లకుపైగా ఆదా జరిగింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అగత్యం తప్పింది. బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా పోయింది. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పొలం పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు యాప్ల పేరుతో వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది కంపెనీలు, డీలర్ల స్థాయిలో జరిగే ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టకుండా రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోంది. ఎరువులు దొరకడం లేదని కౌలు రైతులు సాగు చేయడం మానేస్తే లక్షలాది ఎకరాలు బీడు వారతాయి. యాప్ విధానం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి భూమి సాగు చేసే వారికి డిమాండ్ మేరకు ఎరువులు సరఫరా చేయాలి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవంకేంద్ర జలశక్తి మంత్రి పాటిల్సహా ముఖ్యమంత్రుల హాజరుసాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యామ్కు నూతనంగా అమర్చిన 33 గేట్ల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్సహా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సమీపంలోని మునీరాబాద్లో జరిగిన సభలో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడుతూ పేరుకుపోయిన పూడికను తొలగిస్తే డ్యామ్లో 30 శాతం నీటి నిలువ పెరుగుతుందని తెలిపారు. పూడిక తొలగింపునకు సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని పేర్కొన్న ఆయన, ఇక తదుపరి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అంగీకరించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నదుల అనుసంధానం జరగాలన్న కేంద్రం సంకల్పానికి ఇది మరింత బలం చేకూరుస్తుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో నదుల అనుసంధానం విజయవంతం అవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేట్లను పునరుద్ధరించడం లక్షలాది మంది రైతుల కన్నీరు తుడిచే గొప్ప పరిష్కారంగా అభివర్ణించారు. ఇది మూడు తరాల సమస్యకు పరిష్కారమని అన్నారు. మూడు రాష్ట్రాల రాష్ట్ర రైతుల హితం కోసం తుంగభద్ర డ్యామ్లో నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరస్పరం పొగడ్తల వర్షం!! చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధాన్ని మరోసారి బయటపెట్టింది. ‘రేవంత్ రెడ్డి నా శిష్యుడు. డ్యాషింగ్, డైనమిక్ సీఎం. అన్ని విషయాలపై తరచూ చర్చించుకుంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజీ పడరు. చురుకైన నాయకుడు’ అని చంద్రబాబు పొగిడితే, ‘చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు గురువు. పాలనలో ఆయన అనుభవం, దేశానికి ఆదర్శం. సాంకేతిక పరిపాలనలో చంద్రబాబు మార్పులు తెచ్చారు. ఆయన దూరదృష్టి దేశానికి ఆదర్శం. రాజకీయ జీవితంలో చంద్రబాబు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, డీకేలు కూడా ఒకరికొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. -
మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం
-
రాబోయే రెండేళ్లు దద్దరిల్లిపోద్ది.. గుర్తుపెట్టుకో చంద్రబాబు
-
దుమారం రేపుతున్న పవన్ కామెంట్స్.. తిరగబడుతున్న ప్రజలు!
-
బాంబు పేల్చిన CAG..! అప్పుల్లో ఏపీ నెం.1
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
నీ వయసేంటి..? నీ మాటలేంటి..? నీకు రోజులు దగ్గరపడ్డాయి!
-
సాయి కృష్ణ లాకప్ డెత్ అసలు నిజాలివే..!
-
‘అసైన్డ్’పై ఎమ్మెల్యేలదే పెత్తనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసైన్డ్ భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కొత్త దుకాణానికి తెరతీసింది. ఇప్పటికే నియోజకవర్గాలు, మండలాల నేతలకు ఇసుక, మట్టి, మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకునేందుకు దారులు చూపిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములను సైతం పందేరం చేయడానికి సరికొత్త ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన గల అసైన్డ్ కమిటీలను రద్దు చేసి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అసైన్డ్ కమిటీలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా ఉంచేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. నియోజకవర్గాల వారీగా అసైన్డ్ భూములే లేకుండా మొత్తం భూములను తమ అనుచరులు, అనుయాయులకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎమ్మెల్యేలే ఇష్టానుసారంగా వారికి నచ్చిన వారికి అసైన్డ్ భూములను కేటాయిస్తారు తప్ప.. అర్హులనే పదానికి తావుండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే గత వైఎస్సార్సీపీ సర్కారు.. ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టిన మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు ద్వారా ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈ 2 పోర్టుల్లో మిగతా దశల విస్తరణకు బాబు ప్రభుత్వం దారులను మూసేసింది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు, ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలకు ఆమోదం లభించిందని మంత్రి పార్థసార«థి మీడియాకు వెల్లడించారు. ఇతరత్రా కేబినెట్ నిర్ణయాలు...⇒ రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను డీబీఎఫ్ఒటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన అప్పగించేందుకు పోర్ట్ ఆపరేటర్ నియామకం కోసం ఆర్ఎఫ్పీ జారీ చేయడానికి, బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా ఆర్ఎఫ్పీలో నిబంధనల్లో మార్పులకు ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలలోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచేందుకు ఆమోదం. దీనిని 2022 జనవరి 1 నుంచి పాత తేదీతో వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సరీ్వస్ రూల్స్ సవరించడానికి ఆమోదం. ⇒ 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నియామక నోటిఫికేషన్ విడుదలై..అదే తేదీన లేదా ఆ తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించేందుకు ఆమోదం. ఈ నిర్ణయంతో జీవో 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం పాత పెన్షన్ విధానం వర్తింపు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ⇒ రాష్ట్రంలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేలా, తిరుపతి విమానాశ్రయం మినహా మిగిలిన అన్ని విమానాశ్రయాలలో అత్యాధునిక బార్లు, రిటైల్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి సంబంధించిన నూతన విధాన మార్గదర్శకాల ముసాయిదా ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) చట్టం 2016లో సవరణలకు ఆమోదం. టీడీపీ ఆఫీస్కు రెండు ఎకరాలు ⇒ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో టీడీపీ కార్యాలయం కోసం 2.002 ఎకరాలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి తొలుత 66 ఏళ్లు.. ఆపై 99 ఏళ్లకు పొడిగించేలా లీజుకు ఆమోదం. ⇒ రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత రిజిస్ట్రేషన్ సేవలను అందించేందుకు అల్లూరి సీతారామరాజు, పొలవరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం స్థాపించి, నిర్వహించడానికి ఆమోదం. వీటిని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రకటిస్తూ విధులు నిర్వహించేందుకు ఆమోదం. ‘గీతం’లో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి అనుమతి⇒ విశాఖ రిషికొండలోని గీతం విద్యా సంస్థలో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణం చేపట్టేందుకు తాత్కాలిక ఫైర్ ఎన్వోసీ మంజూరుకు ఆమోదం. ⇒ ఎస్ఐపీబీ, సీఆర్డీఏలో తీసుకున్న నిర్ణయాలకు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం. ⇒ డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య ప్రతిపాదించిన బిల్ డిస్కౌంటింగ్ విధానానికి సంబంధించి 8 శాతం వడ్డీ భారాన్ని సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రులే భరించే నిబంధనతో ఆమోదం. పవన్పై విమర్శలు చేస్తే స్పందించండిమంత్రులకు సీఎం డైరెక్షన్సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిపై స్పందించి కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడుతూ పలు సూచనలు చేసినట్టు సమాచారం. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్పై కాపు సామాజికవర్గం నేతలు, వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం వద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పవన్పై విమర్శలు వస్తే మంత్రులంతా స్పందించాల్సిందేనని, మౌనంగా ఉంటే సరికాదని, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి సందర్భాల్లో కూటమి ఐక్యతను చాటే విధంగా మంత్రులంతా సమన్వయంతో స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ క్రిమినల్స్ను వెనకేసుకొస్తూ రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు కుల మీటింగ్లు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించినట్టు తెల్సింది. జొన్నగిరి గ్రామాన్ని ‘స్వర్ణ గ్రామం’గా నామకరణం చేయాలని సీఎం ప్రతిపాదించినట్టు సమాచారం. జూలై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించారు. -
అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ
-
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...
-
వక్ఫ్ భూములపై పంజా
సాక్షి, అమరావతి: ముస్లిం సమాజం మేలు కోసం దాతలు ఇచ్చిన రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను అధికారికంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు సర్కారు అడ్డూ అదుపులేకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వక్ఫ్బోర్డును రబ్బర్ స్టాంప్గా మార్చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు భూముల కేటాయింపునకు ఆమోదముద్ర వేసేలా వక్ఫ్బోర్డ్ సమావేశాల్లో ఒత్తిడి తెస్తూ ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తోందని ముస్లిం ప్రతినిధులు విమర్శిస్తున్నారు.నంద్యాల జిల్లాలో వక్ఫ్ భూములను పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయాల కోసం కేటాయించే విషయాన్ని మంగళవారం నిర్వహిస్తున్న ఏపీ వక్ఫ్బోర్డు సమావేశం అజెండా అంశాల్లో చేర్చడం ముస్లిం సమాజంలో తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లాలోని చాబోలు గ్రామంలో సర్వే నెంబర్ 313/1లోని 19.14 ఎకరాల వక్ఫ్భూమిని జిల్లా ఎస్పీ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ కోసం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. దీన్ని వక్ఫ్బోర్డు చైర్మన్, అధికారులు పరిశీలించి 11వ అంశంగా అజెండాలో చేర్చారు. అదే జిల్లాలోని పాణ్యం మండలం కౌలుర్ గ్రామంలోని సర్వే నెంబర్ 128/2లో పది సెంట్ల భూమిని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం అప్పగించేలా అజెండాలోని 12వ అంశంగా చేర్చారు. దీనిపై వక్ఫ్బోర్డు సభ్యులు చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ముస్లిం సమాజం గమనిస్తోంది. అడిగేవారే లేరనుకునే ధోరణి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను సహజంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వమే భూ సేకరణ చేసి ఆయా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించి ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ భూములపై కన్నేసింది. పైగా ఆయా వ్యవహారాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం కూడా పెచ్చుమీరింది. రాష్ట్రంలో అనేక వక్ఫ్ భూములను ఏపీఐఐసీ తదితర సంస్థలకు కట్టబెట్టేందుకు, ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద వక్ఫ్బోర్డ్ భూముల విషయంలో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు అధికార పార్టీ నేతలు తమను అడిగేవారే లేరన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంలో కొన్ని అంశాలు..⇒ చిత్తూరులోని ఇఫ్తేదార్ అలీ ఖాన్ షహీద్ దర్గా వక్ఫ్కు చెందిన 6.31 ఎకరాల భూమికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్తో పాటు హైకోర్టులోనూ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ, ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు సదరు దర్గా భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టిన వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్ మొహిద్దిన్పై అక్రమ కేసు నమోదు చేయించడం వెనుక చిత్తూరు జిల్లా టీడీపీ కీలక నేత ప్రమేయం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన చోట వక్ఫ్ ఆస్తులను కాపాడే అధికారులను ఇబ్బందులకు గురిచేయడం అధికార పార్టీ ఆగడాలకు పరాకాష్ట. ⇒ తాడిగడప ఖాజీ సర్వీస్ ఇనామ్ వక్ఫ్ భూములు 25.59 ఎకరాల విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వేలం పాట ప్రక్రియను పూర్తి చేసి ఆ భూములను స్వా«దీనం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా అధికార పార్టీ నేతల అండదండలతో ఆ భూములను ఆక్రమణదారులే సాగు చేస్తున్నారు. దానిపై ముస్లిం నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు అయినా అనిపించలేదు. దీని వెనుక రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లే కారణమనే విమర్శలు రేగుతున్నాయి. అధికారులు స్పందించకపోవడం వల్లే ఆ భూముల్లో అక్రమ సాగు, పంట కోతలు జరిగాయని తాజాగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్–ఆడిటర్ నివేదిక తేల్చిచెప్పింది. ⇒ కర్నూలు జిల్లా కల్లూరు రోజా దర్గా వక్ఫ్ భూములు 19.65 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో వక్ఫ్ భూముల మార్పిడి, బదిలీ చట్ట విరుద్ధమని గతేడాది ఆగçస్టు 4న లీగల్ ఒపీనియన్ స్పష్టంగా పేర్కొంది. అయినా ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయనే విమర్శలున్నాయి. ⇒ విజయనగరం నగరంలోని గెజిటెడ్ ముస్లిం శ్మశాన వాటిక భూమిని అక్రమంగా సబ్ డివిజన్ చేసి.. ప్రైవేట్ ఆస్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వక్ఫ్ ఆస్తులకు పెనుముప్పు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వాటిని పలు శాఖలకు, బడాబాబులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం దారుణం. చంద్రబాబు వైఖరి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులకు పెనుముప్పు వాటిల్లింది. వక్ఫ్భూముల అన్యాక్రాంతానికి వక్ఫ్బోర్డు నుంచి అధికారుల వరకు వేగంగా చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా వ్యవహారాలపై అధికారికంగా ఆడిట్ జరపాలి. అక్రమాలపై స్వతంత్ర సంస్థతో విచారణ నిర్వహించి వాస్తవాలను ముస్లిం సమాజానికి వెల్లడించాలి. వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సినవారే అవినీతికి పాల్పడితే, చట్టం తన పని చేయాల్సిందే. – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
రూ.100 కోట్ల రిటైర్డ్ ఉద్యోగి భూమి కబ్జా
సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూములకు రక్షణ కరువైంది. కోట్ల విలువ చేసే భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేసి పాగావేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ తరహా భూ కబ్జాలు పెరిగిపోవడం గమనార్హం. కూటమినేతల భూదందాలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అదే స్థాయిలో అధికార పార్టీ నేతల ఆగడాలూ పెరిగిపోతున్నాయి. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో రూ.100కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులతో కబ్జా చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.ఆ కబ్జా వెనుక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అధికారుల పాత్ర ఉందని చెబుతున్నారు. రవాణా శాఖలో ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్ముతో ఆ భూమిని కొనుగోలు చేశానని, ఇప్పుడు దానిని ఎస్ఎన్ఎల్ డెవలపర్స్ సంస్థకు అమ్మేసినట్టు ఆన్లైన్ చేసుకున్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. బాధితుల వివరాల మేరకు... పీలేరులోని ఎర్రమిట్టకు చెందిన రిటైర్డ్ ఆర్టీవో ద్వారకానాథ్ రెడ్డి కుటుంబం 2002–03లో తిరుపతి మండలం అవిలాల పరిధిలోని సర్వే నంబర్ 476/1లో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి తన భార్య వనజ పేరుతో ఆన్లైన్ అయ్యిందని, ఈసీతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా తమ పేర్లు ఉన్నాయని ద్వారకానాథరెడ్డి పేర్కొన్నారు.అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి వివాదం సృష్టించిందని... అనంతరం తాము కొనుగోలు చేసిన భూమి చెల్లదంటూ గత ఏడాది ఆగస్టు 25న తిరుపతి రూరల్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. 1986 నాటి సేల్డీడ్ను రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ మరుసటి రోజే ఇతరుల పేరుతో జీపీఏ, రిజిస్ట్రేషన్లు జరగడానికి అవకాశం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భూమిపై గేటెడ్ కమ్యూనిటీ, ఎస్ఎన్ఎల్ డెవలపర్స్ పేరుతో ప్లాట్లు వేసి విక్రయాలకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుల పాత్ర ఉందని ఆరోపించారు.నాని అనుచరుడు అశోక్రెడ్డి పేరిట జీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు అశోక్ రెడ్డి పేరుతో జీపీ చేశారని, గత ఏడాది ఆగస్టు 26న కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన దోనేపూడి విష్ణు శివ నాగప్రసాద్ పేరుతో 35 మంది చేత ఆధార్కార్డు, పాన్కార్డ్, ఇతర తనిఖీలు చేయకుండానే తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ విజయ్కుమార్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని బాధితురాలు వనజ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ, ఆర్డీవో కోర్టులో అప్పీలుకు వెళ్లామని, స్టే ఆర్డర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను ప్రశ్నించగా పెద్ద వాళ్లు ఒత్తిడి చేయడం వల్లే రిజిస్ట్రేషన్ చేశామంటూ తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. వృద్ధ వయసులో ఉన్న తమ భూమిపై ఎమ్మెల్యే, మంత్రి కన్నేసి కబ్జా చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుపతి 10వ అదనపు కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తుడా అనుమతులకు ఫైళ్లను పంపించగా అక్కడి అధికారులు అన్ని రకాల దస్త్రాలను అందజేయాలని కోరడంతోపాటు కోర్టులో కేసు నడుస్తున్నందున అనుమతులు ఇవ్వలేమని టౌన్ప్లానింగ్ అధికారులు అడ్డు చెప్పారని బాధితులు తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కబంద హస్తాల నుంచి తమ భూమిని కాపాడాలని వనజ కోరుతున్నారు.పట్టా భూములకూ రక్షణ కరువైందిరిటైర్మెంట్ డబ్బులతో 2002 – 03 మధ్య కొనుగోలు చేసిన భూమిని మంత్రి అనగాని, ఎమ్మెల్యే నాని అనుచరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ భూములకే కాకుండా పట్టా భూములకు కూడా రక్షణ కరువైంది. 1986 నుంచి ఉన్న రిజిస్ట్రేషన్ను నిషేధిత భూముల జాబితాలో ఉందంటూ లిటిగేషన్ సృష్టించారు. మేము కొనుగోలు చేసినప్పటికే 20కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగితే నిషేధిత జాబితాలోకి ఎలా చేరుతుంది. వెబ్ల్యాండ్లో మా పేరు తొలగించి మంత్రి అనుచరులు పేరును చేర్పించుకున్నారు. రూ.100 కోట్ల విలువైన భూమిని ఇప్పుడు డెవలపర్స్ పేరిట ఆన్లైన్ చేసేశారు. తహసీల్దార్ను అడిగితే కోర్టులో చూసుకోమని చెబుతున్నారు. – ద్వారకానాథ్రెడ్డి, రిటైర్డ్ ఆర్టీవో, పీలేరుఅక్రమార్కులపై చర్యలు తీసుకోవాలితిరుపతి రూరల్ మండలం అవిలాల రెవెన్యూ గ్రామంలో రూ.100 కోట్లకు పైగా విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని భారీ భూదందా సాగుతోందని తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు విడుదల మాధవరెడ్డి ఆరోపించారు. ఆ మేరకు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తూ అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవిలాల రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 476/1లో భూమిపై హక్కులు లేని వ్యక్తులు తప్పుడు పత్రాలు, నకిలీ ఆధారాలతో రిజిస్ట్రేషన్లు సృష్టించి చేతులు మారుస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ భూవ్యవహారంపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్లను ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ గానీ, చర్యలు గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తిరుపతికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ప్రస్తుతం వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుండటంతో భూ మాఫియా కన్ను పడిందని ఆరోపించారు. ‘మూడు రోజుల్లో భూ దోపిడీపై చర్యలు ప్రారంభించకపోతే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు, భారీ ప్రజా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ భూములను దోచుకున్న వారిని ప్రజల ముందు నిలబెడతామని ఎంపీపీ మాధవరెడ్డి హెచ్చరించారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
సాక్షి, అమరావతి: ఈ–బస్సుల ముసుగులో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ధర్నాలు చేపట్టబోతోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పటికే తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ–బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు తదితర డిమాండ్లతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యంకు వినతిపత్రాలు సమర్పించింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతోంది. మంగళ, బుధవారాల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో ధర్నాలు నిర్వహించనుంది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులపై సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ డీఎస్సీ 1998, 2008 కింద మినిమం టైమ్ స్కేల్పై (ఎంటీఎస్) పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఉద్యోగాలకు అర్హులై, దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉపాధ్యాయ కొలువులోకి అడుగుపెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది. జీవోలకు విరుద్ధంగా బదిలీల పేరుతో కౌన్సెలింగ్ చేపట్టి ఇష్టారీతిన తలోదిక్కుకు విసిరేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. వాస్తవానికి 1998, 2008 డీఎస్సీకి చెందిన దాదాపు 4,900 మందికిపైగా అర్హులకు దశాబ్దాల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగింది.వీరిని మినిమం టైమ్ స్కేల్ కింద పరిగణిస్తూ ఉపాధ్యాయులుగా నియమించింది.వారికి సొంత మండలాలు, సమీప ప్రాంతాల్లోనే పోస్టింగులు ఇచ్చింది. వారి జీవన ప్రమాణాలను, కుటుంబం, వయసు, ఆరోగ్య కారణాలరీత్యా మానవతా దృక్పథంతో ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో మినిమం టైమ్ స్కేల్తో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు పనిచేస్తున్న వారిని బదిలీల పేరుతో వందల కిలోమీటర్ల దూరానికి, కొండలు, అటవీ ప్రాంతాల్లోకి విసిరేసింది. కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాలు కల్పించారనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని పాశవిక చర్యలకు పాల్పడుతోంది. కౌన్సెలింగ్కు వ్యతిరేకంగా ధర్నా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి, ధర్నాలకు దిగడంతో చాలాచోట్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం 4,900 మంది టీచర్లకు సమీప ప్రాంతాల్లోని ఖాళీలను బ్లాక్ చేసి సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రదేశాలు, కొండలు, అటవీ కేంద్రాల్లో మాత్రమే పోస్టులను చూపించి బలవంతంగా నెట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. దీనికి ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు టీడీపీ అనుకూల వ్యక్తులు సైతం వంతపాడుతూ పోస్టులను బ్లాక్ చేయిస్తుండటం విస్తుగొలుపుతోంది.గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో–27ను తుంగలో తొక్కడం గమనార్హం. రెగ్యులర్ టీచర్లతో సమానంగా ఏకోపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి రాజకీయ కోణంలో చూస్తుండటం ప్రభుత్వ దుర్నీతికి అద్దం పడుతోంది. దీనిపై 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు రెండేళ్లుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కనికరం చూపించడంలేదు. పైగా సదరు ఉపాధ్యాయుల సర్వీసును 62 ఏళ్లకు పెంపుపైనా నోరు మెదపడంలేదు. హెచ్ఆర్ఏ, డీఏ, ఇతర ఆర్థిక లబ్ధికి దూరంగా 11 నెలలు మాత్రమే జీతం తీసుకుంటూ పనిచేస్తున్న వారిపై కనికరాన్ని ప్రదర్శించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోంది. -
రాష్ట్రంలో రాక్షస పాలన
నెల్లూరు (వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీలో జరిగిన అవకతవకలను, ఎత్తిచూపుతున్నారనే ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థల్లో దాడులు చేయడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 18 మంది శాసన మండలి సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖరరెడ్డికి సంఘీభావంగా నెల్లూరుకు తరలివచ్చారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సర్కారు దమన నీతిని ఎండగట్టారు. చిల్డ్రన్స్పార్కు రోడ్డులోని చంద్రశేఖర్రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ, నియంతృత్వ పోకడలు మంచివి కాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలను తగిన సాక్ష్యాధారాలతో ఎత్తిచూపినందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై అర్ధరాత్రి దాడులు నిర్వహించారని విమర్శించారు.ఈ జిల్లాలో నారాయణ విద్యాసంస్థలు, హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని, వాటిపై దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతరెడ్డి, కేఆర్జే భరత్, ఇషాక్బాషా, పి.రామసుబ్బారెడ్డి, మంగమ్మ, రమేష్ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, తూమాటి మాధవరావు, ఎండీ రుహుల్లా, కవురు శ్రీనివాస్, వెంకటరవీంద్రనాథ్, బొమ్మి ఇజ్రాయిల్, కె హరిబాబు, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పాల్గొన్నారు. -
‘గంపగుత్త’గా దోచేశారు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–24 మధ్య జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ అమలుతోపాటు మొబిలైజేషన్ అడ్వాన్సు విధానం రద్దు లాంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవంపోసి పారదర్శకతకు పెద్దపీట వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దుచేసి టెండర్ల వ్యవస్థను 2014–19 తరహాలో నీరుగార్చిందనేందుకు స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులే మరో నిదర్శనం.కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని సరఫరా చేయడం.. మురుగునీటిని శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పనులకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుండగా మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, ఆయా కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలు వాటాగా ఇవ్వాలి.ఇలా రాష్ట్రంలో 103 మున్సిపాల్టీ, కార్పొరేషన్, నగర పంచాయతీల్లో అమృత్ 2.0 కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులకు 2023–24లో కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించి నిధుల విడుదలకు అంగీకరించింది. ఆ పనులకు 2023–24లోనే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రెండు నెలలకే 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తొలుత ‘ఛామ్’ పాట..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమృత్ 2.0 కింద వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన పనుల టెండర్లను రద్దుచేసింది. ఆ పథకానికి రాష్ట్ర వాటాగా నిధులు ఇచ్చేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించదనే సాకుతో 77 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి ఛామ్ (కన్ససెనైర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో గతేడాది జూన్లో వేర్వేరుగా టెండరు నోటిఫికేషన్లు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీ వాటా నిధులను కాంట్రాక్టరే చెల్లించి పనులు చేపడితే.. వాటిని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో వడ్డీతో కలిపి పదేళ్లలో చెల్లించేలా గత జూన్లో టెండర్లు పిలిచింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసింది. ఎన్నడూలేని రీతిలో గంపగుత్తగా..అనంతరం.. అమృత్ 2.0 కింద చేపట్టిన పనుల అంచనా వ్యయాలను భారీగా పెంచేశారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 103 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను 9 ప్యాకేజీలుగా విభజించి.. టెండరు నోటిఫికేషన్కు ముందే ముఖ్యనేత సన్నిహితుడు ఒకరు బడా కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలాడారు. కమీషన్ల లెక్కతేల్చాకే.. ఆ కాంట్రాక్టు సంస్థలకే టెండరులో బిడ్లు దాఖలు చేసే అర్హత ఉండేలా నిబంధనలు రూపొందించి గతేడాది నవంబర్– డిసెంబర్లలో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. అడిగినంత కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టు సంస్థకే అధిక ధరకు పనులు కట్టబెట్టేశారు. ⇒ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 24 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులకు రూ.1,048.29 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో బిడ్ దాఖలు చేయాలంటే మార్చి 31, 2025 నాటికి గత పదేళ్లలో అంటే 2014–15 నుంచి 2024–25 వరకూ ఏదైనా ఒక సంవత్సరం రూ.262.07 కోట్ల వ్యయంతో ఇలాంటి పనులనే పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ టెండర్లో 3.77 శాతం అధిక ధర అంటే రూ.1087.81 కోట్లకు కోట్ ఎల్–1గా నిలిచిన మేఘాకు ఆ పనులను అప్పగించేశారు. ⇒ కొండపల్లి, వైఎస్సార్ తాడిగడప, దాచేపల్లి, విజయవాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, పెడన, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి, తెనాలి, పొన్నూరు, చీరాల, బాపట్ల, రేపల్లె, ఉయ్యూరు, తిరువూరు, సత్తెనపల్లి, అద్దంకి.. మొత్తం 26 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం–నిర్వహణ పనులకు రూ.1,038.34 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 3.80 శాతం అధిక ధరకు అంటే రూ.1,077.79 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మేఘాకు ఆ పనులను అప్పగించారు.⇒ వైఎస్సార్ కడప జిల్లాలో కడప కార్పొరేషన్, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు మున్సిపాల్టీలు, యర్రగుంట్ల నగర పంచాయతీలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, వాటి నిర్వహణ పనులకు రూ.648.90 కోట్ల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్ జారీచేశారు. 3.85 శాతం అధిక ధరకు అంటే రూ.673.82 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్కు ఆ పనులు అప్పగించారు. ⇒ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల పనులకు రూ.563.08 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.96 శాతం అధిక ధర అంటే రూ.585.33 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు ఆ పనులు అప్పగించారు.⇒ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 11 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.426.56 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించిన టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.91 శాతం అధిక ధరకు అంటే రూ.443.24 కోట్లకు కోట్ చేసిన ఎల్–1గా నిలచిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్కు ఆ పనులను అప్పగించారు.⇒ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 11 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.405.09 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.90 శాతం అధిక ధరకు అంటే రూ.420.88 కోట్లకు కోట్ చేసిన ఎల్–1గా నిలిచిన సివెట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఆ పనులను అప్పగించారు. ⇒ తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నాలుగు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.399.50 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.61 శాతం అధిక ధరకు అంటే రూ.413.89 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కు వాటిని అప్పగించారు. ⇒ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఐదు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.398.14 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.93 శాతం అధిక ధరలకు అంటే రూ.413.79 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థకు వాటిని అప్పగించారు. ⇒ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో 10 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.381.41 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. 3.97 శాతం అధిక ధరకు అంటే రూ.396.52 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీకి వాటిని అప్పగించారు.రూ.551.30 కోట్ల మేర పంచుకు తిన్న వైనం..అంచనా వ్యయం పెంచేయడం.. అస్మదీయ కాంట్రాక్టరుకే పనులు దక్కేలా నిబంధనలతో టెండరు నోటిఫికేషన్ జారీచేయడం.. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టడం.. ఒప్పంద విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పడం.. అందులో ఎనిమిది శాతం ప్రభుత్వ పెద్దలు తిరిగి వసూలు చేసుకోవడం రివాజుగా మారిపోయింది. ఇదే పద్ధతిని అమృత్ 2.0 టెండర్లలోనూ అనుసరించారని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పనుల్లో రూ.551.30 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి కాంట్రాక్టర్లు, ముఖ్య నేతలతో కలిసి పంచుకు తిన్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉంటే..ఇలా గంపగుత్తగా కాకుండా ఒక్కో కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీకి వేర్వేరుగా టెండర్లు నిర్వహించి ఉంటే.. చిన్నచిన్న కాంట్రాక్టర్లు పెద్దఎత్తున పోటీపడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉండేదని.. దానివల్ల కాంట్రాక్టు విలువ కంటే సగటున 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరలకు పనులు అప్పగించే అవకాశం ఉండేదని.. అలాగే ఖజానాకు రూ.450 కోట్లకు పైగా ఆదా అయ్యేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పనులు కూడా నిర్దేశిత గడువు రెండేళ్లలోగా పూర్తయ్యే అవకాశం ఉండేదని.. వాటి నిర్వహణ కూడా సవ్యంగా ఉండేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా.. వాటిని మళ్లీ సబ్ కాంట్రాక్టు కింద ఆయా ప్రాంతాల్లోని చిన్నచిన్న కాంట్రాక్టర్లకే అప్పగించారని చెబుతున్నారు.అంతా సిండికేట్.. సగటున 3.9% అధిక ధరకు..తొమ్మిది ప్యాకేజీలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధరలు చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల తరహాలోనే అమృత్ 2.0 పనుల్లోనూ కాంట్రాక్టర్లను ప్రభుత్వ పెద్దలే సిండికేట్ అయ్యేలా చేశారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థలు వరుసగా 3.97, 3.96, 3.93, 3.91, 3.90, 3.85, 3.80, 3.77 కోట్ చేయడమే అందుకు నిదర్శనం. ఒక్కో ప్యాకేజీలో సగటున 3.9 శాతం అధిక ధరకు కోట్చేస్తూ బిడ్లు దాఖలు చేసి పనులు దక్కించుకోవడం గమనార్హం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.203.76 కోట్ల భారం పడింది. ఇక జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లిస్తామని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. వీటిని బట్టిచూస్తే ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.6,500 కోట్లకుపైగా దాటుతుందని అంచనా వేస్తున్నారు. -
లాకప్డెత్ సాక్షిగా హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఏమైంది? తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకాయించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో టాస్్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ డీల్ వ్యవహారమేనా..! సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్ పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ ఆత్మహత్య... సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
కాపులకు బాబు ద్రోహం..!
సాక్షి, అమలాపురం/రామచంద్రపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని.. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని.. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలని.. కాపు కార్పొరేషన్కు చంద్రబాబు బకాయి పెట్టిన రూ.9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్కు రూ.3 వేల కోట్లు ఇస్తామని హామీలిచ్చిన చంద్రబాబు రెండేళ్లలో మూడు రూపాయిలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ‘కాపు నేస్తం’ సహా ఎన్నో పథకాలను ఇచ్చారని.. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా కాపు మహిళలు, విద్యార్థులకు మేలు జరిగిందని.. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకొస్తారా? అని మండిపడ్డారు. కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని వెంకటాయపాలెంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కాపులపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలు, సంక్షేమ పథకాల నిలిపివేతతో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కడం లేదు.. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా? అధికార పార్టీ నేతలు ఎంతోమంది అరాచకాలు చేస్తుంటే పవన్కు కనపడటం లేదా? సాయికృష్ణ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపెడతారా? అయినా కేసులు ఉంటే మనుషులను చంపేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు..’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ నోటికి, భాషకు.. హద్దు, ఆనకట్ట లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు అడగలేదా? ఇప్పుడు అదే కులంలో ఓ మనిషిని చంపేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, పోలీసుల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు సర్కారు అరాచకాలను కలసికట్టుగా ఎదుర్కొంటామని.. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తామున్నామనే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. ఇది మరే కులాలకూ వ్యతిరేకం కాదని, కాపులతో పాటు మిగిలిన కులాలను కూడా కూడగట్టి వెళ్తామని, కాపులతో ఉంటే తమకు ఓ భరోసా ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన నవరత్న పథకాలతో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా కాపు మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్య పథకం ద్వారా కాపు విద్యార్థులకు మేలు జరిగిందని.. కాపు నేస్తం కింద ఏటా రూ.15 వేలు ఇచ్చి కాపు మహిళల అభ్యున్నతికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేయూత అందించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతోపాటు రూ.వేల కోట్ల నిధులిచ్చి కాపులకు ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, రౌతు సూర్యప్రకాశరావు, జి.శ్రీనివాస్ నాయుడు, దూలం నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, చిన్న, మల్లి వెంకట్రాజు, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, జె.గురునాథరావు, చిన్న శీను, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియచేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. పక్కన కాపు ముఖ్య నాయకులు ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం‘రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. నష్టపోయిన వారింటికి వెళ్తాం. అక్కడే కూర్చుంటాం. వారికి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కల్పిస్తాం. ఆర్థికంగా చేయూతనిస్తాం. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆపద కల్పించినా కలసికట్టుగా ఎదుర్కొంటాం..’ అని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కాపు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఎనిమిది మంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించారు. ‘నా కుమారుడి శవాన్ని ఇవ్వకున్నా.. కనీసం బూడిదైనా ఇవ్వాలి..’ అంటూ కాపు యువకుడు సాయికృష్ణ కన్నతల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న హృదయ విదారక ఘటనలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.ఎన్నికల్లో కులం చూపించి ఓట్లేయమనలేదా?: బొత్సరానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్నంలో కూడా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యన్నారాయణ తెలిపారు. అవసరమైతే ప్రతి జిల్లాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపి శవం కూడా కనిపించకుండా ఏవిధంగా మాయం చేశారో చూశామన్నారు. దీనిపై సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సిట్పై తమకు నమ్మకం లేదన్నారు. ‘క్రిమినల్ కేసులుంటే చంపేస్తారా? అలాగని చట్టంలో, రాజ్యాంగంలో ఉందా? అలా అయితే కమిషన్ ఎందుకు వేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులకున్న అంగబలం, ఆర్థిక బలంతో అవసరమైతే సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రౌడీలతో పోల్చడంపై బొత్స తీవ్రంగా మండిపడ్డారు. అధికారం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు వేయమంటారా? ఇప్పుడు అదే కులంలో మనిషిని చంపేస్తే ఆయనకు అడగాల్సిన బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. ‘కాపులకు న్యాయం జరుగుతుందని రెండేళ్లు ఎదురు చూశాం. అయినా అన్యాయమే జరిగింది’ అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం సహా ఎన్నో పథకాలను ఇచ్చారని, ఇప్పుడు గతంలో ఉన్న పథకాలను సైతం తీసేస్తామంటే ఒప్పుకోబోమన్నారు.ఇవీ తీర్మానాలు..⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. బాబు సర్కారు అరాచకాలను ఖండిస్తున్నాం. సాయికృష్ణను పోలీసులే చంపేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు కూడా పోలీసులే కారణం. వీరి మరణాలపై సీబీఐతో విచారణ చేయాలి.⇒ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.⇒ కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు మూడు ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం.⇒ కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి.⇒ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.⇒ వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం పథకం కింద మహిళలకు రూ.2 వేల కోట్ల సాయం అందించారు. ఈ ప్రభుత్వం మహిళలకు రూ.9 వేల కోట్ల బాకీలు చెల్లించాలి.రూ.3,000 కోట్లన్నారు.. రూ.3 కూడా ఇవ్వలేదుకాపుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కంటే అధికంగా కట్టుబడి ఉంటామని, రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రూ.3 కూడా కేటాయించలేదని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాపునేతల ఆత్మీయ సమావేశానికి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు 100 మంది గన్మెన్లను ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఫ్లైట్లు సమకూర్చితే కాపులకు న్యాయం జరిగినట్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల్లో అత్యధికులు చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారన్నారు. వారి జీవితాలు చదువు ద్వారా మాత్రమే మారతాయని, కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టి వారందరికీ అన్యాయం చేస్తోందన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, ఆయనకు అనుకూలంగా నోటికి హద్దు లేకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం అనవసరమనే స్థాయి కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు. రౌడీలను ప్రోత్సహిస్తారా..? అంటూ పవన్ కళ్యాణ్ ఒక రకం నాటకం ఆడితే.. పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ దాగుడు మూతలు, డ్రామాలను కాపులతో పాటు రాష్ట్ర ప్రజలంద రూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తమను రెడ్డి కాపులుగా సంబోధిస్తున్న పవన్ కళ్యాణ్.. కమ్మ కాపు అవుతాడా? అని ప్రశ్నించారు. కాపులు కాపులేనని, కులం కార్డు వాడుతూ చంద్రబాబుకు ఊడిగం చేయడాన్ని సహించబోరని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న కాపులతో పాటు తమ గొంతు వినిపించలేని ఇతర కులాలకు కూడా అండగా ఉండాలని, అందుకోసం టాస్క్ఫోర్స్లు, క్రౌడ్ ఫండింగ్తో ఆదుకోవాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు నాని వివరించారు.అలాగైతే కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు?: తోట త్రిమూర్తులుకాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసేందుకు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. ఇది మరే కులానికీ వ్యతిరేకం కాదని, అందరూ కలసి ఉండాలని, అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కుల జాడ్యం పోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లాంటి పదవులన్నీ కులాల వారీగానే కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కులాలు అవసరం లేదన్నప్పుడు.. కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.‘కాపు నేస్తం’.. వైఎస్ జగన్నవరత్నాల పథకాలతో కాపులకు రూ.39,317.80 కోట్ల సాయంకాపు కార్పొరేషన్కు టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలు సైతం చెల్లించింది జగనేచంద్రబాబు మాదిరిగా తాను మాయమాటలతో మభ్యపెట్టలేనని ముందునుంచీ చెప్పిన వైఎస్ జగన్ 2019–2024 మధ్య ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిజమైన కాపు నేస్తంగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నవరత్నాలతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల సంక్షేమానికి బాటలు వేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర లాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపులకు తోడ్పాటు అందించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. పార్టీ, ప్రాంతం లాంటివి చూడకుండా, దళారుల ప్రమేయం లేకుండా కాపులకు నవరత్నాల (డీబీటీ, నాన్ డీబీటీ) పథకాల ద్వారా రూ.39,317.80 కోట్లను అందించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.500 కోట్లు, 307 మంది విద్యార్థులకు రూ.20.97 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.8.83 కోట్లు ఇవ్వకుండా బకాయి పెట్టగా.. వైఎస్ జగన్ వాటిని చెల్లించడమే కాకుండా కాపుల సంక్షేమానికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా 4 కాపు భవనాలు ప్రారంభించింది.


