breaking news
Chandrababu Naidu government
-
సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..
-
సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్
-
మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
-
ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి
-
అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?
-
మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్
-
గర్జించిన ఉపాధ్యాయులు
సాక్షి, అమరావతి/మంగళగిరి రూరల్: చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహోదగ్రులయ్యారు. ‘లోకేశ్ రాజీనామా చేస్తావా.. లేక టెట్ రద్దు చేస్తావా’ అంటూ గర్జించారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్తో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని (విద్యాభవన్)ముట్టడించేందుకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. పోలీసులను ప్రయోగించి వారి గొంతునొక్కే ప్రయత్నం చేసింది. విద్యాభవన్కు టీచర్లు చేరుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టించింది. సర్వీసు రోడ్లను సైతం మూసివేయించింది. పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తూ విద్యాభవన్ వైపు ఉపాధ్యాయులు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్లు చేశారు. 150 మందికి పైగా ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. టీచర్లంటే అంత నిర్లక్ష్యమా! కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తమ ఆవేదనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీచర్లంటే అంత నిర్లక్ష్యమా బాబూ’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాదాపు 30 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన తాము టెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగం వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టామని.. బైక్ ర్యాలీలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో చలో విద్యాభవన్కు సిద్ధమయ్యామని తెలిపారు. పీఆర్సీ వేయకపోయినా, ఐఆర్, డీఏలు ఇవ్వకపోయినా ప్రశ్నించని తాము ఉద్యోగ భద్రత కోసం విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వచ్చిందని వాపోయారు. ఉపాధ్యాయుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశి్నంచారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులను ప్రయోగించి నిర్భందించడం తమ గొంతు నొక్కడమేనని వాపోయారు. అవసరమైతే నిరవధిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు. టీచర్ల ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, సహాధ్యక్షురాలు కుసుమకుమారి, కార్యదర్శి మనోహర్కుమార్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ప్రధాన డిమాండ్లు ఇవీ⇒ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి ⇒ విద్యాహక్కు చట్టంలోని 23(1) సవరించాలి⇒ టెట్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి ⇒ బోధిస్తున్న సబ్జెక్టుపైనే టెట్ నిర్వహించాలి⇒ టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి -
పోలవరానికి మరో ద్రోహం కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన (డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో వచి్చనా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ను 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టకేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపింది. విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి.. తాజా ధరలు, పనుల పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని రీయింబర్స్ చేయాలన్న విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్లముందు కరిగిపోతున్న స్వప్నం నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగిపోతుండటంతో రైతులు, సాగు నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాస వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
‘యువగళం పోస్టింగ్స్’.. లోకేశ్ టీమ్కు టీచర్ ఉద్యోగాలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీఎం చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ అక్రమాలమయంగా మారిందనేందుకు మరిన్ని బలమైన ఆధారాలు, కొత్త కోణాలు, సంచలన వాస్తవాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిభావంతులను దగా చేస్తూ, అర్హులకు ద్రోహం తలపెట్టి మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గోప్యతకు, పారదర్శకతకు చంద్రబాబు సర్కారు తూట్లు పొడిచింది. అసలు పరీక్షే లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో ఇష్టారాజ్యంగా టీచర్ ఉద్యోగాలను ఇవ్వడం.. జాతీయ స్థాయిలో పతకాలు పొందినవారిని పక్కనపెట్టి కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేయడం.. ఆ పోస్టులకు బేరం పెట్టిన వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ వైరల్ కావడం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయడంతోపాటు మొత్తం ప్రక్రియపై సీబీఐతో విచారించాలని ఇప్పటికే నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్జీ డిమాండ్ చేస్తుండగా తాజాగా కర్నూలులో మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీస అర్హత మార్కులు సాధించడంలో విఫలమైన వారిని సైతం మెగా డీఎస్సీ ద్వారా టీచర్లుగా పోస్టింగ్లు ఇవ్వడం చంద్రబాబు సర్కారు బరి తెగింపు చర్యలకు పరాకాష్టగా విద్యావేత్తలు, పరిశీలకులు పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఎంతో కీలకం. టెట్ మార్కులను బట్టి తలరాతలు మారిపోతుంటాయి. ఇక ఇప్పటికే దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లకు సైతం టెట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అలాంటిది కొత్తగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో టెట్ క్వాలిఫై కాకున్నా టీచర్ పోస్టు కేటాయించటాన్ని బట్టి ఈ ప్రక్రియ ఎంత దారుణంగా జరిగిందో ఊహించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ‘అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరేనా..? పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరి చేతికేనా? ఇది స్కామ్కు నాంది కాదా? అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనడం.. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్ ర్యాంకర్గా నిలవడం నిజం కాదా? మరి టాప్ ర్యాంకర్కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? 1 : 1లో వెరిఫికేషన్కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’ 336 కేసులు వేశారంటూనే.. ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయిస్తారా? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై కేసు నమోదైనా సూత్రధారులెవరో బయట పెట్టరా? స్కామ్కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా? న్యాయం జరగాలంటే సీబీఐతో విచారించాల్సిందే. నైతిక బాధ్యతగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే..’ అని స్పష్టం చేస్తున్నారు. టెట్ క్వాలిఫై కాకున్నా ఎస్జీటీ పోస్టింగ్.. మెగా డీఎస్సీలో కనీసం టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫై కాకుండానే చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు బహిర్గతమైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీ స్కూల్లో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ప్రభాకర్ను ఎస్జీటీ టీచర్గా నియమించినట్లు తాజాగా తేలింది. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో బుధవారం విచారించిన జిల్లా విద్యాధికారి వాస్తవమేనని నిర్ధారించడం సంచలనం రేపుతోంది. ఒక్క ప్రభాకరే కాకుండా జిల్లావ్యాప్తంగా స్పోర్ట్స్ కోటాలో సుమారు 25 మంది ఇలా టీచర్ ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదని తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి రావడం ఖాయం. మరోవైపు స్పోర్ట్స్లో ఎలాంటి నైపుణ్యం లేకున్నా చాలామంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ వ్యవహారం బయటకు పొక్కడంతో వారంతా బెంబేలెత్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు టీచర్లు సెలవులో వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీల కలకలం.. కర్నూలుకు చెందిన ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్, దూరవిద్యా కేంద్రంలో పని చేస్తున్న మరోవ్యక్తి, నెల్లూరుకు చెందిన క్రీడా అసోసియేషన్ నాయకుడితో కలసి మెగా డీఎస్సీలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించినట్లు సమాచారం. వీరితోపాటు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే తరహాలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కడప అనంతపురం జిల్లాల్లోనూ నకిలీ స్టోర్ట్స్ సర్టిఫికెట్లతో చాలామంది మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్ యువగళం టీమ్కు టీచర్ జాబ్స్..! నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో చురుగ్గా పనిచేసిన వారిలో చాలామందికి మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. యువగళంలో ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన టీమ్ సభ్యులకు ఈ తరహాలో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్ టీమ్లో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ మొత్తం వ్యవహారం నడిపించినట్లు టీడీపీలోని ఓ వర్గం చర్చించుకుంటోంది. సవాల్ స్వీకరించకుండా చినబాబు దబాయింపు..!ఇప్పటికే మెగా డీఎస్సీలో అక్రమాలను మీడియా సాక్షిగా ఎండగట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరితే మంత్రి లోకేశ్ తోక ముడిచారు. దీన్ని కప్పిపుచ్చేందుకు గత ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా పూర్తయిన గ్రూప్ 1 నియామకాలపై దు్రష్పచారానికి తెర తీశారు. నిజంగానే మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టడం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అవన్నీ అమ్మకానికి పెట్టిన ఉద్యోగాలేనని, ఈ వ్యవహారం విద్యాశాఖా మంత్రి కనుసన్నల్లోనే జరిగినట్లు కర్నూలు డీఈవో కార్యాలయంలోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇక స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలివ్వడానికి టెట్ అక్కర లేదని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇన్ సర్వీసు టీచర్లకు మాత్రం టెట్ తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు. -
విధుల్లో ఉన్న పోలీసుపై దాడి.. గోప్యంగా విషయం?
-
చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి
-
దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు
-
Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?
-
బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం
-
జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి
-
అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు
-
ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?
-
ఆదాయం అంతా ఉద్యోగులకు జీతాలకే సరిపోతుందని ఎలా మాట్లాడుతారు?
-
గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మారిక వలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులను వారికి నచ్చిన చోట చదువుకోనివ్వాలని హితవు పలికారు. ఈ పాఠశాల తరలింపునకు నిరసనగా విద్యార్థులు, తల్లిదండ్రులకు బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులపై దమనకాండకు పాల్పడడం సరికాదన్నారు. ‘తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు వస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతు నొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధం చేస్తారా? వారు చేసిన తప్పేమిటి?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ హయాంలోనే గురుకులాలు ఏర్పాటు‘విశాఖపట్నం మారిక వలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్సార్ హయాంలో ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సలహాలు, సూచనలతో దేశంలోనే ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆయా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.మా హయాంలో ఎన్నో సౌకర్యాలు సమకూర్చాం మా ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా వీటిలో మరిన్ని సౌకర్యాలను సమకూర్చి, మరింత అభివృద్ధి చేయడమే కాకుండా ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపర్చాం. మంచి ఫలితాలను కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40 వేలతో పాటు వారికి ల్యాప్ట్యాప్లు కూడా ఇచ్చాం. ఇప్పుడు వీటన్నింటినీ పట్టించుకోకుండా బాగా నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను బలవంతంగా తరలించి ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖ లాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందల మంది విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు.గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ, వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటారా? చంద్రబాబూ.. మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు. మీరు పెడతామంటున్న కొత్త వాటిలో ఇంటర్మీడియట్ నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్తో పెట్టిన స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లను నిర్వీర్యం చేయడం సరికాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చిన చోట చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకుల పట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్
-
చంద్రబాబు సర్కారుపై ఏపీ ఉద్యోగుల సమరశంఖం. పీఆర్సీ, పెండింగ్ డీఏల జారీ కోసం భారీ ప్రదర్శనలతో కలెక్టరేట్లకు తరలివెళ్లిన ఉద్యోగులు
-
సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాటు ఎదురుచూసిన ఉద్యోగులు ఇక చాలు అనుకున్నారు. చంద్రబాబు సర్కారుకు మొరపెట్టుకోవడం చెవిటివాడి ముందు శంఖమూదిన చందంలా ఉందన్న నిర్ణయానికి వచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి, చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకు పోరాటం తప్ప వేరే గత్యంతరం లేదని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. పోరాటం ప్రారంభించారు. పీఆర్సీ, మధ్యంతర భృతి (ఐఆర్), 5 పెండింగ్ డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమాన్ని ప్రారంభించారు. 26 జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు, డీఆర్ఓలకు జేఏసీ జిల్లాల నేతలు తాము ఉద్యమంలోకి వెళుతున్నట్లు నోటీసులు అందించారు. తమ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ను కూడా దానికి జత చేశారు. ఈ కార్యక్రమానికి అన్నిచోట్లా ఉద్యోగులు భారీ ర్యాలీగా కలెక్టరేట్లకు తరలివెళ్లారు. ‘సీఎం సార్ మా డబ్బులు మాకు చెల్లించండి’ అనే నినాదాలతో సోమవారం కలెక్టరేట్లు మార్మోగాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. 1వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలతో నిరసనఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులంతా తమ సెల్ఫోన్లో వాట్సాప్ డీపీగా ‘సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదాన్ని పెట్టుకుంటారని నోటీసుల్లో పేర్కొన్నారు. 1 నుంచి 5వ తేదీ వరకు విధులకు హాజరయ్యే ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలుపుతారని తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర భోజన విరామం సమయంలో నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. 15వ తేదీ నుంచి వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సోమవారం కలెక్టర్లకు తెలిపినట్లు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం తదుపరి దశల్లో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని చేపడతామన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడమే తప్పా? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరడమే తప్పన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోందని ఉద్యోగులు అంటున్నారు. అసలు తమకు న్యాయంగా రెగ్యులర్గా రావాల్సినవి కూడా పెండింగ్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పీఆర్సీ తదితర అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లు గడిచినా ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఆ వాగ్దానాలు నెరవేర్చాలని అడిగితే మంత్రులు బెదిరించేలా మాట్లాడటం సరికాదని రాయలసీమకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయని, కానీ చంద్రబాబు ప్రభుత్వం జూలై 22న చర్చలు జరిపి నెల రోజులు దాటినా ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కాలయాపన చేయడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని తెలిపారు. తాము చేసే ఉద్యమం కేవలం బకాయిల కోసం చేసే పోరాటం కాదని, ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం చేసే పోరాటమని మరో ఉద్యోగి వ్యాఖ్యానించారు.మా సమస్యలంటే అంత నిర్లక్ష్యమా?సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా, వినతిపత్రాలు ఇచ్చినా, చర్చలకు హాజరైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విశాఖకు చెందిన ఉద్యోగిని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విజయవాడకు చెందిన ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై ప్రభుత్వం వైపు నుంచి కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలవుతాయని ఇంతకాలం ఓపికతో ఎదురు చూశామని, అయితే దీన్ని ఉద్యోగుల బలహీనతగా చూడకూడదని గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పేర్కొన్నారు.కలెక్టరేట్ల వద్ద కదం తొక్కిన ఉద్యోగులుచంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అమరావతి ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టర్లకు మొత్తం 29 డిమాండ్లతో కూడిన నోటీసులను అందజేశారు. 14 లక్షల మంది ఉద్యోగులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటమిది అని నాయకులు పేర్కొన్నారు. తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించకుంటే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు ఉద్యోగుల సమస్యలతో కూడిన నోటీసు/వినతి పత్రాన్ని అందజేశారు. ఒంగోలు కలెక్టర్కు ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన అనంతరం కలెక్టరేట్ ఎదుట జేఏసీ నాయకులు, ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి ఉద్యోగులు నోటీసు అందజేశారు. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తికి ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతి పత్రం అందజేశారు. ఉద్యమ కార్యాచరణ నోటీసును కూడా అందజేశారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో ర్యాలీ చేసి నిరసన తెలిపారు. కడపలో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టర్కు నోటీసు అందజేశారు. కర్నూలు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఉద్యోగులు కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికి, నంద్యాల కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారికి ఉద్యోగులు నోటీసులు అందజేశారు. చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి నిరసన నోటీసు అందజేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఉద్యోగులు పల్నాడు కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమ 8 ప్రధాన డిమాండ్లతో కూడిన వాల్పోస్టర్లను ప్రదర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్లో పీజీఆర్ఎస్ హాల్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్కు నోటీసు అందజేశారు. అనంతపురంలో ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్కు చేరుకుని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు ఉద్యమ నోటీసు అందజేశారు. -
పంచదార్లకొండ మైనింగ్ లీజుల వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, పంచదార్లకొండను గుల్ల చేస్తూ అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సోమవారం స్పందించింది. పంచదార్లకొండ వద్ద మైనింగ్కు సంబంధించిన జారీ చేసిన లీజుల వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లకొండ వద్ద కూటమి ప్రభుత్వ పెద్దలకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ అక్రమ మైనింగ్ చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించడంతో పాటు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారంటూ శ్రీపంచదార్ల ధర్మలింగేశ్వరస్వామి దేవస్థానం పూర్వ చైర్మన్ ఉప్పులూరి నాయుడు పిల్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పంచదార్లకొండ రక్షిత జోన్లో ఉంది. ఇక్కడ ఎలాంటి మైనింగ్ చేయడానికి వీల్లేదు. యమధర్మరాజు ప్రతిష్టించిన శివలింగానికి అక్రమ మైనింగ్ వల్ల ప్రమాదం ఏర్పడింది. అధికార పార్టీలకు చెందిన నేతలు కొందరు పంచదార్లకొండను అక్రమ మైనింగ్ ద్వారా గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎగవేసిన పన్నులు, రాయల్టీ, సీనరేజీ, డెడ్రెంట్ వంటి వాటిని అక్రమ మైనింగ్దారుల నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విజయ్ కుమార్ నాయుడు, రితి్వక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ లైసెన్సులను రద్దు చేయాలి’ అని విన్నవించారు. పంచదార్లకొండపై 2.13 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించామని, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించామని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలుపుతుండగా, పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ‘మొత్తం మూడు మైనింగ్ లీజులున్నాయి. ఒకటి కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీ పేరు మీద, మరొకటి ఆయన డ్రైవర్ పేరు మీద, మరొకటి ఇతర పేరు మీద ఉంది. ఈ మూడింటిలో ఒక లైసెన్సును మాత్రమే రద్దు చేశారు. మిగిలిన వాటి గురించి ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు’ అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ... తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు
-
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్ టన్నెల్స్) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్ జగన్కు పేరొస్తుందనే నిర్వాసిత కుటుంబాలకు 26 నెలలుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్కు కృష్ణా జలాల తరలింపుపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తూ వచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలకు రూ.1,301.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.758 కోట్లను ఇటీవల బాబు సర్కార్ చెల్లించింది. బాబు సర్కారు జాప్యం వల్ల ప్రకాశం బ్యారేజీ మీదుగా 2024–25, 2025–26లో వరుసగా 848.96 టీఎంసీలు, 1,652.12 టీఎంసీల చొప్పున కృష్ణా వరద జలాలు సముద్రంలో కలిశాయని సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా ఫీడర్ కెనాల్ పనులు..గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్లోనే కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు విడుదల చేసే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన 5.2 కి.మీ.లలో గట్లు (ఎంబాక్మెంట్) పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన వర్షాలకు టీడీపీ హయాంలో పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్వాల్, మిగతా చోట్ల కాంక్రీట్ లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. అస్మదీయ కాంట్రాక్టర్కు అధిక ధరలకు బాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ముడుపులు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.‘కొండంత’ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్సార్..⇒ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ. పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1991–93లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. ⇒ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేల ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. ⇒ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ మూడు డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్సార్ పూర్తిచేశారు.హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్..⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని తన పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వెలిగొండను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. ⇒ 2014–19 మధ్య టీడీపీ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. ⇒ రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ⇒ రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. ⇒ శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ⇒ 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. ⇒ 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. ⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ⇒ వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2.58 టీఎంసీలు, పామూరు నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృది్ధకి ఊతం ఇవ్వడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.అప్పుడూ ఇప్పుడూ బాబు సర్కార్ దోపిడీ..2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్⇒ ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసమే వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్ దోపిడీకి నిదర్శనం. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66. 44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. ⇒ 2017.. 2018.. 2019.. ఇలా ఎప్పటికప్పుడు వెలిగొండ పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చిన చంద్రబాబు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. -
నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు
-
Audio: బీడు పడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు... కాలువకు నీరివ్వని కూటమి సర్కార్... బోరుమంటున్న రాయలసీమ రైతులు
-
బాబూ..! చిరిగిన బ్యాగూ!
ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్వాంటమ్ కంప్యూటింగ్.. నాలుగో పారిశ్రామిక విప్లవం.. అంటూ తండ్రి కబుర్లు! గాలిలో మేడలు కట్టేస్తారు! మరోవైపు తనయుడు ఏసీ రూముల్లో రెడ్బుక్ లెక్కలు చూసుకుంటూ.. ‘ఎక్స్’ వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మే పనిలో మునిగి తేలుతుంటారు!! విద్యాశాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి, విద్యార్థులకు ట్యాబ్లు అందించి చదువుల్లో రాణించేలా ప్రోత్సహిస్తే.. చంద్రబాబు సర్కారు అందించింది ‘కుట్టు టెక్నాలజీ’ ‘పిన్నీసు విప్లవం..’ అని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు దాటుతున్నా విద్యార్థులకు అందించాల్సిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీకి పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. బ్యాగులకు జిప్పులు వేద్దామని ప్రయత్నిస్తే జారి చేతికొచ్చేస్తున్నాయి. పుస్తకాలు అమర్చి బ్యాగు పట్టుకుంటే అంచులు వదిలేస్తున్నాయి. భుజానికి తగిలించుకుంటే కాడలు తెగిపోతున్నాయి. దీంతో ఏ విద్యార్థి చేతిలో బ్యాగు చూసినా కుట్ల అల్లికలు.. పిన్నీసుతోనే దర్శనమిస్తున్నాయి. ఇక బూట్ల క్వాలిటీ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. పిల్లల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇచ్చిన బూట్లలో ఒక్కో దాంట్లో రెండు కాళ్లు పెట్టవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థుల చేతుల్లో మెరిసిన విద్యా కానుక కిట్లను గుర్తు చేసుకుంటూ చదువుల పట్ల చంద్రబాబు సర్కారు అలసత్వంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత్యంతరం లేక గత ప్రభుత్వంలో ఇచ్చిన ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి మళ్లీ భుజాన వేసుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్న శాఖలో రూ.వందల కోట్లతో అమలు చేస్తున్న పథకం డొల్లతనం చిరిగిన బ్యాగుల సాక్షిగా బట్టబయలైంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూటమి సర్కారు పంపిణీ చేసిన నాసిరకం ‘పచ్చ’ కిట్ల దయనీయ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్! – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/నెట్వర్క్పుస్తకాల బరువుకు తొలి రోజే ఫట్..కర్నూలు జిల్లా ఏపీ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ధనరాజ్ పాఠశాల తెరిచిన తర్వాత ఎప్పుడెప్పుడు బ్యాగులు ఇస్తారా? అని ఆశగా ఎదురు చూశాడు. ఆలస్యంగా చేతికి రాగానే పుస్తకాలన్నీ సర్ది సంబరపడ్డాడు. కానీ ఆ ఆనందం ఒక్క రోజు కూడా నిలవలేదు. పుస్తకాల బరువుకు బ్యాగు బెల్టులు చేతికొచ్చేశాయి. అడుగు భాగం ఊడిపోయింది. దీంతో మళ్లీ జగనన్న ఇచ్చిన పాత బ్యాగు దుమ్ము దులిపి పుస్తకాలు సర్దుకొని స్కూల్కు వెళుతున్నాడు.సగం బ్యాగులో.. సగం చేతిలోప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో ఏ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చూసినా ఒకటే దృశ్యం. పిల్లల భుజాన బ్యాగు కనిపిస్తున్నా సగం పుస్తకాలు చేతుల్లోనే ఉంటున్నాయి. నాసిరకం బ్యాగు కాడలు తెగిపోయి పుస్తకాలు రోడ్డున పడతాయనే భయంతో మోసుకుని వెళ్తున్నారు. బ్యాగులకు జిప్పులు ఊడిపోవడంతో పిన్నీసులు పెడుతున్నారు. అధ్వానంగా ఉండటంతో జిల్లాలో 24 శాతం (40 వేల కిట్లు) పాఠశాలల్లోనే మూలుగుతున్నాయి. కొందరు పిల్లలు మూడేళ్ల క్రితం నాటి జగనన్న బ్యాగులనే వినియోగిస్తున్నారు.బుజ్జి బాబుకు బూట్లు షాక్..!అనంతపురం రూరల్ రాజీవ్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారి శశికి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్విద్యార్థి మిత్ర’ కిట్ అందింది. ఎంతో సంబరంగా కొత్త షూస్ తొడుక్కోవడానికి ప్రయత్నిస్తే ఒకే దాంట్లో రెండు కాళ్లు దూరిపోయేంత పెద్దవిగా ఉండటంతో బిక్కమొహం పెట్టాడు. వాటిని ధరించి నడవడానికి యత్నిస్తే కాళ్ల నుంచి ఊడిపోతుండటంతో ఇంట్లో పక్కన పెట్టి పాత చెప్పులతో బడి బాట పట్టాడు.బ్యాగులకు పిన్నీస్ టెక్నాలజీ..! టెక్కలికి చెందిన ఒక విద్యార్థి ఉదయాన్నే బడికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. కొత్త బ్యాగులో పుస్తకాలు సర్ది భుజాన వేసుకోబోయాడు. అంతే.. జిప్ ఊడిపోయింది. కాడలు తెగిపోయాయి. అంచులు చిరిగిపోయాయి. బ్యాగ్ లోపలి నుంచి కిందకి పడిపోతున్న పుస్తకాలను గమనించిన విద్యార్థి తల్లి ఉపాయంగా పిన్నీస్ టెక్నాలజీ అమలు చేసింది! బ్యాగు అంచులకు, జిప్పు భాగానికి పిన్నీసులు అమర్చి ఎలాగోలా పిల్లాడిని స్కూలుకు పంపించింది!!చేతిలో బూట్లు.. జేబులో పిన్నీసులు..!ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిల్లలకు పంపిణీ చేసిన కిట్లలో నాణ్యత లోపించడమే కాకుండా బూట్ల సైజులు తలనొప్పిగా మారాయి. విద్యార్థుల పాదాల కొలతలతో సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన సైజుల్లో షూలు పంపిణీ చేయడంతో పిల్లలు వాటిని ధరించలేక చేతుల్లో పట్టుకుని ఇళ్లకు వెళ్తున్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, నరసన్నపేట మండలాల్లో బ్యాగులు పంపిణీ చేసిన మూడు వారాలకే కుట్లు విడిపోయాయి. దీంతో విద్యార్థులు పిన్నీసులు పెట్టుకుని బడికి వెళ్తున్నారు. గుండవల్లిపేట ప్రాథమిక పాఠశాలలో 40 మందికి పంపిణీ చేసిన బూట్ల సైజులు సరిపోక కొత్త షూలు కొనుక్కోవాల్సి వచ్చింది.⇒ విశాఖపట్నం జిల్లాలోని 594 పాఠశాలల పరిధిలో 70 వేల మంది విద్యార్థులకు ఇచ్చిన మెజారిటీ బ్యాగులకు బెల్టులు, జిప్పులు ఊడిపోయాయి. బయట మార్కెట్లో రూ.800 నుంచి రూ.1,000 పెట్టి కొనుక్కోలేక ‘జగనన్న’ బ్యాగులనే తెచ్చుకుంటున్నారు. ⇒ అనకాపల్లి జిల్లాలో కొత్తగా చేరిన 8 వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ అసలు కిట్లే అందలేదు. ఇచ్చిన బ్యాగులు కూడా వారం రోజుల్లోనే పిగిలిపోవడంతో పాతవాటికే కుట్లు వేయించుకుని పాఠశాలలకు వస్తున్నారు. నాసిరకం మెటీరియల్..గోదావరి జిల్లాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా వేలాది మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ కాలేదు. ⇒ ఏలూరులో గతేడాది 1,19,118 మంది విద్యార్థులు ఉండగా ఈసారి ఐదు వేల బ్యాగులు తగ్గించి 1,14,575 బ్యాగులకే ఇండెంట్ పెట్టారు. తీరా ఇచ్చిన అరకొర బ్యాగులు కూడా రెండు నెలలకే జిప్పులు ఊడిపోయి నిరుపయోగంగా మారాయి.⇒ తూర్పు గోదావరి జిల్లాలో 1,148 పాఠశాలల్లో చదువుతున్న 93,849 మంది విద్యార్థులకు కిట్లు పూర్తిస్థాయిలో అందలేదు. ఇచ్చిన బ్యాగులూ చిరిగిపోవడంతో విద్యార్థులు సివిల్ డ్రెస్లు, సొంత బ్యాగులతో బడికి రాక తప్పడం లేదు.⇒ కాకినాడ జిల్లాలో 1,28,988 మంది విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల్లో నాణ్యత లేకపోవడంతో రెండు నెలలకే పాడైపోయాయి. దీంతో సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 85,207 మంది విద్యార్థులకు కిట్లు ఇవ్వాల్సి ఉండగా ఆగస్టు ముగుస్తున్నా ఇంకా 900 మందికి అందలేదు. ఇచ్చిన హ్యాండిల్స్ ఊడిపోతుండటంతో నెల రోజులకే బ్యాగులు మూలనపడ్డాయి. బుక్స్ బరువుకు బ్యాగులు ‘ఫట్’..కోస్తాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటినా కిట్లు అరకొరగానే అందాయి. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 3 జతల యూనిఫాంను కూటమి సర్కారు 2 జతలకు కుదించి కుట్టు కూలి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టింది.⇒ నెల్లూరు జిల్లాలోని 3,221 ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థుల్లో 6,677 మందికి ఇప్పటికీ బ్యాగులు అందలేదు. మరో 40 వేల మందిని బెల్టులు, బూట్లు, సాక్స్ కొరత వేధిస్తోంది. టెన్త్ విద్యార్థులు రోజూ మోసే 32 పుస్తకాల బరువుకు నాసిరకం బ్యాగులు ‘ఫట్’ మంటున్నాయి.⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా 1.71 లక్షల మందికి కిట్లు ఇవ్వాల్సి ఉండగా తీవ్ర నాణ్యతా లోపంతో ఏకంగా 24 శాతం (40 వేల కిట్లు) పాఠశాలల్లోనే మూలుగుతున్నాయి. బ్యాగుల జిప్పులు ఊడిపోవడం, కాడలు తెగిపోవడంతో విద్యార్థులు పిన్నీసులు పెట్టుకుని, సగం పుస్తకాలు చేతుల్లో పట్టుకుని దయనీయంగా బడిబాట పడుతున్నారు. లెక్కలు దేవుడెరుగుకృష్ణా జిల్లాలో అధికారికంగా పంపిణీ సంఖ్య స్పష్టంగా వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు బ్యాగులు, బూట్లు సరిగ్గా అందలేదని, ఇచ్చిన కొన్నింటిలో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.సీఎం సొంత జిల్లాలో సగం మందికే..!సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో పిల్లల దుస్థితి మరింత దయనీయంగా ఉంది. బడి తెరిచి నెలలు కావస్తున్నా డీఈవో ఆఫీసు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే బ్యాగుల పంపిణీ పూర్తి కాలేదు. చిత్తూరు నగరంలోని గిరింపేట మున్సిపల్ స్కూల్లో పిల్లలు బ్యాగుల ముఖమే చూడలేదు.⇒ తిరుపతి జిల్లాలో పంపిణీ చేసిన 60 శాతానికి పైగా బ్యాగుల హ్యాండిళ్లు, బెల్టులు అప్పుడే తెగిపోయాయి. పుస్తకాల బరువును ఆ బ్యాగులు మోయలేక చిరిగిపోతుంటే.. సమగ్ర శిక్ష అధికారులు మాత్రం అంతా బాగుందంటూ ఏసీ రూముల్లో కూర్చుని ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపుతున్నారు.కిట్లు ఆలస్యం.. అందినవి ఖేల్ ఖతం!కర్నూలు జిల్లాలో 1,445 పాఠశాలల్లో 2,63,521 మంది విద్యార్థులకు గాను 1.83 లక్షల మందికే బ్యాగులందాయి. జూలై చివరి వరకు పంపిణీ ఆలస్యమవడమే కాకుండా 30–40 శాతం బ్యాగులు వారం రోజుల్లోనే చిరిగిపోయాయి. కోడుమూరు బాలికల స్కూలులో మూడు నెలలైనా కిట్లు అందలేదు.⇒ అనంతపురంలో 1,91,905 మందికి పంపిణీ చేసినట్లు చెబుతున్నా నెల రోజుల్లోనే బ్యాగులకు చిరుగులు పడ్డాయి. సైజులు సరిపోని బూట్లతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.నాడు ‘జగనన్న కానుక’ నేడు బాబు సర్కారు ‘శిక్ష’!వైఎస్సార్సీపీ హయాంలో ‘జగనన్న విద్యా కానుక’ కింద బడి తెరిచిన తొలిరోజే అత్యుత్తమ నాణ్యతతో 3 జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, ఏడాదంతా చెక్కుచెదరని బ్యాగ్, సైజులకు తగ్గ షూస్, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చారని పిల్లలు, తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చి ఇస్తున్న నాసిరకం కిట్లు వారికి శిక్షలా మారాయి. దీంతో విద్యార్థులు మళ్లీ ‘జగనన్న బ్యాగులు’ దుమ్ముదులిపి భుజాన వేసుకుంటున్నారు. నాసిరకం కిట్లకు రూ.867.56 కోట్లుసాక్షి, అమరావతి: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర 2 పథకం కోసం రూ.867.56 కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు నాణ్యతపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా నాణ్యత తనిఖీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మరో విడ్డూరం. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా వ్యక్తిగత పర్యవేక్షణతో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన స్కూల్ బ్యాగులు, విద్యా కానుక కిట్లను అందించారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. రూ.92 కోట్ల బ్యాగుల్లో నాణ్యత డొల్ల..సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర–2 పథకం కింద 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బ్యాగులు సరఫరా చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 33,07,036 మంది విద్యార్థులకు ఒక్కో బ్యాగ్కు రూ.278 చొప్పున మొత్తం రూ.91,93,56,008 ఖర్చు చేశారు. రూ.91.93 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి కొనుగోలు చేసిన బ్యాగులు విద్యార్థులకు కనీసం విద్యా సంవత్సరం పాటు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అవి ఇలా తీసుకోగానే చిరిగిపోతున్నాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. నాణ్యత తనిఖీలకు రూ.4.38 కోట్లు..ప్రభుత్వం కేవలం కిట్లు కొనుగోలు చేయడమే కాకుండా థర్డ్పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ (టీపీక్యూఏ) కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 0.5 శాతం కేటాయించింది. ఈ లెక్కన రూ.4,38,11,650 ఖర్చు చేసినట్లు చూపించారు. ఇంత మొత్తం నాణ్యత తనిఖీలకు కేటాయించిన తర్వాత కూడా బ్యాగుల నాణ్యతపై ఫిర్యాదులు రావడం గమనార్హం. అంటే తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, రూ.4.38 కోట్లు వృథా చేశారని స్పష్టమవుతోంది. అదనంగా రూ.37.52 కోట్లు కేటాయించినా2026–27 విద్యా సంవత్సరానికి కిట్ల కొనుగోలుకు తొలుత రూ.830.04 కోట్లకు పరిపాలనా అనుమతి పొందగా.. అనంతరం దానిని రూ.867.56 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం సవరించినా అనుమతి ఇచ్చింది. అంటే అదనంగా రూ.37.52 కోట్లు కేటాయించారు. ఇంత భారీ బడ్జెట్ కేటాయించిన పథకంలో విద్యార్థులకు అందే బ్యాగుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఏకంగా రూ.867 కోట్ల విలువైన పథకం.. బ్యాగులకు రూ.91.93 కోట్లు.. నాణ్యత తనిఖీలకు మరో రూ.4.38 కోట్లు.. కేటాయించినా సరే బ్యాగులు చిరిగిపోవడం, కిట్ల పంపిణీ అస్తవ్యస్థంగా జరగటాన్ని బట్టి నాణ్యతకు తిలోదకాలిచ్చారని స్పష్టమవుతోంది. -
5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే.. మీరు వాళ్ళని ఏం చేసారో తెలుసా
-
బాబు బుద్ధులే కొడుక్కి వచ్చాయి... నువ్వు ఓ పిరికిపందవి... ఉతికారేసిన కారుమూరి
-
ఎక్కడికి పోయావ్ అయ్యా పవన్ కళ్యాణ్.. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి..
-
ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు.. ఆదుకుంటాం అని చెప్పి ఎక్కడికి పోయావ్?
-
నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయ్.. సామాన్యుడికి షాక్!
-
జీవో నెం. 3 అమలు చేసి అరకు పర్యటనకు రండి బాబుపై రేగం మత్యలింగం ఫైర్
-
కూటమి మానిఫెస్టోని చూపించి బాబుని ఒక రేంజ్ లో ఏకిపారేసిన బొప్పరాజు
-
ఎక్కడ లేని ధరలు APలోనే..!
-
తాగడానికి నీళ్లు లేవు కానీ.. డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి
-
ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు..
-
చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా..
-
ABN రాధాకృష్ణలాగా బల్ల కింద కూర్చుని వార్తలు చదవను
-
పార్టీ మారతారు అని తెలిసినా... ఆ రోజు ఇచ్చిన మాట కోసం.. అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు
-
కమిషనర్ ఔట్... వేతన సవరణ కమిషన్ లేదు... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం
-
‘సంజీవని’ ముసుగులో దోపిడీ!
సాక్షి, అమరావతి: పేదలకు ప్రాణం పోస్తున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసే నాడు–నేడు కార్యక్రమానికి తూట్లు పొడవటం.. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం.. ఇలా వైద్య రంగాన్ని చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కారు.. అక్కడితో ఆగకుండా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతూ ఖజానాకు భారీగా గండి కొడుతోంది.ప్రైవేట్ కంపెనీలకు నిధుల పంట పండిస్తోంది. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన డిజిటల్ నెర్వ్ సెంటర్ (డీఐఎన్సీ–డింక్) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. డింక్ సాఫ్ట్వేర్ రూపొందించిన కంపెనీకే దాని అమలు కాంట్రాక్టును అప్పగించడం ద్వారా ఏకంగా రూ.350 కోట్లు ఇచ్చేయడానికి ప్రభుత్వం దాదాపు సన్నద్ధం అయిపోయింది. అదే సంజీవని ప్రాజెక్టు. ప్రభుత్వ పెద్దల క్విడ్ ప్రోకో స్కెచ్లో సంజీవని పురుడుపోసుకుందని వైద్య శాఖలో ప్రచారం జరుగుతోంది.మంత్రుల పర్యటన నుంచి కాంట్రాక్ట్ వరకూ అంతా ‘స్కెచ్’సాధారణంగా ఏదైనా కొత్త పథకం, కార్యక్రమం అమలు చేసే ముందు ప్రజల అవసరాలు, అప్పటికే అందుబాటులో ఉన్న వనరుల వినియోగం, ప్రజాధనం వృథా కాకుండా ప్రభుత్వం విధానాలు రూపొందించాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలి. ఇందుకు పూర్తి భిన్నంగా సంజీవని కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కారు తెరపైకి తెచ్చింది. టాటా సంస్థ రూపొందించిన ‘డింక్’ను నేరుగా ఓ విధానంగానే స్వీకరించేసింది. 2024 డిసెంబర్లో ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ కర్ణాటక రాష్ట్రం కోలార్లోని డింక్ కార్యాలాయాన్ని సందర్శించారు.తర్వాత కొద్ది రోజులకే ఏపీలోనూ డింక్ సేవలు ప్రారంభిస్తామని బాబు సర్కార్ ప్రకటించింది. ఇదే సంజీవని ప్రాజెక్టు అని చెప్పింది. అదే సంస్థ ద్వారా కుప్పంలో పైలట్ ప్రాజెక్టు చేస్తున్నట్లు తెలిపింది. తర్వాత చిత్తూరు జిల్లావ్యాప్తంగా అమలు అంటూ హడావుడి చేసింది. సంజీవని పైలట్ ప్రాజెక్టు కోసమే రూ.10 కోట్లు ఖర్చు పెట్టేసింది. పైలట్ ప్రాజెక్టులో ఆమోఘమైన ఫలితాలు వచ్చాయని, రాష్ట్రం మొత్తం సంజీవని అమలు చేసేస్తామని సీఎం ప్రకటించారు. కొద్ది రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు కోసం వైద్య శాఖ టెండర్ పిలిచింది.రూ.350 కోట్లకు పైగా నిధులతో ఐదేళ్ల పాటు కార్యక్రమం అమలు చేయడానికి టాటా సంస్థే టెండర్లో ప్రథమ స్థానంలో నిలిచినట్టు సమాచారం. త్వరలోనే కాంట్రాక్టును వైద్య శాఖ అధికారికంగా కట్టబెట్టబోతోందని తెలుస్తోంది. మంత్రుల కోలార్ పర్యటన, డింక్నే విధానంగా ప్రభుత్వం స్వీకరించడం, తుది కాంట్రాక్ట్ను అదే సంస్థకు కట్టబెట్టడం.. ఇదంతా పక్కా దోపిడీ ‘స్కెచ్’లో భాగంగా కాక మరేంటని వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య శాఖ పిలిచిన టెండర్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పాల్గొంది. అయితే డింక్నే ప్రభుత్వం విధానంగా స్వీకరించి టెండర్ పిలవడంతో ప్రభుత్వ రంగ సంస్థ పోటీలో నిలవలేకపోయిందని సమాచారం.పైలట్ ప్రాజెక్టులోనే చాప చుట్టేసిన కన్నడ సర్కారుకర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో డింక్ కార్యక్రమాన్ని 2017లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అయితే ఆ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడం, ప్రజారోగ్య రంగంలో డింక్తో పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని గుర్తించిన కన్నడ సర్కారు పైలట్ దశలోనే చాపచుట్టేసింది. అదే సమయంలో కేంద్రం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం), ఈ–సంజీవని వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.దీంతో రాష్ట్రంలో సొంతంగా ఒక ప్రత్యేక నెట్వర్క్ను నడిపితే డేటా డబుల్ ఎంట్రీ అవ్వడంతో పాటు, ప్రజారోగ్య సమాచార గోప్యతకు దెబ్బతింటుందని కర్ణాటక ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. అదే డింక్ కార్యక్రమాన్ని గేమ్ చేంజర్ అంటూ చంద్రబాబు సర్కార్ డబ్బా కొడుతోంది. పక్క రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన కార్యక్రమాన్ని ఏపీ ప్రజల నెత్తిన రుద్దడమే కాకుండా ఏకంగా రూ.350 కోట్ల మేర ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తోంది.ప్రైవేటు భాగస్వామ్యం లేకుండానే వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతాలుఏ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, నిధుల దుబారా లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగంలో అద్భుత సంస్కరణలు తెచ్చారు. గ్రామ స్థాయిలో 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రజలకు టెలీ కన్సల్టేషన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవలు, మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫరల్స్, ప్రజల ఆరోగ్య సమాచారం డిజిటలీకరణ వంటి అనేక మార్పులు తీసుకొచ్చారు.అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనట్టుగా నేరుగా ప్రభుత్వ వైద్యులే ప్రజల దగ్గరకు వెళ్లారు. ఇలా 2024 నాటికే ఎంతో కీలకమైన ప్రివెంటివ్ కేర్లో గ్రామ స్థాయిలో సమర్థ వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉంది. చంద్రబాబు ప్రభుత్వం దీన్నంతటిని నిర్వీర్యం చేసేసి, విఫల కార్యక్రమం డింక్ కోసం ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడుతుండటంపై వైద్య నిపుణులు మండిపడుతున్నారు. -
కమిషనర్ ఔట్.. పీఆర్సీ లేదు.. ఉద్యోగులకు వెన్నుపోటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని వర్గాలనూ దారుణంగా వంచించిన సీఎం చంద్రబాబు ఉద్యోగులకూ వెన్నుపోటు పొడిచారు! ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటించడంతోపాటు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామన్న ప్రధాన హామీలకు సైతం తూట్లు పొడిచారు. పీఆర్సీ ప్రకటించకపోగా ఉన్న కమిషనర్నే బలవంతంగా తొలగించి పీఆర్సీ ఎగ్గొట్టేందుకు సన్నద్ధమయ్యారని ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు చిటికెలో పరిష్కరిస్తామని నమ్మబలికి ఇప్పుడు మోసం చేశారని మండిపడుతున్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, ఐఆర్, సీపీఎస్ రద్దు లాంటి హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని రగిలిపోతున్నారు. కమిషనరే లేనప్పుడు.. నివేదిక ఎప్పుడు?టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12వ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్సింగ్ను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు. ఖాళీ అయిన ఆ స్థానంలో వెంటనే కొత్త కమిషనర్ను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. అదే కమిషనర్ ఉంటే ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించడం, ఆర్థిక పరిస్థితులు, నిత్యావసర ధరల పెరుగుదలపై నిశితంగా అధ్యయనం చేయడం, ఇతర రాష్ట్రాల్లో వేతన సవరణలను పరిశీలించి నివేదిక సిద్ధం చేసేవారు. సాధారణంగా ఇందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు కమిషనర్ను నియమించినా నివేదిక తయారు కావడానికే ఏడాదికి పైగా సమయం పడుతుంది. అసలు కమిషనరే లేనప్పుడు నివేదిక ఇంకెప్పుడు? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ను నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలహరణం చేయటాన్ని బట్టి పీఆర్సీ ఇవ్వకుండా ఎగ్గొట్టే వ్యూహం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఐదేళ్లకు ఒకసారి బేసిక్ పే సవరణ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల బేసిక్ పే సవరించాలి. 11వ పీఆర్సీని 2022లో ప్రకటించినా 2018 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే పీఆర్సీ ప్రకటన తేదీ కంటే నాలుగేళ్లు ముందు నుంచి అమలు తేదీ ఉంటుంది. కానీ ఇంతవరకూ కమిషనరే లేకపోవడంతో అసలు పీఆర్సీ ఉంటుందో లేదోనని ఉద్యోగులు మధనపడుతున్నారు. ఐఆర్ అందక భారీగా నష్టపోతున్న ఉద్యోగులుసాధారణంగా పీఆర్సీ నివేదిక వచ్చే లోపు ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించేందుకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో 27 శాతం ఐఆర్ ఇచ్చి ఉద్యోగులకు భరోసా కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పీఆర్సీ కమిషనరే లేని పరిస్థితుల్లో ఐఆర్ ప్రస్తావనే లేకుండా పోయింది. ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ప్రతి ఉద్యోగీ నెలనెలా భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో అమలు చేసిన రెండు పీఆర్సీలను పరిశీలిస్తే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే రూ.50 వేల ప్రాథమిక వేతనం (బేసిక్ పే) కలిగిన సాధారణ ఉద్యోగి ప్రతి నెల రూ.13,500 నష్టపోతుండగా, రూ.లక్ష బేసిక్ పే ఉన్న ఉద్యోగి నెలకు ఏకంగా రూ.27 వేల వరకు కోల్పోతున్నారు. కనిష్ట బేసిక్ పే ఉన్న ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకుంటే సగటున ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.20 వేలు చొప్పున నష్టపోతున్నారు. మొత్తం బకాయిలు రూ.40 వేల కోట్లు.. చంద్రబాబు ప్రభుత్వం మొత్తంగా ఉద్యోగులకు ప్రతి నెలా చెల్లించాల్సిన దాదాపు రూ.1,000 కోట్లను ఎగ్గొడుతోంది. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు, 3.50 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గత రెండేళ్లుగా పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు కోల్పోయిన మొత్తం రూ.24 వేల కోట్లకు చేరుకుంది. దీంతో పాటు ఐఆర్ నిలిపివేయడమే కాకుండా 5 పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలు, మానిటరీ బెనిఫిట్లు అన్నీ కలిపి రూ.40 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. తద్వారా ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు శాశ్వత ఆర్థిక నష్టం జరిగే దుస్థితి నెలకొంది.రిటైర్ అయ్యేవారికి పూడ్చలేని లోటుపీఆర్సీ అమలు కాకుండానే రిటైర్ అవుతున్న వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ లెక్కింపు మొత్తం చివరి బేసిక్ పే మీదే ఆధారపడి ఉంటుంది. పీఆర్సీ రాకముందే రిటైరైతే పాత బేసిక్ పైనే ఈ లెక్కలు కట్టేస్తారు. అంటే జీవితాంతం అందుకోవాల్సిన పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండూ శాశ్వతంగా తగ్గిపోతాయి. ఒక ఉద్యోగి పీఆర్సీ వచ్చాక రిటైరైతే అందుకునే పెన్షన్తో పోలిస్తే.. ముందుగానే రిటైరైన వారికి నెలవారీగా వేల రూపాయల చొప్పున శాశ్వత నష్టం వాటిల్లుతుంది. ఇది మళ్లీ సరిదిద్దలేని నష్టం. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో పీఆర్సీ ప్రక్రియలు నిర్ణీత గడువులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో ఐఆర్ ఎప్పుడో ఇచ్చారు. ఏపీలో మాత్రం ఇంతవరకు కమిషనర్ నియామకమే జరగలేదు. ఇది ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాన్ని మరింత పెంచుతోందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. సరిహద్దు జిల్లాల్లో ఇరు రాష్ట్రాల ఉద్యోగులు పక్కపక్కనే పనిచేస్తున్నా జీతాల్లో వ్యత్యాసం ఏటికేడు పెరుగుతూనే ఉందని చెబుతున్నారు.పీఆర్సీ కమిషనర్ను నియమించకపోవడం దారుణం 12వ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వారిని నియమించకపోవడం దారుణం. దీనిపై ఉద్యోగులంతా ఆందోళనలో ఉన్నారు. మంత్రులు చర్చలకు పిలుస్తున్నారు గానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. 5 డీఏలు, పీఆర్సీ, రూ.వేల కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టేసి అంతా ఇచ్చేశామంటున్నారు. ఒక్కో నెల గడిచే కొద్దీ ఉద్యోగులు వేల రూపాయలు నష్టపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది. – ఎస్. బాలాజీ, అధ్యక్షుడు, ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) స్పందించకుంటే ఐక్యంగా ఉద్యమ బాట..ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ కమిషనర్ను నియమించలేదు. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది.– కె ప్రకాశరావు, అధ్యక్షుడు, ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్–ఆప్టాప్రభుత్వం కావాలనే చేస్తోంది.. ప్రతి నెలా జీతం చూసుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఎప్పటి నుంచో అందుతున్నాయి. మాకు మాత్రం ఇంతవరకు కమిషనర్ నియామకం కూడా జరగలేదు. ప్రభుత్వం కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. – రాష్ట్ర సచివాలయ ఉద్యోగిఇవ్వాల్సినవి ఇవ్వకుండా అవమానిస్తున్నారుఉద్యోగులను అవమానించడం, ఇబ్బందిపెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. పీఆర్సీ, ఐఆర్, రూ.40 వేల కోట్లకుపైగా బకాయిలు ఇవ్వకపోగా ఉద్యోగులకే బడ్జెట్ మొత్తం సరిపోతుందని చెప్పడం అన్యాయం. ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. పీఆర్సీ కమిషనర్ను నియమించకపోవడం ఏమిటి? కొత్త పీఆర్సీ కమిషన్ను ఇప్పటికిప్పుడు నియమించినా నివేదిక రావడం, ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈ జాప్యం అంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు.– కె.వెంకట్రావిురెడ్డి, అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల సమాఖ్యఇవీ ఉద్యోగుల డిమాండ్లు⇒ పీఆర్సీ కమిషనర్ను నియమించి, ఆ వెంటనే పీఆర్సీ ఇవ్వాలి. ⇒ పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్ 30 శాతం ఇవ్వాలి. ⇒ పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు వెంటనే ఇవ్వాలి. ⇒ పోలీసుల సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లించాలి. ⇒ జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోద యోగ్య పరిష్కారం చూపాలి. ⇒ అత్యవసర అవసరాలకు జీపీఎఫ్ విత్డ్రాకు వెంటనే అనుమతివ్వాలి.⇒ రిటైర్మెంట్ ప్రయోజనాలు (జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ లైఫ్ ఇన్సూ్యరెన్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్) వెంటనే అందాలి. ⇒ పెన్షనర్ల కోసం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి. ⇒ పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ⇒ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. ⇒ మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి. -
ఐఏఎస్ ల మధ్య నువ్వా.. నేనా? ఏపీలో ముదిరిన విభేదాలు
-
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
-
34% రిజర్వేషన్లు.. మహా డ్రామా
వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకున్నాం. 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్ జగన్ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చాడు. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు.. అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్లు పేరిట మరోసారి చంద్రబాబు మహా డ్రామాకు దిగాడని విమర్శించారు. మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడని.. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టి వేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనేనంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ఆపేయడంతో పాటు సూపర్ సిక్స్, సూపర్సెవెన్ హామీలను చెత్త బుట్టలో వేసి బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక, వారి మీద అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది మేమే ‘2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు, తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. అప్పుడు బీసీలకు పథకాలే పథకాలు.. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి చెబుతుంటే రోమాలు నిక్క»ొడుస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. ఈ పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ఇచ్చిన బాండ్లను చెత్తబుట్టలో పారేశారు. చంద్రబాబుదంతా మోసమే. నిజంగా బీసీలకు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి. బీసీలు ఎదుగుతుంటే బాబు చూడలేరు రాజకీయంగా బీసీలు ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేక అక్రమ కేసులతో జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టాడు. ఒక మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టి, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అది చేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి.. ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమవుంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళితే అందులో ఆరుగురు చనిపోతే, కనీసం వారిని చూడటానికి స్థానిక మంత్రి కూడా వెళ్లలేదు. ఈయన బీసీల గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన లేక చదవులు మానేస్తున్న వారిలో అత్యధికులు బీసీలే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. మరి చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో అందరూ ఆలోచించాలి.34% రిజర్వేషన్లకు మించి బీసీలకు పదవులు ఇచ్చాం⇒ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.⇒ మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రి పదవులు బీసీలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు. అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. ⇒ చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేము 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. అంటే 48 శాతం వారికే. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో 6 అంటే 46 శాతం బీసీలకే. 13 మేయర్ పదవుల్లో 9 అంటే 69 శాతం బీసీలకే. 636 ఎంపీపీ స్థానాల్లో 239 అంటే 38 శాతం బీసీలకే. మున్సిపల్ ఛైర్మన్ పదవులు 84లో 44 అంటే శాతం బీసీలకే.⇒ 639 జెడ్పీటీసీల్లో 227 అంటే 36 శాతం బీసీలకే. 8,239 ఎంపీటీసీల్లో 3,361 అంటే 41 శాతం మంది బీసీలే. 10,536 సర్పంచుల్లో దాదాపు 4 వేల మంది బీసీలే. అంటే 38 శాతం వారికే. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39 శాతం బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37 శాతం ఇచ్చాం. ⇒ 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు కలలో కూడా ఆలోచన రాలేదు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇచ్చాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి. ⇒ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. -
కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రే
జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి, విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈ రోజు నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి పాలకులు ఉంటారనే... రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత రైతులకు మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ2025లో అక్రమాలు, పేపర్ లీకేజీల మీద సాక్ష్యాలు, ఆధారాలతో గత వారం సమగ్రంగా మాట్లాడా. ఏపీపీఎస్సీ గ్రూప్ృ1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలపై సాక్ష్యాలతో వాస్తవాలను వివరించా. ఈ రెండింటిపై సీబీఐ విచారణకు మేం రెడీ.. మీరు రెడీనా? అని ఛాలెంజ్ కూడా చేశా. నేను ఛాలెంజ్ చేశాక ఇంత వరకూ ఆ అంశాలపై వాళ్లు మాట్లాడలేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలపై వక్రీకరణలు చేస్తున్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే 25 శాతం లోటు వర్షపాతం నమోదు అయిందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా, సాగుకు నీళ్లు ఇస్తున్నామంటూ జూలై 8న వెన్నుపోటు పార్టీ మంత్రులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీరి మాటలు నమ్మి సాగు ప్రారంభించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయకట్టు చివర ఉండే ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించారంటూ చేసిన ప్రచారాలను నమ్మి ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వకుండా సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పులిచింతల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ అక్రమంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం.. రైతులకు అండగా నిలవడంలో చంద్రబాబు సర్కార్ ఘోర నిర్లక్ష్యం, దారుణ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. సీమలోనే కాదు.. కోస్తాలోనూ కరువు ఛాయలురాష్ట్రంలో కరువు ప్రమాద ఘంటికలు మోగుతున్నా చంద్రబాబులో కనీస స్పందన లేకుండా పోయింది. జూన్, జూలై, ఆగస్టు.. ఇప్పటి వరకూ 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 41.78 శాతం, రాయలసీమలో 52.36 శాతం.. ఇలా రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులున్నా కుంభకర్ణుడి తరహాలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారు. రైతులకు మంచి చేస్తూ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకూ సాధారణ వర్షపాతం 388.54 మిల్లీవీుటర్లు (ఎంఎం) నమోదు అవ్వాల్సి ఉండగా 189.62 ఎంఎం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో 688కిగానూ 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అంటే 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. ఈ 625 మండలాల్లో 434 చోట్ల 19 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం ఉంది. మరో 191 మండలాల్లో 19 శాతం నుంచి 59 శాతం వరకూ తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. ఇక 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఏఎస్ఆర్, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షపాత లోటు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిత్యం కరువు ఉండే రాయలసీమ జిల్లాలే కాకుండా కోస్తాంధ్ర జిల్లాల్లోనూ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే దీన్ని గుర్తించడానికి కూడా వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు ఇష్టపడటం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏ మాత్రం అడుగులు ముందుకు వేయడం లేదు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 63 లక్షలకు పైగా ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా కేవలం 50 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అంటే దాదాపు 80 శాతానికే సాగు పరిమితం అయింది. సీమకు నీళ్లివ్వడానికి బాబుకు మనసు రాలేదురాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ ఆగస్టు 11వ తేదీనే 879.50 అడుగులకు చేరుకుంది. అవకాశం ఉన్నా కూడా, పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు. శ్రీశైలంలో 880 అడుగుల్లో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలవచ్చు. 880 అడుగుల నుంచి నీటిమట్టం తగ్గేకొద్దీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం తగ్గుతూ పోతుంది. 854 అడుగుల కంటే కిందకు నీటిమట్టం పడిపోతే... రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, ఇవ్వలేని దుస్థితి వస్తుంది. అలాంటిది ఈ రోజు పరిస్థితి గమనిస్తే శ్రీశైలం నుంచి ఎడాపెడా అటు తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేస్తుండగా, ఇటు చంద్రబాబు కూడా రైతుల గురించి ఆలోచించకుండా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రోజుకు 48 వేల క్యూసెక్కులు నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు ఉంటే ఔట్ఫ్లో 48 క్యూసెక్కులు ఉంటోంది. నికరంగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల దిగువకు చేరుకుంటుంది. ఈ రోజు బహుశా 165 టీఎంసీల నీళ్లున్నాయి. రోజుకు 3.5 టీఎంసీల లెక్కన వాడుతూ పోతే మూడు వారాల్లో 75 టీఎంసీల మేర ఖర్చు అయిపోతాయి. 854 అడుగుల నీటి మట్టానికి వచ్చేస్తాం. దీని తర్వాత రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవ్వలేం. ఇంతకంటే నీటిమట్టం పడిపోతే పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేం. మరోవైపు ఎల్నినో, కరువు కనిపిస్తోంది. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది. సెప్టెంబర్ 15 వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలంలో ఎడాపెడా నీళ్లు తోడేస్తుంటే 854 అడుగుల కిందకు నిల్వలు పడిపోయాక రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా? మరి ఇప్పుడు మీరెందుకు నీరు ఇవ్వడం లేదు? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇలాంటి పాలకులు ఉంటారనే.. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయల సీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.ఒక్క పైసా ఇవ్వని దుస్థితి2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చి రైతులు నష్టపోతే ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు. ఉచిత పంటల బీమాను నాశనం చేశారు. సీజన్ ముగిసేలోపే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు. అగ్రి ల్యాబ్్సను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. మా హయాంలో ‘సీఎం యాప్’ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలతో పోస్టర్లు ప్రదర్శించే వాళ్లం. ఆ ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసేవారు. తక్షణమే జాయింట్ కలెక్టర్/మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రంగంలోకి దిగేవారు. పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ సృష్టించేవారు. దీంతో రేట్లు పెరిగేవి. ఈ మాదిరిగా మా హయాంలో ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలిచాం. గిట్టుబాటు ధరలు ఇప్పించాం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారు. చివరకు రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేసేశారు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చిందేమో రూ.19 వేలు. ఏకంగా రూ.41 వేలు ఎగ్గొట్టాడు. ఆదుకునే ఆలోచన ఉందా బాబూ?ఇంత తీవ్రమైన కరువు పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, ప్రజలను చంద్రబాబు ఆదుకున్నారా? అసలు ఆదుకునే ఆలోచన అయినా ఆయనకు ఉందా? ఎంతసేపూ మాపై తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు, టాపిక్ డైవర్షన్, రెడ్బుక్పైనే ధ్యాస పెడుతున్నారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ధ్యాస లేదు. జూన్, జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వర్షాలు పడతాయి. అప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. జూన్లో 25 శాతం, జూలైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. ఆ రెండు నెలల్లోనే సగటున 52 శాతం లోటు వర్షపాతం కనిపించింది. ఇంత లోటు వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) ఏమైంది? ఆగస్టులోనే దాన్ని అమలు చేసి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లో కొద్దో గొప్పో కురిసే వర్షాలతో పంటలు పండి రైతులు కొంతైనా బాగుపడేవారు. అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, జొన్నలు, పెసలు ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు. మరి ఎంత మందికి మీరు ప్రత్యామ్నాయంగా ఉచిత విత్తనాలు ఇచ్చారు? విత్తనాల పంపిణీ ఎందుకు జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేశారు? వర్షపాతం జూలై చివరి నాటికి 52 శాతం లోటు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎదుర్కొనే వ్యవస్థ (డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లు) పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉండాలి. జిల్లా కంటింజెన్సీ ప్లాన్లు అమలై ఉండాలి. విపత్తు నిర్వహణ ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్) అమలులోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటై ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్, రిసీలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్స్ పంపిణీ రైతులకు జరిగి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా? ఆగస్టు నెల ముగుస్తోంది. సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. మేత అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకుని తనను తాను చంద్రబాబు ప్రశ్నించుకోవాలని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. కనిష్ట స్థాయిలో సీమ డ్యామ్లలో నీటి నిల్వలురాయలసీమలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. తెలుగు గంగ కెనాల్పై ఆధారపడిన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే ప్రస్తుతం కేవలం 55 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ 14 టీఎంసీలు తీసేస్తే అందుబాటులో ఉన్నది 41 టీఎంసీలే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) కింద ఉండే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు. వీటిలో ఇప్పుడు కేవలం 31 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే 23 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 39 శాతం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కింద జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి నిల్వ సామర్థ్యం 8.31 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 టీఎంసీలు పోనూ కేవలం 2.5 టీఎంసీల నీరే అందుబాటులో ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కరువు తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ నీళ్లు మళ్లిస్తుంటే బాబు మౌనంమరోవైపు నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చుక్క నీరు ఇవ్వడం లేదు. ఇంకా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. నాగార్జున సాగర్ కింద ఏపీకి సంబంధించిన పులిచింత ప్రాజెక్ట్ ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్లు కడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం పాతవెల్లటూరు దగ్గర రూ.1,450 కోట్లతో మహాత్మాగాంధీ పంప్డ్ హౌజ్ నిర్మాణాన్ని వేగంగా చేపడుతోంది. దీని ద్వారా పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. అదే విధంగా తెలంగాణలోనే చింతలపాలెం మండలం బుగ్గమాదారం దగ్గర రూ.394 కోట్లతో రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా పులిచింతల దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించాలని చూస్తున్నారు. పులిచింతల సామర్థ్యం దాదాపు 45 టీఎంసీలు అయితే ఏకంగా 10.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ల ద్వారా మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడితే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కనీసం మాటలు లేవు. అడిగిన దాఖలాలూ లేవు. సాగునీటికి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులను చంద్రబాబు కల్పించారు.పబ్లిసిటీ స్టంట్తో రైతులను ముంచారు..జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. సాగుకు వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఈరోజు ఆ నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.బాబు నిర్వాకంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టంకరువు వల్ల ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు ఆదుకుంటున్నారా? అంటే అదీ లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్సార్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని భరించి కట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారు. పంటల బీమా పథకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గమనిస్తే.. రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో 2022–23 ఖరీఫ్లో 1.18 కోట్ల దరఖాస్తులకు ఉచిత పంటల బీమా వర్తిస్తే.. 2026–27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయి. ఇది స్వయంగా పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు. పీఎంఎఫ్బీవై కింద రాష్ట్రాలు, సంవత్సరాల వారీగా రైతులు, పంటల బీమాలో కవర్ అయిన భూ విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా కేంద్రం పార్లమెంట్కు ఇచ్చింది. మా హయాంలో నమోదైన 1.18 కోట్ల దరఖాస్తులు ఎక్కడ? బాబు పాలనలో రైతులే ప్రీమియం కట్టుకునే పరిస్థితుల్లో 40 లక్షల దరఖాస్తులు ఎక్కడ? ప్రస్తుతం 30–33 శాతం రైతులే బీమా పరిధిలోకి వచ్చారని తెలుస్తోంది. పైగా ఇంకా దారుణం ఏంటంటే 2023–24కు సంబంధించి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024 జూలైలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టాలి. రైతులు, రాష్ట్ర వాటాను రాష్ట్ర ప్రభుత్వం కడితే 1/3 వాటాను కేంద్రం ఇస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఏకంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. రూ.1,100–1,800 కోట్లు కట్టి ఉంటే రైతులకు రూ.3 వేల కోట్లు వచ్చేవి. -
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇసుక దందా సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
-
కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా స్పందించని బాబు..
-
పోరాటం చేయాల్సిందే.. వెళ్తూ వెళ్తూ వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ అదుర్స్
-
ఫోటోలకు భలే ఫోజులు ఇస్తాడయ్యా.. నిమ్మలపై జగన్ సెటైర్లు
-
వెలిగొండ ప్రాజెక్ట్ పేరుతో దోచుకున్నారు.. చంద్రబాబుపై ఎమ్మెల్యే ఫైర్
-
బాబు చాప్టర్ క్లోజ్... తేల్చేసిన సర్వేలు! టీడీపీ క్యాంపులో మొదలైన టెన్షన్..
-
ఎదో రైతులను ఉద్ధరిస్తున్నట్టు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఫోజులు.. TDP మంత్రులను ఏకిపారేసిన జగన్..
-
సెల్ఫ్ ఫైనాన్స్ ముసుగులో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్
-
ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే.. 'మనదే విజయం'
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూశాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు వారు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మనకు మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. పార్టీ, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది. ఇలా చేయగలిగితే మన గెలుపు ఖాయం.మీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఇక నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడి పోరాడాలి.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ ృ వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. దాదాపు 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటేరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. తీరా ఏమీ చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఇందుకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని, వెన్నుపోటు పార్టీ కూటమి ఘోర పరాజయం పొందడం ఖాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశామన్నారు. కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏమేం చేశారో? ఎన్ని దౌర్జన్యాలు చేశారో? ప్రత్యక్షంగా చూశామంటూ ఎత్తిచూపారు. అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. ‘కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి.. అధికార పక్షం వాళ్లు.. చంద్రబాబు ఎంత దౌర్జన్యం చేసినా, మాకు మా నాయకుడు ఉన్నాడు అనే భావన, నమ్మకం మీరు కార్యకర్తల్లో కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు’ అని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని.. ప్రజలంతా ఈ పాలనను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని మనం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగుతాయా.. లేదా.. అన్నది తెలియడం లేదు. ఒక వైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. మరో వైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారు. అది చట్ట ప్రకారం నేరం. రెండో వైపు పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశం. గతంలో మనం ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసింది. పక్కన తెలంగాణలో కూడా కోర్టు దాన్ని కొట్టేసింది. అయినా దానిపై చంద్రబాబు కావాలని జీవో ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే అక్కడ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కావాలని జీవో ఇచ్చి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు అసలు స్థానిక ఎన్నికలు జరుపుతాడా? అని అనుమానం వస్తోంది. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే మనం సిద్ధం కావాలి. ఆ దిశలో ముందుకు సాగాలి. గట్టిగా పోరాడాలి.ఇప్పుడు ప్రతి ఇంటా అదే చర్చ2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మనం దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంగా ఉన్నా, గ్రామ స్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించుకోగలిగాం. తొలిసారిగా గ్రామ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండున్నరేళ్లలో ఇలా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మించుకోగలిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన ఎలా ఉంది? అంతకు ముందు మన పరిపాలన ఎలా ఉంది? అన్న దానిపై ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన లో వంచన, దగా..ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. మనం చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చాం. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు ఏం చెప్పారంటే.. ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారుంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. అలా అన్నీ ఇస్తామని చెప్పి నమ్మించి, తర్వాత మోసం చేశారు. ప్రజలు దాన్ని గుర్తించారు. అందుకే ఈ రోజు ప్రతి ఇంట్లో వాటిపై చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నీ వైఫల్యాలు. మరో వైపు అరాచక పరిస్థితి. యథేచ్ఛగా రెడ్బుక్ అమలవుతోంది. స్కూళ్లు నాశనం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. విద్య, వైద్య రంగాలు మొత్తం నాశనం అయ్యాయి. మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అరెస్టులు.. భయపెట్టి లొంగ దీసుకునే పరిస్థితి.సమావేశానికి హాజరైన పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి..ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని మీరు కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. అలా చేయగలిగితే, మనం ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం. అంతే కాకుండా పార్టీ నుంచి ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది.ఈ విభాగాలు.. ఈ పనులు చాలా ముఖ్యంప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే/ఇన్చార్జ్ లీగల్ సెల్, మీడియా సెల్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు దౌర్జన్యం చేస్తాడు. మన పార్టీ వారిని వేధిస్తాడు. కాబట్టి మన క్యాడర్ను, కార్యకర్తలను కాపాడుకోవాలి. అందు కోసం మీరు మంచి టీమ్తో లీగల్ సెల్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మీడియా సెల్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్స్ (మీడియా సమావేశాలు)లో తరచూ మాట్లాడాలి. మనం చేసిన మేలు, సంక్షేమం చెబుతూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీడియా సెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి.. ఎలా యాక్టివేట్ చేయాలి.. ఎలా నడిపించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా దిగజారిపోయిన నెగటివ్ మీడియా ఈనాడు, ఏబీఎన్ తదితర వాటితో పోరాడుతున్నాం. మీకు మీరుగా బలంగా ఎదిగేందుకు, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ ఇంకా బలంగా మారడానికి మీరు తప్పనిసరిగా లీగల్ సెల్, మీడియా సెల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు నియోజకవర్గ స్థాయిలో పని చేస్తూ.. జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు దీంట్లో యాక్టివ్గా లేని వారు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండో అంశం.. ఇంటింటా ప్రచారం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లాలి. మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి మంచి చేశామనేది చెప్పాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దగా, వంచన గురించి వివరించాలి. మరో వైపు బలమైన అభ్యర్థి నిలబడాలి. ఆ అభ్యర్థి అందరినీ కలుపుకుపోవాలి. ఎక్కడా ఇగోకు వెళ్లొద్దు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. కేవలం 9 ఓట్లతో ఓడిన వారు, గెల్చిన వారు కూడా ఉన్నారు. జో జీతా వహీ సికందర్ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. ఎందుకంటే.. జో జీతా వహీ సికందర్ (గెలిచిన వారే రాజు). కాబట్టి వచ్చే 60, 70 రోజులు మీరు మీ నియోజకవర్గాలు దాటి వెళ్లొద్దు. అందరినీ కలవండి. వ్యవస్థలు పక్కాగా ఏర్పాటు చేసుకొండి. అన్యాయం చేస్తే వదిలి పెట్టబోమని పోలీసులకు కూడా గట్టిగా చెప్పండి. చూస్తుండగానే మూడో ఏడాదిలోకి వచ్చాం. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టబోమని చెప్పండి. వారిలో న్యూట్రాలిటీ (తటస్థ వైఖరి) తీసుకురావడానికి ప్రయత్నించండి. అప్పటికీ వారు మారకపోతే వారి వివరాలు డిజిటల్ డైరీలోకి ఎక్కించండి’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మీ పాత్ర చాలా కీలకంప్రతి చోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. పార్టీ కోసం గట్టిగా పని చేసే వారిని ఎంపిక చేయండి. రిజర్వేషన్ల ఖరారు తర్వాత, మారితే చూడొచ్చు. అంతేకానీ, అప్పుడు అభ్యర్థుల కోసం వెతికితే అంతగా ప్రయోజనం ఉండదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మీరు స్వయంగా హాజరై గుర్తింపు కార్డులు, మెటీరియల్ పంపిణీ చేయాలి. వాటికి సంబ«ంధించి, తగిన విధంగా నిర్దేశం చేయాలి. ప్రతిచోటా మీ ప్రమేయం ఉండాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు, అభ్యర్థి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై ప్రజలకు ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే అందరికీ ఆమోద యోగ్యమైన వారిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం వచ్చేలా చొరవ చూపాలి.ప్రతి చోటా పోటీ చేయాలిఎక్కడా ఏకగ్రీవం ఉండకూడదుమీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. అలా మన పార్టీ అభ్యర్థి నిలబడకుండా, పోటీలో లేకుండా ఉంటే, అక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడాలి. పోరాడాలి. అప్పుడే వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మీకు తోడుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. ఇవన్నీ మీ ద్వారానే పార్టీ కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. దాదాపు 15 లక్షల కార్డులు రెడీ అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఆ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటీరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఐదు అంశాలతో సంస్థాగత సమావేశాలు1. చంద్రబాబు పాలన వైఫల్యాలు2. మన ఐదేళ్ల పాలన, సంక్షేమం, సంస్కరణలు, ప్రజలకు చేసిన మేలు3. కేడర్ను మోటివేట్ చేసి, ఎన్నికలకు సిద్ధం చేయడం4. ఐడీ కార్డుల పంపిణీ5. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం సంస్థాగత సమావేశాల షెడ్యూల్⇒ సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్్జలు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇన్ఛార్్జలు, పార్టీ సీనియర్ నాయకులు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు.⇒ సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ. వీటిలో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.⇒ సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో గ్రామ, వార్డు స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం. అంటే సెప్టెంబర్ 23 నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ పాల్గొంటారు. మన పాలనలో విప్లవాత్మక మార్పులుమేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి, ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. దేవుడి దయ వల్ల ఆ విధంగా ఒక గొప్ప పాలన ఇవ్వగలిగాం. ఎన్నికల్లో ఒక మాట చెబితే, ఒక విషయాన్ని మేనిఫెస్టోలో పెడితే, దాన్ని తూ.చ తప్పకుండా అమలు చేపి చూపాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే, ఒక షెడ్యూల్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. ఇది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాం.⇒ సంస్కరణలు, మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు ద్వారా పూర్తి మార్పులు చేశాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. ఇంకా బైజూస్ కంటెంట్.⇒ గ్రామ స్థాయిలో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గ్రామంలో విలేజ్ క్లినిక్స్. ఆరోగ్యశ్రీలో 3,300కు పైగా ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. నాడు దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం స్పెషలిస్టుల కొరత ఉంటే, మన దగ్గర అది కేవలం 4 శాతం మాత్రమే. ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో నియామకాలు జరిపాం. మన హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ.⇒ వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేశాం. ఉచిత పంటల బీమా అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి పంటకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించాం. సీఎం–యాప్ ద్వారా పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, జేసీ స్థాయి అధికారితో మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. తద్వారా పంటల కొనుగోలులో పోటీ ఏర్పడి, రైతులకు మేలు జరిగింది. అలా ఐదేళ్లలో రూ.7,800 కోట్లతో పంటల కొనుగోలు చేశాం.⇒ సుపరిపాలన, మహిళా సాధికారత, విద్య, వైద్యంలో ఎప్పుడూ చూడని మార్పులు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. కర్నూలు, విశాఖలో కొత్త ఎయిర్పోర్టులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అత్యుత్తమ వైద్య సేవలందించాం. డయాలసిస్ సేవలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఆస్పత్రి ఏర్పాటు చేశాం. రూ.600 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాం. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా శాశ్వత చర్యలు చేపట్టాం. -
26 నెలల్లో అప్పులు రూ.3,86,348
సాక్షి, అమరావతి: సంపద సృష్టించడంలో ఘోర వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక విధ్వంసంతో అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించకపోగా రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. ఖజానాపై ప్రైవేట్ సంస్థలకు పెత్తనం కట్టబెడుతున్నారు. మద్యం ఆదాయంతో పాటు గనుల ఆదాయాన్ని సైతం తాకట్టు పెడుతున్నారు. నెలలో 20 రోజుల పాటు చేబదుళ్లకు వెళ్తున్నారు. వివిధ కార్పొరేషన్లకు ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు సర్కారు ఏకంగా జీవోల మీద జీవోలు జారీ చేస్తోంది. రికార్డు అప్పులు.. తన రికార్డును తానే తిరగరాస్తూ చంద్రబాబు అప్పుల మోత మోగిస్తున్నారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు రూ.2.49 లక్షల కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.2,600 కోట్ల బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట అప్పులు ఏకంగా రూ.3,86,348 కోట్లకు చేరాయి. ఇక ఈ ఆర్థిక ఏడాది ఐదు నెలల్లో బడ్జెట్ అప్పులు రూ.55,534 కోట్లకు ఎగబాకాయి. అంటే నెలకు రూ.11 వేల కోట్లకు పైగా బడ్జెట్ అప్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. నెలవారీ పన్ను రాబడిని మించి బాబు సర్కారు అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తోంది. మరోపక్క అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తోంది. తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదు. ఇన్ని అప్పులు చేస్తున్నా సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోంది. -
ఆగస్టు 25.. ఎన్టీఆర్ జీవితంలో చీకటి రోజు
-
నువ్వు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి...? దమ్ముంటే చర్చకు రండి...
-
సంపద సృష్టి పోయి అప్పుల ముష్టి.. ఈ వార్త చూస్తే బాబుగారు ఎదో ఉద్ధరిస్తున్నాడు అనుకుంటాం
-
స్థానిక ఎన్నికల్లో ఏమైనా ఓవర్ యాక్షన్ చేయాలని చూస్తే... జగనన్న మాతో చెప్పిన విషయాలు ఇవే
-
నా ఛానల్ లో ఆ సాంగ్ పెట్టినందుకు నాపై ఎన్ని కేసులు పెట్టారంటే...
-
ఆరోజు అలా చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఉష శ్రీ చరణ్ మాస్ వార్నింగ్
-
రెడ్ జోన్ లో కూటమి.. షాక్ లో పవన్
-
రెండేళ్లకే మోగుతున్న రెడ్ సైరన్.. ఈ కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది
-
ఆ 8లక్షల డబ్బు లిక్కర్ స్కామ్ కావు కారుమూరి అక్రమ అరెస్ట్ పై నాగార్జున యాదవ్
-
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
-
YS జగన్ పాలనలో విద్యా వికాసం, ఇప్పుడు విధ్వంసం
-
కూటమి సర్కార్ పై ఉద్యోగుల దండయాత్ర...!
-
సర్జరీలకు కత్తెర.. ‘ఔట్’ పేషెంట్!
ఫొటోలో బెడ్పై ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన సరస్వతి గుండెల్లో దడ, ఆయాసంతో కడప జీజీహెచ్ ఐసీయూలో చేరింది. జూడాలంతా సమ్మెలో ఉండటంతో వార్డుల్లో రోగులను పట్టించుకునే వారే లేరని, డాక్టర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీల్ చైర్లో కనిపిస్తున్న రాయచోటికి చెందిన నసీబ్ జాన్ కడుపు, నడుము నొప్పి సమస్యలతో బాధపడుతోంది. స్థానిక ఆస్పత్రుల్లో చూపించినా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం 100 కి.మీ. దూరంలోని తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చింది. ఎమర్జెన్సీలో చేరినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రయాసపడుతూ ఓపీకి తీసుకెళ్లారు. అక్కడ కనీస వైద్య పరీక్షలు కూడా చేయకుండానే మాత్రలు రాసిచ్చి వారం తర్వాత రమ్మని సిబ్బంది సూచించడంతో హతాశురాలైంది. 100 కి.మీ దూరం నుంచి వచ్చామని, మళ్లీ మళ్లీ రాలేమని ప్రాథేయపడ్డారు. సమస్య ఏమిటో పరిశీలించాలని కోరగా.. ‘డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతానికి మందులే ఇస్తాం’ అని చెప్పారని నసీబ్జాన్ వాపోయింది. నడవలేని పరిస్థితిలో ఉన్నా. ఇక ప్రైవేట్ ఆస్పత్రే దిక్కు అంటూ రుయా నుంచి వెళ్లిపోయింది.ఏలూరుకు చెందిన కుమారికి షుగర్ సమస్య తీవ్రమై ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్కు రాగా ఇన్పేషెంట్గా చేర్చుకోకుండా మందులు రాసి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్లగానే అనారోగ్యం తీవ్రం కావడంతో చేసేది లేక కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు, వైద్య కళాశాలల్లో సోమవారం 15వ రోజు జూడాల సమ్మె కొనసాగింది. తక్కువ స్టైపెండ్తో ఎక్కువ పని చేస్తున్న తమ ఇబ్బందులను గుర్తించాలని ప్లకార్డులు ప్రదర్శించి జూడాలు నిరసన తెలిపారు. తమ కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 శాతం స్టైపెండ్ పెంచే వరకూ వెనక్కు తగ్గబోమని ఏపీ జూడా అసోసియేషన్ పట్టుబడుతుండగా ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా ఏడాదికి 3 శాతం పెంపు హామీకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంతో ఆస్పత్రుల్లో సేవలు స్తంభించి రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం చలించడం లేదు.సాక్షి, అమరావతి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలకుపైగా బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించి రోగులు హాహాకారాలు చేస్తున్నా చంద్రబాబు సర్కారు మొండి పట్టుదల వీడటం లేదు. జూనియర్ డాక్టర్ల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. స్టైపెండ్ సవరణపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తూ ఎస్మా ప్రయోగానికి కుట్రలు పన్నుతోందని జూడాలు ఆరోపిస్తున్నారు. అత్యవసర సేవలు సైతం బహిష్కరించి జూడాలు సమ్మె చేస్తుండటంతో బోధనాస్పత్రుల్లో సేవలు పూర్తిగా కుంటుపడ్డాయి. వందల కి.మీ నుంచి వ్యయప్రయాసల కోర్చి వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని చంద్రబాబు సర్కార్ ఉద్దేశపూర్వకంగా నీరు గార్చే కుట్రలు చేస్తోంది! సంక్షోభ పరిస్థితులను సృష్టిస్తూ పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీసే దుస్థితి కల్పిస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితిని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం కల్పించింది. ఇన్ సర్వీస్ మెడికల్ పీజీ కోటాకు కోతల పేరిట రెండేళ్ల పాటు పీహెచ్సీ వైద్యులను రోడ్లెక్కించి గ్రామీణ వైద్యాన్ని నెలల తరబడి స్తంభింప చేసి అతలాకుతలం చేసింది. కొత్త వైద్య కళాశాలను ప్రైవేట్కు కట్టబెడుతూ పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యానికి గండి కొట్టింది. తాజాగా జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంచకుండా వారిని సమ్మెలోకి దిగేలా చేసింది. 30 శాతం స్టైపెండ్ పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తే కేవలం 3 శాతం పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో సమ్మె బాట పట్టారు. రెండేళ్లకు ఒకసారి జూడాలకు 15 శాతం పెంచాలి. అయితే పెరిగిన జీవన వ్యయం, ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో 30 శాతం పెంచాలని జూడాలు కోరుతున్నారు.విశాఖలోని కేజీహెచ్లో ఓపీల కోసం బారులు తీరిన రోగులు, కుటుంబ సభ్యులు వైద్య సేవలు పతనంస్టైపెండ్ పెంపుపై సర్కార్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా 7,500 మందికిపైగా జూడాలు విధులకు దూరం అయ్యారు. ప్రస్తుతం రెగ్యులర్ వైద్యులు మాత్రమే సేవలు అందిస్తుండగా రోగుల తాకిడికి అనుగుణంగా అందుబాటులో లేరు. ఓపీలో వారం పది రోజులకు మందులు రాసిచ్చి మళ్లీ రావాలని సూచిస్తున్నారు. అన్ని జీజీహెచ్ల్లో రెండు వారాలుగా అత్యవసరం కాని మేజర్, మైనర్ సర్జరీలన్నింటినీ వాయిదా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్రం అంతటా 200కిపైగా ప్రసవాలు నమోదు అవుతుండగా సమ్మె నేపథ్యంలో సోమవారం 70 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది. 2 వేలకు పైగా నమోదయ్యే సర్జరీలు ఏకంగా సగానికి పరిమితం అయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మేర అడ్మిషన్లు పడిపోయాయి. నర్సులు, నర్సింగ్ విద్యార్థులే దిక్కువైద్యుల కొరత నేపథ్యంలో ఐసీయూ, అత్యవసర విభాగాల్లో సేవలు అగమ్యగోచరంగా మారాయి. గతంలో 24/7 ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయూల్లో జూనియర్ వైద్యులు అందుబాటులో ఉంటూ రోగుల బాగోగులు చూసుకునేవారు. రోగి పరిస్థితి విషమించిన సమయాల్లో సీనియర్ వైద్యులను అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు డ్యూటీలో ఉండే నర్సులు, నర్సింగ్ విద్యార్థులే రోగులకు దిక్కవుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్లో 300 మందికిపైగా జూడాలు విధులకు దూరం కావడంతో ఓపీ, ఐపీల్లో రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.వెనక్కి తగ్గం.. ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె కొనసాగిస్తాం30 శాతం స్టైపెండ్ పెంపు డిమాండ్తో సమ్మెలోకి వెళ్లాం. ప్రభుత్వం మూడు శాతమే పెంచుతామని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో మేమే ఓ మెట్టు దిగి 20 శాతం పెంచాలని కోరాం. దీనికీ ప్రభుత్వం నో చెప్పింది. సోమవారం మళ్లీ చర్చలయ్యాయి. పీజీలకు మూడు శాతం మించి పెంచేదిలేదని ప్రభుత్వం చెప్పేసింది. కనీసం 15 శాతం అయినా పెంచాలని అడిగాం. దీనికి కూడా అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మేం వెనక్కు తగ్గబోం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ సమ్మె కొనసాగిస్తాం. – ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్లు లేని లోటు కనిపిస్తోందిఆయాసం సమస్యతో జీజీహెచ్కు వచ్చా. ఎమర్జెన్సీలో పట్టించుకునే వారే లేకుండా పోయారు. గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. వైద్యులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. – ఫాతిమా, కడప జీజీహెచ్ఈ పరిస్థితి ఉండేది కాదు..తాడిపత్రి నుంచి అత్యవసర వైద్యం కోసం సోమవారం ఉదయం అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చా. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. డ్యూటీలో పీజీ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనిపిస్తోంది. – నదీం, లారీ యజమాని, అనంతపురం జిల్లాప్రైవేట్ ఆస్పత్రికి వెళుతున్నాం..మా అమ్మ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన జీజీహెచ్కు తీసుకొచ్చా. నాలుగు గంటలు తిప్పారు. అష్టకష్టాలు పడి అడ్మిట్ చేస్తే చికిత్స చేయడానికి వైద్యులు లేరు. వార్డుల్లో నర్సులు మాత్రమే ఉంటున్నారు. అమ్మ ఆరోగ్యం కుదుట పడలేదు. ఇక్కడే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందుకే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోతున్నాం. – విజయ్కుమార్, విజయవాడ -
కూటమి ఇంత దిగజారుతోంది వాళ్ల టార్గెట్ బిసీలే..! కడిగిపారేసిన విడదల రజిని
-
TDP MP బస్తిపాటి నాగరాజుకు ఘోర అవమానం
-
మీ కోసం ఒక కుర్చీ ఉంది.. చంద్రన్న(76).. లోకేశన్న(43) ..పవనన్న (54) జడ శ్రవణ్ నాన్ స్టాప్ సెటైర్లు
-
ఈ నెల 30న బాబు మరో క్రెడిట్ చోరీ. వెలిగొండ ప్రాజెక్ట్ ఆలోచన YSRది
-
BCలంటే బాబుకు ఎందుకు అంత భయం..? ఎందుకు ఇంత కక్ష సాధింపు
-
భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్
-
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
రాష్ట్రమంతా గంజాయి ఊడలు..'కుప్పంలో గుప్పు'!
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో గంజాయి గుప్పు ఇచ్చాపురం నుంచి రాజధాని ప్రాంతం మీదుగా హిందూపురం దాకా వ్యాపిస్తోంది. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో గ్రామ గ్రామాన గంజాయి దొరుకుతుండటంతో రాష్ట్రం అక్రమ రవాణాకు గేట్ వేగా మారిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ గంజాయి గుప్పుమంటోంది. విచ్చలవిడిగా సాగుతున్న మత్తు మందుల విక్రయాలపై స్వయంగా టీడీపీ నేతలే పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. పచ్చ ముఠాలు యువతను గంజాయి మత్తులో ముంచి సొమ్ము చేసుకుంటున్నాయి. దేశంలో డ్రగ్స్, గంజాయి దందా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే బహిర్గతమవుతున్నాయి. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా టీడీపీ కూటమి నేతలే చిక్కుతున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులకు చిక్కగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరకడం గమనార్హం. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడులో ఏకంగా ఇద్దరు ఎస్ఐలే గంజాయి తరలిస్తూ పట్టుబడటం రాష్ట్రంలో రెడ్బుక్ అరాచక పాలనకు నిదర్శనం. పోలీసులు యాక్సిడెంట్ చేసిన కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడంతో గంజాయి బండారం బట్టబయలైంది. గంజాయి సాగు, రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసన్నల్లోనే య«థేచ్ఛగా దందా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో గంజాయి దందాకు గేట్ వేగా మార్చేశారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకు ఊపిరి పోసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి సాగుతోపాటు ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా కొనుగోలు చేసి ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయి తరలిస్తున్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఎక్కువగా గంజాయి పట్టుబడటం గమనార్హం. మదనపల్లెలో పట్టుబడిన రూ.32 లక్షల గంజాయి, కూల్ లిప్స్ అక్రమ రవాణాలో కన్నా అనుచరులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు ఇద్దరు గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. అల్లూరి జిల్లా నుంచి తమిళనాడుకు 220 కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా సత్తెనపల్లికి చెందిన షేక్ మొహమ్మద్ రఫీ, డ్రైవర్ ఫయాజ్, పెద్దబయలు మండలం తారాజు జలపాతానికి చెందిన కిల్లో తిమోతి ఈ ఏడాది జూలై 15న గుడివాడ జంక్షన్ వద్ద పోలీసులకు చిక్కారు. ప్రాణాలు తీస్తున్న మత్తు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గంజాయి జాడలు మారుమూల పల్లెల వరకు పాకాయి. యువతే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల వద్ద విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో హత్యలకు సైతం వెనుకాడడం లేదు. అక్రమ రవాణా అడ్డుకుంటే వాహనంతో ఢీకొట్టిన ఘటనలున్నాయి. ఆగస్టు 2వ తేదీన దగదర్తి మండలం సున్నపుబట్టి జాతీయ రహదారిపై 313 కేజీల గంజాయి పట్టుబడింది. రెండున్నరేళ్లుగా సుమారు 1,170 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వెంకటాచలం టోల్ప్లాజా వద్ద తనిఖీల్లో చెన్నైకు సరఫరా చేస్తున్న గంజాయి లభ్యమవుతోంది. గూడూరులో గంజాయి ప్యాకెట్ రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. పొట్టి శ్రీరాములు పార్కువీధి, రైల్వే పార్శిల్ ఆఫీస్, ముత్యాలపేట సందు, రైల్వే క్వార్టర్స్ సమీపంలో జోరుగా విక్రయాలు సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో బైపాస్రోడ్డులోని పాత నూనె మిల్లు ప్రాంతంలో, మున్సిపల్ బస్టాండ్ ఎదురు వైపు సినిమా హాలు వెనుక ఉన్న ఖాళీ స్థలాల మరుగు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు దర్జాగా సాగుతున్నాయి. కారిడార్లా ఒంగోలు గంజాయి రవాణాకు ఒంగోలు కారిడార్లా మారింది. విశాఖ నుంచి ఒంగోలు వెళ్లే రైళ్లు, జాతీయ రహదారుల మీదుగా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. ఇటీవల ఒంగోలులో మినీ లారీలో తమిళనాడుకు తరలిస్తున్న 280 కేజీల గంజాయి పట్టుబడింది. ఒంగోలు శివారులో యాక్సిడెంట్ జరగడంతో ఇది దొరికింది. మోచర్ల సమీపంలో కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న కారులో పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం కలకలం రేపింది. కొండపి మండలంలో టంగుటూరు వద్ద తరచూ గంజాయి పట్టుబడుతోంది. చీమకుర్తిలో గంజాయి చాక్లెట్లను టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇటీవలే శంఖవరప్పాడు వద్ద ఏకంగా పోలీసుల కారులోనే గంజాయి లభ్యం కావడం సంచలనం సృష్టించింది. మార్కాపురం పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం సమీప గ్రామాల్లోని పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న ఘటనలు గతంలో వెలుగు చూశాయి. మత్తులో ఘర్షణలుపోలీసు రికార్డుల ప్రకారం ఏలూరు జిల్లాలో 489 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 342 మంది గంజాయి విక్రేతలున్నట్లు నిర్ధారించారు. అరకు, ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. గంజాయి మత్తులో భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ఘర్షణలు జరిగాయి. ఏజెన్సీ నుంచి దేశ రాజధానికి..! ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాజమహేంద్రవరం మీదుగా గంజాయి తరలిపోతోంది. మెజారిటీ సరకు గుట్టుగా తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీకి తరలిస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 120 కిలోల గంజాయి కొనుగోలు చేసి పుణేకు తరలిస్తుండగా కొవ్వూరు జాతీయ రహదారి సమీపంలో జూలై 4న పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణలోని కోదాడకు 15.5 కిలోల గంజాయి తరలిస్తున్న ఐదుగురు విద్యార్థులను కోరుకొండ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేరు. తాజాగా మలికిపురం మండలం లక్కవరంలో ఓ వ్యక్తి నుంచి 1,150 గ్రాముల గంజాయిని స్వా«దీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అంతర్వేదిలో మూడు నెలల క్రితం గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాకినాడలో పొట్లాలు అరకు, విశాఖ రూరల్, పాడేరు నుంచి కాకినాడకు గంజాయి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా చిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నారు. కాకినాడ జిల్లా పరిధిలో ఏడాది వ్యవధిలో 11 గంజాయి కేసులు నమోదయ్యాయి. సిక్కోలులో హైకోర్టు లోగో అతికించి.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడులో తాజాగా పోలీసుల తనిఖీల సందర్భంగా 3.85 కిలోల గంజాయి తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులు పట్టుబడ్డారు. ఒడిశాలోని గుణుపూర్ నుంచి తమిళనాడుకు రైలుమార్గంలో వెళ్లేందుకు యత్నిస్తూ చిక్కారు. గత రెండేళ్లలో ఇచ్ఛాపురంలో 1,200 కిలోలకుపైగా గంజాయి పట్టుబడింది. కొద్ది రోజుల క్రితం మెళియాపుట్టి మండలం జాడుపల్లి వద్ద 500 కిలోలకు పైగా గంజాయి తరలిస్తున్న బొలేరో.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో స్థానికులు పట్టుకున్నారు. హైకోర్టు లోగో స్టిక్కర్లు అతికించిన కారులో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠా చిలకపాలెంలో పట్టుబడింది. ఈ ఏడాది ఆగస్టు 2వతేదీన విజయనగరం రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాలోని మునుగుడ నుంచి చెన్నైకు తరలిస్తున్న రెండున్నర కిలోల గంజాయి పట్టుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి అనంతకు.. అనంతపురం పోలీసులు రెండు నెలల క్రితం గంజాయి సరఫరా చేస్తున్న 14 మందిని అరెస్ట్ చేసి ఏడు కిలోలు స్వాదీనం చేసుకున్నారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ కేంద్రంగా గంజాయి సరఫరా జరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి రైలుమార్గం ద్వారా గుంతకల్లు జంక్షన్కు గంజాయి తరలించి వివిధ మార్గాల్లో జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి ముఠాల ఘాతుకం వైఎస్సార్ కడప జిల్లాలో కూటమి నేతలు గంజాయి దందాలో మునిగిపోయారు. కడప టూ టౌన్, చిన్న చౌక్, రిమ్స్ పీఎస్, తాలూకా ప్రాంతాలలో అమ్మకాలు జరుగుతున్నాయి. ⇒ ఇంజక్షన్ల ద్వారా మత్తు మందులు తీసుకుంటున్నారు. దీని వెనుక పచ్చముఠాలున్నాయి. ⇒ కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంకాని పల్లె ప్రాంతంలో నివసిస్తున్న పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ మొదట గ్రామంలో గాయపరిచి తర్వాత రిమ్స్ పీఎస్ పరిధిలో వెంటాడి దారుణంగా హత్య చేసింది. ఎర్రగడ్డల లోడు మాటున.. మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఎరగాని మిట్ట వద్ద ఎర్రగడ్డల లోడు ఆటోలో దాచిన సుమారు రూ.4 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అరకు నుంచి కర్నూలుకు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదోని గంజాయికి గేట్వేగా మారింది. ఆదోని, ఎమ్మిగనూరు. ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా గంజాయి సాగు జరుగుతోంది. కర్నాటక పోలీసుల దాడుల్లో 50 కేజీల గంజాయి పట్టుబడింది. బళ్లారిలో పెద్ద ఎత్తున లభ్యం కావడంతో తనిఖీలు చేపట్టారు. గూడూరు మండలం పులకుర్తి క్రాస్ దగ్గర ఇటీవల 751.20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలం బోయిలకుంట్లకు చెందిన వ్యక్తి నుంచి 8 నెలల క్రితం సుమారు 3 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. కర్నూలు అర్బన్ తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేజీల గంజాయి పట్టుబడింది. అరకు నుంచి కారులో గంజాయి తెస్తూ 2025 సెప్టెంబర్ 16న కర్నూలులో పోలీసులకు పట్టుబడ్డారు. కర్నూలుతో పాటు చుట్టుపక్కల దాదాపు 50 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పొట్లాల రూపంలో గంజాయి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. కుప్పంలో గుప్పు గుప్పుచిత్తూరు జిల్లాలో పూతలపట్టు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి బెంగళూరుకు ఎగుమతి చేసే గంజాయి చిత్తూరు జిల్లా మీదుగానే రవాణా అవుతోంది. కుప్పానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు ఒడిశా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. చిత్తూరులో ఇద్దరు టీడీపీ మహిళా నాయకులు గంజాయి విక్రయించడంపై పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎం ఇలాకాలో దందాపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదుసీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో గంజాయి, గుట్కా, హాన్స్ లాంటి ప్రాణాంతక మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండడంపై స్వయంగా టీడీపీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లావ్యాప్తంగా మత్తు రక్కసి కోరలు చాస్తుండడంతో విద్యార్థులు, యువత భవిష్యత్ ప్రమాదంలో పడిందని చిత్తూరు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూలై 20వ తేదీన కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో కలెక్టర్ సుమిత్ కుమార్కు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. గంజాయి రవాణాలో కీలక ప్రాంతాలుఅల్లూరి సీతారామరాజు జిల్లా (ఏఎస్ఆర్ ) పెదబయలు మంగ బంద నుంచి దుంబ్రిగూడ, అరకు పాండ్రంగి, బొబ్రా, అనంతగిరి మీదుగా బోడౌరో చెక్పోస్టు దాటుకుని ఎస్.కోట, ఎల్.కోట, అలమండ, కొత్తవలస మీదుగా విశాఖ వైపు తరలిస్తున్నారు. ఒడిశా కోరాపుట్ నుంచి బరంపురం, సాలూరు మీదుగా విజయనగరంలోకి చేరవేస్తున్నారు. జయపూర్ నుంచి సునాబేడ, పి.కోనవలస, సాలూరు రూరల్, బాడంగి, తెర్లాం మీదుగా శ్రీకాకుళం, నరసన్నపేట, మెలియపుట్టి, గోపాల్పూర్ మీదుగా బరంపురం వెళుతోంది.విశాఖకు తరలించే మార్గాలివి.. రాయగడ నుంచి కూనేరు మీదుగా కొమరాడ, పార్వతీపురం టౌన్, సీతానగరం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం మీదుగా విశాఖకు తరలిస్తున్నారు. బెజవాడలో భారీగా విక్రయాలురాజధాని ప్రాంతం అడ్డాగా ప్రధానంగా విజయవాడ సిటీలో గంజాయి విక్రయాలు భారీగా జరుగుతున్నాతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పటమట పోలీస్స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా గంజాయి రవాణా జరుగుతోంది. ఒడిశా, వైజాగ్, మన్యం నుంచి సరుకు తెస్తూ స్మగ్లర్లు పెద్ద ఎత్తున పటమట పోలీస్స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారు. జూన్ 9వ తేదీన లారీలో 140 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ఈగల్ బృందం పట్టుకుంది. వీరిలో కింగ్పిన్ సొహైల్ జూన్ 11న పటమట పోలీసుల కళ్లు గప్పి కోర్టులో ప్రవేశ పెట్టకముందే పరారయ్యాడు. ఈ ఏడాది జూన్ 24న భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 5 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. జూలై 13న గవర్నర్పేటలో అరుమిల్లి బాలసాయి శ్రవణ్ కుమార్ను అరెస్టు చేసి 26.38 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. జూన్ 24వ తేదీన విజయవాడలో పట్టుబడిన గంజాయి విక్రేతల అరెస్టు చూపుతున్న ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్కు చెందిన ముకేశ్ ఓపీఎం (నల్లమందు) విక్రయిస్తూ పటమట పోలీసులకు పట్టుబడ్డాడు. ఈగల్ తనిఖీల్లో పట్టుబడినవి మినహా పోలీసులు దాడులు చేసి పట్టుకుంది చాలా తక్కువ. భవానీపురంతో పాటు రూరల్ పరిధిలో నిత్యం గంజాయి విక్రయాలు జరుగుతున్నా చర్యలు శూన్యం. పెనమలూరు నియోజకవర్గం గంజాయికి అడ్డాగా మారింది. మన్యం నుంచి వ్యాపారులు ఇక్కడికి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రత్యేక మార్గాల ద్వారా విద్యార్థులు, యువత, కాలువ కట్ట ప్రాంత వాసులకు గంజాయి చేరుతోంది. ఇక్కడి నుంచి ప్రైవేటు వాహనాలలో బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు చేరవేస్తున్నారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా అవుతోంది. గుడివాడ, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో గంజాయి రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అరకు నుంచి తిరుపతికి గంజాయితిరుపతి రూరల్: అల్లూరి జిల్లా అరకు నుంచి కిలోల కొద్దీ గంజాయి గుట్టుగా తిరుపతికి చేరుతోంది. ఆపై తిరుపతిలో చిన్న ప్యాకెట్లుగా మారి చిల్లర దందాకు తెరలేస్తోంది. అరకు–తిరుపతి మధ్య గుట్టుగా సాగుతున్న ఈ గంజాయి సరఫరా వ్యవహారాన్ని తిరుపతి రూరల్ పోలీసులు రట్టు చేశారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 6.35 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల ప్రకారం.. అవిలాల పంచాయతీ ధనలక్ష్మి నగర్కు చెందిన విక్రమ్రెడ్డి, తిరుచానూరుకు చెందిన మురుగన్ అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి తిరుపతిలో గుట్టుగా విక్రయిస్తున్నాడు. పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన గంజాయిని నేరుగా విక్రయించకుండా, 50 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా చేసి చిల్లరగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. వీరిద్దరి కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు, వారి కార్యకలాపాలపై పక్కా సమాచారం సేకరించి ఆదివారం ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అరకు నుంచి తిరుపతికి గంజాయి ఎలా చేరుతోంది? ఈ సరఫరా వెనుక ఇంకెవరున్నారు? ఎవరెవరికి విక్రయిస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విక్రయాలను అడ్డుకున్నాడనే ఆగ్రహంతో నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెంచలయ్యను ఏడాది క్రితం ఓ ముఠా దారుణంగా హత్య చేసింది. మూడు నెలల క్రితం ఆత్మకూరు ఏసీఎస్ఆర్ కాలనీలో ఓ యువకుడు గంజాయి మత్తులో పలువురిపై దాషీ్టకానికి పాల్పడుతుండడంతో అడ్డుకోబోయిన కరిముల్లా అనే వ్యక్తిని బీరు బాటిల్తో తలపై కొట్టడంతో తీవ్ర గాయమై రక్త స్రావమైంది.⇒ పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు ఇద్దరు ఇటీవల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ⇒ ఏడాది క్రితం శ్రీకాకుళం టీడీపీ కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి బ్యాచ్తో జరిగిన ఘర్షణలో తలకు బలమైన గాయం తగలడంతో చనిపోయాడు. ⇒ విశాఖ బీచ్ రోడ్డులో యువత పగలు రాత్రి తేడా లేకుండా గంజాయి మత్తులో జోగుతోంది. గంజాయిని నర్సీపట్నం మీదుగా విశాఖకు తరలించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ⇒ తిరుపతి నగరంలోని జీవకోన, మంగళం, దాసరి మఠం, బస్టాండ్ పరిసరాలు, ఎం ఆర్ పల్లి, పోస్టల్ కాలనీ తదితర ఏరియాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ⇒ శ్రీకాళహస్తి పట్టణంలో కూడా గంజాయి విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు తెలుస్తోంది. -
పోలీసుల జల్సాలు.. ఏపీలో ఆటవిక పాలన.. చేతులెత్తేసిన చంద్రబాబు
-
వెంటాడు.. వేటాడు.. బాబుకు BCల దెబ్బ చూపిస్తాం.. ఇది మాత్రం గ్యారంటీ
-
‘ఎకోరన్’పై అలవిమాలిన ప్రేమ!
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామంలో నిర్మించనున్న 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ (పీఎస్పీ) ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భారీగా పెంచడం అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా రూ.784.95 కోట్ల అదనపు భారం పడుతున్నా, ఆ మేరకు ప్రైవేటు సంస్థకు మేలు చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపడం వెనుక అసలు కారణాలేవై ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. పీఎస్పీ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత రూ.7,376.74 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 12న జీవో నెం.3 పేరుతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కానీ ఎనిమిది నెలలకే ఆ వ్యయాన్ని రూ.8,161.69 కోట్లకు సవరిస్తూ ఈ నెల 19న మరో జీవో నెం.64 విడుదల చేసింది. ఈ పనులు చేపట్టనున్న హైదరాబాద్కు చెందిన ఎకోరన్ కన్సార్టియంకు రూ.5,470.62 కోట్ల విలువైన పనులు అప్పగించేందుకు కూడా ప్రభుత్వం అదే జీవోలో అనుమతినిచ్చింది. ఆ మొత్తంలో జీఎస్టీ కలపలేదని చెప్పింది. మిగతా పనులు కూడా ఇదే సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అంచనా వ్యయాన్ని సైతం పెంచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రూ.2,691.07 కోట్ల పనులు కూడా ఇదే సంస్థకు దక్కనున్నాయి. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. ఈ నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి లేదు. ఏపీఈఆర్సీ ఆమోదం పెండింగ్లో ఉందని స్వయంగా ప్రభుత్వ ఆదేశాల్లోనే పేర్కొనడం విశేషం.‘టీఈసీ’ అక్కర్లేదు..రూ.785 కోట్లు అవసరంకమలపాడు ప్రాజెక్టులో 238 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు, 118 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు చొప్పున మొత్తం 950 మెగావాట్లతో పీఎస్పీ ఏర్పాటు చేస్తామంటున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు సైతం ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నుంచి టెక్నో–ఎకనామిక్ కాంకరెన్స్ (టీఈసీ) పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రాజెక్టు వ్యయం ఒక్కసారిగా రూ.7,376.74 కోట్ల నుంచి రూ.8,161.69 కోట్లకు పెంచేసింది. జీఎస్టీ, ధరల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి(ఐడీసీ), ఎస్కలేషన్, ఇతర నిబంధనల కారణంగా రూ.785 కోట్లు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.ఎకోరన్పైనే ఎందుకింత ప్రేమ?ఎకోరన్ కన్సార్టియంకు తొలి దశలో రూ.5,470.62 కోట్ల పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే ఆ సంస్థ ఎంతో గొప్ప సంస్థ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. దాని చరిత్ర చూస్తే విస్మయం కలుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎకోరన్ ఎనర్జీకి సంబంధించి జీఎస్టీ అధికారులు తప్పుడు ఇన్వాయిస్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అక్రమ వినియోగం జరిగినట్లు గుర్తించారు. సుమారు రూ.64 కోట్ల ఐటీసీ అక్రమంగా పొందినట్లు ఆ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంస్థ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్ను అరెస్టు కూడా చేశారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అప్పగించడం వెనుక పెదబాబు, చినబాబుల స్వార్థ ప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రూ.వెయ్యి కోట్ల సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులుగతేడాది నవంబర్లో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా ఎకోరన్ సంస్థ రాష్ట్రంలో రూ.76,250 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 8 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 1.25 ఎంటీపీఏ గ్రీన్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే సంస్థ తెలంగాణలో మరో రూ.27,000 కోట్లతో 5.5 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రతిపాదిత పెట్టుబడులు రూ.1,03,250 కోట్లు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ ప్రాంతంతో ఓ వాణిజ్య భవనం, రెండవ అంతస్తులో అనేక దుకాణాల మధ్య ఒక చిన్న బోర్డు పెట్టుకుని ఏర్పాటైన ఎకోరన్ సంస్థ మొత్తం ఆస్తులు కేవలం రూ.1,000 కోట్లే. ఏడాదికి ఆ సంస్థ లాభాలు రూ.6 కోట్లు మాత్రమే. మరి అంత తక్కువ స్థాయిలో ఉన్న ఓ సంస్థ ఏపీలో ఏకంగా రూ.76,250 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.ఇష్టానుసారం భూ దోపిడీరాష్ట్రంలో ఎకోరన్కు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారంలో భూముల కేటాయింపుల కోసం కేవలం 12 నెలల్లో ఏకంగా 13 జీవోలను విడుదల చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో కొన్ని జీవోలు ఏకంగా 508.66 ఎకరాల భూమిని వివిధ జిల్లాల్లో కేటాయిస్తూ ఇస్తే.. మరికొన్ని జీవోలు కేటాయించిన భూములను డొల్ల కంపెనీలకు మారుస్తూ ఇచ్చారు. తొలుత ఎకోరన్కు రాయితీలు కల్పిస్తూ జీవోలు ఇస్తే, వాటిని ఏఎంప్లస్ ఎవరెస్ట్, ఏఎంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్, దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ, ఓ2 పవర్ ఎస్జీ పీటీఈ, అయిన రెన్యువబుల్ ఎనర్జీ, ఓ2 పవర్ ఎస్జీ2 పీటీఈ, ఆంపిన్ ఎనర్జీ, ఎన్ఎస్ఎల్ రెన్యువబుల్ ఎనర్జీ పేరు మీదకు బదలాయించారు. ఎకోరన్ పేరుతో కేటాయించిన భూములు ఇలా ఇతర కంపెనీలకు ఇవ్వడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా సింగపూర్ కేంద్రంగా నమోదైన ఓ2 పవర్ ఎస్జీ పీటీఈ, ఓ2 పవర్ ఎస్జీ2 పీటీఈ కంపెనీలకు భూములను బదలాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎకోరన్ సంస్థకు ఇంత ప్రాధాన్యం ఎందుకు? ప్రాజెక్టు వ్యయం పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సంస్థ పెట్టుబడుల సామర్థ్యంపై ప్రభుత్వం చేసిన పరిశీలన ఏమిటి? ఏపీఈఆర్సీ ఆమోదానికి ముందే పనులు అప్పగించడానికి తొందరెందుకు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. -
ఆటవిక పరిపాలన @ ఏపీ
భారత రాజ్యాంగానికి అతీతులమనే భావన ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో బలంగా పాతుకొనిపోయింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన చట్టుబండలైన చలనదృశ్యాలు గజ్జెకట్టి మరీ గంతు లేస్తున్నాయి. రక్షకులే భక్షకులుగా మారిన ఆటవిక రాజ్య వికటాట్టహాసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ప్రాథమిక హక్కుల సంగతి దేవుడెరుగు, ప్రజల ప్రైవేట్ ఆస్తులను సైతం గద్దెలమీదున్న గద్దలు ఇష్టారీతిన ఎగరేసుకు పోవడం రివాజుగా మారింది. ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగ్స్గా మారి ప్రైవేట్ ట్యాక్స్లను పిండుకుంటున్నారు. ప్రకృతి వనరులను సొంత ఖజానాల్లోకి తవ్వి పోసుకుంటున్నారు. రొచ్చు గుంటల్ని సైతం వదలకుండా చేపలవేటకు బయల్దేరు తున్న నాయకమన్యుల కక్కుర్తి కంపు ప్రజల నాసికాఘ్రాణ సహనాన్ని సవాల్ చేస్తున్నది.యువతరం ఆశల మీద, ఆకాంక్షల మీద పాలకులే పూను కొని గంజాయి మత్తును వెదజల్లుతున్నారనేందుకు సాక్ష్యాలు లభ్యమవుతున్నాయి. నవయువత స్వప్నతరంగాలను దారి మళ్లించేందుకు కుట్ర చేస్తున్నారని బలంగా నమ్మవలసి వస్తున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ‘ఉడ్తా పంజాబ్’ రోజులను గుర్తుకు తెస్తున్నది. పోలీసు వాహనాల్లోనే రాచమర్యాదలతో గంజాయి రవాణా గమ్యంవైపు సాగి పోతున్నది. అనధికార రాష్ట్ర మొక్క హోదాను గంజాయి మొక్క అనుభవిస్తున్నదనుకోవాలేమో! పగల్లేదు, రాత్రి లేదు... ఎనీ టైమ్, ఎనీ సెంటర్, ఎనీ లొకాలిటీ... విచ్చలవిడిగా మద్యం అందు బాటులో ఉంటున్నది.లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా ఏర్పడిన బెల్ట్ షాపులే కాదు, వాటికి మొలతాడు షాపులు కూడా మొలకెత్తి డోర్ డెలివరీ స్టేజికి చేరుకున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రవహిస్తున్న మద్యం క్యూసెక్కుల లెక్కకూ, రాష్ట్ర స్థాయి విక్రయాల లెక్కకూ హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. అనధికార కల్తీ సరుకు అంగళ్లను ముంచెత్తుతున్నదనేందుకు ఇదే పెద్ద రుజువు. అనధికార అమ్మకాలకు సంబంధించిన ధరవరలను, వేలం పాటలను ప్రజాప్రతినిధులే దగ్గరుండి నిర్వహించి వాటాలను నిర్ణయిస్తున్నారనే వార్తలు బహిరంగ రహస్యాలుగా చలామణి అవుతున్నాయి. అడ్డుకట్టల్లేని వారుణి వాహిని ఊరూవాడల్ని ముంచెత్తుతుంటే జనజీవనం మీద దాని పర్యవసనాలెలా ఉంటాయో విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అద్దంకి ఘటన చెబుతున్నదేమిటి? ఆ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు చేసే వ్యాపారులు పరిమితిని మించి అక్రమ రవాణాను యథేచ్ఛగా చేసుకోవడానికి అడ్డంకులు లేకుండా ఎవరి వాటాలు వారికి పంచే ఒప్పందం కోసం ఒక పొట్టేళ్ల పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీకి ఒక మంత్రి పీఏ సమన్వయకర్తగా వ్యవహరించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గ్రానైట్ వ్యాపారులతో పాటు కొందరు అధికార రాజకీయ నేతలు, అరడజన్ మందికి పైగా ఎస్ఐలు, ఒకరో ఇద్దరో సీఐలు, ఎంపిక చేసుకున్న కొందరు పెంపుడు మీడియా ప్రతినిధులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు సమాచారం. ఒక ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా పార్టీ జరిగింది.లిక్కర్ గ్లాసుల గలగలలూ, పొట్టేళ్ల మాంసం ఘుమ ఘుమల మధ్య చర్చలు, ఒప్పందాలు పూర్తయిన తర్వాత అతిథులను తగురీతిన సత్కరించి గ్రానైట్ వ్యాపారులు వీడ్కోలు పలికారట. అలా బయల్దేరిన ఒక కారుకు సమీపంలోని శంఖవరప్పాడు అనే గ్రామం వద్ద ఆక్సిడెంట్ జరిగింది. చుట్టుముట్టిన గ్రామస్తులు అందులో ప్రయాణిస్తున్న మఫ్టీలో ఉన్న ఇద్దరు ఎస్ఐలను గుర్తించలేదు. డ్రైవర్తోపాటు ఈ ఇద్దరూ ప్రయాణంలో కూడా తాగుతున్నట్టుగా గమనించి ఆ కారును అక్కడే నిలిపేశారు. 108 వాహనాన్ని పిలిచి ప్రమాదా నికి గురైన ఆటోలోని ప్రయాణికుల్ని అందులో పంపించారు. కారు డిక్కీలో కూడా మద్యం బాటిళ్లు ఉండొచ్చనే అనుమానంతో తెరవాలని డిమాండ్ చేశారు. ఈలోగా సమాచారం అందుకున్న స్థానిక సీఐ హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. డిక్కీ ఓపెన్ చేయడానికి వీల్లేదని స్థానిక ప్రజలపై బెదిరింపునకు దిగారు. అదే సమయంలో ఒక పాలక పార్టీ నాయకుడిదిగా అనుమానిస్తున్న కారు అక్కడికి చేరుకొని మఫ్టీ ఎస్ఐలను ఎక్కించుకొని వెళ్లిపోయింది. సీఐ బెదిరంపులను లెక్క చేయకుండా స్థానిక ప్రజలు కారు డిక్కీని ఓపెన్ చేసి నిర్ఘాంతపోయారు. పెద్ద మొత్తంలో గంజాయి, ఒక బ్లూ కలర్ బ్యాగ్లో భారీ మొత్తంలో నగదు, ఒకటో రెండో ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అందులో కనిపించాయి. జరిగిన ఘటనపై స్థానిక డీఎస్పీ, ఎస్పీలు చెరో రకమైన కథను వినిపించారు. దూడ గడ్డి కోసమే తాటిచెట్టు ఎక్కారనేది వారు చెప్పిన కథల సారాంశం. పోలీసు వాహనాల్లోనే యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నదనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలు నిజమేనని అద్దంకి ఘటన రుజువు చేసింది. అక్రమ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగ గణం ఏకమై వనరుల్ని లూటీ చేసి వాటాలు పంచుకుంటున్నారనే ఆరోపణకు కూడా ఈ ఘటన సాక్ష్యంగా నిలబడింది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వ పెద్దలుగానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ, దీనిపై మౌనం వీడకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యవహారాలే ఇప్పుడు ‘ఆర్డర్ ఆఫ్ ద డే’గా అర్థం చేసుకోవలసి వస్తున్నది.డీఎస్సీ – 2025 పరీక్షలను రాష్ట్రప్రభుత్వం ఎంత ప్రహస నంగా మార్చిందో వెల్లడిస్తూ జరిగిన అవకతవకలను చాలా కాలం క్రితమే ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ పరీక్షలను రద్దు చేయాలనీ, అక్రమాలకు బాధ్యుడైన విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనీ కోరుతూ రాష్ట్రంలో ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత చూపెడుతున్న ఆధారాలపై స్పందించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఎదురుదాడికి దిగింది. జగన్ హయాంలో జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు, యెల్లో మీడియా డైవర్షన్ గేమ్ను ఆశ్రయించారు. మొన్న గురువారం నాడు జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. గ్రూప్–1 పరీక్షలతో పాటు, డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు నేను సిద్ధమే, మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.ఈ సవాల్పై రెండు రోజులు గడిచినా పాలకపక్షం నోటమాట పెకల్లేదు. డీఎస్సీలో జరిగిన అక్రమాల గురించి వారికి స్పష్టంగా తెలుసు కనుకనే సీబీఐ విచారణ పేరు వినగానే బాబు, లోకేశ్ల నోళ్లు మూతపడ్డాయి. రద్దయిన నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ అంశం ఒక్కటి మాత్రమే ఉన్నది. డీఎస్సీలో లీకేజీతోపాటు స్పోర్ట్ కోటా పేరుతో మూడొందల పైచిలుకు పోస్టులకు బేరాలు పెట్టడం, డీఎస్సీ పరీక్ష రాయని వారితో ఆ పోస్టులను నింపేయడం, అందుకోసం పాత జీవోల స్థానంలో కొత్త జీవోలను విడుదల చేయడం, పని పూర్తికాగానే పాత నిబంధనలతో మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడం అనే కుట్రపూరిత వ్యవహారం ఇమిడి ఉన్నది. ఉన్నత స్థాయి వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ఆడిన నాటకం, చేసిన నయవంచన అనేందుకు జీవోల ప్రహసనమే తిరుగులేని సాక్ష్యం.నిబంధనలకూ, సంప్రదాయాలకు విరుద్ధంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణను, ప్రశ్నాపత్రాల తయారీని ఒకే సంస్థ చేతిలో పెట్టారు. ఆ సంస్థకు సంబంధించిన ఔట్సోర్సింగ్ విద్యార్థికి మొదటి మెరిట్లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకసారి ప్రశ్నా పత్రం లీకయితే ఒక్కడితోనే ఆగిపోతుందా? ఒక్కడితోనే ఆగిపోతే మాత్రం అది చెల్లుబాటవుతుందా? లీకేజీ జరిగిందని గమనించినందువల్లనే తదుపరి మెరిట్ లిస్ట్ నుంచి సదరు వ్యక్తి పేరును తొలగించి, సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకుండా అతని లాగిన్ ఐడీని తీసేశారన్నది నిజం కాదా? అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి ఎంపికయిన టీచర్ అభ్యర్థులను రెచ్చగొట్టి వారి చేత ప్రదర్శనలు చేయించే చౌకబారు ఎత్తుగడలకు సర్కార్ దిగజారింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎక్కువమంది మెరిటోరియస్ అభ్యర్థులే ఉండవచ్చు. సందేహం లేదు. లీక్ కారణంగా రద్దయిన నీట్ పరీక్షలో కూడా చాలామంది మెరిట్ అభ్యర్థులు సెలెక్టయ్యారు. రెండోసారి నీట్ పరీక్ష నిర్వహించినప్పుడు కూడా వారు ఎంపికయ్యారు. కాకపోతే వారికి అనవసర ఆందో ళన, అధిక శ్రమ. అందుకు కారణం మరెవరో కాదు. పరీక్ష నిర్వాహణా వ్యవస్థ నిర్వాకం. ప్రభుత్వ అసమర్థత. డీఎస్సీకి కూడా ఇదే వర్తిస్తుంది.అద్దంకి గంజాయి, డీఎస్సీ అవినీతి బయటకు స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ నిర్వాకాలు మాత్రమే. అన్ని రంగాల్లోనూ రెండేళ్లల్లోనే ఈ సర్కార్ సర్వభ్రష్టత్వాన్ని సాధించింది. జగన్ సర్కార్ మెరిట్ విద్యార్థులకూ, పేద రోగులకూ అందు బాటులోకి తెచ్చిన పదిహేను మెడికల్ కాలేజీలను పీపీపీ జపంలో ఈ సర్కార్ మూలన పడవేసింది. పిల్లలందరికీ న్యాయమైన ఉచిత విద్యను అందించాలని జగన్ సర్కార్ ప్రారంభించిన విద్యారంగ సంస్కరణలకు బాబు సర్కార్ పాతరేసింది. ఫలితంగా ఇప్పటికే ఐదులక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేసినట్టు అసెంబ్లీలోనే ప్రభుత్వం అంగీ కరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పీపీపీ ముసుగులో చేస్తున్న ప్రైవేటీకరణ ఎంత దూరం వెళ్లిందంటే ఇకమీదట ఆస్పత్రి సేవలు, తాగునీటి సరఫరా, ఆర్టీసీ సేవలు, చివరకు చెత్త ఎత్తడం కూడా పీపీపీలోకి మారబోతున్నాయి. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే లక్ష్యంతోనే పీపీపీ మంత్రాన్ని బాబు సర్కార్ జపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడం, యువతరాన్ని మత్తులో జోగేలా చేయడం, రాజీకీయ ప్రత్యర్థులను వేటాడటం, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మడం ప్రధాన ఎజెండాలుగా పాలక కూటమి అమలుచేస్తున్నది. సొంత ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. ఇదే అదునుగా కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి పౌరహక్కులకు పాతరేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక్కొక్కడూ వందల కోట్లు వెనకేసుకున్నారని అదే పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలను చూసి క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం అవినీతి కూపంలో మునకలేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మాత్రం నానాటికీ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్నారు. ఇటువంటి ఆటవిక పాలనను ఇంకెంతకాలం భరించాలి? చైతన్యవంతులైన ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబుకు ఉద్యోగ JAC నేతలు వార్నింగ్
-
సీమ అంటే ఇంత ద్వేషమా రేవంత్ కోసం బాబు తలొంచాడు.. రాయలసీమ కరువుకు బాబే కారణం
-
వివేకాను చంపిన గొడ్డలి ఎవరిది? విచారణకు అడ్డెందుకు.?
-
డీఎస్సీపై ప్రశ్నిస్తే.. ఈడీ సోదాలా? జగన్ దెబ్బకు డైవర్షన్ పాలిటిక్స్
-
ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, అరాచకాలపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యంలేక అధికారపక్షం పలాయనం చిత్తగిస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. గంజాయి, ఇసుక, లిక్కర్ మాఫియాను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారని అన్నారు. సాక్షాత్తూ పోలీసుల కారులోనే గంజాయి పట్టుబడిందని, ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ ఎస్పీ, డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను వదిలేసి కిందిస్థాయి వారిపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి అనేది చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని చెప్పారు. అమరావతిలో కొత్తగా వారు చేసిందేమీలేదని, ఐదేళ్ల క్రితం ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరే మళ్లీ టెంట్లు వేసి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.రోజంతా చర్చిద్దామన్నాం..డీఎస్సీలో అక్రమాలు, గ్రూప్ – 1 అంశాలపై సభలో రోజంతా చర్చిద్దామని, అవసరమైతే మరో రెండు రోజులు సభను పొడిగించాలని తాము డిమాండ్ చేస్తే పారిపోయారని, పైగా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని బొత్స తెలిపారు. బయటకొచ్చి మాత్రం ప్రతిపక్షంపై బురదజల్లుతూ డాంబికాలు పలుకుతారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా 1.30 లక్షల సచివాలయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో 10,300కు పైగా టీచర్ పోస్టుల భర్తీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1998 డీఎస్సీలో మిగిలిపోయిన 5,887 మందికి, 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 2,193 మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. 2019 స్పెషల్ డీఎస్సీ ద్వారా 521 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేజీబీవీల్లో 1,250 మంది క్వాలిఫైడ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించామని, ట్రిపుల్ ఐటీలో 450 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. మొత్తంగా ఉపాధ్యాయ రంగంలో 10,300కు పైగా ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అలాగే 2024 ఫిబ్రవరి 12న 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రకటించామని, ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. మరి వైఎస్సార్సీపీ హయాంలో 16 వేల పోస్టులు ఇవ్వలేదని ఎలా చెబుతున్నారని, దీంట్లో ఏది అబద్ధమో సభలో నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు.విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారుపేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్న సత్సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, జగనన్న గోరుముద్ద లాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారని బొత్స చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్ లేకుండా కఠిన చట్టాలు తెచ్చామన్నారు. ఈరోజు ఆ వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసి విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి, లక్షలాది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల వైపు నెడుతున్నారని చెప్పారు. సగం మంది తల్లులకు అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ మోసాలు, అరాచకాలను వదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో’నే తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
గ్రూప్–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా
పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయి? అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నారు.చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలిచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా? అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? స్పష్టంగా మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యలూ లేవు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, బెయిల్పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి.. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలన్నీ పక్కా సాక్షా్యధారాలతో రుజువు కావడంతో తన కుమారుడిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు కొత్త ఆట మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరింత దిగజారిపోయి ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షలో ఇప్పటి మెగా డీఎస్సీలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు.. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? అని చంద్రబాబు, నారా లోకేశ్కు సూటిగా వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని చాలెంజ్ చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. పక్కా సాక్ష్యాధారాలతో మెగా డీఎస్సీ కుంభకోణం రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవాలన్న ఆరాటంతో 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను, పారదర్శకంగా చేపట్టిన గ్రూప్–1 నియామకాలను ఆధారాలతో వైఎస్ జగన్ వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వూ్యలు.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..డీఎస్సీ పోస్టులు అమ్ముకునేందుకు బేరసారాలు ఆడుతున్న ఆడియో కాల్ వివరాలను ఫోన్ నంబర్తో సహా ప్రదర్శించిన వైఎస్ జగన్ ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..మా హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు వచ్చిందా? చిత్తశుద్ధి, పారదర్శకత అంటే అది. ఇప్పుడు చూస్తే కుట్రపూరిత జీవోలు ఇచ్చి వీళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి 372 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా కుంభకోణాలు చేశారు. మేం 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడైనా ఒక్క ఆరోపణ వచ్చిందా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న వివాదం తలెత్తిందా? మేం ఇచ్చిన వాటిలో ఏడు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ. మీ జోక్యంతో జరిగిన అక్రమాలన్నీ స్పష్టంమా హయాంలో జరిగిన గ్రూప్–1 నియామకాలకు, ఇప్పటి డీఎస్సీ–2025 నియామకాలకు ఎంతో తేడా ఉంది. చరిత్రలో మొదటిసారి పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి సంతకాలు లేకుండా ఈ జీవోలు ఇవ్వగలుగుతారా? నేరుగా విద్యా శాఖ మంత్రి ఆమోదంతో పరీక్షే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టే వ్యవస్థను రూపొందించారు. 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అరాచకాలకు గేట్లు ఎత్తారు. ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. ఇది నేరుగా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రిగా ఉండగా జరిగింది. ఇది ఎంతో ఘోరమైన విషయం. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు. మా హయాంలోని గ్రూప్–1, ఇప్పటి డీఎస్సీ–2025కి మధ్య మొదటి తేడా ఇది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అదేవిధంగా అతని ఐడీలను ఎందుకు చెరిపేశారు? అతడికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఈ సాక్ష్యాలతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైంది. బేరసారాలు జరిగినట్టుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? మొబైల్ నంబర్ కనిపిస్తున్నా అనుమానితులని అంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యల్లేవు. మరో కేసులో రూ.14 లక్షల నగదు లావాదేవీ జరిగినా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరు. విచారణ చేపట్టరు. ఇలా మీ వ్యక్తిగత జోక్యంతో కూడిన కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. పెద్ద పెద్ద అధికారుల పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేస్తుంది. పరీక్షలు నిర్వహిస్తారు. బాబు దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పైగా మా ప్రభుత్వం రాక ముందే గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికే మెయిన్స్ నిర్వహించాం. హైకోర్టు ఆదేశాలతో, కోర్టు ఆధ్వర్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఎంపికైన వారికి ఉద్యోగాల కల్పన ఇలా ప్రతి ప్రక్రియ చేపట్టాం. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదుబాబు పాలనలో నేరుగా పోలీసులతోనే నేరుగా గంజాయి అమ్మిస్తున్నారు. ప్రతి గ్రామం, వీధుల్లో గంజాయి లభ్యమవుతోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. గంజాయి సంస్కృతి గ్రామాలకు పాకింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్షాపులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పోలీసులే నేరుగా గంజాయి అమ్మకాలు.. బీసీల రిజర్వేషన్ అంశం.. బీసీలకు ఎవరేం చేశారు? రైతుల సమస్యలు.. రాష్ట్రంలో నెలకొన్న కరవు, సంక్షోభ పరిస్థితులపై వచ్చే వారం మరోమారు మీడియా ముందుకు వస్తా. -
స్పోర్ట్స్ కోటా ఉద్యోగం.. నా దగ్గర డబ్బు తీసుకుంది ఆయనే..! లైవ్ లో DSC బాధితురాలి ఆవేదన
-
సభలో చర్చకు రమ్మంటే భయపడతారు.. బయటమాత్రం ఛాలెంజ్ లు చేస్తారు..
-
ఇదే నా సవాల్... బల్ల గుద్ది ఛాలెంజ్ విసిరిన జగన్
-
అవినీతి, అక్రమాల కోసమే డీఎస్సీలో శాప్ జోక్యం చేసుకుంది
-
వైఎస్ జగన్ ఫుల్ స్పీచ్ @ తాడేపల్లి
-
జగన్ కు భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
-
వెళ్తూ వెళ్తూ.. అబ్బా కొడుకులకు జగన్ ఓపెన్ ఛాలెంజ్
-
పోస్టుకు 14 లక్షలు తీసుకున్నారు. ధర్మేంధ్ర ప్రధాన్ కో రూల్ నీకో రూలా..?
-
జీవో ఎందుకు ఇచ్చారు ఎందుకు రద్దు చేసారు? అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...
-
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
-
మోసాలపై చర్చ మొదలైంది
‘‘ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. అక్కడ జగన్ ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఉంది. ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా ఒక్క మనిషి మాత్రమే. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’’ ‘‘చంద్రబాబు హయాంలో రైతులు హ్యాపీగా లేరు. మహిళలు హ్యాపీగా లేరు. చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు. ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు.’’ ‘‘నాడు మడమ తిప్పని మన పరిపాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు చేసిన మోసాలపైనా చర్చ సాగుతోంది. అందుకే వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఎన్టీ రామారావు అయినా సరే. ప్రజలైనా సరే. ఆయన చేసేది వెన్నుపోటు కాబట్టి. ఆ పార్టీకి ప్రజలే ఆ నామకరణం చేశారు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ పాలనపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, అన్ని వర్గాలనూ మోసం చేశారని అన్నారు. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మన గెలుపు తధ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న వైఎస్ జగన్.. ఆ దిశలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించి.. ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజమండ్రి రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చే దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు అన్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే రూ.15 వేలు ఇచ్చాడు. నేను అలా కాదు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున.. నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తా అన్నాడు. అంతటితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి, అమూల్, ఐటీసి, రిలయన్స్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలతో టైఅప్ చేయించి, ప్రతి మహిళను తాను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తే.. జగన్ ఏటా కేవలం రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే, 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడ రూ.18,750. ఎక్కడ రూ.48 వేలు. అంటే దాదాపు మూడు రెట్లు. ఇంకా అంతటితో ఆగలా. 18 ఏళ్లు నిండిన ఏ మహిళకైనా నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామన్నారు. అలా నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని ప్రచారం చేశారు. అది ఆడబిడ్డ నిధి అంట!. ఇంకా భుజాన కండువా వేసుకుని ఎవరైనా రైతు కనిపిస్తే ఏమన్నాడు?. జగన్ ఇచ్చేది ఏటా రూ.13,500 మాత్రమే కదా, నేను వస్తే రూ.26 వేల చొప్పున ఇస్తామన్నారు. మళ్లీ ఎవరైనా యువకుడు కనిపిస్తే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అన్నాడు. అదే నిరుద్యోగ భృతి. అలా అప్పుడు జగన్ ఇచ్చేవాటికన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు. బాండ్లు, సంతకాలతో పచ్చి మోసం ఇంటింటికి పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే క్యాండిడేట్లను పంపాడు. తన ఫోటో, సంతకంతో ఒక బాండ్ తయారు చేసి, ప్రతి ఇంటికి ఇవ్వడం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని, మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారమ్మా? వాళ్లకు ఏటా రూ.18 వేలు. మీ ఇంట్లో 50 ఏళ్లు నిండిన మీ అత్తమ్మ ఉందా? నీకు రూ.48 వేలు. సినిమా రిలీజ్ జూన్, 2024. అని బాండ్లు ప్రతి ఇంటికీ పంపారు. ఇంకా ప్రమాణం. ‘నేను పవన్ కళ్యాణ్. మేమిద్దరం ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం’ అని చెప్పి, ఇద్దరూ బాండ్ల మీద సంతకాలు చేశారు. అవేవీ అమలు కాలేదు కాబట్టి, ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ ఈరోజు రాష్ట్రంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా. అధిక ధరలకు పీపీఏలు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు ఇచ్చేయడం, కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం. అమరావతిలో చూస్తే చదరపు కట్టడానికి ఏకంగా రూ.20 వేలు వ్యయం. అదే హైదరాబాద్, బెంగళూరులో ఫైవ్ స్టార్ సదుపాయాలతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్ కట్టినా చదరపు అడుగుకు రూ.4,500. ఇంకా మహా అయితే రూ.5 వేలు వ్యయం. మరి ఇక్కడ అమరావతిలో ఇసుక ఉచితం. ఇంకా పలు రాయితీలు. అయినా చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు అంటున్నారు. లూటీ ఏ స్థాయిలో జరుగుతోందో ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు పీపీపీ పేరుతో దోచేయడం. ఆస్పత్రి సేవలు, తాగునీరు, ఆర్టీసీ, చివరకు చెత్త ఎత్తడం కూడా అంతా పీపీపీ. అంటే ఇక మీదట మొత్తం ప్రైవేట్ వాళ్ళకే. అంటే లంచాలు తీసుకోవడం. అన్నీ అమ్మేయడం. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి అంటే అర్ధం ప్రభుత్వ ఆస్తులన్నీ శనక్కాయలు, పప్పుబెల్లాలకి అమ్మేయడం. విద్యార్థులకూ వెన్నుపోటు రాష్ట్రంలో పిల్లలు కూడా సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేవు. మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్ లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026. ఏటా రూ.1100 కోట్లు. మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. దీంతో రూ.3,300 కోట్లు బాకీ. విద్యాదీవెన 2024 జనవరి–మార్రి త్రైమాసికం నుంచి ఇవ్వలేదు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే మొత్తం 13 త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు. అంటే మొత్తం రూ.9,100 కోట్లు బాకీ. అది వసతి దీవెన బాకీ రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రూ.12,400 కోట్లు. కానీ, ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి రూ.1700 కోట్లు. మరోసారి రూ.1100 కోట్లు. అంటే ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు. ఫీజు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఏకంగా 6 లక్షలు తగ్గారు. అక్కచెల్లెమ్మలకూ వంచన అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు లేదు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల సంగతి దేవుడెరుగు. ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు ఉంటే, మన హయాంలో వాటి పరపతి పెంచడంతో, ఆ రుణ పరిమితి రూ.49 వేల కోట్లకు చేరింది. ఇంకా ఆ అక్కచెల్లెమ్మలకు మనం చేయూత ఇచ్చాం. ఆసరా ఇచ్చాం. సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకుని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగింది. దీంతో రుణ పరిమితి రూ.20 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్లకు చేరింది. అలా మన హయాంలో పెరుగుదల ఉంటే, ఇప్పుడు రూ.49 వేల కోట్ల నుంచి ఈ రోజు రూ.39 వేల కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో వ్యవసాయం.. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితి. 53 శాతం వర్షం లోటు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. లోటు వర్షపాతం నమోదవుతున్నా, ఎక్కడా వరికి బదులు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా ఈయనే దగ్గరుండి కత్తిరించాడు. ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. ఆర్బికేలను నిర్వీర్యం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకం సున్నా. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ లేకుండా ఉన్నారంటే, శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 878 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఫుల్ డ్రా అంటే 44 వేల క్యూసెక్స్. పక్కన తెలంగాణ పవర్ హౌస్ నుంచి పవర్ జనరేషన్ కోసం రిజర్వాయర్లో 800 అడుగుల నుంచే పంప్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి.. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు మొత్తం పంటలంతా నష్టపోతున్నారు. రైతులందరూ 40 శాతం పెట్టుబడి పెట్టి నారుమళ్ళు వేసి ఫెర్టిలైజర్స్ చల్లారు. ఒకవైపు ఉచిత పంటల బీమా లేదు.. మరోవైపు నీళ్లు ఇవ్వలేను అంటాడు.రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..ఎన్నికలు జరిగి చూస్తుండగానే మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కళ్ళు మూసుకొని, తెరిచే సరికి ఇంకో సంవత్సరం దాటితే, ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. కళ్ళు మూసుకొని, తిరిగి తెరిచేసరికి ఈ రెండేళ్లు ఇట్టే ముగిసిపోతాయి. చూస్తుండగానే, మూడో ఏడాది కూడా వేగంగా గడిచిపోతుంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. మామూలుగా ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా మూడో ఏడాదిలో వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కానీ చంద్రబాబు పాలనలో అది ఇప్పటికే కనిపిస్తోంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. దీనినిబట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం.చంద్రబాబు పాలనకు–మన పాలనకు తేడా ఏమిటంటే...ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం పూర్తి చేసిన ఏకైక పార్టీ.. ఈ రాష్ట్రంలో.. బహుశా దేశంలో ఏదైనా ఉంది అంటే, అది వైఎస్సార్సీపీ అని సగర్వంగా చెప్పగలం. చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్లి, మా పాలనలో ఇలా జరిగింది అని గొప్పగా కూడా చెప్పుకోగలం. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఆ రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుందో చెప్పేవాళ్లం. ఆ తర్వాత క్రమం తప్పకుండా అమలు చేసే వాళ్లం. అలా పక్కాగా బటన్ నొక్కిన పరిపాలన ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఏకంగా రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ.. అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నగదు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు, ఇళ్లలోకి వెళ్లిన పరిస్థితి. అలాంటిది చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి, పథకాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ చూడలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో దిశ వంటి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ సచివాలయంలో ఉండడం. ఇవన్నీ చరిత్ర చూడని విషయాలు. స్కూళ్లు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు జరగడం, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, మూడవ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, పిల్లలకు ఇంగ్లీష్లో శిక్షణ, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ డిజిటలైజ్ కావడం, ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్ మీడియంతో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, రోజుకో మెనూతో బడి పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ అమలు చేసిన గోరుముద్ద.. ఆ స్థాయిలో సమీక్ష చేసిన సీఎంను బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలువిద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు విద్యా రంగంలో విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ మాత్రమే కాదు.. ఏకంగా ఐబి సిలబస్. ఐబి వాళ్ళని తీసుకొచ్చి, మన రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయిస్తూ, 2020 నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా, 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ, 2035 నాటికి ఐబి సిలబస్. అలా ఏకంగా మన రాష్ట్ర పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 2035 లో రాసేట్టుగా అడుగులు పడిన పరిస్థితి అంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. మనం రాక మునుపు ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ఇంకా పథకంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టాం. నాడు–నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మొదటిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనం ఇచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతే తొలిసారిగా ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ). ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ఒక 104 అంబులెన్స్ సర్వీస్. పీహెచ్సీలో ప్రతి డాక్టర్కు ఆ మండలంలో నాలుగైదు గ్రామాలు కేటాయించి, ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ 104 సర్వీస్లో తనకు కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. వైద్య సేవల కోసం తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లే డాక్టర్, అక్కడి విలేజ్ క్లినిక్ను ఉపయోగించేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, అలా డాక్టర్లను గ్రామాలకు పంపించిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. సాధారణంగా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు మాత్రమే దొరికేట్లుగా చేసి పరిస్థితి కూడా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం కానీ.. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయాలు. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట తొలిసారిగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. ఆ ఆర్బీకే పరిధిలోని గ్రామంలో ప్రతి ఎకరా ఈ–క్రాప్. ఆర్బీకేలోనే ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. తాను అగ్రికల్చరల్ అసిస్టెంట్గా రైతు చేయి పట్టుకుని నడిపించడం. ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటకు ఆర్బీకేలో బోర్డు పెట్టి పంటలకు గిట్టుబాటు ధరలు ప్రదర్శించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే, ఆ గ్రామంలో వెంటనే ఆర్బికే అసిస్టెంట్, సీఎం–యాప్ ద్వారా అంటే..‘కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’. ఆ సీఎం యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ ఫెడ్, వెంటనే జోక్యం చేసుకునే వారు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో ఆ ఆర్బికే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి, ఆ గ్రామంలో ఆ పంట కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు కనిపించే విధంగా గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎప్పుడూ చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందే సచివాలయం. మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పని చేస్తూ, చిక్కటి చిరునవ్వుతో సేవలు. మన గ్రామంలోనే 60 ఇళ్లకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్లి సహాయం అందించే పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడూ చరిత్రలో చూడలేదు. లంచాలు లేకుండా ప్రభుత్వ సాయం, ఎప్పుడైనా జరిగిందంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది⇒ రాష్ట్రం నివ్వెరపోయే ఘటన. మొన్న అద్దంకిలో జరిగింది. ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. చూస్తే, కారులో ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్ మత్తులో ఉన్నారు. అప్పుడందరూ చుట్టుముట్టి కారు డిక్కీ ఓపెన్ చేస్తే, గంజాయి, మద్యం, పెద్ద ఎత్తున డబ్బులు, పోలీస్ యూనిఫార్మ్ కనిపించాయి. యాక్సిడెంట్ విషయం తెలిసిన ఒక సీఐ అక్కడికి వచ్చాడు. అక్కడ స్థానికులు ఆ యాక్సిడెంట్ను వీడియో తీస్తుంటే, కేసు పెడతామని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఎస్ఐలను ఘటనా స్థలి నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ కారు. అయినా ఇంతవరకు కేసు లేదు. ప్రజలు కూడా మర్చిపోయేలా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో చెప్పడానికి మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన. చిన్న ఉదాహరణ చెబుతా. డాక్టర్ ప్రియాంక. పీజీ మెడికల్ స్టూడెంట్. మన కళ్ల ముందే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. తాగిన మైకంలో మత్తులో అది మరి గంజాయా లేకపోతే మద్యమా ఏమో గాని ఆ మత్తులో కారుతో గుద్దడం, ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబునాయుడు గవర్నమెంట్లో ఏం కేసు పెట్టారు? కనీసం సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టలేదు. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే, వైఎస్సార్సీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడితే, ప్రజలు వైఎస్సార్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై నిరసనకు దిగితే కూడా చంద్రబాబు మనసు కరగని పరిస్థితి. ⇒ మరోవైపున చూస్తే, దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి? డాక్టర్ అప్పలరాజు కేసు. పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్. కారు కాదు. తాగింది లేదు, తాగుడు అలవాటు కూడా లేదు. 18 ఏళ్ల పిల్లోడు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగింది. వెంటనే ఆ పిల్లోడు 108 కి ఫోన్ చేశాడు. ప్రమాదంలో గాయపడిన ఆ గొర్రెలకాపరికి సీపీఆర్ కూడా చేశాడు. అలా ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. స్వయంగా 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అప్పలరాజు కూడా పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు. కానీ, అదే అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏమిటి? ఏకంగా మర్డర్ కేసు పెట్టారు. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో కారుతో రెండు మూడు సార్లు గుద్ది, ఆపకుండా వెళ్ళిపోతే, చిన్న చిన్న సెక్షన్లతో కేసు. ⇒ మొన్న తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ రవాణా. ఏదో కొన్ని కార్టన్లు కాదు. లారీలకు లారీల లోడ్. అంతకు ముందు తంబళ్లపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, ములకలచెరువులో ఏకంగా లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కుటీర పరిశ్రమ పెట్టి, వాళ్ల బెల్ట్ షాపులకు పంపిణీ చేసి అమ్మించారు. ప్రతి ఐదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్.ఆ పర్మిట్ రూమ్ల్లో లూజ్గా మందు అమ్మకాలు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మకం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.ఎవరైనా చంద్రబాబుని ఎన్నికల హామీలపై ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లు చూపించి అడిగినా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతు మీద కేసులు. అక్రమ కేసులు, అరెస్టులు, రొటీన్గా సాగుతున్నాయని, అవి ఏ స్థాయికి చేరాయంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే పోలీసులను ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెడతారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ గాడి తప్పుతుందని జగన్ అన్నారు. స్థానిక సమరానికి సై!స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదని ఎత్తిచూపారు. అందుకే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనబడకుండా కుట్రలు చేసే వీలుందని.. అందుకు పోలీసు బలగాలనూ వినియోగించవచ్చని చెప్పారు. వైఎస్సార్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని.. వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారని, తోడుగా నిలుస్తారని అన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోరాడాలని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘‘చంద్రబాబు ఒక విలన్. స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు. పోలీసులను పెడతాడు. దౌర్జన్యం చేస్తాడు. బెదిరిస్తాడు. ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, అందరూ గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజలు సపోర్ట్గా ఉన్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. మీ జగనన్న సపోర్ట్గా ఉంటాడు.’’ అని జగన్ పేర్కొన్నారు. ‘వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.’ అని అన్నారు. ఒకవేళ పోలీసులను దురి్వనియోగం చేసి, ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుగారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ‘అందుకే కచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మనకు మనం ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. గెలుపు మనదే. చివరగా, వేణుఅన్న మీ అందరికీ పరిచయస్తుడే. మంచి లీడరు. అందుకే ఆయన్ను గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు. -
ఖాకీ వనంలో ‘గంజాయి’!
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా శంఖవరప్పాడులో ఇద్దరు ఎస్ఐలు నేరుగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఘటనతో రాష్ట్రం నివ్వెరపోయింది. చంద్రబాబు సర్కారు చేతకానితనంతో రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు గేట్ వేగా మారిపోయిందని మరోసారి రుజువైంది. గంజాయి సాగు, రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా దందా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా టీడీపీ కూటమి నేతలే చిక్కుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరకడం గమనార్హం. కుటీర పరిశ్రమలా లిక్విడ్ గంజాయి యూనిట్లు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి దందాకు గేట్ వేగా మారినా చోద్యం చూస్తున్నారు. టీడీపీ కూటమి నేతలే రింగ్ మాస్టర్లుగా, మత్తు మాఫియాలా మారి రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకు ఊపిరి పోసింది. మొత్తం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి సాగు చేయిస్తుండటంతోపాటు ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా గంజాయిని కొనుగోలు చేస్తూ ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. అంతటా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయి తరలిస్తున్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా గంజాయి పట్టుబడటం గమనార్హం. ఆదాయ వనరుగా గంజాయి.. రాష్ట్రంలో యధారాజా తథా పోలీస్ అనే చందంగా కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం గంజాయి నిర్మూలనను గాలికి వదిలేయడంతో కొందరు టీడీపీ నేతలు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికార పార్టీ నేతలే బరి తెగించడంతో రెడ్బుక్ రాజ్యాంగంలో తామేం తక్కువ తినలేదన్నట్లుగా కొందరు పోలీసులు సైతం గంజాయి దందాకు పాల్పడుతున్నారు. తాజాగా శంఖవరంపాడులో ఇద్దరు ఎస్ఐలు మరికొందరు పోలీసులతో ధూమ్ ధామ్గా పార్టీ చేసుకుని వెళుతూ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ చేసిన కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడంతో అసలు బండారం బట్టబయలైంది. రెడ్బుక్ అమలు మినహా మరేమీ పట్టని పోలీసు వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలో అబాసుపాలైంది. తాజా ఘటనతో గంజాయితో వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేస్తున్నారనే విషయం బట్టబయలైంది. గంజాయి పట్టుకొచ్చారా.. పట్టుకున్నారా? గంజాయి వ్యవహారంలో ప్రకాశం జిల్లా పోలీసులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం ద్వారా తప్పు చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వేరేవారిపై కేసు పెట్టేందుకే గంజాయి తెచ్చినట్టు ఒకసారి.. కాదు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని మరోసారి నాలుక మడతేయడంతో అడ్డంగా బుక్ అయ్యారు. వాస్తవానికి గంజాయి, డ్రగ్స్ విషయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదు. ఎన్డీపీఎస్ చట్టం–1985, ఎన్డీపీఎస్ నియమావళి–2022, ఎన్సీబి స్టాండింగ్ ఆర్డర్ 1/89) ప్రకారం సోదా, స్వా«దీనం, నమూనా సేకరణ ప్రక్రియలను నిర్వహించేటప్పుడు దర్యాప్తు అధికారి కచ్చితమైన నిబంధనలను పాటించడం తప్పనిసరి. గంజాయి స్వాదీనం సమయంలో పోలీసులు పాటించాల్సిన కీలక నిబంధనలివీ..⇒ సోదాకు ముందు అవసరమైన చర్యలు, సమాచారాన్ని (సెక్షన్లు 41/42) ప్రకారం లిఖితపూర్వకంగా నమోదు చేశారా? ఆ సమాచారాన్ని 72 గంటల్లో పైఅధికారికి నివేదిక ఇచ్చారా? ⇒ సోదా నిర్వహణ, స్వతంత్ర సాక్షులు (సెక్షన్ 100 సీఆర్పీసీ, ఎన్డీపీఎస్ సెక్షన్ 50 ప్రకారం కనీసం ఇద్దరు సాక్షులు ఉన్నారా? ⇒ వ్యక్తిగత సోదా రక్షణ సెక్షన్ 50 ప్రకారం సోదాలు గెజిటెడ్ అధికారి, మేజిస్ట్రేట్ సమక్షంలో నిర్వహించే చట్టపరమైన హక్కు గురించి నిందితుడికి లిఖితపూర్వకంగా తెలిపారా? ⇒ రసాయన విశ్లేషణ కోసం స్వా«దీనం చేసుకున్న సరుకును అక్కడే సీల్ చేసి, తూకం వేసి, జాబితా తయారు చేయాలనే విషయం తెలియదా? సెక్షన్ 52 ఏ కింద నమూనా సేకరణ, జాబితా ధృవీకరణ, ఫోటోగ్రఫీ ప్రక్రియలు మేజిస్ట్రేట్ సమక్షంలోనే చేయాలనే విషయం తెలియదా? ⇒ సంఘటనా స్థలంలోనే నిందితుడు, సాక్షుల సంతకాలతో కూడిన సమగ్ర పంచనామా, స్వాధీన మెమోను సిద్ధం చేశారా? ⇒ స్వాదీనం చేసుకున్న భారీ మొత్తంలోని సరుకును సీళ్లు చెక్కుచెదరకుండా రిజిస్టర్లో నమోదు చేసి అధికారిక పోలీసు స్టోర్లో వెంటనే భద్రపరచాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? ⇒ సెక్షన్ 57 కింద అరెస్టు/స్వాధీనానికి సంబంధించిన పూర్తి నివేదికను 48 గంటల లోపు తక్షణం పైఅధికారికి పంపాలనే విషయం తెలియదా? -
నా వీల్ చైర్ చూసి కూటమి ప్రభుత్వం వణికిపోతుంది
-
నిరోద్యోగులకు కూటమి ప్రభుత్వం టోకరా
సాక్షి, అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీరని మోసం చేసింది. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదని శాసనమండలిలో ఖరాఖండీగా తేల్చిచెప్పింది. మండలి సమావేశాల్లో నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించగా భృతి ఇచ్చేది లేదని తెలిపింది. అంతేకాకుండా అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో అన్న విషయాలను సైతం కూటమిలో ప్రకటించలేదు. కాగా శాసనమండలిలో మూడోరోజు సమావేశాలు వాడివేడీగా జరిగాయి.డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సమయంలోనూ సభలో కూటమి సభ్యులు సభను వీడారు. దీంతో కూటమి ఎమ్మెల్సీలు వ్యవహారిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చిన్నారెడ్డి VS మేఘారెడ్డి... డీసీసీ అధ్యక్ష పదవిపైనా వర్గపోరు
-
మంత్రులపై మండలి చైర్మన్ ఫైర్
-
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
-
జూడాల సమ్మె ఉధృతం
సాక్షి, అమరావతి/మహారాణిపేట/ తిరుపతి తుడా: స్టైపెండ్ పెంపు, ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు(జూడా) ఉధృతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల వద్ద ధర్నాలు కొనసాగించారు. రెండు చేతులు బంధించుకుని, నోటికి ప్లాస్టర్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వమే తమను చేతులు కట్టేసి, రోగులకు సేవలు అందించలేని స్థితికి తెచ్చిందని మండిపడ్డారు. విశాఖలో తమ డిమాండ్లను చేతులపై ముద్రించుకొని నిరసన తెలపగా.. తిరుపతిలో బైక్ ర్యాలీతో కదంతొక్కారు. కాగా, జూనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు బహిష్కరించడంతో బోధనాస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిరుపేద రోగులు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. విజయవాడ జీజీహెచ్కు వచ్చిన రోగులను.. వైద్యులు లేరంటూ సిబ్బందే ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించేస్తున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖ, అనంతపురం, తిరుపతి.. అన్ని జీజీహెచ్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానీ వైద్య సేవలపై పెద్దగా ప్రభావం లేదంటూ సూపరింటెండెంట్లు డీఎంఈకి తప్పుడు లెక్కలు రిపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో మంగళవారం అడ్మిషన్లు అమాంతం పతనమైనట్లు సమాచారం. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సర్కారు బడులకు రాం రాం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమేపి పడిపోతోంది. ఇక ప్రహరీ కూలి విద్యార్థులు మృత్యువాత పడుతున్న దుర్ఘటనలు కూడా లేకపోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంతో పోలిస్తే బాబు రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య సుమారు ఆరు లక్షల మేర తగ్గినట్టు శాసన మండలి సాక్షిగా విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఒప్పుకోవడం గమనించదగ్గ అంశం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఇలా ... ‘యూడైస్’ విద్యా సమాచార వ్యవస్థ వివరాల మేరకు 2023–24లో వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,031 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33 శాతంగా తేలింది. 2025–26లో చంద్రబాబు పాలనలో 34,92,791కి పడిపోయింది. అంటే 41.40 శాతానికి తగ్గింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 34,61,612 మాత్రమే. దీనిని 2023–24తో పోల్చి చూడగా, మొత్తం 5,88,419 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. 2023–24లో 52 శాతం ఉన్న ప్రైవేటు పాఠశాలల వాటా ప్రస్తుతం 56.57 శాతానికి పెరిగింది. విద్యారంగాన్ని పటిష్టం చేసిన వైఎస్ జగన్... వైఎస్ జగన్ హయాంలో నాడు–నేడు కార్యక్రమం అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. మౌలిక వసతులు సమకూర్చారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని బలోపేతం చేశారు. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఇంగ్లిష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, ట్యాబ్లు పంపిణీ చేశారు. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంతోపాటు జగనన్న కానుకలో భాగంగా విద్యార్థి కిట్లను అందించారు. అమ్మ ఒడి పథకాన్ని అందించి పేద విద్యార్థులను పాఠశాలలకు రప్పించారు. అయితే వీటన్నింటికి చంద్రబాబు ఈ రెండేళ్లలోనే మంగళం పాడేశారు. ఫలితంగానే విద్యాప్రమాణాలతోపాటు, విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుందనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. -
తాడిపత్రిలో లిక్కర్ మాఫియా
తాడిపత్రి టౌన్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యం తయారీ, సిండికేట్ విక్రయాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతో పచ్చ ముఠాలు బరి తెగించి అక్రమ విక్రయాలు సాగిస్తున్నాయి. గంజాయి ముఠాలు రోజుకో చోట మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. టీడీపీ సిండికేట్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నాయి. నాడు ములకలచెరువు నుంచి నేడు తాడిపత్రి దాకా ఇదే కథ! 2025 అక్టోబర్ 3న ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే.గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన డి.జయచంద్రారెడ్డి సన్నిహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నకిలీ మద్యం డంప్ బహిర్గతం కాగానే ఆయన ఆఫ్రికాకు పరారై కొన్నాళ్లు అక్కడే గడిపారు. ములకలచెరువులో వివిధ రకాల బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం బాటిళ్లు, నకిలీ మద్యం తయారీ సామగ్రి సహా ప్లాంట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా అద్దంకి వద్ద ఏకంగా పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడం రెడ్బుక్ రాజ్యాంగంలో అక్రమాలకు పరాకాష్ట. తాడిపత్రిలో గోవా మద్యం స్వాధీనం..తాడిపత్రిలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది. ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం భారీగా తాడిపత్రికి చేరవేస్తున్నారు. సోమవారం రాత్రి తాడిపత్రి శివారు అనంతపురం ప్రధాన రహదారిపై రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఓ లారీలో 400కిపైగా మద్యం ఫుల్ బాటిళ్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. లారీ క్యాబిన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ బాక్స్లో దాచిన మద్యం బాటిళ్లను గోవా నుంచి తరలిస్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, ఏపీ రిజిస్ట్రేషన్తో లారీలో రెండు నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలు తప్పించుకునేందుకు రెండు నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.నిందితులు తప్పించుకున్నారా.. తప్పించారా?తాడిపత్రిలో భారీగా గోవా మద్యం లభ్యం కాగా నిందితులు పరారైనట్లు పోలీసులు చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి ప్రాంతానికి చెందిన పది మంది దాకా ముఠాగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యాన్ని తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరికినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం తరలిస్తున్న లారీని స్టేషన్ వద్ద కాకుండా ప్రైవేట్ స్థలంలో ఉంచామని పోలీసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. మద్యం అక్రమ రవాణా కేసు నుంచి తప్పించడంతోపాటు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు తాడిపత్రిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ప్రెస్మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ ఆరోహణరావు తెలిపారు. -
పవన్ కు బాబు వెన్నుపోటు.. అన్నకు మంత్రి పదవి లేదు..!?
-
ఇంకెంతకాలం జగన్ పై నీ ఏడుపు చంద్రబాబు? ఏమైంది నీ నలభై ఏళ్ల చరిత్రా...
-
ప్రొద్దుటూరులో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ కుటుంబాలు
-
Gen-Zని అవమానిస్తున్నారు.. డాక్టర్ ప్రియాంక ఘటన షాకింగ్ నిజాలు..
-
ఎందుకు పారిపోతున్నావ్ లోకేష్? చర్చకు రా లోకేష్!
-
అసెంబ్లీ సాక్షిగా ఆ ఇద్దరు దొరికిపోయారు
-
ప్రయాణికులతో సందడిగా మారిన భోగాపురం ఎయిర్ పోర్ట్
-
సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్ర పార్వతిని అడ్డుకున్న పోలీసులు..
-
DSC అక్రమార్కుల డైవర్షన్ ప్లాన్!
-
అచ్చెన్నాయుడి బూతు పురాణం
-
విశాఖ MP భరత్ కు బిగ్ షాక్ ఏకమైన ఎమ్మెల్యేలు
-
అమరావతిలో సదుపాయాలు లేవు.. కూటమి పార్టీ MLA షాకింగ్ కామెంట్స్
-
చింతాడ రవి కుమార్ సంచల ప్రెస్ మీట్
-
పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!
-
సర్కారు ‘పుర’చేతివాటం బాదుడే బాదుడు
సాక్షి,అమరావతి: ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబు సర్కారు ప్రజలపై భారాలు మోపడానికి పోటీపడుతోంది. ఆధునికత, ఏకీకృత విధానాల పేరిట వివి ధ రూపాల్లో బాదేస్తోంది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ప్రజ లపై భారాలు మోపడానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంది. ఆటోమ్యుటేషన్కు, డిజిటలైజేషన్, రాష్ట్రవ్యాప్తంగా ఒకే పాల సీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల (మూడో సవ రణ) బిల్లు 2026ను ప్రవేశపెట్టింది. పురపాలక కార్పొరేషన్ల చట్టం–1955లోని సెక్షన్ 208, ఏపీ పురపాలక చట్టం–1965 లోని సెక్షన్ 93 సవరణకు సిద్ధపడింది.ప్రజల కష్టాలను, ఆర్థి క ఇబ్బందులను విస్మరించింది. ఆస్తి అమ్ముకోవాలన్నా.. గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వాలన్నా అప్పటివరకూ ఉన్న బకాయిలు చెల్లి స్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని పేర్కొంది. స్థానిక సంస్థలు నిర్ణయించాల్సిన ఫీజును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించేలా అధికారం తీసుకుని స్థానిక సంస్థల అధి కారాలకు కత్తెర వేస్తోంది. బిల్లులో ప్రభుత్వం చూపిన కారణాలు చూసి నిపు ణులు విస్తుపోతున్నారు. ఒకే పాలసీ పేరుతో సామాన్యుల ఇబ్బందులను విస్మరించి.. ఆదాయం దండుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. లోపాలను పట్టించుకోని సర్కారుఆదాయం రాబట్టు కోవడానికి చట్టాల్లోని పలు సెక్షన్లను సవ రించడానికి సిద్ధపడిన చంద్రబాబు సర్కారు దానిలో లోపా లు, ప్రజల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను విస్మరించింది. కొత్త గా ప్రవేశ పెట్టిన బిల్లులో మ్యుటేషన్ ఫీజు ఎంత శాతం, ఎంత మొత్తం ఉంటుందో నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రజలపై ప్రత్యక్ష ప్రభావంఆస్తి అమ్మకం, బహుమతి, తనఖా, విభజన, మార్పిడి లేదా వారసత్వ బదిలీ అవ్వాలన్నా ఆస్తి పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించాలి. మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ అనంతరం పురపాలక రికార్డుల్లో కొత్త యజమాని పేరు ఆటోమేటిక్గా నమోదు అవుతుంది. అసెస్మెంట్ లేని ఆస్తులు కూడా పురపాలక పన్ను పరిధిలోకి వస్తాయి.బిల్లులో ప్రధాన లోపాలుమ్యుటేషన్ ఫీజు ఎంతో చెప్పలేదు. బిల్లులో ఫీజు మొత్తం, శాతం, కనిష్ట–గరిష్టపరిమితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని మాత్రమే పేర్కొంది. పట్టణ స్థానిక సంస్థల కేటగిరీల వారీగా శాతం ఆధారిత రేట్లు నిర్ణయిస్తామని చెప్పి న సర్కారు అసలు సవరణ క్లాజుల్లో శాతం, కేటగిరీలు, రేటు నిర్ణయించే ప్రమాణాలను పొందు పరచలేదు.రిజిస్ట్రేషన్కు బకాయిల లింక్ ! సామాన్యుడు ఏదైనా అవసరం ఉండి ఆస్తి అమ్ము కోవాలన్నా బిల్లులో పొందుపరిచిన నిబంధనలు గుదిబండగా ఉన్నాయి. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడంతో పాటు మ్యుటేషన్ ఫీజు కట్టిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. దీనివల్ల చిన్న బకాయి ఉన్నా.. రికార్డుల్లో పొరపాటు ఉన్నా రిజిస్ట్రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.వివాదాస్పద పన్ను బకాయిలపై స్పష్టత ఏది?ఆస్తి పన్ను నిర్ణయాన్ని యజమాని కోర్టులో లేదా అప్పీల్లో సవాలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్కు అను మతిస్తారా?లేదా అన్నది చెప్పలేదు. మరో వైపు‘సందర్భానుసారంగా బదిలీ దారుడు, బదిలీ పొందేవారు బకాయిలు చెల్లించాలి’అని పేర్కొన్నా.. ఎవరు ఏ బకాయి చెల్లించాలనేది స్పషత లేదు.తనఖాకు ఆటోమ్యుటేషన్ ఎందుకు?ఆస్తిని తనఖా పెట్టినంత మాత్రాన యాజమాన్యం మారదు. అయినప్పటికీ తనఖా లావాదేవీని కూడా మ్యుటేషన్ ప్రక్రి యలో చేర్చింది. దీని వల్ల ఆర్థిక అవసరాల కోసం బ్యాంకు రుణాలు తీసుకునేవారిపై అదనపు భారం పడుతుంది.కుటుంబ బదిలీ అయినా వడ్డనేవారసత్వం, కుటుంబ విభజన, బహుమతి, భార్యా భర్తలు లేదా తల్లిదండ్రులు – పిల్లల మధ్య బదిలీలకు ప్రత్యేక రాయితీలు గాని మినహాయింపు ఇవ్వలేదు. మరో వైపు పేదల, మధ్యతరగతి ప్రజలు, చిన్న ఇళ్లు, తక్కువ విలువైన ఆస్తులు, ప్రభుత్వ గృహ పథకాల లబ్ధిదారులు, పేద కుటుంబాలకు మ్యుటేషన్ ఫీజు మినహాయిస్తారా లేదా అన్న అంశంపై అసలు బిల్లులో ప్రస్తావించలేదు. దీనివల్ల పేదలు, మధ్య తరగతి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు.ఫీజు ఏ విలువపై లెక్కిస్తారో!మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ విలువపైనా, మార్కెట్ విలువపైనా, ఆస్తి పన్ను వార్షిక విలువపైన నిర్ణ యిస్తారో పేర్కొనలేదు. మరో వైపు ఒకే లావాదేవీపై చార్జీల మోతమోగనుంది. స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లిస్తున్న ఇప్పుడు అదనంగా ముటేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి వస్తుంది.అసెస్మెంట్ లేని ఆస్తులపై స్పష్టత ఏది?తాత్కాలిక అసెస్మెంట్ నంబర్ ఇస్తామని చెప్పారు. తుది అసెస్మెంట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, అభ్యంతరాలు ఎలా స్వీకరిస్తారు, అప్పీల్ ఎక్కడ చేయాలి అనే వివరాలు లేవు. మరో వైపు ఆటో మ్యుటేషన్లో తప్పుల సవరణకు వ్యవస్థ లేదు. పేరు, విస్తీర్ణం, డోర్ నంబర్, యాజమాన్య వివరాలు తప్పుగా నమోదైతే వాటిని సరిచేసే గడువు, ఎవరు పరిష్కరిస్తారో పేర్కొనలేదు.అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే?నకిలీ పత్రాలు లేదా కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులకు ఆటో మ్యుటేషన్ జరిగితే రద్దు లేదా సవరణకు అనుసరించాల్సిన విధానం లేదు. మ్యుటేషన్కు ముందు సహ యజమానులు, వారసులు లేదా ఇతర హక్కుదారులకు నోటీసు ఇవ్వాలా? అభ్యంతరాలు స్వీకరించాలా? అనే అంశంపై స్పష్టత ఇవ్వ లేదు. రిజిస్ట్రేషన్, ఆస్తి పన్ను డేటాను అనుసంధాని స్తున్నప్పటికీ వ్యక్తిగత సమాచారం భద్రత, సైబర్ సెక్యూరిటీ, డేటా దుర్వినియోగం కాకుండా ఎలాంటి రక్షణ వ్యవస్థ తీసుకొస్తోందో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.బకాయిలు చెల్లిస్తేనే...⇒ ఆస్తికి సంబంధించిన బదిలీ నోటీసు ఇచ్చే తేదీ నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలి.⇒ ప్రభుత్వం నిర్ణయించే ఆటోమ్యుటేషన్ ఫీజును చెల్లించకపోతే ఆస్తి బదిలీ జరగదు.⇒ ఆన్లైన్ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ రిజిస్టర్లో ఇప్పటికే నమోదైన ఆస్తుల బదిలీ సమయంలో మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి.⇒ ఆస్తిని పొందుతున్న వ్యక్తి అన్ని పురపాలక బకాయిలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు.⇒ ఇప్పటి వరకు అసెస్మెంట్ చేయని ఆస్తి రిజిస్ట్రే షన్కు వస్తే ముందుగా తాత్కాలిక అసెస్మెంట్ నంబర్ జారీ చేస్తారు. నిబంధనల్లో నిర్దేశించిన ప్రక్రియ పూర్తయ్యాక ఆ ఆస్తికి శాశ్వత అసెస్ మెంట్ నంబర్ కేటాయిస్తారు.⇒ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖతో పురపాలక శాఖ వ్యవస్థలను అనుసంధానించి రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఆటో మ్యుటేషన్ అవుతుంది. -
మెగా డీఎస్సీ స్కామ్కు సమాధానమేది
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 కుంభకోణంపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రజల్లోకి వెళ్లడం.. నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత, జెన్జీ దీనికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడంతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు నిద్ర పట్టడం లేదు. అందుకే దాన్ని కప్పిపుచ్చేందుకు, పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్లు రోజురోజుకీ వెల్లువెత్తుతుండటంతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కాపాడేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం అసెంబ్లీలో తండ్రి, కుమారుడు డీఎస్సీ అక్రమాలను సమర్థించుకుంటూ తప్పుదోవ పట్టించేలా కళ్లార్పకుండా అబద్ధాలు వల్లె వేశారని, అడ్డగోలు వాదనలు వినిపించారని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అని నిలదీస్తున్నారు. ‘‘ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను ఔట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు.. పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? పతకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలిస్తారా? జాతీయ పతక విజేతకు ఉద్యోగం ఎందుకు రాలేదు? సొంత పార్టీ నేతలే క్రీడా ధృవీకరణ పత్రాలు ఇవ్వటాన్ని నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు? మెగా డీఎస్సీపై 336 కేసులు వేశారంటూనే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బుకాయించడం ఏమిటి? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియోపై తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదుతో సరిపుచ్చి అసలు సూత్రధారులెవరో బయట పడకుండా తొక్కిపెడుతున్నదెవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనే. ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారించాలి’’ అని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రశ్నలకు లోకేశ్ సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరటాన్ని, సభ సాక్షిగా వ్యక్తిగత దూషణలకు దిగటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు సమాధానం చెప్పాల్సిందేనని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే స్పోర్ట్స్ కోటాలో నియామకాలకు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ ఒకరికేఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నల అప్లోడ్, డిజిటల్ నిర్వహణ అత్యంత గోప్యంగా జరగాలి. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను ఎస్సీఈఆర్టీ రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ ఇక్కడ డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండు బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. స్కామ్కు బీజం పడింది ఇక్కడే. గోప్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టడం వెనుక ఉద్దేశమేంటి?‘వెరిఫికేషన్కు రాలేదు’.. మరి కాల్ లెటర్ ఏది?మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి ధ్రువపత్రాల పరిశీలనకు రాలేదని, అందుకే పోస్టు ఇవ్వలేదని లోకేష్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాకమ్మ కబుర్లు కాదా? ఎందుకంటే.. మెరిట్ జాబితాలో ఆ అభ్యర్థి పేరు తీసేశారు.. అభ్యర్థి డేటాను మాయం చేశారు.. కాల్ లెటర్ ఇవ్వలేదు.. ఇక అలాంటప్పుడు ధృవపత్రాల పరిశీలనకు ఎలా వస్తాడు? అసలు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేదని చెబుతున్న వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అతడు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.అవన్నీ గోల్మాల్ కాక మరేంటి?కీలక బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం..అతడికి టాప్ ర్యాంకు రావడం.. ఆ తర్వాత పోస్టు ఇవ్వకపోవడం.. అతడి వివరాలను మాయం చేయడం.. ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికీ అర్థం పేపర్ లీక్ అయిందని అంగీకరించినట్లే కదా? పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐతో విచారణ జరగాలి.కలెక్టరేట్లు డమ్మీ.. పారదర్శకత ఎక్కడ?గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. మెగా డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ జాబితాలు లేవు. మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు. బహిరంగంగా జాబితాలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సందేశాలు పంపించే కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అసలు పారదర్శకత ఎక్కడ ఉంది? సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్లకు వెళ్తే పైకి వెళ్లండని, మాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ పేరుతో మొత్తం ప్రక్రియను కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?వన్ టు వన్ పిలిచి.. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. నిబంధనల ప్రకారం మెరిట్, రోస్టర్ ఆధారంగా ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. అంటే అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఓపెన్లోకి వస్తారా? రిజర్వేషన్లోకి వస్తారా? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికులు వంటి వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే తెలుసు. అందుకే 1 : 1 కింద పిలిచారు. మరి ధృవపత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? వారిని తిరస్కరించిన జాబితాలో కూడా ఎందుకు చూపలేదు? ప్రశ్నిస్తే సర్దుబాటు అంటున్నారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు? వీటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. పతకాలు లేకపోయినా ఉద్యోగాలిస్తారా?క్రీడాకారుల ప్రతిభ చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. పతకాలు చూడలేదు. కేవలం ఆటల్లో పాల్గొన్న ధృవపత్రం ఉంటే చాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. బాల్ బ్యాడ్మింటన్లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 270 మందికి పతకాలు లేకపోయినా కేవలం పాల్గొన్నందుకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న 99 మందికి ఉద్యోగాలు రాగా.. వారిలో 86 మందికి పతకాలు, ట్రోఫీలు లేవు. అంతర్ జిల్లా పోటీల్లో 59 మందికి ఉద్యోగాలు రాగా వారిలో 18 మందికి కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చారు.ధృవపత్రాలు ఇచ్చేదీ.. ధృవీకరించేదీ వారేనా?సాఫ్ట్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, జూడో సంఘం అధ్యక్షుడిగా విశాఖ ఎంపీ భరత్ ఉన్నారు. వాళ్లే ధృవపత్రాలు ఇచ్చి.. వాళ్లే ధృవీకరించి.. వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎలా వచ్చింది? అంటే నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగలేదా? జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఉద్యోగాలు రాకుండా.. కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు రావడం న్యాయమా?ఒక్కో పోస్టుకు రూ.15–20 లక్షల బేరసారాలా?స్పోర్ట్స్ కోటా పోస్టులకు ఒక్కొక్కదానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగినట్లు ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్తో వదిలేశారు. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా ఉన్నా ఎఫ్ఐఆర్లో పేరు వెల్లడించకుండా అనుమానితుడిగా మాత్రమే పేర్కొనడం ఎందుకు? ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే దానికి సమాధానం లేదు. నిజాలు తేలాలంటే సీబీఐ విచారణే..మెగా డీఎస్సీ వ్యవహారంలో ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు.. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రవేశం నుంచి టాప్ ర్యాంకు వరకు.. మెరిట్ జాబితా మార్పుల నుంచి కాల్ లెటర్ల వరకు.. స్పోర్ట్స్ కోటా నుంచి బేరసారాల ఆరోపణల వరకు అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విచారణ జరిగితే నిష్పక్షపాతంగా నిజాలు బయటకు వస్తాయా? స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున దీనిపై స్వతంత్ర విచారణ అవసరమని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మూడో పక్షం దర్యాప్తు జరగాలని స్పష్టంచేస్తున్నారు. సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని, దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్న డిమాండ్పై చంద్రబాబు సర్కారు ఎందుకు స్పందించడంలేదు?అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంకర్ఈ ప్రక్రియలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో మొదటి ర్యాంకు సాధించారు. టీజీటీ తెలుగు పరీక్షలో జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించాడు. అంటే ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకు వెళ్లింది? ఎంతమందికి చేరింది? లీకైన ప్రశ్నాపత్రం పొందినవారు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. నిజంగానే మెరిట్తో ర్యాంకు సాధించి ఉంటే అతడికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? లోకేశ్ వీటికి సమాధానం చెప్పలేదు.స్పోర్ట్స్ కోటా.. మరో పెద్ద కుంభకోణంమెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాను మరో పెద్ద కుంభకోణంగా మార్చారు. గతంలో రెండు శాతం ఉన్న క్రీడా కోటాను మూడు శాతానికి పెంచారు. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారు. అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్లీ నిబంధనలు మార్చి పాత జీవోలను రద్దు చేశారు. నిజంగా మంచి జీవోలు అయితే వాటిని ఎందుకు రద్దు చేశారు? తన వివరణలో లోకేశ్ ఈ అంశాలను ప్రస్తావించనేలేదు. -
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమర శంఖం పూరిద్దాం... ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
-
ఏపీలో జూడాల సమ్మె ఉధృతం.. అత్యవసర సేవలు బంద్
సాక్షి, అమరావతి: ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన మరింత ఉధృతం కానుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే పలు దశల్లో నిరసనలు చేపట్టిన జూనియర్ డాక్టర్లు.. నేటి నుంచి మూడో దశ ఆందోళనలకు సిద్ధమయ్యారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని వారు ప్రకటించారు.ఇప్పటివరకు ఓపీ, సాధారణ వైద్య సేవలకు మాత్రమే పరిమితమైన ఆందోళన.. ఇకపై అత్యవసర సేవలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలు నిలిచిపోతే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. -
జూడాల సమ్మె తీవ్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ వైద్యుల (జూడా) సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించనున్నామని ఏపీ జూడా అసోసియేషన్ ఆదివారం ప్రకటించింది. స్టైపెండ్ల పెంపులో చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దశల వారీ సమ్మెలో భాగంగా స్టైపెండ్ పెంపు నిర్ణయంపై ఆగస్టు 15 వరకూ ప్రభుత్వానికి ఏపీ జూడా డెడ్లైన్ ఇచ్చింది. గడువులోగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అత్యవసర సేవలను బహిష్కరించి సమ్మె తీవ్రతరం చేస్తున్నామని జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ శంకర్ ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్, జూనియర్ రెసిడెంట్స్, పీజీలు, సీనియర్ రెసిడెంట్స్ అత్యవసర సేవల్ని బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటారు. వీరి సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం(ఏపీజీడీఏ), ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏఏపీ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏపీ విభాగం, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈనెల 10 నుంచి జూడాలు సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి వీరికిచ్చే స్టైపెండ్ను పెంచాల్సి ఉంది. దీని గురించి గతేడాది డిసెంబర్ నుంచే ఏపీ జూడా ప్రభుత్వానికి వినతులు ఇస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత నెలలో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో చర్చలకు పిలిచిన ప్రభుత్వం జూడాలు 30%పెంపు కోరగా కేవలం 3 శాతం పెంచుతామని చెప్పింది. కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న 15% పెంపును కూడా ప్రభుత్వం ఎత్తేయడంపై నిరసనగా జూడాలు సమ్మెలోకి వెళ్లారు. -
కేజీబీవీ టెండర్లలో డీపీటీ దందా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారుకు ప్రతి పనిలో.. టెండర్లో దోచుకో..పంచుకో.. తినుకో (డీపీటీ) అలవాటుగా మారింది. అంచనాలు పెంచేయడం.. కమీషన్లు కొట్టేయడం రివాజుగా మారింది. లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీల్లో చదివే పిల్లలకు అందించే సరకుల రేట్లు కూడా పెంచేసి డీపీటీ విధానానికి తెరలేపారు. ఈ టెండర్ల వ్యవహారంలో పెద్ద తలకాయలు జోక్యం చేసుకోవడంతో అధికారులు మార్కెట్లో లభిస్తున్న ధరలతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్లు వేసిన ధరలకే టెండర్లు ఖరారు చేసేశారు. మార్కెట్లో కొనుగోలు చేస్తేనే ధరలు తక్కువగా ఉన్నాయి. కానీ టెండర్లలో ఇలా పెంచేయడం దోపిడీ కాక మరేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన విక్టరీ బజార్, విశాఖకు చెందిన విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్లతో పాటు నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లకు మొత్తం రూ.178 కోట్ల విలువైన టెండర్లను కట్టబెట్టేశారు. ధరల పెంపుపై ఆరోపణలు వస్తున్నా, ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. ఈ నెల 16 నుంచి సరుకులు సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.సిండికేట్కు జీ హుజూర్పేద, అనాథ బాలికలు చదివే కేజీబీవీలకు సరుకులు సరఫరా చేసే టెండర్లలో చిరువ్యాపారులు పాల్గొనకుండా నిబంధనలు విధించారు. ఈ వ్యవహారంలో అధికార పారీ్టకి చెందిన నేతల ఒత్తిడి పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. 20 వేల చదరపు అడుగుల గోడౌన్, 20 సొంత వాహనాలు ఉండాలనే నిబంధన పెట్టి సిండికేట్కు కట్టబెట్టేశారు. విజిలెన్స్ కేసులున్న కేంద్రీయ భండార్కి టెండర్ కట్టబెట్టడమే దోపిడీ పర్వానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. మార్కెట్లో లభించే ధరల కంటే దాదాపు 40 శాతం అధికంగా టెండర్లు ఖరారు చేశారు.మధ్యాహ్న భోజనం కంటే అధికంగా కోడిగుడ్డు ధర చెల్లింపు మిడ్ డే మీల్కి గుడ్డు రూ.6.20.. కానీ కేజీబీవీకి మాత్రం రూ.7.5ధరలు పెంచేసి.. జోన్ల వారీగా విభజించి..మార్కెట్లో కొనుగోలు చేస్తే లభించే ధరలను పట్టించుకోని సమగ్ర శిక్ష అధికారులు ఇష్టం వచ్చినట్టు ధరలు ఖరారు చేసి జోన్ల వారీగా విభజించి కట్టబెట్టారు. గతంలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కొనుగోలు కమిటీ ఉండేది. వారు నిర్ణయించిన మేరకు జిల్లాల వారీగా సరకులు సరఫరా చేసేవారు. ఇప్పుడు కేంద్రీకృత విధానానికి తెరలేపారు. జోన్ల వారీగా విభజించడంతో పాటు తమకు అనుకూలమైన వారికి టెండర్లు దక్కేలా నిబంధనలు రూపకల్పన చేయించి ఎల్–1 పేరిట దోపిడీ పర్వానికి ద్వారాలు తెరిచారు. -
నాలుగో సారీ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాలల సంరక్షణ కమిటీలు (సీడబ్ల్యూసీ), జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) నియామకాల విషయంలో చంద్రబాబు సర్కారు తమాషాలు చేస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా నాలుగోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 నవంబర్లోనే రాష్ట్రంలో సీడబ్ల్యూసీలు, జేజేబీల కాల పరిమితి ముగిసింది. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరకు పైగా నోటిఫికేషన్లు ఇవ్వడం.. ఇంటర్వూ్యలు చేయడం.. చివరకు నియామకాల దశలో రద్దు చేయడం పరిపాటిగా మారింది.తాజాగా మూడు నోటిఫికేషన్ల రద్దు చేసిన అనంతరం ఈ నెల 11న అరకొర నియామకాలతో మునపెన్నడూ లేని సంప్రదాయానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. 28 జిల్లాల్లో 140 మందిని నియామకం చేయాల్సి ఉండగా, కేవలం 9 జిల్లాల్లో 33 మందిని మాత్రమే నియమించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం.. కూటమి నేతల్లోనే ఈ నియామకాలపై అసంతృప్తి జ్వాలలు రేగడంతో ఆ మొత్తం ప్రక్రియను రద్దు చేసి ఈ నెల 14న నాలుగోసారి నోటిఫికేషన్ ఇచ్చింది.సీడబ్ల్యూసీల నియామకానికి సంబంధించిన రిఫరెన్స్లో పేర్కొన్న అంశాలు తప్పుగా వచ్చినా సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నెల 11న ఇచ్చిన జీవోలో 11.08.2026 అనడానికి బదులు 11.08.2028 అని ఇచ్చింది. తర్వాత ఈ తప్పును సరి చేయక పోవడం గమనార్హం. కాగా, నియామక కమిటీ మంత్రి సంధ్యారాణి, కీలక మంత్రి లోకేశ్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని సమాచారం. -
ఆ వంకర ఎవరికోసం?
-
కర్నూల్ లో జగన్ సునామీని చూసి కూటమికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది
-
అభివృద్ధి లేదు కానీ అప్పులు మాత్రం సరిపడా ఉన్నాయి..
-
అక్కడ నిషేధం.. ఇక్కడ ఆహ్వానం
సాక్షి, అమరావతి: దొంగ బిల్లులతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండికొట్టే కంపెనీలకు చంద్రబాబు సర్కారు రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తోంది. రాష్ట్రంలో హరిత ఇంధన రంగంలో రూ.76,250 కోట్ల పెట్టుబడి పెడతానంటూ ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్కు చెందిన ఎకోరన్ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్ ఏకంగా దొంగ ఇన్వాయిస్లతో రూ.64 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన ఘటన మరవకముందే..ఇప్పుడు బాబు సర్కారు మరో దొంగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇటీవల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికంటూ సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖకు చెందిన డేటా ప్రో కంప్యూటర్స్ లిమిటెడ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్య శిక్షణ పేరిట ఈ కంపెనీ పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తూ దొంగ బిల్లులతో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా కొన్నిరాష్ట్రాలు ఈ కంపెనీపై ఏకంగా నిషేధాన్ని కూడా విధించాయి. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన కంపెనీతో చంద్రబాబు స్వయంగా ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు అధికారవర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.జమ్మూ అండ్ కశ్మీర్లో ఏసీబీ కేసుశిక్షణ ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు చూపించడమే కాకుండా వారికి ఉపాధి కల్పించినట్లు దొంగ సర్టిఫికెట్లు సమర్పించి రూ.కోట్లు కొట్టేయడానికి పథకం వేసి విశాఖకు చెందిన డేటాప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జమ్మూ అండ్ కశ్మీర్ ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కు చెందిన ‘హిమాయత్ ప్రోగ్రామ్’ను అమలు చేయడానికి 2018లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం డేటాప్రోతో ఒప్పందం కుదుర్చుకుంది.రూ.30 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో తొలి విడత రూ.7 కోట్లు చెల్లించగా మలివిడత సొమ్ము కోసం ఏకంగా 89 మంది నకిలీ అభ్యర్థుల జాబితాను సమర్పించి ఏసీబీకి ఈ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది.మొత్తం శిక్షణ ఇచ్చినట్లు చూపించిన 136 మంది అభ్యర్థుల్లో 89 మంది నకిలీ అభ్యర్థులే ఉన్నట్లు తేలింది. వీరంతా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందారంటూ దొంగ బ్యాంకు ఖాతాలను జమ్మూ కశ్మీర్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్కు డేటా ప్రో సమర్పించింది. దీనిపై ఆ రాష్ట్ర ఏసీబీ సెపె్టంబర్ 1, 2021న ఎఫ్ఐఆర్ నంబర్ 08/2021తో కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం 2022లో జమ్మూ కశ్మీర్ పరిపాలన యంత్రాంగం రూ.3 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఈ కంపెనీ ఖాతాలను జప్తు చేసి కంపెనీని రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్లో చేర్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా డేటాప్రో కార్యకలాపాలను నిషేధించాలంటూ కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. విశాఖ కేంద్రంగా 2008లో ప్రసాద్ రంగినేని, ప్రసాద్ సిద్ధవరపు డైరెక్టర్లుగా ఉన్న ఈ కంపెనీ పలు రాష్ట్రాల్లో నైపుణ్య శిక్షణ పేరిట ఈ విధమైన మోసాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి కంపెనీతో సీఎం చంద్రబాబే ఎంవోయూ కుదుర్చుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
డీఎస్సీ డైవర్షన్ కోసమే..!
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలు, లీకేజీలపై జెన్జీ నిలదీస్తున్న వేళ.. అందరి దృష్టి మళ్లించేందుకు గ్రూప్–1పై పసుపురాతల ‘ఈనాడు’ అభూత కల్పనలకు తెగబడింది. డీఎస్సీ పాపాల నుంచి లోకేశ్ను కాపాడడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో డీఎస్సీ కుంభకోణంపై లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎస్సీ కుంభకోణంపై వైఎస్సార్సీపీ నిలదీస్తుందన్న భయంతోనే చంద్రబాబు హడావిడిగా గ్రూప్–1 అక్రమాలంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. వాస్తవానికి కోవిడ్ పరిస్థితుల కారణంగానే ఎపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షలలో డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. దాని ఆధారంగా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఎవరూ లబ్ధి పొందలేదు. హాయ్ల్యాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదని, అక్కడ జరిగినది ప్రిపరేటరీ వర్క్ మాత్రమేనని సాక్షాత్తూ చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషినల్ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒకవైపు మూల్యాంకనమే జరగలేదని కోర్టులో చెబుతారు. మరోవైపు అదే అంశంపై ఆరోపణలు, అనుమానాలు ఎందుకు రేపుతున్నారు? హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు ఆధారాలే లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్ ఎక్కడ? అంతేకాదు.. అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి ఇంకా ఆరోపణలు ఎందుకు? డీఎస్సీ అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ కథనాలు.. ఎల్లోవీుడియా, చంద్రబాబు కలిసి లోకేశ్ని రక్షించడానికే ఇలాంటి అభూతకల్పనలు వండివార్చుతున్నట్లు అర్థం కావడం లేదూ... అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్ నివేదికలో పేర్కొన్న భాగం డీఎస్సీలాగా లీకేజీల్లేవ్.. అక్రమాల్లేవ్... వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన డీఎస్సీ మాదిరిగా ఎలాంటి అక్రమాలు జరగలేదు. కావాల్సిన అభ్యర్థుల కోసం అనుకూల జీవోలు ఇవ్వలేదు. పరీక్షల నుంచి మినహాయింపులూ ఇవ్వలేదు. పేపర్ లీకేజీలు జరగలేదు. డీఎస్సీ మాదిరిగా ఏపీపీఎస్సీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్ ర్యాంకుల్లాంటివి రాలేదు. కోవిడ్ వల్లే డిజిటల్ మూల్యాంకనంకోవిడ్ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం గ్రూప్–1 పరీక్షా పత్రాలను డిజిటల్ మూల్యాంకనం జరిపించింది. అయితే నోటిఫికేషన్ సమయంలో పేర్కొనలేదంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో టెక్నికల్ గ్రౌండ్స్లో డిజిటల్ మూల్యాంకనాన్ని కోర్టు నిలిపివేసింది. అంతే తప్ప డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కాదు, కొంతమందికి అయాచిత లబ్ధి జరిగిందనీ కాదు. హైకోర్టు డిజిటల్ మూల్యాంకనం నిలిపేసిన తర్వాత, మాన్యువల్ మూల్యాంకనం ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఎంతో కష్టపడి చదివి, కఠినమైన ఇంటర్వూ్యలో ఎంపికై, నాలుగేళ్లపాటు ఉన్నత ఉద్యోగాలు చేసి, ప్రజలకు సేవలందిస్తున్న 163 మంది గ్రూప్–1 ఆఫీసర్లపై చంద్రబాబు కత్తి కట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన పరీక్షలో ఉత్తీర్ణులై ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికై ప్రస్తుతం ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న 163 మంది జీవితాలతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు.హైకోర్టు పర్యవేక్షణలోనే మొత్తం ప్రక్రియఅసలు ఈ నోటిఫికేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి, ఉద్యోగాల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే సాగింది. అలాగే ఉద్యోగాలు సాధించిన వారు, ఉద్యోగాలు రాని వారు, కేసులు వేసిన వారు, ఇలా అందరి జవాబు పత్రాలన్నీ కూడా కోర్టు కస్టడీలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మార్పులు, చేర్పులు జరగలేదని, తారుమారు కూడా కాలేదని సిట్ నిర్ధారించింది. ఉద్యోగాల భర్తీలో డిజిటల్ మూల్యాంకనాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు చేసిన మాన్యువల్ మూల్యాంకనాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. మాన్యువల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత న్యాయ పర్యవేక్షణ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారాలు చేయడం డీఎస్సీ లీకేజీ, అక్రమాల నుంచి డైవర్ట్ చేయడానికి కాక మరేమిటి?. అభ్యర్థుల ప్రతిభ, వారి ఎంపిక, వారి ర్యాంకుల్లో తప్పులు జరగలేదన్న విషయాన్ని సిట్ పదే పదే తన నివేదికలో స్పష్టం చేసింది. వారు తమ ప్రతిభ, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యారని నివేదికలో పేర్కొంది. అసలు వాల్యుయేషన్ ఎలా జరుగుతుందన్న దానిపై అటు ఎల్లో వీుడియాకు, ఇటు చంద్రబాబుకు అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.అంతా సవ్యంగానే జరిగిందన్న ఏపీపీఎస్సీచంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్ 22న విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇప్పించి, ఏపీపీఎస్సీ మూల్యాంకనంపై విచారణకు ఓ సిట్ వేశారు.. వాదనల సమయంలో ప్రస్తుత ఏపీపీఎస్సీ పాలక మండలి తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ మూల్యాంకనం అంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేశారు. కౌంటర్ దాఖలు చేశారు. అటు తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మరొక సిట్ను 2026, ఫిబ్రవరి 14న వేసింది. ఈ సిట్ వేసిన దగ్గర నుంచి హైకోర్టులో వాదనలు మారిపోయాయి, గతానికి భిన్నంగా రాజకీయ బాస్ల ఆదేశాలకు అనుగుణంగా వాదనలు మొదలయ్యాయి. రెండో సిట్ అందుకు అనుగుణంగానే రాజకీయ కోణంలో ప్రాథమిక నివేదికలు ఇచ్చింది. సిట్ నివేదిక మొత్తం చూస్తే అభ్యర్థుల అర్హతల మీద కాని, వారి సామర్థ్యాల మీద గాని, పరీక్షలు నిర్వహించిన విధానాల మీద కాని, జవాబు పత్రాలను తారుమారు చేసినట్టుగాని ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ చంద్రబాబు, ఎల్లోవీుడియా బురదజల్లుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం మానసిక వేదనను అనుభవించాల్సి వస్తోంది.మూల్యాంకన ప్రక్రియ ఇలా ఉంటుంది...మూల్యాంకనంలో భాగంగా వాల్యుయేటర్ దిద్దిన తర్వాత, చీఫ్ ఎగ్జామినర్కి ఇస్తారు. దాంట్లో ఏమైనా తేడాలున్నాయని చీఫ్ ఎగ్జామినర్ భావిస్తే, మళ్లీ ఆ జవాబుపత్రాన్ని మరొకసారి పరిశీలించమని మొదటి వాల్యుయేటర్ను కోరవచ్చు. లేదా మరో వాల్యుయేటర్కి అప్పగించవచ్చు. ఈ ప్రక్రియలో ప్రతి ప్రశ్న ఎవాల్యుయేటర్ దిద్దాడా? దిద్దిన ప్రతి ప్రశ్నకు మార్కులు వేశాడా? వేసిన ప్రతి మార్కును తిరిగి ఓఎంఆర్ షీట్లలో నింపారా? అని పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దమని మరోసారి వాల్యుయేటర్కి ఇస్తారు. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా ప్రశ్నలవారీగా ఓఎంఆర్ షీటులో నమోదు చేస్తారు. ఇంత పకడ్బందీగా మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. ప్రతిభ ఉన్న వారికి అన్యాయం జరగకుండా ప్రతి దశలో కూడా పరిశీలనా ప్రక్రియ ఉంటుంది. రెండు సార్లు ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి. మరి ఈ ప్రక్రియను అక్రమంటూ తప్పుడు రాతలు రాసి రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. మూల్యాంకనంలో ఏకరూపత కోసం చీఫ్ ఎగ్జామినర్కు మార్కులను పరిశీలించి మాడరేట్ చేసే అధికారం ఉంటుంది అన్న అంశాన్ని ఎల్లో మీడియా మర్చిపోయింది. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం అనేక దశల్లో జరుగుతుంది. ఇందులో అనేక మంది పాలుపంచుకుంటారు. ఒక క్యాంపు ఆఫీసర్, ఆయన కింద అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్, ఆయన కింద ఎగ్జామినర్, ఎగ్జామినర్ చేసిన మూల్యాంకనాన్ని పరిశీలించడానికి ఒక స్క్రూటినైజర్ ఉంటారు. వీళ్లందరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్లంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్లందరి దగ్గరకూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. సరిదిద్దాల్సిన చోట దిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీకూడా కంట్రోల్ బండిల్ స్లిప్పులో నమోదు అవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. అలాంటప్పుడు దిద్దివేతలు ఎలా అక్రమాలు అవుతాయి? అత్యున్నత అధికారులతో ఇంటర్వ్యూ బోర్డులు... విచిత్రంగా ఈ రెండో సిట్లో సభ్యుడిగా ఉన్న డీజీ ర్యాంకు అధికారి, సీనియర్ ఐపీఎస్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. తదుపరి నోటిఫికేషన్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేశారు. 163 మందిని ఎంపిక చేసే ప్రక్రియలో 24 మంది సీనియర్ ఐఏఎస్లు.. ఐపీఎస్లు ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వాళ్లు ఇంటర్వూ్యలకు మార్కులు కూడా వేశారు.గతంలో ఒక బోర్డు.. వైఎస్సార్సీపీ హయాంలో మూడు బోర్డులువైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ఎంపిక ప్రక్రియకు ఒక్కటే ఇంటర్వ్యూ బోర్డు ఉండేది. అందులో ఒకరే సివిల్ సర్వీసెస్ అధికారి ఉండేవారు. కానీ సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసింది. గ్రూప్–1 నియామకాల్లో మొత్తంగా 24 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇంటర్వూ్యలు చేశారు.వీసీలకూ ఇంటర్వ్యూ బోర్డులో స్థానం.. ఎంపిక ప్రక్రియలో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన ఆరుగురు వైస్ఛాన్సలర్ (వీసీ)లకు కూడా ఇంటర్వ్యూ బోర్డులో స్థానం కల్పించారు. వారు కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన వారిలో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉన్న సభ్యుల్లో, రెండు బోర్డులకు ఛైర్మన్లు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన వారే ఉన్నారు.. వారిలో ఒకరు కె. విజయ్కుమార్ కాగా, మరొకరు ప్రొఫెసర్ పద్మరాజు.గ్రూప్–1కి ఎంపికైన వారిలో 16 మంది ఐఏఎస్, ఐపీఎస్ సహా కేంద్ర సర్వీసులకు ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వారి వివరాలు జంబ్లింగ్ విధానంతో పారదర్శకత.. అప్పటి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ 104 మందిని ఇంటర్వ్యూ చేస్తే, చంద్రబాబు హయాంలో నియామకం అయిన కె. విజయ్ కుమార్ 102 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఏ ఇంటర్వూ్యలో ఏ బోర్డు మెంబర్ ఉన్నారో కూడా తెలియకుండా.. జంబ్లింగ్ విధానాన్ని పాటించారు. దీనివల్ల అభ్యర్థుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించినట్లయింది.హాయ్ల్యాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదుహైకోర్టు సూచనల నేపథ్యంలో మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఏపీపీఎస్సీ సిద్ధమయ్యింది. కోవిడ్ నేపథ్యంలో హాయ్ల్యాండ్ను ఎంచుకున్నారు. కానీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ మూల్యాంకనం జరగలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ కోర్టుకు సమర్పించిన అడిషినల్ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొంది. మాన్యువల్ ఎవాల్యూయేషన్కు అవసరమైన ప్రిపరేటరీ వర్క్ మాత్రమే అక్కడ జరిగిందని ఆ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టంగా పేర్కొంది. అసలు అక్రమాలన్నీ హాయ్ల్యాండ్లోనే జరిగాయని, అక్కడే మూల్యాంకనం చేశారన్న పలువురి ఆరోపణలకు సిట్ కూడా తన నివేదికలో స్పష్టత ఇచ్చింది. హాయ్ల్యాండ్లో అసలు ఎలాంటి మూల్యాంకనం జరగలేదని తేల్చింది. గ్రూప్–1 వ్యవహారంలో హాయ్ల్యాండ్లో రెండో మూల్యాంకనం జరిగిందంటూ తప్పుడు ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ‘అనర్హుల చేత మూల్యాంకనం చేయించారు’, ‘డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారు’ అంటూ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలోనే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా... పారదర్శకత కోసం ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టారు. పరీక్ష రాసే అభ్యర్థుల్లో డూప్లికేట్ క్యాండిడేట్ లేకుండా ఫేషియల్ రికగ్నిషన్, వేలిముద్రల స్వీకరణ, ప్రతి పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ కఠినమైన, పారదర్శకమైన పద్ధతులు అవలంబించడం మొదలుపెట్టగానే, అటు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవే పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టింది.పరీక్షలు పారదర్శకం.. అభ్యర్థుల ట్రాక్ రికార్డే నిదర్శనంఏపీపీఎస్సీ పరీక్షలు ఎంత సమర్థవంతంగా జరిగాయి, ఎంత పారదర్శకంగా జరిగాయి, ఎంత ప్రతిభ ఆధారంగా జరిగాయి అనడానికి ఎంపికైన అభ్యర్థుల ట్రాక్ రికార్డు కన్నా మరో నిదర్శనం ఉండదు. ఎంపికైన 163 మందిలో, ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో ఐఐటీల నుంచి 19 మంది, ఐఐఎంల నుంచి ఏడుగురు, ఎన్ఐటీల నుంచి 17 మంది, బిట్స్ పిలానీ నుంచి ఇద్దరు, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు పూర్తిచేసిన వారు 177 మంది, జనరల్ పీజీలు, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు.సివిల్స్ అర్హత సాధించిన అభ్యర్థులు..ఇందులో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు 39 మంది ఉంటే, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లుగా ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపికైన వారు 16 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి సివిల్ సర్వీసుల్లో వేరే రాష్ట్రాల కేడర్ వస్తే సొంత రాష్ట్రాల్లోనే పనిచేద్దామని ఆ సివిల్ సర్వీసు పోస్టులను కూడా వదులుకుని ఇక్కడే కొనసాగుతున్నారు. పైగా ఇదే నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించిన వారు కూడా, మళ్లీ ఏపీపీఎస్సీ నిర్వహించిన మరో నోటిఫికేషన్లో కూడా పరీక్షలు రాసి, డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు.గ్రూప్–1కి ఎంపిక అయిన వారిలో ఐఐటీల నుంచి 19 మంది ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వివరాలు ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారుఇవే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు హాజరైన 325 మందిలో కేంద్రప్రభుత్వ సంస్థల్లో పనిచేసినవారు 34 మంది, రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన సంస్థల్లో పనిచేసిన వారు 103 మంది, ఇతర ఉద్యోగాలు చేసినవారు 101 మంది ఉన్నారు. ఐటీ రంగంలో నిపుణులుగానూ, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగులు గానూ, డాక్టర్లుగా పనిచేసిన వారూ ఉన్నారు. ఇదే రిక్రూట్మెంట్ లో ఎంపికైన వ్యక్తిని కుప్పం ఆర్డీఓగా చంద్రబాబు నియమించుకున్నారు. కోర్టు ఈ 163 మందిని నాన్ ఫోకల్ పోస్టుల్లో వేయాలని ఆదేశాలు ఇస్తే, ఇదే చంద్రబాబు మాత్రం ఆ ఆర్డీఓను తన నియోజకవర్గం కుప్పంలో ప్రత్యేకంగా నియమించుకున్నారు. దిద్దివేతలు ఎగ్జామినర్లవేఓఎంఆర్ షీట్లో దిద్దివేతలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి సిట్ తన నివేదికలో ఎగ్జామినర్లే దిద్దివేతలు చేశారని, కాకపోతే వాళ్లు మూల్యాంకనం చేసిన తర్వాత పొరపాటున కొన్నిచోట్ల సంతకాలు మరిచారని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఎగ్జామినర్లు అంగీకరించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఇలా మరిచిపోవడాన్ని ఆసరాగా తీసుకుని ఎలాంటి బయటవ్యక్తులు దిద్దివేతలు చేసే అవకాశం కూడా లేదని తేల్చిచెప్పింది. సమాధాన పత్రాలు చెక్కు చెదరలేదు. మాన్యువల్ మూల్యాంకనంలో ఉపయోగించిన అభ్యర్థుల అసలు సమాధాన పత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని సిట్ నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. హాయ్ల్యాండ్లో జవాబు పత్రాలు 84 రోజుల పాటు ఉన్నప్పటికీ వాటిలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదా మార్పులు జరగలేదన్నది ఫోరెన్సిక్ పరిశీలనలో తేలినట్లు సిట్ చెప్పింది.ఎన్ఐటీల నుంచి 17 మంది ఎంపికైనట్లు సిట్ వెల్లడించిన వివరాలు కొందరికి లబ్ది చేకూర్చారన్న ఆరోపణలు తోసిపుచ్చిన సిట్...ఎంపికైన 163 మంది అభ్యర్థులు, ఎంపిక కాని వారు, అలాగే హైకోర్టును ఆశ్రయించిన 408 మంది రిట్ పిటిషనర్ల విషయంలో ఒకే రకమైన మార్పుల నమూనాలు ఉన్నాయన్న సిట్, ఈ తేడాలు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికే పరిమితం కాలేదని స్పష్టంగా పేర్కొంది. ముందుగా నిర్ణయించిన కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చడానికి రికార్డులను సవరించారన్న ఆరోపణను సిట్ తోసిపుచ్చింది. మూల్యాంకనంలో మార్కులు పెరిగాయన్న దానికి సిట్ తన నివేదికలో చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. టోటల్ మార్కుల లెక్కింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దడం వల్ల మాత్రమే మార్కుల పెరుగుదల జరిగిందని నిర్ధారించింది. తద్వారా మూల్యాంకన స్లిప్పై జరిగిన ప్రతి మార్పును మోసపూరిత తారుమారుగా చూడ్డానికి వీల్లేదని సిట్ తేల్చి చెప్పింది.అక్రమాలకు ఆధారాల్లేవన్న సిట్.. నిజానికి సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని నిర్ధారించలేదు. బార్కోడ్లు మారలేదని స్పష్టం చేసినా, జవాబు పత్రాల మార్పిడి జరగలేదని చెప్పినా, మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాల్లేవని తేల్చినా కూడా.. చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం, తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన 10 వేల పేజీల విచారణ నివేదికలో ‘ఒరిజినల్ జవాబు పత్రాలను మార్చినట్లు గానీ, బార్ కోడ్లను తారుమారు చేసినట్లు గానీ ఎలాంటి ఆధారాలు లభించలేదని సిట్ తేల్చింది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా లబ్ధి చేకూర్చినట్లు కూడా ఆధారాల్లేవంది. 287 బార్కోడ్ల వ్యత్యాసాలపై ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) జరిపిన అత్యున్నత స్థాయి ఫోరెన్సిక్ పరీక్షల్లో అభ్యర్థుల పేపర్లు మారలేదని సిట్ తేల్చింది. అభ్యర్థుల గుర్తింపుపై గానీ, మూల్యాంకనంపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని సిట్ నివేదిక తేటతెల్లం చేసింది. -
ఎవరిని కాపాడటం కోసం చూస్తున్నారు! ఏపీ ప్రభుత్వం పై ప్రియాంక తండ్రి సంచలన కామెంట్స్
-
ఆర్నెల్లకే.. చంద్రబాబు సర్కార్ మరో దుబారా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ దుబారాకు ఇదో నిలువెత్తు నిదర్శనం..! జనవరిలో రాజధాని పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు సిద్ధం చేసేందుకు రూ.6.68 కోట్లు వ్యయం చేసింది. ఆర్నెల్లు తిరక్కముందే పరేడ్ గ్రౌండ్ను మెరుగుపర్చే పనులకు రూ.3.30 కోట్లు వ్యయం చేసింది. ఈ రెండు పనులను టెండర్ ద్వారా ఒకే సంస్థ ఎన్సీసీకే కట్టబెట్టడం గమనార్హం. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసేందుకు, మెరుగుపర్చేందుకు రూ.9.98 కోట్లు వ్యయం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించేది. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను రాజధాని ప్రాంతంలో నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయం వెనుక 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు రూ.6,58,07,360 అంచనాతో సీఆర్డీఏ ద్వారా టెండర్ పిలిచింది. రూ.6,68,27,374.08 కోట్చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు ఆ పనులను కట్టబెట్టింది. ఆ గ్రౌండ్లోనే జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశాలను మెరుగుపర్చే పనులకు రూ.3,17,96,335 అంచనాతో జూలై 10న సీఆర్డీఏ ద్వారా టెండర్ పిలిచింది. ఈ టెండర్లోనూ రూ.3,30,61,829.13 కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్కు ఆ పనులను కట్టబెట్టింది. అంటే.. పరేడ్ గ్రౌండ్ను సిద్ధం చేసిన ఆర్నెల్లకే దాన్ని మెరుగుపర్చే పనులను రూ.3.30 కోట్లకు అప్పగించడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. -
ఆదాయానికి మించి అప్పు.. ముప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు సొంత పన్ను రాబడులను మించి పోయి విచ్చలవిడిగా అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే ముమ్మాటికీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడమే. కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలు (2026 ఏప్రిల్ నుంచి జూలై వరకు) బడ్జెట్ కీలక సూచికలను కాగ్ శుక్రవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయిస్తే.. రాష్ట్ర సొంత పన్నులు రాబడులు జూలై వరకు రూ.38,092 కోట్లు వచ్చినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్లో చేసిన అప్పులే ఏకంగా రూ.49,134 కోట్లుగా ఉన్నట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. అంటే చంద్రబాబు సర్కారు సొంత పన్ను రాబడులకన్నా రూ.11,042 కోట్లు ఎక్కువగా అప్పులు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూలధన వ్యయం.. దయనీయం మరోపక్క చేసిన అప్పుల్లో మూలధన వ్యయం దారుణంగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. నాలుగు నెలల్లో ఏకంగా రూ.49,134 కోట్లు అప్పు చేస్తే మూలధన వ్యయం కేవలం రూ.9,963 కోట్లు మాత్రమేనని గణాంకాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్ అంచనా వ్యయంలో మూలధన వ్యయం 20.46 శాతమేనని కాగ్ తెలిపింది. బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పుల్లో నాలుగు నెలల్లోనే 64.76 శాతం అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రూపంలో వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించిన నిధుల్లో కేవలం 9.11 శాతమే వచ్చినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32,458 కోట్లు గ్రాంటు రూపంలో వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా నాలుగు నెలల్లో కేవలం రూ.2,956 కోట్లే వచ్చినట్లు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ గ్రా>ంట్లు రూపంలో నిధులు రాబట్టడంలో తీవ్రంగా విఫలమైనట్లు ఇది స్పష్టం చేస్తోంది. గీత దాటిన రెవెన్యూ లోటు మరో పక్క ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. రెవెన్యూ రాబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని రెవెన్యూ లోటు పెరుగుదల స్పష్టం చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లకు పరిమితం అవుతుందని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే నాలుగు నెలల్లోనే రెవెన్యూ లోటు ఏకంగా 36,942 కోట్లకు ఎగబాకింది. అంటే బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను మించి 167.90 శాతానికి రెవెన్యూ లోటు పెరిగిపోయింది. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు అదుపు తప్పి పెరగడం అంటే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయడమేనని స్పష్టమవుతోంది.2026 జూలై వరకు బడ్జెట్ కీలక సూచికలు ఇలా..⇒ రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.38,092 కోట్లు ⇒ కేంద్ర పన్నుల్లో వాటాతో కలిపి సొంత పన్ను ఆదాయం రూ.48,764 కోట్లు ⇒ బడ్జెట్ అప్పు రూ.49,134 కోట్లు ⇒ రెవెన్యూ లోటు రూ.36,942 కోట్లు ⇒ ద్రవ్యలోటు రూ.49,134 కోట్లు ⇒ మూలధన వ్యయం రూ.9,963 కోట్లు ⇒ మొత్తం రెవెన్యూ రాబడి రూ.54,059 కోట్లు ⇒ రెవెన్యూ వ్యయం రూ.91,001 కోట్లు -
బాబుకు పవన్ షాక్.! జనసంద్రాన్ని చూసి బాబు ఏడుపు.. కరకట్టలో పగిలిన టీవీలు!
-
జగన్ దెబ్బకు.. కరకట్టలో పగిలిన టీవీలు.. చిరిగిన సోఫాలు..
-
రెడ్బుక్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే విరుపాక్షిపై అక్రమ కేసు పెట్టారు... చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
బాధితులే నిందితులా?.. పరాకాష్టకు కుట్ర రాజకీయాలు
బీసీ నాయకులపై చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్, గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తఫాలపై ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నాం.– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెన్నుపోటు పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం సాక్షిగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్టు చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, బాధితులే నిందితులవుతున్నారని.. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలే లక్ష్యంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళితే ఆయనపైనే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బాధితుల పక్షాన ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. వారు ఎమ్మెల్యేలైనా కూడా లెక్కలేకుండా అర్ధరాత్రి పూట పోలీసులే దొంగలు, బందిపోటు గూండాల మాదిరిగా ఇంట్లోకి చొరబడి సీసీ టీవీ కెమెరాలు దొంగిలించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి దుర్బర పరిస్థితులు నెలకొనడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం 3.50 గంటల ప్రాంతంలో ములాఖత్లో కలుసుకున్నారు. అరగంటపాటు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తానున్నానని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? ‘‘ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా విరూపాక్షి గెలుపొందారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా చొరబడి నిద్ర పోతున్న ఆయన్ను అరెస్టు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇది జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడి.. సీసీ కెమెరాలను దొంగిలించి.. డోర్లు పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మనుషుల సంచారం లేని రాత్రి సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం దారుణం. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? పగటి పూట నోటీసు ఇస్తే ఎమ్మెల్యే స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వడా? విరూపాక్షికి సంబంధించి ఒక కేసులో 34 మందిపై, రెండో కేసులో మరో 14 మందిపై కేసు పెట్టారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తంగా 38 మంది రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన తమ్ముడి కొడుకుసహా కేసు పెట్టి జైలుపాలు చేశారు. మరో తమ్ముడి కొడుకును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల ఆరు తప్పులు.. ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసుల్లో పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో వారు ఆరు తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. (ఇందుకు సంబంధించి ఫోన్ కాల్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు చూపారు) 1 బాధితులపై దాడి చేసి.. వారిపైనే కేసులు పెట్టడం మొదటి తప్పు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంగాలకు చెందిన గిరి అనే పార్టీ కార్యకర్త తన ఇంటిపై దాడి జరుగుతోందని, అందుకు సంబంధించి తన ఇంటి ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యేకు ఆగస్టు 1వ తేదీన రాత్రి 7.45 గంటలకు పంపారు. ఎమ్మెల్యే వెంటనే 7.47 గంటలకు చిప్పగిరి ఎస్ఐకి ఫోన్ చేసి గిరిని కాపాడాలని కోరారు. ఆ వెంటనే ఆలూరు సీఐకి కూడా ఫోన్ చేస్తే కలువలేదు. తిరిగి 8.03 గంటలకు సీఐకి ఫోన్ చేసి కాపాడాలని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 8.08 గంటలకు గిరి.. ఎమ్మెల్యేకు మరోసారి ఫోన్ చేసి కాపాడకపోతే చంపేస్తారని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎమ్మెల్యే స్వయంగా సంగాలకు వెళ్లి.. అక్కడ పరిస్థితులను తెలుసుకొని గిరిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టడం పోలీసుల మొదటి తప్పు 2 నేమకల్లులో ఎమ్మెల్యే కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో నేమకల్లులో ఓ టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చింపారని చెప్పి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే రెండో కేసు పెట్టి మరో తప్పు చేశారు. 3 ఎమ్మెల్యే కారుపైనే దాడి చేసి.. ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టి, దాడి చేసిన వారి జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యేపైనే మూడో కేసుపెట్టి పోలీసులు మూడో తప్పు చేశారు. 4 టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన సంగాల గిరి, చేయి విరిగిపోయిన తమ్ముడిని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కేసు పెట్టాలని కోరినా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం నాలుగో తప్పు. ఇక్కడ ఎమ్మెల్యేపైనే రివర్స్ కేసు పెట్టారు. 5 సంగాల, నేమకల్లులలో జరిగిన సంఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.. పోలీసులే కేసులు కట్టడం ఐదో తప్పు. 6 ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొళ్లి.. పోలీసులే సీసీటీవీ కెమెరాలను దొంగల్లా తీసుకెళ్లడం ఆరో తప్పు. ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి పోలీసులు కేసులు పెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వ్యవస్థను నడిపాం. చంద్రబాబు ప్రభుత్వంలో అవేమీ లేకుండా బాధితులెవరూ ఫిర్యాదు ఇవ్వకున్నా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబూ ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావో తెలుసుకో.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడానికి ఏకంగా టీడీపీ కార్యకర్త పది మంది చూస్తుండగా తన భార్య బట్టలు చింపే వరకు దిగజారారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపే వీడియో బయటకు రావడంతో రాష్ట్రం నివ్వెర పోయింది. చివరికి ఆ ఆడబిడ్డతో తప్పుడు మాటలు చెప్పించే పని చేయడం అన్యాయం. రాష్ట్రం ఎంత దిగజారి పోయిందో చెప్పడానికి చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలే నిదర్శనం. మీరే దాడి చేసి.. మీరే చేయి విరగ్గొట్టి.. మా పార్టీ నేతపై మీరే అక్రమ కేసులు పెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? సంగాల గిరిపై దాడి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరిగ్గొట్టిన సంఘటనల్లో పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులే సీసీ టీవీలను మాయం చేశారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఇట్టే తెలుస్తోంది. బీసీ నాయకత్వంపై చంద్రబాబు కుట్రలు పేరు పొందిన బీసీ నాయకులపై చంద్రబాబునాయుడు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజుపై ఆయన 18 ఏళ్ల కుమారుడి బైక్ యాక్సిడెంట్ను వక్రీకరించి కుట్ర, హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టారు. శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజును నేను చూడడానికి వెళితే ప్రజలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి మహిళా ఎస్ఐని చంపబోయాడని అక్రమ కేసు పెట్టారు. బుద్ధుంటే పోలీసులు ఇలాంటి కేసులు ఎలా కడతారు? వేల మందిలో మహిళలను ఎలా చంపుతారు? కర్నూలులో బోయ కులస్తుడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి. ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తాఫాపై ఏరకంగా అక్రమ కేసు పెట్టారో చూశాం. ముస్తాఫా కుటుంబీకులు డబ్బులు ముందుగానే ఇచ్చినా, తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోగా పొగాకు కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ముస్తాఫా బా«ధితుడు అయితే అతనిపైనే కేసులు పెట్టడం అన్యాయం. అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన యాదవ నేత కారుమూరి సునీల్.. లిక్కర్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారు. నన్నూర్ టోల్గేట్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే ముందుకు సాగుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట గ్రిల్ వద్ద నిలబెట్టి వీడియోలు తీసి అవమానించారు.. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర రాజకీయాలకు హద్దే లేకుండా పోతోంది. దిగజారి కక్ష సాధింపులకు దిగుతున్నారు. జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో కలుసుకోవడానికి వెళ్లిన నన్ను అవమానించారు. సాధారణంగా జైలులోకి ప్రవేశించిన తర్వాత వెళ్లిన వారిని కూర్చోబెట్టి వీడియో, ఫోటోలు తీసి పంపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను మాత్రం గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసి అవమానించారు. ఎందుకిలా చేశారని సూపరింటెండెంట్ను ప్రశ్నిస్తే.. పై నుంచి వచ్చిన ఆదేశాలతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీన్నిబట్టి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్దేశ పూర్వకంగానే నన్ను అవమానించాడు. ఇది దారుణం. ఇది చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట. అన్యాయంగా కేసులు.. అరెస్టులుఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టారు. కేసుల నమోదు, ఎఫ్ఐఆర్లు డొల్లతనంగా ఉన్నాయి. ఒక ఫిర్యాదులో ఉన్న నలుగురి పేర్లు.. అదే ఫిర్యాదులో వేరే నిందితులుగా చూపారు. ఏ–10 యాదవల్లి ప్రేమకుమార్ను ఏ–22గా కూడా చూపారు. ఏ–17 మాల గాదిలింగను ఏ–25గా.. ఏ–19 సత్తిరెడ్డిని ఏ–23గా ఎ.సత్యనారాయణరెడ్డి అని చూపారు. ఏ–18 కురవ లింగప్పను మళ్లీ ఏ–24 గా చూపించారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది. ఎల్లకాలం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గట్టిగా చెబుతున్నా. మీరు ఈరోజు ఏవైతే దుష్ట సంప్రదాయాల విష బీజాలు విత్తుతున్నారో.. రేపు అవే రెండింతలై మిమ్మల్ని చుట్టుకుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి చూస్తూ చూస్తూ ఉండగానే రెండేళ్లయిపోయింది. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికి ఇంకో మూడేళ్లు కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబునాయుడు నాటిన విష బీజాలు రెండింతలవుతాయని ఆయన గుర్తుంచుకోవాలి’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్నినాని.. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీమోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇషాక్బాషా, మధుసూదన్, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటెత్తిన జనసునామీ!కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు కదిలింది.. ఓర్వకల్లు హోరెత్తింది.. రహదారులు జనసంద్రాలయ్యాయి..! కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిపై జన ప్రభంజనం కనిపించింది. తుంగభద్ర, హంద్రీ ప్రవాహంతో పోటీ పడుతూ యువ తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. పోలీసుల ఆంక్షలు, చెక్ పోస్టులు, అడ్డంకులను చేధించుకుని ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి తమ కష్టాలు చెప్పుకునేందుకు.. తమ గోడు వెళ్లబోసుకునేందుకు.. న్యాయం కోసం మొరపెట్టుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆడబిడ్డ నిధి అందని మహిళలు.. తల్లికి వందనం మిస్సయిన తల్లులు.. ఉద్యోగం లేక, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్న యువత.. దగా డీఎస్సీలో మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగార్థులు.. కరువుసీమలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడు లేక విలవిల్లాడుతున్న రైతులు.. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు.. కష్టాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు.. సూపర్సిక్స్.. సూపర్సెవెన్ హామీలను నమ్మి మోసపోయామని వాపోతున్న వివిధ వర్గాల ప్రజలు.. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ఒక్కటే ఆశ.. జగన్ తమ గోడు వింటారన్న నమ్మకం! తమకు అండగా ఉంటారన్న నమ్మకం ! వీరి ఆవేదనకు తోడుగా.. తమ అభిమాన నేతను ఒక్కసారి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు జనసునామీ కనిపించింది. జననేత పర్యటన ఆసాంతం ‘జెన్ జీ’ యూత్ జోష్ వెల్లువెత్తింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. ఎండ తీవ్రత ఠారెత్తిస్తున్నా.. 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఐదు గంటలకు పైగా సమయం పట్టేంతగా జనప్రవాహం ఉప్పొంగింది. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారి, బైపాస్ రోడ్డు, నగర పురవీధులు ఎటుచూసినా జనసంద్రమే. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు.. పూలవర్షాలు.. ‘జై జగన్’ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. జనమే జనం.. జననేతకు బ్రహ్మరథం.. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎయిర్పోర్టు నుంచి కర్నూలు– హైదరాబాద్ జాతీయ రహదారి కూడలికి చేరుకునేందుకే అరగంటకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత పూడిచెర్ల క్రాస్, రాక్ గార్డెన్, హెచ్ 8 హోటల్ జంక్షన్, నన్నూరు, నన్నూరు టోల్ ప్లాజా, ప్రజా నగర్, కర్నూలు రింగ్ రోడ్డు జంక్షన్, వెంకన్నబావి, గుత్తి పెట్రోల్ బంక్ జంక్షన్, కల్లూరు, షరీఫ్ నగర్, హ్యాంగవుట్ హోటల్ సెంటర్, జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, కేశవ గ్రాండ్ హోటల్ జంక్షన్, బళ్లారి చౌరస్తా, ఆటోనగర్, సంతోష్ నగర్, పంచలింగాల సర్కిల్, పంచలింగాలపల్లె మీదుగా జిల్లాజైలు వరకు దాదాపు 38 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగింది. జగన్ను చూసేందుకు కర్నూలు, నంద్యాల పరిసర జిల్లాల నుంచి వచ్చిన జనంతో కర్నూలు నగరం జనసంద్రాన్ని తలపించింది. ఓర్వకల్లు ఎయిర్పోర్టు వద్ద భారీగా తరలి వచ్చిన జనసందోహానికి అభివాదం చేస్తున్న జననేత వైఎస్ జగన్కు డీఎస్సీ అభ్యర్థుల మొరమెగా డీఎస్సీ పేరిట తమను దగా చేశారంటూ.. అన్ని అర్హతలు ఉండి డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జాతీయ రహదారిపై ప్రజానగర్ వద్ద వీరంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. తప్పకుండా మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద్ద వైఎస్ జగన్ను కలిసిన డాక్యుమెంట్ రైటర్లు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొడుతోందంటూ వాపోయారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు సంతోష్నగర్ వద్ద కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు పడవని, కరువుతో సీమ ప్రజలు అల్లాడిపోతుంటారని వాపోయారు. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు నమ్మి మోసపోయిన వివిధ వర్గాల ప్రజలు దారి పొడవునా వైఎస్ జగన్ను కలిసి తమ వినతులు అందజేశారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టులో వైఎస్ జగన్ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవి కలిసి తమగోడు చెప్పుకున్నారు. తనకోసమే పార్టీ పెట్టానని చెప్పుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం తనను అన్ని విధాలుగా వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి జరిగిందంటే అది మీ హయాంలో మాత్రమేనని పార్వతి గుర్తుచేసుకున్నారు. -
రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్
-
పరారే పరారే.. పరిశ్రమలు పరారే.. బాబు దెబ్బకు కంపెనీలు టాటా.. బైబై..!
-
నింగిలోకి నిత్యావసరాల ధరలు... ఆంధ్రప్రదేశ్లో నెలనెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
-
నీకు దమ్ముంటే.. బాబుకు ఓపెన్ ఛాలెంజ్.. భారతి సిమెంట్స్ పై భారీ కుట్ర..
-
నేడు వైఎస్ జగన్ కర్నూలు పర్యటన
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 13న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాక్గార్డెన్, నన్నూరు, టోల్ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్, పుల్లూరు సర్కిల్ మీదుగా పంచలింగాల వద్ద ఉన్న జిల్లా జైలుకు చేరుకుంటారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్లో కలిసి పరామర్శిస్తారు. ఆయనకు ధైర్యం చెప్పనున్నారు. అక్కడే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోనూ మాట్లాడతారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు సర్కారు కుట్రలుచంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా కలిసి, పరామర్శించేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు జనం రాకూడదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షారోన్లు హెచ్చరికలు జారీ చేశారు. కాదు కూడదని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్కు కర్నూలు జైలులో ములాఖత్కు మాత్రమే అనుమతి ఉందన్నారు. రోడ్షోలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. 30 యాక్ట్ అమలులో ఉన్నందున జగన్ను చూసేందుకు జనం హాజరు కాకూడదన్నారు. ములాఖత్కు వస్తున్న వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశముందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో జనం రాకుండా కట్టడి చేయాలని రెండు జిల్లాల పోలీసులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనం రాకుండా పోలీసులు హెచ్చరికలు పంపుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక మరింత గట్టిగా పోరాటం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సభలో బలంగా ప్రస్తావించాలని.. ముఖ్యంగా శాసన మండలిలో పార్టీకి బలం ఉన్నందున ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా పోరాడాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. గతంలోనూ పార్టీ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారని, ఆదే రీతిలో ప్రస్తుత సమావేశాలకు మరింత సన్నద్ధంగా ఉండాలన్నారు. శాసనసభలో వైఎస్సార్సీపీ గొంతు వినిపించకూడదనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందంటూ ఎత్తిచూపారు. వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే.. ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడేందుకు నిర్ణీత సమయం, హక్కులు వస్తాయని, అందుకే ప్రభుత్వం ఆ హోదా ఇవ్వడానికి ఇష్టపడటం లేదన్నారు. ‘‘వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించక పోవడం వల్ల అసెంబ్లీలో పార్టీకి సమయం లభించే అవకాశం పరిమితంగా ఉంటుంది. అందుకే సాక్ష్యాధారాలతోసహా, బయట ప్రెస్మీట్ల ద్వారా సమాధానం చెబుదాం.. ఆ విధంగా ప్రజలకు ఒకవైపు మాత్రమే కాకుండా, ప్రతి అంశంలోనూ ‘నాణేనికి రెండో వైపు’ చూపించే ప్రయత్నం చేద్దాం’’ అని చెప్పారు. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాల సందర్భంగా బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీఎస్సీ అక్రమాలపై రాజీ లేని పోరాటం‘‘డీఎస్సీ–2025లో పేపర్ లీకేజీ, అంతులేని అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తాం. అదే మన మొదటి ప్రాధాన్యం. అందుకే ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రధానంగా లేవనెత్తాలి. డీఎస్సీ వ్యవహారంపై ఇప్పటికే 74 రోజులుగా దాదాపు 10 రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. ఇంకా ఈ స్కామ్పై సీబీఐ దర్యాప్తు కొనసాగాల్సిందే. డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందుంచాం. డీఎస్సీలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికే ఫస్ట్ ర్యాంకు రావడం చూశాం. మెరిట్ లిస్టులు మారిన వ్యవహారాలు కూడా బయటపడ్డాయి. డీఎస్సీ లీకేజీ ఎంతదూరం వెళ్లిందో పూర్తిగా తేలాల్సిందే. అందుకే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే సీబీఐ విచారణకు ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అయినా వీళ్లుంటే నిజాలు బయటకు వస్తాయా? అందుకే మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ జరిగితేనే డీఎస్సీలో అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయి.తీవ్ర సంక్షోభంలో రైతులురాష్ట్రంలో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. పంటలు వేసుకోమని చెప్పి.. 40 శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమంటున్నారు. రైతులకు అండగా ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. వీటన్నింటితో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. అందుకే వారి సమస్యలపైనా మండలిలో గట్టిగా పోరాడాలి.‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’ అన్నట్లుగా పీపీపీకొత్త పీపీపీ విధానం చూస్తే ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’ అన్నట్టుగా ఉంది. పీపీపీ ప్రాజెక్టులకు ప్రభుత్వమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. ఇంకా ఆ ప్రైవేటు సంస్థ తీసుకునే రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంటున్నారు! అంటే రాయితీలు ప్రభుత్వం ఇవ్వాలి.. ఆ తర్వాత ఆ ప్రైవేటు కంపెనీలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చంటున్నారు. అంటే ప్రైవేటుకు అన్ని రాయితీలు ఇచ్చి చివరకు ప్రజలపైనే ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం అన్నమాట. తాగు నీరు, స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సహా ప్రజా సేవలను పీపీపీ పరిధిలోకి తెస్తామంటున్నారు. అన్నీ ప్రైవేటుకే అప్పగిస్తే ఇక ప్రభుత్వం ఉండేది ఎందుకు? కేవలం స్కామ్లు చేసి లూటీ చేయడానికా?అవి పచ్చ పత్రాలు.. అబద్ధాల పత్రాలుచంద్రబాబు ఆర్భాటంగా విడుదల చేస్తున్న వైట్ పేపర్లన్నీ ‘ఎల్లో పేపర్లు’. ఇంకా చెప్పాలంటే పచ్చి అబద్ధాల పత్రాలు. ఆ పత్రాల్లో ప్రభుత్వం చెప్పిన అంశాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ వైట్ పేపర్లలోని అబద్ధాలను ఆధారాలు, సాక్ష్యాలతో ఇప్పటికే బయటపెట్టాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందిస్తాం. మన పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా సాక్ష్యాలు, ఆధారాలతో మాట్లాడాలి. అది నేనైనా, మీరైనా, మరెవరైనా సరే. ఒక నివేదికలోని అంశాన్ని ప్రస్తావిస్తే.. ఆ నివేదిక ఎక్కడిది? ఏది? ఆ సమాచారం ఏ పేజీలో ఉంది? ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా ప్రజలకు చూపించాలి. సోర్స్ లేకుండా ఆరోపణలు చేయొద్దు. పూర్తి ప్రిపరేషన్తోనే ప్రజల ముందుకు వెళ్లాలి. వైఎస్సార్సీపీ ఏది మాట్లాడినా సాక్ష్యాలు, ఆధారాలు.. అంటే పక్కా సోర్స్తో మాట్లాడుతుంది. నేను కానీ, పార్టీ నాయకుడు కానీ మాట్లాడే ప్రతి అంశానికి సోర్స్ చూపిస్తాం. అదే చంద్రబాబు మాత్రం తాను చెప్పే ఏ అంశాలకు సోర్స్ చెప్పడు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు కాబట్టి. పచ్చి అబద్ధాలు చెప్పడమే ‘వెన్నుపోటు పార్టీ’ పని.విజన్–2020 అర్థం లేని యోచనమాట్లాడితే చంద్రబాబు విజన్ డాక్యుమెంట్లు అంటాడు. గతంలో కూడా విజన్–2020 అంటూ నానా హడావిడి, హంగామా, భారీ ప్రచారం చేశారు. కానీ, వాస్తవంగా దాని వల్ల సాధించిందేమీ లేదు. అసలు విజన్–2020 డాక్యుమెంట్ ఏమైంది? అందులో చెప్పిన దాంట్లో ఎన్ని సాధించారు? వీటికి సమాధానం లేదు. ఇప్పుడు విజన్–2047 అంటూ హడావిడి చేస్తున్నారు. కాగా, గతంలో విజన్–2020కి సంబంధించి, 2000లో స్విస్ మంత్రి పాస్కల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సందర్భంగా ‘అలాంటి మాటలు తమ దేశంలో చెబితే జైల్లోనో, మానసిక ఆస్పత్రిలోనో పెడతారు’ అన్నారు. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు సాటిలేరు. అదే స్థాయిలో అబద్ధాలు చెప్పేలా లోకేశ్కు కూడా శిక్షణ ఇచ్చారు. కేవలం అబద్ధాలు చెప్పడం.. అదే పనిగా ప్రచారం చేసుకోవడం వెన్నుపోటు పార్టీకి అలవాటు.ఏ వర్గమూ సంతృప్తిగా లేదుజూనియర్ డాక్టర్లు స్టైపెండ్ పెంపు కోసం ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఇంకా రాష్ట్రంలో ఉద్యోగులు సహా ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత.. ఏ వర్గమూ సంతోషంగా లేదు. పాత పథకాలను రద్దు చేశారు. కొత్త పథకాలు మోసాలుగా మారాయి. మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూత పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆ గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. మహిళలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాల సంఖ్య కూడా తగ్గుతోంది. జీవో నంబర్ 3 అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు దాని ఊసే లేదు. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటిపై మండలిలో గట్టిగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రిపరేషన్ లేకుండా ఎవరూ మాట్లాడొద్దు. పూర్తిగా కసరత్తు చేసి మాట్లాడితేనే విషయం ప్రజలకు బలంగా చేరుతుంది. కంటెంట్ అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి అంశాన్నీ ఆధారాలు, సాక్ష్యాలతో వివరించాలి. సబ్జెక్టుల వారీగా సభ్యులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన రూ.9 వేల కోట్లకు పైగా బకాయి ఫీజు రీయింబర్స్మెంట్ 13 త్రైమాసికాలుగా పెండింగ్లో ఉంది. ఒక్కో త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల చొప్పున రూ.9,100 కోట్లు పెండింగ్. వసతి దీవెన కింద మరో రూ.3,300 కోట్లు పెండింగ్. రెండూ కలిపి రూ.12,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. కానీ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.2,900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా, రూ.9 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. బీసీల తలరాతలు మార్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్నే నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి బకాయిలపై మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. చర్చ కోసం పట్టుబట్టాలి. విద్యార్థుల తరఫున మండలిలో గట్టిగా పోరాడాలి.‘దిశ’ వ్యవస్థ రద్దు.. బీసీ నాయకులపై కేసులు‘దిశ’ వ్యవస్థ రద్దు వల్ల రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయింది. బీసీ నాయకులపై కేసులు కీలక అంశాలు. గాంధీ పుట్టిన దేశంలో శాంతియుత నిరసనలు చేసినా కేసులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంతియుతంగా నిరసనలు చేసినా కేసులతో అణచి వేయాలని చూస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే కక్షతో అన్యాయమైన కేసులు పెడుతున్నారు. వీటన్నింటిపై కచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. జరగని ఘటనను జరిగినట్టుగా వక్రీకరించి చింతాడ రవిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసుల కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. గుంటూరులో ముస్తఫాపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షిపైనా అక్రమ కేసులు పెట్టారు. పార్టీలో బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా కారుమూరు సునీల్పైనా తప్పుడు కేసు పెట్టారు. ప్రశ్నించే వారందరిపైనా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలుడీఎస్సీలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెర తీశారు. వెన్నుపోటు పార్టీ నాయకులే క్రీడా సంఘాల్లో కీలక స్థానాల్లో ఉండటం, వారి పరిధిలోనే సర్టిఫికెట్లు జారీ కావడం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంది. పోటీ పరీక్ష లేకుండా, డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి వచ్చింది. నియామకాలు పూర్తి కాగానే, మళ్లీ జీవోలు మార్చారు. అంటే ముందు చేసినది తప్పు అని ఒప్పుకున్నట్టే కదా? ఇన్ని అక్రమాలు, ఆధారాలు కనిపిస్తున్నç³్పుడు విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే. సీబీఐ విచారణ జరగాల్సిందే. దాని ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయి. డీఎస్సీ నియామకాలకు సంబంధించి రెండు జీవోలు, మెరిట్ లిస్టుల మార్పులు, ఉద్యోగాల కోసం డబ్బులు అడిగినట్టుగా ప్రచారంలోకి వచ్చిన ఆడియో, వీడియో కాల్స్ వంటి అంశాలన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఫోన్ నంబర్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నప్పటికీ కేసుల్లో అసలు వ్యక్తుల పేర్లు స్పష్టంగా నమోదు చేయలేదు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన కొన్ని ఆరోపణల్లో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షల వరకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినట్టు బాధితులే చెబుతున్నారు. ఇన్ని ఆధారాలు బయట కనిపిస్తున్నప్పుడు డీఎస్సీ ఒక ప్రధాన అంశం. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అలాగే మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. -
నిజం రావడం లేటవచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. దడదడలాడించిన శ్యామల


