breaking news
Chandrababu Naidu government
-
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
-
అవును.. అది అదానీ డేటా సెంటరే
సాక్షి, అమరావతి: గూగుల్ పేరుతో డేటా సెంటర్ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు సర్కారు చేసిన గిమ్మిక్కు అదే ప్రభుత్వం విడుదల చేసిన జీవో సాక్షిగా బట్టబయలైంది. చివరకు ప్రభుత్వమే దిగివచ్చి మొత్తం భూ కేటాయింపులను అదానీ ఇన్ఫ్రా (ఇండియా) పేరు మీదకు మార్చడమే కాకుండా, ఇకపై ఈ ప్రాజెక్టును అదాని ఇన్ఫ్రా (ఇండియా) లిమిటెడ్గా ప్రస్తావించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 480 ఎకరాలను ఇప్పుడు 601.4 ఎకరాలకు పెంచడమే కాకుండా, ఈ మొత్తం భూమిని అదాని ఇన్ఫ్రా పేరుపైకి బదలాయించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో అడవివరం–ముడసర్లలోవ వద్ద 120 ఎకరాలు కేటాయించగా, ఇప్పుడు దానిని 160 ఎకరాలకు పెంచారు. అదానీ ఇన్ఫ్రాకు 601.4 ఎకరాలు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అలాగే తుర్లవాడ వద్ద 200 నుంచి 266.6 ఎకరాలకు, రాంబిల్లి వద్ద 160 నుంచి 174.80 ఎకరాలకు పెంచుతూ భూ కేటాయింపులు చేశారు. ఇందుకోసం అదానీ ఇన్ఫ్రా అడవివరం–ముడసర్లలోవ భూముల కోసం వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, తర్లవాడ భూముల కోసం వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, రాంబిల్లి భూముల కోసం వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశాక, వాటి పేరు మీద భూ కేటాయింపులు చేయనుంది. ఇలా మొత్తంగా 601.4 ఎకరాల భూమిని డేటా సెంటర్ కోసం అదానీ ఇన్ఫ్రాకు కేటాయించింది.వైఎస్ జగన్కు క్రెడిట్ దక్కకూడదని కుతంత్రం⇒ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 14న న్యూఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో ప్రభుత్వం అదానీ పేరును ప్రస్తావించలేదు. కానీ అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మాత్రం ఈ డేటా సెంటర్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.⇒ అలాగే భారతీ ఎయిర్టెల్ గ్రూపు కూడా ఈ డేటా సెంటర్లో తాము భాగస్వాములమంటూ ట్వీట్ చేసింది. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో కూడా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ, సీఎం చంద్రబాబు సమక్షంలోనే గూగుల్తో కలిసి 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో చంద్రబాబు క్రెడిట్ చోరీ అంతర్జాతీయ స్థాయిలో బయట పడింది.⇒ ఈ విషయమై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్లో విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో బయట పెట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని ఎత్తి చూపారు. ఇప్పుడు వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అంశం నిజమేనని ప్రభుత్వ జీవో సాక్షిగా వెల్లడైంది. తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి, ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్ఫ్రా పేరు మీదకు బదలాయించడమే ఇందుకు నిదర్శనం. ⇒ ఈ నేపథ్యంలో రూ.87,250 కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ను అదానీ ఇన్ఫ్రా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు భూ కేటాయింపులు పెంచి, ఆ మేరకు అదానీ ఇన్ఫ్రాకు కేటాయించినట్లు తెలిపింది. -
సబ్ ప్లాన్కు చిల్లు.. కోతల ‘ప్లాన్’
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను ఎగ్గొడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం నిలిపివేసిన చంద్రబాబు సర్కారు కనీసం ఉప ప్రణాళిక నిధులైనా వ్యయం చేయకుండా బడుగు, బలహీన వర్గాలను దారుణంగా వంచిస్తోంది. సబ్ ప్లాన్ నిధులను కాగితాలపై చూపిస్తూ.. ఖర్చు పెట్టకుండా మురగబెడుతోంది. సబ్ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు సర్కారు రెండేళ్లలో ఎగ్గొట్టిన మొత్తం ఏకంగా దాదాపు రూ.27,000 కోట్లు!! గత రెండు బడ్జెట్ల గణాంకాల సాక్షిగా చంద్రబాబు సర్కారే దీన్ని ఒప్పుకుంది! విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, వ్యవసాయం.. సంక్షేమం కోసం ఉప ప్రణాళిక నిధులను వ్యయం చేయాలి. విద్యార్ధులకు స్కాలర్షిప్లు ఉప ప్రణాళిక నుంచి అందించాలి. సంక్షేమానికి రూ.వేల కోట్లు కోత పడటంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. భారీ కేటాయింపులు చూపిస్తూ మోసం.. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉత్త కేటాయింపులు మినహా ఖర్చు చేయలేదని చంద్రబాబు ప్రభుత్వమే సవరించిన బడ్జెట్ అంచనాల్లో వెల్లడించింది. కేవలం బడ్జెట్లో భారీ కేటాయింపులు చూపించి మోసం చేయడం మినహా వాస్తవంగా ఖర్చు చేయడం లేదని బహిర్గతమైంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల (2024–25, 2025–26) బడ్జెట్ల కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికలకు ఏకంగా రూ.9,591 కోట్లు కోత విధించింది. ఇక ఎస్టీ సబ్ప్లాన్ కేటాయింపుల్లో ఏకంగా రూ.3,695.23 కోట్లు కోత పెట్టింది. బీసీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ల కేటాయింపుల్లో ఏకంగా రూ.12,426 కోట్లు కోత విధించింది. మైనారిటీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1,132 కోట్ల మేర కోత విధించింది. ఆగిపోతున్న పిల్లల చదువులు...! చంద్రబాబు సర్కారు ప్రచారం కోసం ఎక్కువ మొత్తంలో సబ్ప్లాన్కు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్లలో చూపిస్తోంది. కేటాయింపుల మేరకు ఆయా వర్గాల సంక్షేమం, ఆర్థికాకాభివృద్ధికి చేయూతనివ్వకుండా మోసగిస్తోంది. విద్యార్ధులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఉప ప్రణాళిక నుంచే అందించాలి. వీటిని ఎగ్గొట్టడంతో పేదింటి పిల్లలు చదువులు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.4,642 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో కేవలం రూ.545.51 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం పట్ల చంద్రబాబు సర్కారు ఎంత చిన్న చూపు చూస్తోందో స్పష్టం అవుతోంది. -
మళ్లీ చెప్తున్నా తగ్గేదేలే. అనితకు కౌంటర్ Ambati
-
Varudu: దేవుడిపై నింద వేశారు.. కర్మ ఎవరినీ వదలదు..
-
టీచర్ల గర్జనతో దద్దరిల్లిన బెజవాడ
-
ఇకనైనా కళ్లు తెరువు..! చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
రగిలిన గుండెల ‘రణభేరి’
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తే సర్కారు పతనం తప్పదని ఉపాధ్యాయులు హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఐఆర్ 29 శాతం ప్రకటించాలని, నాలుగు డీఏలు, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం చలో విజయవాడ చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ధర్నా చౌక్లో రణభేరి సభ నిర్వహించారు.ఫలితంగా ధర్నా చౌక్ ఎరుపెక్కింది. రణన్నినాదాలతో దద్దరిల్లింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. రణభేరిలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, బకాయిలు చెల్లిస్తామని హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ, ఐఆర్, డీఏల కోసం సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇచ్చామని, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్లోనూ పీఆర్సీ, డీఏ బకాయిలపై కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఇప్పటికైðనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాలని, లేకుంటే చలో సెక్రటేరియేట్ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తే తట్టుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.శాసనమండలి, శాసన సభలలో టీటీడీ లడ్డూ నెయ్యిపై ప్రతిపక్షంపై అవాకులుచెవాకులు పేలడం తప్పితే ప్రజల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సర్కారు చర్చించడం లేదని విమర్శించారు. పీఆర్సీ జాప్యం జరిగే కాలానికి ఐఆర్ 29 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్, ఏపీజేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పాపం బాబుదే
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ వ్యవహారంతో మంగళవారం శాసన మండలి అట్టుడికింది. హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలు కేఆర్జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. ఈ విషయంపై చర్చకు అనుమతించాల్సిందేనని, తద్వారా హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధం బయట పెట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినదించారు. అయినా చైర్మన్ చర్చకు అనుమతించక పోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీటీడీలో హెరిటేజ్ పాత్రపై చర్చ జరపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హెరిటేజ్ నెయ్యి, పాలు, పెరుగు అన్నీ కల్తీ కల్తీ.. చంద్రబాబు పాలనా కల్తీ కల్తీ.. గోవిందా.. గోవిందా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ, చైర్మన్ మరో వైపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ.. హెరిటేజ్ వ్యవహారం బయట పడుతుందని సీఎం చంద్రబాబు తన మంత్రులను పంపి డ్రామా ఆడిస్తున్నారని మండిపడ్డారు. ధర పెంచుకునేందుకే దుష్ప్రచారం ‘ఎంతో కాలంగా టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. ఇది హెరిటేజ్ అనుబంధ సంస్థే. మొన్నటి వరకు రూ.300కు అటూ ఇటుగా నెయ్యి సరఫరా చేసింది. అయితే చంద్రబాబు ఇది వరకు ముఖ్యమంత్రి కాక ముందు, ముఖ్యమంత్రి ఆయ్యాక.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్దిష్ట విధానం కొనసాగింది. టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు టెండర్ ఖరారు చేస్తారు. ఇవే సంస్థలు రాష్ట్రంలో పలు ఆలయాలకు కూడా నెయ్యిని సరఫరా చేశాయి. అక్రిడేటెడ్ ల్యాబ్లో సర్టిఫికెట్ పొందాకే టీటీడీకి నెయ్యిని అనుమతిస్తారు. ఇక్కడ మళ్లీ టీటీడీ సొంతంగా ఆ నెయ్యిని పరీక్షిస్తుంది. నాణ్యత లేకపోతే ఆ ట్యాంకర్లను వెనక్కు పంపుతారు. అలా గత చంద్రబాబు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పలుమార్లు వెనక్కు పంపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే అదనుగా తన కుటుంబ సంస్థ హెరిటేజ్ నుంచి ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి ధరను ఏకంగా రెట్టింపు చేయాలని కుట్ర పన్నారు. తద్వారా తన హెరిటేజ్కు, తన సంబందీకులకు, తన అనుబంధ సంస్థలకు లబ్ధి చేకూర్చాలనుకున్నారు. ఇందు కోసం ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పైనే బరితెగించి రాజకీయం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, పందికొవ్వు, బాత్రూమ్లు క్లీన్ చేసే రసాయనాలు వాడారని ఉద్దేశ పూర్వకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే కొనుగోలు చేయడం వల్ల నాణ్యత లేదని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు, ఎల్లో మీడియా ఈ విషయమై భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించారు. బండారం బట్టబయలు శ్రీవారి లడ్డూపై చంద్రబాబు అండ్ కో చేయాల్సినంత దుష్ప్రచారం చేసేసి.. శ్రీవారి డబ్బులు దోచేసేందుకు బరితెగించారు. లడ్డూ సరఫరా ధరను ఏకంగా రెట్టింపు కిలో రూ.600కు పైగా పెంచేశారు. తద్వారా తన కుటుంబం సంస్థ, తన సంబంధీకులు, అనుబంధ కంపెనీలకు లబ్ధి చేకూర్చారు. ఆ లడ్డూ కల్తీ అనే ముద్ర వేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసి.. తను అనుకున్న రీతిలో స్కెచ్ మేరకు ధర పెంచుకోగలిగారు. చంద్రబాబు అంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారనే కోణంలో పలు సంస్థలు, మీడియా, మేధావి వర్గాలు కాస్తా లోతుగా శోధించడంతో నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సంబంధించి పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్దేనని స్పష్టమైంది. దీంతో తన కుట్ర బెడిసి కొట్టడంతో కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ విషయంపై మండలిలో చర్చ జరగాలని, హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ సంబంధాల గురించి స్పష్టం చేయాలని మంగళవారం మండలిలో వైఎస్సార్సీపీ పట్టుపట్టింది. ఈ విషయమై చర్చ జరిగితే ప్రజల్లో మరింత చులకన అవుతామని చంద్రబాబు హుటాహుటిన కొందరు మంత్రులను మండలికి పంపారు. ఈ నేపథ్యంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కె.అచ్చెన్నాయుడు ప్రతి దశలోనూ వైఎస్సార్సీపీ సభ్యులకు అడ్డు తగిలారు. ఇది డ్రామా కాదా? సభ్యుల వాదప్రతివాదనల నేపథ్యంలో చైర్మన్ కొద్ది సేపు సభను వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడటానికి చైర్మన్ మోషేన్రాజు అవకాశం ఇచ్చారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నాకే ఆయనతో మాట్లాడించాలని అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పొడియం వద్ద నుంచి బొత్స వెనక్కు వెళ్లి నిల్చొన్నారు. ఆ తర్వాత బొత్స మాట్లాడే ప్రయత్నం చేయగా.. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. తద్వారా సభలో గందరగోళం నెలకొనేలా చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులకు మాట్లాడే నైతిక హక్కు లేదంటూ అడ్డుకున్నారు. మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. తాము ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమేనని, హెరిటేజ్ వ్యవహారంపై చర్చ జరిగి తీరాల్సిందేనని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కలుగ జేసుకుంటూ.. ‘హెరిటేజ్కు, తిరుపతి లడ్డూకు సంబంధం ఉందని ఒక్క ఆధారం తెమ్మనండి.. అయినా తిరుమల లడ్డూపై ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు’ అని ఎదురు దాడి చేయబోగా.. ‘ఆధారాలు లేకుండా మాట్లాడిందెవరు? ఆధారాలు బయటకు రాకుండా ఇప్పుడు డ్రామాలాడుతోందెవరు?’ అని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని ధనార్జన ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అసలు ప్రభుత్వానికి సభ జరిపే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశి్నంచారు. సీఎం చంద్రబాబు ధనార్జన కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడైన వేంకటేశ్వరస్వామి లడ్డూపై దుష్ప్రచారం చేశారన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కల్తీ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేశారని చెప్పారు. హెరిటేజ్–ఇందాపూర్ బంధంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, హెరిటేజ్– ఇందాపూర్ డెయిరీ బంధంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో శాసన మండలి చరిత్రలో అరుదైన రికార్డు నెలకొంది. ఎప్పుడులేని విధంగా సభలో తొలిసారి మైక్, సౌండ్ సిస్టమ్ పని చేయలేదు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల మధ్య కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే సభ జరిగింది. గందరగోళం వల్ల నాలుగుసార్లు సభ వాయిదా పడింది. -
చంద్రబాబూ ఇకనైనా మేలుకో! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మదనపల్లె పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి, ఆపై హత్యచేసి, నీటి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. ఇకనైనా మేలుకుని తక్షణమే శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించి.. వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ‘నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలిక, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురై, ఆపై హత్యకు గురయ్యారు. ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై ఎన్నో దారుణమైన ఘటనలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనలను తేలిగ్గా తీసుకుందనేది వాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో హడావుడి ప్రకటనలు చేయడం, అనంతరం ఆ విషయాన్ని వదిలేయడం సహజంగా మారిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నాలు చేయించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. శాంతిభద్రతలపై హోం మంత్రి బాధ్యత వహించరని, చంద్రబాబు కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ.. అందరి శాఖల్లో వేలుపెడతారని విమర్శించారు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరన్నారు. ‘ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారి పనిగా మారిపోయింది. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘చంద్రబాబు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్తో, రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్స్టేషన్కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ టీడీపీ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే కేసు కట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారని వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.Shame on you, @ncbn garu!మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా… pic.twitter.com/QcR3jyWo0I— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
పులిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య పెట్టారు జాగ్రత్త
-
హెరిటేజ్ పాలలో ఏం కలిశాయంటే.. బాబుపై కేంద్రం ఆగ్రహం
-
బిల్గేట్స్ ఏపీ పర్యటన.. ఏపి కి లాభం ఏంటి?
-
యూరియా..‘ప్రైవేట్’ దయ!
సాక్షి, అమరావతి: ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి. వచ్చిన యూరియా వచ్చినట్లుగా దొడ్డి దారిన మిక్సింగ్ ప్లాంట్లకు తరలిపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా రూ.350 నుంచి రూ.600 చొప్పున కొనాల్సిన అగత్యం ఏర్పడింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండుసార్లు పెరగడం రైతులకు పెనుభారంగా మారింది. ఇప్పటికే కూలీల కొరతతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.30 వేలు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే విదిల్చింది. ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టింది. కౌలు రైతులకైతే రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. సున్నా వడ్డీకి చాప చుట్టేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో బీమా పరిహారానికి రైతులు దూరమయ్యారు. ఇక 20 నెలలుగా ధాన్యం సహా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరలు దక్కడం లేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని ఎత్తివేశారు. సబ్సిడీ విత్తనాల సరఫరాలో అడ్డగోలుగా కోత పెట్టారు. కనీసం యూరియా కూడా అదునుకు అందించకుండా రైతులు అధికంగా వినియోగిస్తున్నారంటూ తమ వైఫల్యాన్ని వారిపై గెంటేస్తున్నారు. పక్కదారి.. రబీ సీజన్లో వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. ఒకవైపు యూరియా కోసం రైతులు అల్లాడుతుండగా.. మరోవైపు లక్షల టన్నుల విక్రయాలు పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఆ యూరియా అంతా రైతుల పొలాలకు బదులుగా ప్రైవేట్ వ్యాపారుల ఆధీనంలోని బ్లాక్ మార్కెట్కు చేరిపోయినట్లు స్పష్టమవుతోంది. సీజన్లో 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ఇప్పటికే 6.27 లక్షల టన్నులు విక్రయించినట్లు ప్రభుత్వం చెబుతోంది.కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఒక్కకట్ట కోసం పడరాని పాట్లు పడుతుండటం గమనార్హం. సీజన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ యూరియా దొరకని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నంద్యాల జిల్లాలో బయట మార్కెట్లో బస్తా రూ.500 పెట్టి కొన్నామని జొన్న, మొక్క జొన్న రైతులు చెబుతుండగా.. నెల్లూరు జిల్లాలో రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించినట్లు వరి సాగుదారులు వాపోతున్నారు. సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా టీడీపీ నేతల సిఫారసు ఉంటేగానీ కరుణించడం లేదు. విత్తగానే లక్షల టన్నుల విక్రయాలా? రాష్ట్రంలో లక్షలాది టన్నుల యూరియా దారి మళ్లిపోయిందని సాగు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నెలలవారీగా సాగు, అమ్మకాలు పరిశీలిస్తే ఏ స్థాయిలో యూరియా పక్కదారి పట్టిందో వెల్లడవుతుంది. రబీ సీజన్ ఏటా అక్టోబర్లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంటలకు ఆరంభంలోనే యూరియా పెద్దగా అవసరం ఉండదు. పంటలు వేయడమే ఆలస్యం.. లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగిపోవడం దారి మళ్లించారనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ⇒ అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. కేవలం 22 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 6,500 ఎకరాల్లో జొన్న సాగైంది. ఒక్క ఎకరాలో కూడా మొక్కజొన్న సాగవలేదు. అయినా సరే అక్టోబర్లో ఏకంగా 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ⇒ నవంబర్లో 7.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 1.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. 82 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 57 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. నవంబర్లో మరో 1.14 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ⇒ డిసెంబర్లో మరో 21.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 6.07 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. 4.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 68 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. కానీ డిసెంబర్లో ఏకంగా 1.67 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ⇒ జనవరిలో 15.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా... 8.7 లక్షల ఎకరాల్లో వరి, 2.07 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 55 వేల ఎకరాల్లో జొన్న పంటలు సాగయ్యాయి. జనవరిలో ఏకంగా 2.24 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరిలో మరో 1.77 లక్షల టన్నులు, మార్చిలో 1.28 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిక్సింగ్ ప్లాంట్లకు మళ్లుతున్న యూరియాయూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేట్ వ్యాపారులకే కేటాయిస్తున్నారు. పట్టుమని పది శాతం ఆర్ఎస్కేలకు కూడా సరఫరా చేయడం లేదు. దీనివల్ల యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. పెద్ద ఎత్తున యూరియా దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో స్వయంగా పేర్కొనడం గమనార్హం. సారా, బీర్ల తయారీతో పాటు రంగుల కంపెనీలు, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూతపడిన మిక్సింగ్ ప్లాంట్లు ఇటీవల పెద్దఎత్తున తెరుచుకుంటున్నాయి. విజిలెన్స్ దాడులు మొక్కుబడిగా మారాయి. ‘కాంప్లెక్స్’ ధరల మోత ఒకవైపు యూరియా దొరకక అల్లాడుతుండగా మరోవైపు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల మోత మోగుతోంది. సీజన్ ప్రారంభంలోనే బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచేసిన కంపెనీలు తాజాగా మరోసారి రూ.50 నుంచి రూ.250 మేర పెంచేశాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే ప్రత్యేక ఎరువుల (వాటర్ సాల్యుబల్ ఫెర్టిలైజర్స్) ధరలను సీజన్ ఆరంభంలోనే 25–50 శాతం మేర పెంచాయి. ఎకరాకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అదనంగా భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీలు ఖర్చులు, యంత్రాల అద్దెలన్నీ కలిపితే వరికి రూ.6 వేలు, మొక్కజొన్నకు రూ.8 వేల వరకు ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. అదనంగా రూ.13 వేల భారంనంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన ఎర్రం కృష్ణారెడ్డి రబీలో 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎన్నిసార్లు తిరిగినా సొసైటీలో, రైతు సేవా కేంద్రాల్లో ఒక్క కట్ట కూడా యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ డీలర్ల వద్ద కొన్నాడు. ఎమ్మార్పీ ప్రకారం బస్తా యూరియా ధర రూ.266 కాగా గత్యంతరం లేని పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి రూ.495 చొప్పున 58 బస్తాలు కొనుగోలు చేశాడు. దీంతో రూ.13 వేలకు పైగా అదనంగా భారం పడిందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు. యూరియాతో పాటు బలవంతంగా అంటగట్టిన కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే కావాల్సినంత యూరియా ఇచ్చేవారని, ఐదేళ్లలో ఏ రోజూ ఎరువుల కోసం ఊరు దాటాల్సిన పరిస్థితి రాలేదని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఖరీఫ్లో మొదలైన అగచాట్లు రబీలోనూ వెంటాడుతున్నాయని, ఇలాగైతే వ్యవసాయం చేసేదెలా? అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.ఎన్నిసార్లు వెళ్లినా ‘నో స్టాక్’ రబీలో 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి వ్యవసాయం భారంగా మారింది. సరిపడా యూరియా లభ్యం కావడం లేదు. రైతు సేవా కేంద్రాలలో అధికార పార్టీకి చెందిన వారికే అమ్ముతున్నారు. ప్రస్తుతం వరి పంటకు మూడో కోటా యూరియా వేయాలి. ఎన్నిసార్లు వెళ్లినా నో స్టాక్ అంటున్నారు. చేసేది లేక బహిరంగ మార్కెట్లో బస్తా రూ.400 పెట్టి కొన్నా. కాంప్లెక్స్ ఎరువులు 20 నుంచి 30 శాతం ధరలు పెంచేశారు. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. – ఏలూరు శ్రీధర్ రెడ్డి మనుబోలు నెల్లూరు జిల్లా, రూ.3వేలకుపైగా అదనపు భారం ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇప్పటి వరకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం పంట కంకి దశలో ఉంది. మంచి దిగుబడి రావాలంటే యూరియా చాలా అవసరం. రైతు సేవా కేంద్రం సిబ్బంది స్టాక్ లేదు అంటున్నారు. బయట బస్తా రూ.350–400 పెట్టి దాదాపు 25 బస్తాల యూరియా కొన్నా. రూ.3 వేలకు పైగా అదనపు భారం పడింది. ఖరీఫ్లోనూ ఇలాగే ఇబ్బందిపడ్డాం. – జి.డి.వీరదాస్, బ్రహ్మసముద్రం, అనంతపురం జిల్లారాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకనే..అదునుకు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా,. గోదావరి డెల్టాలో ధాన్యం, మొక్కజొన్న, మినుము తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతో అవసరం. ఎనీ్టఆర్, నెల్లూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలలో యూరియా కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది.. అదునుకు యూరియా దొరక్క రబీలో రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. రూ.267కు లభించాల్సిన బస్తా బ్లాకులో రూ.400 నుంచి రూ.600కు కొనుక్కోవల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, పెరిగిన కూలీ ఖర్చులు, యంత్రాల అద్దెల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. పంటలను మద్దతు ధరకు కొనే వారు లేక రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతు సంక్షేమం పేరిట ప్రకటనలకు పరిమితమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
వరుసగా మూడో బడ్జెట్లోనూ అన్నదాతకు మొండిచెయ్యే
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది. ఉచిత పంటల బీమా అటకెక్కింది.. ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు.. సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ ఈ మూడో బడ్జెట్లోనూ రైతుకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో గత 20 నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ రంగంలో తగిన కేటాయింపులు జరపడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అరకొర కేటాయింపులతో రైతులకు పంగనామాలు పెట్టింది. 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.12,152 కోట్లు, అనుబంధ శాఖలకు రూ.3,589 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపారు. అంటే మొత్తం బడ్జెట్లో 4.74 శాతానికి మించలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా గతేడాది 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309 కోట్ల పెట్టుబడి సాయం అందజేశామని.. జోన్, నాన్ జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్పు కొచ్చారు. మరో వైపు కొత్తగా రూ.లక్ష కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్గా తీర్చి దిద్దుతున్నామని, ఇందులో రూ.30 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెబుతూ.. ఉద్యాన శాఖకు మాత్రం రూ.1,123.86 కోట్లకు మించి కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురి చేస్తోంది.పంటల బీమాకు మంగళం పాడేందుకేఐదేళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించేసిన చంద్రబాబు ప్రభుత్వం.. స్వచ్ఛంద నమోదు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2024–25 బడ్జెట్లో పైసా కేటాయించలేదు. 2025–26లో రూ.1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. రెండేళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.2,419.44 కోట్ల ప్రీమియం ఎగ్గొట్టడంతో ప్రస్తుత రబీ సీజన్ నుంచి కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు రావాల్సిన రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అందకుండా పోయింది. దీంతో ఈ ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు ఆశపడ్డారు. కనీసం ఈ ప్రీమియం బకాయిలతో పాటు రానున్న వ్యవసాయ సీజన్కు తగిన నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పథకానికి కేటాయింపులు గతేడాదితో పోలిస్తే నాలుగో వంతుకు తగ్గించి, రూ.250 కోట్లతో సరిపెట్టారు. గతేడాది అరటి, మిరప, పొగాకు బొప్పాయి, మామిడి, చీనీ, టమాట, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదు. అయినప్పటికీ మార్కెట్లో జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకున్న దాఖలాలు లేవు.ఈ హామీలన్నీ అటకెక్కినట్టేనా?⇒ రాయితీపై సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు మాటేంటి? ⇒ గుర్తింపు కార్డులు అందజేసిన కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారు? ⇒ రైతు కూలీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు.. తద్వారా వారికి రాయితీలు, సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారు? ⇒ దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్టును పటిష్టంగా ఎప్పుడు అమలు చేస్తారు? ⇒ పాడి రైతులకు పశుగ్రాసం సాగు కోసం బంజరు భూములు కేటాయింపు ఎంత వరకొచ్చింది? ⇒ పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఏమయ్యాయి? ⇒ పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారు? ⇒ ఆక్వా రైతులకు జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా సంగతేంటి? ⇒ వీటిలో ఏ ఒక్క హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లేనా?‘ధరల స్థిరీకరణ నిధి కింద గతేడాది రూ.300 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది దాన్ని రూ.500 కోట్లకు పెంచాం’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మరోవైపు నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేశారు. సబ్సిడీ విత్తనానికి కోత పెట్టారు. గతేడాది రూ.182 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.240 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చింది. వాస్తవానికి మార్కెట్లో విత్తన ధరలు భారీగా పెరిగాయి. ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ పథకం కింద పైసా చెల్లించలేదు. ఈ ఏడాది రూ.250 కోట్లు కేటాయించడం పట్ల రైతులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం రైతులు ఏవిధంగా ఇబ్బందుల పాలయ్యారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. బఫర్ స్టాక్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం కేవలం రూ.40 కోట్లకు పరిమితం చేసింది. 20 నెలల్లో ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకు రూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలుండగా, ఆ ఊసెత్తకుండా రూ.310 కోట్ల పెట్టుబడి రాయితీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్య శాఖల కేటాయింపులు పూర్తిగా సిబ్బంది జీత భత్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సరిపడా తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని ప్రకటించలేదు. ఒక్క రూపాయి అదనంగా కేటాయింపులు జరపలేదు. -
బలవన్మరణాలకు పాల్పడుతున్నా పట్టదా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పనిభారం పెంచేసి మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నిరసన గళం వినిపించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. కరప, ఉప్పాడకొత్తపల్లి, తుని రూరల్, నిడదవోలు తదితర మండలాల్లో ధర్నాలు చేపట్టారు.కొన్ని చోట్ల భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలతో ధర్నాలు చేశారు. సర్వీసు రూల్స్కు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు పనులు అప్పగించి తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖ పరిధిలో పనిచేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్లు ఇలా అందరినీ డీడీవో పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు పరిష్కరించకుంటే మార్చి1 నుంచి పెన్డౌన్ చేపడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలియజేసినా న్యాయం చేయకపోవడంతోనే రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు ఈ నెల 12న వర్క్ టు రూల్ అమలు చేస్తుంటే, కొంతమంది అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. -
లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు
-
Venkatarami: ఇలాంటి చెత్త బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు ప్రజలకు ఎందుకూ పనికిరాదు
-
Surya Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలి..
-
ఒక్క అమరావతికే 6000 కోట్లు.. కొంచమైనా సిగ్గు ఉందా..
-
సన్నిధి గొల్ల కుటుంబానికి కూటమి నేతల వేధింపులు..
-
బాండ్లు పంచి బాబు బురిడీ
-
శివ.. శివా! శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతి..
-
కమీషన్ ఇవ్వకపోతే.. మీ బియ్యం ఉడకవ్!
సాక్షి టాస్క్ఫోర్స్: రైస్ మిల్లర్లకు ఊహించని రీతిలో కష్టం వచ్చి పడింది. తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వంలో కీలక మంత్రులు ఇద్దరు ఫిక్స్ చేసేశారు. చెప్పినట్లు చేయాల్సిందేనని, లేదంటే తిప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేశారు. ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగింది అడిగినట్లు ముట్టజెప్పుతున్నారు. సీజనల్గా రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపి (సీఎంఆర్– కస్టమ్ మిల్లెడ్ రైస్), బియ్యంగా మార్చి తీసుకుని.. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు క్వింటాకు రూ.16 చొప్పున మామూళ్లు ఇచ్చేలా రేట్ ఫిక్స్ చేసింది. గతేడాది బిల్లులు మంజూరు కోసం ముడుపులు మెక్కిన అమాత్యుడు ఈసారి మరో అడుగు ముందుకేసి సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లపై పడి కోట్లు దండుకోవడానికి బరితెగించారు. కేబినెట్లో మరో కీలక మంత్రి కూడా ఇతనితో జత కలిశారు. ఇద్దరూ కూడబలుక్కుని.. కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. ఈ దందాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2,280 మిల్లులపై ఒత్తిడి ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఆర్) సేకరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమీషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాతి ఏడాది ప్రాధాన్యతనిస్తూ కోటా పెంచుతుంటారు. ఈ కేటాయింపు ప్రక్రియ ఏ జిల్లాకు ఆ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేపడుతుంటుంది. మిల్లింగ్ చేసే ధాన్యం పరిమాణాన్ని బట్టి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. అనంతరం మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తారు. ఇలా సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీకి కేటాయిస్తుంది. ఈ మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, మిల్లర్ల మధ్య మూడు నెలల కాలానికి ఒప్పందం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,280 మిల్లుల్లో దాదాపు చిన్న తరహా మిల్లులన్నీ మూడు నెలలపాటు సీఎంఆర్పైనే నడుస్తున్నాయి. మిగిలిన తొమ్మిది నెలలు దాదాపు ఖాళీగానే ఉంటాయి. అదనపు ఆదాయం వస్తుందనుకుంటే.. గతేడాది కంటే ఈ ఏడాది 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించడంతో మిల్లర్లు అదనపు ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. సీఎంఆర్ అదనపు కోటాతో ఈ ఏడాది అదనంగా పని దొరుకుతుందని పడ్డ సంబరం కాస్తా ఒక మంత్రి దోపిడీ ప్లాన్తో తల్లకిందులైంది. సీఎంఆర్కు అనుమతి పొందిన మిల్లర్లు మంత్రికి ముడుపులు మూటగట్టి ఇవ్వాలని అసోసియేషన్ల ద్వారా ఆదేశాలు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. సీఎంఆర్ ద్వారా మిల్లింగ్ చేసే ప్రతి క్వింటా బియ్యానికి రూ.16 వంతున కమీషన్ను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరిస్తోన్న 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై రూ.80 కోట్లు ముడుపులు (కొందరికి మినహాయింపు ఇవ్వడం వల్ల.. లేదంటే మరింత పెరుగుతుంది) ముట్ట చెప్పేందుకు వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే 60–70 శాతం మిల్లుల నుంచి వసూలు చేసేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారు ఈ నెలాఖరు లోపు చెల్లించాలంటూ ఆయా జిల్లాల్లో అసోసియేషన్ల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ మంత్రి వియ్యంకుడా.. మజాకా! ⇒ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ అనుమతించిన మిల్లుల నుంచి ముడుపులు మెక్కడానికి స్కెచ్ వేసిన అమాత్యుడు.. తన దందా సవ్యంగా సాగేందుకు సహచర కీలక మంత్రిని కలుపుకున్నారు. ఈ కీలక మంత్రి వియ్యంకుడిది బియ్యం వ్యాపారంలో అందె వేసిన చెయ్యి. దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో అపార అనుభవం గడించారు. సొంతంగా మిల్లులు కూడా ఉన్నాయి. ఇతన్ని అడ్డుగా పెట్టుకుని కమీషన్ల దందా నడుపుతున్నారు. ⇒ ఈ క్రమంలో సదరు మంత్రి వియ్యంకుడి మిల్లుతో పాటు అతని సహచరుడైన మరో బడా ఎక్స్పోర్టర్ మిల్లులకు కమీషన్లో మినహాయింపు ఇవ్వడం అసోసియేషన్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వియ్యంకుడైన గోదావరి జిల్లాలకు చెందిన బడా ఎక్స్పోర్టర్కు, మరో బడా ఎక్స్పోర్టర్ తోడై కమీషన్ల బాగోతాన్ని చక్కబెడుతున్నారు. ఇందుకు కమీషన్లో మినహాయింపుతో పాటు తొలిసారి సీఎంఆర్ కోటా దక్కించుకున్నారు. ⇒ వాస్తవానికి మిల్లర్లకు జిల్లా స్థాయిలోనే మిల్లర్ల అసోసియేషన్ సీఎంఆర్ కోటా కేటాయిస్తుంటుంది. అటువంటిది అసోసియేషన్ ప్రమేయం లేకుండానే ఈ రెండు బడా రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు నేరుగా ఉన్నత స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి సీఎంఆర్ అనుమతి తెచ్చుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు నష్టపోయిన రైతుల నుంచి బస్తా ధాన్యం కొనుగోలు చేసిన చరిత్ర లేని ఈ కంపెనీలకు ప్రభుత్వం పెద్ద పీట వేయడం చర్చనీయాంశమైంది. ⇒ సీఎంఆర్కు ఏ జిల్లాలో పండించిన ధాన్యాన్ని ఆ జిల్లాలోనే అనుమతిస్తారు. కానీ మంత్రి వియ్యంకుడు కావడంతో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి పొరుగున కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేక అనుమతి ఇచ్చారని సమాచారం. మంత్రి వియ్యంకుడికి 65 వేల టన్నులు, మరో బడా రైస్ ఎక్స్పోర్టర్కు 25 వేల టన్నులు సీఎంఆర్కు అనుమతించారు. ఇది ఆ జిల్లా మొత్తం సీఎంఆర్లో మూడింట (మూడు లక్షల టన్నులు) ఒక వంతు కావడం గమనార్హం. సారూ.. ‘సీజ్ ద కమీషన్స్’ అనండి ఏడాది క్రితం పేదల బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి పోతున్నాయని ‘సీజ్ ద షిప్’ అంటూ హడావిడి చేసిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడేం చేస్తున్నారని ఈ సందర్భంగా మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ కోసం సేకరిస్తోన్న సీఎంఆర్లో ఇంతలా బరితెగించి కమీషన్లు వసూలు చేస్తుండటం మీ దృష్టికి రాలేదా అని నిలదీస్తున్నారు. ఈ విషయమై ఆయన స్పందించకపోతే, ఈ దందాలో ఆయనకూ వాటా ఉన్నట్లేనని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ‘సీజ్ ద కమీషన్స్’ అంటూ ఈ కమీషన్లకు బ్రేక్ వేయాలని కోరుతున్నారు.సీజన్ మొదట్లోనే స్కెచ్.. ఇప్పుడు అమలు⇒ సీఎంఆర్ విధానంలో అమాత్యునికి కమీషన్ విషయమై సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలో చర్చించారు. నాటి సమావేశంలో పలువురు ప్రతినిధులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయమై మిల్లర్లు రోడ్డెక్కితే అల్లరై బియ్యం సేకరణకు ఆదిలోనే ప్రతిబంధకం ఎదురవుతుందని అప్పట్లో మిన్నకుండిపోయారు. ⇒ సీఎంఆర్ కేటాయింపు ప్రకారం 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో కమీషన్ వసూలుకు ఇదే తరుణమని స్కెచ్ వేశారు. క్వింటాల్కు రూ.16 వంతున కమీషన్ చెల్లించాల్సిందేనంటూ అసోసియేషన్ ద్వారా మిల్లర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ⇒ సీఎంఆర్ చివర్లో ఉన్న తరుణంలో అడిగినంత కమీషన్ ఇచ్చుకోక తప్పని పరిస్థితుల్లో మిల్లర్లు వెనక్కు పోయేది ఉండదు. అదే ధైర్యంతో గత పక్షం రోజులుగా కమీషన్ల వసూళ్ల దందాను మరింత ముమ్మరం చేశారు. కమీషన్ ఇవ్వకుంటే సీఎంఆర్ బిల్లుల్లో కోతలు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. క్వింటాకు ప్రభుత్వం ఇచ్చేది రూ.10. సంచులు, నూకలు, తౌడు వంటి వాటిపై కొంత ఆదాయం వచ్చే మాట నిజమైనా, ఏకంగా రూ.16 కమీషన్ చెల్లించాలనడం భావ్యం కాదని మిల్లర్లు వాపోతున్నారు. ఇంత కమీషన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో తొమ్మిది నెలలు మూతేసుకుని కూర్చుంటున్న మిల్లులకు సీఎంఆర్తో మూడు నెలలు పని దొరుకుతుందనుకుంటుంటే మెడపై కత్తిపెట్టి కమీషన్ వసూలు చేయడం దారుణం అని, ఇదేం మంచి ప్రభుత్వం? అని మిల్లర్లు నిలదీస్తున్నారు. ⇒ కమీషన్ ఇచ్చుకోలేమని ఎదురు తిరుగుతున్న మిల్లర్లకు సీఎంఆర్ బిల్లులు ఎలా మంజూరు అవుతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా మంత్రుల కోసం కమీషన్లు వసూలు చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే 90 శాతం వసూళ్లు పూర్తయ్యాయని సమాచారం. ప్రభుత్వ ముఖ్య నేతలకు బాగా తెలిసిన వారికి కమీషన్లో కొంత మినహాయింపు ఇచి్చనట్లు తెలిసింది. -
ఆచరణ సాధ్యం కాని బడ్జెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై మేధావులు పెదవివిరుస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఈ బడ్జెట్ వల్ల ఆకాంక్షలు తప్ప ఆచరణ సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. ఆ కోవలోనే సీనియర్ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర బడ్జెట్పై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ.2.34 లక్షల కోట్లు అని ప్రభుత్వం అంచనా వేసింది గానీ, ఆ మేరకు కచ్చితంగా ఆదాయం రాదని ఆయన స్పష్టంచేశారు. 2025–26లో వచ్చింది రూ.1.96 లక్షల కోట్లు అయితే, అంతకుముందు ఏడాది కూడా రూ.1.67 లక్షల కోట్లే వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కేసుకున్నా రూ.2.15 లక్షల కోట్లకు మించదన్నారు. ఈ లెక్కన రూ.20 వేల కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే, దానిని కూడా ఆదాయంగా భావించి పథకాలు రూపొందించడం వల్ల వాటి అమలుపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పడం వల్ల బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఐవైఆర్ వివరించారు. మసిపూసి మారేడు..రెవెన్యూ లోటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఊహాజనితంగా మాట్లాడుతోందని ఐవైఆర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నాటికే రూ.60 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని తెలిపారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది మొత్తానికి గాను రూ.41 వేల కోట్ల దగ్గర రెవెన్యూ లోటును నియంత్రిస్తామని ప్రభుత్వం ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ లోటు ప్రభుత్వం చెబుతున్న దానికి రెట్టింపు అయ్యి రూ.80 వేల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్కు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని, లేదంటే బడ్జెట్కు ఉన్న విశ్వసనీయత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.మూలధన వ్యయం 2024–25లో రూ.16 వేల కోట్లు ఉంటే, 2025–26లో బడ్జెట్లో రూ.40 వేల కోట్లుగా చూపించి, సవరించిన పద్దుల్లో రూ.33 వేల కోట్లు ఉంటుందని చెప్పారన్నారు. అంచనాలకే బడ్జెట్ పరిమితమయ్యే అవకాశం ఉందా... ఆచరణ సాధ్యం కాదా... అంటే సాధ్యం కాదనే అనిపిస్తోందని ఐవైఆర్ తన విశ్లేషణలో స్పష్టంచేశారు. అప్పులు తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది? పెండింగ్ బిల్లులకు ఎంత వెళుతుందనేది చెప్పాలి. ఈ బడ్జెట్ను చూస్తే మసిపూసి మారేడు చేసినట్లుగా ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. -
లెక్కలకు రెక్కలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి పచ్చముఠాల దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఊహాజనిత లెక్కలతో వరుసగా మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత రెండు బడ్జెట్లలోనూ అంచనాల మేరకు రాష్ట్ర పన్నుల ఆదాయం రాకపోవడంతో సవరించిన అంచనాల్లో భారీ కోతలు విధించడమే దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. తద్వారా బడ్జెట్ కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా కోతలు పెడుతోందని, ఇది అంకెల గారడీతో ప్రజలను మోసగించడమేనని తప్పుబడుతున్నారు.చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక నుంచి మద్యం వరకూ.. చివరకు ప్రకృతి సంపదను సైతం వదలకుండా విచ్చలవిడిగా సిలికా, క్వార్ట్జ్, లేటరైట్, గనుల దోపిడీకి తెర తీసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం అంతా టీడీపీ పెద్దల జేబుల్లోకి చేరిపోతోంది. సంపద సృష్టించకుండా... సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా.. అంతులేని అప్పులతో రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతున్నారు.హామీలు విస్మరించి.. పరిమాణం పెంచిచట్టసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ను అపహాస్యం చేస్తూ, వాస్తవాలకు దూరంగా, ఊహాజనిత గణాంకాలతో 2026–27 వార్షిక బడ్జెట్ను చంద్రబాబు సర్కారు రూపొందించింది. బడ్జెట్ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయకుండా ఆయా వర్గాలను వంచిస్తోంది. ఆదాయం, రాబడులు రావని తెలిసి కూడా ప్రజలను ఏమార్చేందుకు రూ.3,32,205 కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత రెండు బడ్జెట్లలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసినట్లుగానే వచ్చే ఆర్థికఏడాదిలో కూడా వంచించడమే లక్ష్యంగా ఊహాజనిత గణాంకాలతో బడ్జెట్ పరిమాణాన్ని భారీగా పెంచారని, ఈ బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించడం లేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఉత్త కేటాయింపులే.. అంతా కోతలే2024–25, 2025–26 బడ్జెట్ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. 2024–25లో రూ.2,94,427 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ రూ.19,820 కోట్ల మేర కోత విధించారు. చివరకు కోత విధించిన మేరకు కూడా బడ్జెట్ను అమలు చేయలేకపోయారు. వాస్తవ లెక్కల ప్రకారం 2024–25 బడ్జెట్ అంచనాల్లో రూ.22,141 కోట్ల మేర కోత పడింది. అంటే బడ్జెట్ రూ.2,72,286 కోట్లకే పరిమితమైంది. ఇక 2025–26లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది.తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ బడ్జెట్లో రూ.21,825 కోట్ల మేర కోత విధించింది. వాస్తవ లెక్కలు వెల్లడైతే ఎంత మేర కోత విధించారో స్పష్టం కానుంది. ఇదే రీతిలో ఈదఫా కూడా పేదలను మోసం చేయడానికి 2026–27 బడ్జెట్లో ఇళ్ల నిర్మాణాలకు రూ.6,357 కోట్ల కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాగితాలకే పరిమితమని, వాస్తవంగా వ్యయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గత రెండు బడ్జెట్లు నిరూపిస్తున్నాయి. పన్నుల ఆదాయం పతనం..రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం అంచనాల మేరకు లేదని తెలిసి కూడా వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ను ఊహాజనిత లెక్కలతో, భారీ పరిమాణంతో ప్రవేశపెట్టారని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,789 కోట్లు వస్తుందని అంచనా వేయగా వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.89,435 కోట్లు మాత్రమే. రూ.20,354 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడింది.2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,006 కోట్లు వస్తుందని బడ్జెట్ను ప్రవేశపెట్టగా సవరించిన అంచనాల్లో రూ.98,025 కోట్లుగా చూపించారు. అంటే రూ.10,981 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడుతుందని పేర్కొన్నారు. సొంత పన్ను ఆదాయం లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో సవరణల్లో తగ్గించారు. 2026–27 బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం ఏకంగా రూ.1,25,845 కోట్లు వస్తుందని చూపారు. 2025–26 సవరించిన అంచనాలను మించి ఏకంగా రూ.27,820 కోట్లు రాబడి వస్తుందని పేర్కొనడం గమనార్హం.కాగితాల్లోనే పేదల ఇళ్లు..పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు సర్కారు గత రెండు బడ్జెట్లలో ఎంత మోసం చేసిందో చెప్పేందుకు సవరించిన అంచనాలే నిదర్శనం. పేదల ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైనట్లు సవరించిన బడ్జెట్ అంచనాల్లో తేలింది. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్లో రూ.4,012 కోట్లు కేటాయించి చివరకు కేవలం రూ.1,611 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇక 2025–26 బడ్జెట్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ మేరకు కూడా వ్యయం చేయడం లేదు. -
బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
-
అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రయిట్ టాక్
-
కూటమి ప్రభుత్వానికి మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
-
రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్ చంద్రబాబు మోసాలకు...
-
పర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్ ... ఏందయ్యా ఈ లెక్కలు..
-
హెరిటేజ్ కోసమే లడ్డూపై కుట్ర చివరికి పాపం పండింది
-
బడ్జెట్ ప్రసంగంలో అసత్యాలు చెప్పారు: బుగ్గన
-
పన్నుల బాదుడు, అప్పుల పద్దు తప్ప సంపద సృష్టి, సూపర్ సిక్స్ అమలు జాడలేని ఏపీ బడ్జెట్
-
బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
-
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ మంటలు... విద్యార్థుల ఫీజుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
-
అన్నీ సమస్యేలే... చంద్రబాబుకు మరో షాక్.. రెచ్చిపోయిన కొలికపూడి
-
Maqbool : కూటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం
-
Audimulapu : ఆల్రెడీ ప్రాణ భిక్ష పెట్టాడు.. అయిన చంద్రబాబుకు సిగ్గు రాలేదు
-
సెంటిమెంట్తో ఆటలా చంద్రబాబు.. కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకున్నావు
-
Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు
-
రూ.306లకే నెయ్యిని చంద్రబాబు హయాంలో సరఫరా చేశారు
-
Chirla Jaggi: గుర్తుపెట్టుకోండి.. ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఉండవు..
-
Jakkampudi : చంద్రబాబుకు ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడు
-
మీరు పొలిమేరలు దాటే లోపే.. జడ శ్రవణ్ వార్నింగ్
-
శివ సన్నిధానంలో అపచారం.. బాబు ప్రభుత్వం వైఫల్యం
-
బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.. అనిత నీకే చెప్తున్నా..
-
ఏపీఎస్ఆర్టీసీపై బాబు దొంగ దెబ్బ!
-
దివాలా అంచున ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన విజనరీ
-
సర్కారు శాడిజానికి 'పరాకాష్ట'
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు. ఒకే కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లా..హైకోర్టు విస్మయం.. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు. -
బాకీల బాబు.. బడాయిల డాబు!
సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఇవ్వకుండా మోసం.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ కింద రూ.19,200 కోట్లు ఎగనామం.. తల్లికి వందనం కింద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగ్గొట్టి పిల్లలకు పంగనామాలు.. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు రూ.64,800 కోట్లు ఎగవేత.. అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ.16,747.52 కోట్లు బకాయిలు.. దీపం పథకంతో మహిళలకు రూ.4,700.96 కోట్లు ఎగవేత.. మహిళలు అందరికీ ఉచిత బస్సు కింద రూ.3,200 కోట్లు బాకీ.. సూపర్ సిక్స్ కింద రెండేళ్లలో రూ.1,42,897.12 కోట్లకుపైగా ఎగ్గొట్టి ప్రజలను సీఎం చంద్రబాబు మోసగించారు! ఆ మోసాలన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా.. సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేసినట్లు గవర్నర్తో సీఎం చంద్రబాబు అసత్యాలు చెప్పించారు. అలవోకగా, కళ్లార్పకుండా అసత్యాలను చెప్పే చంద్రబాబు.. ఉభయసభలనుఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలోనూ అవే అవాస్తవాలను వల్లె వేయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా 143 హామీలను సీఎం చంద్రబాబు ఇచ్చారు. వాటి అమలుకు తనదీ పూచీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు వాగ్దానం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్నీ రద్దు చేయబోమని.. వాటిని కొనసాగిసూ్తనే సూపర్ సిక్స్ సహా 143 హామీలనూ నెరవేరుస్తామని చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలంటే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్లో కేవలం రూ.17,179 కోట్లు మాత్రమే విదల్చడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా మిగలడంతో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇచ్చిన బాండ్లను పరిశీలించి 20 నెలల్లో తమ కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఎంత ఎగ్గొట్టిందో ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. సంపద సృష్టి లేదు.. ఆర్థిక విధ్వంసం!రుణ సేకరణ భారాన్ని తగ్గించడానికి.. రాష్ట్ర పునరుజ్జీవనానికి అవసరమైన మద్దతు పొందడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్తో చెప్పించారు. ఎన్నికలకు ముందు.. సంపద సృష్టించి, రుణ భారాన్ని తగ్గించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని సీఎం చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పులు చేశారు. రికార్డు స్థాయి అప్పులతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఏ ఒక్క పథకాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య.. రెండేళ్లపాటు కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులున్నా.. రూ.3,32,671 కోట్ల అప్పులలో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేస్తున్నారు.తప్పు చేసి నిందలా..2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 6 లక్షల ఎకరాలను అకారణంగా 22 ఏ జాబితాలో పెట్టారు. చుక్కల భూములు, అనాధీనం భూములు, షరతులు గల పట్టా భూములు లాంటివి అందులో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 22 ఏ జాబితాలో ఉన్న భూములను సుమోటో వెరిఫికేషన్ చేయించారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 60 వేల ఎకరాల అనాధీనం భూములు, 34 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, సుమారు 18 వేల ఎకరాల ఇతర భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించి ఊరట కల్పించారు. దీంతో ఆ భూములపై రైతులకు మళ్లీ హక్కులు వచ్చాయి. కానీ.. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ భూముల్లో చాలా వరకూ మళ్లీ 22 ఏ జాబితాలోకి నెట్టేశారు. వీటితోపాటు 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములు 13.59 లక్షల ఎకరాలను జగన్ ఫ్రీ హోల్డ్ చేస్తే.. వాటిని కూడా చంద్రబాబు 22 ఏ జాబితాలో పెట్టించేశారు. వాస్తవాలు ఇలా ఉండగా గత ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నిందలు వేయించారు. రాష్ట్రంలో 22 ఏ దుర్వినియోగం చేసింది చంద్రబాబు సర్కారేనని రైతులు స్పష్టం చేస్తున్నారు.పోలవరంలో బాబు చారిత్రక తప్పిదాలుగోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. 2016–18లో పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ను చంద్రబాబు పూర్తి చేశారు. 2017లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురై దెబ్బతింది.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ చారిత్రక తప్పిదాన్ని విదేశీ నిపుణుల కమిటీ ఎండగట్టింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది.. పోలవరాన్ని గాడిలో పెట్టి.. 2027 నాటికి పూర్తిచేసేందుకు మార్గం సుగమం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గవర్నర్తో చంద్రబాబు అభాండాలు వేయించారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా..2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టు సంస్థలతో కలిసి భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. ఈ కమీషన్ల బాగోతాన్ని కేంద్ర ఆదాయపు పన్నుల శాఖ ఎండగట్టింది. ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టారంటూ కాగ్ కడిగిపారేసింది. 2014–19 మధ్య తాను కట్టని రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసినట్లు.. ఇప్పుడు దాన్ని పునర్ నిర్మిస్తున్నట్లు గవర్నర్తో సీఎం చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేయించారు. రాజధాని పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రూ.47,387 కోట్లను అప్పుగా తెచ్చిన చంద్రబాబు.. నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగిస్తున్నారని కాంట్రాక్టర్లు ప్రస్తావిస్తున్నారు. భవనాలు చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తుండగా చంద్రబాబు సర్కారు దానికి మూడు రెట్లకుపైగా అధికంగా చెల్లించడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే రాజధాని నిర్మాణాల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందన్నది బహిర్గతమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విత్తనం నుంచి విక్రయాల దాకా అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలిచి వ్యవసాయాన్ని వైఎస్ జగన్ పండుగగా మార్చితే.. పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి, ఉచిత పంటల బీమాను రద్దు చేసి, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను నట్టేట ముంచింది చంద్రబాబేనని రైతన్నలు మండిపడుతున్నారు.క్రెడిట్ చోరీలో చంద్రబాబుకు సాటెవ్వరు..?వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు అవే అసత్యాలను గవర్నర్ నోటి వెంట చెప్పించారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ బాగోతాన్ని విశాఖ సీఐఐ సదస్సు వేదికగా గౌతమ్ అదానీ బట్టబయలు చేసినా.. ఆ సదస్సు ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయంటూ గవర్నర్తో చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేయించారు. అదానీ గ్రూప్ పేరును దాచిపెట్టి గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ చంద్రబాబు సర్కారు చేసుకున్న ప్రచారానికి తెర దించుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు సమక్షంలోనే సీఐఐ సమ్మిట్లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఇక వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన ఇంధన వనరులపై దృష్టిసారించడమే కాకుండా ఆ దిశగా పలు పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు వాటిని తన ఖాతాలో వేసుకుంటూ వైజాగ్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్న సంగతి విదితమే. గత ప్రభుత్వ హయాంలో 2023లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడుల తర్వాత అతిపెద్ద పెట్టుబడుల ఒప్పందంగా నిలిచిన ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,000 కోట్ల ఒప్పందాన్ని తిరిగి ఇప్పుడు కుదుర్చుకొని కొత్త ఒప్పందంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెన్యూ పవర్తో కుదిరిన రూ.97,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం, రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్తో ఇప్పుడు కొత్త పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలను అదుపు తప్పేలా చేసి విధ్వంస పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు.. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ నిర్మించి ప్రగతి దిశగా నడిపిస్తున్నట్లు గవర్నర్తో అవాస్తవాలను చెప్పించారంటూ సర్వత్రా మండిపడుతున్నారు.బాబు మోసాల ఖరీదు రూ.1,42,897.12 కోట్లు!⇒ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉండగా రెండేళ్లుగా హామీని అమలు చేయలేదు. ఒక్కో ఏడాది రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. భృతి కింద రెండేళ్లలో యువతకు చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయి పడ్డారు.⇒ పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.⇒ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. రెండేళ్లుగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు.⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు.⇒ 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వీరు 20 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. రెండేళ్లుగా పైసా ఇవ్వకుండా పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేరలేదు.⇒ తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లు తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. -
AP: వీడియో వైరల్!! 104 వాహనాలను ధ్వంసం
-
మాజీ మంత్రి అంబటిపై ఆగని కూటమి కుట్రలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.గతేడాది నవంబర్లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. -
అంతా డొల్ల బాబు ఒప్పందాల అసలు కథ
-
రాష్ట్రంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు
-
దేవుడితో పెట్టుకున్నోడెవడూ బతకడు చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త
-
శ్రీశైలంలో శివ భక్తులపై లాఠీచార్జ్ ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ ఆగ్రహం
-
మేడం గారి తొలి హామీ.. సంతకు వెళ్లింది..!
‘గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. జ్వరాల బారిన పడిన పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించేలా ఏఎన్ఎమ్లను నియమిస్తాం. నెలవారీగా వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తాం. అనారోగ్యంతో ఏ విద్యార్థి మరణానికి గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తొలి సంతకం చేస్తున్నాను’. – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కరువైంది. వారికి చిన్నపాటి సమస్య వచ్చినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. దీంతో జ్వరం వచ్చినా, జలుబు చేసినా వారు మృత్యువుతో పోరాడుతూ విగతజీవులుగా మారుతున్న దుస్థితి గిరిజన ఆశ్రమ పాఠశాలు, కళాశాలల్లో కొనసాగుతోంది. ఏఎన్ఎమ్లను నియమిస్తాం.. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు/ కళాశాలల వసతి గృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా ‘ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తానంటూ’ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘ మొదటి సంతకం’ చేశారు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఆ సంతకం ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు సకాలంలో వైద్యసేవలు అందక ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరు మరణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గిరిజనులు వక్కానిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో కురుపాం నియోజకవర్గంలోని విద్యాలయాల్లో మృతిచెందిన విద్యార్థుల వివరాలు..గుమ్మలక్ష్మీపురం మండలంలో.. 2024 జూలై 21న వామాసీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మండంగి గౌతమ్(9) మలేరియాతో బాధపడుతూ మృతిచెందాడు.2024 అక్టోబర్ 2న పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి(13) రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధపడుతూ పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.2024 డిసెంబర్ 17న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పత్తిక దినే‹Ù(14) పచ్చకామర్లు, రక్తహీనత, కిడ్నీ సంబంధి వ్యాధులతో బాధపడుతూ మరణించాడు.2025 డిసెంబర్ 14న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న టి.అవిష్ అనారోగ్యంతో మృతిచెందాడు.2026 జనవరి 7న రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మక రూప శ్వాసతీసుకోవడం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందింది.కురుపాం మండలంలో...2024 నవంబర్ 6న కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల(బాలురు)లో నాలుగో తరగతి చదువుతున్న నిమ్మక నితిన్(9) అనారోగ్యం బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 2025 సెపె్టంబర్ 26న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి పచ్చకామెర్లతో బాధపడుతూ మృతి చెందింది. 2025 సెపె్టంబర్ 30న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యారి్థని తోయక కల్పన పచ్చకామర్లెతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్లో మృతిచెందింది.జియ్యమ్మవలసలో... 2024 నవంబర్ 6న రావాడ రామభద్రాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలో 7వ తరగతి చదివిన నిమ్మక జీవన్ కుమార్(12) అనారోగ్యంతో మృతిచెందాడు. నెల రోజుల వ్యవధిలో ఇదే ఆశ్రమ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి బి.ఈశ్వరరావు కూడా అనారోగ్యంతో మృతిచెందాడు.కొమరాడలో... 2 2024 సెపె్టంబర్ 17న కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదివిన కె.శారద అనారోగ్యంతో మృతిచెందింది. -
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని YSRCP డిమాండ్
-
శివనామస్మరణ వినాల్సిన చోట కాపాడండి అంటూ ఆర్తనాదాలు
-
మా ప్రభుత్వం ఫెయిల్.. నిజం ఒప్పుకున్న కొలికపూడి
-
భక్తుల ప్రాణాలు పోతున్న.. మొద్దు నిద్ర వీడని చంద్రబాబు
-
శివ భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్.. వైఎస్ జగన్ ఫైర్
-
శివ శివా.. ఇదేం దారుణం?
శ్రీశైలం టెంపుల్: వరుసగా ఆలయాల్లో విషాద ఘటనలు.. ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాటలు.. భక్తుల మరణాలు.. చంద్రబాబు సర్కార్ అంతులేని నిర్లక్ష్యానికి ప్రబల నిదర్శనాలు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ పుణ్య క్షేత్రాలలో భక్తులు ప్రాణాలు కోల్పోయినా బాబుసర్కార్ మొద్దునిద్ర వీడలేదు. ఇపుడు శ్రీశైలం వంతు వచ్చింది. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ నల్లమల కొండగుట్టల్లో ప్రతిధ్వనించే శివస్వాముల గొంతులు.. భయంతో రక్షించు శివా అంటూ ఆర్తనాదాలు చేసే పరిస్థితి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం దారుణంగా విఫలమవడంతో శివస్వాములు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోతూ చివరకు తాళాలను పగులగొట్టి గోడలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న శివభక్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడం మరీ దారుణం. ఆలయాల్లో సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం భక్తులపై కాఠిన్యం ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని హిందూ ధార్మిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వరుసగా దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల పవిత్ర ప్రసాదంపై అదేపనిగా నిరాధార ఆరోపణలు చేయడం చూస్తుంటే అసలు చంద్రబాబుకు భక్తి అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు పుణ్యక్షేత్రాలలో ఉత్సవాల నిర్వహణే చేతకావడంలేదని వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే దీనిని బట్టి ఆయనకు కనీస అడ్మినిస్ట్రేషన్ కూడా చేతకావడం లేదని అర్థం చేసుకోవచ్చు. విజనరీ అంటూ ప్రచారమే గానీ నిజానికి ఆయన ఎల్లో మీడియా తయారుచేసిన ఓ ఈవెంట్ మేనేజరేనని విమర్శకులంటున్నారు.భయాందోళనతో ఉన్న భక్తులపై లాఠీలా..?శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చే శివస్వాములకు, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్రప్రభుత్వం ఆ విషయంలో దారుణంగా విఫలమయ్యింది. ముగ్గురు మంత్రులు శ్రీశైలంలో ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. కానీ ఫలితం సున్నా. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది శివస్వాముల దర్శనం రోజులను కుదించారు. దాంతో సోమవారం రాత్రికే వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దేవస్థానం అధికారుల సమన్వయ లోపం, వీఐపీ ప్రోటోకాల్ పేరుతో ఇతరులకు స్పర్శదర్శనాలు కల్పించడంతో కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 9గంటల నుంచి శివస్వాముల లైన్లను నిలిపివేశారు. ఉచిత కంపార్ట్మెంట్లలో ఉండలేక అసహనానికి గురై గేటు దూకుతున్న భక్తులు అప్పటికే చంద్రావతి కళ్యాణ మండపంలోకి భారీగా చేరుకున్న శివస్వాములు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరో వైపు సాధారణ భక్తులు సైతం కంపార్ట్మెంట్లలో నిండిపోయారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు అక్కడక్కడా అరకొరగా అందాయి.. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోయిన భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, గోడలు ఎక్కి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న తమపై పోలీసులు లాఠీలను ఝుళిపించడంతో భక్తుల ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితికి కారణమైన సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ భక్తులు తమ నిరసనను తెలియజేశారు. భక్తులపై లాఠీచార్జీ ఘటనలో నంద్యాల ఏఎస్పీ యుగంధర్బాబు తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.తూతూమంత్రంగా సమీక్షలు..మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 2న శ్రీశైలంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, హోంశాఖ మంత్రి అనితలు జిల్లా అధికారులతో, దేవస్థాన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భక్తులకు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నామని, గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 30శాతం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్బాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపించింది. తూతూ మంత్రంగా జరిపిన మంత్రుల సమీక్షలను అధికారులు పట్టించుకోలేదు. అరకొర ఏర్పాట్లతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. భక్తులు భారీగా తరలివచ్చే శ్రీశైల పుణ్యక్షేత్రంలో కనీస సౌకర్యాలపై చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాముల యాత్రకు అనుమతిలోనూ అలక్ష్యమే..మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం శివభక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో చాలా మంది శివస్వాములు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుని మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే తమ ఇంటి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి శ్రీగిరి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది జాతీయ పులుల గణన పేరుతో అటవీశాఖ అధికారులు నల్లమల అడవుల్లో పాదయాత్రకు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఈ నెల 6వ తేది నుంచి అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు, శివస్వాములు ఒక్కసారిగా పాదయాత్రతో శ్రీగిరి చేరుకున్నారు. అటవీశాఖ నుంచి భక్తుల పాదయాత్రకు అనుమతి ఇప్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. గ్రామోత్సవం చేయకపోవడం మహాపచారం!మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను విశేష వాహనసేవలో అలంకరించి ప్రత్యేకంగా వాహన పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక వాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో శ్రీశైలం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించక పోవడాన్ని భక్తులు మహాపచారంగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో అలంకార మండపంలో పూజలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రాణభయంతో క్యూలైన్ల నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న శివస్వాములు తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఈవో పాట్లు..శివస్వాముల ముసుగులో కొంత మంది అసాంఘిక శక్తులు తనపై కుట్ర పన్ని భక్తులను రెచ్చగొట్టేలా చేశారని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో పేర్కొనడం గమనార్హం. తనని ఈఓ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్ని.. ప్రణాళికాబద్ధంగా భక్తులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే రద్దీని కంట్రోల్ చేయాల్సిన దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్, ఈఓ కంట్రోల్ రూంకే పరిమితం కావడం గమనార్హం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజే భక్తుల రద్దీని కంట్రోల్ చేయలేని దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఇక మహాశివరాత్రి రోజు లక్షన్నరకు పైగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.స్వామివారి దర్శనం కోసం ఎండలో భక్తులు ఇలా మాడాల్సిందే.. సనాతన ధర్మం అన్నాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడు?సనాతన ధర్మాన్ని కాపాడతానని గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం శ్రీశైలంలో భక్తులకు ఇన్ని సమస్యలు ఎదురవుతుంటే ఎక్కడున్నాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణం. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తే భక్తుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.– మల్లికార్జున, శివస్వామి, అనంతపురంకనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలంమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు శ్రీశైలం వచ్చాను. 6గంటలకు పైగా క్యూలైన్లలో ఉండాల్సిన పరిస్థితి. క్యూలైన్లలో ఉండలేక బయటికి వచ్చి కూర్చున్నా. కనీస సౌకర్యాలైన తాగునీరు, అన్నప్రసాదం, బాత్రూం లేవు. వృద్ధులకు సైతం ప్రత్యేక క్యూలైన్ లేదు. బ్రహ్మోత్సవాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, భక్తుడు, అనంతపురంప్రభుత్వానికి, పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించు మల్లన్నాబ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వానికి, శ్రీశైల దేవస్థానం పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించాలని మల్లన్నను కోరుకుంటున్నా. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నా, ఒక్క అధికారి, వలంటీర్ కూడా పలకరించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా ఏర్పాట్లు చేసింది. పదవులు తీసుకోవడానికి కాదు పాలక మండలి సభ్యులు ఉండేది. భక్తులకు సేవలందించేందుకని గుర్తుంచుకోవాలి.– నరసింహారెడ్డి, శివస్వామి, తెలంగాణ30 ఏళ్లలో ఎన్నడూ మల్లన్న దర్శనం చేసుకోకుండా వెళ్లలేదునేను గత 30 ఏళ్ల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటా. చాలా సార్లు శివమాలను స్వీకరించి 41రోజులు నిష్టగా ఉండి ఇరుముడి సమర్పించేందుకు శ్రీశైలం చేరుకుంటా. గత 30ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో ఈ ఏడాది మల్లన్నను దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్తున్నా. ప్రభుత్వం, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతోనే పరమేశ్వరుడిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్తున్నా.– వెంకటరావిురెడ్డి, శివభక్తుడు, హైదరాబాద్ -
శివ భక్తులపై లాఠీచార్జి దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: ⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ -
జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు.. నాగేశ్వర్కు బెదిరింపులు
సాక్షి, అమరావతి: ‘‘ఒరేయ్.. నా కొడకా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, బాత్రూం రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పవురా నువ్వు.. ఇదే కాదు ఇంత కన్నా దారుణమైంది కలిసిందని కూడా చెప్పాలి.’’ అంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నట్లు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న ప్రచారాన్ని నాగేశ్వర్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ–సిట్ చార్జ్షీట్లో స్పష్టం చేసిన తరువాత కూడా కలిసిందని నిరూపించాలని యత్నం చేయడం హిందూ దేవుళ్లు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూటమి అనుకూల వర్గీయులు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. జంతువుల కొవ్వు, బాత్రూం రసాయనాలే కాకుండా మరికొన్ని దారుణమైనవి లడ్డూలో కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు వచ్చాయని నాగేశ్వర్ తెలిపారు. అలా చెప్పడం అన్యాయమవుతుందని, కావున తానలా చెప్పలేనన్నానని ఆయన వివరించారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం’ వారిపై అమలు కాదా? మూడు రోజుల క్రితమే ఈ వేధింపులపై ఫిర్యాదు చేసినా మంత్రి లోకేశ్ కనీసం పట్టించుకోలేదని నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ రికార్డులను లోకేశ్ టీమ్ జైకు పంపించానని, దీనికి స్పందనగా ఆయన పోలీసులు ఆగంతకులను హెచ్చరించారని, మళ్లీ ఆ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్లు రావని చెప్పారని నాగేశ్వర్ వివరించారు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు రోజుకు 20 నుంచి 30 మంది ఫోన్లు చేస్తున్నారని, బెదిరిస్తున్న వారి నంబర్లు రాష్ట్ర మంత్రికి స్వయంగా పంపితే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయాలి కదా అని లోకేశ్ను నిలదీశారు. ‘‘మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతామని బెదిరించినా, నేను మాత్రం నిరూపణ కాకుండా, ఆధారాలు లేకుండా దేవుని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే మాటను చచ్చినా అనను. పంది కొవ్వు కలిసిందని, బాత్రూం రసాయనాలు కలిశాయని మీరు వాడుతున్న భాషను నేను వాడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను దేనికైనా సిద్ధం.’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. కల్తీ జరిగితే నిరూపించండి: మరో వైపు లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలపై నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్గానీ, విచారణగానీ జరగకుండా సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రకటన చేయడం, దానిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ కూడా అదే మాట్లాడటం దారుణమని మరోసారి నాగేశ్వర్ తప్పుబట్టారు. -
22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ
-
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.𝗖𝗕𝗡'𝘀 𝗧𝗵𝗲 𝟮𝟮𝗻𝗱 𝗥𝗮𝗻𝗸 𝗩𝗶𝘀𝗶𝗼𝗻: 𝗛𝗶𝗴𝗵 𝗼𝗻 𝗛𝘆𝗽𝗲, 𝗟𝗼𝘄 𝗶𝗻 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲- 𝗟𝗜𝗘𝗦 𝗮𝗻𝗱 𝗗𝗘𝗖𝗘𝗜𝗧 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲 𝗨𝗻𝗮𝗯𝗮𝘁𝗲𝗱At a time when State is confronting a worrying economic slowdown, very clearly evident from the Government… pic.twitter.com/lkeEp84jOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
జగన్ దమ్మున్న మొనగాడు.. మీలా చేతకాని రాజకీయాలు YSRCP చేయదు
-
తప్పు చేసి దొరికిపోయి కవర్ చేసేందుకు హార్పిక్ డ్రామా
-
హిందువుల దోహులు ఎవరంటే..? చంద్రబాబు, పవన్
-
చంద్రబాబు పాలన సక్కగ లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే
-
మీ కక్ష రాజకీయాలతో.. సొంత కంపెనీలోనే ఇంత కల్తీ చేశాడు ..
-
జగన్పై కుట్ర.. కేంద్ర హోంశాఖకు YSRCP లేఖ
-
విశాఖ ఉక్కు కర్మాగారంపై కమ్ముకుంటున్న నీలినీడలు
-
KSR Show: రాజకీయ నిరసనలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలట..!
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబు సర్కార్ కీలక నిర్ణయం
-
చంద్రబాబు మూక నిర్వాకం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
-
కలియుగ దైవంపై 'నారా'రూపరాక్షసుల కుట్ర
-
టీడీపీ ర్యాంకింగ్లో చిట్టచివరి స్థానంలో గల్లా మాధవి
-
నాడూ నేడూ బాబు మౌనమే 'ఏపీ ఆయకట్టు ఎడారే'!
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి ఏకంగా 524.256 మీటర్లకు పెంచడంపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. డ్యామ్ ఎత్తు పెంపు పనులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 అక్టోబర్ 25నే టెండర్ పిలవగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. అప్పట్లో రూపొందించిన డీపీఆర్ ప్రకారం.. తాజాగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును కర్ణాటక సర్కార్ పెంచుతుండగా, ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం జూలై ఆఖరుకు వస్తోంది. అదే ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆగస్టు రెండో వారానికిగానీ.. శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం చేరదని.. దాంతో నీటి లభ్యత భారీగా తగ్గి రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని మహారాష్ట్ర సర్కార్.. తమ ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కానీ.. చంద్రబాబు సర్కార్ మాత్రం కనీసం నోరు మెదపకపోవడంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వడివడిగా భూ సేకరణ, పునరావాసంఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచితే 20 గ్రామాలతోపాటు భాగల్కోట్ మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ముంపునకు గురయ్యే భూమితోపాటు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,33,967 ఎకరాలను సేకరించేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమైంది. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పనకు రూ.87,818 కోట్లను మంజూరు చేసింది. మాగాణి భూమికి ఎకరానికి రూ.40 లక్షలు.. మెట్ట భూమికి ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని పేర్కొంటూ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక భాగల్కోట్ మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన పనులను వేగవంతం చేస్తూనే 20 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓవైపు డ్యామ్ ఎత్తు పెంచే పనులను వేగంగా చేపడుతూ మరోవైపు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు మూడో దశ(యూకేపీ–3) కింద 5.94 లక్షల హెక్టార్లకుగానూ.. ఇప్పటికే 1,13,500 హెక్టార్లను అభివృద్ధి చేసి గతేడాది ఆ ఆయకట్టుకు సాగునీటిని కూడా అందించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఏపీ హక్కులను హరిస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.కేడబ్ల్యూడీటీ – 2 తుది నివేదిక అమలుకు ఒత్తిడి..కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకు పంపిణీ చేస్తూ కేడబ్ల్యూడీటీ–2 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ఇచ్చిన తొలి నివేదిక.. 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. దాంతో ఇప్పటిదాకా కేడబ్లూ్ల్యడీటీ–2 తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయితే తక్షణమే కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను అమలు చేయాలని కేంద్రంపై ఓవైపు ఒత్తిడి చేస్తూనే.. మరోవైపు ఆ తుది నివేదికలో కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ చర్యలు చేపట్టింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీలను కొనసాగిస్తూనే.. 65 శాతం, సరాసరి ప్రవాహాల ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 అదనంగా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో కర్ణాటకకు 173 టీఎంసీలను కేటాయించింది. అందులో యూకేపీ–3 కింద 130 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చిన కేడబ్ల్యూడీటీ–2.. ఆ మేరకు ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికీ ఇబ్బందులేఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఇందులో 369 టీఎంసీల లభ్యత ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లో ఉంటుందని.. ఎగువ నుంచి 442 టీఎంసీల ప్రవాహం వస్తుందని పేర్కొంది. ఇక కృష్ణా నదిలో 65 శాతం, సరాసరి లభ్యత కింద కేడబ్ల్యూడీటీ–2 కర్ణాటకకు 173 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలను కేటాయించింది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపులు, కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు కలిపితే మహారాష్ట్ర వాటా 585 నుంచి 666, కర్ణాటక వాటా 734 నుంచి 907 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక 1,573 టీఎంసీలను వాడుకున్న తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తాయి. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఆ మేరకు నీటిని అదనంగా కర్ణాటక నిల్వ చేసుకుని, వినియోగించుకోనుంది. దాంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోనుంది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన అదనపు జలాలు 194 టీఎంసీల మాట దేవుడెరుగు.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల లభ్యత కూడా ఉండదని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి రావాల్సిన 442 టీఎంసీల ప్రవాహంలో భారీ ఎత్తున కోత పడుతుందని.. ఇది రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును ఎడారిగా మార్చుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు కాదు కదా.. కనీసం గుక్కెడు తాగునీటికీ ఇబ్బందులు తప్పవని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.నాడు ఆనకట్టను రిజర్వాయర్గా.. నేడు రిజర్వాయర్ను మెగా రిజర్వాయర్గా!ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 1995 వరకూ 506.87 మీటర్లు.. నీటి నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలు మాత్రమే. ఆ ఆనకట్ట ద్వారా యూకేపీ తొలి దశ కింద 4.25 లక్షల హెక్టార్లకు కర్ణాటక సర్కార్ 1996 వరకూ నీళ్లందించింది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటుచేసి.. నాటి కర్ణాటక సీఎం దేవెగౌడను ప్రధానిగా చేశానని గొప్పగా చెబుతుంటారు. ఆ సమయంలో ప్రధాని హోదాలో ఉన్న దేవెగౌడ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని మంజూరు చేయించి.. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506.87 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచుతూ, నీటి నిల్వ సామర్థ్యాన్ని 17.82 నుంచి 129.72 మీటర్లకు పెంచే పనులను చేపట్టారు. కృష్ణా జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కులను కర్ణాటక సర్కార్ కాలరాస్తూ ఆల్మట్టి ఆనకట్టను రిజర్వాయర్గా మార్చేసినా చంద్రబాబు అప్పుడు నోరుమెదపలేదు. దాంతో యూకేపీ–2 కింద అదనంగా 54 టీఎంసీలను వినియోగించుకుంటూ 1.97 లక్షల హెక్టార్లకు 2002 నాటికే కర్ణాటక నీళ్లందించింది. దీని వల్ల ఎగువ నుంచి జూన్ నాటికి శ్రీశైలానికి చేరాల్సిన కృష్ణా వరద.. ఇప్పుడు జూలై ఆఖరుకుగానీ చేరడం లేదు. ఇక ఇప్పుడు ఆల్మట్టి రిజర్వాయర్ను మెగా రిజర్వాయర్గా మార్చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం మౌనవ్రతాన్ని వీడకపోవడం గమనార్హం. -
రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి
తిరువూరు: రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన వాట్సాప్లో స్టేటస్ పెట్టారు.తాను మూడ్రోజులపాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యానని, రహదారుల్లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయానంటూ ఆ స్టేటస్లో పేర్కొన్నారు. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని, వారి పరిస్థితి సైతం కంటతడి పెట్టించిందని కొలికపూడి పేర్కొన్నారు. ఇప్పుడు కొలికపూడి వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. -
బాబు పాలనలో హాలా‘హలం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులకు హాలాహలమే దిక్కవుతోంది. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల మరణమృదంగం మోగుతోంది. రోజుకు సగటున 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ప్రతి మూడు గంటలకు ఓ రైతు/రైతు కూలీ బతుకు భారమై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2025లో రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల దయనీయ స్థితి ఇదీ... రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించిన చేదు నిజం ఇదీ. 2025లో రాష్ట్రంలో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గృహిణులూ బలి బలవన్మరణం పాలైన వారిలో గృహిణులు రెండో స్థానంలో ఉన్నారు. 1,884 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో గృహహింస వేధింపులు పెరుగుతున్నాయన్నది స్పష్టమవుతోంది. మహిళా భద్రతపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే అందుకు కారణమన్నది స్పష్టమవుతోంది. రైతులు, రైతు కూలీలు, గృహిణులతోపాటు ఇతర వర్గాల ప్రజల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. 2024లో కంటే 2025లో రాష్ట్రంలో ఆత్మహత్యలు 4.8 శాతం పెరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సమర్పించిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ... ⇒ రాష్ట్రంలో 2024లో 8,045 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 8,433కు పెరిగింది. భవితపై భరోసా లేకనే...రాష్ట్రంలో భవిష్యత్పై భరోసా లేకనే అత్యధికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. 2025లో ఆత్మహత్యలు చేసుకున్నవారిలో పురుషులు 6,360మంది, మహిళలు 2,073 మంది ఉన్నారు. బలవన్మరణం పాలైన వారిలో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు అత్యధికంగా 4,594 మంది ఉన్నారు. భవిష్యత్పై భరోసా లేకనే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్ అంబటికి బెయిల్
-
TJR : చంద్రబాబు పాలనపై సొంత ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి
-
కూటమి పాలనలో.. పల్లె కన్నీరు పెడుతుంది.. కొలికపూడి సంచలన పోస్ట్
-
NDDB రిపోర్టులో ఏముందో.. చదివి వినిపించిన మల్లాది
-
తిరుమలను అపవిత్రం చేస్తున్నావ్... చంద్రబాబూ..ఇది మహా పాపం..
-
భయం జగన్ బ్లడ్ లోనే లేదు.. భయం అంటే ఏంటో 2029లో చూపిస్తాం
-
మీ ముగ్గురు నోర్లు పడిపోతాయి.. బాబు, పవన్, లోకేష్ పై రాచమల్లు సెటైర్లు
-
Perni Nani: మీరు మనుషులా.. రాక్షసులా..? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు
-
హెరిటేజ్ పెరుగులో ఏంకలుపుతున్నారు..? బాబు, లోకేష్ను నిలదీసిన కారుమూరి
-
రాజకీయాలకోసం ఇంత దిగజారాలా.. దేవుడు నిన్ను విడిచిపెట్టడు జాగ్రత్త..
-
ప్రజలు అసహ్యించుకుంటున్నా బుద్ధి రాట్లే.. చంద్రబాబుపై ధర్మాన సీరియస్
-
Advocate: PT వారెంట్ పెట్టి హింసిస్తున్నారు..? అంబటి ఆరోగ్యం ఎలా ఉందంటే..
-
కాకాణిపై మరో అక్రమ కేసు
-
బాబుపై తిరగబడుతున్న బీజేపీ, జనసేన
-
అంబటి రాంబాబుపై PT వారెంట్.. గుంటూరుకు తరలింపు
-
అందినకాడికి బాదుడే లక్ష్యం.. ప్రైవేట్ కు రాజధాని..!
-
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
-
పెండింగ్లో ‘పోలీస్’ ఫైల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలలో వర్గపోరుతో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోలేకపోతుండటం గమనార్హం. దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఓ కొలిక్కి తేలేకపోతోంది. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు సరైన పోస్టింగులు దక్కక అప్రాధాన్య పోస్టులతో కాలం వెళ్లబుచ్చుతుండగా... డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై డీజీపీ హరీశ్కుమార్ గుప్తా రూపొందించిన జాబితాకు సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు ఆర్పీ ఠాకూర్ మరో జాబితాను సీఎంవోకు ప్రతిపాదించడంతో పీటముడి బిగుసుకుంది.గుప్తా ‘సై’... ఠాకూర్ ‘నై’..! హరీశ్ కుమార్ గుప్తా 2025 ఫిబ్రవరిలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పూర్తిస్థాయిలో ఐపీఎస్ల బదిలీ ప్రక్రియను చేపట్టలేదు. 2025 జూన్లో రెగ్యులర్ అయిన తరువాత కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసినా... రాజధాని కేంద్రంగా విధులు నిర్వర్తించే సీనియర్ ఐపీఎస్ల బదిలీలను మాత్రం ఓ కొలిక్కితేలేకపోతున్నారు. కీలకమైన విభాగాలను డీజీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించగా అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలపై తుది నిర్ణయం తీసుకోవడం లేదు. సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్లపై డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెక్ పెట్టినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హోంశాఖ వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. డీజీపీ గుప్తా సీఎంవోకు ప్రతిపాదనలు పంపగా.. ఠాకూర్ మంత్రి లోకేశ్ పేషీ ద్వారా మరో జాబితాను చేరవేసినట్లు సమాచారం. కీలక పోస్టింగ్లపై డీజీపీ గుప్తా, ఆర్పీ ఠాకూర్ పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు చేయడంతో సీఎంవో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పక్కనపెట్టేసింది. రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీగా తన ఏడాది పదవీ కాలం పూర్తి కావడంతో వైదొలిగారు. ప్రస్తుతం రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబును అదనపు బాధ్యతలతో ఎండీగా నియమించినా, సీనియర్ ఐపీఎస్ను రెగ్యులర్ ఎండీగా నియమించాల్సి ఉంది. డీజీ (ఆర్గనైజేషన్) ఎన్.బాలసుబ్రహ్మణ్యంను ఆర్టీసీ ఎండీగా నియమించాలని సీఎంవో భావిస్తోంది. అందుకు డీజీపీ గుప్తా సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత్ర బాగ్చీ డీజీగా పదోన్నతి పొందడంతో ఆయన్ను బదిలీ చేయాల్సి ఉంది. ఆయన గ్రేహౌండ్స్ డీజీగా వెళ్లాలని భావిస్తున్నారు. లేదంటే విజిలెన్స్ విభాగం డీజీగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అందుకు డీజీపీ గుప్తా సానుకూలంగా స్పందించడం లేదు. ఆర్టీసీ ఎండీ పోస్టుతోపాటు విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలకు తాను సూచించిన అధికారులనే ఇన్చార్జ్లుగా నియమించాలని డీజీపీ గుప్తా పట్టుదలతో ఉన్నారు. విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలను డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు అప్పగించకూడదన్నది ఆయన ఉద్దేశం. ఐజీ స్థాయి అధికారులను నియమించి తన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే కొనసాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ విభాగాన్ని పూర్తి అదనపు బాధ్యతలతో ఆయనే నిర్వహిస్తున్నారు. అదే పరిస్థితిని కొనసాగించాలని యోచిస్తున్నారు. అయితే అందుకు విరుద్ధంగా విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలలో డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులను రెగ్యులర్ డీజీలుగా నియమించాలని ఆర్పీ ఠాకూర్ సూచిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో సీనియర్ ఐపీఎస్ల పోస్టింగ్లపై సీఎంవో తుది నిర్ణయం తీసుకుండా పక్కనపెట్టేసింది.డీఐజీలకు ఒకటికి మించి బాధ్యతలుసీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేకపోవడం పోలీసు శాఖపై ప్రభావం చూపిస్తోంది. ఇదే అదనుగా డీఐజీ స్థాయి అధికారులకు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కట్టెబెట్టి డీజీపీ గుప్తా తన పంతం నెగ్గించుకుంటున్నారు. డీఐజీ సత్య ఏసుబాబు పోలీసు ట్రైనింగ్, అపా, పీటీసీ, రైల్వేస్, పీ అండ్ ఎల్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. మరో డీఐజీ ఫకీరప్ప శాంతి–భద్రతలు, ఏపీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ, సిట్ (డీజీ అటాచ్మెంట్) బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పోలీస్ సంక్షేమం, స్పోర్ట్స్, ప్లానింగ్, కో ఆర్డినేషన్ విభాగాలను డీఐజీ అన్బురాజన్ పర్యవేక్షిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ విభాగాలను పర్యవేక్షిస్తున్నవారికి కేవలం అదనపు బాధ్యతలుగా మాత్రమే అప్పగించారు. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం. తద్వారా అంతా పూర్తిగా తన గుప్పిట్లోనే ఉండేలా డీజీపీ గుప్తా పావులు కదుపుతున్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘ప్రైవేట్’ రాజధాని!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యం పీపీపీ, ప్రైవేట్ జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా అమరావతి రాజధానిని సైతం పీపీపీ, ప్రైవేట్కు అప్పగించేలా అడుగులు ముందుకు వేసింది. గంపగుత్తగా ప్రైవేట్కు అప్పగించి అందినకాడికి చార్జీల రూపంలో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడున్న చట్టాలను మార్చడంతో పాటు మరిన్ని కొత్త చట్టాలను రూపొందించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇదంతా చేసి పెట్టడానికి ప్రైవేట్ సంస్థలను (కన్సల్టెంట్) ఆహ్వానించింది. ఇలా ఎంపికైన కన్సల్టెంట్ ద్వారా పీపీపీ, ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం చట్టపరమైన నిబంధనలను రూపొందించనుంది. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా అమరావతికి మెట్రో పాలిటిన్ నగరంగా స్వయం ప్రతిపత్తి కల్పించనుంది. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) రుణం మంజూరు చేసిన నేపథ్యంలో ఇక అమరావతి పరిపాలన అంతా ఆ బ్యాంకుల కనుసన్నల్లోనే సాగనుంది. గత ఏడాది జూలైలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఏపీసీఆర్డీఏ ఇన్నోవేటివ్ అర్బన్ గవర్నెన్స్ పేరుతో మేధోమథన వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్లో అమరావతి పాలనకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. పీపీపీ, ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించాలని సంకల్పించారు. అలాగే ప్రజలకు అందించే అన్ని రకాల సేవలకు వినియోగ చార్జీలతోపాటు ఆస్తి పన్ను, ఇతర లెవీలతో అంటే ప్రజలను మరింతగా బాదడం ద్వారా బహుళ ఆదాయ వనరులను అమరావతి మెట్రో పాలిటిన్ నగరానికి సమకూర్చాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన, పాలనా పరమైన నిబంధనల తయారీ కోసం సీఆర్డీఏ కన్సల్టింగ్ సంస్థను ఆహ్వానించింది.కన్సల్టింగ్ సంస్థ ఎంపిక కోసం కసరత్తు⇒ అమరావతి రాజధాని నగరం కోసం పాలన అభివృద్ధి సంస్థాగత చట్రం రూపకల్పన కోసం కన్సల్టింగ్ సంస్థ ఎంపిక కోసం సీఆర్డీఏ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (టెండర్ నోటీసు) జారీ చేసింది. ప్రజా సేవల ప్రాజెక్టులైన నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, నీటి పంపిణీ, సేకరణ, మునిసిపల్.. ఇతర వర్గాల ఘన వ్యర్థాలు, జిల్లా శీతలీకరణ, విద్యుత్ సరఫరా మొదలైనవి పీపీపీలో చేపట్టనున్నారు. ⇒ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే ఈ చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన జరగనుంది. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి (మానిటైజ్) హక్కులు కల్పించే విధంగా మున్సిపల్ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి.. స్థిరమైన రాబడి, పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్ట పరమైన ఫ్రేమ్ వర్క్ను రూపొందించనున్నారు.⇒ అమరావతికి స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్థ్యం కోసం చట్టపరమైన నిబంధనలు ఉండాలని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి ఆర్థిక మద్దతు, రాజధానికి ఆదాయం, స్వయం ప్రతిపత్తి, సంస్థలకు అప్పగించిన భూమి విక్రయించుకునేందుకు అనుమతులు.. వీటన్నింటినీ మానిటైజేషన్ చేయడానికి కొత్త ఫ్రేమ్ వర్క్ను తయారు చేయనున్నారు.⇒ సీఆర్డీఏ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. దక్షిణ కొరియా, యుఎస్ఏ, దక్షిణాఫ్రికాతో పాటు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రాల్లో నిబంధనలను పరిశీలించడంతో పాటు అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా అలాంటి రవాణా నెట్వర్క్లు, పర్యావరణ ప్రణాళిక, హైబ్రిడ్ గవర్నెన్స్ ఏర్పాట్లను రూపొందించనున్నారు. ⇒ మున్సిపల్ పాలన, సంప్రదాయ నమూనాలు అమరావతి స్థాయికి సరిపోవని, ఈ నేపథ్యంలో ప్రత్యేక పాలన ఫ్రేమ్ వర్క్కు చట్టపరమైన నిబంధనలు అవసరమని నిర్ణయించారు. ప్రత్యేక పాలన ఫ్రేమ్ వర్క్ ఇలా..⇒ ఢిల్లీ, చండీగఢ్, నవీ ముంబై, గాంధీనగర్, న్యూ టౌన్ కోల్కతాతో సహా ప్రపంచ రాజధాని నగరాలైన బ్రెజిలియా, పుత్రజయ, సెజోంగ్, అస్తానా, నుసంతారా, సింగపూర్, జోహన్నెస్బర్గ్ మెట్రో పాలిటన్ ప్రాంతాల పాలన ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా చట్టపరమైన స్వయం ప్రతిపత్తి పాలన, ఆర్థిక అధికారాలు, ఆదాయ ఏర్పాట్లు, § ప్రణాళిక అభివృద్ధి కోసం ఉత్తమ విధానాలు రూపకల్పన. ⇒ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలు రూపొందించడం. పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీలనూ నియమించేందుకు వీలుగా చట్టాల రూపకల్పన. ⇒ అన్ని అంశాలలో మార్గ నిర్దేశం చేయడానికి రాజధాని నగరంలో వివరణాత్మక పాలనా వ్యవస్థలను అభివృద్ధి చేయడం.⇒ అమరావతి సంస్థాగత రూపకల్పనలో రెవెన్యూ మోడల్లో భాగంగా పన్ను, వినియోగదారు చార్జీలు, భూమి విక్రయం విలువ, అంతర్గత ప్రభుత్వ ఆర్థిక బదిలీ, ఆర్థిక వనరులను పంచుకోవడానికి రాజధాని నగరంలో ఏర్పాట్లు. సేవల పంపిణీ విధానం, ప్రైవేట్ రంగ ప్రమేయం పరిధి నిర్ణయించడం.⇒ రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి.. పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్ వర్కును రూపొందించడం.⇒ బలమైన ఆర్థిక సాధనాల సమితిని సిఫార్సు చేయాలి. ఆస్తి పన్ను, వినియోగదారు చార్జీలు, భూమి విలువ, ఇతర లెవీలతో సహా బహుళ ఆదాయ వనరులను సృష్టించే మార్గాలు వెల్లడించాలి. ⇒ ఆర్థిక వికేంద్రీకరణ, పీపీపీ సౌకర్యాల రక్షణ చర్యల కోసం చట్టపరమైన చర్యలను సూచించాలి.⇒ పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల సేవలు, భూమి నిధుల కోసం నియంత్రణ చట్రాలను ప్రతిపాదించాలి.⇒ భూములను ఆర్థిక వనరులుగా మార్చడంతో (క్రయవిక్రయాలు) పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం–రాజధాని అమరావతి మధ్య ఆర్థిక పంపిణీ జరిగేలా చట్టాన్ని రూపొందించాలి.⇒ ఆదాయ మార్గాల యంత్రాంగాలపై మాన్యువల్ రూపకల్పన.⇒ అమరావతి జిల్లాగా ప్రకటించిన సందర్భంలో భూ ఆదాయానికి సంబంధించి జిల్లా పరిపాలన పాత్రను నిర్వచించాలి.⇒ మౌలిక సదుపాయాలు, సేవా స్థాయిలను కొనసాగించడానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వేయడంతోపాటు నిధుల సమీకరణ సూచించాలి.⇒ నిర్దిష్ట పట్టణ విధులు, సేవలు, మూల ధన పెట్టుబడులు, నిర్వహణ వ్యయం, పట్టణ ప్రణాళిక అభివృద్ధి వంటి స్పష్టమైన బాధ్యతలతో అమరావతి పట్టణాన్ని పరిపాలించే.. నిర్వహించే అధికారాలను సూచించాలి.⇒ సుంకాలు, పన్నులు, వినియోగదారు చార్జీలను నిర్ణయించడం, వసూలు చేయడం, రుణ ఫైనాన్సింగ్ కోసం మూల ధన మార్కెట్లను యాక్సెస్ చేసే అధికారాలు, ప్రస్తుత అభివృద్ధి దశ నుండి క్రియాత్మక కార్యాచరణ నగరం వరకు ఇన్స్టాలేషన్ ట్రాన్స్మిషన్ కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను అందించాలి. -
పోలవరంకు పగుళ్లు.. TDP నేతల వియ్యంకుల దందా
-
పేదల భూమిని అక్రమంగా ABNకు గిఫ్ట్ ఇచ్చిన బాబు
-
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ... వియ్యంకుల సంస్థలకు పనుల అప్పగింత
-
వియ్యంకులకు పోల‘వరం’
సాక్షి, అమరావతి: పోలవరం ఎడమ కాలువ పనుల్లో 2014–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ దోచేస్తే.. ఇప్పుడు ‘ఈనాడు’ రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’ సంస్థ అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కాలువకు అత్యంత నాసిరకంగా కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల పనులు చేసిన కొద్ది రోజులకే పగుళ్లు రావడంతో వాటికి సిమెంటు పూతతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. కాంట్రాక్టర్కు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం వల్ల పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేక పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277 శాతం) ఎక్కువకు అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. అయినా, పనులు అత్యంత నాసిరకంగా చేస్తూ పెంచేసిన అంచనా వ్యయాన్ని ‘నీకింత.. నాకింత’ అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.అప్పట్లో అడ్డగోలు దోపిడీకి ఇప్పుడు నజరానా⇒ పోలవరం ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పనులను అనుంగులకు అప్పగించడంపై దృష్టి సారించారు. ⇒ 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను 60–సీ కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తప్పించి.. వాటిని రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)కు 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు. ⇒ వాటితోపాటు 100.3 కిలోమీటర్ నుంచి 102.5 కిలోమీటర్, 110.5 కిలోమీటర్ల నుంచి 111.487 కిలోమీటర్ వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని, అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని.. క్యూబిక్ మీటర్కు రూ.29.21 చొప్పున రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ఎడమ కాలువ తవ్వకం కోసం కుమ్మరిలోవ వద్ద కొండను కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో కాకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న దృశ్యం ⇒ కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్కే–హెచ్ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో.. ఆ సంస్థకు రూ.181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లయింది. ⇒ 2019 అక్టోబర్ 3 నాటికి ఆ సంస్థ రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో రూ.64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనులను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ ఎడమ కాలువలో 5–ఏ ప్యాకేజీలో 100.3 కిలోమీటర్ల నుంచి 102.50 కిలోమీటర్ల వరకు 2016–19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశారని చూపి.. క్యూబిక్ మీటర్కు అదనంగా రూ.78 చొప్పున రూ.13,25,59,128 అదనంగా చెల్లించేందుకు 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ట్ లెవల్ శాంక్షన్ కమిటీ) ప్రతిపాదన మేరకు చెల్లించిన రూ.9,94,19,274 పోనూ మిగిలిన రూ.3,31,39,854 చెల్లించాలని పేర్కొంది. ⇒ 2017 ఆగస్టు 6న డీఎల్ఎస్సీ చేసిన ప్రతిపాదనపై గత ఏడాది జూన్ 25న అంటే.. ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో ఎస్ఎల్టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆమోద ముద్ర వేసిందంటూ ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించేసింది. ⇒ ఇక కాలువ అడుగు (బెడ్) భాగం వెడల్పు పెరగడం వల్ల 2016–19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని చూపి.. వాటికి అదనంగా రూ.4.40 కోట్ల బిల్లు చెల్లించడానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.పనులు ఇలా చేయాలి⇒ టెండర్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పోలవరం ఎడమ కాలువను అడుగు (బెడ్) భాగంలో 68.5 మీటర్ల వెడల్పు, 4.9 మీటర్ల లోతుతో.. 17,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వాలి. ⇒ కఠిన శిలలతో కూడిన ప్రాంతంలో కాలువను తవ్వేటప్పుడు కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాలి. ⇒ ఆ తర్వాత కాలువ గట్లపై ఇరు వైపులా 5 మీటర్ల వెడల్పుతో.. 225 మిల్లీమీటర్ల మందంతో సర్వీసు రోడ్డు కోసం వరుస వేయాలి. ⇒ దాన్ని 8 నుంచి 10 టన్నుల సామర్థ్యంతో కూడిన షీప్ ఫుట్ రోలర్ లేదా వైబ్రేటరీ రోలర్తో మందం 150 ఎంఎం వరకు తగ్గేలా రోలింగ్ చేయాలి. ⇒ కాలువకు ఇరు వైపులా వాలు (స్లోప్స్)ను వైబ్రేటరీ ఇన్క్లెయిన్డ్ రోలర్తో పటిష్టం చేయాలి. కాలువ అడుగు భాగాన్ని వైబ్రేటరీ రోలర్తో గట్టి పరచాలి. ⇒ ఆ తర్వాత 40 ఎంఎం కంకర, ఇసుక, సిమెంటుతో కూడిన ఎం–10 కాంక్రీట్ మిశ్రమాన్ని 100 ఎంఎం మందంతో కాలువకు ఇరువైపులా వాలుకు పేవర్ యంత్రంతో లైనింగ్ వేయాలి. ⇒ కాలువ అడుగు భాగంలోనూ అదే రీతిలో లైనింగ్ వేయాలి.పనులు నాసిరకంగా చేయడం వల్ల లైనింగ్కు పగుళ్లు రావడంతో ఇటీవల సిమెంట్ పూత పూసి మాయ చేశారనడానికి నిదర్శనం పనులు ఇలా చేస్తున్నారు⇒ కఠిన శిలలతో కూడిన ప్రాంతంలో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయడం లేదు. కుమ్మరిలోవ వద్ద కాలువ కోసం కొండను ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ చేస్తూ తవ్వేస్తుండటంతో తుని మున్సిపాల్టీలో ఒకటో వార్డులో ఇళ్లు కంపిస్తున్నాయని ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ⇒ కాలువకు ఇరు వైపులా సర్వీసు రోడ్డును ఇష్టారాజ్యంగా కానిచ్చేస్తున్నారు. ⇒ కాంక్రీట్ లైనింగ్ చేయడం కోసం కాలువకు ఇరు వైపులా వాలు భాగాన్ని గట్టి పరచకుండానే అత్యంత నాసిరకం కంకర, ఇసుక, సిమెంటుతో కూడిన కాంక్రీట్తో చేస్తున్నారు.⇒ కాలువ అడుగు భాగంలోనూ ఇష్టారాజ్యంగా నాసిరకం కాంక్రీట్తో లైనింగ్ చేస్తున్నారు.⇒ దీని వల్ల కాంక్రీట్ వేసిన కొద్ది రోజులకే ఎక్కడికక్కడ పగుళ్లు వస్తున్నాయి. పగుళ్లు వచ్చిన చోట సిమెంటు పూత పూస్తూ మాయ చేస్తున్నారు.⇒ పనులు అత్యంత నాసిరకంగా చేస్తుండటం వల్ల కాలువలోకి పూర్తి స్థాయి మేరకు నీటిని వదిలినప్పుడు ఎక్కడికక్కడ గండ్లు పడతాయని సాగు నీటి రంగ నిపుణులు, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఈనాడు రామోజీరావు కుమారుని వియ్యంకుడు రాయల రఘుది కావడం, ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతోనే పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేకపోతున్నారని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
కూటమి కోరల్లో కాలకూటం!
‘‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ’’. చిత్తం శివుడి మీద – భక్తి చెప్పుల మీద నిలుపుకొనే దొంగ భక్తుల ముసుగుల్ని మహాకవి వేమన ఏనాడో తొలగించాడు. ఇప్పుడు సమస్య కొందరు వ్యక్తులు, కొందరు భక్తులు వేసుకునే ముసుగుల గురించి కాదు. ఏకంగా ప్రభుత్వ వ్యవస్థే వేసుకున్న ప్రమాదకరమైన ముసుగు గురించి! ముసుగులు వేసుకున్న ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం కంటే దారుణమైన చెత్తబుద్ధి తాపంతో బుసకొడుతున్నది. రాజకీయంగా స్థిరపడటానికి మతాన్ని అస్త్రంగా మలుచుకోవాలనే నిశ్చయానికి కూటమి వచ్చేసిందని మొన్నటి కూటమి ప్రెస్మీట్, అందులో ముఖ్య నేత మాటలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికల హామీలు వెక్కిరిస్తున్నాయి. పాలనా వైఫల్యం వెన్నాడుతున్నది. అప్పుల పర్వతం పెరిగిపోతున్నది. అభివృద్ధి పేరుతో జపిస్తున్న తూతూమంత్రానికి తుప్పిళ్లు తప్ప చింత కాయలు రాలడం లేదు. అదానీ – గూగుల్ డేటా సెంటర్కు మనం ఇరవై వేల కోట్లు రాయితీలిస్తే గూగుల్ వాళ్లు బెంగ ళూరులో 20 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒకటి రెండు పెద్ద కంపెనీల పేర్లు చెప్పి అదే వరసలో ఊరూ పేరూ లేని ‘ఉర్సా’లకు భూసంతర్పణ చేస్తున్నాం. దానివల్ల సాధించబోయే అభివృద్ధి దృశ్యం త్వరలోనే ముందుకు రాబోతున్నది. అమరావతి పేరుతో తలపెట్టిన లక్షల కోట్ల జూదం ఒక ‘మాన్యుమెంటల్ ఫెయిల్యూర్’గా అల్లంత దూరంలో భయపెడుతున్నది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కార్కు కిం కర్తవ్యం? ‘‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.... రావే ఈశ్వరా కావవే వరద’’. ఇక దేవుడే దిక్కని కూటమి నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యమేమున్నది!‘పరిత్రాణాయ సా«ధూనాం... సంభవామి యుగేయుగే’ అన్నాడు కృష్ణపరమాత్ముడు. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మా ర్గులను శిక్షించడానికీ తాను వస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సన్మార్గులూ విశ్వసిస్తారు. దుర్మార్గులూ నమ్ముతారు. కూటమి సర్కార్కు ఇక్కడ దేవుడు దిగిరావలసిన అవసరం లేదు. దేవదేవుని పేరు, ఆ పేరు చుట్టూ ఉండే మతవిశ్వాసాలను కబ్జా చేసుకుంటే చాలు! కూటమి సర్కార్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నది. తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చంద్రబాబు వ్యాఖ్యానాలు చేశారు. పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారని మొదట ఆరోపించారు. ఆయన ఆరోపణపై అప్పట్లోనే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఒకవైపు ‘సిట్’ను ఏర్పాటు చేసి, దాని దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఇలా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మంచిది కాదని మందలించింది.ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దేశాలను గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం నిష్పాక్షిక దర్యాప్తునకు స్వతంత్ర బృందమే మేలని భావించింది. సీబీఐ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నిధులు కూడా ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియ మించింది. ఈ బృందం దర్యాప్తు చేసి ఈమధ్యనే అభియోగ పత్రాన్ని (ఛార్జిషీట్) న్యాయస్థానం ముందుంచింది. చంద్ర బాబు, ఇతర కూటమి పెద్దలు, యెల్లో మీడియా కలిసి భువన భువనాంతరాల్లో చాటింపు వేయించినట్టుగా జంతు కొవ్వు కలవలేదని తమ దర్యాప్తులో తేలినట్టు ‘సిట్’ స్పష్టం చేసింది. అయినా సరే, జంతు కొవ్వు కలిసినట్టు తేలిందనే ప్రచారాన్ని కూటమి ఆపలేదు. పైగా ఊరూరా, వాడవాడనా ఫ్లెక్సీలు కూడా వేసింది. ఇది నూటికి నూరుపాళ్లు కోర్టు ధిక్కరణ! వేంకటేశ్వర స్వామినే రాజకీయాల్లోకి లాగడానికి భయపడనివాళ్లు కోర్టు ధిక్కరణకు భయపడతారా? తాజాగా ఆ నెయ్యిని బాత్ రూమ్లు కడిగే కెమికల్తో తయారు చేశారనే ప్రచారాన్ని చంద్ర బాబు ప్రారంభించారు. ఆ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడే పద్ధతి ఈ విధంగానే ఉంటుందా?సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ తన ఆకాంక్షల మేరకు ఛార్జిషీట్ వేయలేదు కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం మరో కమిషన్ వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు, దాంతోపాటు బాత్రూమ్లు కడిగే కెమికల్ కలిసిందనే రిపోర్టు వచ్చేవరకు చంద్రబాబు కమిషన్లను, కమిటీలను నియమిస్తూనే ఉంటారన్న మాట! అయితే ఇప్పుడు వివాదానికి కారణమైన నెయ్యి శాంపిల్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసు కున్నదే! అదే విచిత్రం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నెయ్యి శాంపిల్ను పరీక్షిస్తే జగన్ కాలంలో జరిగిన కల్తీ కనిపించాలని కూటమి సర్కార్, యెల్లో మీడియా కోరుకుంటున్నాయి.వివాదానికి కేంద్ర బిందువైన భోలేబాబా డెయిరీ వాళ్లు అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఉన్నప్పటి నుంచే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో (ఇతర డెయిరీల ద్వారా) తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్! చంద్రబాబు కాలంలో కిలో నెయ్యికి రూ. 297 వసూలు చేసే వాళ్లు. ప్రభుత్వం మారిన తర్వాత 319 నుంచి 348 రూపాయల వరకు ధర పెరిగింది. ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. నెయ్యి ట్యాంకర్లు తొలుత తిరుమలకు వెళ్లకుండా తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్కు చేరుకుంటాయి. మార్కెటింగ్, విజిలెన్స్, ప్రొక్యూర్మెంట్ అధికారుల సమక్షంలో శాంపిల్ తీస్తారు. ఈ శాంపిల్ను తిరుమలలోని నాణ్యతా పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. వారు ఓకే అన్న తర్వా తనే నెయ్యి ట్యాంకర్ తిరుమలకు బయల్దేరుతుంది. నాణ్యత లేదని తేలితే ట్యాంకర్ను వెనక్కు పంపిస్తారు. చాలాకాలంగా ఇటువంటి పకడ్బందీ విధానం అక్కడ అమల్లో ఉన్నది.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లను నాణ్యత లేని కారణంగా 16 సార్లు వెనక్కు పంపి నట్టు రికార్డులు చెబుతున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపారు. దర్యాప్తులో తేలిన ఆందోళనకరమైన విషయం ఏమిటంటే – ఇలా వెనక్కు వెళ్లిన నాలుగు ట్యాంకర్లు ఒకచోట మాటువేసి ఉండి, కంపెనీ పేరు మార్చుకొని ‘పరీక్షలు’ నెగ్గి తిరుమలకు చేరుకున్నాయి. ఈ ట్యాంకర్లలో తీసిన శాంపిల్సే ఇప్పుడు దేశవ్యాప్త సంచలనాలకు కారణమయ్యాయి. చంద్రబాబు తొలిదఫా అధికారంలో ఉన్న సమయంలోనే బోలేబాబా టెండర్ను అనిల్ సింఘాల్ అనే ఐఏఎస్ అధికారి ఖాయం చేసుకొచ్చారు. అయనప్పుడు టీటీడీ ఈవోగా పని చేశారు. ఈ శాంపిల్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా మరోసారి ఆయన్నే ఈవోగా నియమించారు. దీని భావమేమి తిరుమలేశా? వైసీపీ సర్కార్ హయాంలో తిరస్కరించిన 16 ట్యాంకర్లలో ఏ ఒక్కటీ తిరిగి కంపెనీ పేరు మార్చుకొని వచ్చిందనే దాఖలా లేదు. అప్పుడు లడ్డూల్లో వాడిన నెయ్యి శాంపి ల్స్ను పరీక్షించకుండానే మరి ఆ కాలమంతా కల్తీ జరిగిందని ఎలా చెబుతారు?చంద్రబాబు హయాంలో భోలేబాబా టెండర్ ఖరారైంది. ఈ టెండర్ను ఖరారు చేసిన అధికారి అప్పుడు ఈవోగా పని చేశారు. అప్పుడు కేవలం 297 రూపాయలకే ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వైసీపీ హయాంలో 16 సార్లు వెనక్కు పంపించారు. చంద్రబాబు హయాంలో శాంపిల్ తీసి వెనక్కి పంపిన ట్యాంకర్లు మళ్లీ వచ్చి తిరుమలకు వెళ్లాయి. దాని శాంపిల్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తర్వాత అప్పుడు టెండర్ ఖరారు చేసిన అధికారే మళ్లీ ఈవోగా వచ్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏమర్థమవుతుంది? చూపుడు వేలు ఏ వైపు తిరుగుతుంది? తిరుమల లడ్డూను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రతిపక్షానికి బురద పూయాలనే సంకల్పం తప్ప మరోటి కన్పించడం లేదు. మొన్న గురువారం నాటి ఓ శుభముహూర్తాన, కూటమి నేతలంతా కొలువుదీరిన మీడియా సమావేశంలో ఎటువంటి దాపరికం లేకుండా ఈ సంకల్పాన్ని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఒక మహాకుట్ర జరిగిందని, అందులో భాగంగానే లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ చేశారని తాను కనిపెట్టినట్టుగా ఆయన చెప్పుకున్నారు. దీన్ని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా ఆయన భావించారు. తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామే తనకు అప్పగించారని ఆయన చెప్పారు. ఖతమ్. బారా ఖూన్ మాఫ్. అఖిలాంధ్ర జనులారా... చంద్రబాబు నుంచి ఇంకేమీ ఆశించకండి. ఆయన స్వామివారి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉంటారు. హిందూ ధర్మాన్ని ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో ఆయన ఒకే ఒక్క నిర్వచనాన్ని ప్రవచించారు. ‘‘మన ధర్మం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి. మనకు కుటుంబ విలువలుంటాయి. పెళ్లయిన తర్వాత విడాకులివ్వడం మన ధర్మం ప్రకారం సరైంది కాదు’’ అంటూ మాట్లాడారు. ఈ నిర్వచనానికి కూటమిలో ఏకాభిప్రాయం ఉన్నదో లేదో తెలియదు.తిరుమల పవిత్రతపై, హిందూ ధర్మంపై ప్రతిపక్ష పార్టీ కుట్ర చేస్తున్నదని ఆయన సారాంశం. దానికి వ్యతిరేకంగా కూటమి తోడ్పాటుతో పోరాటం చేస్తారట! ఎనభై ఐదు శాతం మంది హిందువులున్న రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే, హిందూ దేవుళ్ల పవిత్రతను దెబ్బతీయడానికి పనిచేస్తుందా? ఇంగిత జ్ఞానమున్నవాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా? మాట్లాడితే నమ్ము తారా? ప్రతిపక్ష నేతకు లభిస్తున్న జనాదరణను తట్టుకోలేక నిస్పృహతో కూడిన మాటలుగానే వాటిని భావించాలి. ఈ నిస్పృహలో ఆయన ప్రజాస్వామిక విలువల్నీ, రాజ్యాంగ ధర్మాన్నీ తుంగలో తొక్కుతున్నారు.విజయవాడ నగరంలో డజన్లకొద్దీ ఆలయాలను చంద్ర బాబు కూల్చివేస్తే వాటిని పునర్నిర్మించిన ధార్మికుడు, దేశ వ్యాప్తంగా వందలాది శ్రీవారి ఆలయాలను నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి. వేలాది గోవుల్ని అక్రమ రవాణా చేస్తుంటే, వాటిని వధించి గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఈ వ్యాపారంలో ఆయన పార్టీ వారే భాగస్థులుగా ఉన్నా కఠిన చర్యలకు పూనుకోని వ్యక్తి చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుంచి దేశవాళీ గోసంపదను సమీకరించి తిరుమ లలో గోశాలను ఏర్పాటు చేసి, స్వయంగా తన నివాసంలోనే గోవుల్ని పోషించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఆలయ రథం కాలిపోతే పట్టించుకోని పాలకుడు చంద్రబాబు. అంతర్వేదిలో ఓ రథాన్ని ఎవరో దుండగులు తగలబెడితే, వెంటనే సరికొత్త రథాన్ని తయారు చేయించడమే కాక, ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాసిన పారదర్శక పాలన జగన్ది. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మం విషయంలో జగన్ చిత్తశుద్ధిపై డజన్కిపైగా ఉదాహరణలివ్వవచ్చు. చంద్రబాబు పోటీయే కాదు.ఒక దేవుడిని విశ్వసించేవాడు, నమ్మేవాడు అందరు దేవుళ్లనూ ఆరాధిస్తాడు. ఇది ప్రాథమిక సూత్రం. అన్యమత స్థులెవరూ ఇతరుల ఆరాధనా స్థలాలపై దాడులు చేయరు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరుండే ఉన్మాదులు తప్ప! ఆకతాయిలు తప్ప! దొంగలు తప్ప!! ఇటువంటి వాళ్లు అన్ని చోట్లా, అన్ని మతాల్లో, అన్ని సమూహాల్లో ఉండవచ్చు. వాళ్లు చేసే చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి మతంపై దాడిగా ప్రచారం చేయడం దుర్మార్గమైన రాజకీయం. ప్రజల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనే ఎత్తుగడ. రాజకీయ మనుగడ కోసం విసిరే ఆఖరి పాచిక. ఇటువంటి ఎత్తులకు ఆంధ్ర ప్రజలు పడిపోతా రనుకోవడం అవివేకం.అన్యమతస్థుల ఆలయ ప్రవేశానికి ఆంక్షలుండాలనీ, షరతులుండాలనీ, అన్య మతస్థులెవరూ అక్కడ పనిచేయకుండా చూస్తామనీ కూడా చంద్రబాబు చెప్పారు. ఇదేం గొప్ప విషయమా? సుప్రసిద్ధ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్కు కాశీ విశ్వేశ్వరునితో ఉన్న అనుబంధం లోకానికి తెలిసిందే కదా! ‘అమెరికాలో స్థిరపడితే జీవితాంతం సకల సౌక ర్యాలు కల్పిస్తాన’ని ఓ సంపన్నుడు బిస్మిల్లా ఖాన్ను అడిగాడట! ‘సరే, గంగానదిని, విశ్వనాథుడినీ కూడా ఇక్కడికి తేగలవా? అలా అయితే ఇక్కడే ఉంటా’నని చెప్పాడట! సిరిసంపదల కంటే విశ్వనాథుడే మిన్నగా ఆయన భావించాడు. మన తెలుగు వాడు నాదస్వర బ్రహ్మ షేక్ చిన మౌలానాను శ్రీరంగం దేవ స్థానం ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించిన సంగతి మరిచి పోదామా? గంధర్వ గాయకుడు యేసుదాసు ‘హరివరాసనం స్వామి విశ్వమోహనం’ అని పాడుతుంటే తన్మయత్వానికి లోనుకాని హిందూ భక్తులుంటారా? గంగా – యమునా తెహ జీబ్... భారతీయ సంస్కృతి. దాన్ని కాపాడుకోవడంలోనే దేశ పురోగతి దాగి ఉన్నది. దీన్ని ధ్వంసం చేయడానికి స్వయంగా పాలకులే ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరమే అవుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది
-
గల్లా మాధవి, పెమ్మసానికి YSRCP కాపు నేతల స్ట్రాంగ్ వార్నింగ్
-
ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు
-
అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త
-
అప్పుడు గేట్లు, గోడలు దూకి రెచ్చిపోయావ్.. గీతం భూకబ్జాపై వార్నింగ్
-
ఇరికించబోయి అడ్డంగా ఇరుకున్నారు తప్పుడు ప్రచారమే బాబుకి ఉరితాడు..
-
బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI
-
‘లిఫ్ట్’ తాకట్టుపై ‘సీమ’ కన్నెర్ర
సాక్షి, ప్రతినిధి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన లిఫ్ట్ పనులను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో పుట్టి.. పుట్టిన గడ్డకే ద్రోహం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు. లిఫ్ట్ను వెనువెంటనే పూర్తి చేయాల్సిందిపోయి.. ప్రాజెక్టు దండగంటూ తన టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే ప్రజలు తరిమికొడతారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని తీర్మానం చేశారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగా నిలిచిపోయిన ‘రాయలసీమ లిఫ్ట్’ పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడులో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’ పేరుతో పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించింది. ఆగిపోయిన లిఫ్ట్ పనులను పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించిన అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సభ ప్రారంభమైంది. సీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆవశ్యకత, చంద్రబాబు ప్రభుత్వం చేసిన ద్రోహం.. ‘సీమ’లోని కూటమి నేతల నిర్లిప్తత, ప్రభుత్వంపై భవిష్యత్తులో ఉద్యమించే తీరుపై పార్టీ నేతలు ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి రెండు నెలల్లో పనులకు పూనుకోకపోతే రైతులతో కలిసి కడపలో భారీ ఎత్తున మహా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాధాన్యతపై ఆరు జిల్లాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు ‘సీమ’లో పారే ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్ పేరు 40 ఏళ్ల కిందట వైఎస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్షతోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బీజం పడింది. ఆ రోజు వైఎస్సార్తో పాటు నడిచిన కాటసాని, చవ్వా రాజశేఖర్రెడ్డి ఈ రోజు ఈ వేదికపై కూడా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరుకు వెళ్లే ప్రతీ నీటి చుక్కపై వైఎస్సార్ పేరు ఉంది. ఇది చరిత్ర, ఎవ్వరూ మార్చలేరు. రాయలసీమ లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తి చేశాం. తక్కిన 20 శాతం పూర్తి చేస్తే కనీసం మంచి పని చేసిన పేరైనా చంద్రబాబుకు ఉండేది. అది కూడా లేకుండా ప్రాజెక్టును ఆపి ద్రోహం చేశారు. రేవంత్రెడ్డి మాటలతో వాస్తవాలు వెలుగు చూశాయి. రేవంత్రెడ్డి తన మాటలపై కావాలంటే నిజ నిర్ధారణ కమిటీకి సిద్ధమని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు దండగని టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. నీళ్లు, రైతు, వ్యవసాయం బాగుంటే రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన వైఎస్కు ఉంది కాబట్టే పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టారు. 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఆ పనులు పూర్తి చేయలేదు. 2019లోజగన్ అధికారంలోకి వచ్చాక ఆర్అండ్ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును వాడకంలోకి తెచ్చారు. రాయలసీమ లిఫ్ట్తో జగన్ చేసిన మేలు ప్రతీ ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలోని ప్రాజెక్టును చంద్రబాబు ఆపి మహాపాపం చేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు – సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప బాబుకు ఏమీ పట్టదు కరోనా సంక్షోభాన్ని లెక్క చేయకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చివరి దశకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ నిలిచిపోతే కేసీ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఎస్సార్బీసీకి నీళ్లుండవు. అనంతపురం రైతులకు మేలు చేయాలని హంద్రీ–నీవా కాలువను 3,800 నుంచి 6,500 క్యూసెక్కులకు జగన్ పెంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పనులు నిలిపేశారు. అంతేకాదు రూ.2 వేల కోట్లతో కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పానికి నీరిచ్చిన ఘనత కూడా జగన్దే. గాలేరు–నగరి ద్వారా చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ‘సీమ’లోని ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కానీయకుండా చంద్రబాబు అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాట్లు పడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నాడు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ ఏకతాటిపై పోరాడుదాం 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు వైఎస్సార్తో కలిసి నేను పాదయాత్ర చేశాను. వైఎస్ కృషితోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఎనీ్టఆర్ 4 వేల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. దీన్ని 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్ పెంచారు. అలాగే హంద్రీ–నీవా, గాలేరు–నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు నిలిపేశారు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు సర్కారుపై పోరాడాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ప్రజలను మాయ చేయడం చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు.. జగన్కు మంచి పేరొస్తుందని రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. ఆంధ్రాకు సీఎంగా ఉండి, చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదని 40 ఏళ్లుగా ఆయన్ను చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రతి పౌరుడికీ తెలిసేలా వివరిద్దాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు.. ఇతర సీఎంలు ప్రారంభించిన ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేయడం, పూర్తయిన వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే చంద్రబాబుకు సాగు నీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్నచూపు. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. – బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దాం వైఎస్సార్ సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి దేవుడయ్యాడు. గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కలగడడం లేదు. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి. – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరగలేరు. – దారా సుదీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే ఆ ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించి రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుంది ‘సీమ’ అంటే చంద్రబాబుకు ఎప్పుడూ ఇష్టం లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపి ద్రోహం చేశాడు. కర్నూలుకు రావల్సిన హైకోర్టును, నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్లారు. ‘అనంత’కు మంజూరైన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించారు. ఆఖరుకు కడపలో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకును కూడా తరలించుకుపోయాడు. ఆనాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమాతో ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఉద్యమానికి ఇప్పుడు మళ్లీ బీజం పడింది. ఉద్యమం మొదలయ్యాక తల తెగ నరికినా మా మొండెం ఉద్యమిస్తుందే కానీ ఉద్యమం మాత్రం ఆగదు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి ఓటుకు కోట్లు కేసుకు భయపడే.. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు కేసీఆర్కు, నేడు రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోదావరి–బనకచర్ల పేరుతో కాలయాపన శ్రీశైలం డ్యాంకు ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచించ లేదు. దివంగత వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిరి్మంచాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ గెలిచి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు లిఫ్ట్తోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలనే డిమాండ్తో త్వరలో కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం. – రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం రాష్ట్రంలో సాగు నీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే, ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ లిఫ్ట్ పూర్తవుతుంది. ఈ లిప్్టతో ఉమ్మడి ప్రకాశం, నెలూర్లు, రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఉద్యమంలో ఎంత వరకైనా ముందుకు నడుస్తాం. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాబు కుట్రలను అంతం చేద్దాం రాయలసీమ దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం. నీళ్లు లేక వ్యవసాయం చేయలేక ఏడాదిలో రెండు నెలలు మినహా 10 నెలలు వలసోయి బతికే పరిస్థితి. పిల్లలు, వృద్ధులు మాత్రమే ఇళ్ల వద్ద ఉంటారు. అలాంటి ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు మా నాయకుడు సిద్ధమైతే దాన్ని అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు. రాయలసీమకు చంద్రబాబు కంటే ద్రోహం చేసేవారు బహుశా ఎవ్వరూ ఉండరు. చంద్రబాబు కుట్రలను అంతం చేసి రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తాం. – గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలు పెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. – భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం రాష్ట్ర సాగు నీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైఎస్సార్కు ముందు.. వైఎస్సార్ తర్వాత అని చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే నెల్లూరు జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్షీట్లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
వైఎస్ జగన్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు. నిన్నటి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. -
చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
-
నడి రోడ్డుపై టిప్పర్లు పెట్టి కుట్రలు.. జగన్ సునామీని ఆపడం ఎవరివల్ల కాదు
-
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతని ఇంటెలిజెన్స్ రిపోర్టు!
-
బాబు జంగిల్ రాజ్ – భయానక పాలనతో 'ప్రజాస్వామ్యం ఖూనీ'!
కచ్చితంగా ప్రతిఘటన.. ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితనకు కావాల్సిన వారిని నియమించుకుని..చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.- మీడియాతో వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం అబద్ధాలతో ఫ్లెక్సీలు..తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా? ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.పోలీసుల సమక్షంలోనే..అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు తప్పు చేసింది బాబేఅసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు. నకిలీ లిక్కర్ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు. విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాంఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్ చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే. తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీనెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్డీఆర్ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్లో పొందుపరిచి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్చిట్ ఇస్తోంది. ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్..ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.ప్రశ్నిస్తుంటే దాడులు...దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు
-
కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్
-
మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?
-
YS Jagan: ముగ్గురూ లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి..లేదంటే
-
ఇసుకేస్తే రాలనంత జనం. ఈ వీడియో చూస్తే చంద్రబాబు ఏమైపోతాడో
-
టీడీపీ హయాంలోనే తిరుమల నెయ్యిలో కల్తీ!
-
జంగిల్ రాజ్ పై జనాగ్రహం
-
ఆరోగ్యశ్రీ ఉద్యోగులూ ప్రైవేటుపరం!
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం అమలులో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందించిన వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెట్టిస్తోంది. ఒకటిన్నర దశాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయడానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్ర, టీం లీడర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజెప్పేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది ఆరోగ్య మిత్రలు, వంద మంది టీం లీడర్లు క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులందరు కలిపి 2,500 మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. అందరిలో కలవరపాటు2019–24 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసిన వైఎస్ జగన్ సర్కారు.. ఈ పథకం అమలులో కీలకమైన ఉద్యోగులకు ఆరి్థకంగా భరోసా ఇచి్చంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిత్రలకు రూ.6 వేలు, టీం లీడర్లకు రూ.10,600 చొప్పున వేతనాలు ఉండేవి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నవంబర్లో ఆరోగ్య మిత్రలకు రూ.12 వేలు, టీం లీడర్కు రూ.15 వేల వరకూ వేతనాలను పెంచారు. ప్రభుత్వ రంగంలో నిశ్చింతగా పని చేసుకుంటూ, ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని కోరుకుంటున్న ఉద్యోగుల గుండెల్లో 2024లో చంద్రబాబు బీమా బాంబు పేల్చారు. ప్రీమియంలో వీలైనంత మిగుల్చుకోవాలనే లాభాపేక్షతో పనిచేసే బీమా కంపెనీల చేతుల్లో ప్రజారోగ్యాన్ని పెట్టడమే కాకుండా, 2500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పొగ పెట్టడానికి సిద్ధం అయ్యారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాభాపేక్షే పరమావధిగా పనిచేసే ప్రైవేటు బీమా కంపెనీల్లో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని చిరుద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు. -
రెడ్బుక్కే రాజ్యాంగం.. నేనే ‘సుప్రీం’!
సాక్షి, అమరావతి: స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ, ఏ ముఖ్యమంత్రీగానీ తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరి తెగించారు! దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను పట్టించుకోకుండా.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను పక్కనపెట్టేసి సొంత విచారణకు సిద్ధమయ్యారు! సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ధిక్కరిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిపై మళ్లీ విచారణకు సొంత విచారణ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెర తీశారు. దీనిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరపగా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను తాము పరిగణలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగించేందుకు... రాజకీయ కక్ష సాధింపుతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను నమోదు చేసేందుకు తమ వీర విధేయులతో విచారణకు ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కుతంత్రానికి రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వేదికగా చేసుకోవడం గమనార్హం. అంటే సుప్రీం కోర్టుతో తమకేమాత్రం సంబంధం లేదని... టీడీపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఓ సమాంతర న్యాయ వ్యవస్థగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు. దేశ చరిత్రలో ఓ దుస్సాంప్రదాయానికి తెరతీశారు. తిరుమల లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేనేలేదని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చార్జిషీట్లో సీబీఐ సిట్ పేర్కొన్న అంశం సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ... బాబు బరితెగింపురాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ఆయన నిరాధారణ ఆరోపణలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు విభ్రాంతి చెందారు. అంతే కాదు ఈ రాజకీయ కుట్రకు అధికారిక ముద్ర వేసేందుకు టీడీపీ అనుకూల ఐపీఎస్ అధికారులతో సిట్ను నియమించారు. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుళ్లను అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీడీపీ కూటమి ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఈ క్రమంలో లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతపై విచారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది. ఆ స్థానంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఆ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. దాంతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరిపి తన నివేదికను ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించడానికి తెగబడ్డారు. 2024లోనే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేయడం గమనార్హం. అనంతరం సీబీఐ ఆధ్వర్యంలోని స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ సిట్ ఆ కేసులో దాఖలు చేసిన చార్జ్షీట్ ఇప్పుడు నెల్లూరు న్యాయస్థానంలో ఉంది. ఇంకా కొనసాగుతున్న ఆ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. కేబినెట్ వేదికగా న్యాయధిక్కార కుట్ర...సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ను ఇతర మార్గాల ద్వారా సేకరించి న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించడం విస్మయపరుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై సమాంతరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. చార్జ్షీట్లోని అంశాలపై న్యాయస్థానం పరిశీలించి విచారించాలి. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలను వినిపించాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనే ‘సుప్రీం’ అన్నట్లుగా బరి తెగించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా సాగుతున్న కేసు దర్యాప్తుపై తాము ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కేబినెట్ సమావేశానికి ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో సమావేశమై చార్జ్షీట్లోని అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్చంద్ర లడ్హ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావడం గమనార్హం. సిట్ సభ్యుడిగా ఉన్న ఓ అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విస్మయపరుస్తోంది. అంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన సిట్లో సభ్యుడిగా ఉన్న ఆ అధికారి... సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే సమావేశంలో భాగస్వామి అయ్యారు. ఆది నుంచి అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మరోసారి రాజ్యాంగబద్ధ ధర్మం కంటే తన రాజకీయ విధేయతకే పెద్ద పీట వేశారు. ఇక ఎంపిక చేసిన మంత్రులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కూడా సీబీఐ చార్జ్షీట్లో పేర్కొన్న అంశాలపై చర్చించారు. అంతే కాదు... సీబీఐ చార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు విభేదించారు. ఆ చార్జ్షీట్ సమగ్రంగా లేదని వారే తీర్పునిచ్చేశారు. ఈ విధంగా తాము సమాంతర న్యాయ వ్యవస్థ అన్నట్టుగా వ్యవహరించారు. సీబీఐ దర్యాప్తు, నివేదికను తాము గుర్తించబోమని పరోక్షంగా ప్రకటించారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిజం చెప్పినందునే..చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా బరితెగించి సుప్రీం కోర్టును ఎందుకు ధిక్కరించింది? అంటే కారణం ఒకటే... తిరుమల లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతోనే ఇంతటి దుస్సంప్రదాయానికి తెగబడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన సిట్... లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిగ్గు తేల్చింది. టీటీడీకి చెందిన నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి నెయి నమూనాలను సేకరించి దేశంలోని ప్రతిష్టాత్మకమైన హర్యానాలోని ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీబీ) ల్యాబొరేటలరీలకు పంపింది. ఆ ల్యాబరేటరీలలో పరీక్షించిన అనంతరం... ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదనే వాస్తవం నిగ్గు తేలింది. శాస్త్రీయంగా పరీక్షించిన రెండు ల్యాబొరేటరీలు సాధికారికంగా వేర్వేరు నివేదికలు ఇచ్చాయి. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఆ రెండు నివేదికలూ స్పష్టం చేశాయి. ఆ రెండు నివేదికలను ప్రస్తావిస్తూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది. దాంతో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్రికలు సైతం అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ మీడియా చానళ్లు, డిజిటల్ మీడియా కూడా ఆ విషయాన్ని అత్యంత ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఇక రాజకీయ పార్టీలతో నిమిత్తం లేని తటస్థులు, విశ్లేషకులు కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేననిఅభిప్రాయపడ్డారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు కొత్త కుతంత్రానికి తెరతీశారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిషన్ను నియమించాలని నిర్ణయించారు.నాడు పచ్చ సిట్.. నేడు పచ్చ కమిషన్!రాజకీయ కుట్ర కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు పంతం పట్టారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద సహాయక చర్యల్లో తన దారుణ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దుష్ప్రచారానికి తెరతీశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే దుష్ప్రచార కుట్రకు సీఎం హోదాలో ఆయనే నేతృత్వం వహించి ఘోర అపచారానికి పాల్పడ్డారు. శ్రీవారి ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చే కుట్రకు రాజముద్ర వేసేందుకు చంద్రబాబు యత్నించారు. అందుకే ఈ అంశంపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయులైన రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్ను నియమించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన వివాదాస్పద అధికారి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్కు చీఫ్గా నియమించడం గమనార్హం. మరో వీర విధేయ అధికారి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అప్పటి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ)లను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి ఎవరో కాదు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా నియమితుడైన రిటైర్ట్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యకు ఆయన అల్లుడు. పచ్చ సిట్ ద్వారా చంద్రబాబు కుట్రలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దాంతో ఆ సిట్ను సుప్రీంకోర్టు రద్దుచేసి స్వతంత్ర సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దాంతో చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ దర్యాప్తులో వెల్లడి కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఈసారి ఈ అంశంపై దర్యాప్తునకు కమిషన్ను నియమిస్తామని ప్రకటించింది. తమ వీర విధేయులైనవారిని అందులో చైర్మన్, సభ్యులుగా నియమించి తమ దుష్ప్రచార కుట్రకు అధికారిక ముద్ర వేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని స్పష్టమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.నివేదిక ఇలా ఉండాలి.. నిందితులుగా వీళ్లే!సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ మరీ సొంత కమిషన్ ఏర్పాటుకు బరితెగించడం వెనుక చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం సుస్పష్టం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తాము చేసిన దుష్ప్రచారాన్ని బలపరుస్తూ ఓ నివేదిక ఇప్పించుకోవాలి. అంతే కాదు తాము రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసులో నిందితులుగా చేర్చాలి. వాస్తవాలు, ల్యాబరేటరీలలో పరీక్షలు, విధి విధానాలతో నిమిత్తం లేకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకే కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. ఫలానా వారిని నిందితులుగా చేర్చడానికే కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. ఆ కమిషన్కు అతి తక్కువ సమయమే ఇస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం గమనార్హం. అంటే దర్యాప్తుతో నిమిత్తం లేకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా తాము చెప్పింది చెప్పినట్టుగా నివేదిక ఇచ్చేవారినే కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమిస్తామని ప్రభుత్వం నిర్భీతిగా ప్రకటించుకున్నట్టే! అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చినట్టుగా నివేదికలు ఇప్పించుకుంటాం...! తమకు నచ్చనివారిపై అక్రమ కేసులు పెడతామంటే ఇక దేశంలో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఎందుకు ఉన్నట్లని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు, వ్యవస్థలను తాము పట్టించుకోమంటూ చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వానికి తెగబడుతోందని విమర్శిస్తున్నారు. -
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
‘గీతం’ యూనివర్సిటీ భూముల వ్యవహారం.. ఏపీ హైకోర్టులో విచారణ
సాక్షి,విజయవాడ: ఏ హక్కుతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాదులపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.మంగళవారం ఈ పిల్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది. -
తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు
-
ఇదే విద్వాంస పాలన మీరు కోరుకుంటే.. సినిమా స్టైల్ లో అనిల్ కుమార్ వార్నింగ్
-
MAGAZINE STORY: బండబూతుల దండుపాళ్యం
-
ఏపీలో అరాచక పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్ను పెంచండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు మోసం.. పథకాలన్నీ బంద్! గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్ను, కోల్డ్ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. -
జంగిల్రాజ్పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్రాజ్కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్
-
Jogi Ramesh: నన్ను చంపాలనే ప్లాన్
-
సిగ్గన్నా లేకపాయే.. TDP ఎంపీలు.. ఏకిపారేసిన శైలజానాథ్
-
Jada Sravan: ఏపీకి కేంద్రం వరాల జల్లా..? ఫ్లైట్ ఎక్కడం... ఫ్లైట్ దిగడం...
-
YSRCP నేతల ఇళ్లపై దాడులు రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్
-
Kakani: రాషాన్ని ఒక అగ్నిగుండంగా మార్చేశావయ్యా చంద్రబాబు
-
Vangaveeti: ఆరోజు రంగా... ఈరోజు అంబటి.. దమ్మున్న కాపు నాయకులే నీ టార్గెటా
-
కొనసాగుతున్న జంగిల్రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
జంగిల్ రాజ్.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జంగిల్ రాజ్ సృష్టిస్తోంది. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. పక్కా స్కెచ్తో దాడులుశనివారం ఉదయం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవునా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందన.. అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి అంబటి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేసినా, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈలోగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నల్లపాడు సీఐ వంశీధర్ అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి నోటీసు ఇవ్వడానికి వచ్చానని చెప్పి కొద్దిసేపు అక్కడి పరిస్థితులు గమనించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లంక మాధవి అంబటి ఇంటి ముందుకు వచ్చి చెప్పు చూపించి దుర్భాషలాడారు. రండి తేల్చుకుందాం అంటూ బూతులు తిడుతూ రెచ్చగొట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సంఅప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూటీడీపీ నాయకుడు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కొంత మంది వికలాంగులను సైతం తీసుకొచ్చి మైక్లో బూతులు తిట్టారు. ‘నా కొడకా.. అంబటీ బయటికి రారా..’ అంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం లంకించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ బీభత్సం రాత్రి 10 గంటలు అయినప్పటికీ కొనసాగింది. ఫోన్లు చేసి గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అక్కడికి రప్పించారు. హిజ్రాలను, దివ్యాంగులను కూడా తీసుకువచ్చి గొడవ చేయించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా జనాన్ని అక్కడికి తరలించారు. అంబటి రాంబాబు కార్యాలయంలో అప్పటికే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆళ్ల కిరణ్, పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా ఖాన్ తదితరులు అంబటి కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. గొడవ విషయం తెలియగానే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని సర్వత్రా చర్చఅంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్న గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్లెదుటే ఫర్నీచర్ను ధ్వంసం చేస్తుంటే.. కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకొచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పని తీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు మాజీ హోం మంత్రి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ సమన్వయకర్తలు బలసాని కిరణ్కుమార్, వనమా బాలవజ్రకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాలేదు. గంటకు పైగా నాయకులు ఎస్పీ ఇంటి ముందు నిలబడే ఉన్నారు. చివరికి ఎస్పీ లైన్లోకి వచ్చి తాను గుంటూరులో లేనని, అడిషనల్ ఎస్పీని కలవాలని చెప్పారు. ఐజీ కూడా ఫోన్కు అందుబాటులోకి రాలేదు. అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతపై టీడీపీ గూండాల దాడిఅంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్పై విరుచుకు పడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని కారును సైతం ధ్వంసం చేశారు. తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన అశోక్ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తమకు అడ్డువచ్చిన ఎవరినైనా చంపేస్తాం రండిరా అంటూ టీడీపీ గూండాలు తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అశోక్ వాపోయాడు.అర్ధరాత్రి దాటినా..టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగులగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యాలయంపై విసురుతున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్ టీవీ కెమెరామెన్తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు. కాగా, అంబటి రాంబాబుపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదునగరంపాలెం (గుంటూరు వెస్ట్): సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాను ఏ వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, 24 గంటల్లో ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పి తాను వచ్చేశానని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లింది ఫ్లెక్సీలు చించేందుకు కాదని, వాటిని తొలగించాలని చెప్పేందుకు మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ఒక్కసారిగా తన కారుపైకి తెగబడ్డారని చెప్పారు. టీడీపీకి చెందిన ఓ మహిళ అసభ్యకరంగా మాట్లాడటంతో తాను ప్రతిస్పందనగా వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈలోగా చంద్రబాబూ దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం తనకు లేనేలేదని స్పష్టం చేశారు. తనపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడానికి టీడీపీ గూండాలు కారు డోరు తీశారని, తాను ప్రాణ రక్షణ నిమిత్తం అక్కడున్న వారిపై మాట్లాడానని చెప్పారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ టీడీపీ నాయకురాలు (లంకా మాధవి) సిద్ధార్థనగర్లోని తన ఇంటి వద్దకు వచ్చి చెప్పు పట్టుకుని నానాయాగీ చేసినా పోలీసులు ఆమెను ఆపలేదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ల రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తేలేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. తాను అరెస్ట్కు భయపడేదే లేదని, ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్కు కూడా దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. తన ఇంటి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్పై, తనపై అభిమానంతో వచ్చారని.. అంతేతప్ప తన అరెస్ట్ను అడ్డుకునేందుకు కాదని స్పష్టం చేశారు.రారా చూసుకుందాం.. ఇక్కడే పాతేస్తాంగోరంట్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘రారా చూసుకుందాం.. నిన్ను ఇక్కడే పాతేస్తాం’ అంటూ రాయలేని పదాలతో టీడీపీ గూండాలు బూతు పురాణంతో విరుచుకుపడటంతో భక్తులు హడలిపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలియుగదైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అసత్యమని సీబీఐ సిట్ నివేదికలో వెల్లడి కావడంతో శనివారం అంబటి రాంబాబు గోరంట్లలోని శ్రీవేంకటేశ్వరాలయంలో పాపపరిహార పూజల్లో పాల్గొన్నారు. ఇది తెలిసిన టీడీపీ గూండాలు కర్రలు, ఇనుపరాడ్లు తీసుకుని అంబటిపైకి దూసుకొచ్చారు. వేలాది మంది భక్తులు చూస్తుండగా.. పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. టీడీపీ మహిళా గూండాలు సైతం అసభ్య పదజాలంతో రోడ్లపై కర్రలు, రాడ్లతో హల్చల్ చేశారు. టీడీపీ గూండాలను అడ్డుకోవాల్సిన పోలీసులు.. అక్కడ నుంచి వెళ్లాలని అంబటి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ముందుకు కదులుతున్న అంబటి కారుపై టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి దిగి కారు అద్దాలను పగలగొట్టి హత్య చేయడానికి యత్నించారు. టీడీపీ గూండాల హడావుడికి అమరావతి రోడ్డులో ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు.


