breaking news
Chandrababu Naidu government
-
పచ్చటి కొండ కొల్లగొట్టు
పచ్చనేతలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అది అటవీశివారు గ్రామం.. ఆ ఊళ్లో కొండపై పచ్చనేతల కళ్లుపడ్డాయి.. రాళ్లు, కంకర, మట్టి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. పచ్చటి కొండను కొల్లగొడుతున్నారు.. కాపాడాలని స్థానికులు కోరుతున్నా.. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారు. ఫలితంగా ఆ ఎత్తైన కొండ కరిగిపోయింది. మిగిలిన హెచ్చుతగ్గులు చదునైపోయి రికార్డులు పుడుతున్నాయి. అయినా అడిగేవారు లేక.. అడ్డుకునే వారు రాక ప్రకృతి ప్రసాదితమైన కొండ మాయమైంది. సాక్షి, టాస్క్ ఫోర్స్: బాబు సర్కారులో పచ్చనేతలు కొండలను చదును చేసి.. పొలాలుగా మార్చేస్తున్నారు. అయినా అడిగేవారు కరువయ్యారు. వివరా ల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపా ళెం మండలం నెరబైలు గ్రామ రెవెన్యూ లెక్క దాఖ లా సర్వే నంబర్ 160914లో ఉన్న 1.10 ఎకరాల గుట్టను గత పది రోజులుగా భారీ యంత్రాలతో ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే విలువైన మట్టిని బయటకు తరలించగా కొండ మొత్తం కరిగి పోయింది. ఆ నేలను చదును చేసి పంట పొలాలుగా తీర్చుతుర్చున్న ఘటనపై పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఎత్తైన కొండ కళ్లముందే కరిగించేస్తున్నా అధికారులు స్పందించక పోగా ఆ భూముల కు అక్రమ మార్గంలో ఆక్రమణ దారుల పేరిట రికార్డులు సృష్టించేందుకు సాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీని వెనుక టీడీపీ మండలస్థాయి నేతలిద్దరితో పాటు గ్రామానికి టీడీపీ సాను భూతి పరులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. పల్లె రోడ్లు ఛిద్రం కొండను తవ్వి మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో పల్లె రోడ్లు ఛిద్రమవడంతోపాటు చుట్టు పక్కల పొలాలు సైతం దెబ్బతింటున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను లొంగతీసుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తుండడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎత్తైన కొండలు, గుట్టలను తవ్వి పొలాలుగా మార్చుకోవడం, ఆపై రికార్డులు తయారు చేయడం నిరంతర ప్రక్రియగా మార్చుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతుండగా అన్ని రాజకీయ పారీ్టలు పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అధికారులపై న్యాయ పోరాటం ప్రకృతి వనరులను ధ్వంసం చేసే భూ ఆక్రమణ దారులకు అండగా నిలుస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులందరికీ ఫిర్యాదులు చేశామని, భూ ఆక్రమణలు, ప్రకృతి వనరులను కాపాడడంలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. -
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్సైట్ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘ఆశ’యమే ఆగ్రహజ్వాలై
చంద్రబాబు సర్కారు నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. ఆశయ సాధన కోసం రణన్నినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టిచాకిరీ, బానిసత్వంపై నిప్పులుగక్కారు. బెజవాడలో మండుటెండనూ లెక్కచేయక నిరసన గళమెత్తారు. పది డిమాండ్లతో బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు వెన్నులో వణుకుపుట్టించారు. సాక్షి, అమరావతి: ఆశా కార్యకర్తలు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్నా జయప్రదమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వర్కర్లు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతులు సమర్పించినా సమస్యలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. అనేక రకాల విధులు అప్పగించి తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న చంద్రబాబు సర్కారు తమను బానిసలుగా చూస్తోందని దుమ్మెత్తిపోశారు. పనిభారం తీవ్రమై, చాలీచాలని జీతంతో నరకం అనుభవిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టి సర్కా రు మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తమ ఆత్మగౌరవాన్ని పెంచిందని ఆశా కార్యకర్తలు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని రూ.పదివేలకు పెంచారని గుర్తుచేసుకున్నారు. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేలు అసలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రవాణా ఖర్చులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఖర్చుచేయాల్సి వస్తోందనిన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించి వెట్టిచాకిరీ, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏ, డీఏలు, ఏఎన్ఎం–జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టు, రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతోపాటు విధినిర్వహణలో మృతి చెందిన వారికి దహన సంస్కార ఖర్చులుగా రూ.20వేలు ఇవ్వాలనే 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే ఆశా కార్యకర్తల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు ఆశాల పోరాటం వాయిదా ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హా మీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళ న, పోరాటాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్చల్లో రమణకుమారి, కమల, వాణిశ్రీ, సత్యవతి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలి. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. సెలవులు మంజూరు చేయాలి. వేధింపులు ఆపాలి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. – ఎ.కమల, భవానీపురం, విజయవాడఉద్యోగ భద్రతేదీ? మా బతుకులకు ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఇవ్వడం లేదు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలి. కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. ఉద్యోగ భ««ద్రత కల్పించాలి. – బి.సరళ, చింతలపూడి ఎలా బతకాలి? కనీస వేతనాలు ఇవ్వకుండా మాతో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా యాప్ల పేరుతో సర్వేల భారం మోపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు. ఆ నెపాన్నీ తమపైనే మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. సిమ్లు సైతం పనిచేయకపోవటంతో సొంత డబ్బుతో రీచార్జి చేయించుకుని పని చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.పదివేలలో రవాణా, ఇతర విధుల ఖర్చులకే నలభైశాతం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక మిగిలి వాటితో ఎలా బతకాలి? – సీహెచ్ పద్మ, కాకినాడసెలవుల్లేవు.. లాస్ ఆఫ్ పేనే ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసుకున్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా చాకిరీ పనిచేయిస్తున్న పభుత్వం కనీస వేతనం ఇవ్వటం లేదు. ఆన్లైన్ సర్వేలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు వెల్నెస్ సెంటర్లోనే కూర్చోమని చెప్పటం ఇబ్బందిగా ఉంది. సెలవులు లేకపోవటం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే భరించాల్సి వస్తోంది. – ఎం.రాధ ధవళేశ్వరం -
చంద్రబాబు, పవన్కు ఉండవల్లి లేఖ
-
హెరిటేజ్ కోసం కొన్న కెమికల్స్.. వివరాలను బయటపెట్టే దమ్ముందా..?
-
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
-
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
నెల్లూరులో మైనర్ బాలికలపై ఆగని లైంగిక దాడులు
-
మీకు సిగ్గనిపించడం లేదా..? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
హామీలు అమలు చేయమంటే అంగన్వాడీలపై దౌర్జన్యమా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్టీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తప్పుబట్టారు.ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరుఅంగన్వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. -
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
కూటమి మోసంపై నిరుద్యోగుల కన్నెర్ర!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి సర్కారు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా... ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటోంది. ఏపీ శాసన సభలో ఫిబ్రవరి 25న విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుడు ఉద్యోగ కల్పన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,587 జాబ్ మేళాలు జరిపి, 1,08,747 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందులో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించినట్లు సభలో ప్రకటించారు. అనేక సదస్సులు జరిపి 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగినట్లు గొప్పగా తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు పారా మెడికల్ శిక్షణ ఇచ్చి వారందర్నీ విదేశా లకు పంపాలని ప్రభుత్వం భావిస్తుందని అసెంబ్లీలో చెప్పు కొచ్చారు. నిజానికి లోకేష్ ప్రకటించిన గణాంకాలన్నీ వాస్తవ విరుద్ధ మైనవే! 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 ఉద్యోగాలు కల్పిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను, బహిర్గతం చేయాలి కదా! ఆ పని చేయలేదు. నిరుద్యోగుల్ని వంచించే కుట్ర ఇది. అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లోకేష్ నెత్తీ, నోరు బాదుకున్నారు. అధికారం చేపట్టగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ ‘యువగళం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరగకుంటే తన చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసి అడగండని నిరుద్యోగ యువతకి మాటిచ్చారు. అధికారం చేపట్టి ఇరవై నెలల సమయం అవుతున్నా ఈ హామీ ఏమయ్యింది?ఉద్యోగాలిచ్చేంత వరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతీ నెల మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. కానీ చిల్లిగవ్వ కుడా చెల్లించలేదు. రాష్ట్రంలో 1.75 లక్షల కుటుంబాలున్నాయి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు దాదాపు రెండేళ్లకి కలిపి రూ. 14,400 కోట్లు నిరుద్యోగ భృతికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్ కూడా కలుపుకొంటే మొత్తం రూ. 21,600 కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ప్రభుత్వం డెబ్భై రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉందన్నమాట.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించారు. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 1.30 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేపట్టారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. భారీ పరిశ్రమలలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగంలో 32 లక్షల 79 వేల 970 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 40 లక్షల 13 వేల 552 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. లేకపోతే యువత ఉద్యమిస్తుంది.– ఎ. రవిచంద్ర ‘ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ -
అంగన్వాడీలపై ఆటవిక దాడి!
2000 జూలై 26..సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.2026 మార్చి 3..విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!సాక్షి, అమరావతి, నెట్వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్వాడీలు రాత్రి ధర్నా టెంట్లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం..దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈడ్చేసిన మగ పోలీసులు..టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో యాక్షన్లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్ను కకావికలం చేసి అంగన్వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్న మహిళలు..చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.కర్నూలులో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలు బాబు మారలేదు.. అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులుచంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్వాడీల వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు. -
‘రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుంది’
ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. మంగళవారం బుగ్గన.. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. అధికారపార్టీ తరపున మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దాడులు చేయడం ఎప్పుడైనా చూశామా?దాడులను మహిళలు లీడ్ చేయడం ఓ కొత్త రకం సాంప్రదాయం. ఎవరో ఒకరు వెనుక ఉండి కోచింగ్ ఇస్తే తప్ప మహిళలు ఇలా చేయరు. నిజంగా పొరపాటు జరిగితే చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు మీరు ఏం నేర్పిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కేసు లేకపోయినా కేసును ...ఆధారాలను సృష్టిస్తున్నారు.ఈ సంస్కృతి ఇక్కడితో ఆగిపోతుందా .. అసలు రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకు వెళ్తున్నారు. మీరు చెప్పుకునే దశాబ్ధాల రాజకీయం దేనికి ఉపయోగపడుతుంది.దాడులు చేసిన వారి పై ఏం చర్యలు తీసుకున్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ మీరేం చేశారు..అంబటి పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితుల పై కేసులు పెట్టడమేంటి. ఎవరూ ఏమీ చూడటం లేదని మీరు అనుకుంటున్నారు ...కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీ అనుభవాన్ని మంచి కోసం ఉపయోగించండి తప్పుడు కేసుల కోసం కాదు’ అని సూచించారు. -
బాబుకు అంగన్వాడీలు వార్నింగ్.. వాష్ రూమ్ కి వెళ్తామన్నా విడిచిపెట్టకుండా..
-
టెంట్లు పీకేసి, కుర్చీలు విరగొట్టి.. అంగన్వాడీలను ఈడ్చుకెళ్లిన పోలీసులు
-
విశాఖ తీర రక్షణకు తూట్లు!
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మారి్పడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు.విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. పర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యంవీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పారీ్టల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆరి్థక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజే‹Ù, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
రూ.6,000 కోట్లు ఔట్.. ‘పారి’.. శ్రమ!
సాక్షి, అమరావతి: ‘‘మీ కప్పాలు కట్టలేం.. మీ బెదిరింపులు భరించలేం.. మీ భూములు వద్దు.. మీకో దండం..!’’ అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖంమీదే విసిరి కొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి నాలుగు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా రూ.6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాలను ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూపు నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమీషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని గాయపర్చారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరితెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ‘సీమ’ దాకా సేమ్ సీన్..శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఆరీ్టపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటే తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పారీ్టకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. బైబై చెప్పేసిన కోకోకోలా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకొని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొర పెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఒప్పందానికే దిక్కులేదు.. బాబు సర్కారు అధికారం చేపట్టిన తరువాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. రూ.85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎలీజీ ఎల్రక్టానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. వడ్డీతో సహా ‘ఆజాద్’ వసూలు..! శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండీ కింద అజాద్ మొబిలిటీ చెల్లించిన రూ.2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.జిన్ఫ్రా.. పరుగో పరుగు! రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్ఐపీబీ 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షలు చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను రద్దు చేయాలంటూ లేఖ రాసింది. దీంతో జిన్ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్కో మిథాని యూనిట్ ప్యాకప్...!కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పీఎస్యూ ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతోంది. రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథాని కలిసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంతులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జారుకున్న ‘జూపిటర్..’ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని.. రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్ధలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
నిర్బంధాల కంచె దాటి.. అంగన్వాడీ ఉద్యమవేడి
పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహాల్లోనే నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదు.. తప్పదనుకుంటే నలుగురైదుగురు వెళ్లండి’ అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకలించుకుని అంగన్వాడీలు పోరుబాట పట్టి.. న్యాయం కోసం నినాదాల పొలికేక పెట్టారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకుని కొందరు.. చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకుని మరికొందరు విజయవాడ తరలివచ్చి నిరసన గళమెత్తారు. సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని.. మండేఎండను సైతం లెక్కచేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాల చలో విజయవాడ పిలుపునందుకుని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ‘ధర్నా’గ్రహానికి దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వేస్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గం ధర్నా చౌక్లో ఆందోళన సందర్భంగా జరిగిన సభలో మూడు యూనియన్ల ముఖ్య నాయకులు కె.సుబ్బరావమ్మ, బేబీరాణి, ఎన్సీహెచ్ సుప్రజ, జె.లలిత, వీఆర్ జ్యోతి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన విరమించేది లేదని అల్టీమేటం ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మీక సంఘాలు అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను తాత్కాలిక జైళ్లుగా మార్చేసి.. ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని మంత్రులతో ప్రకటనలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు అంగన్వాడీల ఆందోళనను విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు(హౌస్ అరెస్టుల)తో తీవ్రమైన ఆంక్షలు పెట్టింది.విజయవాడలో అంగన్వాడీలు అడుగుపెట్టకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మందిని అదుపులోకి తీసుకుని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్బంధించి వాటిని తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు పరిసరాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ తదితర ప్రాంతాల్లో యూనియన్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఛలో విజయవాడకు బయలుదేరుతున్న వారిని రైల్వే స్టేషన్లలోనే నిలిపివేశారు.విశాఖలోని పలు ప్రాంతాల నుండి బయలుదేరుతున్న కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైళ్లలో విజయవాడకు వస్తున్న వారిని రైల్వే స్టేషన్లలోనే అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వచ్చే వారిపై ఎక్కడికక్కడ పోలీస్ నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు సైతం ఇచ్చారు. అనేక జిల్లాల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేసి అడ్డుకోవడం గమనార్హం. ఎలాంటి ఆంక్షలు విధించినా.. భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ధర్నా చౌక్లోనే వంటా వార్పు.. రోడ్డుపైనే నిద్ర చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోడంతో సోమవారం రాత్రి కూడా అంగన్వాడీలు నిరసన కొనసాగించారు. ధర్నా చౌక్లోనే వంటా వార్పు చేపట్టి రోడ్లపైనే భోజనాలు చేశారు. అక్కడే నిద్రించి నిరసన తీవ్రతను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం దాదాపు 20 నెలలపాటు ఎదురు చూశామని, ఇకపై ఓర్పు వహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం నెలకు రూ.32 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. కనీసం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వేతనం పెంపుతోపాటు మిగిలిన డిమాండ్స్ కూడా అమలు చేయకపోతే ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ఉద్యమాన్ని చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని మూడు యూనియన్ల నేతలు హెచ్చరించారు.కీలక డిమాండ్లు ఇవీ..అంగన్వాడీలు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. వేతనాల పెంపుపై ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కలి్పంచాలి. యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. -
Sunil Naik : లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి బీహార్ ఝలక్
-
నువ్ మనిషివే కాదు.. ఒక నీచమైన.. నిన్ను తిట్టడానికి నా దగ్గర మాటలు కూడా లేవు
-
రాష్టంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే.. నోటీసిలిచ్చుకుంటూ ఉంటారా..
-
జనం చనిపోతుంటే.. డ్యాన్స్ లు, ఆటలు కావాలా మీకు
-
ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి..? కల్తీ పాలు, కలుషిత నీటిపై జగన్ ఫైర్
-
బాబు సర్కార్ కు బీహార్ సర్కార్ షాక్
-
కొవ్వు ఆరోపణలు.. చర్చ అంటే కూటమిలో వణుకు
-
ఎలా ముంచావో అందరికి తెలుసు.. హేరిటేజ్ బాగోతాన్ని బయటపెట్టిన లక్ష్మి పార్వతి
-
సైకిల్ కి ఓటు వేసి తప్పు చేశా! చెప్పుతో కొట్టుకున్న కార్యకర్త
-
చంద్రబాబు డీజీపీ బెదిరించి... ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిపై కామెంట్స్
-
రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. ఇక మీరు తప్పయించుకోలేరు..
-
Tatiparthi Chandrasekhar : వెలిగొండలో బాబు క్యాట్ వాక్, ర్యాంప్ వాక్
-
తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స
-
మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్
-
అందరి బాబాల వెనుక ఉన్న ఏకైక బాబా మన చంద్ర "బాబా"
-
మహాపచారం మీదే చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: ‘‘మోసానికి ఫ్యాంటూ చొక్కా వేస్తే అది చంద్రబాబు...!’’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలు నిజమేనని శాసనసభ వేదికగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సీబీఐ తన చార్జిషీట్లో తేల్చేసినా ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదు! దారుణమైన అబద్ధాలు మాట్లాడి వెంకన్న భక్తులను క్షోభకు గురిచేసి మోసగించాననే బాధ ఆయన మొహంలో ఏ కోశానా కానరాలేదు. 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే ఇందాపూర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఏడు కొండలూ తిరుమల దివ్య క్షేత్రానివేనని స్పష్టం చేస్తూ.. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జారీ చేసిన జీవోలు ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా సమాధానం లేదు! ఇందాపూర్ డెయిరీని హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా కొద్ది రోజుల క్రితం వరకు హెరిటేజ్ వెబ్సైట్లోనే చూపించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా సమాధానం లేదు! టీటీడీకి పంపిన నెయ్యి ట్యాంకర్లు రిజెక్టు కావడం.. వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగాయని సీబీఐ దర్యాప్తులో తేల్చేసినా దానికీ సమాధానం లేదు. చంద్రబాబు వీటిలో ఏ ఒక్కదానికీ జవాబు చెప్పకుండా తిరుమల క్షేత్రం, ఏడుకొండల గురించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకుంటూ చట్ట సభ సాక్షిగా నిస్సిగ్గుగా బుకాయించారు. ‘‘టీడీపీ అధికారంలోకి వస్తే ఆ రెండు జీవోలు 746, 747లను రద్దు చేస్తాం..’’ అని స్వయంగా మీరే 2009లో గుంటూరులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు చంద్రబాబూ..! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. తిరుమల ఏడుకొండలూ టీటీడీవేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన 746, 747 జీవోలను మీరు రద్దు చేస్తామన్నారు.. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ మహానేత వైఎస్సార్ ఇచ్చిన జీవోను కూడా రద్దు చేస్తామని కూడా మీరే ప్రకటించారు చంద్రబాబూ..! అంటే.. తిరుమల శ్రీవారి పట్ల, హిందూమతం పట్ల అపచారానికి ఒడిగట్టింది మీరే.. అటువంటి మీరు ఇప్పుడు పరమ భక్తుడి మాదిరిగా కొంగ జపం చేస్తుంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నది గుర్తుంచుకోండి చంద్రబాబూ..! ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అటు కలియుగ దైవం తిరుమల శ్రీవారు అంటే ఏమాత్రం భక్తీ లేదు..! ఇటు ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభ పట్ల కనీస గౌరవం లేదని నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు! భగవంతుడి గురించి ఏమాత్రం అవాస్తవం చెప్పాలన్నా ఏ ఒక్క భక్తుడూ సాహసించరు. వైఎస్సార్ తెచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తానంటూ 2009 జనవరి 27న చంద్రబాబు చేసిన ప్రకటనలపై ‘ది హిందూ’తో పాటు చంద్రబాబు గెజిట్ పత్రికైన ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తలు అందుకే ‘దేవుడి తోడు.. నిజమే చెబుతున్నా!’ అని ప్రమాణం చేస్తారు. ఇక నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాలంటే ఏ పాలకుడైనా కాస్త తటపటాయిస్తారు. కానీ తనకు అవేవీ పట్టవని చంద్రబాబు చాటి చెబుతూ, శాసనసభ వేదికగా తిరుమల క్షేత్రం గురించి పచ్చి అవాస్తవాలు వల్లిస్తూ, బుకాయిస్తూ రాజకీయ దురుద్దేశ ఆరోపణలు చేశారు. తిరుమలను రెండు కొండలకే పరిమితం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవోలు జారీ చేశారని చంద్రబాబు నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేశారు.ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం టీడీపీ సిండికేట్ నిర్వాకమేనని బట్టబయలు కావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కల్తీ దందా మహాపచారం పచ్చ ముఠా పనేనని ఆధారాలతో సహా నిగ్గు తేలడంతో చంద్రబాబు అసెంబ్లీలో అడ్డంగా బుకాయించి ప్రజల్ని మభ్య పెట్టేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ దాచేందుకు యత్నిస్తున్న కొద్దీ టీడీపీ కల్తీ నెయ్యి కంపు మరింతగా బయటపడుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం సాగిందంతా 2024 జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతేనన్నది తేదీలతో సహా వెలుగులోకి వచ్చింది. కల్తీ అని నిర్ధారణ అయినా సరే అదే నెయ్యిని తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసిన మహాపాపం టీడీపీ పాలకులదేనన్నదీ నిగ్గు తేలింది. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా ఉన్న భోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీలతో చంద్రబాబు ముఠా వ్యాపార బంధం బట్టబయలైంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్గా ఉన్న సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో వ్యాపార సంబంధాలు ఉండటం.. అదే సంగం డెయిరీకి 5 లక్షల కిలోల టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం.. మొత్తం పక్కా పన్నాగంతో కల్తీ దందా సాగిస్తున్నారన్నది టీటీడీ పాలక మండలి తీర్మానాల సాక్షిగా వెలుగులోకి వచ్చింది. వైష్ణవి, సంగం డెయిరీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అవుట్లెట్లు ఇక చంద్రబాబు బుకాయించేందుకు ఏమీ లేదు.. తిరుమల శ్రీవారి ఆలయం పట్ల... పవిత్ర ప్రసాదం పట్ల మీరు చేసిన మహాపచారం బట్టబయలైంది బాబూ! టీడీపీ అనుకూల పత్రికలు ఎంత భాజాభజంత్రీలు మోగించినా సరే కల్తీ నెయ్యి పాపాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు. ఇకనైనా లెంపలు వేసుకుని తిరుమల శ్రీవారిని క్షమాపణలు వేడుకోండి... యావత్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇంకా మొండిగా రాజకీయ కుట్రతో తిరుమల క్షేత్రంపై దుష్ప్రచారం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నారు. శాసన సభ వేదికగా చంద్రబాబు చేసిన అవాస్తవ ఆరోపణలను వైఎస్సార్సీపీ పూర్తి ఆధారాలతో తిప్పికొట్టింది. వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్రెడ్డి, పేర్ని నాని వేర్వేరు విలేకరుల సమావేశాల్లో చంద్రబాబు బండారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. -
శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందడంతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి.ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
జీవో 746,747 జగన్ ప్రశ్నకు పలాయనం.. దొరికిన చంద్రబాబు
-
వీఎస్ఆర్ విమానాలకు.. నారా వారి హెరిటేజ్ హింగ్లాజ్ కి లింకేంటి ?
-
KSR LIVE: ఏపీలో పాల కూట విషం మొద్దు నిద్రలో ప్రభుత్వం
-
Rajahmundry : 'పాల' కూట విషం మరణ మృదంగం
-
అంతా బూమెరాంగ్.. పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్.. అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-
‘పాల’కులదే కల్తీ పాపం
రాజమహేంద్రవరం రూరల్: కల్తీ పాల పాపం చంద్రబాబు సర్కారుదేనని, ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కల్తీపాల వల్ల అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా పరామర్శించారు. అలాగే కల్తీపాల వల్ల మరణించిన కుటుంబాలను వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వారు విలేకరులతో మాట్లాడారు.కల్తీ పాల వల్ల దాదాపు వారం రోజులుగా ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు సర్కారుకు రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై, భద్రతపై లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని వారి పనిని వారిని చేసుకోనిస్తే ఇలా ప్రజల ప్రాణాలు పోవని రాజా పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాధితులను ఏ ఒక్క అధికారి ఇంతవరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధితుల ఆస్పత్రుల బిల్లులకే రూ.లక్షలు ఖర్చవుతున్నాయని, రెండేళ్లలోపు చిన్నారి రితిక చికిత్సకు ఇప్పటివరకు రూ.8.50 లక్షలు ఖర్చయిందని రాజా ఆవేదన చెందారు. మృతదేహాల పోస్టుమార్టం, అంత్యక్రియలకు ప్రభుత్వం హడావుడి చేయడం అనుమానాలకు తావిస్తోందని రాజా మండిపడ్డారు.బాధితులకు తమ పార్టీ నాయకుల ద్వారా సాయం అందజేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ప్రభుత్వ చేతగానితనం వల్లనే పాల కల్తీ ఘటన జరిగిందన్నారు. వారం పది రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితులు చేరుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నెలల పిల్లలూ కల్తీ పాల బారిన పడ్డారని, వారికీ డయాలసిస్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లే దని మండిపడ్డారు. తక్షణం సర్కారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
కౌలు రైతుల సమరభేరి
చంద్రబాబు సర్కారుపై కౌలు రైతులు సమరభేరి మోగించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సాగుదారులను ఆదుకోవాలని గర్జించారు. రాష్ట్ర నడిబొడ్డున 30 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. అన్నదాతా సుఖీభవ వర్తింపజేయాలని, భూ యజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, రుణమాఫీ అమలు చేయాలని నినదించారు.గాందీనగర్(విజయవాడసెంట్రల్): వ్యవసాయ రంగానికి ఎంతో చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకొంటున్నాయని, వాస్తవానికి అవి చెప్పేదానిలో పది శాతం కూడా చేయడం లేదని అఖిల భారత కిసాన్ మోర్చా రాష్ట్ర కనీ్వనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ వర్తింపజేసి రూ.20 వేలు ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలగించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట రుణాలు, నష్టపరిహారం, బీమా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లో 30 గంటల నిరవధిక దీక్షను సోమవారం కౌలు రైతులు చేపట్టారు. ఈ దీక్షను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూ యజమానుల కన్నా కౌలు రైతులే అధిక శాతం భూములను సాగు చేస్తున్నారని తెలిపారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కౌలు రైతులు ఎంతగా శ్రమిస్తున్నా అప్పులే మిగులుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతుల్లో 24 శాతం మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారని వెల్లడించారు. నూటికి రూ.2 నుంచి రూ.3 వరకు వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎటువంటి భూమిగానీ, తోటి రైతు సంతకంతో గానీ పని లేకుండా రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వొచ్చని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని వడ్డే ధ్వజమెత్తారు. బడా వ్యాపారులకు రుణాలు ఇచ్చి లక్ష్యాలను పూర్తి చేస్తున్నారే తప్ప రైతులు, కౌలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కౌలు రైతులు పంటలు సాగు చేయకపోతే ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులకు ఒక పర్యాయం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన బోనస్ ఇవ్వకూడదంటూ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. రైతులకు, కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయస్థానాల్లోనూ న్యాయ పోరాటం చేయాలని పేర్కొన్నారు. హామీల అమలేదీ?ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంతకం తొలగించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రయోజనం కౌలు రైతులకే చెందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ.. రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటూ, ఎకరం 99 పైసల వంతున బడా కార్పొరేట్లకు కేటాయించడానికి భూములు ఎవడబ్బ సొమ్మని నిలదీశారు. రైతులను పట్టించుకోకపోతే ఇంటిదారి పట్టిస్తారని కూటమి నేతలను హెచ్చరించారు. దీక్షలో కౌలు రైతుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు టి.వి.లక్ష్మణస్వామి, పంచకర్ల రంగారావు, జె.వెంకటేశ్వరరావు, జి.సీతారెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం
దేవుడి ప్రసాదంలో కల్తీ అంటూ డెయిరీలను భయపెట్టి సొంత డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు తీస్తున్న పాల కల్తీపై లేకపోయింది. పాల కల్తీ బయటపడి వారం రోజులవుతున్నా.. వరుసగా ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిర్ఘాంతపరుస్తోంది. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తోందో తెలుసుకోవడానికి రాజమహేంద్రవరం పాల కల్తీ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల దుర్ఘటన మరణ మృదంగం మోగిస్తోంది. లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలో చోటుచేసుకుంటున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగి చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్.శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి రమణి (58) మరణించారు. ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందగా.. అధికారులు మాత్రం నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 17 మంది బాధితులు ఒక్కసారిగా మూత్రం ఆగిపోవడం (అనూరియా), వాంతులు, విరేచనాలు కావడం, కిడ్నీ ఫెయిల్ కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 17 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మంది కిమ్స్, రెయిన్బో, రవి చైతన్య, సన్స్టార్ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిమ్స్లో ఏడుగురు చికిత్స పొందుతుండగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెయిన్బోలో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఐదు నెలల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అభం శుభం తెలియని పసివాడికి చికిత్స అందిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆదిత్య ఆస్పత్రిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రవి చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరికొందరు జయ కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా.. వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం కల్తీ పాల బాధితులు 19 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మంది మృతి చెందగా.. మరో 14 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు మాత్రం మొత్తం బాధితులు 17 మందేనని స్పష్టం చేశారు. వీరిలో నలుగురు మృతి చెందారని చెబుతున్నారు. కల్తీ నిర్ధారణకు మరో రెండు రోజులు పాలల్లో కల్తీని నిర్ధారించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాల వ్యాపారి గణేష్ నుంచి పాలు పోయించుకుంటున్న 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపించారు. ఈ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వీటితో పాటు పశు సంవర్ధక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి ఆ నమూనాలను వైజ్ఞానిక, పశు సంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపించారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు సైతం పంపించామన్నారు. వెలుగులోకి కీలక విషయాలు కల్తీ పాల కలవరానికి కారణమని భావిస్తున్న పాల వ్యాపారి గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కీలక అంశాలు బహిర్గతమైనట్లు తెలిసింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలోని 106 కుటుంబాలకు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేష్ అనే వ్యాపారి ప్రతిరోజూ పాలు పోస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి కావడంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో రోజూ పాలుపోసే వారితో కలిపి మొత్తం 126 కుటుంబాలకు గణేష్ ఆ రోజు పాలు పోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. 16వ తేదీన పోసిన పాలు కొంచెం చేదుగా ఉన్నాయని వినియోగదారులు గణేష్ దృష్టికి తీసుకెళ్లగా.. మరునాటి నుంచి అలా జరగదని అతడు చెప్పడంతో మిన్నకుండిపోయారు. తిరిగి సాధారణంగా ఎప్పుడూ ఉండే రుచే ఉండటంతో వినియోగదారులు పట్టించుకోలేదు. ఆ రోజు గణేష్ నరసాపురం గ్రామ పరిసరాల్లో పాలను సేకరించినట్లు సమాచారం. దీనిని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాలు ఎక్కడెక్కడ, ఎవరెవరి నుంచి సేకరించాడనే విషయమై ఆరా తీస్తున్నారు. అనధికార డెయిరీ సీజ్ పాల వ్యాపారి గణేష్ నరసాపురంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని పోలీసులు సీజ్ చేశారు. పాలు సేకరించే పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. వెనిగర్, పాలు, కెమికల్స్ స్వాదీనం చేసుకున్నారు. పాలు, నీళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పశువుల రక్త నమూనాలు సైతం సేకరించారు. కారణాలు బయటకొచ్చిన వెంటనే గణేష్తో పాటు ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కాలనీల్లో వైద్య బృందాలు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. పాలు వినియోగించిన వారి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అధికారులు 18 బృందాలుగా విడిపోయి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శ కల్తీ పాల బాధితులను, బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్లో పర్యటించి ఏం జరిగిందనే విషయంపై బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరా తీశారు.మా ఇంట్లో ముగ్గురి పరిస్థితి విషమం మా ఇంట్లో నా తల్లి, తండ్రితో పాటు నా కుటుంబ సభ్యులు నలుగురికి కిడ్నీ విఫలమైంది. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. శివరాత్రి నాడు మా పాల వ్యాపారి అందించిన పాలు తీసుకున్న తర్వాత ఈ అనర్థం జరిగింది. ఆ పాలు తాగిన తర్వాత వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత అంటే.. ఈ నెల 22న అందరికీ మూత్రం ఆగిపోయింది. కుటుంబంలో అందరికీ ఒకే సమస్య రావడంతో ఆందోళనకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. – మధు, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంశరీరమంతా దద్దుర్లు వచ్చేశాయి మా మనవరాలు నాలుగు రోజుల క్రితం పాలు తాగిన వెంటనే శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆ పాల వ్యాపారికి మేం ఈ విషయం చెప్పాం. పాలు చేదుగా ఉన్నాయని తెలిపాం. కొత్తగా గేదె ఈనిందని, అందుకే పాల రుచిలో తేడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత మా చుట్టుపక్కల అతను పాలు పోసిన ఇళ్లలో కిడ్నీ బాధితులు బయటపడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నాం. మా మనవరాలిని ఆస్పత్రిలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వారు చేసిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. – షేక్ సిరాజుద్దీన్, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంమిగతా వారిలోనూ సమస్యలు రావొచ్చు ఈ నెల 14న రాత్రి మూత్ర సమస్యతో నా వద్దకు కొందరు వచ్చారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచినీటి సరఫరాపై అనుమానం కలిగింది. మంచినీటి సరఫరా బాగానే ఉందని మున్సిపల్ అధికారులు స్పష్టంచేయడంతో రోగులు తీసుకున్న ఆహారంపై ఆరా తీయగా పాలు తాగిన తర్వాత ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. ముందుగా బలహీనంగా ఉండే వృద్ధులు, చిన్నారులపై కల్తీ పాలు ప్రభావం చూపించాయి. మిగతా వారిలో కూడా భవిష్యత్లో అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అందుకే ఆ పాలు తాగిన వారందరూ కిడ్నీకి సంబంధించి క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శశాంక్, కిడ్నీ వ్యాధుల నిపుణుడు, రాజమహేంద్రవరంఅందని ప్రభుత్వ వైద్యంబాధితులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూత్ర విసర్జన స్తంభించడం, కిడ్నీ సమస్యలు, వాంతులు, విరేచనాలతో రాజమహేంద్రవరం జీజీహెచ్కు మూడేళ్ల చిన్నారిని తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లగా తమవద్ద వైద్య సదుపాయాలు లేవని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు లబోదిబోమంటూ తిరిగి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే విధంగా మరో చిన్నారి రితిక్ చికిత్స కోసం ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.8.50 లక్షలకు పైగా ఖర్చయింది. మిగిలిన బాధితులకు సైతం వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. -
ఫెర్రో అల్లాయ్స్కు బాబు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు ఈ ఏడాది మార్చి చివరి వరకే కొనసాగుతాయని, ఆ తర్వాత ఉండవని తేల్చి చెప్పింది. రెండేళ్ల పాటు రాయితీలు కొనసాగించాలని ఫెర్రో అల్లాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించలేదు.మార్చి 31 వరకే రాయితీలు ఉంటాయని, ఈ ఏడాది ఏప్రిల్ 1 (వచ్చే ఆరి్థక సంవత్సరం) నుంచి రాయితీలు లేకుండా సాధారణ సుంకాలను చెల్లించడానికి సిద్ధం కావాలని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ పరిశ్రమలు ఆరి్థక ఇబ్బందుల్లో పడి, ఆ ప్రభావం 50 వేల మంది జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని పారిశ్రామిక, కారి్మక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై నడపడం కష్టమే రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరి సంక్షేమంతోపాటు పారిశ్రామిక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ ప్రభుత్వం ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ సుంకం యూనిట్కు రూ.0.6 పైసలకు, డిమాండ్ ఛార్జీలు 90 శాతం వరకూ తగ్గించింది. 10 శాతం మాత్రమే వసూలు చేసింది. పరిశ్రమలు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పాలకులు కరగలేదు.ఈ వెసులుబాటు ఆ పరిశ్రమలకు ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుందని తెగేసి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ముక్కుపిండి మరీ మొత్తం చార్జీలను వసూలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ఈ పరిశ్రమలపై నిబంధనలు విధించింది. వాటికి అవసరమయ్యే కరెంటును కేవలం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నుంచే కొనాలని గతేడాదే నిబంధనలు విధించింది.మార్చి తరువాత వేసవిలో ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే విద్యుత్ కొరత కారణంగా అధిక ధరలకు డిస్కంలు విద్యుత్ను కొంటాయి. దానిని సరఫరా చేసి ఎక్కువ చార్జీలు వసూలు చేయడం వల్ల ఫెర్రో పరిశ్రమలకు మరింత భారంగా మారుతుంది. దానికి తోడు ఈ రాయితీలు కూడా మార్చితో ముగిసిపోతే అవీ, ఇవీ కలిపి ఫెర్రో అల్లాయ్స్ మూతపడే పరిస్థితి వస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/ఇబ్రహీంపట్నం: కాపుల వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వారిపైనే దాడులు చేయిస్తూ అవమానాలు, వేధింపులకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా బానిసలుగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అది జరగదని మండిపడ్డారు. సోమవారం ఆయన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి వచ్చారు. అంబటిని పరామర్శించారు.ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైనా, తన కుటుంబంపైనా దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంపైనా దాడి చేయించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘అయ్యా చంద్రబాబు నీకు, మీ సతీమణి, మీ కుమారుడు, కోడలికి అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏమిటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు చేయించటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.ఇప్పటికైనా అబద్ధాలు ఆపి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ ఆయనకు వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా జోగి రమే‹Ùను పరామర్శించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నగర గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గం ఇన్చార్జ్, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు చిలిమిలి వెంకటరాయుడు, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
ఒప్పందాల కోసమే ‘క్వాంటమ్’ కంపెనీల సృష్టి?
సాక్షి, అమరావతి: ఇటీవల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన సమయంలో 14 కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడింది. కేవలం ఒప్పందాల కోసమే కొన్ని కంపెనీలను సృష్టించి, వాటితో ఎంవోయూలు కుదుర్చుకున్నారంటూ ఆధారాలతో సహా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న 14 కంపెనీల్లో... మూడు కంపెనీలు డిసెంబర్, జనవరి నెలల్లోనే ఏర్పాటయ్యాయని... మరో రెండు కంపెనీల అడ్రస్లు ఎంత వెతికినా దొరకడం లేదని విమర్శిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో ఏర్పాటు చేసిన కంపెనీలతో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం కుదుర్చుకొని 35 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు ఉద్యోగులున్న కంపెనీతో ఒప్పందమా... 35 లక్షల ఉద్యోగాలా? చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వాటిలో ఐక్యూలీప్ అనే కంపెనీ డిసెంబర్లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో ముగ్గురు ఉద్యోగులే ఉన్నారు. ఫోటాన్ కోర్ సిస్టమ్స్ అనే కంపెనీ రూ.10 లక్షల మూలధనంతో జనవరి 12న ఏర్పాటైంది. ఇక ట్రై క్వాంటా అనే కంపెనీ కూడా నెలల వ్యవధిలోనే ఏర్పాటైంది. అయితే ఆ కంపెనీ నెలకొ ల్పిన ఆరు నెలల్లోనే బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డును కూడా కైవసం చేసుకుందని ప్రకటించారు. కానీ, ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అప్పుడే ఆ కంపెనీకి అవార్డులు ఎవరిచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీల ప్రొఫైల్స్ చూసిన నెటిజన్లు.. ఒకటి, రెండు నెలల కిందటే ఏర్పాటు చేయడంతోపాటు కేవలం ముగ్గురు ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థల ద్వారా ఎంత మందికి శిక్షణ ఇస్తారు? 35 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా క ల్పిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం భారీ ప్రచారం ఎప్పటిలాగానే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన పేరుతో గ్రాఫిక్ డిజైన్స్ విడుదల చేసి చంద్రబాబు సర్కారు భారీ ప్రచారం చేసుకుంది. రూ.9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాలంటూ గ్రాఫిక్స్తో సినిమా చూపించింది. వాస్తవంగా చూస్తే ఒప్పందానికి ఒకటి, రెండు నెలల ముందు పుట్టిన మూడు కంపెనీలు, అడ్రస్ దొరకని మరో రెండు కంపెనీలతోపాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బోసాన్ క్యూసై, ఐక్యూలీప్, క్యూబిక్ఫోర్స్, క్వాంటమ్ ఫోకస్ ల్యాబ్స్ వంటి లోకల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. -
రెడ్బుక్ రివర్స్.. బిహార్లో బేజార్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్బుక్ అరాచకాలకు బిహార్ గడ్డ ఘాటుగా బుద్ధి చెప్పింది! రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులను బిహార్లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురయ్యారు. ప్రస్తుతం బిహార్లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్ రావడం ఏమిటి..? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించేది లేదు.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్ కోర్టు మండిపడింది. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఒక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేస్తామని కూడా వ్యాఖ్యానించింది. దాంతో బిహార్లో తీవ్ర అవమానానికి గురైన ఏపీ పోలీసులు బిక్క మొహంతో తిరుగుముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చి తీవ్ర అవమానభారంతో వెనుదిరిగారు. యావత్ దేశంలో సంచలనంగా మారిన ఏపీ పోలీసుల రెడ్బుక్ అరాచకం ఇలా ఉంది..!! కిడ్నాపర్ల మాదిరిగా ఏపీ పోలీసులు.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచి్చన ఫిర్యాదుపై అక్రమ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు బరితెగించి వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యావత్ పోలీసు శాఖకు రెడ్బుక్ టాస్క్ ను అప్పగించారు. దాంతో గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించి దర్యాప్తు పేరిట దళిత, గిరిజన ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. అందుకోసం అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయినా సరే ఈ కేసు దర్యాప్తు అధికారిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో డిప్యుటేషన్పై రాష్ట్రంలో సీఐడీ డీఐజీగా పని చేసిన గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను లక్ష్యంగా చేసుకున్నారు.ప్రస్తుతం బిహార్లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసుల బృందం తాజాగా పట్నా వెళ్లింది. అందుకోసం ఏపీ పోలీసులు కిడ్నాపర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి సోమవారం తెల్లవారుజామున సునీల్ నాయక్ అధికారిక నివాసం గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన్ను చుట్టిముట్టి బలవంతంగా తమతో లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సునీల్ నాయక్ ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన పోలీస్ క్వార్టర్స్లో ఉన్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు వచ్చారని భావించి దాదాపు వందమంది పోలీసులు, హోంగార్డులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు... కేసు డైరీ, వారెంటూ లేదు.. బిహార్ అగ్ని మాపక శాఖ డీజీతోపాటు పలువురు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు అక్కడకు చేరుకుని గట్టిగా నిలదీయడంతో ఏపీ పోలీసుల బండారం బయటపడింది. తాను ఎస్పీనని.. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు వచ్చామని దామోదర్ చెప్పడంతో బిహార్ పోలీసు అధికారి, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. అరెస్టు వారెంటు ఉందా? అని ప్రశ్నించగా ఏపీ పోలీసులు తెల్లమొహం వేశారు. పోనీ ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు..? కేసు డైరీ ఉందా..? ఎఫ్ఐఆర్ కాపీ ఉందా..? స్థానిక కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ వారెంట్ ఉందా..? అని నిలదీయడంతో అవేవీ తమ వద్ద లేవని బదులిచ్చారు. అసలు సునీల్నాయక్కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా..! అని న్యాయవాదులు గుర్తు చేయడంతో ఏపీ పోలీసులు మౌనం దాల్చారు. అయినా సరే.. 35 బీఎన్ఎస్ఎస్ కింద సునీల్నాయక్ను తాము అరెస్టు చేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు.అయితే ఆ నిబంధన కింద అరెస్టు చేసేందుకు వారికి అధికారం లేదని న్యాయవాదులు అభ్యంతరం తెలిపినా ఆలకించలేదు. ఆయన్ను అరెస్టు చేశామని, తమతో తీసుకువెళ్తామని మొండిగా వాదించారు. సునీల్నాయక్ను బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో బిహార్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. వంద మందికిపైగా పోలీసులు, హోంగార్డులు ఏపీ పోలీసు బృందాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడకు చేరుకున్న పట్నా ఎస్పీ (ఈస్ట్) భానుప్రతాప్సింగ్ ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ నాయక్ను మీరు అరెస్టు చేశామనుకుంటే అనుకోండి..! కానీ ఆయన్ను మా అనుమతి లేకుండా... న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకెళ్లేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఏపీ పోలీసులపై పట్నా కోర్టు ఫైర్.. సునీల్ నాయక్ అరెస్టుకు ‘నో’ ఈ క్రమంలో సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు సోమవారం ఉదయం పట్నా కోర్టును ఆశ్రయించారు. బిహార్ ఐపీఎస్ అధికారిని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఓ ఐపీఎస్ అధికారి నివాసంలోకి ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని ఏపీ పోలీసుల బృందం గోడదూకి చొరబడటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఏపీ పోలీసులు అప్పటికప్పుడు ఆగమేఘాలపై పట్నా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.సునీల్ నాయక్ను అరెస్టు చేశామని చెబుతూ, ఏపీకి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. దీనిపై బిహార్ పోలీసుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సునీల్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలే లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. అనంతరం సునీల్ నాయక్ను నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేయగా పట్నా హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన విషయాన్ని గుర్తు చేశారు. విచారణకు సహకరిస్తారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.సునీల్ నాయక్పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పట్నా కోర్టు సునీల్ నాయక్కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సునీల్ నాయక్కు వ్యతిరేకంగా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు నిరాకరించింది. సునీల్ నాయక్పై 30 రోజుల వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఎస్పీ దామోదర్ బృందం బిహార్లో భంగపాటుకు గురైంది. ఏపీ డీజీపీ vs బిహార్ డీజీపీసునీల్ నాయక్ అక్రమ అరెస్టు పన్నాగం బెడిసికొట్టడంతో నాలు క కరుచుకున్న ఏపీ పోలీసులు డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను ఫోన్లో బిహార్ డీజీపీ వినయ్కుమార్తో మాట్లాడించినట్లు సమాచారం. సునీల్ నాయక్ను అరెస్టు చేసేందుకు సహకరించాలని కోరడంపై బిహార్ డీజీపీ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘ఐజీ సునీల్ నాయక్ నా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి.ఈ రోజు ఏపీ పోలీసులు ఆయన నివాసంలో గోడ దూకి ప్రవేశించారు. ఆయన్ను ఎత్తుకు పోయేందుకు యత్నించారు. ఇందుకు అనుమతిస్తే భవిష్యత్లో నా బంగ్లాలోకి కూడా అక్రమంగా ప్రవేశించి నన్నూ ఎత్తుకుపోతారేమో..’ అని తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. స్థానిక ఎస్పీకి, చివరికి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక ఐపీఎస్ అధికారిని అపహరించేందుకు యత్నించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం.బందిపోటు దొంగల్లా వచ్చారు..! బిహార్కు చెందిన ఐజీ సునీల్ నాయక్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లా వచ్చారు. ఏపీకి చెందిన ఎస్పీ స్థాయి అధికారి గోడదూకి సునీల్నాయక్ నివాసంలోకి చొరబడ్డారు. ఏపీ పోలీసులు ఎటువంటి నిబంధనలను పాటించలేదు. వారి వద్ద అరెస్టు వారెంటూ లేదు.. కేసు డైరీ లేదు.. ఎఫ్ఐఆర్లో కనీసం సునీల్ నాయక్ పేరు లేదు. బిహార్ వచ్చి ఏదైనా చేయవచ్చని అనుకుంటే ఎలా..? ఏపీ పోలీసుల తీరును పట్నా కోర్టు తప్పుబట్టింది. సునీల్ నాయక్ను అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పింది. సునీల్ నాయక్పై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. – శ్రీవాస్తవ్, కునాల్ తివారీ, సునీల్నాయక్ తరపు న్యాయవాదులు -
నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్
-
హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?
-
తిరుమల లడ్డుపై బాబు అబద్దాలు BJP నేత కౌంటర్..
-
హెల్త్ ఇన్సూరెన్స్ లో భారీ స్కాంకు కుట్ర
-
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ కుంభకోణం.. అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ
-
‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం... దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించటాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.సీఎం అబద్ధాలు ప్రచారం చేశారురాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాలను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.స్వయంగా ‘సుప్రీం’ పర్యవేక్షిస్తున్నా ఏకసభ్య కమిటీనా..? లడ్డూ ప్రసాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ విచారణ కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్లో నివేదించారు.కుట్ర బెడిసికొట్టడంతో కమిటీ పన్నాగం!శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ లాబ్లు స్పష్టం చేయగా సీబీఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ ఒక్క వైఎస్సార్సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసికొట్టడంతో మరో కొత్త కుత్రంత్రానికి తెర తీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలనే రాజకీయ కుట్రతో దినేష్ కుమార్ కమిటీని నియమించారు.బాబు సర్కారుపై ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు..చంద్రబాబు సర్కారు దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అంటూ చంద్రబాబునుద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రానుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.స్వామి పిటిషన్లో ఆరుగురు ప్రతివాదులు వీరే..⇒ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం⇒ కేంద్ర ప్రభుత్వం ⇒ చంద్రబాబు (ఏపీ సీఎం)⇒ సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బందం)⇒ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)⇒ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) -
ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్!
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమలులో స్కామ్కు రంగం సిద్ధమైంది! ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పచ్చ పార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకే వైద్యశాఖలో రూ.నాలుగు వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్ట్ను కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అస్మదీయ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్లించడం, ప్రీమియంపై భారీ మొత్తంలో కమీషన్ బ్రోకర్ ఏజెన్సీకి చెల్లించడం, ఏజెన్సీ నుంచి పెద్దలకు ముడుపులు చేరవేసేలా పావులు కదుపుతున్నారు. ఈ దోపిడీ పరంపరతో భారీ కుంభకోణానికి తెర తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతటా అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ..ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా అమలులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ బ్రోకర్ సంస్థ చక్రం తిప్పుతోంది. పచ్చ పార్టీ కార్యకర్తలకు బీమా సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీ, పార్టీకి మధ్య ఓ సంస్థ బ్రోకింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ గతేడాది కోటి మంది కార్యకర్తలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా కోసం కేవలం రూ.42 కోట్లు ప్రీమియం చెల్లించేలా ఓ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిర్చింది. ప్రస్తుతం ఆ బ్రోకర్ ఏజెన్సీ ద్వారానే వివిధ శాఖల్లో బీమా అమలు స్కామ్ను ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది విద్యుత్ శాఖలో ట్రాన్స్కో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.100 కోట్ల విలువైన ఈ టెండర్ను తొలుత పచ్చ పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకర్ ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సాల్వెన్సీ నిబంధన, ప్రమాణాల కారణంగా ఆ బిడ్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కోరినంత కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకుని మరో ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్డదారుల్లో కాంట్రాక్టు ముట్టజెప్పారు. కాంట్రాక్టు దక్కించుకున్న బీమా సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసేందుకు టెండర్ల సమయంలో తిరస్కరణకు గురైన అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీని మళ్లీ రంగంలోకి దించారు. ఇన్సూరెన్స్ సంస్థకు, ఉద్యోగులకు మధ్య సమన్వయం కోసం టెండర్ల దశలో అనర్హతకు గురైన ఏజెన్సీని నియమించారు. పచ్చ పార్టీ బీమా సేవలో తరిస్తున్న కంపెనీకి మేలు చేసేందుకు వైద్యశాఖ బీమా టెండర్లో సాల్వెన్సీ నిబంధనకు మినహాయింపు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే అస్మదీయ ఏజెన్సీకి విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ ప్రమాద బీమాలో 15 శాతం వాటాను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేశారు. 2024–25, 2025–26లో ఇదే ప్రాతిపదికన ఎంపిక చేశారు. భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయనే భయంతో విజయవాడతో పాటు మరో థర్మల్ పవర్ స్టేషన్కు 2026–27లో బ్రోకింగ్ ఏజెన్సీల ఎంపికకు టెయిలర్ మేడ్ నిబంధనలతో ఇటీవల టెండర్ పిలిచారు. ఇలా ప్రభుత్వ శాఖల్లో బీమా కార్యకలాపాలన్నింటిలో బ్రోకర్ ఏజెన్సీ ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు.సాల్వెన్సీ నిబంధన ఎత్తివేతవైద్య శాఖలో బీమా టెండర్ను ఎలాగైనా సరే పచ్చ పార్టీకి బీమా అందిస్తున్న ప్రైవేట్ కంపెనీకే కట్టబెట్టాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనల్లో మార్పులు తెచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తోంది. పచ్చ పార్టీకి బీమా సేవలు అందిస్తున్న సంస్థ సాల్వెన్సీ నిబంధనతో ట్రాన్స్కో టెండర్లో వైదొలగింది. దీంతో వైద్య శాఖ బీమా టెండర్లో ప్రీ బిడ్ అనంతరం సాల్వెన్సీ షరతులో మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సమర్పిస్తే సాల్వెన్సీ నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల మంది పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణతో చెలగాటమాడుతూ రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టు విషయంలో సాల్వెన్సీ నిబంధన నుంచి మినహాయిం ఇస్తామని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వం తీరుపై పలు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం అభ్యంతరం తెలపడం గమనార్హం. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఐఏ) నిబంధనల ప్రకారం ప్రతి బీమా సంస్థ (లైఫ్, జనరల్/హెల్త్ ఇన్సూరెన్స్) కనీసం 150 శాతం సాల్వెన్సీ రేషియోను నిరంతరం కొనసాగించాలి. ఉదాహరణకు ఒక సంస్థ చెల్లించాల్సిన క్లెయిమ్ల విలువ రూ.100 అనుకుంటే.. ఆ సంస్థ వద్ద కనీసం రూ.150 విలువైన ఆస్తులు సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసుకున్న బీమా సంస్థ సాల్వెన్సీ రేషియో లోటులో ఉండటం గమనార్హం. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి టెండర్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. -
దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!
-
పోర్టు మాటున భూ దుమారం!
‘ఇది సర్కారు వారి పాట.. ఇక్కడ ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి అంటూ అడగడముండదు.. మాకు కావాల్సిన చోట, మాకు కావాల్సినంత భూమిని మేమిచ్చే రేటుకు వెంటనే ఇచ్చేయాల్సిందే.. అవి పట్టా భూములని, కోర్టుకెళతామని సాకులు చెబుతూ అడ్డుకుంటారో కబడ్దార్.. మీరలా చేస్తే ఏం చేయాలో మాకు తెలుసు.. ఆ భూమిని మేము ఎవరికి ఇచ్చుకుంటామో మీకు అనవసరం.. ఈ ప్రభుత్వం మాది.. అధికారులూ మేము చెప్పినట్లే వింటారు.. అంతా మా యిష్టం’ అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. మచిలీపట్నం పోర్టుకు సమీపంలో అత్యంత విలువైన భూములపై సర్కారు కన్నుపడింది. పోర్టుకు అవసరం లేకున్నా, ప్రజోపయోగాలకు కాకున్నా.. కేవలం కావాల్సిన వారికి ధారాదత్తం చేయడానికి బరితెగించింది.. రైతుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆరు గ్రామాలను కనుమరుగు చేస్తూ వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించడానికి రంగం సిద్ధం చేయడం కలకలం రేపుతోంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి అవసరమైన మేరకు భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. పోర్టు కనెక్టివిటీ కోసం కూడా 200 ఎకరాలకు పైగా రైతులకు మంచి ధర ఇచ్చి అప్పట్లోనే సేకరించింది. ముందస్తు ఆలోచనలతో అన్ని విధాలా పోర్టు అభివృద్ధికి చక్కటి ప్రణాళిక సిద్ధం చేసింది. పోర్టుకు సమీపంలో వీలైనంత భూమిని గుప్పెట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కుని తనకు నచ్చిన వారికి పప్పుబెల్లాల్లా పంచిపెట్టి లబ్ధి చేకూర్చడానికి పథకం వేశారు. కరకట్ట ప్యాలెస్లో సమాలోచనల అనంతరం కొద్ది రోజుల క్రితం ఈ కుతంత్రానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రాథమికంగా రెండు దశల్లో దాదాపు ఆరున్నర వేల ఎకరాలు సేకరించేందుకు ఉన్నతాధికారులకు సర్కారు పెద్దలు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నం పోర్టుకు కూత వేటు దూరంలో 1,556.76 ఎకరాల ప్రభుత్వ భూమి, 4,851.3 ఎకరాల ప్రైవేట్ భూమిని ప్రభుత్వం లాక్కోవడానికి రంగం సిద్ధమైపోయింది. ఏకంగా 6,408.06 ఎకరాలు గుప్పెట్లో పెట్టుకుని తన సంబంధీకులకు, బినావీులకు ధారాదత్తం చేసేందుకు కుతంత్రం రచించింది. రెండు దశల్లో ఆరు గ్రామాలను కాల గర్భంలో కలిపేయనుంది. చెన్నై లాంటి అంతర్జాతీయ నౌకాశ్రయం 553 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ పోర్టు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాలు సేకరించడం వెనుక బినావీులకు దోచిపెట్టాలన్న దుగ్ధ దాగి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రైవేట్ బృందం సర్వేఅసలే భూమి అవసరం లేని చోట ఎవ్వరికీ అర్థంకాని కారణాలు చెబుతూ మచిలీపట్నం పోర్టుకు కూత వేటు దూరంలో ఏకంగా 4,851 ఎకరాలు లాక్కోజూస్తుండటం రైతులను కలవరానికి గురి చేస్తోంది. రానున్న రోజుల్లో పోర్టు సమీప ప్రాంతంలో భూమి విలువ పెరుగుతుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారు. ఇదే అదనుగా వీలైనంత భూమిని చేజిక్కించుకుని తమ వారికి అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ వ్యక్తులతో కూడిన బృందాన్ని పోర్టు పరిసర ప్రాంతాలకు పంపారు. ఆ బృందం పలు గ్రామాలను, భూములను పరిశీలించి ప్రభుత్వ పెద్దలకు ఓ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏ గ్రామ పరిధిలో ఎక్కడెక్కడ ఏ మేరకు భూమి కావాల్సి ఉంటుందో ఆ బృందం నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ విధంగానే భూ సేకరణ జరగాలని ప్రభుత్వ పెద్దలు ఈ నెల 12వ తేదీన ఇద్దరు ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. ‘పరిశ్రమల కోసం’ అనే ముసుగుతో భూ సేకరణ చేయాలని ఆదేశాలు అందడంతో ఉన్నతాధికారులు ఇద్దరూ మారు మాట్లాడకుండా ఆ దిశగా కింది స్థాయి యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. త్వరలో ఈ మేరకు నోటిఫికేషన్ కూడా వెలువడనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నోట, ఈ నోట ఈ విషయం రైతుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. అవసరమైన మేరకు ఇప్పటికే సిద్ధంగత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా కేవలం ప్రైవేటు భూమి 129.12 ఎకరాలు, అసైన్మెంటు భూమి 50 ఎకరాలు, ముడా (మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ ఆ«థారిటీ) భూమి 50.85, ప్రభుత్వ భూమి 5.40 ఎకరాలను మాత్రమే తీసుకుంది. ఈ భూమి సైతం పెడన నుంచి పోర్టు వరకు 40 మీటర్ల వెడల్పుతో రహదారి, రైల్వే ట్రాక్, గ్యాస్ ఆయిల్ పైపు లైను కోసం తీసుకున్నారు. మనిషికి భూమికి భావోద్వేగ బంధం ఉంటుందని, దాన్ని అధిగమించి ఊరికి, పోర్టు అవసరాలకు రైతులు భూమి ఇస్తున్నందున వారు నవ్వూతూ వెళ్లేలా బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పటి కలెక్టర్కు సూచించారు. దీంతో అప్పట్లో రైతులు సంతోషంగా నాటి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భూములు స్వచ్ఛందంగా అప్పజెప్పారు. దీంతో పాటు 1,780 ఎకరాల సముద్ర భూమిని పోర్టు నిర్మాణానికి అప్పజెప్పారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, కావాల్సిన వనరులన్నింటినీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమకూర్చి, శంకుస్థాపనలతో బందరు ప్రజలను మభ్యపెట్టకుండా నేరుగా పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. పోర్టుకు ఇంతకు మించి భూ అవసరం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇంకా పోర్టు, అభివృద్ధి అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముడా భూముల్లో భారీగా మట్టి తవ్వకాలు ఇప్పటికే ముడా (మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ ఆ«థారిటి) భూములను టీడీపీ నేతలు చెరబట్టారు. 700–800 ఎకరాల భూమిలో ఆరేడు అడుగుల లోతు వరకు మట్టి తవ్వి అమ్మకాలు చేపట్టారు. తద్వారా కోట్ల రూపాయలు దండుకొన్నారు. ఈ దందా అంతా ఓ మంత్రి కనుసన్నల్లో జరిగినట్లు ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. సదరు అమాత్యుడు తన ముఖ్య అనుచరుల ద్వారా ఈ దందా నడిపించినట్లు అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ముడా చైర్మెన్గా బీజేపీ చెందిన వ్యక్తిని నియమించారు. పచ్చ నేతలతో వేగలేక ఆయన కొన్ని రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.ఇలా సేకరించాలంటూ బ్లూ ప్రింట్⇒ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంత భూమి తీసుకోవాల్సి ఉంటుందో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందికి నివేదించారు. కాదు.. కూడదని ఎవరైనా కోర్టులకు ఎక్కే, రోడ్డెక్కి గొడవ చేసే వాళ్ల నోరు ఎలా మూయిస్తారో మీ ఇష్టం.. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోండని సూచించినట్లు తెలిసింది. అంటే అక్రమ కేసులు పెట్టి మరీ వేధించి భూములు లాక్కోవాలని ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రశ్నించే వారి లోటు పాట్లు కనుక్కొని, అడ్డు రాకుండా ముందే జాగ్రత్త పడాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.⇒ ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ భూమి తొలి దశలో 2805.64 ఎకరాలు, రెండో దశలో 2046.66 ఎకరాలు అంటున్నారంటే.. మూడో దశలో ఇంకెంత ఉంటుందోనని మచిలీటప్నం ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భూములు లాక్కోజూసినా పప్పులు ఊడకలేదు. అది మనుసులో పెట్టుకొని ఇప్పుడు పక్కా ప్లాన్తో సరికొత్త ‘రియల్ వెంచర్’కు స్కెచ్ వేసినట్లు అధికార పార్టీకి చెందిన నేతల్లోనే చర్చ సాగుతోంది.⇒ ప్రభుత్వం భూ సేకరణ చేయనున్న మంగినపూడిలో 1,600 జనాభా, తవిసిపూడిలో 1,600, గోపువానిపాలెంలో 1,000.., కొత్త పూడిలో 800, పొట్లపాలెంలో 800, గోకవరంలో 1,800 జనాభా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి తట్టా బుట్టా చేత పట్టుకుని వలస వెళ్లాల్సి ఉంటుంది. వీరికి ఏ మేరకు పునరావాసం కల్పిస్తారో స్పష్టత లేదు.⇒ వాస్తవానికి పరిశ్రమల కోసం ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వొచ్చు. లేదంటే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్న యజమానులే సొంతంగా భూమి కొనుగోలు చేస్తారు. కానీ వారి తరఫున ప్రభుత్వమే ఇలా బలవంతంగా భూ సేకరణ చేయడం విస్తుగొలుపుతోంది. -
జగన్ వర్సెస్ డర్టీ డజన్!
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్సిక్స్’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్’ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.‘ఓట్ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా వీఎఫ్డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.వీఎఫ్డీ వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్’ అనే స్వతంత్ర వెబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3500 పోలింగ్ బూత్లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్ రేట్ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్ మోహన్రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ వన్ – జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్’ కాంపౌండ్లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్’ పేలుళ్లు వినబడుతున్నాయి.జగన్ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎమ్ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్
-
హిందువుల ద్రోహి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి
-
ఇంకోసారి లడ్డు గురించి మాట్లాడాలంటే... బాబుపై కన్నెర్రజేసిన జడ శ్రవణ్
-
చరిత్రలో దేవుని మీద రాజకీయాలు చేయాలంటే గజగజ వణికి పోవాలి
-
Guntur : సచివాలయం ఉద్యోగుల భారీ ర్యాలీ..
-
చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ ఫిన్ లీస్ నుంచి VSRకు ఫండింగ్
-
స్వామితో చెలగాటం ఆడుతున్నారు కచ్చితంగా ఫలితం చూస్తారు
-
నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ డ్రామా.. దొరికిపోవడంతో మరో కొత్త కుట్ర
-
Botsa : రండి చర్చకు అంటే తోక ముడిచి పారిపోయారు
-
Jada: తన కేసులు మాఫీ చేయించుకోవడం తప్ప ఏమీ చేయలేదు...
-
చంపితే చస్తా కానీ.. తగ్గేదేలే... మరో సారి అంబటి మాస్ వార్నింగ్
-
పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్.. ఏపీ బడ్జెట్ పై YS జగన్ రియాక్షన్
-
త్రిశంకుస్వర్గంలో ఉన్నత విద్య
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పిల్లల చదువులపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై స్పష్టత లేకుండా చేసి చదువులను త్రిశంకు స్వర్గంలో పెట్టారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక త్రైమాసికం ముగిసిన వెంటనే మరో త్రైమాసికంలో తల్లుల ఖాతాల్లో వేసేవాళ్లం. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో నిధులు విడుదల చేసేవాళ్లం. అయితే 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది.మే 13 పోలింగ్ జరిగింది. అంతే, అక్కడితో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి 9 త్రైమాసికాలకు విద్యా దీవెనకు రూ.6,300 కోట్లు చెల్లించాలి. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. ఎన్నికల పుణ్యంతో అది కూడా ఆగిపోయింది. 2024–2025 ఏప్రిల్ వరకు కలిపి రూ.2,200 కోట్లు వసతి దీవెన చెల్లించాలి. విద్యా దీవెన, వసతి దీవెన కలిపితే రూ.8,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,771 కోట్లు మాత్రమే విడుదల చేశారు.ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోందని మరో రూ.1,200 కోట్లకు బీఆర్వోలు ఇచ్చారు. బీఆర్వో ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీల ఖాతాల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పడ్డాయి. అంటే రెండేళ్లలో బాబు ఇచ్చింది రూ.2,071 కోట్లే. ఇంకా రూ.6,428 కోట్లు బాకీ పడ్డారు’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రూ.35,209 కోట్లతో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ⇒ అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన మేనిఫెస్టోలో పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ గజం స్థలం కొనడానికి పైసా కేటాయించ లేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. ⇒ పైగా మా హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉంటే, వాటిని కూడా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నాడు. 2024–25లో రూ.4,012 కోట్లు బడ్జెట్ పెట్టి రూ.1,548 కోట్లు ఖర్చు చేశారు. 2025–26లో రూ.6,300 కోట్లు (రివైజ్డ్ అంచనాలు) పెడితే రూ.1,928 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు గానీ, వాస్తంగా ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే. ⇒ వైఎస్సార్సీపీ హయాంలో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. నాడు–నేడుకు ఉరి ⇒ ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మేము దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తే దానికి చంద్రబాబు ఉరి వేశారు. తొలి విడతలో 15,713 స్కూళ్లలో పనులు చేస్తే, రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపు పూర్తి చేసే దశకు తీసుకొచ్చాం. నాడు–నేడుకు రూ.8,524 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని చంద్రబాబు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ⇒ మరో రూ.4–5 వేల కోట్లు ఖర్చు పెడితే నాడు–నేడు పనులు అయిపోతాయి. కానీ, చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మూలన పడేశారు. ఆయన సుపుత్రుడి శాఖలో నాడు–నేడు కోసం 2024–25లో రూ.285 కోట్లు ఖర్చు చేస్తే, 2025–26లో రూ.1,500 కోట్లు కేటాయించి రూ.259 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు గానీ, ఎంత ఖర్చు చేస్తారో చూడాలి. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్సీ, ఐబీ, టోఫెల్ నిలిపివేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, నాడు–నేడు ఎగిరిపోయాయి. సబ్జెక్టు టీచర్ విధానానికి మంగళం పాడేశారు. గోరుముద్ద పిల్లలు తినకుండా చేస్తున్నారు. కలుషిత నీరు తాగి, నాణ్యత లేని ఆహారం తిని 900 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారని జాతీయ పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయి. ఇంత దారుణంగా విద్యా రంగాన్ని నడుపుతున్నారు.ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు రూ.330 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4 వేల కోట్లు వ్యయం చేయాలి. 2024–25, 2025–26 రెండేళ్లకు రూ.8 వేల కోట్లు వెచ్చించాలి్సన చోట చంద్రబాబు 2024–25లో రూ.2,259 కోట్లు, 2025–26లో రివైజ్డ్ అంచనాలు ప్రకారం రూ.3 వేల కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ మాత్రం రూ.2,600 కోట్లే ఇచ్చినట్టు చెబుతోంది. ఇంకా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,141 కోట్ల బకాయిలు పెట్టింది. 2026–27లో రూ.4 వేల కోట్లతో కలిపితే మొత్తం రూ.7,200 కోట్లు ఆర్యోశ్రీకి అవసరం. వీళ్ల బడ్జెట్ చూస్తే పేదలను బతికించేలా కనిపించట్లేదు. 2026–27 విద్యా సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు (త్రైమాసికానికి రూ.700 కోట్లు) రూ.2,800 కోట్లతో పాటు వచ్చే ఏప్రిల్లో వసతి దీవెనకు రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వ్యయం చేయాలి. దీనికి రూ.6,428 కోట్ల బకాయిలు కలిపితే రూ.10,328 కోట్లు నిధులు కావాల్సి ఉంది. అయితే బడ్జెట్లో పెట్టింది మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలాగైతే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? అసలు చదివే పరిస్థితి ఉంటుందా?వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. ఇదే విషయంపై సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. – వైఎస్ జగన్మహిళలకు రుణ పరపతిలో క్షీణత ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలో అతీగతి లేదు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించి ఇవ్వకపోగా.. ఇంతకు ముందు ఇచ్చేది కూడా ఆపేశారు. వైఎస్సార్సీపీ హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా 26,98,931 మందికి రూ.19,189 కోట్లు, ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు, కాపు నేస్తం కింద 3,58,613 మందికి రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 4,95,269 మందికి రూ.1,876 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ⇒ స్త్రీలను శక్తిమంతులను చేసేలా వారి సాధికారత కోసం వైఎస్సార్సీపీ హయాంలో చర్యలు చేపట్టాం. మేము అక్కచెల్లెమ్మల బాగు కోసం పరితపించి వారిని నిలబెట్టే కార్యక్రమం చేస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో విచిత్రంగా పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. నాబార్డ్ డేటా చూస్తే.. 2023–24లో మహిళలకు రూ.49,626 కోట్లు పొదుపు రుణాలు ఉంటే, చంద్రబాబు హయాంలో 2025–26 పది నెలల్లో (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. దానికి ముందు ఏడాది 2024–25లో రూ.41 వేలుగా ఉంది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో పరపతి తగ్గిపోతోంది.స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీఉద్యోగులకు పైసా జీతం పెరగలేదు ⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. మూడు బడ్జెట్లు పెట్టినా ఉద్యోగులకు ఒక్క పైసా జీతం పెరగలేదు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చాం. ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ వేసి చైర్మన్ను నియమిస్తే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చైర్మన్ను తీసేశారు. ⇒ ఆయన త్వరగా రిపోర్టు ఇస్తే వెంటనే జీతాలు పెంచాలనే భయంతో, ఒకవైపు ఐఆర్ ఇవ్వకుండా మరో వైపున పీఆర్సీ చైర్మన్ తొలగించి, కొత్త పీఆర్సీని నియమించకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్, ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, ఒకటో తేదీ జీతాల ముచ్చట ఒక నెలతోనే అయిపోయింది. ⇒ జీపీఎఫ్, ఏపీజీఎస్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవుల కింద దాదాపు రూ.35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పడ్డారు. 2024–25లో ఉద్యోగుల జీతాలు రూ.62,806 కోట్లు అయితే, 2025–26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ.61,111 కోట్లు. అంటే జీతాలు పెరగాల్సింది పోయి తగ్గాయి. కొద్దో గొప్పో ఉద్యోగులు రిటైర్ అయ్యి ఉంటారు. హెచ్ఆర్ఏ 2024–25లో రూ.4,614 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.4,600 కోట్లకు తగ్గింది. మెడికల్ రీయింబర్స్మెంట్ రూ.124 కోట్ల నుంచి రూ.121 కోట్లకు పడిపోయింది. అలవెన్సులు, ఈఎల్, ఎస్టీసీ, ఓవర్టైమ్ అలవెన్స్లు రూ.2,415 కోట్లు అయితే ఇప్పుడు రూ.1,316 కోట్లకు క్షీణించింది. ఉద్యోగుల బేసిక్ పే రూ.35,671 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.35,345 కోట్లుగా మాత్రమే ఉంది. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్, అలవెన్స్ చెల్లింపు తదితరాలపై మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. -
అంకెలతో మోసం.. ప్రతి అడుగులో పతనం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అవే పచ్చి అబద్ధాలు.. తప్పుడు లెక్కలు.. చంద్రబాబు భజన.. బడ్జెట్ అంతా మోస మే..! అని టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ల ద్వారా రాష్ట్రానికి, ప్రజల కు చంద్రబాబు చేసిన మంచి ఎక్కడా కనిపించద ని.. అంతా మోసమేనని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్, సెవెన్ హామీలను అమలు చేయలేక.. అట్టర్ ప్లాప్ అయినా, సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘మోసానికి షర్టు, ఫ్యాంట్ వేస్తే అది చంద్రబాబు. అబద్ధాలకు రెక్కలు కడితే అవి చంద్ర బాబు మాటలు’’ అని విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో అంకెల గారడీ, ప్రజలను మోసగిస్తున్న తీరును నిలదీశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో పొందుపరిచిన గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల్లో తప్పుడు లెక్కలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఫ్యాబ్రికేటెడ్ అంకెలతో డప్పు..ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడిచి వంచిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టింది. తాను ఇస్తానన్న సూపర్ సిక్స్, సెవెన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి ఎగిరిపోయాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. రాష్ట్ర ప్రగతి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతాయి.. వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం గడప కూడా దాటని పరిస్థితి కని పిస్తుంది. చంద్రబాబు పాలనంతా పబ్లిసిటీ పీక్, ఫెర్మామెన్స్ వీక్. 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు (జీఎస్డీపీ) 11.75 శాతంగా చంద్రబాబు చెప్పుకొస్తారు. దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 9.8% మాత్రమేనని.. దేశం కంటే రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారు. ఇక 2025–26 రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్రేటు 10.75 శాతంగా తన ఆఫీసులో కూర్చుని అంకెలు రాసుకుంటారు. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతమేనని.. దేశం కంటే ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందంటూ తన డబ్బా తానే మోగించడం మొద లుపెడతారు. ఫ్యాబ్రికేటెడ్ (మోసపూరిత) అంకెలతో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కనిపిస్తూనే ఉంది. అసమర్థ ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా?రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటులో ఉంది అంటే.. రాష్ట్రంలోని అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయని అర్థం. వ్యవసాయం, తయారీ, సేవలు రంగాలు వేగంగా పరిగెడుతున్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఆ లెక్కలు నిజమే అయితే.. జీఎస్డీపీ ఆ విధంగా పెరిగి ఉంటే అది ప్రజల తలసరి ఆదాయంలో కూడా ప్రతిబింబించాలి కదా? అదే రీతిలో తలసరి ఆదాయం పెరిగి ఉండాలి కదా? తలసరి ఆదాయం నిజంగానే పెరిగి ఉంటే.. తద్వారా ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా పెరిగి ఉండాలి కదా? తద్వారా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయాలు కూడా పెరిగి ఉండాలి కదా? ఇదంతా ఒక సైకిల్! మరి వాస్తవంగా ఇది జరిగిందా..? అని ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి సంవత్సరం 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు. కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.94,937 కోట్లు మాత్రమే. ఆశ్చర్యం ఏమిటంటే.. 2023–24 వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.93,084 కోట్లతో పోలిస్తే.. పెరుగుదల కేవలం 1.99 శాతం మాత్రమే. అంటే బడ్జెట్లో చంద్రబాబు లెక్కలేసిన రూ.1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక 2025–26లో కూడా వాస్తవంగా రూ.94,937 కోట్లు వచ్చినట్లు కనిపిస్తుంటే.. బడ్జెట్ గారడీతో రాష్ట్ర సొంత ఆదాయాలు రూ.1,27,703 కోట్లుగా చంద్రబాబు చూపించారు. కానీ.. పది నెలలకు సంబంధించి కాగ్ విడుదల చేసిన డేటా చూస్తే 2025–26లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.75,964 కోట్లు మాత్రమే వచ్చింది. అదే అంతకుముందు పది నెలల కాలానికి (2024–25) వచ్చింది రూ.72,864 కోట్లు. అంటే.. పెరుగుదల కేవలం 4.25 శాతం మాత్రమే. పది నెలల కాలానికి రూ.75,964 కోట్ల ఆదాయం వస్తే.. బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఏకంగా రూ.1,27,703 కోట్లు వస్తుందని చూపించారు. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా వాస్తవాలు చెప్పకుండా.. ఇంకా మోసం చేస్తూ దాన్ని రూ.1,12,349 కోట్లుగా సవరించారు. అంటే.. మిగిలిన రెండు నెలల కాలంలో ఏకంగా రూ.36,385 కోట్ల మేర ఆదాయాలు వస్తాయని గారడీ లెక్కలు చూపించారు. 2025–26లో రాష్ట సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున రూ.7,596 కోట్లే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద రూ.95,000 కోట్లు వస్తే గగనం. కానీ ఈ పెద్ద మనిషి మళ్లీ 2026–27లో రాష్ట్ర సొంత ఆదాయాలు ఏకంగా రూ.1,37,320 కోట్లు వస్తాయని చూపిస్తున్నారు. అంటే రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు 45 శాతం పెరుగుదల!! అది సాధ్యమేనా? గత బడ్జెట్లో కూడా ఇలాగే చూపిస్తే వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతమే. దేశంలో చిట్ట చివరి నుంచి రెండో స్థానం..నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) మొదటి తొమ్మిది నెలలు రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాలను మా ప్రభుత్వ హయాంలో 2023–24 తొమ్మిది నెలల ఆదాయాలతో పోలిస్తే సగటు వృద్ధిరేటు 1.97 శాతం మాత్రమే. ఈమధ్య కాగ్ 23 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో సొంత పన్నుల ఆదాయాల వృద్ధిని పరిశీలిస్తే సగటున 1.97 శాతంతో మన రాష్ట్రం దేశంలో 23 రాష్ట్రాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. బాబు అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా? -
దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు
-
Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్
-
YS Jagan: ఒక్క 2025 లోనే 2685 మంది రైతులు ఆత్మహత్య
-
50 ఏళ్లకే పెన్షన్.. అవ్వను పట్టుకోని ఫోటో దిగి..! జగన్ మాస్ ర్యాగింగ్
-
బాబు అప్పుల చిట్టా..! ఆధారాలతో బట్టబయలు చేసిన జగన్
-
పబ్లిసిటీ పీక్.. పెర్ఫామెన్స్ వీక్..! ఏపీ బడ్జెట్పై YS జగన్ రియాక్షన్
-
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు సర్కారు దగా... ఉప ప్రణాళిక నిధుల్లో 27 వేల కోట్ల రూపాయలు కోత
-
అవును.. అది అదానీ డేటా సెంటరే
సాక్షి, అమరావతి: గూగుల్ పేరుతో డేటా సెంటర్ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు సర్కారు చేసిన గిమ్మిక్కు అదే ప్రభుత్వం విడుదల చేసిన జీవో సాక్షిగా బట్టబయలైంది. చివరకు ప్రభుత్వమే దిగివచ్చి మొత్తం భూ కేటాయింపులను అదానీ ఇన్ఫ్రా (ఇండియా) పేరు మీదకు మార్చడమే కాకుండా, ఇకపై ఈ ప్రాజెక్టును అదాని ఇన్ఫ్రా (ఇండియా) లిమిటెడ్గా ప్రస్తావించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 480 ఎకరాలను ఇప్పుడు 601.4 ఎకరాలకు పెంచడమే కాకుండా, ఈ మొత్తం భూమిని అదాని ఇన్ఫ్రా పేరుపైకి బదలాయించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో అడవివరం–ముడసర్లలోవ వద్ద 120 ఎకరాలు కేటాయించగా, ఇప్పుడు దానిని 160 ఎకరాలకు పెంచారు. అదానీ ఇన్ఫ్రాకు 601.4 ఎకరాలు బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అలాగే తుర్లవాడ వద్ద 200 నుంచి 266.6 ఎకరాలకు, రాంబిల్లి వద్ద 160 నుంచి 174.80 ఎకరాలకు పెంచుతూ భూ కేటాయింపులు చేశారు. ఇందుకోసం అదానీ ఇన్ఫ్రా అడవివరం–ముడసర్లలోవ భూముల కోసం వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, తర్లవాడ భూముల కోసం వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, రాంబిల్లి భూముల కోసం వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశాక, వాటి పేరు మీద భూ కేటాయింపులు చేయనుంది. ఇలా మొత్తంగా 601.4 ఎకరాల భూమిని డేటా సెంటర్ కోసం అదానీ ఇన్ఫ్రాకు కేటాయించింది.వైఎస్ జగన్కు క్రెడిట్ దక్కకూడదని కుతంత్రం⇒ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 14న న్యూఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో ప్రభుత్వం అదానీ పేరును ప్రస్తావించలేదు. కానీ అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మాత్రం ఈ డేటా సెంటర్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.⇒ అలాగే భారతీ ఎయిర్టెల్ గ్రూపు కూడా ఈ డేటా సెంటర్లో తాము భాగస్వాములమంటూ ట్వీట్ చేసింది. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో కూడా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ, సీఎం చంద్రబాబు సమక్షంలోనే గూగుల్తో కలిసి 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో చంద్రబాబు క్రెడిట్ చోరీ అంతర్జాతీయ స్థాయిలో బయట పడింది.⇒ ఈ విషయమై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్లో విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో బయట పెట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని ఎత్తి చూపారు. ఇప్పుడు వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అంశం నిజమేనని ప్రభుత్వ జీవో సాక్షిగా వెల్లడైంది. తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి, ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్ఫ్రా పేరు మీదకు బదలాయించడమే ఇందుకు నిదర్శనం. ⇒ ఈ నేపథ్యంలో రూ.87,250 కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ను అదానీ ఇన్ఫ్రా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు భూ కేటాయింపులు పెంచి, ఆ మేరకు అదానీ ఇన్ఫ్రాకు కేటాయించినట్లు తెలిపింది. -
సబ్ ప్లాన్కు చిల్లు.. కోతల ‘ప్లాన్’
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను ఎగ్గొడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం నిలిపివేసిన చంద్రబాబు సర్కారు కనీసం ఉప ప్రణాళిక నిధులైనా వ్యయం చేయకుండా బడుగు, బలహీన వర్గాలను దారుణంగా వంచిస్తోంది. సబ్ ప్లాన్ నిధులను కాగితాలపై చూపిస్తూ.. ఖర్చు పెట్టకుండా మురగబెడుతోంది. సబ్ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు సర్కారు రెండేళ్లలో ఎగ్గొట్టిన మొత్తం ఏకంగా దాదాపు రూ.27,000 కోట్లు!! గత రెండు బడ్జెట్ల గణాంకాల సాక్షిగా చంద్రబాబు సర్కారే దీన్ని ఒప్పుకుంది! విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, వ్యవసాయం.. సంక్షేమం కోసం ఉప ప్రణాళిక నిధులను వ్యయం చేయాలి. విద్యార్ధులకు స్కాలర్షిప్లు ఉప ప్రణాళిక నుంచి అందించాలి. సంక్షేమానికి రూ.వేల కోట్లు కోత పడటంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. భారీ కేటాయింపులు చూపిస్తూ మోసం.. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉత్త కేటాయింపులు మినహా ఖర్చు చేయలేదని చంద్రబాబు ప్రభుత్వమే సవరించిన బడ్జెట్ అంచనాల్లో వెల్లడించింది. కేవలం బడ్జెట్లో భారీ కేటాయింపులు చూపించి మోసం చేయడం మినహా వాస్తవంగా ఖర్చు చేయడం లేదని బహిర్గతమైంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల (2024–25, 2025–26) బడ్జెట్ల కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికలకు ఏకంగా రూ.9,591 కోట్లు కోత విధించింది. ఇక ఎస్టీ సబ్ప్లాన్ కేటాయింపుల్లో ఏకంగా రూ.3,695.23 కోట్లు కోత పెట్టింది. బీసీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ల కేటాయింపుల్లో ఏకంగా రూ.12,426 కోట్లు కోత విధించింది. మైనారిటీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ కేటాయింపుల్లో రూ.1,132 కోట్ల మేర కోత విధించింది. ఆగిపోతున్న పిల్లల చదువులు...! చంద్రబాబు సర్కారు ప్రచారం కోసం ఎక్కువ మొత్తంలో సబ్ప్లాన్కు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్లలో చూపిస్తోంది. కేటాయింపుల మేరకు ఆయా వర్గాల సంక్షేమం, ఆర్థికాకాభివృద్ధికి చేయూతనివ్వకుండా మోసగిస్తోంది. విద్యార్ధులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఉప ప్రణాళిక నుంచే అందించాలి. వీటిని ఎగ్గొట్టడంతో పేదింటి పిల్లలు చదువులు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.4,642 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో కేవలం రూ.545.51 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం పట్ల చంద్రబాబు సర్కారు ఎంత చిన్న చూపు చూస్తోందో స్పష్టం అవుతోంది. -
మళ్లీ చెప్తున్నా తగ్గేదేలే. అనితకు కౌంటర్ Ambati
-
Varudu: దేవుడిపై నింద వేశారు.. కర్మ ఎవరినీ వదలదు..
-
టీచర్ల గర్జనతో దద్దరిల్లిన బెజవాడ
-
ఇకనైనా కళ్లు తెరువు..! చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
రగిలిన గుండెల ‘రణభేరి’
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తే సర్కారు పతనం తప్పదని ఉపాధ్యాయులు హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఐఆర్ 29 శాతం ప్రకటించాలని, నాలుగు డీఏలు, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం చలో విజయవాడ చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ధర్నా చౌక్లో రణభేరి సభ నిర్వహించారు.ఫలితంగా ధర్నా చౌక్ ఎరుపెక్కింది. రణన్నినాదాలతో దద్దరిల్లింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. రణభేరిలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, బకాయిలు చెల్లిస్తామని హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ, ఐఆర్, డీఏల కోసం సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇచ్చామని, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బడ్జెట్లోనూ పీఆర్సీ, డీఏ బకాయిలపై కనీసం ప్రస్తావించలేదని మండిపడ్డారు. ఇప్పటికైðనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాలని, లేకుంటే చలో సెక్రటేరియేట్ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తే తట్టుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.శాసనమండలి, శాసన సభలలో టీటీడీ లడ్డూ నెయ్యిపై ప్రతిపక్షంపై అవాకులుచెవాకులు పేలడం తప్పితే ప్రజల, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై సర్కారు చర్చించడం లేదని విమర్శించారు. పీఆర్సీ జాప్యం జరిగే కాలానికి ఐఆర్ 29 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్, ఏపీజేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పాపం బాబుదే
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ వ్యవహారంతో మంగళవారం శాసన మండలి అట్టుడికింది. హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలు కేఆర్జే భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. ఈ విషయంపై చర్చకు అనుమతించాల్సిందేనని, తద్వారా హెరిటేజ్తో ఇందాపూర్ డెయిరీ బంధం బయట పెట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినదించారు. అయినా చైర్మన్ చర్చకు అనుమతించక పోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీటీడీలో హెరిటేజ్ పాత్రపై చర్చ జరపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హెరిటేజ్ నెయ్యి, పాలు, పెరుగు అన్నీ కల్తీ కల్తీ.. చంద్రబాబు పాలనా కల్తీ కల్తీ.. గోవిందా.. గోవిందా..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నప్పటికీ, చైర్మన్ మరో వైపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ.. హెరిటేజ్ వ్యవహారం బయట పడుతుందని సీఎం చంద్రబాబు తన మంత్రులను పంపి డ్రామా ఆడిస్తున్నారని మండిపడ్డారు. ధర పెంచుకునేందుకే దుష్ప్రచారం ‘ఎంతో కాలంగా టీటీడీకి ఇందాపూర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అవుతోంది. ఇది హెరిటేజ్ అనుబంధ సంస్థే. మొన్నటి వరకు రూ.300కు అటూ ఇటుగా నెయ్యి సరఫరా చేసింది. అయితే చంద్రబాబు ఇది వరకు ముఖ్యమంత్రి కాక ముందు, ముఖ్యమంత్రి ఆయ్యాక.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో టీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్దిష్ట విధానం కొనసాగింది. టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థలకు టెండర్ ఖరారు చేస్తారు. ఇవే సంస్థలు రాష్ట్రంలో పలు ఆలయాలకు కూడా నెయ్యిని సరఫరా చేశాయి. అక్రిడేటెడ్ ల్యాబ్లో సర్టిఫికెట్ పొందాకే టీటీడీకి నెయ్యిని అనుమతిస్తారు. ఇక్కడ మళ్లీ టీటీడీ సొంతంగా ఆ నెయ్యిని పరీక్షిస్తుంది. నాణ్యత లేకపోతే ఆ ట్యాంకర్లను వెనక్కు పంపుతారు. అలా గత చంద్రబాబు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పలుమార్లు వెనక్కు పంపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే అదనుగా తన కుటుంబ సంస్థ హెరిటేజ్ నుంచి ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి ధరను ఏకంగా రెట్టింపు చేయాలని కుట్ర పన్నారు. తద్వారా తన హెరిటేజ్కు, తన సంబందీకులకు, తన అనుబంధ సంస్థలకు లబ్ధి చేకూర్చాలనుకున్నారు. ఇందు కోసం ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పైనే బరితెగించి రాజకీయం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, పందికొవ్వు, బాత్రూమ్లు క్లీన్ చేసే రసాయనాలు వాడారని ఉద్దేశ పూర్వకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరకే కొనుగోలు చేయడం వల్ల నాణ్యత లేదని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు, ఎల్లో మీడియా ఈ విషయమై భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించారు. బండారం బట్టబయలు శ్రీవారి లడ్డూపై చంద్రబాబు అండ్ కో చేయాల్సినంత దుష్ప్రచారం చేసేసి.. శ్రీవారి డబ్బులు దోచేసేందుకు బరితెగించారు. లడ్డూ సరఫరా ధరను ఏకంగా రెట్టింపు కిలో రూ.600కు పైగా పెంచేశారు. తద్వారా తన కుటుంబం సంస్థ, తన సంబంధీకులు, అనుబంధ కంపెనీలకు లబ్ధి చేకూర్చారు. ఆ లడ్డూ కల్తీ అనే ముద్ర వేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసి.. తను అనుకున్న రీతిలో స్కెచ్ మేరకు ధర పెంచుకోగలిగారు. చంద్రబాబు అంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారనే కోణంలో పలు సంస్థలు, మీడియా, మేధావి వర్గాలు కాస్తా లోతుగా శోధించడంతో నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సంబంధించి పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్దేనని స్పష్టమైంది. దీంతో తన కుట్ర బెడిసి కొట్టడంతో కొద్ది రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ విషయంపై మండలిలో చర్చ జరగాలని, హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ సంబంధాల గురించి స్పష్టం చేయాలని మంగళవారం మండలిలో వైఎస్సార్సీపీ పట్టుపట్టింది. ఈ విషయమై చర్చ జరిగితే ప్రజల్లో మరింత చులకన అవుతామని చంద్రబాబు హుటాహుటిన కొందరు మంత్రులను మండలికి పంపారు. ఈ నేపథ్యంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కె.అచ్చెన్నాయుడు ప్రతి దశలోనూ వైఎస్సార్సీపీ సభ్యులకు అడ్డు తగిలారు. ఇది డ్రామా కాదా? సభ్యుల వాదప్రతివాదనల నేపథ్యంలో చైర్మన్ కొద్ది సేపు సభను వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడటానికి చైర్మన్ మోషేన్రాజు అవకాశం ఇచ్చారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నాకే ఆయనతో మాట్లాడించాలని అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పొడియం వద్ద నుంచి బొత్స వెనక్కు వెళ్లి నిల్చొన్నారు. ఆ తర్వాత బొత్స మాట్లాడే ప్రయత్నం చేయగా.. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. తద్వారా సభలో గందరగోళం నెలకొనేలా చేశారు. వైఎస్సార్సీపీ సభ్యులకు మాట్లాడే నైతిక హక్కు లేదంటూ అడ్డుకున్నారు. మంత్రుల తీరుపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. తాము ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమేనని, హెరిటేజ్ వ్యవహారంపై చర్చ జరిగి తీరాల్సిందేనని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ కలుగ జేసుకుంటూ.. ‘హెరిటేజ్కు, తిరుపతి లడ్డూకు సంబంధం ఉందని ఒక్క ఆధారం తెమ్మనండి.. అయినా తిరుమల లడ్డూపై ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు’ అని ఎదురు దాడి చేయబోగా.. ‘ఆధారాలు లేకుండా మాట్లాడిందెవరు? ఆధారాలు బయటకు రాకుండా ఇప్పుడు డ్రామాలాడుతోందెవరు?’ అని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని ధనార్జన ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అసలు ప్రభుత్వానికి సభ జరిపే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశి్నంచారు. సీఎం చంద్రబాబు ధనార్జన కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడైన వేంకటేశ్వరస్వామి లడ్డూపై దుష్ప్రచారం చేశారన్నారు. హెరిటేజ్ సంస్థకు చెందిన కల్తీ నెయ్యిని ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేశారని చెప్పారు. హెరిటేజ్–ఇందాపూర్ బంధంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, హెరిటేజ్– ఇందాపూర్ డెయిరీ బంధంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో శాసన మండలి చరిత్రలో అరుదైన రికార్డు నెలకొంది. ఎప్పుడులేని విధంగా సభలో తొలిసారి మైక్, సౌండ్ సిస్టమ్ పని చేయలేదు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల మధ్య కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే సభ జరిగింది. గందరగోళం వల్ల నాలుగుసార్లు సభ వాయిదా పడింది. -
చంద్రబాబూ ఇకనైనా మేలుకో! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మదనపల్లె పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి, ఆపై హత్యచేసి, నీటి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయారని నిలదీశారు. ఇకనైనా మేలుకుని తక్షణమే శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించి.. వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. ‘నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలిక, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురై, ఆపై హత్యకు గురయ్యారు. ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై ఎన్నో దారుణమైన ఘటనలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనలను తేలిగ్గా తీసుకుందనేది వాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో హడావుడి ప్రకటనలు చేయడం, అనంతరం ఆ విషయాన్ని వదిలేయడం సహజంగా మారిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నాలు చేయించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. శాంతిభద్రతలపై హోం మంత్రి బాధ్యత వహించరని, చంద్రబాబు కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ.. అందరి శాఖల్లో వేలుపెడతారని విమర్శించారు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరన్నారు. ‘ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారి పనిగా మారిపోయింది. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘చంద్రబాబు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్తో, రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్స్టేషన్కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ టీడీపీ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేస్తే కేసు కట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారని వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.Shame on you, @ncbn garu!మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా. బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా… pic.twitter.com/QcR3jyWo0I— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
పులిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య పెట్టారు జాగ్రత్త
-
బిల్గేట్స్ ఏపీ పర్యటన.. ఏపి కి లాభం ఏంటి?
-
యూరియా..‘ప్రైవేట్’ దయ!
సాక్షి, అమరావతి: ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి. వచ్చిన యూరియా వచ్చినట్లుగా దొడ్డి దారిన మిక్సింగ్ ప్లాంట్లకు తరలిపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా రూ.350 నుంచి రూ.600 చొప్పున కొనాల్సిన అగత్యం ఏర్పడింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండుసార్లు పెరగడం రైతులకు పెనుభారంగా మారింది. ఇప్పటికే కూలీల కొరతతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.30 వేలు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే విదిల్చింది. ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టింది. కౌలు రైతులకైతే రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. సున్నా వడ్డీకి చాప చుట్టేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో బీమా పరిహారానికి రైతులు దూరమయ్యారు. ఇక 20 నెలలుగా ధాన్యం సహా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరలు దక్కడం లేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని ఎత్తివేశారు. సబ్సిడీ విత్తనాల సరఫరాలో అడ్డగోలుగా కోత పెట్టారు. కనీసం యూరియా కూడా అదునుకు అందించకుండా రైతులు అధికంగా వినియోగిస్తున్నారంటూ తమ వైఫల్యాన్ని వారిపై గెంటేస్తున్నారు. పక్కదారి.. రబీ సీజన్లో వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. ఒకవైపు యూరియా కోసం రైతులు అల్లాడుతుండగా.. మరోవైపు లక్షల టన్నుల విక్రయాలు పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఆ యూరియా అంతా రైతుల పొలాలకు బదులుగా ప్రైవేట్ వ్యాపారుల ఆధీనంలోని బ్లాక్ మార్కెట్కు చేరిపోయినట్లు స్పష్టమవుతోంది. సీజన్లో 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ఇప్పటికే 6.27 లక్షల టన్నులు విక్రయించినట్లు ప్రభుత్వం చెబుతోంది.కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఒక్కకట్ట కోసం పడరాని పాట్లు పడుతుండటం గమనార్హం. సీజన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ యూరియా దొరకని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నంద్యాల జిల్లాలో బయట మార్కెట్లో బస్తా రూ.500 పెట్టి కొన్నామని జొన్న, మొక్క జొన్న రైతులు చెబుతుండగా.. నెల్లూరు జిల్లాలో రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించినట్లు వరి సాగుదారులు వాపోతున్నారు. సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా టీడీపీ నేతల సిఫారసు ఉంటేగానీ కరుణించడం లేదు. విత్తగానే లక్షల టన్నుల విక్రయాలా? రాష్ట్రంలో లక్షలాది టన్నుల యూరియా దారి మళ్లిపోయిందని సాగు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నెలలవారీగా సాగు, అమ్మకాలు పరిశీలిస్తే ఏ స్థాయిలో యూరియా పక్కదారి పట్టిందో వెల్లడవుతుంది. రబీ సీజన్ ఏటా అక్టోబర్లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంటలకు ఆరంభంలోనే యూరియా పెద్దగా అవసరం ఉండదు. పంటలు వేయడమే ఆలస్యం.. లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగిపోవడం దారి మళ్లించారనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ⇒ అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. కేవలం 22 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 6,500 ఎకరాల్లో జొన్న సాగైంది. ఒక్క ఎకరాలో కూడా మొక్కజొన్న సాగవలేదు. అయినా సరే అక్టోబర్లో ఏకంగా 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ⇒ నవంబర్లో 7.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 1.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. 82 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 57 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. నవంబర్లో మరో 1.14 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ⇒ డిసెంబర్లో మరో 21.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 6.07 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. 4.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 68 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. కానీ డిసెంబర్లో ఏకంగా 1.67 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ⇒ జనవరిలో 15.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా... 8.7 లక్షల ఎకరాల్లో వరి, 2.07 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 55 వేల ఎకరాల్లో జొన్న పంటలు సాగయ్యాయి. జనవరిలో ఏకంగా 2.24 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరిలో మరో 1.77 లక్షల టన్నులు, మార్చిలో 1.28 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిక్సింగ్ ప్లాంట్లకు మళ్లుతున్న యూరియాయూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేట్ వ్యాపారులకే కేటాయిస్తున్నారు. పట్టుమని పది శాతం ఆర్ఎస్కేలకు కూడా సరఫరా చేయడం లేదు. దీనివల్ల యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. పెద్ద ఎత్తున యూరియా దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో స్వయంగా పేర్కొనడం గమనార్హం. సారా, బీర్ల తయారీతో పాటు రంగుల కంపెనీలు, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూతపడిన మిక్సింగ్ ప్లాంట్లు ఇటీవల పెద్దఎత్తున తెరుచుకుంటున్నాయి. విజిలెన్స్ దాడులు మొక్కుబడిగా మారాయి. ‘కాంప్లెక్స్’ ధరల మోత ఒకవైపు యూరియా దొరకక అల్లాడుతుండగా మరోవైపు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల మోత మోగుతోంది. సీజన్ ప్రారంభంలోనే బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచేసిన కంపెనీలు తాజాగా మరోసారి రూ.50 నుంచి రూ.250 మేర పెంచేశాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే ప్రత్యేక ఎరువుల (వాటర్ సాల్యుబల్ ఫెర్టిలైజర్స్) ధరలను సీజన్ ఆరంభంలోనే 25–50 శాతం మేర పెంచాయి. ఎకరాకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అదనంగా భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీలు ఖర్చులు, యంత్రాల అద్దెలన్నీ కలిపితే వరికి రూ.6 వేలు, మొక్కజొన్నకు రూ.8 వేల వరకు ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. అదనంగా రూ.13 వేల భారంనంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన ఎర్రం కృష్ణారెడ్డి రబీలో 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎన్నిసార్లు తిరిగినా సొసైటీలో, రైతు సేవా కేంద్రాల్లో ఒక్క కట్ట కూడా యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ డీలర్ల వద్ద కొన్నాడు. ఎమ్మార్పీ ప్రకారం బస్తా యూరియా ధర రూ.266 కాగా గత్యంతరం లేని పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి రూ.495 చొప్పున 58 బస్తాలు కొనుగోలు చేశాడు. దీంతో రూ.13 వేలకు పైగా అదనంగా భారం పడిందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు. యూరియాతో పాటు బలవంతంగా అంటగట్టిన కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే కావాల్సినంత యూరియా ఇచ్చేవారని, ఐదేళ్లలో ఏ రోజూ ఎరువుల కోసం ఊరు దాటాల్సిన పరిస్థితి రాలేదని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఖరీఫ్లో మొదలైన అగచాట్లు రబీలోనూ వెంటాడుతున్నాయని, ఇలాగైతే వ్యవసాయం చేసేదెలా? అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.ఎన్నిసార్లు వెళ్లినా ‘నో స్టాక్’ రబీలో 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి వ్యవసాయం భారంగా మారింది. సరిపడా యూరియా లభ్యం కావడం లేదు. రైతు సేవా కేంద్రాలలో అధికార పార్టీకి చెందిన వారికే అమ్ముతున్నారు. ప్రస్తుతం వరి పంటకు మూడో కోటా యూరియా వేయాలి. ఎన్నిసార్లు వెళ్లినా నో స్టాక్ అంటున్నారు. చేసేది లేక బహిరంగ మార్కెట్లో బస్తా రూ.400 పెట్టి కొన్నా. కాంప్లెక్స్ ఎరువులు 20 నుంచి 30 శాతం ధరలు పెంచేశారు. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. – ఏలూరు శ్రీధర్ రెడ్డి మనుబోలు నెల్లూరు జిల్లా, రూ.3వేలకుపైగా అదనపు భారం ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇప్పటి వరకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం పంట కంకి దశలో ఉంది. మంచి దిగుబడి రావాలంటే యూరియా చాలా అవసరం. రైతు సేవా కేంద్రం సిబ్బంది స్టాక్ లేదు అంటున్నారు. బయట బస్తా రూ.350–400 పెట్టి దాదాపు 25 బస్తాల యూరియా కొన్నా. రూ.3 వేలకు పైగా అదనపు భారం పడింది. ఖరీఫ్లోనూ ఇలాగే ఇబ్బందిపడ్డాం. – జి.డి.వీరదాస్, బ్రహ్మసముద్రం, అనంతపురం జిల్లారాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకనే..అదునుకు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా,. గోదావరి డెల్టాలో ధాన్యం, మొక్కజొన్న, మినుము తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతో అవసరం. ఎనీ్టఆర్, నెల్లూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలలో యూరియా కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది.. అదునుకు యూరియా దొరక్క రబీలో రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. రూ.267కు లభించాల్సిన బస్తా బ్లాకులో రూ.400 నుంచి రూ.600కు కొనుక్కోవల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, పెరిగిన కూలీ ఖర్చులు, యంత్రాల అద్దెల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. పంటలను మద్దతు ధరకు కొనే వారు లేక రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతు సంక్షేమం పేరిట ప్రకటనలకు పరిమితమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
వరుసగా మూడో బడ్జెట్లోనూ అన్నదాతకు మొండిచెయ్యే
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది. ఉచిత పంటల బీమా అటకెక్కింది.. ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు.. సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ ఈ మూడో బడ్జెట్లోనూ రైతుకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో గత 20 నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ రంగంలో తగిన కేటాయింపులు జరపడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అరకొర కేటాయింపులతో రైతులకు పంగనామాలు పెట్టింది. 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.12,152 కోట్లు, అనుబంధ శాఖలకు రూ.3,589 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపారు. అంటే మొత్తం బడ్జెట్లో 4.74 శాతానికి మించలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా గతేడాది 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309 కోట్ల పెట్టుబడి సాయం అందజేశామని.. జోన్, నాన్ జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్పు కొచ్చారు. మరో వైపు కొత్తగా రూ.లక్ష కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్గా తీర్చి దిద్దుతున్నామని, ఇందులో రూ.30 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెబుతూ.. ఉద్యాన శాఖకు మాత్రం రూ.1,123.86 కోట్లకు మించి కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురి చేస్తోంది.పంటల బీమాకు మంగళం పాడేందుకేఐదేళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించేసిన చంద్రబాబు ప్రభుత్వం.. స్వచ్ఛంద నమోదు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2024–25 బడ్జెట్లో పైసా కేటాయించలేదు. 2025–26లో రూ.1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. రెండేళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.2,419.44 కోట్ల ప్రీమియం ఎగ్గొట్టడంతో ప్రస్తుత రబీ సీజన్ నుంచి కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు రావాల్సిన రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అందకుండా పోయింది. దీంతో ఈ ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు ఆశపడ్డారు. కనీసం ఈ ప్రీమియం బకాయిలతో పాటు రానున్న వ్యవసాయ సీజన్కు తగిన నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పథకానికి కేటాయింపులు గతేడాదితో పోలిస్తే నాలుగో వంతుకు తగ్గించి, రూ.250 కోట్లతో సరిపెట్టారు. గతేడాది అరటి, మిరప, పొగాకు బొప్పాయి, మామిడి, చీనీ, టమాట, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదు. అయినప్పటికీ మార్కెట్లో జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకున్న దాఖలాలు లేవు.ఈ హామీలన్నీ అటకెక్కినట్టేనా?⇒ రాయితీపై సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు మాటేంటి? ⇒ గుర్తింపు కార్డులు అందజేసిన కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారు? ⇒ రైతు కూలీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు.. తద్వారా వారికి రాయితీలు, సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారు? ⇒ దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్టును పటిష్టంగా ఎప్పుడు అమలు చేస్తారు? ⇒ పాడి రైతులకు పశుగ్రాసం సాగు కోసం బంజరు భూములు కేటాయింపు ఎంత వరకొచ్చింది? ⇒ పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఏమయ్యాయి? ⇒ పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారు? ⇒ ఆక్వా రైతులకు జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా సంగతేంటి? ⇒ వీటిలో ఏ ఒక్క హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లేనా?‘ధరల స్థిరీకరణ నిధి కింద గతేడాది రూ.300 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది దాన్ని రూ.500 కోట్లకు పెంచాం’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మరోవైపు నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేశారు. సబ్సిడీ విత్తనానికి కోత పెట్టారు. గతేడాది రూ.182 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.240 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చింది. వాస్తవానికి మార్కెట్లో విత్తన ధరలు భారీగా పెరిగాయి. ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ పథకం కింద పైసా చెల్లించలేదు. ఈ ఏడాది రూ.250 కోట్లు కేటాయించడం పట్ల రైతులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం రైతులు ఏవిధంగా ఇబ్బందుల పాలయ్యారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. బఫర్ స్టాక్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం కేవలం రూ.40 కోట్లకు పరిమితం చేసింది. 20 నెలల్లో ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకు రూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలుండగా, ఆ ఊసెత్తకుండా రూ.310 కోట్ల పెట్టుబడి రాయితీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్య శాఖల కేటాయింపులు పూర్తిగా సిబ్బంది జీత భత్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సరిపడా తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని ప్రకటించలేదు. ఒక్క రూపాయి అదనంగా కేటాయింపులు జరపలేదు. -
బలవన్మరణాలకు పాల్పడుతున్నా పట్టదా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పనిభారం పెంచేసి మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నిరసన గళం వినిపించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. కరప, ఉప్పాడకొత్తపల్లి, తుని రూరల్, నిడదవోలు తదితర మండలాల్లో ధర్నాలు చేపట్టారు.కొన్ని చోట్ల భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలతో ధర్నాలు చేశారు. సర్వీసు రూల్స్కు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు పనులు అప్పగించి తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖ పరిధిలో పనిచేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్లు ఇలా అందరినీ డీడీవో పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు పరిష్కరించకుంటే మార్చి1 నుంచి పెన్డౌన్ చేపడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలియజేసినా న్యాయం చేయకపోవడంతోనే రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు ఈ నెల 12న వర్క్ టు రూల్ అమలు చేస్తుంటే, కొంతమంది అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. -
Venkatarami: ఇలాంటి చెత్త బడ్జెట్ ఎప్పుడూ చూడలేదు ప్రజలకు ఎందుకూ పనికిరాదు
-
Surya Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలి..
-
ఒక్క అమరావతికే 6000 కోట్లు.. కొంచమైనా సిగ్గు ఉందా..
-
సన్నిధి గొల్ల కుటుంబానికి కూటమి నేతల వేధింపులు..
-
బాండ్లు పంచి బాబు బురిడీ
-
శివ.. శివా! శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతి..
-
కమీషన్ ఇవ్వకపోతే.. మీ బియ్యం ఉడకవ్!
సాక్షి టాస్క్ఫోర్స్: రైస్ మిల్లర్లకు ఊహించని రీతిలో కష్టం వచ్చి పడింది. తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వంలో కీలక మంత్రులు ఇద్దరు ఫిక్స్ చేసేశారు. చెప్పినట్లు చేయాల్సిందేనని, లేదంటే తిప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేశారు. ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగింది అడిగినట్లు ముట్టజెప్పుతున్నారు. సీజనల్గా రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపి (సీఎంఆర్– కస్టమ్ మిల్లెడ్ రైస్), బియ్యంగా మార్చి తీసుకుని.. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు క్వింటాకు రూ.16 చొప్పున మామూళ్లు ఇచ్చేలా రేట్ ఫిక్స్ చేసింది. గతేడాది బిల్లులు మంజూరు కోసం ముడుపులు మెక్కిన అమాత్యుడు ఈసారి మరో అడుగు ముందుకేసి సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లపై పడి కోట్లు దండుకోవడానికి బరితెగించారు. కేబినెట్లో మరో కీలక మంత్రి కూడా ఇతనితో జత కలిశారు. ఇద్దరూ కూడబలుక్కుని.. కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. ఈ దందాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2,280 మిల్లులపై ఒత్తిడి ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఆర్) సేకరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమీషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాతి ఏడాది ప్రాధాన్యతనిస్తూ కోటా పెంచుతుంటారు. ఈ కేటాయింపు ప్రక్రియ ఏ జిల్లాకు ఆ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేపడుతుంటుంది. మిల్లింగ్ చేసే ధాన్యం పరిమాణాన్ని బట్టి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. అనంతరం మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తారు. ఇలా సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీకి కేటాయిస్తుంది. ఈ మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, మిల్లర్ల మధ్య మూడు నెలల కాలానికి ఒప్పందం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,280 మిల్లుల్లో దాదాపు చిన్న తరహా మిల్లులన్నీ మూడు నెలలపాటు సీఎంఆర్పైనే నడుస్తున్నాయి. మిగిలిన తొమ్మిది నెలలు దాదాపు ఖాళీగానే ఉంటాయి. అదనపు ఆదాయం వస్తుందనుకుంటే.. గతేడాది కంటే ఈ ఏడాది 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించడంతో మిల్లర్లు అదనపు ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. సీఎంఆర్ అదనపు కోటాతో ఈ ఏడాది అదనంగా పని దొరుకుతుందని పడ్డ సంబరం కాస్తా ఒక మంత్రి దోపిడీ ప్లాన్తో తల్లకిందులైంది. సీఎంఆర్కు అనుమతి పొందిన మిల్లర్లు మంత్రికి ముడుపులు మూటగట్టి ఇవ్వాలని అసోసియేషన్ల ద్వారా ఆదేశాలు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. సీఎంఆర్ ద్వారా మిల్లింగ్ చేసే ప్రతి క్వింటా బియ్యానికి రూ.16 వంతున కమీషన్ను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరిస్తోన్న 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై రూ.80 కోట్లు ముడుపులు (కొందరికి మినహాయింపు ఇవ్వడం వల్ల.. లేదంటే మరింత పెరుగుతుంది) ముట్ట చెప్పేందుకు వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే 60–70 శాతం మిల్లుల నుంచి వసూలు చేసేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారు ఈ నెలాఖరు లోపు చెల్లించాలంటూ ఆయా జిల్లాల్లో అసోసియేషన్ల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ మంత్రి వియ్యంకుడా.. మజాకా! ⇒ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ అనుమతించిన మిల్లుల నుంచి ముడుపులు మెక్కడానికి స్కెచ్ వేసిన అమాత్యుడు.. తన దందా సవ్యంగా సాగేందుకు సహచర కీలక మంత్రిని కలుపుకున్నారు. ఈ కీలక మంత్రి వియ్యంకుడిది బియ్యం వ్యాపారంలో అందె వేసిన చెయ్యి. దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో అపార అనుభవం గడించారు. సొంతంగా మిల్లులు కూడా ఉన్నాయి. ఇతన్ని అడ్డుగా పెట్టుకుని కమీషన్ల దందా నడుపుతున్నారు. ⇒ ఈ క్రమంలో సదరు మంత్రి వియ్యంకుడి మిల్లుతో పాటు అతని సహచరుడైన మరో బడా ఎక్స్పోర్టర్ మిల్లులకు కమీషన్లో మినహాయింపు ఇవ్వడం అసోసియేషన్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వియ్యంకుడైన గోదావరి జిల్లాలకు చెందిన బడా ఎక్స్పోర్టర్కు, మరో బడా ఎక్స్పోర్టర్ తోడై కమీషన్ల బాగోతాన్ని చక్కబెడుతున్నారు. ఇందుకు కమీషన్లో మినహాయింపుతో పాటు తొలిసారి సీఎంఆర్ కోటా దక్కించుకున్నారు. ⇒ వాస్తవానికి మిల్లర్లకు జిల్లా స్థాయిలోనే మిల్లర్ల అసోసియేషన్ సీఎంఆర్ కోటా కేటాయిస్తుంటుంది. అటువంటిది అసోసియేషన్ ప్రమేయం లేకుండానే ఈ రెండు బడా రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు నేరుగా ఉన్నత స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి సీఎంఆర్ అనుమతి తెచ్చుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు నష్టపోయిన రైతుల నుంచి బస్తా ధాన్యం కొనుగోలు చేసిన చరిత్ర లేని ఈ కంపెనీలకు ప్రభుత్వం పెద్ద పీట వేయడం చర్చనీయాంశమైంది. ⇒ సీఎంఆర్కు ఏ జిల్లాలో పండించిన ధాన్యాన్ని ఆ జిల్లాలోనే అనుమతిస్తారు. కానీ మంత్రి వియ్యంకుడు కావడంతో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి పొరుగున కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేక అనుమతి ఇచ్చారని సమాచారం. మంత్రి వియ్యంకుడికి 65 వేల టన్నులు, మరో బడా రైస్ ఎక్స్పోర్టర్కు 25 వేల టన్నులు సీఎంఆర్కు అనుమతించారు. ఇది ఆ జిల్లా మొత్తం సీఎంఆర్లో మూడింట (మూడు లక్షల టన్నులు) ఒక వంతు కావడం గమనార్హం. సారూ.. ‘సీజ్ ద కమీషన్స్’ అనండి ఏడాది క్రితం పేదల బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి పోతున్నాయని ‘సీజ్ ద షిప్’ అంటూ హడావిడి చేసిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడేం చేస్తున్నారని ఈ సందర్భంగా మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ కోసం సేకరిస్తోన్న సీఎంఆర్లో ఇంతలా బరితెగించి కమీషన్లు వసూలు చేస్తుండటం మీ దృష్టికి రాలేదా అని నిలదీస్తున్నారు. ఈ విషయమై ఆయన స్పందించకపోతే, ఈ దందాలో ఆయనకూ వాటా ఉన్నట్లేనని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ‘సీజ్ ద కమీషన్స్’ అంటూ ఈ కమీషన్లకు బ్రేక్ వేయాలని కోరుతున్నారు.సీజన్ మొదట్లోనే స్కెచ్.. ఇప్పుడు అమలు⇒ సీఎంఆర్ విధానంలో అమాత్యునికి కమీషన్ విషయమై సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలో చర్చించారు. నాటి సమావేశంలో పలువురు ప్రతినిధులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయమై మిల్లర్లు రోడ్డెక్కితే అల్లరై బియ్యం సేకరణకు ఆదిలోనే ప్రతిబంధకం ఎదురవుతుందని అప్పట్లో మిన్నకుండిపోయారు. ⇒ సీఎంఆర్ కేటాయింపు ప్రకారం 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో కమీషన్ వసూలుకు ఇదే తరుణమని స్కెచ్ వేశారు. క్వింటాల్కు రూ.16 వంతున కమీషన్ చెల్లించాల్సిందేనంటూ అసోసియేషన్ ద్వారా మిల్లర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ⇒ సీఎంఆర్ చివర్లో ఉన్న తరుణంలో అడిగినంత కమీషన్ ఇచ్చుకోక తప్పని పరిస్థితుల్లో మిల్లర్లు వెనక్కు పోయేది ఉండదు. అదే ధైర్యంతో గత పక్షం రోజులుగా కమీషన్ల వసూళ్ల దందాను మరింత ముమ్మరం చేశారు. కమీషన్ ఇవ్వకుంటే సీఎంఆర్ బిల్లుల్లో కోతలు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. క్వింటాకు ప్రభుత్వం ఇచ్చేది రూ.10. సంచులు, నూకలు, తౌడు వంటి వాటిపై కొంత ఆదాయం వచ్చే మాట నిజమైనా, ఏకంగా రూ.16 కమీషన్ చెల్లించాలనడం భావ్యం కాదని మిల్లర్లు వాపోతున్నారు. ఇంత కమీషన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో తొమ్మిది నెలలు మూతేసుకుని కూర్చుంటున్న మిల్లులకు సీఎంఆర్తో మూడు నెలలు పని దొరుకుతుందనుకుంటుంటే మెడపై కత్తిపెట్టి కమీషన్ వసూలు చేయడం దారుణం అని, ఇదేం మంచి ప్రభుత్వం? అని మిల్లర్లు నిలదీస్తున్నారు. ⇒ కమీషన్ ఇచ్చుకోలేమని ఎదురు తిరుగుతున్న మిల్లర్లకు సీఎంఆర్ బిల్లులు ఎలా మంజూరు అవుతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా మంత్రుల కోసం కమీషన్లు వసూలు చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే 90 శాతం వసూళ్లు పూర్తయ్యాయని సమాచారం. ప్రభుత్వ ముఖ్య నేతలకు బాగా తెలిసిన వారికి కమీషన్లో కొంత మినహాయింపు ఇచి్చనట్లు తెలిసింది. -
ఆచరణ సాధ్యం కాని బడ్జెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై మేధావులు పెదవివిరుస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఈ బడ్జెట్ వల్ల ఆకాంక్షలు తప్ప ఆచరణ సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. ఆ కోవలోనే సీనియర్ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర బడ్జెట్పై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ.2.34 లక్షల కోట్లు అని ప్రభుత్వం అంచనా వేసింది గానీ, ఆ మేరకు కచ్చితంగా ఆదాయం రాదని ఆయన స్పష్టంచేశారు. 2025–26లో వచ్చింది రూ.1.96 లక్షల కోట్లు అయితే, అంతకుముందు ఏడాది కూడా రూ.1.67 లక్షల కోట్లే వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కేసుకున్నా రూ.2.15 లక్షల కోట్లకు మించదన్నారు. ఈ లెక్కన రూ.20 వేల కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే, దానిని కూడా ఆదాయంగా భావించి పథకాలు రూపొందించడం వల్ల వాటి అమలుపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పడం వల్ల బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఐవైఆర్ వివరించారు. మసిపూసి మారేడు..రెవెన్యూ లోటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఊహాజనితంగా మాట్లాడుతోందని ఐవైఆర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నాటికే రూ.60 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని తెలిపారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది మొత్తానికి గాను రూ.41 వేల కోట్ల దగ్గర రెవెన్యూ లోటును నియంత్రిస్తామని ప్రభుత్వం ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ లోటు ప్రభుత్వం చెబుతున్న దానికి రెట్టింపు అయ్యి రూ.80 వేల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్కు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని, లేదంటే బడ్జెట్కు ఉన్న విశ్వసనీయత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.మూలధన వ్యయం 2024–25లో రూ.16 వేల కోట్లు ఉంటే, 2025–26లో బడ్జెట్లో రూ.40 వేల కోట్లుగా చూపించి, సవరించిన పద్దుల్లో రూ.33 వేల కోట్లు ఉంటుందని చెప్పారన్నారు. అంచనాలకే బడ్జెట్ పరిమితమయ్యే అవకాశం ఉందా... ఆచరణ సాధ్యం కాదా... అంటే సాధ్యం కాదనే అనిపిస్తోందని ఐవైఆర్ తన విశ్లేషణలో స్పష్టంచేశారు. అప్పులు తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది? పెండింగ్ బిల్లులకు ఎంత వెళుతుందనేది చెప్పాలి. ఈ బడ్జెట్ను చూస్తే మసిపూసి మారేడు చేసినట్లుగా ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. -
లెక్కలకు రెక్కలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి పచ్చముఠాల దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఊహాజనిత లెక్కలతో వరుసగా మూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత రెండు బడ్జెట్లలోనూ అంచనాల మేరకు రాష్ట్ర పన్నుల ఆదాయం రాకపోవడంతో సవరించిన అంచనాల్లో భారీ కోతలు విధించడమే దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. తద్వారా బడ్జెట్ కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా కోతలు పెడుతోందని, ఇది అంకెల గారడీతో ప్రజలను మోసగించడమేనని తప్పుబడుతున్నారు.చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక నుంచి మద్యం వరకూ.. చివరకు ప్రకృతి సంపదను సైతం వదలకుండా విచ్చలవిడిగా సిలికా, క్వార్ట్జ్, లేటరైట్, గనుల దోపిడీకి తెర తీసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం అంతా టీడీపీ పెద్దల జేబుల్లోకి చేరిపోతోంది. సంపద సృష్టించకుండా... సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా.. అంతులేని అప్పులతో రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతున్నారు.హామీలు విస్మరించి.. పరిమాణం పెంచిచట్టసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ను అపహాస్యం చేస్తూ, వాస్తవాలకు దూరంగా, ఊహాజనిత గణాంకాలతో 2026–27 వార్షిక బడ్జెట్ను చంద్రబాబు సర్కారు రూపొందించింది. బడ్జెట్ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయకుండా ఆయా వర్గాలను వంచిస్తోంది. ఆదాయం, రాబడులు రావని తెలిసి కూడా ప్రజలను ఏమార్చేందుకు రూ.3,32,205 కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత రెండు బడ్జెట్లలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసినట్లుగానే వచ్చే ఆర్థికఏడాదిలో కూడా వంచించడమే లక్ష్యంగా ఊహాజనిత గణాంకాలతో బడ్జెట్ పరిమాణాన్ని భారీగా పెంచారని, ఈ బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించడం లేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఉత్త కేటాయింపులే.. అంతా కోతలే2024–25, 2025–26 బడ్జెట్ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. 2024–25లో రూ.2,94,427 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ రూ.19,820 కోట్ల మేర కోత విధించారు. చివరకు కోత విధించిన మేరకు కూడా బడ్జెట్ను అమలు చేయలేకపోయారు. వాస్తవ లెక్కల ప్రకారం 2024–25 బడ్జెట్ అంచనాల్లో రూ.22,141 కోట్ల మేర కోత పడింది. అంటే బడ్జెట్ రూ.2,72,286 కోట్లకే పరిమితమైంది. ఇక 2025–26లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది.తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ బడ్జెట్లో రూ.21,825 కోట్ల మేర కోత విధించింది. వాస్తవ లెక్కలు వెల్లడైతే ఎంత మేర కోత విధించారో స్పష్టం కానుంది. ఇదే రీతిలో ఈదఫా కూడా పేదలను మోసం చేయడానికి 2026–27 బడ్జెట్లో ఇళ్ల నిర్మాణాలకు రూ.6,357 కోట్ల కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాగితాలకే పరిమితమని, వాస్తవంగా వ్యయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గత రెండు బడ్జెట్లు నిరూపిస్తున్నాయి. పన్నుల ఆదాయం పతనం..రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం అంచనాల మేరకు లేదని తెలిసి కూడా వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ను ఊహాజనిత లెక్కలతో, భారీ పరిమాణంతో ప్రవేశపెట్టారని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,789 కోట్లు వస్తుందని అంచనా వేయగా వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.89,435 కోట్లు మాత్రమే. రూ.20,354 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడింది.2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,006 కోట్లు వస్తుందని బడ్జెట్ను ప్రవేశపెట్టగా సవరించిన అంచనాల్లో రూ.98,025 కోట్లుగా చూపించారు. అంటే రూ.10,981 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడుతుందని పేర్కొన్నారు. సొంత పన్ను ఆదాయం లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో సవరణల్లో తగ్గించారు. 2026–27 బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం ఏకంగా రూ.1,25,845 కోట్లు వస్తుందని చూపారు. 2025–26 సవరించిన అంచనాలను మించి ఏకంగా రూ.27,820 కోట్లు రాబడి వస్తుందని పేర్కొనడం గమనార్హం.కాగితాల్లోనే పేదల ఇళ్లు..పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు సర్కారు గత రెండు బడ్జెట్లలో ఎంత మోసం చేసిందో చెప్పేందుకు సవరించిన అంచనాలే నిదర్శనం. పేదల ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైనట్లు సవరించిన బడ్జెట్ అంచనాల్లో తేలింది. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్లో రూ.4,012 కోట్లు కేటాయించి చివరకు కేవలం రూ.1,611 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇక 2025–26 బడ్జెట్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ మేరకు కూడా వ్యయం చేయడం లేదు. -
బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
-
అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రయిట్ టాక్
-
కూటమి ప్రభుత్వానికి మోసపూరిత బడ్జెట్: మల్లాది విష్ణు
-
రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్ చంద్రబాబు మోసాలకు...
-
పర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్ ... ఏందయ్యా ఈ లెక్కలు..
-
బడ్జెట్ ప్రసంగంలో అసత్యాలు చెప్పారు: బుగ్గన
-
పన్నుల బాదుడు, అప్పుల పద్దు తప్ప సంపద సృష్టి, సూపర్ సిక్స్ అమలు జాడలేని ఏపీ బడ్జెట్
-
బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
-
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ మంటలు... విద్యార్థుల ఫీజుల కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
-
అన్నీ సమస్యేలే... చంద్రబాబుకు మరో షాక్.. రెచ్చిపోయిన కొలికపూడి
-
Maqbool : కూటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం
-
Audimulapu : ఆల్రెడీ ప్రాణ భిక్ష పెట్టాడు.. అయిన చంద్రబాబుకు సిగ్గు రాలేదు
-
సెంటిమెంట్తో ఆటలా చంద్రబాబు.. కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకున్నావు
-
Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు
-
రూ.306లకే నెయ్యిని చంద్రబాబు హయాంలో సరఫరా చేశారు
-
Chirla Jaggi: గుర్తుపెట్టుకోండి.. ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఉండవు..
-
Jakkampudi : చంద్రబాబుకు ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడు
-
మీరు పొలిమేరలు దాటే లోపే.. జడ శ్రవణ్ వార్నింగ్
-
శివ సన్నిధానంలో అపచారం.. బాబు ప్రభుత్వం వైఫల్యం
-
బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు.. అనిత నీకే చెప్తున్నా..
-
ఏపీఎస్ఆర్టీసీపై బాబు దొంగ దెబ్బ!
-
దివాలా అంచున ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన విజనరీ
-
సర్కారు శాడిజానికి 'పరాకాష్ట'
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు. బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్.. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు. సుప్రీం తీర్పులకు విరుద్ధంగా.. అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు. ఒకే కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లా..హైకోర్టు విస్మయం.. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు. -
బాకీల బాబు.. బడాయిల డాబు!
సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఇవ్వకుండా మోసం.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ కింద రూ.19,200 కోట్లు ఎగనామం.. తల్లికి వందనం కింద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగ్గొట్టి పిల్లలకు పంగనామాలు.. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు రూ.64,800 కోట్లు ఎగవేత.. అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ.16,747.52 కోట్లు బకాయిలు.. దీపం పథకంతో మహిళలకు రూ.4,700.96 కోట్లు ఎగవేత.. మహిళలు అందరికీ ఉచిత బస్సు కింద రూ.3,200 కోట్లు బాకీ.. సూపర్ సిక్స్ కింద రెండేళ్లలో రూ.1,42,897.12 కోట్లకుపైగా ఎగ్గొట్టి ప్రజలను సీఎం చంద్రబాబు మోసగించారు! ఆ మోసాలన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా.. సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేసినట్లు గవర్నర్తో సీఎం చంద్రబాబు అసత్యాలు చెప్పించారు. అలవోకగా, కళ్లార్పకుండా అసత్యాలను చెప్పే చంద్రబాబు.. ఉభయసభలనుఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలోనూ అవే అవాస్తవాలను వల్లె వేయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా 143 హామీలను సీఎం చంద్రబాబు ఇచ్చారు. వాటి అమలుకు తనదీ పూచీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు వాగ్దానం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్నీ రద్దు చేయబోమని.. వాటిని కొనసాగిసూ్తనే సూపర్ సిక్స్ సహా 143 హామీలనూ నెరవేరుస్తామని చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలంటే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్లో కేవలం రూ.17,179 కోట్లు మాత్రమే విదల్చడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా మిగలడంతో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇచ్చిన బాండ్లను పరిశీలించి 20 నెలల్లో తమ కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఎంత ఎగ్గొట్టిందో ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. సంపద సృష్టి లేదు.. ఆర్థిక విధ్వంసం!రుణ సేకరణ భారాన్ని తగ్గించడానికి.. రాష్ట్ర పునరుజ్జీవనానికి అవసరమైన మద్దతు పొందడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్తో చెప్పించారు. ఎన్నికలకు ముందు.. సంపద సృష్టించి, రుణ భారాన్ని తగ్గించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని సీఎం చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పులు చేశారు. రికార్డు స్థాయి అప్పులతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఏ ఒక్క పథకాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య.. రెండేళ్లపాటు కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులున్నా.. రూ.3,32,671 కోట్ల అప్పులలో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేస్తున్నారు.తప్పు చేసి నిందలా..2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 6 లక్షల ఎకరాలను అకారణంగా 22 ఏ జాబితాలో పెట్టారు. చుక్కల భూములు, అనాధీనం భూములు, షరతులు గల పట్టా భూములు లాంటివి అందులో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 22 ఏ జాబితాలో ఉన్న భూములను సుమోటో వెరిఫికేషన్ చేయించారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 60 వేల ఎకరాల అనాధీనం భూములు, 34 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, సుమారు 18 వేల ఎకరాల ఇతర భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించి ఊరట కల్పించారు. దీంతో ఆ భూములపై రైతులకు మళ్లీ హక్కులు వచ్చాయి. కానీ.. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ భూముల్లో చాలా వరకూ మళ్లీ 22 ఏ జాబితాలోకి నెట్టేశారు. వీటితోపాటు 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములు 13.59 లక్షల ఎకరాలను జగన్ ఫ్రీ హోల్డ్ చేస్తే.. వాటిని కూడా చంద్రబాబు 22 ఏ జాబితాలో పెట్టించేశారు. వాస్తవాలు ఇలా ఉండగా గత ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నిందలు వేయించారు. రాష్ట్రంలో 22 ఏ దుర్వినియోగం చేసింది చంద్రబాబు సర్కారేనని రైతులు స్పష్టం చేస్తున్నారు.పోలవరంలో బాబు చారిత్రక తప్పిదాలుగోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. 2016–18లో పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ను చంద్రబాబు పూర్తి చేశారు. 2017లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురై దెబ్బతింది.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ చారిత్రక తప్పిదాన్ని విదేశీ నిపుణుల కమిటీ ఎండగట్టింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది.. పోలవరాన్ని గాడిలో పెట్టి.. 2027 నాటికి పూర్తిచేసేందుకు మార్గం సుగమం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గవర్నర్తో చంద్రబాబు అభాండాలు వేయించారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా..2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టు సంస్థలతో కలిసి భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. ఈ కమీషన్ల బాగోతాన్ని కేంద్ర ఆదాయపు పన్నుల శాఖ ఎండగట్టింది. ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టారంటూ కాగ్ కడిగిపారేసింది. 2014–19 మధ్య తాను కట్టని రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసినట్లు.. ఇప్పుడు దాన్ని పునర్ నిర్మిస్తున్నట్లు గవర్నర్తో సీఎం చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేయించారు. రాజధాని పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రూ.47,387 కోట్లను అప్పుగా తెచ్చిన చంద్రబాబు.. నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగిస్తున్నారని కాంట్రాక్టర్లు ప్రస్తావిస్తున్నారు. భవనాలు చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తుండగా చంద్రబాబు సర్కారు దానికి మూడు రెట్లకుపైగా అధికంగా చెల్లించడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే రాజధాని నిర్మాణాల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందన్నది బహిర్గతమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విత్తనం నుంచి విక్రయాల దాకా అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలిచి వ్యవసాయాన్ని వైఎస్ జగన్ పండుగగా మార్చితే.. పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి, ఉచిత పంటల బీమాను రద్దు చేసి, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను నట్టేట ముంచింది చంద్రబాబేనని రైతన్నలు మండిపడుతున్నారు.క్రెడిట్ చోరీలో చంద్రబాబుకు సాటెవ్వరు..?వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు అవే అసత్యాలను గవర్నర్ నోటి వెంట చెప్పించారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ బాగోతాన్ని విశాఖ సీఐఐ సదస్సు వేదికగా గౌతమ్ అదానీ బట్టబయలు చేసినా.. ఆ సదస్సు ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయంటూ గవర్నర్తో చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేయించారు. అదానీ గ్రూప్ పేరును దాచిపెట్టి గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ చంద్రబాబు సర్కారు చేసుకున్న ప్రచారానికి తెర దించుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు సమక్షంలోనే సీఐఐ సమ్మిట్లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఇక వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన ఇంధన వనరులపై దృష్టిసారించడమే కాకుండా ఆ దిశగా పలు పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు వాటిని తన ఖాతాలో వేసుకుంటూ వైజాగ్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్న సంగతి విదితమే. గత ప్రభుత్వ హయాంలో 2023లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడుల తర్వాత అతిపెద్ద పెట్టుబడుల ఒప్పందంగా నిలిచిన ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,000 కోట్ల ఒప్పందాన్ని తిరిగి ఇప్పుడు కుదుర్చుకొని కొత్త ఒప్పందంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెన్యూ పవర్తో కుదిరిన రూ.97,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం, రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్తో ఇప్పుడు కొత్త పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలను అదుపు తప్పేలా చేసి విధ్వంస పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు.. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ నిర్మించి ప్రగతి దిశగా నడిపిస్తున్నట్లు గవర్నర్తో అవాస్తవాలను చెప్పించారంటూ సర్వత్రా మండిపడుతున్నారు.బాబు మోసాల ఖరీదు రూ.1,42,897.12 కోట్లు!⇒ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉండగా రెండేళ్లుగా హామీని అమలు చేయలేదు. ఒక్కో ఏడాది రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. భృతి కింద రెండేళ్లలో యువతకు చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయి పడ్డారు.⇒ పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.⇒ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. రెండేళ్లుగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు.⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు.⇒ 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వీరు 20 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. రెండేళ్లుగా పైసా ఇవ్వకుండా పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేరలేదు.⇒ తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లు తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు. -
AP: వీడియో వైరల్!! 104 వాహనాలను ధ్వంసం
-
మాజీ మంత్రి అంబటిపై ఆగని కూటమి కుట్రలు
సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.గతేడాది నవంబర్లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. -
అంతా డొల్ల బాబు ఒప్పందాల అసలు కథ
-
రాష్ట్రంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు
-
దేవుడితో పెట్టుకున్నోడెవడూ బతకడు చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త
-
శ్రీశైలంలో శివ భక్తులపై లాఠీచార్జ్ ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ ఆగ్రహం
-
మేడం గారి తొలి హామీ.. సంతకు వెళ్లింది..!
‘గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. జ్వరాల బారిన పడిన పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించేలా ఏఎన్ఎమ్లను నియమిస్తాం. నెలవారీగా వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తాం. అనారోగ్యంతో ఏ విద్యార్థి మరణానికి గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తొలి సంతకం చేస్తున్నాను’. – మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కరువైంది. వారికి చిన్నపాటి సమస్య వచ్చినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. దీంతో జ్వరం వచ్చినా, జలుబు చేసినా వారు మృత్యువుతో పోరాడుతూ విగతజీవులుగా మారుతున్న దుస్థితి గిరిజన ఆశ్రమ పాఠశాలు, కళాశాలల్లో కొనసాగుతోంది. ఏఎన్ఎమ్లను నియమిస్తాం.. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు/ కళాశాలల వసతి గృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా ‘ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తానంటూ’ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘ మొదటి సంతకం’ చేశారు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఆ సంతకం ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు సకాలంలో వైద్యసేవలు అందక ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరు మరణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గిరిజనులు వక్కానిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో కురుపాం నియోజకవర్గంలోని విద్యాలయాల్లో మృతిచెందిన విద్యార్థుల వివరాలు..గుమ్మలక్ష్మీపురం మండలంలో.. 2024 జూలై 21న వామాసీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మండంగి గౌతమ్(9) మలేరియాతో బాధపడుతూ మృతిచెందాడు.2024 అక్టోబర్ 2న పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి(13) రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధపడుతూ పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.2024 డిసెంబర్ 17న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పత్తిక దినే‹Ù(14) పచ్చకామర్లు, రక్తహీనత, కిడ్నీ సంబంధి వ్యాధులతో బాధపడుతూ మరణించాడు.2025 డిసెంబర్ 14న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న టి.అవిష్ అనారోగ్యంతో మృతిచెందాడు.2026 జనవరి 7న రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మక రూప శ్వాసతీసుకోవడం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందింది.కురుపాం మండలంలో...2024 నవంబర్ 6న కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల(బాలురు)లో నాలుగో తరగతి చదువుతున్న నిమ్మక నితిన్(9) అనారోగ్యం బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 2025 సెపె్టంబర్ 26న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి పచ్చకామెర్లతో బాధపడుతూ మృతి చెందింది. 2025 సెపె్టంబర్ 30న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యారి్థని తోయక కల్పన పచ్చకామర్లెతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్లో మృతిచెందింది.జియ్యమ్మవలసలో... 2024 నవంబర్ 6న రావాడ రామభద్రాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలో 7వ తరగతి చదివిన నిమ్మక జీవన్ కుమార్(12) అనారోగ్యంతో మృతిచెందాడు. నెల రోజుల వ్యవధిలో ఇదే ఆశ్రమ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి బి.ఈశ్వరరావు కూడా అనారోగ్యంతో మృతిచెందాడు.కొమరాడలో... 2 2024 సెపె్టంబర్ 17న కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదివిన కె.శారద అనారోగ్యంతో మృతిచెందింది. -
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని YSRCP డిమాండ్
-
శివనామస్మరణ వినాల్సిన చోట కాపాడండి అంటూ ఆర్తనాదాలు
-
మా ప్రభుత్వం ఫెయిల్.. నిజం ఒప్పుకున్న కొలికపూడి
-
భక్తుల ప్రాణాలు పోతున్న.. మొద్దు నిద్ర వీడని చంద్రబాబు
-
శివ భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్.. వైఎస్ జగన్ ఫైర్
-
శివ శివా.. ఇదేం దారుణం?
శ్రీశైలం టెంపుల్: వరుసగా ఆలయాల్లో విషాద ఘటనలు.. ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాటలు.. భక్తుల మరణాలు.. చంద్రబాబు సర్కార్ అంతులేని నిర్లక్ష్యానికి ప్రబల నిదర్శనాలు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ పుణ్య క్షేత్రాలలో భక్తులు ప్రాణాలు కోల్పోయినా బాబుసర్కార్ మొద్దునిద్ర వీడలేదు. ఇపుడు శ్రీశైలం వంతు వచ్చింది. హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ నల్లమల కొండగుట్టల్లో ప్రతిధ్వనించే శివస్వాముల గొంతులు.. భయంతో రక్షించు శివా అంటూ ఆర్తనాదాలు చేసే పరిస్థితి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం దారుణంగా విఫలమవడంతో శివస్వాములు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోతూ చివరకు తాళాలను పగులగొట్టి గోడలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రాణభయంతో పరుగులు పెడుతున్న శివభక్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడం మరీ దారుణం. ఆలయాల్లో సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం భక్తులపై కాఠిన్యం ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని హిందూ ధార్మిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వరుసగా దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం, కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల పవిత్ర ప్రసాదంపై అదేపనిగా నిరాధార ఆరోపణలు చేయడం చూస్తుంటే అసలు చంద్రబాబుకు భక్తి అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు పుణ్యక్షేత్రాలలో ఉత్సవాల నిర్వహణే చేతకావడంలేదని వరుస ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అంటే దీనిని బట్టి ఆయనకు కనీస అడ్మినిస్ట్రేషన్ కూడా చేతకావడం లేదని అర్థం చేసుకోవచ్చు. విజనరీ అంటూ ప్రచారమే గానీ నిజానికి ఆయన ఎల్లో మీడియా తయారుచేసిన ఓ ఈవెంట్ మేనేజరేనని విమర్శకులంటున్నారు.భయాందోళనతో ఉన్న భక్తులపై లాఠీలా..?శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చే శివస్వాములకు, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్రప్రభుత్వం ఆ విషయంలో దారుణంగా విఫలమయ్యింది. ముగ్గురు మంత్రులు శ్రీశైలంలో ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. కానీ ఫలితం సున్నా. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది శివస్వాముల దర్శనం రోజులను కుదించారు. దాంతో సోమవారం రాత్రికే వేలాది మంది శ్రీగిరి చేరుకున్నారు. పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దేవస్థానం అధికారుల సమన్వయ లోపం, వీఐపీ ప్రోటోకాల్ పేరుతో ఇతరులకు స్పర్శదర్శనాలు కల్పించడంతో కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉదయం 9గంటల నుంచి శివస్వాముల లైన్లను నిలిపివేశారు. ఉచిత కంపార్ట్మెంట్లలో ఉండలేక అసహనానికి గురై గేటు దూకుతున్న భక్తులు అప్పటికే చంద్రావతి కళ్యాణ మండపంలోకి భారీగా చేరుకున్న శివస్వాములు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరో వైపు సాధారణ భక్తులు సైతం కంపార్ట్మెంట్లలో నిండిపోయారు. కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు అక్కడక్కడా అరకొరగా అందాయి.. గంటల తరబడి క్యూలైన్లలో మగ్గిపోయిన భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, గోడలు ఎక్కి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న తమపై పోలీసులు లాఠీలను ఝుళిపించడంతో భక్తుల ఆగ్రహం తారస్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితికి కారణమైన సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ భక్తులు తమ నిరసనను తెలియజేశారు. భక్తులపై లాఠీచార్జీ ఘటనలో నంద్యాల ఏఎస్పీ యుగంధర్బాబు తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.తూతూమంత్రంగా సమీక్షలు..మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ నెల 2న శ్రీశైలంలో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, హోంశాఖ మంత్రి అనితలు జిల్లా అధికారులతో, దేవస్థాన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. భక్తులకు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నామని, గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 30శాతం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్బాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపించింది. తూతూ మంత్రంగా జరిపిన మంత్రుల సమీక్షలను అధికారులు పట్టించుకోలేదు. అరకొర ఏర్పాట్లతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. భక్తులు భారీగా తరలివచ్చే శ్రీశైల పుణ్యక్షేత్రంలో కనీస సౌకర్యాలపై చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాముల యాత్రకు అనుమతిలోనూ అలక్ష్యమే..మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం శివభక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో చాలా మంది శివస్వాములు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుని మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే తమ ఇంటి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి శ్రీగిరి చేరుకుంటారు. అయితే ఈ ఏడాది జాతీయ పులుల గణన పేరుతో అటవీశాఖ అధికారులు నల్లమల అడవుల్లో పాదయాత్రకు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. చివరకు ఈ నెల 6వ తేది నుంచి అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు, శివస్వాములు ఒక్కసారిగా పాదయాత్రతో శ్రీగిరి చేరుకున్నారు. అటవీశాఖ నుంచి భక్తుల పాదయాత్రకు అనుమతి ఇప్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు. గ్రామోత్సవం చేయకపోవడం మహాపచారం!మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను విశేష వాహనసేవలో అలంకరించి ప్రత్యేకంగా వాహన పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక వాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అయితే సరైన ప్రణాళిక లేకపోవడంతో శ్రీశైలం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించక పోవడాన్ని భక్తులు మహాపచారంగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో అలంకార మండపంలో పూజలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రాణభయంతో క్యూలైన్ల నుంచి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న శివస్వాములు తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఈవో పాట్లు..శివస్వాముల ముసుగులో కొంత మంది అసాంఘిక శక్తులు తనపై కుట్ర పన్ని భక్తులను రెచ్చగొట్టేలా చేశారని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో పేర్కొనడం గమనార్హం. తనని ఈఓ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్ని.. ప్రణాళికాబద్ధంగా భక్తులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే రద్దీని కంట్రోల్ చేయాల్సిన దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్, ఈఓ కంట్రోల్ రూంకే పరిమితం కావడం గమనార్హం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజే భక్తుల రద్దీని కంట్రోల్ చేయలేని దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఇక మహాశివరాత్రి రోజు లక్షన్నరకు పైగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.స్వామివారి దర్శనం కోసం ఎండలో భక్తులు ఇలా మాడాల్సిందే.. సనాతన ధర్మం అన్నాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడు?సనాతన ధర్మాన్ని కాపాడతానని గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం శ్రీశైలంలో భక్తులకు ఇన్ని సమస్యలు ఎదురవుతుంటే ఎక్కడున్నాడు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణం. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తే భక్తుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.– మల్లికార్జున, శివస్వామి, అనంతపురంకనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలంమహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు శ్రీశైలం వచ్చాను. 6గంటలకు పైగా క్యూలైన్లలో ఉండాల్సిన పరిస్థితి. క్యూలైన్లలో ఉండలేక బయటికి వచ్చి కూర్చున్నా. కనీస సౌకర్యాలైన తాగునీరు, అన్నప్రసాదం, బాత్రూం లేవు. వృద్ధులకు సైతం ప్రత్యేక క్యూలైన్ లేదు. బ్రహ్మోత్సవాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, భక్తుడు, అనంతపురంప్రభుత్వానికి, పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించు మల్లన్నాబ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వానికి, శ్రీశైల దేవస్థానం పాలక మండలికి మంచి బుద్ధి ప్రసాదించాలని మల్లన్నను కోరుకుంటున్నా. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నా, ఒక్క అధికారి, వలంటీర్ కూడా పలకరించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా ఏర్పాట్లు చేసింది. పదవులు తీసుకోవడానికి కాదు పాలక మండలి సభ్యులు ఉండేది. భక్తులకు సేవలందించేందుకని గుర్తుంచుకోవాలి.– నరసింహారెడ్డి, శివస్వామి, తెలంగాణ30 ఏళ్లలో ఎన్నడూ మల్లన్న దర్శనం చేసుకోకుండా వెళ్లలేదునేను గత 30 ఏళ్ల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటా. చాలా సార్లు శివమాలను స్వీకరించి 41రోజులు నిష్టగా ఉండి ఇరుముడి సమర్పించేందుకు శ్రీశైలం చేరుకుంటా. గత 30ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో ఈ ఏడాది మల్లన్నను దర్శించుకోకుండానే వెనుతిరిగి వెళ్తున్నా. ప్రభుత్వం, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతోనే పరమేశ్వరుడిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్తున్నా.– వెంకటరావిురెడ్డి, శివభక్తుడు, హైదరాబాద్ -
శివ భక్తులపై లాఠీచార్జి దుర్మార్గం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పాలనలో శ్రీశైలంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం, బాధాకరమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన రూపంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం బయటపడిందన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయాల ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయని ఎత్తిచూపారు. తిరుమల లడ్డూనూ పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని.. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోందని వివరించారు.శ్రీశైలంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ‘ఎక్స్’లో తన ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..‘‘ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలనలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది.కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇస్తున్న సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. 🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.… pic.twitter.com/kBILeAwLOY— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: ⇒ తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.⇒ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.⇒ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.⇒ జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⇒ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు గారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.⇒ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ.. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ -
జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు.. నాగేశ్వర్కు బెదిరింపులు
సాక్షి, అమరావతి: ‘‘ఒరేయ్.. నా కొడకా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, ఆవుకొవ్వు, బాత్రూం రసాయనాలు కలిశాయని ఎందుకు చెప్పవురా నువ్వు.. ఇదే కాదు ఇంత కన్నా దారుణమైంది కలిసిందని కూడా చెప్పాలి.’’ అంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి తనను బెదిరిస్తున్నట్లు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా లడ్డూలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న ప్రచారాన్ని నాగేశ్వర్ తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ–సిట్ చార్జ్షీట్లో స్పష్టం చేసిన తరువాత కూడా కలిసిందని నిరూపించాలని యత్నం చేయడం హిందూ దేవుళ్లు, హిందూ సమాజంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూటమి అనుకూల వర్గీయులు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. జంతువుల కొవ్వు, బాత్రూం రసాయనాలే కాకుండా మరికొన్ని దారుణమైనవి లడ్డూలో కలిశాయని చెప్పాలంటూ దాదాపు 20 నుంచి 30 ఫోన్లు వచ్చాయని నాగేశ్వర్ తెలిపారు. అలా చెప్పడం అన్యాయమవుతుందని, కావున తానలా చెప్పలేనన్నానని ఆయన వివరించారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం’ వారిపై అమలు కాదా? మూడు రోజుల క్రితమే ఈ వేధింపులపై ఫిర్యాదు చేసినా మంత్రి లోకేశ్ కనీసం పట్టించుకోలేదని నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ రికార్డులను లోకేశ్ టీమ్ జైకు పంపించానని, దీనికి స్పందనగా ఆయన పోలీసులు ఆగంతకులను హెచ్చరించారని, మళ్లీ ఆ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్లు రావని చెప్పారని నాగేశ్వర్ వివరించారు. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు రోజుకు 20 నుంచి 30 మంది ఫోన్లు చేస్తున్నారని, బెదిరిస్తున్న వారి నంబర్లు రాష్ట్ర మంత్రికి స్వయంగా పంపితే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయాలి కదా అని లోకేశ్ను నిలదీశారు. ‘‘మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపుతామని బెదిరించినా, నేను మాత్రం నిరూపణ కాకుండా, ఆధారాలు లేకుండా దేవుని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందనే మాటను చచ్చినా అనను. పంది కొవ్వు కలిసిందని, బాత్రూం రసాయనాలు కలిశాయని మీరు వాడుతున్న భాషను నేను వాడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను దేనికైనా సిద్ధం.’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. కల్తీ జరిగితే నిరూపించండి: మరో వైపు లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలపై నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్గానీ, విచారణగానీ జరగకుండా సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రకటన చేయడం, దానిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ కూడా అదే మాట్లాడటం దారుణమని మరోసారి నాగేశ్వర్ తప్పుబట్టారు. -
22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ
-
DSCలో అక్రమ నియామకాలు.. ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్లో పూరించడంపై సీరియస్ అయ్యింది.గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.𝗖𝗕𝗡'𝘀 𝗧𝗵𝗲 𝟮𝟮𝗻𝗱 𝗥𝗮𝗻𝗸 𝗩𝗶𝘀𝗶𝗼𝗻: 𝗛𝗶𝗴𝗵 𝗼𝗻 𝗛𝘆𝗽𝗲, 𝗟𝗼𝘄 𝗶𝗻 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲- 𝗟𝗜𝗘𝗦 𝗮𝗻𝗱 𝗗𝗘𝗖𝗘𝗜𝗧 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲 𝗨𝗻𝗮𝗯𝗮𝘁𝗲𝗱At a time when State is confronting a worrying economic slowdown, very clearly evident from the Government… pic.twitter.com/lkeEp84jOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2026 -
జగన్ దమ్మున్న మొనగాడు.. మీలా చేతకాని రాజకీయాలు YSRCP చేయదు
-
తప్పు చేసి దొరికిపోయి కవర్ చేసేందుకు హార్పిక్ డ్రామా
-
హిందువుల దోహులు ఎవరంటే..? చంద్రబాబు, పవన్
-
చంద్రబాబు పాలన సక్కగ లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే
-
మీ కక్ష రాజకీయాలతో.. సొంత కంపెనీలోనే ఇంత కల్తీ చేశాడు ..


