-
ల్యాండ్ టైట్లింగ్ కేంద్రం అమలు చేసే చట్టం
అవనిగడ్డ: ల్యాండ్ టైట్లింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చట్టమని, రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాని ఈ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు ఏమీ దొరక్క, ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఈ చట్టంపై దిగజారుడు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్లో ఎలాంటి లోపాలు కనబడకపోవడంతో ఈ చట్టం అమలైతే జగన్మోహన్రెడ్డి మీ భూములన్నింటినీ తాకట్టు పెట్టుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనుకునే వారు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అయినా ఇలా చేస్తుందా, అలా చేస్తే వ్యవస్ధ నడుస్తుందా అన్నారు. ప్రజల మెదళ్లలో విషం ఎక్కించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయర్టీని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకునే బాబు అంత అసహ్యంగా మాట్లాడటానికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మోసగించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సమగ్ర భూ సర్వే సాహసోపేతమైన చర్య అని.. 6 వేల గ్రామాల్లో ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం పూర్తిస్ధాయిలో అమల్లోకి వస్తే రాష్ట్రంలో భూములకు సంబంధించి వివాదాలు, ఎలాంటి గొడవలు ఉండవని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు చెబుతున్న మాటలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతున్న విషయం తెలిసి చంద్రబాబు ఎంత ఆందోళనకు గురవుతున్నారో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక వందేళ్ల నుంచి ఉన్న భూ సమస్యను పరిష్కరించారని, లక్షలాది ఎకరాల్లో చుక్కల భూముల అంశాన్ని పరిష్కరించారన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ దు్రష్పచారాన్ని ప్రజలు నమ్మొద్దని, 10 రోజుల తరువాత టీడీపీ, జనసేన మైకులు, వాళ్ల నోళ్లు మూగబోతాయని జోస్యం చెప్పారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, నియోజవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వి నర్ రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
FactCheck: ‘అంధుడి’ సర్టిఫికెట్ అందుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అధికారులు ఇసుకపై కోర్టులకు ఇవ్వాల్సిన నివేదికలు తనకే ఇచ్చినట్లు ఊహించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే.. కృష్ణా జిల్లా గనుల శాఖాధికారి సంచలన నివేదిక’ పేరుతో రామోజీ రోత పత్రిక వాస్తవాలకు మసి పూసి పూర్తిగా వక్రీకరించి అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది.నివేదికలో అంతా అక్రమాలే జరిగాయని ఒక అధికారి నివేదిక ఇచ్చారంట.. అది ఈయనగారికి చెప్పారంట? దాన్నే ఏ ఆధారం లేకుండా అబద్దాలతో అచ్చేశారు. కోర్టులకు వెళ్లాల్సిన నివేదికలు అంతకంటె ముందు రామోజీ, ఈనాడు కార్యాలయాలకు వెళుతున్నాయంటే అది నమ్మాలా? ఒకవేళ నిజంగా అలా జరిగితే రామోజీరావు కోర్టుల్ని కూడా డిక్టేట్ చేస్తున్నారా?. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారణ జరుగుతుంటే దానిపై కోర్టును ధిక్కరించేలా అడ్డగోలు కథనాలు రాసి మరీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.జిల్లా కలెక్టర్లు ఇసుక రీచ్లను మరోసారి పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారితో సహా సంబంధిత అధికారుల బృందం ఇసుక రీచ్లను సందర్శించి నివేదికలను రూపొందిస్తున్నాయి. రూపొందించాక కోర్టుకు సమర్పించనున్నారు. ఈలోపే అక్రమ తవ్వకాలు జరిగాయని ఈనాడుకు తెలిసిపోతుందా? నివేదిక తయారు కాకుండానే అందులో ఏం రాస్తారో ఊహించుకుని తన ఇష్టానుసారం వార్తలు రాస్తారా?ఈ కథనాల ద్వారా కోర్టుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేగా? జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు చేసి, సమర్పించిన నివేదికలు మార్చేందుకు వీలుంటుందా? అలా మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఈనాడు మాత్రం కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగిపోతున్నాయని ఊహించుకుని, నివేదికలో అవి జరిగాయని ఊహించుకుని కథనాలు రాసేసింది. అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగకుండా గనులశాఖ, ఎస్ఇబి నిరంతరం పర్యవేక్షణ జరుపుతోంది.ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా అబద్ధాలు రాసింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతో ప్రభుత్వంపై బుదరచల్లే పనిలో భాగంగా తరచూ ఇలాంటి కథనాలు రాస్తోంది. అందుబాటు ధరలోనే ఎక్కడా ఇసుక కొరత లేకుండా ప్రజలకు అందించడాన్ని తట్టుకోలేక అడ్డగోలుగా బురదజల్లుతున్నారు. పర్యావరణ అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎస్ఇబిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరగకుండా అన్ని చోట్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇంత పకడ్భందీగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతుంటే దానిపై అదే పనిగా అబద్ధపు ప్రచారం చేస్తోంది. 4 వేల కోట్ల విలువ లేని ఇసుక కాంట్రాక్టులో రూ.40 వేల కోట్ల దోపిడీయా? రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ఏపీఎండీసీ సహకారం అందిస్తోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం కామెడీ షో నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం టెండర్లు పిలిచిన మొత్తం కాంట్రాక్ట్ విలువే రూ.4 వేల కోట్ల లోపు ఉంటే, ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో ఆ మహా మేధావికే తెలియాలి.ఏపీఎండీసీ శరవేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏపీఎండీసీ నిర్ణయించింది. బాండ్ల కోసం సేకరించే మొత్తం, దానికి చెల్లించే వడ్డీ కన్నా అధికంగా రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి వాణిజ్య ప్రయోజనం అందించే ప్రాజెక్టులనే బాండ్ల ద్వారా సేకరించిన సొమ్మును పెట్టుబడి వ్యయంగా పెట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.ఈ బాండ్ల సేకరణ ప్రక్రియ ఇంకా నడుస్తుండగానే ఏపీఎండీసీ రూ.7 వేల కోట్లకు బాండ్లు జారీ చేసిందని ఆరోపణలు చేయడం విడ్డూరమే. బాండ్ల కోసం ఆసక్తి వ్యక్తం చేసిన వారి వివరాలే తెలియకుండా, బాండ్ల జారీనే జరగకుండా, రూ.7 వేల కోట్లు ఎలా సేకరిస్తారో ఆ ప్రతినిధికే తెలియాలి? అసలు సేకరణే జరగని సొమ్మును ప్రభుత్వానికి ఎలా బదిలీ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మెప్పు కోసం ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
సేనానీ.. నీ ప్రాణాలకు ఉంది హాని ..
అయిపోయాయి.. అన్ని రకాల భూతవైద్యాలు.. చేతబడులు.. బాణామతి.. ఎత్తులు.. జిత్తులు ముగిశాయి. కూటమి విజయానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసేశారు. ఎన్ని సపర్యలు చేసినా పక్షవాతం రోగికి చెయ్యి కాలు నోరు రానట్లే కూటమి కూడా నిస్తేజంగా మంచానపడిన రోగిమాదిరి చూస్తుందే తప్ప ప్రయోజనం లేదు. ఈ గుడ్డిగుర్రాన్ని పంచకల్యాణి మాదిరిగా మార్చి యుద్ధానికి బయల్దేరుదాం అనుకున్న చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది. పవన్ కల్యాణ్కు చేర్చుకోవడం ద్వారా కాపుల ఓట్లు గంప గుత్తగా కొట్టేద్దాం. దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాపులకు ప్రాబల్యం ఉంది కాబట్టి అవనీ హోల్సేల్ లాక్కోవచ్చని భావించి 21 సీట్లు ఇచ్చినా అదీ పెద్ద వర్కవుట్ కావడం లేదు.పవన్ ప్రభావం భారీగా ఉంటుందని ఆశించిన తూర్పు గోదావరి జిల్లాలోనే దాని ఫలితం అంతంతమాత్రం అని తెలుస్తోంది. గోదావరికి వరదలు తెచ్చే స్థాయిలో ఓట్లు తెస్తాడు అనుకున్న పవన్ సైతం పిఠాపురంలో గెలుపు కష్టమే అని ఎదురీదుతున్న తరుణంలో ఇక బాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఏమి చేస్తే ఈ బతుకు బాగవుతుంది దేవుడా అనుకుంటున్నా తరుణంలో అయన ఇంకో కుట్రకు కూడా పాల్పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కు హాని తలపెట్టి ఆ అఘాయిత్యాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేసేందుకు సైతం కుట్ర పన్నుతున్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగానే తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు, కథనాలు రాయించి ఎన్నికల ముందు పవన్ మీద దాడి చేయించి దాన్ని ప్రభుత్వం వైఫల్యం అని బుకాయించి ఆ గాయాల నుంచి లభ్ది పొందాలని టీడీపీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు సందేహాలున్నాయి. ఈమేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఒక అవగాహనా కుదిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే పవన్ కూడా పలు సార్లు కామెంట్లు చేశారు. తనమీద దాడులు చేసేందుకు రౌడీలు సిద్ధంగా ఉన్నారని, బ్లేడ్లు పట్టుకుని తమవాళ్లను కోస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తానూ ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రెచ్చగొడుతున్నారు. చూస్తుంది బయటివాళ్ల సంగతి ఏమోకానీ చంద్రబాబు పురమాయించినవాళ్ళే పవన్ మీద దాడి చేసి, అయ్యో..మన బిడ్డకు ఘోరం జరిగిందని కొందరు అద్దె మనుషుల ద్వారా డ్రామా నడిపించి కాపుల ఓట్లు దండుకునేందుకు కుట్రలకు తెగబడవచ్చని జనసైనికులు, ఇంకా చంద్రబాబు నైజం తెలిసినవాళ్ళు అంటున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో చంద్రబాబును మించినవాళ్లు లేరని, రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతటికైనా దిగజారుతారని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకే పవన్... నువ్వు జరంత పైలం బిడ్డా అని జాగ్రత్తలు చెబుతున్నారు.- సిమ్మాదిరప్పన్న -
మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ
గతం ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. ప్రస్తుతం పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్గల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్ యాప్లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ ‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం. వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు. ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్’ అని ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది. -
జగన్ పాలనలో జనం హ్యాపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయమే కొలమానం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోకన్నా గత ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ, దాన్ని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.88,448 పెరిగింది. కోవిడ్ సంక్షోభం లేకపోయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల రూ.60,128 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాది 2018–19 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా, సీఎం జగన్ పాలనలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,42,479కి పెరిగింది. అంతేకాకుండా 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లలో జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,14,000కు చేరింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,60,341 ఉండగా 2023–24 నాటికి రూ.2,42,479 కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 తో దేశంలో 17వ స్థానంలో ఉంది. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం వరుసగా పెరుగుతూ 2022–23 నా టికి దేశంలోనే 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తలసరి ఆదాయం అంటే.. తలసరి ఆదాయం అనేది రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సు ముఖ్యమైన సూచిక. ఇది వ్యక్తులు, కుటుంబాలపై ఆచరణాత్మక ప్రభావాలను కలిగి ఉంటుంది. తలసరి ఆదాయం అంటే సాధారణంగా ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి డబ్బుని కలిగి ఉండటం. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఏదైనా రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కొలమానం తలసరి ఆదాయమే. జగన్ సర్కారు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించిందిలా.. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను యథాతథంగా అమలు చేసింది. ఈ సమయంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. జీవనోపాధి కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంది. వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగే వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా నమోదైంది. -
భూ బకాసురుడు!
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు. తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. సామాన్య రియల్టర్లను ముంచిన బాబు... అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు. చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ముందస్తు పన్నాగంతోనే... ► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు. ► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు. ► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు. సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్ ► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు. ► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు. ► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. ► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్ఆర్ అలైన్మెంట్ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం ► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. ► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి. ► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్కే సాధ్యమైంది. -
Ap: బాబు హయాం.. స్కాముల మయం !
నవ్యాంధ్రలో 2014 నుంచి 2019వరకూ చంద్రబాబు పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి. ప్రజాధనాన్ని దోచుకోవడం దాచుకోవడంతోనే చంద్రబాబు ఐదేళ్ల పాలన ముగిసిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తర్వాత ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది ఫైబర్ నెట్ కుంభకోణం. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఇంటింటికీ ఇంటర్నెట్ ఇస్తానని చెప్పుకున్న చంద్రబాబు ఫైబర్నెట్ పేరుతో ఎంత దోచుకున్నారు..? నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన మనుషులకు చెందిన కంపెనీల ద్వారా ఫైబర్ నెట్ పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తానంటూ ప్రారంభించిన ఫైబర్నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలోనే అక్రమాలు జరిగాయి. 330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ను అనుకూలమైన కంపెనీకి కేటాయించేందుకు టెండర్ ప్రక్రియను తారుమారు చేయడం సహా టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయి. ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖకు బదులు ఇంధన, మౌలిక సదుపాయాల శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సిఫార్సు చేసారు. పాలక మండలి-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ను చంద్రబాబు నియమించారు. సీఎం హోదాలో చంద్రబాబే మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం తెలిపారు. సీఐడీ ఛార్జ్షీట్లో బాబుపై తీవ్ర అభియోగాలు.. ‘వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్వేర్ను బ్లాక్లిస్ట్లో పెట్టినప్పటికీ..నిబంధనలకు వ్యతిరేకంగా దాన్ని ఉపసంహరించాలంటూ అధికారులపై నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఫైబర్నెట్కు పారదర్శకంగా, పక్కాగా టెండర్లు నిర్వహించాలని కోరిన అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో తనకు అనుకూలమైనవారిని చంద్రబాబు నియమించారని సీఐడీ ఛార్జ్ షీట్లో తెలిపింది. ఫైబర్నెట్ కేసులో అప్పటి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, హైదరాబాద్లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ ప్రసాద్పై మోసం, ఫోర్జరీ, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపీసీ సెక్షన్లతో పాటు..అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేసిందని, ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని న్యాయవాది సాయిరాం చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం.. ‘నాసిరకం మెటీరియల్ని ఉపయోగించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నప్పుడు ఆర్ఎఫ్పీలో పేర్కొన్న స్పెసిఫికేషన్లకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రాజెక్టులోని మొత్తం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సమారు 80 శాతం నిరుపయోగంగా మారిందని సీఐడీ పేర్కొంది. ఇది ఏపీ ఫైబర్ నెట్ జీవిత కాలానికి శాశ్వతమైన నష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీ ఫైబర్గ్రిడ్ ఫేజ్-1 ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 114 కోట్ల నష్టం వాటిల్లింది. 80 శాతం ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ వల్ల ఆపరేషన్, నిర్వహణ పనులు మరింత ఖరీదవుతాయి. దీంతో మరింత నష్టం వాటిల్లుతుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేశామని, మారుమూల ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలను విస్తరించడంతో పాటు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాం. ఆర్బీకేలు, స్కూల్స్ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనేక ఆన్ లైన్ సౌకర్యాలను కల్పిస్తూ.. పాలనను మెరుగుపరిచాం’ అని ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్రెడ్డి చెప్పారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ..వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటైన చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనా కాలంలో అందినమేరకు దోచుకున్నారు. పైగా తాను ఎక్కడా ఎవరికీ దొరకనని గర్వంగా చెప్పుకుంటారు చంద్రబాబు. అయితే చంద్రబాబు చేసిన అవినీతి పనులన్నీ వెలికి తీయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీలో పాలనా వ్యవస్థలన్నిటినీ వైఎస్ఆర్సీపీ చక్కదిద్దింది. చంద్రబాబు నాశనం చేసిన ఫైబర్ నెట్ను గాడిలో పెట్టి నెట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇదీ చదవండి.. టీడీపీలో టికెట్ల కుమ్ములాట.. చంద్రబాబుపై అసమ్మతి నేతల ఫైర్ -
మోసం చేయడానికే రంగురంగుల మేనిఫెస్టో
గుంటూరు, సాక్షి: నోరు తెరిస్తే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని అంటారని.. అనుభవం అనేది రాష్ట్రాలకు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని.. ఏ అనుభవం లేకుండానే రాష్ట్రానికి సుపరిపాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగిస్తూ.. గత 57 నెలల్లో జరిగిన మంచిని ప్రస్తావిస్తూనే చంద్రబాబు తీరను ఎండగట్టారు. ఇప్పటివరకు ఐదు బడ్జెట్ లు ప్రవేశపెట్టాం. ఇదే బడ్జెట్ కు మరిన్ని మెరుగులతో వచ్చే ప్రభుత్వంలో పెట్టుకుందాం. 2024 జూన్ లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయి. కఠినమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చాం. ఇప్పటివరకు ఐదు ప్రజాబడ్జెట్లు ప్రవేశపెట్టాం. కరోనా కారణంగా ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగాయి. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కరోనా మూడేళ్లలో రాష్ట్రం రూ.66,116 కోట్లు నష్టపోయింది. కరోనా వల్ల ఇతర రాష్ట్రాలు కూడా బాగా నష్టపోయాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాలను ఈ పరిస్థితులు కుదిపేశాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయి. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 35 శాతం. ఈ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 31.5 శాతమే. ప్రతి ఏటా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గుతూ వచ్చాయి గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాలు కుదేలయ్యాయి. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా చంద్రబాబు రైతులకు ఇవ్వలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనమిక్ పవర్ హౌస్ ఉండాలి. అలాంటి పవర్ హౌస్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ ను కోల్పోయాం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అందుకోసమే విశాఖ గురించి పదేపదే చెప్తున్నా విభజన కారణంగా రాష్ట్రం ఏటా రూ.13 వేలకోట్లు నష్టపోతున్నాం. లక్షా 30 వేల కోట్లు అదనపు ఆదాయాన్ని కోల్పోయాం. మనకు ఆ వెసులుబాటు లేకుండా చేశారు. కనీసం చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు. అందుకే కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 57 నెలల మన ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన చేశాం. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి రూపాయి ప్రజలకు చేరుతోంది. రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులేస్తున్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం. ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్తోంది. ఇలాంటి వారిపై మనం యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో కంటే అభివృద్ధి కోసం మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే మా హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం. అప్పులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కువ అప్పులు చేశామని అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోంది. విభజన నాటికి లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే... చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లకు చేరింది. రూ.4.12 లక్షల కోట్ల అప్పులతో మన ప్రయాణం ప్రారంభించాం. చంద్రబాబు హయాంలో అప్పులు రూ.4,12,288 కోట్లు చంద్రబాబు హయాంలో అప్పులు 21.87 శాతం పెరిగితే .. మన హయాంలో అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశాం. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఒక్కరికీ మంచి చేసింది లేదు. మన పాలనలో అందరికీ సంక్షేమం అందించాం. బాబు హయాంలో అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మనం అక్కచెల్లెమ్మల ఖాతాలో రూ.2 లక్షల 55 వేల కోట్లు వేశాం. పేదలకు అండగా నిలబడ్డాం. ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. చంద్రబాబు పొత్తులకోసం వెంపర్లాడుతున్నారు. జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా అంటకాగుతున్నారు. చంద్రబాబు మళ్లీ మోసపూరిత వాగ్ధానాలు ఇస్తున్నాడు. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయినా... ప్రజలకు చేసిందేమీ లేదు. ఇప్పటికీ బాబు ఏంచేశాడో చెప్పి ఓటు అడగలేకపోతున్నాడు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే స్కీం ఒక్కటైనా ఉందా?. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది.. వెన్నుపోటు. అన్ని సామాజిక వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్ తెస్తారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా చంద్రబాబు చేసిందేమీ కనిపించదు. నమ్మినవాడు మునుగుతాడు... నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. పేదలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. పక్క రాష్ట్రాల్లోని వాగ్ధానాలను తీసుకొచ్చి మళ్లీ మేనిఫెస్టోలో పెట్టారు. బాబు కనీసం మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు ఎందుకు?. వేరే రాష్ట్రాల్లో ఆకట్టుకున్న హామీలను చంద్రబాబు తీసుకొచ్చారు. మా హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చాం. 8 పథకాలకే రూ.52 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 650 వాగ్దానాలతో గత మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు అందులో 10 శాతం మాత్రమే అమలు చేశారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఇచ్చిన వాగ్ధానాలకు రూ.లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్లు అమలు చేస్తే రాష్ట్రం ఏమవుతుంది?. దీనిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. ఏమైనా అంటే చంద్రబాబు సంపద సృష్టిస్తాడని అంటారు. చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రంలో రెవెన్యూ ద్రవ్య లోటు వాగ్ధానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు. విశ్వసనీయతకు అర్ధం జగనే. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశాం. మేలు చేశాం కాబట్టే ప్రతి గడపకు ధైర్యంగా పోగలుగుతున్నాం అని సీఎం జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
CBN Petition: 17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు
-
స్కామ్ కారకులనే నాడు అప్రమత్తం చేశారు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంను చాలా స్కిల్ ఫుల్గా జరిపించి.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. సీమెన్స్ ఏజీ అనే జర్మన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో.. స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్ కంపెనీ ఇస్తుందని.. ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్టెక్కు చెల్లించారు. చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్డెవలప్మెంట్ కార్పొరేషన్ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. అంటే.. పుణే నుంచి ఈ స్కామ్ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు. -
లోకేశ్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు: కన్నబాబు పొలిటికల్ పంచ్
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా ఎల్లో మీడియా ఆణిముత్యాలు ఏరుకుంటోంది. పచ్చి అబద్దాలను వండి వారుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై నారా లోకేశ్ ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు అని ప్రశ్నించారు. లోకేశ్ పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు? కాగా, కురుసాల కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ఓ గజదొంగ. అవినీతిలో పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయాడు. కోర్టులను అడ్డుపెట్టుకుని దర్యాప్తులను ఆపుకోవడం బాబుకు అలవాటే. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ముడుపులు చేరాయి. చిన్న చిన్న ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన లోకేశ్.. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు?. స్పందించే దమ్ము లేకుంటే దొరికిపోయినట్టే.. అమరావతి లంచాల కోసం నిర్మించింది. అమరావతి పేరుతో అవినీతివతిని నిర్మించాలనుకున్నాడు. చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. చంద్రబాబు గ్యారెంటీలు, ష్యూరిటీలను ప్రజలు ఎప్పుడో చూసేశారు. ఇంతా జరుగుతున్నా ఎల్లో మీడియా మాత్రం స్పందించడం లేదు. ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. చెప్పే దమ్ము లేకుంటే దొరికిపోయినట్లు అర్థం. 2014లో ఇచ్చిన 600 హమీలకు దిక్కు లేదు. ఇప్పుడు మేం మీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తాం అంటున్నాడు. మూడు లేక నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు. దానిని హమీ అంటారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులతో చంద్రబాబుకు హైటెన్షన్ -
బయటపడిన చంద్రబాబు అసమర్ధత
-
బాబు హయాంలో గద్దర్ హత్యకు కుట్ర..
సాక్షి, హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్పై గతంలో ఐదు రౌండ్లు కాల్పులు జరిగిన ఘటన వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతోమంది విప్లవకారులను క్రూరంగా హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బాహాటంగా ఈ విషయాలు పేర్కొనడం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గద్దర్ మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. అందులో గద్దర్తో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూనే..ఆయనపై కాల్పులు జరపడం ద్వారా చేసిన హత్యాయత్నం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు నేతృత్వంలో దోపిడీ పాలకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్లదండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రజా సంఘాల్లో క్రియా శీలకంగా పనిచేస్తున్న అనేకమంది విప్లవ కారులను నల్లదండు ముఠాలతో క్రూరంగా హత్యలు చేయించారు. అందులో భాగంగా 1997లో గద్దర్పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు జరిపారు. ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లినా గద్దర్ ప్రాణాలతో బయటపడ్డారు..’అని వివరించారు. తనపై జరిగిన కాల్పులకు సంబంధించి విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించాలంటూ గద్దర్ ఎన్నో ఏళ్లపాటు ప్రభుత్వాలకు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓసారి ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి పాత సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తనపై హత్యకు కుట్ర జరిగిందని గద్దర్ చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక స్పెషల్ టీంను పెట్టి దోషులను అతి త్వరలో పట్టుకుంటామని ప్రకటించినా అది జరగలేదని తెలిపారు. అంతకు ముందు సైతం గద్దర్ పలు వేదికలపై, మీడియా ఇంటర్వ్యూల్లో తనపై కాల్పుల వెనుక చంద్రబాబునాయుడు ప్రభుత్వ కుట్ర ఉందని పేర్కొన్నారు. -
జగన్ పాలనపై ఒంగోలు కుర్రాడి లెక్కలు చూశారా?
సాక్షి, ఒంగోలు: ఏపీ ప్రజల్లారా.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత పాలనకు తేడాలు గమనిస్తున్నారా?. చంద్రబాబు హయంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోపోగా.. అదనంగా దొంగలముఠా అవినీతితో అడ్డగోలుగా దోపిడీకి గురైంది. ఆ గాయాలకు మందు రాస్తూనే.. సంక్షేమం ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో ఎంతటి భారానైన్నా భరిస్తూ ముందుకు సాగుతోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం . ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు సీఎం జగన్పాలనపై అద్భుతమైన ప్రజంటేషన్ ఇచ్చాడు. అభివృద్ధి.. సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి.. ఇప్పటి ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది లెక్కలతో సహా తేల్చి చూపించాడు ఒంగోలుకు చెందిన త్రిపర్ణో. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది.. ఏపీని అన్నింటా ఎలా వెనక్కి తీసుకెళ్లింది.. ఈ నాలుగేళ్ల ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేం చేసింది.. ఇంతకు ముందున్న ప్రభుత్వం-ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి తేడాలు ఉన్నాయనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. అభివృద్ధి అంటే కేవలం ధనికులు ఎదగడం మాత్రమే కాదని.. సగటు మనిషిని అభివృద్ధిలోకి తేవడమనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న సీఎం జగన్ తనకు ఆదర్శనీయమంటున్నాడు త్రిపర్ణో. అందుకే క్షేత్ర స్థాయిలో బాగా రీసెర్చి చేసి.. వాస్తవాలను కళ్లకు కట్టేలా ఈ ప్రజంటేషన్ను రూపొందించాడట. -
దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే!
కవల పిల్లల్లాంటి రామోజీరావు, చంద్రబాబునాయుడు ఎంత నిరాశా, నిస్పృహల్లో ఉన్నారంటే... తామేం చేస్తున్నామో తమకే తెలియనంత!. ఇది మనకు తెలియడానికి మంగళవారం నాటి ‘ఈనాడు’ పత్రిక మొదటిపేజీ చూస్తే చాలు. ఎందుకంటే ‘జగన్ ఏలుబడిలో ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు’ అంటూ ఓ బ్యానర్ కథనాన్ని వండిన ‘ఈనాడు’... ఆ విషయాన్ని ముందే చంద్రబాబుకు చెప్పటంతో బాబు హడావిడిగా ఓ వీడియో చేసి ట్విటర్లో పెట్టేశారు. ‘ఇది రాష్ట్రమా? రావణ కాష్టమా?’ అన్న చంద్రబాబు ట్విటర్ ప్రసంగాన్ని కూడా ‘ఈనాడు’ తన వార్త పక్కనే పెట్టింది. కాకపోతే రాజధాని ప్రాంతంలో బలహీనవర్గాలకు ఇళ్లు రాకుండా అడ్డుకుంటూ తామెన్ని కుట్రలు చేసినా పారలేదన్న ఉక్రోషం ఈ కవలలిద్దరినీ కుదిపేస్తోంది. ఆ దుగ్దతో.. ‘ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై ఆమోదం’ అనే వార్తను కూడా అక్కడే వేయాల్సి వచ్చింది. ఇదిగో... ఇక్కడే ఈ ‘నారామోజీ’ కుట్ర పచ్చగా బయటపడింది. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లింది ఈ నారా వారి ముఠానే. అంటే.. అక్కడ దళితులు ఉండకూడదని కోర్టులకెక్కి న్యాయపోరాటం చేసింది వీరే. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ దృఢ సంకల్పంతో వారి కుట్రల్ని అడ్డుకున్నారు. కింది నుంచి పైవరకూ కోర్టుల్లో పోరాడి మరీ... పేదలకు అనుకూలంగా ప్రభుత్వం గెలవగలిగింది. 51వేల మందికిపైగా పేదలకు ‘ఆర్–5’ జోన్లో ఇళ్ళ స్థలాలు కేటాయించింది. వాటిలో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ చొరవ తీసుకుని నేరుగా కేంద్ర పెద్దలను అభ్యర్థించి నిధులు సాధించారు. నిధులను అడ్డుకోవటానికి టీడీపీ, ఎంపీ రఘు రామకృష్ణరాజు కేంద్రానికి లేఖలు కూడా రాసినా... అవేవీ పనిచేయలేదు. సోమవారం కేంద్రం వీటికి ఆమోదం తెలియజేసింది. ఎస్సీ, ఎస్టీల విషయంలో ఇది ప్రభుత్వ విజయం కాబట్టి... దాని ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ‘ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు’ అంటూ రామోజీరావు తన పైత్యానికి పనిచెప్పారు. విధిలేక... తన అక్కసునంతా బయటపెట్టుకుంటూ... ‘ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఆగమేఘాలపై ఆమోదం’ అనే కథనాన్ని కూడా వేశారు. కాకపోతే ఆ కథనంలో కూడా... కేంద్రం ఇంత త్వరగా ఎందుకు అనుమతిచ్చింది? అసలు ఎందుకివ్వాలి? అనే రీతిలో తన బాధనంతా వ్యక్తంచేసింది. ఇది చాలు కదా.. దళితులు, పేదలు, బలహీనవర్గాలపై నిజంగా ఎవరికి మమకారం ఉందో చెప్పటానికి? ఎవరి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగిందో తెలియటానికి? బాబు జమానా... భయంభయం మాటల్లో అబద్ధాలుండొచ్చు. రామోజీ రాతల్లోనైతే ఇక చెప్పక్కర్లేదు. కానీ అంకెలు అబద్ధాలు చెప్పవు కదా!. చంద్రబాబు ప్రభుత్వ హయాంను తలచుకుంటే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు ఎందుకు ఉలిక్కి పడతారో అప్పటి అఘాయిత్యాల గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. 2014–19 మధ్య దేశంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యధికంగా దాడులు జరిగిన టాప్–10 రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. ఎస్సీలపై దాడుల్లో ఏపీ 9వ స్థానమైతే... ఎస్టీలపై దాడుల్లో ఐదో స్థానం. దక్షిణాది రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన రాష్ట్రాల్లో ఏపీది 3వ స్థానం. అదీ.. ‘ఈనాడు’ రాయని చంద్రబాబు పాలన. పెరిగిన భద్రత... తగ్గిన కేసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ కేసులతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలపై కేసుల (పీఓఏ) శాతం తగ్గడం ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమనే చెప్పాలి. 2019లో మొత్తం ఐపీసీ కేసుల్లో పీఓఏ కేసులు 1.7 శాతమే ఉండగా... 2020లో ఆ కేసులు మరింతగా తగ్గి కేవలం 1.1 శాతానికే పరిమితమయ్యాయి. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు సగటున ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బాగా తగ్గాయి. మార్గదర్శి అక్రమాలు వెలికి తీస్తున్నారనే సంజయ్పై అక్కసు దళితులంటే తనకు ఎంతటి ద్వేషమో రామోజీరావు మరోసారి బయటపెట్టుకున్నారు. సీఐడీ అదనపు డీజీ హోదాలో ఉన్న దళిత అధికారి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని ‘ఈనాడు’ కొన్ని రోజులుగా అవాకులు చెవాకులు రాస్తూనే ఉంది. కారణం... ఆయన మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలను వెలికి తీస్తుండటమే. దశాబ్దాలుగా తాము నిర్మించుకున్న ఆర్థిక అక్రమ సామ్రాజ్యం సీఐడీ దర్యాప్తుతో కుప్పకూలుతుండటంతో రామోజీకి దిక్కు తోచక... దళిత అధికారి సంజయ్ని పత్రికాముఖంగా బెదిరించడానికి దిగారు. ఆయన అధికారి హోదాలో నిర్వహించిన మీడియా సమావేశ వివరాలను కూడా యథాతథంగా కాకుండా వక్రీకరించి ప్రచురించడం ద్వారా తన దిగజారుడు పాత్రికేయాన్ని బయటపెట్టుకున్నారు. తిరుపతి ఆటోనగర్లో రామోజీరావు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆరె అజయ్కుమార్, కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు మీడియా ట్రయల్స్పై ‘ఈనాడు’ గురివింద నీతి మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కావటంతో బెంబేలెత్తుతున్న రామోజీ... గురివింద నీతిని ప్రదర్శిస్తుండటం హాస్యాస్పదమే. మార్గదర్శి అక్రమాలపై మీడియాలో కథనాలు వస్తున్నాయని... మీడియానే విచారణ చేసేస్తోందని శైలజా కిరణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విడ్డూరం కాక మరేమిటి? దశాబ్దాలుగా ఎన్నెన్నో వ్యవహారాల్లో ‘ఈనాడు’ దర్యాప్తు చేసి... తీర్పులిచ్చేసి... నిర్దోషుల్ని సైతం బజారుకీడ్చిన సంఘటనలు ఎన్ని ఉన్నాయో తెలియదా? ఎందరి బతుకుల్ని బుగ్గి చేశారో మరిచిపోయారా రామోజీ? పత్రిక ద్వారా మీ ప్రత్యర్థులను వేధించిన తీరు తెలియనిదెవరికి? చంద్రబాబును అడ్డదారిలో సీఎంను చేసేందుకు అనాటి సీఎం ఎన్టీ రామారావు, ఆయన సతీమణి లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఈనాడు సాగించిన దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అవహేళన, మహిళలను అవమానించేలా ఈనాడు వేసిన కార్టూన్లు, రాసిన కథనాలు పాత్రికేయ విలువలకు మాయని మచ్చ లాంటివే. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే రామోజీరావులోని వికృత పాత్రికేయం మరోసారి జడలు విప్పింది. పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం గుర్తు లేనిదెవరికి? ఇప్పుడు మార్గదర్శి చిట్స్ అక్రమాలు బట్టబయలవుతుంటే మాత్రం మీడియాలో వార్తలు రాయకూడదన్నట్టు బెదరింపులేల? నాడు: ఫిర్యాదు చేయాలంటేనే హడల్... ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అని సభాముఖంగా వ్యాఖ్యానించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి హయాంలో ఎస్సీ, ఎస్టీల భద్రత బాగుంటుందని అనుకోగలమా? ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దంటూ కోర్టులకెళ్లిన వ్యక్తి పాలనలో వారికి న్యాయం జరిగిందనగలమా? ‘ఎస్సీలకు పరిశుభ్రంగా ఉండడం రాదు, వారు స్నానాలు చేయరు’ అంటూ నీచంగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని నెత్తిన పెట్టుకుని పదవిలో కొనసాగించిన బాబు హయాంలో... తమపై అఘాయిత్యాలు జరిగినపుడు ఫిర్యాదు చేసే ధైర్యం ఎస్సీ, ఎస్టీలకు ఉందనుకోగలమా? పైపెచ్చు కేసుల సంఖ్య తక్కువగా చూపించేందుకు టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులను అసలు స్వీకరించేది కాదు. ధైర్యంచేసి బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని బెదిరించి వెనక్కి పంపేసేవారు. కేసులే నమోదు చేయరు కనక దోషులకు శిక్షలు అన్న ప్రసక్తే ఉండేది కాదు. నేడు: ఆ వర్గాల చేతిలోనే హోంమంత్రి పదవి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలోను, తరవాత మార్చిన మంత్రివర్గంలోను రెండుసార్లూ హోంమంత్రి పదవి ఎస్సీ వర్గీయులకే ఇచ్చారు సీఎం జగన్. అది కూడా.. మహిళలకు. ఆ చిత్త శుద్ధి వల్లే... ఎస్సీ, ఎస్టీలపై దాడుల నియంత్రణ సాధ్యమైంది. పైపెచ్చు బాధితులకు ప్రభుత్వం అండగా ఉందన్న నమ్మకం కలిగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు, దిశ పోలీసింగ్ వ్యవస్థ... తదితర సంస్కరణలతో సమూల మార్పులు సంభవించాయి. దాడులు, వేధింపులకు గురైన ఎస్సీ, ఎస్టీలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా పర్వా లేదు... బాధితులకు న్యాయం జరగాలి...దోషులకు శిక్షలు పడాలి అనే విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తోంది ఈ ప్రభుత్వం. దున్నపోతుకు ఈనాడు పత్రికను తినిపిస్తున్న నేతలు సకాలంలో ఛార్జిషీట్లు... కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకు కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు వేయడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 2020లో 691 కేసులు, 2021లో 1,172 కేసులు, 2022లో 1,173 కేసులు మొత్తం 3,036 కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేయడం రికార్డు. 2014–19 మధ్య ఒక కేసు దర్యాప్తుకు సగటున 206 రోజులు పడితే ఈ ప్రభుత్వ హయాంలో సగటున 86 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. 2014–19 మధ్యలో కేవలం 44 శాతం కేసుల్లోనే సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేస్తే ఈ ప్రభుత్వ హయాంలో 73 శాతం కేసుల్లో సకాలంలో ఛార్జిషీట్లు వేశారు. ఇవీ... ఈనాడు రాయని నిజాలు. ఎస్సీ, ఎస్టీల కేసుల్లో టీడీపీ హయాంలో శిక్షపడ్డ వారి శాతం 2018లో 5.7 శాతం ఉండగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019లో ఇది 6.8శాతానికి పెరిగింది. పెండింగు కేసులపై ఈనాడు వక్రభాష్యం ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి 66.25 శాతం కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉందని ‘ఈనాడు’ పేర్కొనటం పచ్చి అబద్ధం. దర్యాప్తు పూర్తయి న్యాయస్థానంలో విచారణ కోసం ఉన్న కేసుల్ని పెండింగ్ కేసులంటే ఎలా? న్యాయస్థానాల్లో వివిధ సమస్యల కారణంగా సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కేసుల గురించి రామోజీరావుకు తెలియదా? వాటిని పెండింగ్ కేసులని వక్రీకరించడం దుర్బుద్ధి కాదా? జనవరి 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి 3989 కేసుల్లో ఛార్జిషీట్లు వేయగా ఇప్పటికి 1384 కేసులు పరిష్కారమయ్యాయనే వాస్తవాన్ని ఎందుకు చెప్పరు రామోజీ? -
చక్కెర కర్మాగారాలకు ఉరేసింది చంద్రబాబే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలకు ఉరేసిందే చంద్రబాబు. ఆయన ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల కారణంగా అనేక సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వేలాది రైతులు, కార్మికులు రోడ్డున పడ్డారు. చివరకు వారికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా చంద్రబాబు బకాయి పెట్టారు. ఈ వాస్తవాలను వదిలేసిన ఈనాడు పత్రిక మూతపడ్డ ఆ ఫ్యాక్టరీలకు మళ్లీ ప్రాణం పోస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు ఉపసంఘం వేసింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించింది. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ మొదలయ్యేలా చేసింది. కానీ సామర్థ్యానికి తగినట్టుగా చెరకు ఉత్పత్తి లేదు. దీంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు మేలు చేయడం కూడా నేరమన్నట్టుగా రామోజీ తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ బురద రాతలు రాస్తున్నారు. రామోజీ ముసుగేసిన వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: చక్కెర కర్మాగారాలను మూతపడేలా చేశారు వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు.. చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో 2003–04లో వాటిని మూతపడేటట్టు చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం మినహా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేయడంతో పదింటికి తొమ్మిది మూతపడ్డాయి. బాబు నిర్వాకం వల్ల ప్రైవేటు రంగంలో ఉన్న కర్మాగారాలపై ఆ ప్రభావం పడింది. ఈ రంగంలోని 19కి 15 మూతపడేలా చేశారు. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ సుగర్స్లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఏజే సుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి పడిపోయాయి. ఇదంతా బాబు నిర్వాకం వల్లనే అన్నది సుస్పష్టం. ఆరోపణ: రైతులకు ప్రోత్సాహమేదీ? వాస్తవం: బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్వాకంతో అవి మళ్లీ మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు మూతపడటం, ప్రభుత్వాల ప్రోత్సాహం కరవవడంతో చెరకు రైతులు ఇతర పంటల వైపు మళ్లారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరకు ప్రస్తుతం 35 వేల హెక్టార్లకు పడిపోయింది. సహకార, ప్రైవేటు కర్మాగారాల ద్వారా ఒకప్పుడు కోటి టన్నులకు పైగా క్రషింగ్ జరగ్గా, ప్రస్తుతం 23 లక్షల టన్నులకు పరిమితమైంది. ఆరోపణ: రైతులు, ఉద్యోగులను ఆదుకున్నదెవరు? వాస్తవం: సహకార రంగంలో ఉన్న కర్మాగారాలను మూతపడేలా చేయడమే కాదు.. రైతులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన వందల కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రూ.167.60 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 108 కోట్లలో రూ.14 కోట్లు ఇప్పటికే చెల్లించింది. మరో 94 కోట్లు జూలైలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరోపణ: ఆ కర్మాగారాలను పునరుద్ధరించలేదేమి? వాస్తవం: బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఏ కర్మాగారమైనా పూర్తి స్థాయిలో నడవాలంటే ముడిసరుకు అవసరం. కానీ వీటి పరిసర ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఫ్యాక్టరీల సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకడంలేదు. ఫలితంగా పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా క్రషింగ్ జరిపే పరిస్థితి లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని ఆధునికీకరించినా క్రషింగ్ చేసేందుకు ముడిసరుకైన చెరుకు దొరికే పరిస్థితి లేదు. ఆరోపణ: ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే? వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చడం ద్వారా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి కలిగించాలన్నది ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మిస్తోంది. కర్మాగారాలకు చెందిన గజం స్థలం కాదు కదా.. వాటికి చెందిన పూచిక పుల్ల కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏకోశానా లేదు. కేవలం నిర్వహణ మాత్రమే.. అదీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, నిర్వహణకు ముందుకొచ్చే సంస్థలకు లీజుకివ్వాలని సంకల్పించింది. ఇందులో తప్పేముంది? ఏదైనా ప్రభుత్వ స్థలం లేదా ఆస్తులున్నాయంటే దొడ్డి దారిన తన అనుయాయులకు కట్టబెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నైజం. ఇదే రీతిలో చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, జంపని సుగర్ ఫ్యాక్టరీలను తన అనుయాయులకు కట్టబెట్టిన చరిత్ర బాబుదే. ఇలా వేల కోట్ల విలువైన ఆస్తులను కట్టబెట్టారు. కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా రైతులకు, సంబంధిత వర్గాల వారికి మేలు చేయాలనే నిత్యం ఆలోచన చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రామోజీకి మాత్రం కళ్లెదుట ఉన్న ఈ వాస్తవేలేవీ కనిపించవు. నిత్యం పైత్యపు రాతలతో కాలకూట విషం కక్కుతూనే ఉన్నారు. -
పేదల సొంతింటి కలను కలగానే మిగిల్చిన చంద్రబాబు
-
Chandrababu: మలుపు తిప్పిన ముఠా! పవన్ కల్యాణ్కూ వాటా
సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో నారా చంద్రబాబునాయుడు సాగించిన భూదందాలో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంశం ఓ అవినీతి అధ్యాయమేనని వెల్లడైంది. అలైన్మెంట్ ప్రతి మెలికలోనూ పచ్చ గ్యాంగ్ అవినీతి గుట్టు రట్టవుతోంది. టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పొంగూరు నారాయణ అవినీతి బాగోతాలు విస్తుపోయే రీతిలో ఉన్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన లింగమనేని రమేష్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి వెంటనే రూ.877.50 కోట్లకు... రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం ఎల్లో గ్యాంగ్ బరి తెగింపు వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. అవినీతికి బాటలు వేసిన ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక సాగిన గూడుపుఠాణీ దశలవారీగా ఇదిగో ఇలా సాగింది..! అలైన్మెంట్ –1 సీఆర్డీఏ తొలుత రూపొందించింది అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్ణయించేందుకు టెండర్ల ద్వారా కన్సల్టెన్సీతో నిమిత్తం లేకుండా పని ముగించాలని చంద్రబాబు, నారాయణ నిర్ణయించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు 94 కి.మీ. పొడవుతో అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రూపొందించారు. దీన్ని చూసి చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే దాని ప్రకారం ఇన్నర్రింగ్ రోడ్డు పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెంచుకునేందుకు ఆ అలైన్మెంట్ను మార్చాలని ఆదేశించారు. అలైన్మెంట్ – 2 చంద్రబాబు ఆదేశాలతో రూపొందించారు గత సర్కారు పెద్దల ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కీలక మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజా ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటూ ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని మరీ ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్మెంట్ను రూపొందించారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలైన్మెంట్–3 కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించింది సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్ప్లాన్లోనే ప్రతిపాదిత ఇన్నర్రింగ్ రోడ్ డిజైన్ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. అనంతరం ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ను రూపొందించేందుకు ఎస్టీయూపీ అనే ఓ కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే అది ఉండాలని నిర్దేశించారు. అప్పటికే సీఆర్డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్మెంట్ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. అలైన్మెంట్ను ఆనుకుని భూములు ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మెలికలు తిప్పడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఆ భూములకు 3 కి.మీ. దూరంగా ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించాలి. అలైన్మెంట్ మార్పుతో ఆ భూములను ఆనుకుని ఉండేలా ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఆనుకునే హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 9 ఎకరాలు ఒకచోట, ఒప్పందం చేసుకున్న నాలుగు ఎకరాలు మరో చోట ఉండటం గమనార్హం. అమాంతం పెరిగిన విలువ ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. అక్కడే పవన్ కల్యాణ్కు 2.40 ఎకరాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ ఇన్నర్రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలోనే పవన్కల్యాణ్కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా ఇవతలా అవినీతి మెలికలే అమరావతి పరిధిలో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ద్వారా చంద్రబాబు, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతం పెంచుకోగా కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప నుంచి ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ఈ అలైన్మెంట్పై నారాయణ నాడు సీఆర్డీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్మెంట్ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్రింగ్ రోడ్డును నిర్మిస్తారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఉండేలా ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఖరారు చేశారు. తన విద్యా సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా నారాయణ చక్రం తిప్పారు. అటూ ఇటూ భారీగా కొనుగోలు ఇన్నర్రింగ్ రోడ్డును ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. -
ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్ ప్రో కో గుట్టురట్టు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం.. అమరావతిలో చంద్రబాబు క్విడ్ ప్రోకో కు ఓ మచ్చు తునకని నిగ్గు తేలింది. అమరావతిలోని సీడ్ క్యాపిటల్లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూబాగోతానికి నిదర్శనమని నిర్ధారణ అయ్యింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ అమరావతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బట్టబయలు చేసింది. దాంతో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కేంద్ర బిందువుగా ఏ–1 నారా చంద్రబాబు, ఏ–2 పొంగూరు నారాయణ యథేచ్ఛగా సాగించిన భారీ భూ దోపిడీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, అవినీతిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తన అవినీతి బట్టబయలు కాకుండా చంద్రబాబు కొన్నేళ్లుగా అడ్డుకుంటున్న కుట్రలకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాజధాని ల్యాండ్ పూలింగ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో పచ్చ ముఠా అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బాబు, నారాయణవి అక్రమ ఆస్తులే అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న క్రిమినల్ లా ఆర్డినెన్స్ ప్రకారం అనుమతించాలని సీఐడీ కోరింది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం–1988 ప్రకారం లింగమనేని కుటుంబం క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు ఇచ్చిన కరకట్ట నివాసం.. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నారాయణ బినామీల పేరిట పొందిన 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దాంతో సీఐడీ ఆ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించి, ఆ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఉపక్రమించనుంది. తదుపరి దశల్లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తోంది. భారీ అవినీతికే ‘మాస్టర్ ప్లాన్’ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పునాది వేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజస్తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అడ్డగోలుగా అప్పగించేశారు. దాంతో చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. క్విడ్ ప్రోకో కిందే కరకట్ట నివాసం చంద్రబాబు, లింగమనేని క్విడ్ ప్రో కో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్ నిర్ధారించింది. లింగమనేని కుటుంబ సభ్యుల భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చేసినందుకు చంద్రబాబుకు భారీగా ముట్టజెప్పారు. ఇన్నర్రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టలేదు. లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు ఇవ్వడం గమనార్హం. పక్కా క్విడ్ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కరకట్ట నివాసంపై బాబు కట్టుకథలు కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీతంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ (ఇంటి అద్దె అలవెన్స్) కూడా తీసుకున్నారు. అంటే ప్రజాధనం నుంచి సీఎంగా ఇంటి అద్దె అలవెన్స్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఇంటి అద్దె అలవెన్స్ను ప్రజాధనం నుంచి తీసుకుంటున్న చంద్రబాబు.. తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదన్నది నిర్ధారణ అయ్యింది. క్విడ్ ప్రో కోలో భాగంగా ఆ నివాసం చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు కాబట్టే అద్దె చెల్లించలేదు. దేశ భక్తితో ఇచ్చారట! కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని లింగమనేని రమేశ్ న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరి ఉచితంగా ఇచ్చిన ఇంటికి చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్ను ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఆ ఇంటిని ప్రభుత్వానికి అప్పగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. ఆ నివాసం ప్రభుత్వానికి చెందుతుంది. కానీ 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్ ప్రో కోలో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది దీనినిబట్టి కూడా నిర్ధారణ అయ్యింది. లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్కు భూమి 2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 4 ఎకరాలను ‘కొనుగోలు చేసినట్టు’ చూపించడం గమనార్హం. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్ ఫుడ్స్కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేశ్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి కూడా అయిన లోకేశ్ అదే లింగమేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు. సీడ్ క్యాపిటల్లో వేళ్లూనుకున్న అవినీతి ► అమరావతిలో అత్యంత ప్రధానమైన సీడ్ క్యాపిటల్లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే శాసనసభ, సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించారు. ► ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి, సీడ్ క్యాపిటల్లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా చంద్రబాబు, నారాయణ పన్నాగం పన్నారు. సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించింది. కానీ ఆ ప్లాన్ను బహిర్గతం చేయకుండా, ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు. ► ఆ సమయంలోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. వారి పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ► రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. ► కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ► అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. వాటిలో 7,620 చదరపు గజాలు, 8,880 చదరపు గజాలు, 6,550 చదరపు గజాలు, 25 వేల చదరపు గజాల స్థలాలు కూడా ఉన్నాయి. అవి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం. ► భవిష్యత్లో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రా>పూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది. వారి భూముల వద్దే ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రూపొందించడంలో చంద్రబాబు, నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. వారి భూములను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను రూపొందించారు. లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు, నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తమ భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల భూముల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను ఖరారు చేయడం గమనార్హం. అందుకోసం ముందుగానే ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వకుండా సీఆర్డీయే నిలుపుదల చేసింది. అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంట్ను రూపొందించకముందే చంద్రబాబు, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించాలో నిర్ణయించేశారు. అప్పటికే నిర్ణయించిన అలైన్మెంట్ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీని నియమించి కనికట్టు చేశారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక వాస్తవానికి విజయవాడలోని కామినేని ఆస్పత్రి వద్ద ఉన్న తాడిగడప– ఎనికేపాడు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్టీయూపీ అలైన్మెంట్ను రూపొందించింది. అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూముల మీదుగా రోడ్డును నిర్మించాల్సి వస్తుంది. దీనిపై అప్పటి సీఆర్డీయే వైస్ చైర్మన్గా ఉన్న నారాయణ సీఆర్డీయే సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాడిగడపకు 3 కి.మీ. దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు– నిడమానూరు మీదుగా ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను మార్పించారు. -
చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అసలు ఈ కేసులో మొదట నుంచీ ఏం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. ►చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ►2019 జూన్ 26న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలపై తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ►విధానపరమైన లోపాలు, న్యాయపరమైన తప్పిదాలు, ఆర్థిక అక్రమాలు, మోసపూరిత లావాదేవీలను గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ ►సీఆర్డీయే సహా పలు ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ ►డిసెంబర్ 27, 2019న తొలినివేదిక ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీ చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక ►కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై తదుపరి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ. కేబినెట్ సబ్ కమిటీ గుర్తించిన అంశాలపై చర్చ ►దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించిన స్పీకర్. సిట్తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం ►ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 21, 2020లో సిట్ ఏర్పాటు ►10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►సిట్ గుర్తించిన అంశాలపై దర్యాప్తు చేసి కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసే అధికారాన్ని సిట్కు అప్పగించిన ప్రభుత్వం ►అవసరమైన పక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం, దర్యాప్తులో వారితో సమన్వయం చేసుకోవాలని సిట్కు నిర్దేశించిన ప్రభుత్వం ►ఎరినైనా విచారణ చేయడానికి, సీఆర్పీసీ ప్రకారం వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి సిట్కు అధికారం ►దర్యాప్తునలో ఏ అంశానికైనా సంబంధించి ఏ రికాక్డునైనా పరిశీలించే అధికారం సిట్కు ఉంది కోర్టుకెక్కిన టీడీపీ: ►సిట్ ఏర్పాటును, దర్యాప్తును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన తెలుగు దేశం పార్టీ. టీడీపీ నాయకులు వర్లరామయ్య, ఆలపాంటి రాజేంద్ర ప్రసాద్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు ►తమ పార్టీ ప్రయోజనాలకోసమే పిటిషన్లు దాఖలు చేశామని వెల్లడించిన వర్ల రామయ్య ►మార్చి 4, 2020న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య ►మార్చి 10న మరో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వర్ల రామయ్య జీవోలను పక్కనపెట్టాలని పిటిషన్దాఖలు ►మార్చి 23, 2020న కేంద్ర ప్రభుత్వానికి లేఖ. అమరావతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇలా: ►సెప్టెంబరు 16, 2020న ఈకేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అంతకుముందు మీడియాలో వార్తలు కూడా ప్రసారం చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. ►అమరావతి ప్రాంతంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో… వివరాలను కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►సీబీఐ దర్యాప్తునకు రాసిన లేఖనూ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►ఈడీ ఈసీఐఆర్ నమోదుచేసిన విషయాన్నీ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►ఈ కారణంగా - కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ప్రతివాదులుగా చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థననూ తోసిపుచ్చిన కోర్టు ►ప్రత్యేక కోర్టు ఏర్పాటు లాంటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను కొట్టిపారేసిన జస్టిస్ డీవీ సోమయాజులు ►గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్న హైకోర్టు ►రాష్ట్ర ప్రభుత్వం అధికారాల ప్రయోగానికి పరిమితులు ఉన్నాయన్న హైకోర్టు ►గత ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, నిర్దిష్టమైన, బలమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే పక్కకు తప్పుకోవాలన్న కోర్టు ►గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించాలంటే శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, స్వతఃసిద్ధ అధికారాలు లేవన్న హైకోర్టు ►ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు కట్టబెడుతూ ఎలాంటి చట్టం లేదన్న కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే..? ►హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ►ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం ►దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదన ►ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు ►గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో వ్యాఖ్యానించిన సుప్రీం ►సిట్ నియామకంపై హై కోర్ట్ ఇచ్చిన స్టే ను కొట్టి వేసిన సుప్రీం కోర్టు ►ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం ►చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ►దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు ►సిబిఐ , ఈడీ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదు ►సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదు ►జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదన్న సుప్రీం ►పిటిషన్ ను తాజాగా విచారించే సమయంలో , ఈ కేసును సిబిఐ, ఈడీకి పంపుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హై కోర్ట్ పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట -
చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే.. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్ సబ్ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా ఆధారాలు బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. టీడీపీ నేతలు, ప్రముఖులు రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. నారా లోకేష్ బినామీ వ్యవహారం.. నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్. 👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్(దివంగత మాజీ స్పీకర్)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. సంస్థల కేటాయింపుల్లోనూ.. వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ -
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట
ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. ఆ సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. ఈ తరుణంలో.. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. మరోవైపు అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాల లో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలిగాయి. ఇక కేసు విచారణ సమయంలో.. సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి?. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది బెంచ్. బలంగా ఏపీ ప్రభుత్వ వాదనలు.. ఇక ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని, ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదనలు వినిపించింది. దీంతో ఏపీ ప్రభుత్వ వాదనలతో జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్ను నిజంగా అంత అభిమానిస్తే అలా ఎలా చేశావ్?
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement