breaking news
Crime
-
‘రాము.. ఇంటికి రా..!’ అర్ధరాత్రి ప్రియుడికి భార్య ఫోన్
కర్ణాటక: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది. బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. -
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్..!
తమిళనాడు: మాదక ద్రవ్యాలతో భర్తను హత్య చేసేందుకు యత్నించిన భార్యను పోలిసులు అరెస్టు చేశారు. కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం గ్రామానికి చెందిన రాజీవ్ గాంధీ(40) వ్యవసాయ కూలీ. ఇతను తన భార్య కనగ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటలకు రాజీవ్ గాంధీ తన ఇంటి ముందు నిలబడి ఉండగా, పొలం బయట రోడ్డు నుండి బైకు పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతని మెడపైనా, నడుముపైనా పొడిచారు. కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన, ఆ గుర్తుతెలియని వ్యక్తులు బైకు పై పారిపోయారు .దీని తరువాత, రాజీవ్ గాందీని రక్షించి కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఈ విషయమై చిన్నసేలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. అందులో, రాజీవ్ గాంధీ భార్య కనక, ఆమె వివాహితర ప్రియుడు, మాజీ పంచాయత్ అధ్యక్షుడు ధనపాల్ (53), ఇద్దరు అనుచరులతో కలిసి రాజీవ్ గాందీని హత్య చేయడానికి యత్నించినట్లు వెల్లడైంది. దీంతో చిన్నసేలం పోలీసులు ఆ గ్రూపు మాజీ నాయకుడు ధనపాల్, కనక, కిరాయి హంతకులైన పాల్ రాజ్ (24), కార్తీక్తో సహా మరో నలుగురి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
కూరగాయల కొట్టు నుంచి అండర్వరల్డ్ సింహాసనం వరకు..
ముంబై అండర్వరల్డ్ చరిత్రలో ఒకప్పుడు భయానక వాతావరణం సృష్టించిన గ్యాంగ్స్టర్ అమర్ నాయక్ ప్రస్థానం ఒక కూరగాయల వ్యాపారిగా మొదలయ్యింది. తరువాత అండర్వరల్డ్ను గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం, అరుణ్ గావ్లీ లాంటి ఉద్దండులకే సవాళ్లు విసిరే స్థాయికి చేరింది. ఒక సాధారణ కూరగాయల వ్యాపారి మోస్ట్ వాంటెడ్ డాన్గా మారడం.. తరువాత అథఃపాతాళానికి చేరడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 1980లలో దాదర్ మార్కెట్లో ప్రారంభమైన అతని మనుగడ ఎలాంటి సంచలనాలకు తెరలేపిందనేది ఈ కథనంలో చూద్దాం.బలవంతపు వసూళ్లపై తిరుగుబాటుముంబైలోని దాదర్ కూరగాయల మార్కెట్ ఆ కాలంలోనే కోట్లలో వ్యాపారం జరిగే ప్రధాన కేంద్రం. అజిత్ నాయక్ అనే వ్యక్తి అక్కడ కూరగాయల దుకాణం నడిపేవాడు. అజిత్ సోదరుడైన అమర్ నాయక్ చాలా కోపిష్టి, ఎవరికీ తలవంచని స్వభావం కలవాడు. ఆ సమయంలో మార్కెట్లో చెలరేగుతున్న ‘పోటియా ముఠా’ వ్యాపారుల నుండి బలవంతంగా వారపు డబ్బులు వసూలు చేసేది. ఈ వసూళ్లను అమర్ నాయక్ తీవ్రంగా వ్యతిరేకించి, ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో అండర్వరల్డ్తో అసలు పోరు మొదలైంది.అన్నపై దాడితో రగిలిపోయిన అమర్ఒకరోజు పోటియా ముఠా సభ్యులు అమర్ సోదరుడు అజిత్పై దాడి చేసి అమర్ ఆచూకీ చెప్పాలని వేధించారు. ఈ విషయం తెలుసుకున్న అమర్ తన మనుషులతో కలిసి వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ భీకర ఘర్షణలో పోటియా ముఠాకు చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మిగతావారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఒక్క సంఘటనతో దాదర్ మార్కెట్లో అమర్ నాయక్ పేరు మారుమోగడం ప్రారంభమైంది. అతని ఖ్యాతి క్రమంగా పెరుగుతూ వచ్చింది.తమ్ముడి అపహరణ హైడ్రామా.. తన ఆధిపత్యం తగ్గిపోతోందని గ్రహించిన పోటియా ముఠా కుట్ర పన్ని, అమర్ తమ్ముడు అశ్విన్ను అపహరించింది. బదులుగా అమర్ను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన అమర్ తన బృందాన్ని ఘర్షణలకు సిద్ధం చేశాడు. ఇంతలో అశ్విన్ వారి చెరనుండి చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. ఈ ఘటనతో పోటియా ముఠా బలహీనపడింది. అండర్వరల్డ్లో అమర్ నాయక్ రాజ్యానికి పునాది పడింది.దావూద్, గౌలీలకే ముచ్చెమటలుఅప్పట్లో డాన్ దావూద్ ఇబ్రహీం దుబాయ్ నుండి తన సామ్రాజ్యాన్ని నడిపిస్తూ, ముంబైలో చోటా రాజన్ను ఇన్చార్జ్గా ఉంచాడు. మరోవైపు అరుణ్ గావ్లీ సెంట్రల్ ముంబై నుండి తన గ్యాంగ్ను నడిపేవాడు. సరిగ్గా ఇదే ప్రాంతం నుండి అమర్ నాయక్ తన కార్యకలాపాలను సాగిస్తూ వీరిద్దరికీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగాడు. ఒకే ప్రాంతంలో ఇద్దరు డాన్లు ఉండకూడదనే నియమం ప్రకారం గావ్లీ వర్గానికి, నాయక్ వర్గానికి మధ్య తీవ్రమైన రక్తపాతంతో కూడిన గ్యాంగ్వార్ చెలరేగింది.పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ..అమర్ నాయక్ కేవలం ప్రత్యర్థులకే కాదు, పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. అతని ముఖం ఎలావుంటుందననేది అప్పట్లో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విదేశాలకు వెళ్లేందుకు అతనికి ఏకంగా ఐదు వేర్వేరు పాస్పోర్ట్లు ఉండేవి. ఒకసారి సాక్షాత్తు పోలీసుల ఎదురుగా వచ్చి వారితో సాధారణంగా మాట్లాడి వెళ్లిపోయినా, అది అమర్ నాయక్ అని గుర్తించలేనంత చురుగ్గా, పోలీసుల కంట పడకుండా అతను తన సామ్రాజ్యాన్ని ఏలాడు.క్రూరత్వంతో 'రావణ్' బిరుదుముంబైలోని బట్టల మిల్లులు మూతపడటంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన నిరుద్యోగ యువకులను అమర్ నాయక్ తన గ్యాగ్లోకి చేర్చుకున్నాడు. తన శత్రువులపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించడం వల్ల అండర్వరల్డ్ వర్గాలు అతన్ని ‘రావణ్’ అని పిలవడం మొదలుపెట్టాయి. ముంబైలో సంచలనం సృష్టించిన అనేక హత్యల్లో, ముఖ్యంగా ఖటావ్ మిల్లు యజమాని సునీత్ ఖటావ్ హత్యలో అమర్ నాయక్ పేరు ప్రముఖంగా వినిపించింది.ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో హతంఅమర్ నాయక్ నేర సామ్రాజ్యం రోజురోజుకూ పెరిగిపోవడంతో ముంబై పోలీసులు అతనిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు. అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి డాన్ అరుణ్ గావ్లీని అరెస్ట్ చేసి జైలులో పెట్టగా, అతని గ్యాంగ్ను నిర్వీర్యం చేశారు. చివరకు 1995లో మదన్పురా ప్రాంతంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్ నేతృత్వంలోని పోలీసు బలగాలు అమర్ నాయక్ను చుట్టుముట్టాయి. అర్ధరాత్రి జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ‘రావణ్’ హతమవడంతో అతని అండర్వరల్డ్ అధ్యాయం ముగిసింది.ఇది కూడా చదవండి: 79 లేక 80?.. స్వాతంత్ర్య దినోత్సవంపై కన్ఫ్యూజన్? -
‘నా పిల్లలు ఇలాంటి తల్లితో పెరగకూడదు’.. ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన తండ్రి
సాక్షి, బెంగళూరు: నగరంలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో కనిపించాడు.పోలీసుల వివరాల ప్రకారం.. 40 ఏళ్ల ఎస్జీ ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్కు వచ్చాడు. ఆ తర్వాత గదిలో చిన్నారులు మృతి చెందగా.. ఇమ్రాన్ బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి కనిపించాడు. అతని మెడపై కత్తితో కోసుకున్న గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారుల వయస్సు 10, 5 సంవత్సరాలుగా గుర్తించారు. తండ్రి నుంచి కొద్ది దూరంలోనే మంచంపై వారి మృతదేహాలు కనిపించాయి.హోటల్ సిబ్బంది సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఇమ్రాన్ను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.భార్యపై అనుమానమే కారణమా?ప్రాథమిక దర్యాప్తులో ఇమ్రాన్ తన భార్యపై అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని భావించినట్లు వెల్లడించారు. ‘నాపిల్లలు ఇలాంటి తల్లితో పెరగకూడదని అనుకున్నాను. అందుకే వారిని చంపి, నేను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాను’ అని ఇమ్రాన్ చెప్పినట్లు సమాచారం.గదిలోకి వెళ్లిన సిబ్బందికి షాక్డీసీపీ జీకే మిథున్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్లో ముందురోజు సాయంత్రం చెక్ఇన్ చేశాడు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో శుభ్రం చేసే సిబ్బంది గది తలుపు తట్టినా స్పందన రాలేదు. దీంతో వారు తలుపు తెరిచి చూడగా.. ఇద్దరు చిన్నారులు మంచంపై మృతిచెంది కనిపించారు. తండ్రి కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన స్థితిలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.చిన్నారులను తానే చంపినట్లు అంగీకారంఇమ్రాన్ తన కుమార్తెలను తానే చంపినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతడు నాగవార ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించాం’అని స్థానిక పోలీసులు వెల్లడించారు. -
‘మీ ఇళ్ల కింద గుప్త నిధులు’ అంటున్న ముఠా.. గుట్టు రట్టు
హైదరాబాద్:: ‘ మీ ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి నగరంలో హల్చల్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ఫోర్స్ టీమ్.. ఈ ముఠాను విజయవంతంగా పట్టుకుంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25),మహ్మద్ సల్మాన్ (29)లు ముఠాగా ఏర్పడి గుప్తా నిధులు ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న ఉదంతం పోలీసుల దృష్టికి రావడంతో వారిని అత్యంత పకడ్బందీగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, ఒక ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు పూత పూసిన నాణేలు, 6 కేజీల బొగ్గు, 4 కేజీల మట్టి, పూజా సామగ్రి తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు.ఇలా కొంతమందిని ముఠాగా ఏర్పరుచుకున్నాడు. వీరంతా కలిసి అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు.ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రజలకు విజ్ఞప్తి‘ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది.హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి, సబ్ఇన్స్పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది’ అని రాజేంద్ర నగర్-శంషాబాద్ జోన్స్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎస్ రావు తెలిపారు. -
బంగారం కోసం బరితెగింపు.. షాకైన అధికారులు
సూర్య నటించిన వీడొక్కడే గుర్తుందా?. అందులో డ్రగ్స్ను పొట్టలో ఉంచుకుని.. బాత్రూమ్కు కూడా పోకుండా స్మగ్లింగ్ చేస్తుంటారు. అది వాస్తవంగా జరిగేదే!. అయితే బంగారం అక్రమ రవాణాకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్న స్మగ్లర్లకు అధికారులు షాక్ ఇస్తున్నారు. తాజాగా.. శరీరం ప్రైవేట్పార్ట్లో దాచుకుని బంగారం తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అధికారుల వివరాల ప్రకారం.. సర్ఫరాజ్ మాలా అనే ప్రయాణికుడు ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నాడు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అతడిపై అనుమానం రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతడి మలద్వారంలో దాచిన బంగారం ప్యాకెట్లను గుర్తించారు. వాటిని బయటకు తీసి పరిశీలించగా.. మొత్తం 467.09 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.65.69 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.కడ్డీగా మార్చగా బరువు తగ్గిందిస్వాధీనం చేసుకున్న బంగారాన్ని కరిగించి కడ్డీగా మార్చిన తర్వాత దాని బరువు 422.83 గ్రాములకు చేరిందని అధికారులు వెల్లడించారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నందుకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా స్మగ్లింగ్ ముఠా ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.కొనసాగుతున్న అక్రమ రవాణా ప్రయత్నాలువిదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు శరీర భాగాల్లో దాచడం, ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లను ఉపయోగించడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్, భద్రతా సిబ్బంది తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది. -
నేను చనిపోయినా మెదడు బతికుంటుందిగా.. ఆ 7 నిమిషాలు నీ గురించే..
ఆంధ్రప్రదేశ్: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్..జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్ కుమారుని వీరంగం!
ప్రయాగ్రాజ్: దివంగత మాఫియా డాన్ అతీక్ అహ్మద్ పెద్ద కుమారుడు ఉమర్ అహ్మద్ కాన్వాయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్ముడు ఆబాన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లక్నో జైలు నుంచి పెరోల్పై ప్రయాగ్రాజ్ వస్తున్న క్రమంలో ఉమర్ కాన్వాయ్లోని దాదాపు 30 వాహనాలపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.మార్గం మధ్యంలో ప్రయాగ్రాజ్, ప్రతాప్గఢ్ జిల్లాల్లోని టోల్ ప్లాజా బూమ్ బారియర్లను ఈ కాన్వాయ్ ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జాతీయ రహదారి-19లోని నవాబ్గంజ్ టోల్ ప్లాజా, ప్రతాప్గఢ్ జిల్లా కుండాలోని భద్రి టోల్ ప్లాజా సిబ్బందిని బెదిరించడమే కాకుండా, వారిపైకి వాహనాలు ఎక్కించి చంపే ప్రయత్నం చేశారని టోల్ మేనేజర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో గత ఆగస్టు 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతీక్ చిన్న కుమారుడు ఆబాన్ మృతి చెందాడు. ఆగస్టు 8న కసారి-మసారిలో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా, లక్నో జైలులో ఉన్న ఉమర్కు అల్లహాబాద్ హైకోర్టు పెరోల్ మంజూరు చేసింది. ప్రభుత్వ వాహనంలో అతడిని తరలిస్తుండగా, వెనుక అనుచరులు, సన్నిహితులు సుమారు 30 వాహనాలతో కాన్వాయ్గా తరలివచ్చారు.వారు టోల్ ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై దూసుకెళ్తూ, అడ్డుకున్న సిబ్బందిని బూతులు తిడుతూ, భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై నవాబ్గంజ్ టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ జయ్ ప్రకాష్ యాదవ్ ఫిర్యాదు మేరకు 28 మందితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే భద్రి టోల్ ప్లాజా మేనేజర్ ఇషాక్ ఖాన్ ఫిర్యాదు ఆధారంగా మరో రెండు వాహనాలపై హతిగ్వాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టోల్ సిబ్బందిని తొక్కించే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు -
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
పెళ్లయి వారం రోజులు.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్!
హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయిన ఘటన మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్కు చెందిన ఏర్పుల ప్రవీణ్, నగరంలోని ఐఎస్ సదన్కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.వారం క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. చిత్తాపూర్లో ఆ జంట నివాసం ఉంటున్న క్రమంలో శనివారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. తన భార్యను జ్యోతిబస్ అనే యువకుడితోపాటు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆదివారం ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
నర్సాపూర్ అర్బన్ పార్క్కు వెళ్లి వస్తుండగా.. విషాదం!
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షేక్ షిరీన్బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్కు వెళుతుంటారు. జిమ్ యజమాని రుతి్వక్, రోజూ జిమ్కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్ తరలించే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్ను ఢీకొంది. కారు డ్రైవ్ చేసు్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కోల్పోయారు. ఆమెకు వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్ సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, వారి మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేకపోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. -
ఐషర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, 35 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అలాగే, ఐషర్ వాహనం జిమ్ పరికరాలతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. పొగరూరు గ్రామం వద్ద ఐషర్ వాహనం అదుపుతప్పి నీలూరు పుల్లేటి వంక బ్రిడ్జి ప్రారంభంలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దాని వెనకే వేగంగా వస్తోన్న ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకువెళ్లి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు ఎడమకాలు విరగ్గా, ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని 25 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అనంతపురం నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి సిటీ: నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఎస్వీ నగర్కు చెందిన సాయి మేఘన (18) తల్లిదండ్రులు కూలీలు. తమ కుమార్తెను డాక్టర్గా చూడాలనే ఆకాంక్షతో వారు ఆమెను కష్టపడి చదివించారు. దానికి ప్రతిఫలంగా సాయిమేఘన ఇంటర్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించి తిరుపతిలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ లాంగ్టర్మ్ శిక్షణ తీసుకుంది. ఈ ఏడాది మే లో జరిగిన నీట్ పరీక్ష రాసింది. అందులో 499 మార్కులు వచ్చాయి. అయితే నీట్ పేపర్ లీక్ కావడంతో ఎన్టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో ఆమెకు 390 మార్కులే వచ్చాయి. దీంతో డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆశ నిర్వీర్యమైందనే మనోవేదనతో 10 రోజుల క్రితం సాయిమేఘన ఆత్మహత్య చేసుకుంది. కానీ కుటుంబీకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మదనపడుతూ ఆదివారం కర్మక్రియలు నిర్వహించారు. అక్కడికి పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు వచ్చి నివాళులర్పించిన సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో సాయిమేఘన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. -
‘మత్తు’ మారుతోంది!
పోలీసులు బాటసింగారం ప్రాంతంలో నిర్వహించిన ఓ ఆపరేషన్లో గత జూన్ 12న ఎండీ డ్రగ్ తయారీ ముఠాను పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్తోపాటు రూ.50 లక్షల విలువైన డ్రగ్ తయారీ యూనిట్, రసాయనాలు స్వాదీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన సూర్యాపేట జిల్లాకు చెందిన కీసరి మత్స్యగిరి అలియాస్ నరేశ్ మోత్కూరు సమీపంలోని ఓ మామిడి తోటలో రహస్యంగా డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. గతంలో కెమిస్ట్గా పనిచేసిన మత్స్యగిరి గుజరాత్కు చెందిన కొందరితో మెఫెడ్రోన్ తయారీని నేర్చుకుని, సొంతంగా ల్యాబ్ పెట్టి ఎండీ డ్రగ్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.షాద్నగర్లోని ఒక అద్దె ప్రాంగణాన్ని రహస్య డ్రగ్ ల్యాబ్గా మార్చి మెఫెడ్రోన్ (ఎండీ) తయారు చేస్తున్న ముఠాను గత మార్చిలో ఈగల్ ఫోర్స్ ఛేదించింది. 17 కిలోల మెఫెడ్రోన్, 300 కిలోల ప్రీకర్సర్ కెమికల్స్ను స్వాధీనం చేసుకుంది. షాద్నగర్ కేంద్రంగా తయారు చేసిన ఎండీనిఇక్కడ విక్రయించడంతోపాటు రాజస్తాన్కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. సాక్షి, హైదరాబాద్: ఈగల్ఫోర్స్, పోలీస్, ఎక్సైజ్ శాఖల ముప్పేట దాడులతో కొకైన్ను సరఫరా చేసే ఆఫ్రికా దేశాలకు చెందిన డ్రగ్ సరఫరా ముఠాలు హైదరాబాద్ వైపు వచ్చేందుకు సాహసించడం లేదు. దీంతో రాష్ట్రంలో కొకైన్ సరఫరాకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. విదేశాల నుంచి వచ్చే కొకైన్ సరఫరా తగ్గడంతో డ్రగ్స్ ముఠాలు రూటు మారుస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్లు యువతను, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకాల మత్తు పదార్థాల విక్రయాలు విస్తరిస్తున్నారు. గంజాయి, నల్లమందు, ఎండీఎంఏతోపాటు ప్రధానంగా ఎండీ డ్రగ్ను యువత గుట్కాలో కలిపి తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. మెల్లగా గుట్కాలో కొద్దికొద్దిగా కలిపి విద్యార్థులకు అలవాటు చేస్తున్న మత్తుముఠాలు నెమ్మదిగా వారిని బానిసలుగా మారుస్తున్నాయి. తొలుత తక్కువ రేటుకే మత్తుపదార్థాలను విద్యార్థులకు చేరవేసి.. తర్వాత వారిని బానిసలుగా మారుస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లు కొకైన్ కాకుండా కొత్త మత్తు పదార్థాలపై దృష్టి సారిస్తున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా మెఫెడ్రోన్ (ఎండీ), మరో సింథటిక్ డ్రగ్ ఎండీఎంఏ, నల్లమందు (ఓపియం) వంటి మత్తు పదార్థాల వైపు స్థానిక డ్రగ్ నెట్వర్క్లు మళ్లుతున్నాయి. ఇటీవల వరుసగా ఎండీఎంఏ, మెఫెడ్రోన్, ఓపియం సరఫరాదారుల అరెస్టులు, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న స్థానిక డ్రగ్ తయారీ యూనిట్లు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశీయంగా తయారు చేస్తూ... అంతర్జాతీయంగా సరఫరా అవుతున్న డ్రగ్స్పై నిఘా పెరగడంతో కొన్ని ముఠాలు దేశీయంగానే కొన్నిరకాల డ్రగ్స్ తయారీకి తెరతీశాయి. గుట్టుచప్పుడు కాకుండా చిన్న చిన్న ల్యాబ్లలో సింథటిక్ డ్రగ్స్ను తయారు చేసి.. అంతర్రాష్ట్ర లింక్లతో దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఇటీవల జరిపిన కొన్ని సోదాల్లో ప్రధానంగా రాజస్తాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఎండీ డ్రగ్ తెలంగాణకు వస్తున్నట్టుగా ఈగల్ ఫోర్స్ అధికారులు గుర్తించి నిఘా పెంచారు. రాజస్తాన్కు చెందిన డ్రగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న రెండు మెఫెడ్రోన్ తయారీ కేంద్రాలను ఇటీవలే గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా గత జూన్లోనూ బాటసింగారం ప్రాంతంలో మత్స్యగిరి అనే వ్యక్తి మామిడి తోటలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఎండీ డ్రగ్ తయారీ యూనిట్ను ఈగల్ అధికారులు గుర్తించారు. ఈ తరహా డ్రగ్స్ రాజస్తాన్కు చెందిన ముఠాలే నగరానికి సరఫరా చేస్తుండడంతో నిఘా పెంచిన ఈగల్ అధికారులు 2023 ఇప్పటి వరకు 78 సార్లు ఈ ముఠాలను అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత టార్గెట్గా.. మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులను డబ్బుకోసం, మత్తుపదార్థాల కోసం డ్రగ్ పెడ్లర్లుగా మార్చుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో డ్రగ్ నెట్వర్క్ల కార్యకలాపాలను తెలంగాణ పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. క్వాంటమ్ లీప్ స్కూల్ కేసు నేపథ్యంలో విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్ సరఫరా, విక్రయాలపై మరింత నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యార్థులు, కమ్యూనిటీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు చేపడుతున్నారు. స్థానిక పెడ్లర్ నుంచి అంతర్రాష్ట్ర సరఫరాదారు వరకు మొత్తం గొలుసును ఛేదించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. పూర్తి సాంకేతికతను వాడుకుంటూ దాడులు చేస్తున్నారు. విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, ఇలాంటి నెట్వర్క్లపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటామని ఈగల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.‘ఎండీ’తో తీవ్ర ఆరోగ్య ముప్పు మెఫెడ్రోన్ (ఎండీ) అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ సైకోయాక్టివ్ డ్రగ్గా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, తీవ్ర ఆందోళన, భయాందోళనలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తరచూ వినియోగిస్తే దీనికి బానిసగా మారి వ్యసనానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. తీవ్రమైన మత్తు ప్రభావంలో దూకుడు ప్రవర్తన, భ్రాంతులు, ఫిట్స్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎండీ మత్తులో కొందరు తమకు తామే తీవ్రంగా గాయపరుచుకోవడం, ప్రమాదకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. తయారీ కేంద్రాలపై నిఘా పెంచాంమత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను, పెడ్లర్లను కట్టడి చేయడంతో డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేసేలా ఈగల్ ఫోర్స్ విస్తృతంగా పనిచేస్తోంది. అదేవిధంగా ఎండీ, ఇతర డ్రగ్స్ తయారీ కేంద్రాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇటీవల కాలంలో రాజస్తాన్తోపాటు తెలంగాణ కేంద్రంగా ఎండీ డ్రగ్ తయారీ కేంద్రాలపై నిఘా పెంచాం. ఇప్పటికే కొన్ని ల్యాబ్లను మూయించాం. అదేవిధంగా రాజస్తాన్ నుంచి వివిధ పనుల కోసం తెలంగాణకు వస్తున్న యువతలో ఈ మత్తుపదార్థాలు అలవాటు ఉన్న వాళ్ల ద్వారా ఇక్కడికి ఎండీ, నల్లమందు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించాం. డ్రగ్స్ వాడితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని నమ్మించి ఇక్కడి యువతకు దీన్ని అలవాటు చేస్తున్నారు. మనకు ఎక్కువగా రాజస్తాన్ ముఠాల నుంచే వస్తున్నాయి. కానీ అక్కడి వాళ్లను అరెస్ట్ చేసేందుకు రాజస్తాన్కు వెళ్లిన సమయంలో మన ఫోర్స్పై దాడులు జరిగిన ఘటనలు ఉంటున్నాయి. త్వరలో రాజస్తాన్ పోలీసుల సహకారంతో భారీ ఆపరేషన్స్ చేస్తాం. – సందీప్ శాండిల్య, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్రూ.54 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురి అరెస్ట్ భువనగిరి (బీబీనగర్): కారులో తరలిస్తున్న మాదక ద్రవ్యాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్యాదవ్ ఆదివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా... బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద శనివారం స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో సుమారు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల నిషేధిత మెఫెడ్రోన్తోపాటు డ్రగ్స్ తయారీలో ఉపయోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను గుర్తించారు. కారులో ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన చేతన్ మధుకర్ మెప్రామ్, ఆకాశ్ అశోక్ గవాండే, అస్సాంలోని మారిగావ్కు చెందిన ముజుమాల్ హక్, హైదరాబాద్లోని చందానగర్కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తిని అరెస్టు చేశారు. వారిని విచారించగా కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్లో మెఫెడ్రోన్ తయారుచేసినట్లు అంగీకరించారు. డ్రగ్స్ను కొండమడుగు నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. అనంతరం పోలీసులు వేటుకూరి ల్యాబ్కు వెâళ్లి తనిఖీలు చేశారు. పట్టుబడిన డ్రగ్స్తోపాటు ల్యాబ్లో డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్న రియాక్టర్, సెంట్రీఫ్యూజ్, ఇతర పరికరాలు, 6 సెల్ఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నాగపూర్కు చెందిన చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, హైదరాబాద్ మేడిపల్లికి చెందిన ల్యాబ్ యాజమాని వేటుకూరి రామరాజును పట్టుకునేందుకు పోలీస్ బృందాలను నియమించినట్లు చెప్పారు. -
రూ.500 కోసం దాడి.. అవమానం భరించలేక డ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, జగిత్యాల: కేవలం రూ.500 విషయంలో జరిగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. తన యజమాని వద్ద రావాల్సిన డబ్బులు అడిగిన ట్రాక్టర్ డ్రైవర్పై దాడి జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. వెల్దుర్తికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమేశ్కు తన యజమాని వద్ద రూ.500 రావాల్సి ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో రమేశ్ ఫోన్లో యజమానిని మందలించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి రమేశ్ ఇంటికి వెళ్లి ‘నన్నే తిడుతావా?’ అంటూ తన భార్య, పిల్లల ఎదుటే రమేశ్పై ఇద్దరూ కలిసి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో రమేశ్ స్పృహ కోల్పోయి కిందపడిపోయినట్లు తెలిపారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం.అయితే తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగారెడ్డితో పాటు మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రమేశ్కు భార్య, కుమారుడు ఉన్నారు. రూ.500 కోసం తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మెట్రోలో అమ్మాయిలకు అంకుల్ చేతిలో భయానక అనుభవం
న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది.తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు.ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది.“మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు. View this post on Instagram A post shared by praveenya (@praveenyaaaa) -
కుమార్తె ప్రేమ కోసం.. బండ రాయితో మోది భర్త హత్య
మధుర: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అతని భార్య, కూతురు, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ సోని అనే వ్యక్తిని అతని భార్య నైనా, చిన్న కూతురు భక్తి, ఆమె ప్రియుడు విమల్ చౌదరి కలిసి హత్య చేశారు. కూతురి ప్రేమ వ్యవహారాన్ని మనోజ్ వ్యతిరేకించడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో నిందితులు పథకం ప్రకారం ఏప్రిల్ 18న మనోజ్కు మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి, బండరాయితో తల పగులగొట్టి హత్య చేశారు. అనంతరం యమునా నది సమీపంలోని అడవికి శవాన్ని తరలించి, దహనం చేసి పూడ్చిపెట్టారు.బాధితుడి అన్న రాంబాబు ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితురాలు నైనా తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అయితే, మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు అధికారికంగా హత్యను ఇంకా నిర్ధారించలేదు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ఆధారంగా అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్లోక్ కుమార్ తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు -
భార్యాపిల్లలను కాదని మరో మహిళతో కాపురం..!
రాజన్న సిరిసిల్ల జిల్లా: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్ ఆటో డ్రైవర్. శంకర్కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
వారే టార్గెట్.. ఫోన్లో 600కి పైగా వీడియోలు!
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
పనిమనిషి హత్య.. ఇంటిపై నాటు బాంబులతో దాడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి, పనిమనిషిని గొంతుకోసి హతమార్చడమే కాకుండా నాటు బాంబులతో కలకలం సృష్టించారు. బీఎన్ఆర్పేట ఎస్ఐ మణికంఠేశ్వర్రెడ్డి కథనం ప్రకారం.. మంగాపురం గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమెరికాలో ఉంటున్నారు.ఆ ఇంట్లో ఆయన సోదరి, ఆమె భర్తతోపాటు పనిమనిషి ఆనందరావు(50) ఉంటున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన ఆనందరావు ఇక్కడ 11ఏళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు, ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి అచేతనంగా మార్చారు. ఆ తర్వాత ఇంట్లో ఆనందరావును అడ్డగించి గొంతు కోసి హత్య చేశారు. నాటు బాంబుల మోత... హత్య అనంతరం దుండగులు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసేందుకు నాటు బాంబులను పేల్చారు. పెద్ద ఎత్తున బాంబు పేలుడు శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు అరుపులు కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఘటన స్థలంతో పాటు రోడ్డులో రెండు నాటు బాంబులను స్వాదీనం చేసుకున్నారు. ఆనందరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు హత్యకు గురైన ఆనందరావు గత 11 ఏళ్లుగా పట్టాభినాయుడు ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్నాడు. యజమాని ఆర్థిక సహాయంతోనే ఆనందరావు తన కుమారుడిని పుత్తూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. ఆనందరావు భార్య, కుమార్తె బాపట్ల జిల్లాలోని సొంత ఊరిలోనే ఉంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో బాంబులు పేల్చి మరి హత్యకు పాల్పడడం వెనుక అసలు కారణాలు ఏమిటి? కేవలం పనిమనిషినే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారా? లేక ఇంటి యజమానులను భయపెట్టేందుకు ఏమైనా ముఠా పన్నాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
అత్తను హత్య చేసి తగులబెట్టిన అల్లుడు
సత్తుపల్లి: పెద్ద మనుషుల సమక్షాన నిర్వహించిన పంచాయితీలో డబ్బులు, బంగారం ఇవ్వాలని తీర్పు రావడంతో కక్ష గట్టిన వ్యక్తి తన అత్త (భార్య తల్లి)ను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, తుమ్మూరుకు చెందిన వెదుళ్ల వెంకటనరసమ్మ(60) పెద్ద కూతురు మంగకు తిరుపతిరావుతో 30 ఏళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలానికి తిరుపతిరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మంగకు చెందిన బంగారం, రూ.50 వేల నగదును తిరుపతి ఆ మహిళకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై మంగ, నరసమ్మ పెద్ద మనుషుల వద్ద ఈనెల 1వ తేదీన పంచాయితీ పెట్టించగా, ఆరు నెలల్లో నగదు, బంగారం తిరిగి ఇవ్వాలని పంచాయితీలో తీర్పు చెప్పినట్లు సమాచారం.ఆ రెండో రోజే హత్యతిరుపతిరావు పంచాయితీ జరిగిన రెండో రోజే హత్య చేసినట్లు తెలిసింది. తల్లి కనిపించడం లేదని మంగ పోలీసులకు ఫిర్యాదు చేసింది, పోలీసులు విచారించగా సెల్ఫోన్ చార్జింగ్ వైర్ నరసమ్మ మెడకు బిగించి హత్య చేసి, నారాయణపురం – బేతుపల్లి మధ్య రోడ్డు పక్కన తోటలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు తిరుపతిరావు ఒప్పుకున్నాడు. పోలీసులు శనివారం ఘటనాస్థలి నుంచి ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. తిరుపతిరావును, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో మరెవరైనా పాల్గొన్నారా, మృతదేహాన్ని నారాయణపురం తరలించడానికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి దర్యాప్తు మొదలుపెట్టారు.భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్తపక్కింటికి కూడా వ్యాపించిన మంటలునవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్ఏ) అల్లం సురేశ్ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ప్రాణాల మీదికి తెచ్చిన జరిమానా!
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా రూ.6 లక్షలు ఇవ్వాలని గ్రామస్తులు ఒత్తిడి తేవడంతో ఆటో డ్రైవర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలివి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కురి్మండ్ల శ్రీనివాస్ గౌడ్ ఆటో డ్రైవర్. జూన్ 25న రామాయంపేటనుంచి వస్తుండగా ఆటోను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల రమేష్ గౌడ్ మరణించాడు. దీనిపై పంచాయితీ చేసిన గ్రామస్తులు.. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల జరిమానా విధించారు. శ్రీనివాస్గౌడ్ లక్ష రూపాయలు చెల్లించి మిగతా రూ.5 లక్షలకు తన బావ అయిన సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన సిద్దగౌడ్ను జమానత్గా ఉంచాడు. వాయిదా సమయం దాటినా డబ్బులు ఇవ్వకపోవడంతో.. మృతుడు రమేశ్ కుటుంబ సభ్యులను అతని బంధువు తీసుకెళ్లి జమానత్గా ఉన్న సిద్దగౌడ్ ఇంటి వద్ద వదిలాడు. ఈ క్రమంలో సిద్దగౌడ్ భార్య సత్తవ్వ మనస్తాపానికి గురై కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో గ్రామస్తులు కల్పించుకుని తిరిగి పంచాయితీ నిర్వహించి రూ.3 లక్షలను చెల్లించాలని శ్రీనివాస్గౌడ్కు సూచించారు. అంత డబ్బు తమ వద్ద లేదని శ్రీనివాస్గౌడ్ పేర్కొనగా.. జరిమానా చెల్లించాల్సిందేనని గ్రామస్తులు ఆదేశించారు. దీంతో శ్రీనివాస్గౌడ్ అతడి భార్య లత మనస్తాపం చెంది ఇంటికి వెళ్లి పురుగు మందు తాగారు. స్థానికులు గమనించి వారిని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భిక్కనూరు ఎస్ఐ అనిల్ తెలిపారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్గౌడ్ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. -
అనుమానాస్పద స్థితిలో నేతన్న మృతి
సిరిసిల్లటౌన్: తనకున్న పూరిల్లును ఇందిరమ్మ పథకం ద్వారా పక్కా ఇంటిగా నిర్మించుకునేందుకు నిబంధనలు అడ్డురావడం.. ప్రజాప్రతినిధి రూ.లక్ష డిమాండ్ చేయడం.. ఈ క్రమంలో రాజకీయ నేతతో వైరం ఏర్పడడం.. చివరికి నేతన్న జీవితం విషాదాంతం కావడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం మిస్సయిన వెంకటేశం శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. రగుడు గుట్టపై శవమై.. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలోని తారకరామానగర్కు చెందిన వెంగళ వెంకటేశం (49) కుసుమ గణేష్ అనే ఆసామి వద్ద పనిచేసేవాడు. భార్య సులోచన. వీరికి ఓ కూతురు. కాగా, ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వెంకటేశం.. ఈ విషయమై మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్ను సంప్రదిస్తే.. ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్లు గతంలో ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ నిజనిర్ధారణ కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దార్ల సందీప్పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం వెంకటేశం కనిపించకుండా పోయాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెంకటేశం పనిచేసే ఆసామి కుసుమ గణేశ్ను విచారించగా.. గురువారం మల్లికార్జునస్వామి గుడికి వెళ్దామని తనను తీసుకొచ్చాడని, అయితే గుట్టమీదకు తాను రాలేనని చెప్పడంతో ఒక్కడే వెళ్లాడన్నాడు. అనంతరం అక్కడి నుంచి తాను ఇంటికొచ్చినట్లు తెలిపాడు. వెంకటేశం మరణం..అనుమానాస్పదం మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన వెంకటేశం రగుడు శివారులోని మల్లికార్జునస్వామి ఆలయం గుట్ట పరిసరాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. గుట్టపై వెంకటేశం చనిపోయన విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి విషయంలో మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్తో వైరం ఉంది. అతని భార్య సులోచన ఇచ్చిన ఫిర్యాదులోనూ దార్ల సందీప్పై అనుమానాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా, వెంకటేశం సూసైడ్ నోట్ విషయంలో పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై టౌన్ సీఐ శ్రీనివాస్ను వివరణ కోరగా.. మృతుడి వద్ద కాగితాలు లభించాయని వాటిలో ఏమి లేదని చెప్పారు. -
డేటింగ్ యాప్లో వల, వీడియోలతో బ్లాక్మెయిల్ : కోట్లు కొట్టేస్తున్న కిలాడీ
డేటింగ్ యాప్లో పరిచయమైన ఒక లేడీ కిలాడీ హనీ ట్రాప్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ డేటింగ్ యాప్ టిండర్ (Tinder), ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని, ఆపై వారిని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఒక హైకోర్టు లాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హనీట్రాప్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది .విచారణలో విషయాలు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ టిండర్ ద్వారా పురుషులకు వల వేసి, స్నేహం నటించేది. ఆ తర్వాత వారితో దగ్గరయ్యేది. ఇక్కడే తన ప్లాన్ అమలులో కీలకమైన అడుగు వేసేది. తనకు పరిచయమైన వారితో సన్నిహితంగా ఉంటున్న సమయాల్లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేదని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలు, ఫోటోలు చూపించి బాధితులను బెదిరిస్తూ ఇప్పటివరకు దాదాపు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాదు తాను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు పెడతానని బెదిరించేది. ఈమె ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే ఐదుగురు జైలుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.నకిలీ ప్రొఫైళ్లుపల్లవి "స్వీటీ తివారి" అనే పేరుతో సహా వివిధ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఉపయోగించి కొత్తవారిని బురిడీ కొట్టించేదని మరొక ఫిర్యాదులో వెల్లడైంది. ఈమెకు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరిస్తున్నారని సమాచారం.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ఈ కేసువెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి మంచంపై పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పేర్చి ఉన్న ఫొటోలు, అలాగే ఒక మహిళ చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. అయితే, ఈ ఫొటోల విశ్వసనీయతను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోది చేసి ముమ్మర దర్యాప్తు జరుపు తున్నారు.ఇదీ చదవండి: 26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్ -
హైదరాబాద్లో మహిళ అనుమానాస్పద మృతి
చిలకలూరిపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన నూర్ బాష ఆశా (33) కొంతకాలంగా తన 12 ఏళ్ల కుమారుడితో కలసి తాగునీటి చెరువుకు వెళ్లే టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటుంది. సుమారు ఐదేళ్ల కిందట కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయింది. కొంతకాలంగా తన మాజీ భర్త ఊరికి చెందిన పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన, సుల్తాన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సుల్తాన్ కూడా భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట కుమారుడిని తెలిసిన వాళ్ల ఇంటిలో వదిలివేసి ప్రియుడు సుల్తాన్తో కలసి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ మెకానిక్గా పనికి కుదిరిన సుల్తాన్ గురువారం ఉదయం పనుల నిమిత్తం షెడ్డుకు వెళ్లాడు. అతను పనిలో ఉండగా ఇంటి చుట్టుపక్కల వారు ఫోన్ చేసి ఆశా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నట్లు, తాము కిటికీలో నుంచి చూశామని సమాచారం అందించారు. దీంతో ఇంటికి చేరుకున్న సుల్తాన్ మృతదేహాన్ని తీసుకొని అంబులెన్స్లో ఎక్కించుకొని చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాలనీ వద్దకు చేరుకున్నాడు. అంబులెన్స్కు బాడుగ డబ్బులు తీసుకువస్తానని వెళ్లి ఎంతకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ డయల్ 100కు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో చిలకలూరిపేట పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుల్తాన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యూప్లెక్స్ ఇంట్లో అస్తిపంజరమై తేలిన 57 ఏళ్ల దాక్షాయణి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని బాగలగుంటెలో ఒక విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉంటున్న 57 ఏళ్ల దాక్షాయణి అనే మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో అస్థిపంజరమై కనిపించింది. ఆ ఇల్లు కొన్ని నెలలుగా మూసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది.స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా, ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారి కనిపించింది. ఆమె మానసిక వేదన, ఒంటరితనంతోనే, దాదాపు ఏడాది క్రితం మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం 2005లో ఆరోగ్య సమస్యల కారణంగా దాక్షాయణి కొడుకు మరణించాడు. దీంతో ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. ఆ తర్వాత ఆమె 'షిజోఫ్రెనియా' (Schizophrenia) అనే మానసిక అనారోగ్యంతో బాధపడగా కుటుంబ సభ్యులు చికిత్స అందించారు.2017లో ఆమె భర్త ఉమేష్ కూడా మరణించడంతో, హవనూర్ లేఅవుట్లోని ఇంట్లో ఆమె ఒంటరిగానే నివసిస్తోంది.ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ అనుమానం ఎలా వచ్చిందీ అంటేఆ ఇల్లు కొన్ని నెలలుగా మూసివేసి ఉండటంతో, అద్దెకు తీసుకునేందుకు వెళ్లి తలుపులు తెరవలేకపోయిన బ్రోకర్లు స్థానికులు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. బాగలగుంటె పోలీసులు ఆ డ్యూప్లెక్స్ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా దాక్షాయణి అస్థిపంజరం లభ్యమైంది. ఇదీ చదవండి: 8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?మరోవైపు గత రెండేళ్లుగా దాక్షాయణితో తాము టచ్లో లేమని ఆమె సోదరుడు మహేష్ (50) తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె ఎప్పుడు, ఎలా మరణించిందో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ ప్రారంభించారు. -
సీనియర్ అడ్వకేట్ ఇంట్లో భారీ చోరీ : షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే?
హర్యానాలోని థానేసర్లో సీనియర్ అడ్వకేట్ బల్వంత్ సింగ్ వాలియా ఇంట్లో భారీ చోరీ కలకలం రేపింది. ముసుగులు వేసుకున్న నలుగురు దుండగులు ఆయన నివాసంలోకి చొరబడి, తుపాకీతో బెదిరించి దాదాపు రూ. 3.15 కోట్ల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ దిగ్భ్రాంతికి గురిచేసింది.అడ్వకేట్ వాలియా తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చేసరికి, ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. ఆయన భార్యను చేతులు, కాళ్ళు తాడుతో కట్టేసి, నోటికి అడెసివ్ టేప్ వేసి మంచంపై పడేశారు. ఇది చూసి ఏం జరగిందో అంచనా వేసే లోపే ఇంట్లోనే ఉన్న ఆ నలుగురు ముసుగు దొంగలు న్యాయవాదిని కూడా బంధించి, వయోవృద్ధులు అని కూడా చూడకుండా కొట్టి, తుపాకీతో బెదిరిస్తూ నగదు, విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ఏడాది మార్చి 20న అదే ఇంట్లో జరిగిన రూ. 50 లక్షల దొంగతనం యత్నం వెనుక కూడా తామే ఉన్నామని దుండగులు చెప్పారు. ఆ రోజు డిజిటల్ సేఫ్లను తెరవలేకపోయామని, ఇప్పుడు సేఫ్లు తెరవకపోతే కాల్చి చంపుతామని బెదిరించారు.రూ. 17 నుంచి 20 లక్షలు నగదు 1.5 నుంచి 2 కిలోల ఆభరణాలు, దాదాపు 4 కిలోల వెండి ఆభరణాలు, పాత్రలు, విగ్రహాలు, ఒక లైసెన్స్డ్ రివాల్వర్, కార్ట్రిడ్జ్లను దోచుకుపోయారు. వెళ్లేముందు 4 సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, డీవీఆర్ (DVR) ను తీసుకెళ్లారు. అంతేకాకుండా మరో రూ. 80 లక్షలు ఇవ్వాలని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించి బయట నుంచి గడియ పెట్టి పారిపోయారు.ఇదీ చదవండి: 10 నెలల క్రితమే ప్రేమ పెళ్లి : రీల్స్ చేస్తోందని చంపేశాడు!పొరుగువారి సహాయంతో బంధీల నుంచి బయటపడిన దంపతులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై థానేసర్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (CIA) , స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ రాజకీయ విమర్శలుహర్యానా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ అరోరా ఈ ఘటనపై స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కురుక్షేత్ర ప్రాంతంలో తీవ్రమైన నేరాలు పెరిగిపోతున్నాయని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవ వధువు నిండు జీవితం ముగిసిపోయింది.. కొత్త బంధంతో సరికొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన నాలుగు నెలలకే ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తీర్ణురాలైన ఆమె తన గుండెబాధను అధిగమించలేకపోయింది. విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్ బసవతారక నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయోధ్యనగర్ బసవ తారక నగర్ ప్రాంతానికి చెందిన గోనోల్ల దేవేంద్రకు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన మారాని చంద్రకళ (24) తో ఈ ఏడాది ఏప్రిల్ 23న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఎంబీఏ చదువుకున్న చంద్రకళ ఇంటివద్దే ఉంటుండగా దేవేంద్ర హనుమాన్పేటలోని ప్రైయివేటు ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రోజూలానే శుక్రవారం ఉదయం దేవేంద్ర పనికి వెళ్లగా చంద్రకళ ఇంటిలోనే ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేవేంద్ర భోజనానికి ఇంటికి బయల్దేరుతుండగా చంద్రకళ స్నేహితుడు రమణ ఫోను చేసి అన్నా నాకు చాలా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది.. నువ్వు త్వరగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. దీంతో హుటాహూటిన పని నుంచి ఇంటికి వెళ్లగా భార్య తలుపు వేసుకొని, గొళ్లెం పెట్టుకొని ఉంది. కిటికీ తెరచి చూడగా చంద్రకళ తన చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కలినిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో గొళ్లెం పగలగొట్టి లోపలకు వెళ్లి చంద్రకళను కిందకి దించాడు. అంబులెన్స్ డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోనట్టు నిర్ధారించారు. ఇష్టం లేని వివాహం చేసినందుకేనా..? చంద్రకళకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీఏ చదువుకున్న ఆమెకు బెంగళూరులో ఉంటున్న తన స్నేహితుడంటే ఇష్టమై ఉండొచ్చని.. ఆమె కాల్ లిస్ట్లో చివరిగా మాట్లాడిన కాల్ కూడా అతనిదేనని సమాచారం. మృతికి కారణాలు పూర్తిగా తెలియడం లేదని.. యువతి తల్లిదండ్రులు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): -
అసాద్ నుంచి ఆబాన్ వరకు.. మృత్యుపాశంలో అతీక్ కుటుంబం!
లక్నో: మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో గత మూడేళ్లుగా వరుస విషాదాలు అలుముకున్నాయి. ఉమేష్ పాల్ హత్య కేసుతో మొదలైన పోలీసుల ఏరివేత చర్యలు, ఆ తర్వాత అతీక్, ఆయన తమ్ముడు అష్రఫ్ల హత్యలు, తాజాగా మరో కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది. గత మూడేళ్ల కాలంలో జరిగిన ఈ పరిణామాలు ఇలా ఉన్నాయి.ఉమేష్ పాల్ హత్య(ఫిబ్రవరి 24, 2023)ప్రయాగ్రాజ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు ప్రధాన సాక్షి ఉమేష్ పాల్, ఆయన ఇద్దరు భద్రతా సిబ్బందిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ హత్య కేసులో అతీక్ అహ్మద్, అతని ముఠాపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిందితులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించాయి.వరుస ఎన్కౌంటర్లు (ఫిబ్రవరి - ఏప్రిల్ 2023)ఫిబ్రవరి 27, 2023: ఉమేష్ పాల్ హత్య జరిగిన మూడు రోజులకు నిందితుడు అర్బాజ్ను పోలీసులు నెహ్రూ పార్క్ సమీపంలో చుట్టుముట్టారు. పోలీసులపై జరిపిన కాల్పులకు ప్రతిగా జరిగిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. ఉమేష్ హత్యలో ఉపయోగించిన కారును అతనే నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు.మార్చి 6, 2023: ఈ కేసులో మరో నిందితుడైన విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఉమేష్పై తొలి కాల్పులు జరిపింది ఇతనే అని పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 13, 2023: దాదాపు 50 రోజులు పరారీలో ఉన్న అతీక్ మూడో కుమారుడు అసాద్ అహ్మద్, అతని సహచరుడు గులామ్ను ఝాన్సీలో యూపీ ఎస్టీఎఫ్ మట్టుబెట్టింది. అసాద్పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఏప్రిల్ 15, 2023: అసాద్ అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత, ప్రయాగ్రాజ్లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మీడియా ముఖంగా జర్నలిస్టుల వేషంలో వచ్చిన ముగ్గురు దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య చేసిన లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీ సింగ్లను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.తాజాగా రోడ్డు ప్రమాదంలో ఆబాన్ మృతిఅతీక్ కుటుంబంపై మృత్యు నీడ ఇంకా వీడలేదు. తాజాగా అతీక్ కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 2023లో మైనర్లుగా ఉన్న ఆబాన్, ఎహజమ్లను బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచగా, ఆ తర్వాత అక్టోబర్ 2023లో వారు విడుదలయ్యారు.ప్రస్తుతం అతీక్ కుటుంబంలో.. షైస్తా పర్వీన్ (భార్య): ఉమేష్ పాల్ హత్య కేసులో పరారీలో ఉన్నారు.ఉమర్ అహ్మద్ (పెద్ద కుమారుడు): లక్నో జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.అలీ అహ్మద్ (రెండో కుమారుడు): నైని సెంట్రల్ జైలులో ఉన్నాడు.ಅసాద్ అహ్మద్ (మూడో కుమారుడు): ఏప్రిల్ 2023లో పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు.ఆబాన్ (నాల్గో కుమారుడు): తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఎహజమ్ (చిన్న కుమారుడు): అక్టోబర్ 2023లో విడుదలైన తర్వాత తన మేనత్త సంరక్షణలో ఉంటున్నాడు. కాగా గత మూడేళ్లలో జరిగిన వరుస పరిణామాలు, పోలీసుల చర్యలు, హత్యలు, ప్రమాదాల కారణంగా అతీక్ అహ్మద్ సామ్రాజ్యం, అతని కుటుంబం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు.. -
ఏడాది తర్వాత అస్థిపంజరంగా..!
కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. -
కంటిరెప్పే కాటేసింది!
సనత్నగర్ (హైదరాబాద్): సొంత కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై సనత్నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసిస్తున్న భార్యాభర్తలకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి (45) హౌస్ కీపింగ్ పనులు చేస్తుండేవాడు. మద్యం తాగే అలవాటున్న తండ్రి రోజూ ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో ఘర్షణ పడుతుండేవాడు.ఈ క్రమంలో తన రెండో కుమార్తెపై కన్నేసిన నిందితుడు.. భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు పరువు పోతుందనే భయంతో నోరు విప్పలేదు. ఇటీవల రోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, పిల్లలపై దాడి చేయడం, దుర్భాషలాడుతుండడాన్ని భరించలేని రెండో కుమార్తె (16) గురువారం సాయంత్రం సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి తనపై చేసిన అకృత్యాలను బయటపెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. -
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్లి బైక్పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఎంబీబీఎస్లో మెరిట్ స్టూడెంట్ కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఎక్లాస్పురానికి వలస వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె మెరిట్ స్టూడెంట్గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్ ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తున్నారు.వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
ఫీజుల ఒత్తిడి తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు జె.రామారావుపేట సమ్మెట వారి వీధికి చెందిన విద్యార్థి (16) స్థానిక శాంతినగర్లోనిఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్ ఫీజు గడువు ముగిసింది. అయితే, శుక్రవారం విద్యార్థి తన తండ్రితో కలిసి ఫీజు చెల్లించేందుకు వెళ్లాడు. కళాశాల యాజమాన్యం, ఆలస్యం అయిందని కట్టించుకునేందుకు ప్రధాన కార్యాలయ అనుమతి కావాలని, రేపు రావాలని చెప్పారు. దీంతో ఇద్దరు ఇంటికి బయల్దేరారు. మార్గ మధ్యంలో తండ్రి తాను పనిచేస్తున్న ఫాస్ట్ఫుడ్ సెంటర్కి వెళతానని, ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని కుమారుడిని పంపేశాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థి, ఇంట్లో ఫ్యానుకు తన తల్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి అతడి అన్నయ్య గమనించి కాకినాడ జీజీహెచ్కు తరలించాడు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు ధృవీకరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు, ఫీజు ఒత్తిడి వల్లే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫీజుల కోసం విద్యార్థిని పొట్టనబెట్టుకున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆత్మహత్య ఘటనపై కాకినాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన బాలికోన్నత పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి (13) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందింది. మండలంలోని చిట్టంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పాఠశాలకు ఆనుకుని ఉన్న మరో భవనంలో ఆరబెట్టిన దుస్తులు తీసుకునేందుకు వెళ్లింది. దుస్తులు అందకపోవడంతో అక్కడున్న ఇనుప స్టాండ్పై ఎక్కి ఇనుప కిటికీని పట్టుకుంది. ఆ కిటికీకి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్కు గురై కేకలు వేసింది. మరో విద్యార్థిని దీపిక ఆమెను చున్నీతో లాగింది. వెంటనే ఆమెను వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మీపార్వతి మృతికి హాస్టల్ వార్డెన్, హెచ్ఎం కారణమంటూ తల్లిదండ్రులు కెచ్చెల అమల, సుధాకర్రెడ్డి, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మోసుకుని ఆశ్రమ పాఠశాల గేటు వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు. -
బోరబండలో యువతిపై కత్తితో దాడి.. కలకలం
హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతంలో యువతిపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో హిచ్ హోటల్ సమీపంలో చంపాపేటకు చెందిన కె. చంటి బోరబండకు చెందిన రమ్యశ్రీ మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి స్వల్పంగా గాయపడింది. అనంతరం నిందితుడు, బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ దాడికి గల కారణాలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, ఘటన వెనుక అసలు పరిస్థితులేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
నల్లకుంటలో విషాదం! సిలిండర్ పేలి ఇద్దరు మహిళలకు గాయాలు
హైదరాబాద్: నగరంలో ఆదిక్మెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి సిలిండర్ పేలుడు సంభవించింది. దీంతో స్థానికంగా భయాందోళన పరిస్థితి నెలకొంది. ఆదిక్మెట్ పరిధిలోని వడ్డర బస్తీ, ప్రభుత్వ పాఠశాల సమీపంలో రాత్రి సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో సునీత, పుష్పలత అనే ఇద్దరు మహిళలు గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోగల సౌమ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే సిలిండర్ పేలడానికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
10 నెలల క్రితమే ప్రేమ పెళ్లి : రీల్స్ చేస్తోందని చంపేశాడు!
కలకాలం కలిసి ఉందామని బాస చేశాడు. తల్లిదండ్రులను కూడా మరిపించి సుమారు 10 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కన్న ఊరు వదిలి బెంగళూరులో మకాం పెట్టాడు. అంతలోనే తననుపట్టించుకోవడంలేదనీ, ఎక్కువ సమయం రీల్స్చేయడంతోనే గడుపుతోందంటూ అసహనం పెంచుకుని భార్యను మట్టు బెట్టాడు.పోలీసుల వివరాల ప్రకారం, బిహార్కు చెంది 24 ఏళ్ల ధీరజ్ కుమార్, రీమా కుమారి ప్రేమించాడు. 10 నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. రీమా కుటుంబ సభ్యులకు చెప్పకుండా వీరిద్దరూ బెంగళూరు వచ్చి కుంబళగోడు (Kumbalgodu) పట్టణంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య రీమాను గొంతు నులిమి హత్య చేసి స్వగ్రామమైన బిహార్కు పారిపోయాడు. చివరకు పోలీసులు ధీరజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు.బెంగళూరు వచ్చాక రీమాకు తనపై ఆసక్తి తగ్గిందని, రోజంతా సోషల్ మీడియాలో 'రీల్స్' (Reels) చేస్తూ గడిపేదని ధీరజ్ పోలీసులకు తెలిపారు. సఅలు తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో పాటు, కేవలం తన కోసమే వంట చేసుకుని, అతనికి వడ్డించేది కాదని పేర్కొన్నాడు. తిరిగి బీహార్ వెళ్దామని పట్టుబట్టడంతో వీరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో జూలై 25న ధీరజ్ ఇంటికి వచ్చేసరికి అతనికి ఆహారం సిద్ధం చేయలేదు. దీనిపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ధీరజ్ ఆమెను పడుకోమని చెప్పగా, రీమా నిరాకరించి కలప కర్రతో అతనిపై దాడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ధీరజ్, ఆమె చున్నీతోనే (Dupatta) ఉరివేసి చంపేశాడు. హత్య అనంతరం ఆమె ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి, మృతదేహాన్ని బెడ్ షీట్లో చుట్టేసి, గదికి తాళం వేసి బీహార్కు పారిపోయాడు.ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతఆమె మృతదేహం కుళ్లి ఆ గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో, ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. జూలై 29న పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో రీమా మృతదేహం లభ్యమైంది. హత్య, సాక్ష్యాల నాశనం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి నిందితుడిని కుంబళగోడు పోలీసులు బిహార్లో అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్నిఅంగీకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ వైజ్ఞానిక ఆధారాలను కూడా సేకరించామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ -
‘మన గురించి తెలిసిపోయింది.. నా భర్తకు యాక్సిడెంట్ చేయ్..’
సాక్షి, మహబూబాబాద్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నారంటూ ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. సదరు భర్త.. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలం చిలకోడు గ్రామానికి చెందిన గాడే రాజేశ్వర్ రావు, సూర్యాపేట జిల్లా మోటే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానిని 2016లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వర్ రావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, తన భార్య భవానికి ఓ కొరియర్ డెలివరీ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గత నెల 27న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసినట్లు ఆయన తెలిపారు.ఆ తర్వాత భార్య మొబైల్ ఫోన్లోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సందేశాలను పరిశీలించగా, తనను(భర్తను) టార్గెట్ యాక్సిడెంట్ చేసి చంపేయాలని, లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియుడికి సందేశాలు పంపినట్లు గుర్తించానని రాజేశ్వర్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గత నెల 28న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సమీప గ్రామంలో ఉన్న తన అన్నయ్యను తీసుకురావడానికి వెళ్తుండగా, సైదులు తనను వెంబడించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని రాజేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
పాపులర్ క్రైమ్ సిరీస్ ప్రేరణతో భార్య హత్య, రూ. 13 లక్షలతో పరార్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఒక దారుణ హత్యోదంతం కలకలం రేపింది. పాపులర్ హాలీవుడ్ క్రైమ్ సిరీస్ 'ది స్టేర్కేస్' (The Staircase) చూసి, దాని ఆధారంగా భార్యను హత్య చేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది.62 ఏళ్ల సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, ఆస్తి వివాదం కారణంగా భార్యను దారుణంగా హత్య చేశాడు. రియల్ స్టోరీ ఆధారంగా తీసిన ఈ సిరీస్ మరో హత్యకు దారి తీసింది. అయితే సాక్ష్యాలను తుడిచిపెట్టి పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.ఒక భర్త, ఒక భార్య, ఒక దారుణమైన మరణం, ఆపై శాశ్వతంగా మాయమైన హత్యాయుధం. చివరికి న్యాయం అస్పష్టంగా మిగిలిపోవడం... ఇదీ HBO'ది స్టేర్కేస్'. సరిగ్గా ఇదే స్టోరీ తూర్పు ఢిల్లీలోని ఒక ఇంట్లో, ఇదే కథనం నిజ జీవితంలో మరోసారి పునరావృతమైంది.ఈ ఘటన జూలై 30న జరిగిందిపోలీసుల వివరాల ప్రకారం62 ఏళ్ల సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కమల్ సింగ్, ఆయన భార్య కోమల్ సింగ్ దంపతుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు తలెత్తాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా వీరిద్దరూ విడివిడిగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారంటే వీరి విభేదాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అయితే తాను అనుకున్న పథకాన్ని అమలు చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడికి అవకాశం చిక్కింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి (కుమారుడు లైబ్రరీకి, కుమార్తె ఆఫీసుకు, పనిమనిషి పని ముగించుకుని వెళ్లిన తర్వాత) మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో బాల్కనీలో బట్టలు ఆరేస్తున్న భార్యపై కమల్ కత్తితో వెనుక నుంచి దాడి చేశాడు. దెబ్బ గట్టిగా తగలక పోవడంతో కోమల్ కేకలు వేస్తూ కిచెన్లోకి పరుగెత్తింది. కమల్ ఆమెను జుట్టు పట్టుకుని లివింగ్ రూమ్లోకి ఈడ్చుకొచ్చి, కత్తెరతో దారుణంగా పొడిచి చంపేశాడు. పొరుగువారికి కేకలు వినిపించినా ఎవరూ కలగజేసుకోకపోవడం మరో విషాదం.అనంతరం కమల్ రక్తం మరకల బట్టలు, కత్తిని బ్యాగ్లో పెట్టి, స్నానం చేసి స్కూటర్పై పారిపోయాడు. మార్గమధ్యంలో ఆ బ్యాగ్ను పారేశాడు. అలాగే భార్య గదిలోని రూ. 5 లక్షలతో పాటు, రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 7 లక్షలు ఉపసంహరించి మొత్తం రూ. 12.75 లక్షల నగదుతో పరారయ్యాడు. రాత్రి కుమారుడు ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులోపడి ఉంది. మృతదేహం వద్ద కత్తెర మాత్రమే దొరికింది,కత్తి కనిపించలేదు.అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. కమల్ మొదట తన ఫోన్ ఆన్ చేసి గోరఖ్పూర్ వైపు వెళ్లాడు. నేపాల్ పారిపోతున్నట్లు బిల్డప్ ఇవ్వాలని చూశాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మథుర వైపు వెళ్లాడు. ఎట్టకేలకు మూడు రోజుల గాలింపు తర్వాత ఢిల్లీ పోలీసులు మథుర రైల్వే స్టేషన్ వద్ద కమల్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి స్కూటర్ ,పూర్తి నగదును స్వాధీనం చేసుకున్నారు. 'ది స్టేర్కేస్' సిరీస్లో చూపించినట్లుగానే, ఆయుధాన్ని దొరక్కుండా పారేస్తే తనపై బలమైన ఆధారాలు ఉండవని భావించి ఆయుధాన్ని దాచేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతజగత్పురిలో ఒక ఆస్తిని తన తండ్రి పేరిట కొనాలని కమల్ భావించగా, అందులో వాటా కావాలని భార్య కోమల్ పట్టుబట్టింది. దీనికి తోడు కమల్కు ముంబైలో మరొక మహిళతో ఉన్న సంబంధం వీరి మధ్య ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. -
ఏసీ గదిలో నిద్ర.. అదే చివరి రాత్రైంది!
ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం ఆ కుటుంబం మొత్తం ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమించింది. కానీ అదే వారి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాల ధాటికి దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపం ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం కుటుంబమంతా ఒకే ఏసీ గదిలో నిద్రించగా.. అదే వారికి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాలకు దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రతాప్గఢ్ జిల్లాలోని మహులి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది. నగర్ కోత్వాలి పరిధిలోని ఓ పాత ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు.క్షణాల్లో శిథిలాల కిందఎండ తీవ్రత కారణంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏసీ ఉన్న ఒకే గదిలో నిద్రించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బలహీనంగా మారిన పాత ఇంటి పైకప్పు వర్షం ధాటికి కూలిపోయింది. దీంతో నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.ఆరుగురి మృతి.. ఒకరి ప్రాణాలతో పోరాటంఈ ఘటనలో ప్రమోద్ శ్రీవాస్తవ్ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (24), మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ పెద్ద కుమారుడు అమన్ (28) మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శిథిలాల నుంచి స్వయంగా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాత భవనం పరిస్థితి, కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.వర్షాలకు వరుస విషాదాలుప్రతాప్గఢ్ ఘటనతో పాటు ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ పాత నిర్మాణాలు కూలి ప్రాణ నష్టం జరిగింది. బారాబంకీ జిల్లాలోని అలియాబాద్లో పాత ఇటుక గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏడేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. సహరన్పూర్ జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా మట్టి ఇల్లు కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. గ్రామస్థుల సహాయంతో ఆమెను బయటకు తీసినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.వరుసగా కురుస్తున్న వర్షాలు పాత ఇళ్లకు ప్రమాదంగా మారుతున్నాయి. బలహీనంగా ఉన్న నిర్మాణాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు!
ఒంటరిగా జీవిస్తున్న ఆ వృద్ధ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇంట్లో నగలు కనిపించకుండా పోయాయి.. వాటి గురించి ఆరా తీసేందుకు వెళ్లిన ఇంటి పెద్ద మహిళ తిరిగి రాలేదు. గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఊహించని షాక్ ఎదురైంది. అదృశ్యమైన మహిళ ఇంటి సమీపంలోని పైకప్పుపై చెట్టు కింద శవమై కనిపించింది. ఆ తర్వాత బయటపడిన సీసీటీవీ దృశ్యాలు కేసులో కీలక మలుపుగా మారాయి.హర్యానాలోని పంచకుల సెక్టార్-21లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మన్మోహన్ లాల్ మెహతా భార్య నీరా మెహతా (72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మెహతా ఇంట్లో కొన్ని నగలు కనిపించకుండా పోయాయి. వాటి గురించి తెలుసుకునేందుకు నీరా మెహతా ఇంట్లో పనిచేసే సునీతా దేవి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఘర్షణకు దారితీసి ఉండొచ్చని, ఆ సమయంలోనే నీరా మెహతా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా తేలనున్నాయి.ఇంటి పక్కనే దాచిన మృతదేహంభర్త ఫిర్యాదుతో నీరా మెహతా అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సునీతా దేవి ఇంటికి వెళ్లగా.. ఆ ఇల్లు బయట నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. అనంతరం పక్కింటి పైకప్పు నుంచి పరిశీలించగా.. చెట్టు కింద కప్పి ఉంచిన స్థితిలో నీరా మెహతా మృతదేహం కనిపించింది. వెంటనే ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలుఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా మారింది. సునీతా దేవి, ఆమె కుమారుడు రాజా కలిసి మృతదేహాన్ని తరలించి పక్కింటి పైకప్పుపై దాచేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించిన కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ముగ్గురి అరెస్టుఈ ఘటనకు సంబంధించి పోలీసులు సునీతా దేవి, ఆమె భర్త శంకర్, కుమారుడు రాజాలను అరెస్టు చేశారు. హత్య, ఆధారాల ధ్వంసం, దొంగతనం, ఉమ్మడి ఉద్దేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులు మాత్రం నగల దొంగతనం ఆరోపణలను ఖండించినట్లు పోలీసులు తెలిపారు. సునీతా దేవి కన్ఫెషన్ రిపోర్ట్లో.. నీరా మెహతా ప్రమాదవశాత్తు జారి పడిపోయారని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా నివసించే వృద్ధులు ఇంట్లో పనిచేసే సిబ్బంది వివరాలను పోలీసులతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఘటన పనిమనుషుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది. -
ఢిల్లీ పోలీసులమంటూ సైబర్ మోసం
కోనేరు సెంటర్ (మచిలీపట్నం):‘మేం ఢిల్లీ పోలీసులం. ఈడీ అధికారులం. సుప్రీంకోర్టు జడ్జి విచారణజరుపుతున్నారు. మీపై డిల్లీలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి నేరం మోపబడింది. కేసు సైతం నమోదైంది. ఇక మీరు తప్పించుకోలేరు. మేం చెప్పినట్లు చేస్తే కేసు నుంచి తప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మీ ఆస్తులు సీజ్ చేసి జైలుకు పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వృద్ధురాలిని బెదిరించి భారీ మొత్తంలో సొమ్ము కాజేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు గురువారం మచిలీపట్నం పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాసుపేటకు చెందిన వెంపటి అలవేలు మంగమ్మకు జూన్ 10న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్చేసి ఆమెపై ఢిల్లీలో మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు. ఢిల్లీలోని కెనరా బ్యాంకు ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో అక్రమంగా లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కాగా అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు నమ్మించారు. కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని వీడియో కాల్స్ చేసి చూపించారు. ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జి విచారిస్తున్నట్లు ఫేక్ ఫొటో చూపించి నమ్మించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే జరిగిన విషయం ఇతరులకు చెప్పకుండా తాము చెప్పినట్లు చేయాలని కోరారు. ఆమె ఖాతాలో ఉన్న రూ.1,43,50,000ను ఆర్టీజీఎస్ ద్వారా వారి ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు. అక్కడితో ఆగకుండా జూలై చివరిలో మరో రూ.95 లక్షలు చెల్లిస్తే కేసు నుంచి పూర్తిగా తప్పుకునేలా చేస్తామని.. లేదంటే ఉన్న ఆస్తులన్నింటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని అమెరికాలో ఉన్న తన కుమారుడికి చెప్పింది. విషయం తెలుసుకున్న కొడుకు ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించాడు. దీంతో బాధితురాలు మచిలీపట్నం పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. -
భర్త, కుమారుడితో కలిసి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
ఉయ్యూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఇన్చార్జ్ కార్యదర్శిగా (సీఈఓ) పనిచేస్తున్న ఒక ఉద్యోగిని భర్త, కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం కృష్ణాజిల్లా, ఉయ్యూరు సమీపంలోని కడవకొల్లు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. కడవకొల్లు శివారు వీరవల్లి మొఖాసా పరిధిలో గల పీఏసీఎస్లో పనిచేస్తున్న హేమ అక్కడికి సమీపంలోని ఉయ్యూరు శివాలయం రోడ్డులో భర్త బాలాజీ, కుమారుడు మేఘాన్ష్ తో కలిసి నివసిస్తున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో భర్త, కుమారుడితో కలిసి పురుగు మందు తాగారు. ఫోన్ ద్వారా హేమ చెప్పిన సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన వారి నివాసానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని వైద్యం నిమిత్తం తొలుత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి, అటుపై మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సొసైటీ చైర్మన్గా పనిచేసిన జొన్నలగడ్డ తాతా నరేష్ బాబే తమ ఆత్మహత్యకు కారణమని సూచిస్తూ హేమ రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ‘నరేష్ బాబుకు రూ.2 లక్షలు ఇచ్చి గుమాస్తాగా ఉద్యోగంలో చేరా. అటు తర్వాత సీఈఓగా పదోన్నతి పొందా. నరేష్ తన వ్యక్తిగత అవసరాలకు సొసైటీ సొమ్ము వాడుకుంటూ ఉండేవాడు. ఇవ్వనని నిరాకరిస్తే బెదిరించేవాడు. ఒత్తిడి తట్టుకోలేక డిపాజిట్లు క్లోజ్ చేసి సొమ్ము అప్పగించేవాళ్లం. అప్పటి నుంచి ఈ విధంగా రూ. 62,38,393 నగదు దుర్వినియోగం అయినట్లు బ్యాంకు అధికారులు గత నెల 17న నిర్వహించిన తనిఖీల్లో తేల్చారు. పది రోజుల్లో సొమ్ము జమ చేయాలని బ్యాంకు అధికారులు ఆదేశించారు. నరేష్ ను సొమ్ము విషయమై అడగ్గా తనకు సంబంధం లేదని, నువ్వే కట్టుకో అంటూ బెదిరించాడు. సొమ్ము కట్టలేని పరిస్థితుల్లో పరువు పోతుందనే భయంతో డిపాజిట్దారులకు ఎలా న్యాయం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నా’ అని హేమ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా హేమ ఆరోపణలపై నరేష్ ను సంప్రదించగా తాను బ్యాంకు చైర్మన్ పదవి కోల్పోయి రెండున్నరేళ్లు అవుతుందని, నిధులు గోల్మాల్ వ్యవహారానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎప్పుడూ తనతో కార్యదర్శి హేమ చర్చించలేదని వివరణ ఇచ్చారు. -
‘నన్ను కాపాడండి..’.. రక్తపు మడుగులో అతీక్ కొడుకు చివరి క్షణాలు
లక్నో: నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ (ప్రయాగ్రాజ్) ప్రాంతాన్ని తన నేరసామ్రాజ్యంతో గజగజలాడించిన మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్కు ఉన్న ఐదుగురు కుమారులలో అందరికంటే చిన్నవాడైన అబాన్ అహ్మద్ గురువారం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతంలో అత్యంత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారులో చిక్కుకున్న అబాన్ అహ్మద్ తన చివరి క్షణాల్లో ‘నన్ను కాపాడండి’ అంటూ ఆర్తనాదాలు చేశాడని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షి దీపక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న హ్యుందాయ్ క్రెటా కారు అత్యంత వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి ఒక దూడ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్ను తిప్పగా, అదే సమయంలో ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కూడా వచ్చింది. అంతటి వేగంలో కారును కంట్రోల్ చేయలేక, ఆ బైకును తప్పించే క్రమంలో కారు రోడ్డు డివైడర్ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో డివైడర్ను ఢీకొట్టిన కారు గాల్లోకి లేచి రోడ్డుపై పల్టీలు కొడుతూ కిందపడింది. ప్రమాదం జరగడం చూడగానే నేను కారులో ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు పరుగున వెళ్లాను. కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా అవి పూర్తిగా లాక్ అయిపోయాయి. సాధ్యం కాకపోవడంతో వెంటనే సమీపంలో ఉన్న ఒక ఇనుప రాడ్డును తెచ్చి కారు డోర్లను బద్దలు కొట్టాను. అనంతరం పోలీసులకు సమాచారం అందించాను. డోర్లు తెరిచేసరికి కారు ముందు ప్యాసింజర్ సీట్లో రక్తపు మడుగులో పడి ఉన్న అబాన్ అహ్మద్ తీవ్ర నొప్పితో విలవిలలాడుతూ.. 'నన్ను కాపాడండి' అని వేడుకుని, ఆ వెంటనే స్పృహ కోల్పోయాడు అని దీపక్ యాదవ్ వివరించాడు. గాయపడిన ముగ్గురిని పూంచ్ పోలీసులు వెంటనే మోంథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు.రోడ్డు ప్రమాదంపై ఝాన్సీ ఎస్ఎస్పీ బీబీజీటీఎస్ మూర్తి మాట్లాడుతూ..ప్రమాదం జరిగే సమయంలో అబాన్ కారు గంటకు 120 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా, ఆ సమయంలో కురిసిన తేలికపాటి వర్షం కారణంగా హైవే రోడ్డు తడిగా మారిందని, మితిమీరిన వేగం వల్లే బ్రేకులు వేసినా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, కారులో ఉండి ప్రాణాలతో బయటపడిన ఉమర్ అహ్మద్ అనే మరో యువకుడు మాత్రం.. రోడ్డుపై ఉన్న ఒక ఇటుకను కారు బలంగా ఢీకొట్టడం వల్లే వాహనం నియంత్రణ కోల్పోయిందని పోలీసులకు తెలిపాడు. -
నో మీన్స్ నో.. తెహల్కా మాజీ ఎడిటర్కు బిగ్ షాక్
ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు బాంబే హైకోర్టు గోవా బెంచ్లో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు కొట్టివేసింది. తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు కానుంది. అయితే తీర్పు అనంతరం.. కోర్టులో కాసేపు హైడ్రామా నడిచింది.2013 నవంబర్లో గోవాలో జరిగిన థింక్ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో తేజ్పాల్పై కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.ఈ కేసులో 2014లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2017లో గోవాలోని మపుసా కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2021 మేలో కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్పై జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసందేకర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పు వెలువడడాని కంటే ముందే తేజ్పాల్ కోర్టుకు వచ్చారు.బాధితురాలి ప్రవర్తనపై ముందస్తు అంచనాలు సరికాదురాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. ప్రతి బాధితురాలి స్పందన ఒకేలా ఉండదని, వ్యక్తిగత పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అంశాల ఆధారంగా మారుతుందని పేర్కొన్నారు.ట్రయల్ కోర్టు తన తీర్పులో బాధితురాలు లైంగిక దాడి అనంతరం సాధారణంగా కనిపించే ప్రవర్తనను ప్రదర్శించలేదని వ్యాఖ్యానించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తుషార్ మెహతా.. బాధితుల ప్రవర్తనను ఒకే కొలమానంతో అంచనా వేయలేమని తెలిపారు. ఇటు తేజ్పాల్ తరఫున సీనియర్ న్యాయవాది అబాద్ పొండా వాదనలు వినిపించారు.నో మీన్స్ నో.. అరెస్ట్కు డిమాండ్తేజ్పాల్ను దోషిగా నిర్ధారించిన అనంతరం ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. బాధితురాలు తన కుమార్తె వయసులో ఉన్నప్పటికీ తేజ్పాల్ నేరానికి పాల్పడ్డారని, ఆమె నిరాకరించిన తర్వాత కూడా ముందుకు వెళ్లారని వాదించారు. “ఒక మహిళ ‘నో’ అంటే దాని అర్థం నోనే అని సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లాలి” అని తుషార్ మెహతా కోర్టులో పేర్కొన్నారు.మరోవైపు, తీర్పు అనంతరం తరుణ్ తేజ్పాల్ శిక్షలో ఉపశమనం ఇవ్వాలని కోరారు. “నాకు 62 ఏళ్లు. నేను కూడా బాధితుడిననే నమ్ముతున్నాను. నాకు భార్య ఉంది. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తాను. దయచేసి నా విషయంలో కొంత సానుభూతి చూపించండి” అని కోర్టును అభ్యర్థించారు.తెహల్కా-తరుణ్ తేజ్పాల్ నేపథ్యంతెహల్కా భారత జర్నలిజం చరిత్రలో సంచలనాత్మక దర్యాప్తు కథనాలకు పేరుగాంచిన ప్రముఖ వార్తా మ్యాగజైన్. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ.. స్టింగ్ ఆపరేషన్లు, అవినీతి బహిర్గతాలు, రాజకీయ–కార్పొరేట్ వ్యవహారాలపై పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తెహల్కా వ్యవస్థాపకుల్లో తరుణ్ తేజ్పాల్ ఒకరు. జర్నలిస్టుగా, రచయితగా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. 1990లలో జర్నలిజంలోకి వచ్చిన తేజ్పాల్.. పలు ప్రముఖ ప్రచురణ సంస్థల్లో పనిచేసిన అనంతరం 2000లో తెహల్కా డాట్కామ్ను ప్రారంభించారు. ఆ తర్వాత దానిని వార్తా మ్యాగజైన్గా తీర్చిదిద్దారు.తెహల్కా నిర్వహించిన కొన్ని స్టింగ్ ఆపరేషన్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2001లో వెలుగులోకి వచ్చిన “ఆపరేషన్ వెస్ట్ ఎండ్” రక్షణ రంగంలో అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనాలతో తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే తర్వాతి కాలంలో తేజ్పాల్ వ్యక్తిగత జీవితం, సంస్థకు సంబంధించిన వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా 2013 లైంగిక దాడి కేసులో హైకోర్టు తీర్పుతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్ ప్రస్తుతం అప్రూవర్గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.కేసులో కొత్త మలుపుప్రదోష్ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కోర్టు ముందుకు ప్రదోష్ప్రదోష్ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.2024 జూన్లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్పై హత్య కుట్ర, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో దర్శన్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. ప్రదోష్ వాంగ్మూలం కీలకమవుతుందా?తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
12 ఎగ్జామ్స్లో టాపరే లీకురాయుడు!
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడే యువతకు అతడు ఒకప్పుడు ఆదర్శం. వరుసగా పోటీ పరీక్షలు రాసి.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 పరీక్షల్లో విజయం సాధించాడు. అతడి సక్సెస్ స్టోరీ చూసి ఎంతోమంది అభ్యర్థులు స్ఫూర్తి పొందారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పేరు పేపర్ లీక్ కేసులో మారుమోగుతోంది. జార్ఖండ్ పరీక్షల కుంభకోణంలో ప్రధాన అనుమానితుడిగా అరెస్టైన అభయ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.అభయ్ తివారీ.. జార్ఖండ్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన 19 మందిలో ఒక్కడు. అయితే అతను సాధించిన విజయాల జాబితా చిన్నది కాదు. నేవీ పరీక్ష, భాభా అణు పరిశోధన కేంద్రం (BARC) పరీక్ష, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు.. ఇలా అనేక పోటీ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. 13 ఏళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు క్లియర్ చేయడంతో అతడికి “ఎగ్జామ్ స్టార్”గా గుర్తింపు వచ్చింది. అయితే.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల ఆరోపణలు మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. “అతడి వరుస విజయాల వెనుక ప్రతిభేనా? లేక పరీక్షల వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్ సీఐడీ ఆరోపణల ప్రకారం.. అభయ్ తివారీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ఓ నెట్వర్క్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తన వరుస విజయాలనే(సిసలైన సక్సెసా? లేదంటే మోసమా? అనేది తేలాల్సి ఉంది).. నమ్మకంగా మార్చుకుని అభ్యర్థులను ఆకర్షించాడని అధికారులు భావిస్తున్నారు.పరీక్షల సంస్థతో పాత సంబంధాలుతివారీ గతంలో పరీక్షల నిర్వహణ సంస్థ TRS-Data Processing Private Limitedలో పనిచేశాడు. పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత అతడు జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. పాత పరిచయాలు కొనసాగించాడా? పరీక్షల వ్యవస్థలోకి ఎలా ప్రవేశించాడు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.పేపర్ లీక్తో బయటపడిన అసలు విషయంజార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తర్వాత నిరసనలు మరింత పెరిగాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.రాంచీలో రోడ్డెక్కిన విద్యార్థులురాంచీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పరీక్షలు రద్దు చేయాలని, అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరగా.. ప్రభుత్వం మాత్రం సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.ఇటు సీజేపీ ప్రతినిధి అభిజిత్ దీప్కే కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపారు.నలుగురు మంత్రులతో కమిటీవిద్యార్థుల ఆందోళన తీవ్రత పెరగడంతో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. సమస్యలను పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలకు ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థలో లోపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనలు కొంత తగ్గినా.. విద్యార్థులు మాత్రం కేవలం హామీలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.ఒక్క తివారీ కేసు కాదు.. వ్యవస్థకే పరీక్షఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఆదర్శంగా కనిపించిన అభయ్ తివారీ.. ఇప్పుడు అదే పరీక్షల వ్యవస్థపై వచ్చిన అనుమానాలకు కేంద్రంగా మారాడు. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమా? లేదంటే మరేదైనా కోణం ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం దేశంలో పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. -
ట్రాలీ బ్యాగులో కుళ్లిన మృతదేహం.. రైల్లో కలకలం!
ఆగ్రా: చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహ భాగాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం ఆగ్రా కంట్రోల్ స్టేషన్కు రైలు చేరుకున్న సమయంలో ఒక జనరల్ బోగీలో అనుమానాస్పదంగా పడి ఉన్న ఎర్రటి ట్రాలీ బ్యాగు నుంచి రక్తం కారుతుండటంతో పాటు తీవ్ర దుర్వాసన వెలువడింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా రైల్వే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ ఘటనపై వెంటనే స్పందించారు. గ్వాలియర్ స్టేషన్ దాటి ఆగ్రా వైపు వెళ్తున్న రైలులోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఉదయం సుమారు 5 గంటలకు ఆగ్రా కంట్రోల్ స్టేషన్కు రైలు చేరుకోగానే, జీఆర్పీ , ఆర్పీఎఫ్ సిబ్బంది జనరల్ బోగీలోకి ప్రవేశించి ఆ ట్రాలీ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.జీఆర్పీ సర్కిల్ ఆఫీసర్ రాజీవ్ దీక్షిత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్యాగును తెరిచి చూడగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న కాలు, ఉదర భాగానికి సంబంధించిన మృతదేహ అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలను ‘చెన్నై’ అని ముద్రించి ఉన్న పాలిథీన్ షీట్తో చుట్టి ఉంచారు. లభ్యమైన అవశేషాలను బట్టి మృతుడు పురుషుడు అయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.పోలీసులు ఈ ఘటన విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, నివేదిక వచ్చిన తర్వాతే మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలు స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు. చెన్నైకి ఒక ప్రత్యేక బృందాన్ని పంపి, ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మహత్యలు .. అత్యధికం విధుల్లో ఉన్నప్పుడే.. -
ప్రాణం తీసిన ఈత పందెం
చిన్నశంకరంపేట (మెదక్): సరదాగా కాసిన ఈత పందెం ప్రాణం తీసింది. మెదక్జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ శివానందం కథనం ప్రకా రం.. మంగళవారం గ్రామానికి చెందిన నల్ల సిద్దిరాములు (48)తోపాటు ఉప్పరి రాజు, బీరప్ప, ఎల్లం పందెం కాసి చెరువులో ఈతకు దిగారు. చెరువు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లాలని పందెం వేసుకున్నారు. దీంతో ఉప్పరి రాజు, నల్ల సిద్దిరాములు చెరువులో ఈతకు దిగారు. మరో ఇద్దరు చెరువుకట్టపైనే ఉండి పోయారు. అయితే ఈతకు వెళ్లిన ఉప్పరి రాజు తిరిగి రాగా, సిద్దిరాములు మాత్రం చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీ సులు మంగళవారం రాత్రి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో బుధవారం ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్ది రాములు మృతదేహాన్ని గుర్తించి చెరువు నుంచి బయటకు తీశారు. సిద్దిరాములు భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్తన్నారు. -
హోమ్లోన్ భారం.. లోక్సభ సచివాలయ డైరెక్టర్ ఆత్మహత్య?
సాక్షి,న్యూఢిల్లీ: హోమ్లోన్ భారం లోక్సభ సచివాలయ డైరెక్టర్ ప్రాణాన్ని సైతం బలి తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ సచివాలయంలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గౌరవ్ గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు ముందు ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ లేఖలో సుమారు రూ. 70 లక్షల హోమ్లోన్ బాకీ ఉన్నట్లు, అదే తన మరణానికి ప్రధాన కారణమని పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల కథనం ప్రకారం.. లోక్సభ సచివాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గౌరవ్ గౌతమ్, సెక్టార్ 82లోని కేంద్రీయ విహార్-II సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన తన నివాసంలోనే అపస్మారక స్థితిలో కనిపించారు. ఆ సమయంలో గౌతమ్ భార్య పుట్టింటికి వెళ్లారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డు సహాయంతో అపార్ట్మెంట్లోకి ప్రవేశించి చూడగా ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గౌతమ్ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోమ్లోన్ భారం పెరిగిపోవడం, ఇంకా రూ. 70 లక్షల వరకు రుణం చెల్లించాల్సి ఉండటమే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం, స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. గౌతమ్ మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి
ఛత్రా: జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం, నిర్బంధం ఆరోపణల నేపథ్యంలో ఒక యువకునిపై ఆగ్రహించిన గ్రామస్తుల అతనికిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఒక బాలిక కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె ఆచూకీ లభించగా, సదరు యువకుడు తనను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.దీంతో సుమారు 100 నుంచి 150 మంది గ్రామస్తులు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు. ఆ యువకుడి తల్లిదండ్రులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా 56 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీఓ) డియోలాల్ ఒరాన్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని, నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు.ఇది కూడా చదవండి: జంతర్ మంతర్లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్ -
డబ్బుల్లేవా? అయితే చచ్చిపో!
స్నేహం అంటే నమ్మకం.. కష్టాల్లో అండగా నిలిచే బంధం. కానీ అదే ఓ వ్యక్తి జీవితంలో విషాదానికి కారణమైంది. నమ్మినవాళ్లే మోసం చేయడం, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, పైగా బెదిరింపులకు దిగడంతో.. అంతకు మించి అవమానించడంతో ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై.. చివరకు తన ప్రాణాలనే తీసుకున్నాడు. గుజరాత్ సూరత్లోని సార్థానా ప్రాంతానికి చెందిన రాజేశ్భాయ్ కుంజాడియా ఎంబ్రాయిడరీ వ్యాపారం చేసేవారు. గత కొన్ని నెలలుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో తన స్నేహితులకు అవసరాలు పడడంతో.. తన దగ్గరున్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు. అయితే ఆ నమ్మకం వమ్ము కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజేశ్భాయ్ తన స్నేహితుడు ఘనశ్యామ్ అహిర్కు కెనడా వెళ్లేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ.14 లక్షలు ఇచ్చారు. కొంతకాలం తర్వాత డబ్బు తిరిగి అడిగినప్పుడు ఘనశ్యామ్ తప్పించుకోవడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రాజేశ్భాయ్ పేరుతో పలు బ్యాంకు ఖాతాలు తెరవాలని ఒత్తిడి చేశాడు. ఎందుకు? అని గట్టిగా ఆరా తీస్తే.. సైబర్ నేరాలకు ఉపయోగించే ‘మ్యూల్ అకౌంట్స్’ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్భాయ్ అభ్యంతరం చెప్పడంతో తనను సైబర్ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడరు. అదే సమయంలో.. మరో ఇద్దరు స్నేహితులు నికిత్ అలియాస్ రిక్కీ, దాధీ అహిర్లకు కూడా ఆయన డబ్బు ఇచ్చారు. ఒకరికి రూ.2 లక్షలు, మరొకరికి రూ.1.32 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి వద్ద కలిపి రాజేశ్భాయ్కు రావాల్సిన మొత్తం రూ.17.32 లక్షలు. ఆ ముగ్గురు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. స్నేహితులు తనను అవమానించారని, ఒత్తిడి చేశారని రాజేశ్భాయ్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. “డబ్బుల్లేవా? అయితే చచ్చిపో” అంటూ వారు చెప్పడంతో రాజేశ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.జులై 30న రాజేశ్భాయ్ సూసైడ్ నోట్ రాసి.. తన కుమార్తెతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కుమార్తెను తిరిగి ఇంటికి పంపించి విషం తీసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు.మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నేహితుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని గుర్తించి.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. ఫ్రెండ్షిప్ డే రోజే(ఆగస్టు 2న) ఘనశ్యామ్, నికిత్, దాధీ అహిర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్నేహం పేరుతో నమ్మకద్రోహం చేస్తే ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. -
హైదరాబాద్లో లిఫ్ట్ బీభత్సం.. మహిళ విషాదం!
హైదరాబాద్, చందానగర్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆమె లోపల అడుగు పెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వెంటనే వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్కడి బంగ్లాదేశ్? ఎక్కడి ఆదిలాబాద్?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో జరిగిన దొంగతనం కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీ గత కొన్నేళ్లుగా సుమారు 10 నుంచి 12 సార్లు అక్రమంగా, చాలా సులభంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడ్డాడు. వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో పనిచేసే 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్ వాసులతో కూడిన ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జిల్లా పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీవాసులతోపాటు ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. సుమారు తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీని విచారించగా, పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, బంగారం, వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ కాలనీల్లో సంచరిస్తారు. ఇళ్లను రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న వాటిని గుర్తిస్తారు. రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతారు. జౌనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎనిమిదికిపైగా నేరాల కేసులు ఉన్నాయి. ఇదే కేసులో పట్టుబడ్డ మరో సహ నిందితుడు భారత్కు చెందిన తరుణ్ సింగ్పై ఆరుకుపైగా కేసులు నమోదై ఉన్నాయి. ముఠాలోని ఇతర సభ్యులపై కూడా వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.సహకరించిన వ్యక్తుల పాత్రపై దర్యాప్తు..సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, నిఘా సమాచారం, వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులు, సహచరులు, అక్రమంగా భారతదేశంలో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ విదేశీయులు, అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఐబీకి వివరాలు పంపిస్తున్నాంఈ దొంగతనం కేసులో మరికొంత మంది బంగ్లాదేశ్ వాసులు ముఠాగా సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రధాన నిందితుడి ద్వారా తెలిసింది. ఆ మిగిలిన వారి కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి వివరాలు పంపిస్తున్నాం. అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? ఇంకా ఎలాంటి నేరాలు చేస్తున్నారు? అనే విషయాలను రాబడుతున్నాం. వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. – అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ -
రాయితో దాడి.. ఆపై గొంతుకోసి..
నారాయణఖేడ్: కుటుంబ కలహాలు, అనుమానం పెనుభూతంలా మారి కట్టుకున్న భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ఇరక్పల్లిలో చోటుచేసు కుంది. ఖేడ్ సీఐ శ్రీనివాస్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్ (35)కు 13 ఏళ్ల క్రితం మనూరు మండలం అతి మ్యాల్ గ్రామానికి చెందిన పర్వీన్ (32)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా సయ్యద్ ముల్తాన్ దర్గాలో పూజలు చేస్తూ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు.అయితే భార్యపై అనుమానంతో తరచూ ఆమెతో ఘర్షణపడేవాడు. దీంతో ఆరు నెలల క్రితం పర్వీన్ పుట్టింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పడంతో 11 రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. సోమవా రం అర్ధ రాత్రి కూడా భార్య తో గొడవపడిన ముల్తాన్ రాయితో ఆమెపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి మృతదేహాన్ని దర్గాలోకి తీసుకెళ్లి పడేశాడు. అక్కడి నుంచి సమీపంలోని గిరిజన తండాకు వెళ్లి విషయం చెప్పడంతో తండావాసులు పోలీసులకు సమాచారం అందించారు. నాగల్గిద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
అర నిమిషంలో 27 కత్తిపోట్లు!
పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే ఓ పోకిరీ దారుణానికి తెగబడ్డాడు. తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ యువతిపై కిరాతానికి పాల్పడ్డాడు. టీచర్పై జరుగుతున్న దాడిని చూసి పిల్లలు, తోటి సిబ్బంది దూరంగా పరిగెత్తగా.. రక్తపు మడుగులో కుప్పకూలి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.ఫరీదాబాద్ సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్లో 29 ఏళ్ల సంధ్య టీచర్గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు వచ్చిన ఆమెను కలవాలంటూ ఓ యువకుడు గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లగా.. అప్పటికే ముసుగు ధరించి ఉన్న నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు పాఠశాల లోపలే కొంతసేపు వేచి చూశాడు. సంధ్య బయటకు రాగానే ఆమెను పట్టుకుని లాగి కత్తితో వరుసగా పొడిచాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అర నిమిషంలో దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో దాడి చేసినట్లుప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు అతడిపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి దాడి చేసి బైక్పై పరారయ్యాడు.రెండు గంటల్లో అరెస్ట్ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగాడు. నిందితుడి కోసం గాలించి.. రెండే గంటల్లో అరెస్ట్ చేశాడు. అతన్ని అమిత్(21)గా గుర్తించగా.. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.వేధింపుల కేసే కారణమా?ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడేందుకు ఆసక్తి చూపకపోయినా.. నిందితుడు వెంటపడుతూ వేధించేవాడని తెలుస్తోంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి ఈ మధ్యే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదు తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. అయితే ఆ ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఏపీ.. గూడూరులో టవర్ క్లాక్ వద్ద యువకుడి విషాదం!
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ యువకుడు గొంతు కోసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న యువకుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడు ఏ కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
తిరుపతిలో చోరీ కలకలం..
ఆంధ్రప్రదేశ్: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
''నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు. అంత్యక్రియల కోసం అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. నా ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దు. ఎందుకంటే నా ఆత్మ శాంతించ ఉండకూడదు. మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి''- అని వాట్సాప్ మెసేస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడో బాడీబిల్డర్.ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో డిగ్రీ కళాశాలలో క్లర్క్గా పనిచేస్తున్న 52 ఏళ్ల బాడీబిల్డర్ దేవదత్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సర్సావా పోలీస్ స్టేషన్ (Sarsawa police station) పరిధిలోని సలేంపూర్ గ్రామంలో నివసిస్తున్న దేవదత్ శర్మ శనివారం సాయంత్రం తన ఇంటి వెనుక నిర్వహిస్తున్న "రాక్ జిమ్" నుంచి ఇంటికి వచ్చారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల శబ్దం విని ఆయన భార్య సీమా రాణి అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో దేవదత్ను సమీప వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు దేవదత్ శర్మ తన మేనకోడలికి పంపిన వాట్సాప్ సందేశాన్ని కీలక ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని విచారించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సర్కిల్ ఆఫీసర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దేవదత్ భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ సందేశాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కుమార్ చెప్పారు.మేనకోడలికి చివరి సందేశంమరణానికి ముందు దేవదత్ శర్మ తన 21 ఏళ్ల మేనకోడలు నేహా శర్మకు వాట్సాప్లో సుదీర్ఘ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. అందులో తాను ఎదుర్కొంటున్న అవమానాలను ఇక భరించలేకపోతున్నానని పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిరోజూ అవమానాలతో జీవించడం కంటే ఒక్కసారిగా మరణించడం మేలని భావించానని, అయితే తాను పిరికివాడిని కాదని సందేశంలో రాసినట్లు తెలుస్తోంది.తన మరణానంతరం తన భార్య తన మృతదేహాన్ని తాకవద్దని కోరినట్లు సమాచారం. అంత్యక్రియల కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని, పిడకలు (ఆవుపేడతో చేసిన ఇంధనం) ఉపయోగించవద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది. తన ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దని, తన ఆత్మ ప్రశాంతంగా ఉండకూడదని కూడా సందేశంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. చివరగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని మేనకోడలిని కోరినట్లు సమాచారం. ఈ సందేశం ప్రామాణికతను పోలీసులు పరిశీలిస్తున్నారు.రెండు దశాబ్దాలుగా జిమ్ నిర్వహణదేవదత్ శర్మ 2000 సంవత్సరం నుంచి తన ఇంటి వెనుక "రాక్ జిమ్" పేరుతో వ్యాయామశాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా బాడీబిల్డర్గా కూడా మంచి గుర్తింపు పొందారు. గత రెండేళ్లుగా బాలాజీ గ్రూప్ ఆఫ్ కాలేజీలో క్లర్క్గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిలక్ రామ్ సైనీ గర్ల్స్ కాలేజ్, ఎలం చంద్ సైనీ గర్ల్స్ కాలేజీల్లో కూడా పనిచేశారు.కుటుంబ నేపథ్యందేవదత్ శర్మకు సీమా రాణితో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అభిషేక్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదిత్య చండీగఢ్లో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్నాడు. దేవదత్ శర్మకు ఒక సోదరి ఉంది. ఆమె కుమార్తె నేహా శర్మకే ఆయన చివరి వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది.(ఆత్మహత్య ఎన్నటికీ పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోండి. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తే, దయచేసి ‘దిశా’ హెల్ప్లైన్కు కాల్ చేయండి. టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్లు: 1056, 0471-2552056) -
మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్!
వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిళ్లు.. కారణాలు ఏవైనా కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనిషిని కుంగదీస్తుంది. అలాంటి సమయంలో సరైన సహాయం, మద్దతు అందకపోతే పరిస్థితులు విషాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాల్సిన ఓ వైద్యురాలే.. చివరకు అదే మానసిక ఒత్తిడికి బలికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్నగర్ ఎక్స్టెన్షన్లోని ఆఫీసర్స్ సిటీ-2 సొసైటీలో నివసిస్తున్న డాక్టర్ హేమికా అగర్వాల్ (40) ఆదివారం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.హేమికా తండ్రి డాక్టర్ ఆర్. చంద్ర కూడా ఘజియాబాద్లో ప్రముఖ సైకియాట్రిస్ట్గా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన విడాకుల తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె వివాహ బంధం ముగిసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.దాని నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారని.. పేషెంట్లకు చికిత్స కొనసాగిస్తుండడంతో మామూలుగా మారిందని తాము భావించామని చెబుతున్నారాయన. మరోవైపు ఆమె మృతి వార్త స్థానికంగా వైద్య వర్గాల్లో విషాదం నింపింది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఇతరుల మానసిక సమస్యలకు పరిష్కారం చూపే వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడితో విషాద నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ బయటపడకపోవడంతో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
బ్రిజ్ భూషణ్కు భారీ ఊరట
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సహ నిందితుడైన మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది.రౌస్ అవెన్యూ కోర్టులో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వర్ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. కోర్టులో మీడియా ప్రవేశానికి అనుమతి లేకపోవడంతో తీర్పు వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. అయితే బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాదులు దీనిని “గౌరవప్రదమైన నిర్దోషిత్వ తీర్పు”గా అభివర్ణించారు.రెజ్లర్ల ఆరోపణలతో మొదలైన వివాదంబ్రిజ్ భూషణ్పై ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి వేధించారని ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం 2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెజ్లర్ల ఆందోళన తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2023 జూన్లో పోలీసులు బ్రిజ్ భూషణ్పై అభియోగ పత్రం దాఖలు చేశారు.ఏయే సెక్షన్ల కింద కేసు?ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్పై ఐపీసీలోని 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలు), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంటాడటం), 506 (బెదిరింపులు) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2024లో ట్రయల్ కోర్టు ఐదుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదులకు సంబంధించి బ్రిజ్ భూషణ్పై అభియోగాలు నమోదు చేసింది. అయితే విచారణ సందర్భంగా రక్షణ తరఫు న్యాయవాదులు ఆరోపణల్లో వ్యత్యాసాలు ఉన్నాయని వాదించారు.బ్రిజ్ భూషణ్ వాదన ఏంటి?తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ మొదటి నుంచి ఖండిస్తూ వచ్చారు. ఫిర్యాదుల్లో తేదీలు, ఘటనలకు సంబంధించిన వివరాల్లో మార్పులు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ఆరోపణలు జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే లేనని, తనపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వాదించారు. ఫిర్యాదులు చేయడంలో ఆలస్యం కూడా కీలక అంశమని పేర్కొన్నారు.మైనర్ కేసులోనూ ఊరటఈ కేసులో ఓ మైనర్ రెజ్లర్ కూడా ఆరోపణలు చేసింది. అయితే తర్వాత ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో.. పోక్సో చట్టం కింద నమోదైన కేసును పోలీసులు మూసివేయాలని కోరారు. అనంతరం ఆ కేసు కూడా ముగిసింది.రాజకీయంగా కూడా కీలక పరిణామంబ్రిజ్ భూషణ్ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతగా ఉన్నారు. అయితే రెజ్లర్ల వివాదం తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు అవకాశం కల్పించింది. తాజా కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్కు న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లైంది. -
భార్య విడాకులు కోరిందని.. కొడుకు వీడియో తీస్తుండగానే..
గురుగ్రామ్లోని సూరత్ నగర్లో ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భార్య విడాకులు కోరడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తుండగా, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సంజీవ్ యాదవ్ (36) ఓ కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.ఘటన సమయంలో ఇంట్లో అతడి భార్య మన్ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. సంజీవ్ ఉరివేసుకున్న దృశ్యాలను కుమారుడు మొబైల్ ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్తను రక్షించేందుకు మన్ప్రీత్ సహాయం కోసం కేకలు వేసిందని, అనంతరం తన కుటుంబ సభ్యులతో పాటు సంజీవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించిందని పోలీసులు చెప్పారు.అయితే సంజీవ్ కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య విడాకులు కోరడంతో ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతుందని.. సంజీవ్ సోదరి కిరణ్ తెలిపారు. తన సోదరుడి మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. సంజీవ్ తండ్రి రామ్సేవక్ యాదవ్ కూడా తన కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని కుట్ర పన్ని హత్య చేసి ఉండవచ్చని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మన్ప్రీత్ కౌర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంజీవ్, మన్ప్రీత్లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్లోని డెన్సో కంపెనీలో పనిచేసే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2019లో వారికి కుమారుడు జన్మించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ సింగ్ తెలిపారు. -
ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు
అనంతపురం సెంట్రల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె కూతురిపైనా కన్నేశాడు. బలాత్కారం చేసేందుకు యత్రించగా యువతి తల్లి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ మహిళ కుమార్తెపైనా కన్నేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లికి చెప్పింది. దీంతో ఆమె తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. శుక్రవారం సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెను బలాత్కారం చేసేందుకు యతి్నంచాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. అయినప్పటికీ అతను విరమించుకోకపోవడంతో కత్తితో మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి, స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
గొంతు, మర్మాంగం కోసి యువకుడి హత్య
గూడూరు: ఓ యువకుడిని గొంతు, మర్మాంగం కోసి హత్య చేసిన దారుణ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన షాహూల్(21) తండ్రి మృతి చెందగా, తల్లి బతుకుదెరువు నిమిత్తం కువైట్కు వెళ్లింది. దీంతో షాహూల్ తన అన్నతో కలిసి ఉంటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న షాహూల్ శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిద్దెపైకి వెళ్లి మద్యం తాగాడు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు మిద్దెపైన రక్తపు మడుగులో పడిఉన్న షాహూల్ చూసి భయంతో కేకేలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా షాహూల్ దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నారు. వారు అందించే నివేదిక ఆధారంగా కేసు విచారణ చేపడతామని గూడూరు రూరల్ సీఐ కిశోర్బాబు తెలిపారు. మృతదేహం పంచనామా చేసే క్రమంలో పోలీసులకు నిర్ఘాంతపోయే విషయం తెలిసింది. మృతుడి మర్మాంగం కోసి అతని జేబులోనే పెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తే వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణంగా హత్య చేసినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ హత్యోదంతంతో విద్యార్థులు ఎక్కడ భయాందోళనలకు గురవుతారోనని పాఠశాలకు సెలవు ప్రకటించారు.ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడుమర్మాంగాన్ని కోసిన ప్రియురాలు అనంతపురం సెంట్రల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె కూతురిపైనా కన్నేశాడు. బలాత్కారం చేసేందుకు యత్నించగా యువతి తల్లి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ మహిళ కుమార్తెపైనా కన్నేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లికి చెప్పింది. దీంతో ఆమె తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. శుక్రవారం సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెను బలాత్కారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. అయినప్పటికీ అతను విరమించుకోకపోవడంతో కత్తితో మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి, స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
సన్నిహిత సంబంధం కేసు: 6 నెలల పసికందును కాలువలో పడేసి చంపి..
ప్రియుడి మోజులో పడి అతడితో కలిసి వెళ్లిపోయింది ఓ మహిళ. తమకు అడ్డంగా ఉన్నాడని ఆ మహిళ 6 నెలల కుమారుడిని చంపేసి కాలువలో పడేశాడు ఆమె ప్రియుడు. అందుకు ఆ మహిళ కూడా సహకరించింది.ఉత్తర ప్రదేశ్లోని మీరట్లోని నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 12న వైశాలి కాలనీ సమీపంలోని కాలువలో లభించిన 6 నెలల శిశువు మృతదేహం గుర్తింపు ఇప్పుడు పూర్తైంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆ చిన్నారి సహారన్పూర్కు చెందిన ఇమ్రాన్, షబానా కుమారుడు సమీర్. ఈ కేసును ఛేదించిన నౌచండి పోలీసులు శిశువు తల్లి షబానా, ఆమె ప్రియుడు విశాల్ను అరెస్టు చేశారు.షబానా తన ప్రియుడు విశాల్తో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంది. ఇందుకోసం ఆమె చిన్నకుమారుడు సమీర్ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. హాపూర్కు చెందిన విశాల్ కూడా మీరట్కు చేరుకున్నాడు. ఇద్దరూ ముందే కలిసి జీవించాలనే ప్రణాళిక వేసుకున్నారు. అయితే, సమీర్ను తనతో ఉంచుకోవడానికి విశాల్ సిద్ధంగా లేడు.సమీర్ను అడ్డంకిగా భావించి తొలగించాలనే కుట్ర పన్నారు. విశాల్ శిశువును తనతో తీసుకెళ్లాడు. తర్వాత అతడు శిశువును హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. జూలై 12న శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. అయితే అప్పట్లో ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేకపోయారు.ఇదిలా ఉండగా, సహారన్పూర్లోని గంగోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమ్రాన్ తన భార్య షబానా, కుమారుడు సమీర్ కనిపించడం లేదని ఫిర్యాదు నమోదు చేశాడు. పోలీసులు షబానాను గుర్తించారు. కానీ ఆమె 6 నెలల కుమారుడు కనిపించలేదు. షబానా కూడా శిశువు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే సమయంలో మీరట్లో లభించిన గుర్తు తెలియని మృతదేహం ఫొటోలను సమీప జిల్లాలకు పంపించారు.నౌచండి పోలీసులు శిశువు ఫొటోలను సహారన్పూర్ సహా ఇతర జిల్లాలకు షేర్ చేశారు. జులై 13న ఈ సమాచారం సహారన్పూర్ పోలీసులకు కూడా చేరింది. ఫొటో చూసిన ఇమ్రాన్ మృతదేహం తన కుమారుడు సమీర్దేనని గుర్తించాడు. ఆ తర్వాత మీరట్ పోలీసులు కేసులోని అంశాలను కలిపి శిశువు తల్లి, ఆమె ప్రియుడిపై దృష్టి పెట్టారు.సహారన్పూర్లో నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ తర్వాత మీరట్ నౌచండి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ అందిన తర్వాత నిందితుల వద్దకు చేరుకోవడానికి పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు. షబానా, విశాల్ను విచారించగా ఇద్దరూ హత్య కుట్ర పన్నిన విషయం, నేరాన్ని అమలు చేసిన విషయాన్ని అంగీకరించారు.ఇమ్రాన్, షబానాకు నలుగురు పిల్లలుఇమ్రాన్, షబానాకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. షబానా చిన్న పిల్లాడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మీరట్ ఎస్పీ సిటీ వినాయక్ గోపాల్ భోస్లే తెలిపిన వివరాల ప్రకారం, జూలై 12న నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ నుంచి ఒక శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపించింది. సహారన్పూర్ గంగోహ్ పోలీస్ స్టేషన్లో షబానా, ఆమె శిశువు అదృశ్యమైనట్టు కేసు నమోదు అయింది. షబానాను మొదట గుర్తించారు. ఆ తర్వాత శిశువును గుర్తించారు. ఆ తర్వాత గంగోహ్ పోలీస్ స్టేషన్ నుంచి జీరో ఎఫ్ఐఆర్ను నౌచండి పోలీస్ స్టేషన్కు పంపించారు. షబానా, హాపూర్కు చెందిన విశాల్పై ఇమ్రాన్ హత్య ఆరోపణలు చేశాడు. -
హనీ ట్రాప్.. రాజకీయ నేతలే టార్గెట్?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకుని పన్నిన కుట్ర కేసుకు సంబంధించి ఇటీవల అరెస్టయిన అనుమానిత జైషే-మొహమ్మద్ ఉగ్రవాది హమిమ్ మండల్ దర్యాప్తులో భాగంగా.. జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఓ మహిళను పశ్చిమ బెంగాల్ పోలీసులు (స్పెషల్ టాస్క్ ఫోర్స్) అరెస్ట్ చేశారు. అరెస్టయిన అర్పితా సర్కార్.. మండల్తో నిత్యం టచ్లో ఉండేదని.. ప్రముఖులను టార్గెట్ చేయడానికి హనీట్రాప్ నెట్వర్క్లో ఆమె భాగస్వామ్యం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళను శుక్రవారం జార్ఖండ్లోని సాహెబ్గంజ్లో అరెస్ట్ చేసి.. బెంగాల్లోని బర్ధమాన్కు తీసుకొచ్చారు. బీజేపీ నాయకులతో సహా వీఐపీలపై నిఘా వేయడం.. కొత్త కార్యకర్తలను రిక్రూట్ చేయడం.. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి ఐఎస్ఐ మద్దతుగల నెట్వర్క్తో నిందితులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి సువేది అధికారి ప్రయాణించే మార్గాలను, ఆయన కాన్వాయ్ కదలికలను మండల్ నిరంతరం గమనిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడానికి.. వారి గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మండల్.. ఆ మహిళను ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఉగ్ర మాడ్యూల్ కార్యకలాపాలలో భాగంగా నేతలకు వలపువల విసిరేందుకు అర్పితా సర్కార్ కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు. రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ఆమె ఓ నెట్వర్క్ను నిర్మించడానికి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని ఓ అధికారి వెల్లడించారు. ‘‘ప్రముఖులతో పరిచయాలను పెంచుకోవడానికి ఈ మహిళను ఉపయోగించారు. మేము డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నాం. ఆమె సేకరించిన సమాచారాన్ని దాడుల పథక రచనకు ఉపయోగించాలని భావించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. మండల్ అరెస్ట్పై సీఎం సువేందు అధికారి స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన అంశమని.. ఎస్టీఎఫ్, సీనియర్ పోలీసు అధికారులు ఈ కేసును విచారిస్తున్నారని తెలిపారు. -
నీట్ ఫలితాలు.. కుటుంబం ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి!
ఆంధ్రప్రదేశ్, కోడుమూరు రూరల్: నీట్ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు.బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్కు చెప్పసాగింది.అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకు బయటకు రాకపోవడం, పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చిన వేణుగోపల్ భార్య భాగ్యమ్మ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే పుష్పావతి ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఉరి నుంచి తప్పించి చూడగా అప్పటికే మృతి చెందింది.పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి నీట్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
మూసీ బ్రిడ్జిపై తప్పిన విషాదం!
హైదారాబాద్: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మూసీలో దూకి ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో స్పందించిన చైతన్యపురి పోలీసు సిబ్బంది కాపాడారు.వివరాలలోకి వెళ్లితే.....గురువారం సాయంత్రం ఉప్పల్ మూసీ బ్రిడ్జి సమీపంలో ఓ మహిళ, పిల్లలు ఆవేదనగా..అనుమానాస్పదంగా కని్పంచడంతో స్థానికులు వెంటనే డయల్ 100కు కాల్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న చైతన్యపురి మహిళా కానిస్టేబుల్ చంద్రకళ, హోంగార్డు బాలరాజు, హైడ్రా బృందం నాలుగు నిమిషాల్లో అక్కడకు చేరుకుని మహిళతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని కాపాడారు. భర్తపై కోపంతో మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకున్నారు.అనంతరం కౌన్సలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా డయల్ 100కు కాల్ వచి్చన కేవలం నాలుగు నిమిషాల్లో స్పందించిన పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి అభినందించారు. శుక్రవారం ఈ మేరకు వారికి నగదు బహుమతి, రివార్డు అందజేశారు. -
నాకు ఈ బిడ్డ వద్దు.. నేను మా ఊరెళ్లిపోతాను!
కర్ణాటక, చిక్కబళ్లాపురం: ఆసుపత్రిలో ఓ అవివాహిత గర్భిణి బిడ్డకు జన్మనిచ్చి తనకు ఆ శిశువు వద్దని చెప్పడంతో వైద్యులు, అధికారులకు తెల్లమొహం వేశారు. విరాలు.. హావేరి జిల్లాకు చెందిన యువతి (21) కి ఇంకా పెళ్లి కాలేదు. గర్భం దాల్చి నెలలు నిండాయి.దేవనహళ్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మగబిడ్డ పుట్టాడు. శిశువు తక్కువ బరువు, ఊపిరి సమస్యతో ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి బిల్లులను ఆమె చెల్లించింది. తనకు బిడ్డ వద్దని, తాను ఊరికి వెళ్లిపోతానని వైద్యులకు చెప్పడంతో వారు కంగుతిన్నారు. వైద్యులు పోలీసులకు తెలుపగా వచ్చి ఆమె ఊరు పేరు వివరాలను విచారించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
మహిళలపై అత్యాచారం కాదు.. ఆ అస్థిపంజరాలు పురుషులవే!
కర్ణాటక, యశవంతపుర: ధర్మస్థలలో అపరిచిత అస్థిపంజరాల కేసులో ఓ మిస్టరీ వీడిపోయింది. గతంలో బంగ్ల గుడ్డలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపి మూడు అస్థిపంజరాలను కనుగొన్నారు. వాటికి డీఎన్ఏ పరీక్షలను నిర్వహించగా, మూడు కుటుంబాల నమూనాలతో సరిపోలాయి. మృతుల్లో కొడగు జిల్లా విరాజపేట తాలూకా టి శెట్టిగేరి గ్రామవాసి యు.బి. అయ్యప్ప(70), తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా దాసరకల్లహళ్లికి చెందిన ఆదిశేష (27), కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా మీసగానహళ్లికి చెందిన కృష్ణప్పలుగా తేలింది. అందరూ పురుషులేనని, మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేసి పూడ్చిపెట్టారనే ఆరోపణలతో సంబంధం లేదని సిట్ అధికారులు తెలిపారు. ఈ నెల 15న బెళ్తంగడి కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు.ఇలా మిస్సింగ్2017, జూన్ 25న యుబీ అయ్యప్ప మైసూరు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి ఇంక తిరిగి రాలేదు. గుబ్బికి చెందిన ఆదిశేష బెంగళూరులోని బార్లో పని చేసేవాడు, 2013 అక్టోబర్ 2న ఇంటికెళ్లి మొబైల్ను వదిలేసి ఎక్కడికి వెళ్లాడో తెలియదు. కృష్ణప్ప 2024 అక్టోబర్ 22న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు కేసుల్లోనూ కుటుంబీకులు మిస్సింగ్ కేసులు పెట్టారు. అలా వెళ్లినవారు బంగ్ల గుడ్డలో ఎలా శవాలయ్యారన్నది తేలాల్సి ఉంది. -
లారీని ఢీకొట్టిన కారు.. యువకుడు సజీవ దహనం
మహబూబ్నగర్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పాత నాణేలు కొనేస్తామంటూ.. మహిళా ఎన్నారైకి బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: పాత నాణేలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తామంటూ ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రచారం చేసిన ఓ ముఠా నగరానికి చెందిన ప్రవాస భారతీయురాలి నుంచి రూ.71.8 లక్షలు కాజేసింది.అమెరికాలో నివసిస్తున్న ఓ మహిళ (73) జనవరిలో ఇన్స్టాలో.. పురాతన నాణేలు కొంటామనే ప్రకటన చూశారు. 1947 జార్జ్–6 కింగ్ ఎంపరర్ నాణెం ఫొటో, ఓ ఫోన్ నంబర్ను కేటుగాళ్లు పోస్టు చేశారు. నాణెం విలువ రూ.27 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో ఎన్నారై మహిళ తన వద్ద ఉన్న మూడు 1947 జార్జ్–6 నాణేలు, రెండు 20 పైసల ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ నాణేల ఫొటోలు పంపారు.మోసగాళ్లు ఒక్కో 1947 నాణెం విలువ రూ.27 లక్షలుగా, ఒక్కో 20 పైసల నాణెం విలువ రూ.12 లక్షలుగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా రూ.71,80,950 వసూలు చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె నగరానికి చెందిన వ్యక్తికి జీపీఏ ఇచ్చి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయించడంతో కేసు నమోదైంది. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. లైంగిక వేధింపులు?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కాంతారావు.. తనను లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల మేరకు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.. తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి మోసం చేశారని బాధితురాలు పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ చానెల్ పేరుతో ప్లాట్కు పిలిపించి వేధించారని పేర్కొంది. ఇదే సమయంలో కాంతారావు.. తన ప్రైవేటు ఫొటోలతో బ్లాక్ మొయిల్ చేస్తున్నారని యువతి ఆరోపించింది. అలాగే, రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద నాలుగు లక్షలు తీసుకుని మోసం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈనెల 26న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో రేగా కాంతారావు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ చేశారు. దీంతో, తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. -
భర్త ప్రేమకథ.. భార్య విషాదాంతం!
హైదరాబాద్, మీర్పేట: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శోభన్, మృతురాలి బంధువుల కథనం ప్రకారం. కూకట్పల్లి అల్విన్కాలనీకి చెందిన నర్సింహస్వామి, పద్మల కుమార్తె హేమ (28) సాఫ్ట్వేర్ ఉద్యోగి. అల్మాస్గూడ వినాయకహిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజ్కుమార్తో పదిహేను నెలల క్రితం ఈమెకు వివాహమైంది.ఈ క్రమంలో హేమ గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే తాను మరో యువతితో ప్రేమలో ఉన్నానని, పెద్దల ప్రోద్బలంతోనే వివాహం చేసుకున్నానని భర్త రాజ్కుమార్ తరచూ భార్యతో గొడవపడేవాడని మృతురాలి బంధువులు తెలిపారు.హేమ వేతనంతోనే ఈఎంఐలు, ఇంటి అవసరాలు తీరుస్తుండగా, రాజ్కుమార్ మాత్రం తన వేతనం గురించి చెప్పేవాడుకాదని, అదే విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంటికి రావాలన్నా తన అనుమతి ఉండాల్సిందేనని హేమను ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. వివాహమైన రోజు నుంచి తరచూ గొడవ పడేవాడని, దీంతో రెండు నెలలుగా హేమ పుట్టింటి వద్దే ఉంటోందని, నెల రోజుల క్రితం పెద్దమనుషులు నచ్చజెప్పడంతో మంచిగా ఉంటానని రాజ్కుమార్ హామీ ఇవ్వడంతో అత్తవారింటికి పంపామని కుటుంబ సభ్యులు చెప్పారు.రాజ్కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హేమ మానసికంగా కుంగిపోయిందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైనది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి నర్సింహస్వామి ఆరోపించాడు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఏడాదిగా వెంటాడుతున్నాడు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘నిన్ను ఇష్టపడుతున్నాను.. ఒకసారి రావాలి’ అంటూ కార్మికుడు సతీష్ ద్వారా కొన్నాళ్లుగా సూపర్వైజర్ సోమరాజు తనను వెంటాడుతున్నాడంటూ విజయవాడ జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికురాలు గురువారం విచారణ కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాదిగా ఒత్తిడి చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మాట వినకపోవడంతో పని సరిగా చేయడం లేదని మరింత వేధిస్తున్నట్లు విచారణ అధికారులకు తెలిపింది. మరికొందరు కార్మికులూ అకారణంగా కేకలు వేస్తూ రుబాబు చేస్తుంటాడని సూపర్వైజర్పై ఫిర్యాదుచేశారు. ఇదిలా ఉంటే వార్డుల్లో హైజీన్ సరిగా ఉండటం లేదని ఇన్ఫెక్షన్ కంట్రోల్ మేల్ నర్సు తమను వేధిస్తున్నారని మహిళా కార్మికులు ఫిర్యాదు చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను కలెక్టర్, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులకు పంపుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల జీతాల కోసం కలెక్టరేట్ వద్ద శానిటేషన్ కార్మికులు ధర్నా చేశారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సూపర్వైజర్ సోమరాజు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా చూస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. సూపర్వైజర్తోపాటు మరో కార్మికుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వీటిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ శుక్రవారం విచారణ పూర్తిచేసి ఇచి్చన నివేదికను కలెక్టర్, డీఎంఈలకు పంపించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఈ విచారణలో కమిటీ సభ్యులు లైంగిక వేధింపుల ఆరోపణలను నిర్ధారించినట్టు సమాచారం. -
రూ. 40 లక్షల ఎదురు కట్నం కావాలంటూ, కూతురిపైనే తండ్రి దాడి
కర్ణాటకలోని బెంగళూరులో ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి, వివాహం, డబ్బు విషయంలో విభేదాలతో ఓ తండ్రి తన కూతురిని అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కర్కశంగా వ్యవహరించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది లక్ష్మీ దుర్గ. ఆమె తండ్రి నాగేంద్ర క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇటీవల నాగేంద్ర తన కుమార్తె పెళ్లి కోసం ఒక సంబంధం ఖాయం చేశాడు. అయితే, కూతురి చదువు, కెరీర్ కోసం తాను భారీగా ఖర్చు చేశాననే నెపంతో వరుడి కుటుంబం నుండి రూ. 40 లక్షలు డిమాండ్ చేశాడు.అంతేకాదు లక్ష్మీ దుర్గ ప్రతి నెలా వచ్చే తన జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలని నాగేంద్ర ఒత్తిడి తెచ్చేవాడు. దీన్ని నాగేంద్ర భార్య, కుమార్తె లక్ష్మీ దుర్గ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీనికితోడు పెళ్లివారిని రూ. 40 లక్షలు ఎదురు కట్నం డిమాండ్ చేశాడు. దీన్ని లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె మీద పగబట్టాడు. జూలై25 న కన్నకూతురిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇదీ చదవండి: చిన్నప్పటి ఆసక్తే .. రూ. 96 లక్షల ప్రైజ్ తెచ్చిపెట్టింది!కుమార్తెను కలిసే నెపంతో కాలేజిలోని హెచ్ఓడి (HOD) ఛాంబర్లో ఉన్న లక్ష్మీ దుర్గ వద్దకు వెళ్లిన నాగేంద్ర, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపు, ఛాతీ, మెడలో తీవ్రంగా పొడిచి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ దుర్గ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దాడికి కుటుంబంలో దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుఇదీ చదవండి: 144 ఏళ్ల క్రితం దుబాయ్ జనాభా 12 వేలు : ఇపుడు ఎంతో తెలుసా? -
'మిషన్ మంగళ్’నటికి చేదు అనుభవం : లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
బాలీవుడి నటి కీర్తి కుల్హారీ (Kirti Kulhari) సైబర్ నేరగాళ్ల మోసానికి గురయ్యారు. ఆమెకు తెలియ కుండానే, ఎలాంటి ఓటీపీ లేకుండా ఆమెక్రెడిట్ కార్డ్ ద్వారా విదేశీ విమానయాన సంస్థకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన ఘటన దిగ్బ్రాతి రేపింది. ఈ ఘటనపై ముంబై అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' ఫేమ్ కీర్తి ఆమె సినిమా చూస్తున్న సమయంలోనే క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి కేటుగాళ్లు ఆమెకు ప్రమేయం లేకుండానే రూ. 2.43 లక్షలకు పైగా డబ్బులు కొట్టేశారు. జూలై 24న రాత్రి అంధేరిలోని ఒక మల్టీప్లెక్స్లో కీర్తి సినిమా చూస్తుండగా బ్యాంకు నుంచి ఈ (International Transaction) లావాదేవీకి సంబంధించిన అలర్ట్ రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. AeroMexico ఏయిర్లైన్స్కి 2,525 యూఎస్ డాలర్ల చెల్లింపు జరిగినట్లు మెసేజ్ రావడంతో కీర్తి వెంటనే కస్టమర్ కేర్ను సంప్రదించారు. ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుప్రాథమిక విచారణలో ఆమె కార్డ్ ఉపయోగించి వరుసగా 4 లావాదేవీల ద్వారా మొత్తం రూ. 2.43 లక్షలకు పైగా డ్రా చేసినట్లు తేలింది. వెంటనే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో మరిన్ని అనధికారిక లావాదేవీలు జరగకుండా బ్యాంక్ అధికారులు వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ను బ్లాక్ చేశారు.ఈ ఘటనపై కీర్తి కుల్హారీ ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు నమోదు చేశారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుకాగా కీర్తి ఇటీవల 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' చివరి సీజన్లో కనిపించారు. అంతకుముందు పింక్, క్రిమినల్ జస్టిస్, షైతాన్, హ్యూమన్ వంటి విజయవంతమైన చిత్రాలు, టెలివిజన్, సిరీస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలతో ఆదరణ పొందారు. జగన్ శక్తి దర్శకత్వంలో వచ్చిన 'మిషన్ మంగళ్' చిత్రంలో కీర్తి కుల్హరి ఆకట్టుకున్నారు.ఇదీ చదవండి: బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా స్పందన -
నేను చెప్పింది చెయ్! లేదంటే నీ ఫొటోలు అందరికీ..
ఆంధ్రప్రదేశ్, బాపట్ల: ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం వేధింపులు ఆపై దాడికి దారితీసిన ఘటన బుధవారం సాయంత్రం చీరాల మండలం జాండ్రపేట సమీపంలోని అక్కయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజమండ్రికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బలుకూరి సత్యవాణి (32) టైలర్గా పని చేస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించగా అనంతరం సోషల్ మీడియా ద్వారా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన జోగాబత్తుని వెంకట కిరణ్తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె అతనికి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను నిందితుడు ఆమె బంధువులకు పంపడంతో బాధితురాలు అతనిపై రాజమండ్రిలో క్రిమినల్ కేసు నమోదు చేసింది.వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..కొంతకాలం అనంతరం మళ్లీ ఆమెకు ఫోన్ చేసి తనతో కలిసి ఉండాలని, లేకపోతే ఫొటోలను అందరికి పంపిస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడి ప్రవర్తన గురించి అతని తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాధితురాలు మంగళవారం చీరాల వచ్చారు.సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అక్కయపాలెం రోడ్డులో వెళుతుండగా వెంకట కిరణ్ అతని స్నేహితులతో కలిసి ఆమెను అడ్డగించి అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని తెలిపింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా చీరాలకు తీసుకువచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమె బుధవారం చీరాల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.సనత్నగర్కు చెందిన రాకేష్ బలరాం గౌడ్కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్బీ, మాదాపూర్లతో పాటు కోయిల్కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా!
జామ్నగర్: సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యానికి సంబంధించి పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు. భర్తను హత్య చేసి, రెండేళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఓ పారిశ్రామిక యూనిట్ నేలలో మృతదేహాన్ని పాతిపెట్టిన భార్య, ఆమె ప్రియుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిగ్నేష్ మావడియా అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు నమ్ముతూ వచ్చారు. కానీ, అతన్ని హత్య చేసి.. దారెద్ జీఐడీసీ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో దాదాపు 12 అడుగుల లోతున పూడ్చిపెట్టినట్లు పోలీసులు తేల్చారు.కుటుంబ సభ్యులలో ఒకరు ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతూ.. అక్కడ జిగ్నేష్కు సంబంధించి స్థానిక కాంటాక్ట్ వివరాలు అడగడంతో ఈ హత్య సంగతి బయటపడింది. జిగ్నేష్ భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నిలేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలం నుంచి వెలికితీసిన అస్థిపంజర అవశేషాలను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారు. అస్థిపంజరం ఎవరిదనే నిర్ధారణ అయిన తర్వాత హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.విచారణ వివరాల ప్రకారం.. పృథ్వి, నిలేశ్లకు ఆమె వివాహానికి ముందే సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా వారు తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. జిగ్నేష్ను మద్యంలో సైనేడ్ కలిపి హత్య చేశారని.. అనంతరం అతని మృతదేహాన్ని దారెద్ జీఐడీసీలోని ఒక ఫ్యాక్టరీకి తరలించి, సుమారు 12 అడుగుల లోతు గుంట తవ్వి నేల కింద పాతిపెట్టారు. జిగ్నేష్ ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పృథ్వి కుటుంబ సభ్యులకు నమ్మబలికిందని.. దీంతో దాదాపు రెండేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు.జిగ్నేష్ సోదరుడు అశోక్ మావడియా ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ జిగ్నేష్ ఆచూకీ ఏమాత్రం లభించకపోవడంతో సిటీ బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పృథ్వి తన నేరాన్ని అంగీకరించిందని.. మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టిందో ఆ ప్రాంతాన్ని తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిభ నేతృత్వంలో సిటీ బి పోలీసులు దారెద్ జీఐడీసీలోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో తవ్వకాలు జరిపి.. జిగ్నేష్దిగా భావిస్తున్న అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు. ఈ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించగా.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. -
6 రోజులు అలరించాడు.. ఏడో రోజు సమాధి అయ్యాడు!
ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకోవాలని చేసిన ఓ సాహస విన్యాసం.. ఓ యువ కళాకారుడి జీవితాన్నే ముగించింది. ఆరు రోజుల పాటు తన సైకిల్ స్టంట్లతో జనాలను అలరించిన 27 ఏళ్ల దీపక్.. ఏడో రోజు చేసిన ‘లైవ్ బరియల్’ (సజీవ సమాధి) స్టంట్లో మృతి చెందాడు. అయితే కేవలం ఏడు వేల రూపాయల కోసం నిర్వాహకులే అతని ప్రాణాలను బలిగొన్నారనే ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.హరియాణాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తావుడు ప్రాంతంలోని ఖోరీ కలాన్ గ్రామంలో ఓ ట్రావెలింగ్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రదర్శనలో ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన దీపక్ కీలక పాత్ర పోషించాడు. సైకిల్పై ప్రమాదకర విన్యాసాలు చేయడంలో అతడికి మంచి పేరు ఉంది. కళ్లకు గంతలు కట్టుకుని నడపడం, హ్యాండిల్పై నిలబడి బ్యాలెన్స్ చేయడం, కదులుతున్న సైకిల్పై నిలుచుని ప్రదర్శనలు ఇవ్వడం వంటి స్టంట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు.అయితే సర్కస్ చివరి రోజు దీపక్ ఓ ప్రత్యేక విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా అతడిని ఓ సంచిలో ఉంచి, ప్రత్యేకంగా తవ్విన ఓ గోతిలోకి దించారు. 24 గంటల తర్వాత అతడిని సజీవంగా బయటకు తీస్తామని నిర్వాహకులు ప్రేక్షకులకు ప్రకటించారు. అయితే చెప్పిన సమయానికి దీపక్ను బయటకు తీయలేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అతడు దాదాపు 36 గంటల పాటు భూమిలోనే ఉన్నాడు. ఫలితంగా అతని ప్రాణం పోయింది. రూ.7,100 కోసం ఆలస్యమైందా?ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సంచిత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. దీపక్ను బయటకు తీయాలంటే రూ.7,100 సేకరించాల్సి ఉందని నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరిగిందని భావిస్తున్నారు. చివరకు గోతిని తెరిచి దీపక్ను బయటకు తీసిన సమయంలో అతడు మృతిచెంది ఉన్నాడు. ఎక్కువ సమయం భూగర్భంలో ఉండటం వల్ల ఊపిరాడక మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఘటనపై ఆగ్రహం.. భద్రతపై అనుమానాలుదీపక్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి ప్రమాదకర స్టంట్లను నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసే ఇలాంటి విన్యాసాల్లో కళాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీపక్ కుటుంబం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.పోలీసుల దర్యాప్తుదీపక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిని ఎందుకు సకాలంలో బయటకు తీయలేదు? నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా? స్టంట్ నిర్వహణలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. నూహ్ జిల్లా పోలీసు ప్రతినిధి కృష్ణ కుమార్ ఘటనను ధ్రువీకరించారు. అసహజ మరణం కింద సెక్షన్ 174 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఆరు రోజుల పాటు తన సాహసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దీపక్.. ఏడో రోజు అదే సాహసం కారణంగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. చప్పట్ల కోసం చేసిన విన్యాసం.. చివరకు అతడి జీవితానికి ముగింపు పలికింది. -
స్పోర్ట్స్ బైక్తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. స్పోర్ట్స్ బైక్తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి ముంబైలోని మహిమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మహిమ్ కాజ్వేకు చెందిన మంగళ అశోక్ టాండెల్ (46) సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గురు పౌర్ణమి సందర్భంగా సోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్లో ఉన్న శ్రీ స్వామి సమర్థ మఠం దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణానికి సంబంధించిన సామాన్లు సర్దుకుని, బంధువులు సిద్ధమయ్యారా అని తెలుసుకోవడానికి ఆమె లేడీ జంషెడ్జీ రోడ్డును దాటుతుండగా ప్రమాదం జరిగింది.బాంద్రా వైపు అత్యంత వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో మంగళను బైక్ దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అనంతరం ఆమెను వెంటనే రాహేజా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి కాగా, వారికి సలోనీ (22), సానియా (20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.ఇదే ప్రమాదంలో బైక్ నడుపుతున్న ధ్రువ్ గురవ్ (21) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మహిమ్ ఫిషర్మెన్ కాలనీకి చెందిన అతడిని భాభా ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసుల సమాచారం ప్రకారం, ధ్రువ్ తన తల్లిని బాంద్రా నుంచి ఇంటికి తీసుకురావడానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతని తల్లిదండ్రులు గతంలో వివిధ ఆర్కెస్ట్రా బృందాలతో గాయకులుగా పనిచేసేవారని, ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.ధ్రువ్, అతని అన్న ఇద్దరికీ స్పోర్ట్స్ బైక్లపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని, వారి కుటుంబం వద్ద ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ బైక్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధ్రువ్ గతంలో కూడా ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు.ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం), సెక్షన్ 281 (బహిరంగ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం)తో పాటు మోటారు వాహనాల చట్టంలోని ఇతర నిబంధనల కింద మృతుడైన ధ్రువ్ గురవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రియుని కోసం కన్నకొడుకు గొంతు కోసి..
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఓ కన్నతల్లి తన మూడేళ్ల పసికందును అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో మాట్లాడుతుండగా ఏడుస్తున్నాడనే కారణంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛౌలీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛౌలీ గ్రామానికి చెందిన కృష్ణ మురారి గుప్తా భార్య రుచి జిందల్ (32) వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. జూన్ 28న భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో మూడేళ్ల కుమారుడు మాధవ్ పదే పదే ఏడుస్తూ ఆమెకు అడ్డుగా మారాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ తల్లి, బిడ్డ గొంతు నులిమి హత్య చేసింది.ఈ దారుణం తర్వాత ఆమె ఏమీ ఎరుగనట్లు నాటకం మాడింది. బిడ్డకు అకస్మాత్తుగా అనారోగ్యం చేసిందంటూ భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. పోలియో చుక్కల వికటించడం వల్లే మృతి చెంది ఉండవచ్చని భావించి, బాలుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.అయితే, సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జూలై 27న భర్త కృష్ణ మురారి తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఆ సమయంలో ఆమె తన ప్రియుడితో మాట్లాడుతున్న సంభాషణను ఆయన విన్నారు. నిలదీయడంతో రుచి జిందల్ తన తప్పును అంగీకరించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బల్దేవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని, కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మహావన్ సీఓ సంజీవ్ కుమార్ రాయ్ తెలిపారు. -
ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్ వైశాలి నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్హోల్లో ప్రమాదవశాత్తు పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా (HYDRAA), ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గంటల తరబడి గాలించినా.. ఇంకా బాలయ్య ఆచూకీ చిక్కలేదని తెలుస్తోంది.స్థానికుల సమాచారం ప్రకారం.. వైశాలి నగర్ ప్రాంతంలో బాలయ్య మంగళవారం అండర్పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్హోల్లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కూతురి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. గమనించిన కొందరు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ రంగప్రవేశంబాలయ్య ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మ్యాన్హోల్ పరిసరాల్లో, డ్రైనేజీ మార్గాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. లోపల పరిస్థితులను పరిశీలిస్తూ సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.స్థానికుల్లో ఆందోళనఈ ఘటనతో వైశాలి నగర్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో నాల పనులు చేపట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బాలయ్య కుటుంబ సభ్యులు ఆ పెద్దాయన కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు అతడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాలయ్య ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. -
ప్రాణం తీసిన అవమానం!
గద్వాల క్రైం: అతనో నిరుపేద విద్యార్థి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూనే ఫస్టియర్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో ర్యాంకర్గా నిలిచాడు. అయితే ఓ లెక్చరర్ మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ హేళన చేయడం.. చెంపపై కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో కుంగుబాటుకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం, సూసైడ్ నోట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మూడు పేజీల సూసైడ్ నోట్ కొత్తపల్లికి చెందిన నేతి»ొట్టు తెలుగు బుచ్చన్న, రేణమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరి రెండో కుమారుడు తరుణ్ (17) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత శనివారం కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ ఫస్టియర్లో మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ తరుణ్ను హేళన చేసింది. దీంతో అతను ఇలా నిరుత్సాహపర్చడం సబబు కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. విచక్షణ కోల్పోయిన సదరు లెక్చరర్.. ‘నీవేమైనా మంత్రి కుమారుడివా.. అంతకన్నా గొప్పవాడివా’అంటూ అతన్ని చెంపపై కొట్టింది. దీంతో తరుణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రెండురోజుల పాటు కలత చెందాడు. చివరకు తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతగానో కుంగిపోయా.. వాస్తవానికి తరుణ్ సోమవారం ఉదయం విషయం కళాశాల ప్రిన్సిపల్ వీరన్న దృష్టికి తీసుకెళ్లగా ఆయన సర్ది చెప్పారు. అయినప్పటికీ తరుణ్ తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఒక విద్యార్థిని అతిగా పొగిడి.. మరో విద్యార్థిని నిరుత్సాహపర్చడం నా దృష్టిలో సరైంది కాదు.. లెక్చరర్ చర్యల వల్ల నేను ఎంతగానో కుంగిపోయా. నేను బాధపడిన విషయం ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. ఓ లెక్చరర్గా విద్యార్థులను ‘ప్రోత్సహించకపోయినా పర్వాలేదు.. నిరుత్సాహ పర్చకండి. నా చావుకు కారణమైన ఆ లెక్చరర్పై కఠిన చర్యలు తీసుకుని, అలాంటి ప్రవర్తనకు ఆమెను బాధ్యురాలిని చేసినప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది..’అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. చదువులో చురుకైన విద్యార్థి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ విషయమై రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ను సంప్రదించగా.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పా.. ‘తరగతి గదిలో శనివారం జరిగిన సంఘటనపై వాకబు చేశాం. తరుణ్ కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిని ఎంఎల్టీ లెక్చరర్తో తనకు వచ్చిన మార్కులు గురించి వివరించింది. ఈ క్రమంలో ఆ మహిళా లెక్చరర్ తరగతి గదికి వెళ్లి అందరి ముందు ఉత్సాహపరించింది. దీంతో స్పందించిన తరుణ్..‘ప్రోత్సహించడంలో వ్యత్యాసం చూపకండి.. అయినా మీరు మా క్లాస్కు సంబంధించిన లెక్చరర్ కాదు కదా’అని అనడంతో వివాదం చోటుచేసుకుంది. ఆ విద్యార్థికి సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చజెప్పా. లెక్చరర్ను కూడా మందలించాం. ఇంతలోనే అతను బలవన్మరణానికి పాల్పడటం తీవ్రంగా కలచివేసింది..’అని ప్రిన్సిపల్ వీరన్న చెప్పారు. -
మహిళకు సీఐ లైంగిక వేధింపులు.. వీఆర్కు బదిలీ
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వీఆర్కు బదిలీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్టు పోలీసులు గుర్తించారు.అంతేకాకుండా బాధిత మహిళతో కొద్ది రోజుల పాటు ఓకే ఇంట్లో కలిసున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అదే క్రమంలో మహిళను వదిలించేందుకు సీఐ శ్రీనివాసులు రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని వీఆర్కు బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రాత్రంతా ప్రియురాలి మృతదేహంతోనే ప్రయాణం.. ఏకంగా 350 కి.మీ
ముంబై: ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్షిప్లో ఉన్నాడు.పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్గావ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. -
నాకు విలువలున్నాయి.. ఎక్కడికీ పారిపోలేదు: ఉదయ్కృష్ణారెడ్డి
సాక్షి, ప్రకాశం: హైదరాబాద్ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్ల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రైనీ ఐపీఎస్(సస్పెండెడ్) ఉదయ్కృష్ణారెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్న ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.‘‘మా నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వస్థలం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వచ్చా. కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల పూర్తి వివరాలు వెల్లడించలేను. త్వరలోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా’’ అని మంగళవారం ఉదయ్కృష్ణారెడ్డి ఓ మీడియా చానెల్తో మాట్లాడారు. నాకు విలువలున్నాయితాను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినని, విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని ఉదయ్కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్, న్యాయ వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.నోటీసులు అందలేదుపోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని తన రెండు చిరునామాలకు వెళ్లారన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆ రెండు చిరునామాలు తాత్కాలికమైనవని, తన శాశ్వత చిరునామా అయిన ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాను స్వయంగా హైదరాబాద్కు వెళ్తున్నానని, ఎక్కడికీ పారిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.తోటి ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. ఆ వెంటనే దర్యాప్తు నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అటుపై ఆరోపణలు తట్టుకోలేక ఉదయ్ ఆస్పత్రి పాలయ్యారు కూడా. అయితే ఈ ఆరోపణలపై ఉదయ్కృష్ణారెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు.తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తానని ఉదయ్కృష్ణారెడ్డి తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, చివరికి నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
షాకింగ్ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో దిగ్భాంతి రేపే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 23 ఏళ్ల భార్యను భార్యను ఉరివేసి హత్య చేశాడు. అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను రికార్డు చేసి, ఆ వీడియోను బంధువులకు, స్నేహితులకు పంపిన ఘోరాన్ని అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించిన కిరాకత ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలిని భాగ్యశ్రీ జిగళూర్ (23)గా, నిందితుడైన ఆమె భర్తను ప్రవీణ్ జిగళూర్ (28)గా పోలీసులు గుర్తించారు. ఇంట్లో గొడవ జరిగిన సమయంలో ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై దుంగతో దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేశాడు. భాగ్యశ్రీ ఉరితాడుకు వేలాడుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ప్రవీణ్ ఆ ఘోరాన్ని వీడియో రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటాన్ని వారికి చూపించాడు. అంతేకాదు ఆ వీడియోను పలువురికి షేర్ కూడా చేశాడు.ఈ ఘటన బాగల్కోట్ జిల్లా గలగలి గ్రామంలోని వారి నివాసంలో చోటుచేసుకుంది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో భాగ్యశ్రీ రెండు నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉందామని, గొడవలు పడనని నమ్మబలికి ప్రవీణ్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన ఆ రోజే ఆమెను ఈ రకంగా దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రవీణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్
పారిస్లోని పోర్ట్ డి క్లిచీ సమీపంలో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. రెండు పొడవైన కత్తులతో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే డ్యూటీ పోలీస్ అధికారి చాకచక్యంగా అతడిని బంధించి, అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. ఈ ఘటన 'పోర్ట్ డి క్లిచీ' ప్రాంతం సమీపంలో జరిగింది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి లారెంట్ నునెజ్ తెలిపిన వివరాల ప్రకారం,నిందితుడు రెండు వంటగది కత్తులతో 19, 24, 36 ఏళ్ల వయస్సున్న మహిళలపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు గర్భిణి. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. డ్యూటీలో ఉన్న పోలీసు బాటసారులతో కలిసి అడ్డుకుని నిందితుడిని ఆ టకట్టించడం ప్రశంసలందుకుంటోంది. గుర్తుతెలియని ఆ నిందితుడు, తానీ నేరం చేయడానికి "అల్లాహ్" ఆజ్ఞాపించాడని పేర్కొన్నాడు. పారిస్ వీధిలో ఆ వ్యక్తి కత్తితో దాడికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి స్నాప్చాట్లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో నిజమైనదేనని రాయిటర్స్ వార్తా సంస్థ ధృవీకరించింది.Pregnant woman among two people rushed to hospital after mass stabbing in Paris.Suspect shouted: "It's Allah who made me do it"! pic.twitter.com/APe5MSPBzD— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) July 27, 2026 > ఆ వీడియోలో పొడవాటి నల్లని జుట్టు, క్రీమ్ రంగు ట్రాక్సూట్ ధరించిన ఒక వ్యక్తి రెండు చేతుల్లో పెద్ద కత్తులు పట్టుకుని, ఒక యువతిపై దాడి చేసి పొడవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే అదే వ్యక్తి నేలపై పడిపోగా, బాటసారులు అతడిని కదలకుండా పట్టుకున్నారు. నేలపై పడి ఉన్న ఆ వ్యక్తి "నన్ను ఇలా చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించాడు" అని అనడం వీడియోలో వినిపిస్తోంది. ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!ఎలా పట్టుకున్నారంటే..నిందితుడు ఒక మహిళ వెనుక భాగంలో పొడవడం చూసి, 'రండి, అతడిని ఆపుదాం!' అని గట్టిగా అరిచాడు పోలీసు అధికారి. వెంటనే పలువురు ముందుకు వచ్చారు. ఇంతలో మరో వ్యక్తి అతనిపైకి సూట్కేస్ను విసిరాడు. దాంతో అతని చేతిలో కింత పడిపోయాయి.. ఆ సమయంలో పోలీసు అతడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. సమయస్ఫూర్తితో నిందితుడిని బంధించిన ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారిని మంత్రి నునెజ్ ప్రశంసించారు.ఈ దాడికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని నునెజ్ తెలిపారు. నిందితుడి వివరాలను నిర్ధారించలేదు. ఈ ఘటనపై తీవ్రవాద నిరోధక విచారణ చేపట్టాలా వద్దా అనే కోణంలో ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూటర్ కార్యాలయం పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది -
నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
హైదరాబాద్: సరూర్నగర్ పరిధి భగత్సింగ్నగర్ బస్తీలో కంట్రీమేడ్ తుపాకీతో హల్చల్ చేస్తున్న ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ, సరూర్నగర్ పోలీసులు దాడి చేయగా ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న ఇమ్రాన్ వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ లభించాయి.అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇతడి స్వస్థలం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామం అని తేలింది. నగరానికి వచ్చి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాటపట్టాడని తెలిసింది. రాజేంద్రనగర్లోని ఓ స్క్రాప్ దుకాణంలో పని చేసిన సమయంలో బిహార్కు చెందిన షకీర్ వద్ద కంట్రీమేడ్ తుపాకి, ఒక లైవ్రౌండ్ రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇమ్రాన్పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
హైదారాబాద్, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ తెలిపిన మేరకు.. మల్లికార్జునగర్కు చెందిన రవికుమార్(35) అదే ప్రాంతంలోని టెంట్హౌస్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం టెంట్హస్ సమీపంలో అపార్ట్మెంట్ వద్ద ఆడుకుంటున్న బాలిక (4)కు చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా రవికుమార్ తీసుకెళ్లిన విషయం చెప్పింది. ఈ ఘటన పై సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హీటర్ ప్రాణం తీసింది..
హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ వాటర్ హీటర్ ఉపయోగిస్తుండగా షాక్కు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. భువనగిరికి చెందిన స్వాతి (40), భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగరంలో నివాసముంటోంది. శ్రీనివాస్ చర్లపల్లిలో ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు.సోమవారం ఉదయం భర్త డ్యూటీకి, పిల్లలు స్కూల్కి వెళ్లిన తరువాత డోర్ వేసుకున్న స్వాతి వేడినీటి కోసం బకెట్లో ఎలక్ట్రిక్ వాటర్హీటర్ వేసిన సమయంలో ప్రమాదవశాత్తు చెయ్యి వాటర్హీటర్ ఉన్న నీటిని తాకింది. దీంతో తీవ్ర కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన పై పోర్షన్ వారు భర్తకు సమాచారం అందించడంతో అతను వచ్చి లోపలకు వెళ్లి చూడగా కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.రోడ్డు ప్రమాద మృతులను విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేటకు చెందిన రాంబాబు (50), నారాయణరావు (50), మోహన్నాయుడు (8)గా గుర్తించారు. ప్రమాదంలో మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు
కృత్తివెన్ను: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మామాఅల్లుళ్లను హతమార్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. జూన్ 27వ తేదీ రాత్రి పాతగొడవల నేపథ్యంలో చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పను దారుణంగా హత్యచేశారు. అదే గ్రామానికి చెందిన శంకరపు శ్రీనుకు సుబ్బన్న, అయ్యప్పలతో చేపలవేట వద్ద ఘర్షణ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజు, గుడివాడకు చెందిన నలుగురు స్నేహితుల సహకారంతో సుబ్బన్న, అయ్యప్పలపై కర్రలు, రాడ్డు, కత్తితో దాడిచేశారు. వారిద్దరినీ హతమర్చారు. అనంతరం మృతదేహాలను వారి ద్విచక్ర వాహనానికే కట్టి నీటిలో పడేశారు. కంకిపాడు సీఐ బి.బి.రవికుమార్, ఆర్పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ నాగేంద్రప్రసాద్ మూడు బృందాలుగా ఏర్పడి దాదాపు నెలరోజుల పాటు సాంకేతిక అంశాల సాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు హత్యచేసింది శంకరపు శ్రీను, జల్లానాగరాజు, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, అబ్బూరి విజయరత్నం (దాస్), యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, గుడివాడ కార్మికనగర్కు చెందిన అబ్దుల్ఖాదర్జిలానీ అని గుర్తించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి లక్ష్మీపురం సెంటర్లో ఉండగా వారందరినీ పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఒక కారు, ద్విచక్రవాహనం, ఏడు మొబైల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుపరాడ్డు, కర్రను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నెలరోజులపాటు ఎంతో శ్రమించి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించారు. అధికార పార్టీ అండతోనే.. జంటహత్యల కేసులో నిందితులు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చినగొల్లపాలెంకు చెందిన నిందితులు ఆ పార్టీకి అత్యంత సానుభూతి పరులు. ఈ కారణంగానే హత్య జరిగినప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిందితులు శ్రీను, నాగరాజు, కటికల కల్యాణ్ను రక్షించేందుకు అనేక యత్నాలు చేశారని ప్రచారం జరుగుతోంది. శ్రీనుతో పాటు నాగరాజును అనుమానించిన పోలీసులు కొద్ది రోజుల క్రితం విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనంతరం వారిని వదిలేశారని సమాచారం. చివరికి అసలు నిందితులు వారే కావడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలుస్తోంది. -
బాలుడి ప్రైవేట్ పార్ట్స్పై కాల్చి వాతలు, స్కూల్ టీచర్ ఘాతుకం..!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. వాష్రూమ్కు వెళ్లనివ్వకపోవడంతో, ఆ బాలుడు యూరిన్ పాస్ చేశాడు. దీంతో బాలుడి ప్రైవేట్ భాగాలపై చాకు కాల్చివాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.బాలుడు తండ్రి కేసరి కుమార్ తన కుమారుడికి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. నర్సరీ చదువుతున్నబాధిత బాలుడు టాయిలెట్కి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయురాలు ప్రీతి కుష్వాహాను కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో బాలుడు ప్యాంట్లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్, చిన్నారిని వేరే గదిలోకి తీసుకెళ్లి, చాకును వేడి చేసి ప్రైవేట్ భాగాలపై కాల్చి వాతలు పెట్టింది. అంతేకాకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి, మళ్లీ ఈ తప్పు చేయవద్దని బెదిరించింది.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిబాధతో ఇంటికి తిరిగొచ్చిన బాలుడు జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీచర్ దుర్మార్గాన్ని ప్రశ్నించిన తమపై స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు టీచర్, ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపు తున్నారు.ఇదీ చదవండి: ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ Deeply shocked by the horrifying incident in Varanasi, where a 5-year-old was brutally tortured by a teacher. Cruelty against children is unacceptable. I demand swift & strict legal action against the teacher & school admin. Zero tolerance for abuse! #Varanasi pic.twitter.com/mnOd0UOk3S— Rais Shaikh (@rais_shk) July 27, 2026అఖిలేష్ యాదవ్ స్పందనఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన దారుణమైన ఘటన అన్నారు. దీనివల్ల ఆ చిన్నారిపై జీవితాంతం కోలుకోలేని మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో సానుభూతి, మానవత్వంతో ఎలా ప్రవర్తించాలో ఉపాధ్యాయులకు కనీస అవగాహన ఉండాలి. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
హైదరాబాద్: నిత్యం తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాందీనగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.ఛత్తీస్గఢ్కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్నగర్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.రైలెక్కి.. ఛత్తీస్గఢ్ చేరి..హిమాయత్నగర్ మెయిన్ రోడ్లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్గఢ్లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్గఢ్లోని కాంకర్ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు. -
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్కుమార్కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
మొన్నే చంద్రబాబుతో ముచ్చటించింది.. ఇంతలోనే విషాదం
సాక్షి, పోలవరం: రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రేకు షేడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.మృతురాలిని రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివానిగా గుర్తించారు. సోమవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం పక్కన..ఇటీవల జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లో శివానికి ప్రత్యేక అవకాశం లభించింది. ఈనెల 24న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఆమె మాట్లాడింది. ఆపై ఆయనతో ఫొటో కూడా దిగింది. చంద్రబాబుతో ముచ్చటించిన బాలిక ఇలా అనూహ్యంగా మృతి చెందడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.అనుమానాస్పద మృతిగా కేసుఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శివాని మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతికి అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.చంద్రబాబు దిగ్భ్రాంతివిద్యార్థిని మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని.. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని… pic.twitter.com/9NZE0spqgv— N Chandrababu Naidu (@ncbn) July 27, 2026విద్యార్థులు, యువత సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలని.. ఒత్తిడి, నిరాశకు లోనుకావద్దని సూచించారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, తమ బాధలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. -
అబిడ్స్లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్ను పోలీసులు ఛేజ్చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. -
మరిది వేసిన మాస్టర్ప్లాన్! కథ అడ్డం తిరిగింది..
కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన సచిన్వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్రాజ్కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్పే ద్వారా సచిన్కు పంపించాడు. సచిన్వర్మ మెట్పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సచిన్ను ఉత్తరప్రదేశ్కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్రాజ్కు వెళ్లి సచిన్ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్బాబు, ఎస్సై కిరణ్కుమార్, సిబ్బందిని అభినందించారు. -
కెనడాలో పంజాబ్కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్లో మానవత్వపు పరిమళాలు -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్లొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
కీసర: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన బాలిక (13) తల్లిదండ్రులు మృతిచెందడంతో కీసరలోని తన అమ్మమ్మ వద్ద కొన్ని సంవత్సరాలు ఉంది. స్థానికుల సహాయంతో ఇటీవల తుర్కపల్లిలోని వసతి గృహంలో చేరి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. ఇటీవల సెలవులు కావడంతో కీసరలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మేనమామతో పాటు వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం వసతి గృహానికి వెళ్లిన బాలిక తలకు ఫ్యాన్ తగిలి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి రాగా ఈ విషయం తెలిసింది. దీంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి
నిర్మల్టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15న సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ అస్లాంఖాన్ హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.6లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని సవతి తల్లి హత్య చేయించింది. ప్రధాన కుట్రదారు అన్వరీబేగంతోపాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్లోని ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మీల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన అస్లాంఖాన్(23)కు సవతి తల్లి అన్వరీబేగంతో కొంతకాలంగా వివాహేతరసంబంధం ఉంది. అతడు మరో యు వతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవద్దని, తమ సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేసింది.పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం అస్లాంఖాన్ తన బాబాయికి చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసి వివాదం ఏర్పడింది. అస్లాంఖాన్ భయంతో అదే కాలనీలోని తన బాబా యి ఇంటి వద్ద ఉంటూ ఆటో నడుపుతుండేవాడు. తమ సంబంధం అందరికీ తెలిసి పరువు పోయిందని, తనకు దూరమై మరో వివాహం చేసుకుంటాడని అన్వరీబేగం కక్ష పెంచుకుంది. రూ.6లక్షలతో సుపారీ హత్యకు మహారాష్ట్రకు చెందిన తన పరిచయస్తుడు ముఖీద్తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50వేలు చెల్లించి హత్య తర్వాత మిగతా మొత్తం చెల్లించడానికి ఒప్పందం చేసుకుంది. అస్లాంఖాన్ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు అందజేసింది. తన సోదరుడు షేక్ మహమ్మద్కు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ కుట్రలో భాగస్వామిని చేసింది.అస్లాంఖాన్ హత్యకు ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్ పవార్ జూలై ఒకటిన నిర్మల్కు వచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హత్యకు యత్నించగా.. జన సంచారం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తగ్గి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో జూలై 14న ముఖీద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్ అద్దె స్కార్పియోలో మహారాష్ట్ర నుంచి బయల్దేరి నిర్మల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అన్వరీబేగం, షేక్ మహమ్మద్లను కలిశారు. అస్లాంఖాన్ కదలికలను ఎప్పటికప్పుడు అన్వరీబేగం నిందితులకు చేరవేసింది. అస్లాంఖాన్ ప్రయాణికులతో ఆటోలో నిర్మల్ బస్టాండ్ వైపు వెళ్తుండగా.. ముఖీద్, అఫ్రోజ్ స్కారి్పయో వాహనం నుంచి దిగి అడ్డగించారు. అస్లాంఖాన్ను బయ టకు లాగి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. ఘటన అనంతరం నిందితులు నాందేడ్ వైపు పారిపోయారు. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ గుర్తించారు. ముఖిద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్, షేక్ మహమ్మద్లను అరెస్ట్ చేసి స్కార్పియో కారు, మోటార్సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అన్వరీబేగంను ఈ నెల 17న అరెస్ట్ చేసి విచారించగా విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన నిర్మల్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు ఎం.కృష్ణ, రవీంద్రనాయక్, ఎస్సైలు జి.లింబాద్రి, ఎస్.శ్రీకాంత్, గోపి, గణేష్, అశోక్, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఒంగోలు వన్టౌన్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి కే శైలజ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన సాదు శ్యామ్ అలియాస్ శ్యాంసుందరరావు (49) 2020 జూన్ 8న ఓ బాలిక(10) ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడి చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్ వేశారు. నేర నిరూపణ కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను జడ్జి విధించారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ.2,50,000 ఒంగోలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందజేయాలని ఆదేశించారు. -
బాయ్ఫ్రెండ్ని కట్టేసి, నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ (NEET) విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. దిగ్భ్రాంతి రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల యువతి రాజస్థాన్లోని కోటాలో ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఆమె కొద్ది రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 17 ఏళ్ల మైనర్ ఫ్రెండ్ను కలవడానికి చిత్రకూట్కు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు బైక్పై దేవాంగన లోయ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది దుండగులు నకిలీ అధికారులు అవతారం ఎత్తారు. వీరిద్దరూ సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్పై అక్కడికి వచ్చారు. తాము అటవీ శాఖ అధికారులమని చెప్పి బెదిరించారు. అబ్బాయిపై బెల్టుతో తీవ్రంగా కొట్టి, అతడి చేతులు, కాళ్లను బంధించారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా సమీపంలో ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. అరిస్తే గుట్టపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడినుంచి ఉడాయించారు. చివరికి అబ్బాయి ఎలాగో తప్పించుకొని పోలీసు అత్యవసర హెల్ప్లైన్కు సమాచారం అందించాడు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్షసంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయపడిన అబ్బాయికి ప్రాథమిక చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సిసిటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగాఅనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాగ్రాజ్ జోన్ అడిషనల్ డీజీ జ్యోతి నారాయణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు.ఇదీ చదవండి: 150 పిజ్జాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్లో మానవత్వపు పరిమళాలు -
'చదవడం' నావల్ల కాదన్నా వినిపించుకోరేం?
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు.రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్కు వచ్చిన చంద్రేగౌడ్.. రాత్రి వేళ హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు.గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
నా భర్తకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది..!
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో సె క్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేషతో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కు టుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితు రాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది. -
క్యాబ్ ఎక్కాలంటేనే భయం!
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండురోజుల క్రితం క్యాబ్లో నగరానికి వస్తున్న ఓ ఎయిర్లైన్స్కు చెందిన మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.6 నెలల క్రితం ఈసీఐఎల్ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్తున్న ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్యాబ్లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడే కేసులు నమోదవుతున్నాయి. కానీ నిశి్చంతగా, నిర్భయంగా ప్రయాణం చేసే సదుపాయం మాత్రం అందుబాటులోకి రావడం లేదు. అభయ, దిశ ఉదంతాల తర్వాత ప్రతి వాహనానికీ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించినా అది అమలులోకి రాకపోవడం దురదృష్టకరం.రహదారి భద్రతా చట్టంపై నిర్లక్ష్యం..కేంద్రం రూపొందించిన రహదారి భద్రతా చట్టం ప్రకారం అన్ని రకాల రవాణా వాహనాల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్టీడీ) తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యవస్థను కలిగిన వాహనాలకే రవాణాశాఖ ఫిట్నెస్ ధ్రువీకరించాలి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్లో మాత్రం ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు. మహిళా ప్రయాణికుల భద్రతతో పాటు అన్ని వర్గాల ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీఎల్టీడీ ఎంతో అవసరం. దీంతో జీపీఎస్ ట్రాకర్ ద్వారా వాహనం రియల్టైమ్ లొకేషన్ నమోదవుతుంది. వాహనం వేగం, రూట్ చరిత్ర వంటివి నిక్షిప్తమవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ సిబ్బంది త్వరతిగతిన అక్కడికి చేరుకోవచ్చు. ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు, క్యాబ్లు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లతో పాటు వస్తు రవాణా వాహనాలకు కూడా వీఎల్టీడీ తప్పనిసరి అని చట్టంలో ఉంది.వాహన్తో అనుసంధానం..వీఎల్టీడీ కలిగిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేసేలా వాహన్ పోర్టల్లో మార్పులు చేశారు. అన్ని మెట్రో నగరాల్లో ఇది అమల్లో ఉంది. హైదరాబాద్లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. వీఎల్టీడీ లేకపోయినా ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గతంలో స్కూల్ బస్సులకు ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పట్లో పాలెం బస్సు దగ్ధం నేపథ్యంలోనూ ఈ ప్రతిపాదన ముందుకొచి్చనా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. -
చెక్కుపై రూ.55 కోట్లు.. దిమ్మతిరిగే ప్లాన్! కానీ..
హైదరాబాద్, పంజగుట్ట: ఓ ఔషధ సంస్థకు చెందిన చెక్కుపై రూ.55 కోట్లు రాసుకుని బ్యాంకును, ఔషధ సంస్థను మోసం చేసేందుకు యత్నించిన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ అనే ఔషధ సంస్థకు బెంగళూరు కెనరాబ్యాంకులో అకౌంట్ ఉంది.2024లో వీరి చెక్ బుక్ నిండిపోవడంతో కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తూ పాత చెక్బుక్ లోని ఆఖరు చెక్కును సంతకం చేసి ఎలాంటి నగదు వివరాలు రాయకుండా దరఖాస్తుతో పాటు పొందుపర్చి బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆ చెక్కును యూపీకి చెందిన జగత్సింగ్ అనే వ్యక్తి సేకరించి అందులో రూ.55 కోట్లు రాసుకుని సోమాజిగూడలోని కెనరాబ్యాంకులో ఉన్న తన ఖాతాకు బదిలీ చెసుకునేందుకు ప్రయత్నించాడు.బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి సదరు ఔషధ సంస్థను సంప్రదించడంతో వారు ఈ చెక్కును తాము కొత్త చెక్కుబుక్ కోసం దరఖాస్తు చేస్తూ బ్యాంకులో ఇచ్చామని చెప్పడంతో నగదు బదిలీ ఆపారు. ఔషధ సంస్థ నిర్వాహకులు నగరానికి చేరుకుని గురువారం అసలు బ్యాంకులో సమర్పించిన తమ చెక్కు బయటకు ఎలా వచ్చిందో తెలుసుకోవడంతో పాటు.. దాన్ని డ్రా చేసుకునేందుకు యత్నించిన జగత్ సింగ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
10వ అంతస్తునుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..
హైదరాబాద్, మణికొండ: అపార్ట్మెంట్ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్ చేజ్ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్రెడ్డి(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఏఎస్బీఎల్ స్పెక్ట్రా అపార్ట్మెంట్ 10వ అంతస్తులోని తన ఫ్లాట్కు వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం, దర్యాప్తు అనంతరం వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. -
హనుమాన్ విగ్రహం దొంగ టీడీపీ నేత
తిరుపతి క్రైం/తిరుమల/తగరపువలస: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలురాయి వద్ద బుధవారం వేకువజామున అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహం కేసు గురువారం సంచలన మలుపు తిరిగింది. ఈ ఘటనలో అరెస్టయిన నిందితుడు భీమిలికి చెందిన టీడీపీ నాయకుడేనన్న విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా, వార్తా ఛానళ్లలో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. నిందితుడు విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొట్నూరు రాము కుమారుడు, ఐటీడీపీ కార్యదర్శి జశ్వంత్కుమార్ (22) అని తేలింది. ఈ విగ్రహం చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? జశ్వంత్కు ఎవరైనా ప్రోత్సాహం అందించారా? చోరీ సమయంలో ఇంకెవరైనా సహకరించారా? అనే కోణాల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు జశ్వంత్ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజకు అత్యంత కీలక సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. బీటెక్ చదివి, ఐటీడీపీలో భీమిలి నియోజకవర్గం కార్యదర్శిగా కొనసాగుతున్న జశ్వంత్కు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. వీరితో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గతంలో పలువురిని బెదిరించిన సందర్భాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడు ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ కేసులో పోలీసులకు చిక్కిన విషయం బుధవారమే తెలిసినా, టీడీపీ ఉన్నత నాయకత్వం సూచనల మేరకు పొట్నూరు రాము మౌనం పాటించారు. సాంకేతికత ఆధారంగా నిందితుడి అరెస్ట్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మామండూరు మిట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని చిన్న అభయ ఆంజనేయస్వామి విగ్రహం అపహరణకు గురైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు 15 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ వివరాలను జిల్లా ఏఎస్పీలు గురువారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ ఏవీఎస్ఓ ఎ.వెంకట శివకుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలింపు నిర్వహించారు. నిందితుడు ప్రయాణించిన జీపును గుర్తించి, అతని కదలికలను విశ్లేషించారు. రైల్వే పోలీసుల సహకారంతో ఒంగోలు రైల్వే స్టేషన్లో విశాఖపటా్ననికి చెందిన పొట్నూరు జశ్వంత్ కుమార్ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి విగ్రహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, జశ్వంత్ కుమార్ ఇంజినీరింగ్ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని, మూడేళ్లుగా మానసిక పరిస్థితి స్థిరంగా లేదని కుటుంబ సభ్యులు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గొర్ల మండలంలోని భువనేశ్వరి పీఠంతో అతనికి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడు పొట్నూరు జశ్వంత్ కుమార్ను రిమాండ్కు తరలించి, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడు జశ్వంత్ మానసిక స్థితి బాగోలేదని తిరుపతి పోలీసులు చెప్పడం సరికాదని భీమిలి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు రైల్వేస్టేషన్లో విగ్రహంతో జశ్వంత్ దొరకగానే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అతడి బ్యాక్ గ్రౌండ్ తెలిసిపోయిందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు.. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని డైవర్షన్ డ్రామాకు తెర లేపారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన కూడా నిందితుడు తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లొచ్చారని స్థానికులు తెలిపారు. -
అమ్మా.. క్షమించు..
చిల్లకూరు: ‘అమ్మా..నన్ను క్షమించు.మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్లో రాసి సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాలలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన శ్రీపతి రమణయ్య ద్వితీయ కుమార్తె సాయి చందనప్రియ (27) ఏడాది క్రితం తొణుకుమాల సచివాలయానికి ఏఎన్ఎంగా బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి ఆమె స్థానికంగా పనిచేసే వారితో పాటు చింతవరం వైద్యులతో కలిసి సచివాలయంలోనే మధ్యాహ్నం భోజనం చేసేది. గురువారం తాను మరోసారి భోజనం చేస్తానని ఆశ వర్కర్లకు చెప్పి వారిని గ్రామంలోని పాఠశాలకు పంపేసింది. సచివాలయ సిబ్బంది మండల పరిషత్లోని సమావేశంలో ఉండగా..అగ్రికల్చర్ అసిస్టెంట్ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో సూసైడ్ నోట్ను రాసి టేబుల్పై పెట్టి..సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సచివాలయానికి వచ్చిన వారు గమనించి కిందికి దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని విషయాన్ని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అక్కడికి వచి్చన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. రైలు కింద పడి తహసీల్దార్ ఆత్మహత్య ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో తీవ్ర మానసిక వేదన చిత్తూరు సిద్ధంపల్లె రైల్వే గేటు వద్ద ఆత్మహత్య మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు (45) చిత్తూరు పట్టణ సమీపంలోని సిద్ధంపల్లె రైల్వేగేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కాట్పాడి – తిరుపతి ప్యాసింజర్ రైలు కింద పడి ఆయన మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించి.. మదనపల్లె అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాసులును ఇటీవల ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక ఆయనను మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ విభాగానికి బదిలీ చేశారు. అయితే, సస్పెన్షన్ వేటుతో శ్రీనివాసులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చిత్తూరుకు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకున్న వ్యక్తి మృతి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/తిమ్మాపూర్/గన్నేరువరం: కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ఈనెల 14వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకున్న బేతెల్లి రాజేందర్రెడ్డి బుధవారం రాత్రి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని స్వగ్రామం గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజేందర్రెడ్డి మరణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్రెడ్డే కారణమని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని నగరంలోని జిల్లా ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబం, బంధువులు నిరసనకు దిగారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్తోపాటు పోలీసులు వారితో మాట్లాడి పోస్టుమార్టం పూర్తయ్యాక రాజేందర్రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. గుండ్లపల్లి స్టేజీ రాజీవ్ రహదారిపై మరోసారి బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడ నుంచి మురళీధర్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముట్టడికి యత్నించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాజేందర్రెడ్డి మరణానికి ఎమ్మెల్యే పీఏ మురళీధర్రెడ్డి వేధింపులే కారణమని, తన భర్తపై పలువురితో అక్రమ అట్రాసిటీ కేసు పెట్టించడంతోనే ప్రాణాలు తీసుకున్నాడని భార్య సమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసులో ఏ–1గా మురళీధర్రెడ్డితో పాటు మరో నలుగురిపై ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డ్రగ్స్ కేసు పెడతా.. జీవితాలను నాశనం చేస్తా : పోలీస్ బెదిరింపు వీడియో వైరల్
సాక్షి, ముంబై: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అనే ప్రధాన డిమాండ్లతో సీజేపీ పోరాటానికి రోజు రోజుకు యువత నుంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలోని జంతర్ వంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. భాష్ప వాయువు ప్రయోగించిన వైనం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ధర్నాలు ర్యాలు ఉదృతంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబైలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శివాజీ పార్క్, చెంబూర్ , ఆజాద్ మైదాన్తో సహా నగరంలోని కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పౌరులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు తీరుపై, ముంబై కాంగ్రెస్ ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియో కొత్త వివాదానికి దారితీసింది. దీనికి ప్రకారం ఒక పోలీసు అధికారి నిరసన ప్రదేశం నుండి అదుపులోకి తీసుకున్న విద్యార్థుల బృందాన్ని నిరసనల్లో పాల్గొంటే అక్రమ మాదకద్రవ్యాల కేసులోఇరికిస్తానని బెదిరించడం కనిపిస్తుంది. అంతేకాదు నిరసనకు తిరిగి రావద్దని, మళ్లీ ఇక్కడ కనిపిస్తే, మీ బ్యాగుల్లో 50-50 గ్రాముల పౌడర్ (మాదక ద్రవ్యం) పెడతాను, దాంతో మీ జీవితం నాశనమైపోతుంది అంటూ ఆ పోలీసు అధికారి విద్యార్థులతో అనడం వీడియోలో ఉంది. (కిచిడీ ఫెయిల్, అంతరిక్ష వంటకాల్లో మూడింటికే చోటు : ఎందుకో?)ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చMumbai Police are threatening students" If you come to Protest again, I will frame you all in drug case and you'll spend your whole life in Jail.I'm a very bad guy,don't test me, I'll throw u all in Jail" This is what goons in uniform look like, Hope the Nation is watching…— 🪳Against Corruption (@akashuchani08) July 23, 2026 ఈ వీడియో వైరల్ కావడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసులు, దీనికి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులపై విచారణను ప్రారంభించారు. విచారణ పూర్తయ్యే వరకు, వీడియోలో యూనిఫాంలో కనిపించిన సదరు అధికారిని ప్రస్తుత విధి నిర్వహణ నుండి తప్పించారు. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వందే భారత్లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ -
హనీమూన్ హత్య కేసులో సోనమ్కు బిగ్ షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ను గురువారం రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్పై సుప్రీం కోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇండోర్కు చెందిన సోనమ్ రఘువంశీ.. 2025 మేలో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. అక్కడే వీరిద్దరూ అదృశ్యం కాగా.. కొద్ది రోజుల తర్వాత రాజా మృతదేహం ఓ లోయలో లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా రాజా హత్య వెనుక సోనమ్ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. తన తండ్రి దగ్గరే పని చేసే ప్రియుడి రాజ్ కుశ్వాహాతో కలిసి ఆమె ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరూ.. సుపారీ గ్యాంగ్తో కలిసి రఘువంశీని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. బెయిల్ ఎలా వచ్చింది?ఈ కేసులో సోనమ్కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.విచారణకు ఆటంకం కలిగే అవకాశంజస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. ప్రస్తుత దశలో సోనమ్ బెయిల్పై బయట ఉండటం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విచారణ వేగంగా కొనసాగకపోతే ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.సోనమ్ వాదనతనపై అభియోగాలను సోనమ్ ఖండించింది. తాను నిర్దోషినని, కేసు పూర్తిగా పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలపైనే ఆధారపడి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం ఆరోపణల ఆధారంగా తనను దోషిగా చూడలేమని కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా.. బెయిల్ను రద్దు చేస్తూ మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మేఘాలయా హనీమూన్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
కలకలం రేపిన సగం కాలిన మృతదేహం..
విశాఖపట్నం: గోపాలపట్నం, కొత్తపాలెంలోని పులగానిపాలెం పాత ఊరు సమీపంలో రైల్వే ట్రాక్ దాటాక నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం ఘటన బుధవారం కలకలం రేపింది. గుర్తుతెలియని, సుమారు 35–40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం సగం కాలి, చెట్టు కింద పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి వీఆర్వో సుబ్బారావుకు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐలు మారయ్య, రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద కాలిపోయిన మొబైల్, కళ్లజోడు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వేలిముద్రలను కూడా సేకరించారు. అనంతరం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ మృతుడు ట్రాక్ ప్యాంటు, రౌండ్ నెక్ టీషర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి ఘటన మంగళవారం రాత్రి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, వేరే చోట హత్య చేసి, ఆధారాలు చెరిపివేసేందుకు ఇక్కడ కాల్చి ఉండొచ్చన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడి గుర్తింపుతో పాటు ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్ ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఆర్వో సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.మద్యం, గంజాయి కార్యకలాపాలకు అడ్డాఘటన జరిగిన పులగానిపాలెం పాత ఊరు–రైల్వే కల్వర్టు పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ తరచూ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి రావాలంటే స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. పోలీసుల నిఘాను మరింత పెంచాలని కోరుతున్నారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య: పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు... కోటకొండ పంచాయతీ, బీఎస్ఆర్ వడ్డిపల్లికి చెందిన మహేష్, రవళి (18)ని 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో రవళి తీవ్ర మనోవేదనకు గురైంది.గర్భిణి అని కూడా చూడకుండా..రవళి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్త అరుణ వేధింపులకు గురిచేసేది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్ఐ అనీల్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
నెలక్రితం ఆమె తలలో దిగింది బుల్లెట్టే..!
కరీంనగర్: మెట్పల్లి పట్టణానికి చెందిన గోనెల లక్ష్మీపై నెల క్రితం జరిగిన దాడి సంఘటనకు సంబంధించి ఆమె తలలో నుంచి బయటపడింది బుల్లెట్టేనని ఫోరెన్సిక్ విభాగం పరిశీలనలో తేలినట్లు తెలిసింది. ఆ రోజు సదరు మహిళను ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు కాల్చినట్లు గుర్తించిన పోలీసులు.. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని మూడురోజుల క్రితం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలక నిందితుడైన యూపీ యువకుడు పట్టుబడడంతో కేసుపై ఉన్న అనుమానాలు తొలగిపోనున్నాయి.ఉపాధి కోసం వచ్చి..వెంట రివాల్వర్ తెచ్చుకుని..పట్టణంలోని మఠంవాడకు చెందిన గోనెల శంకర్కు జేసీబీ ఉంది. దానికి డ్రైవర్గా కొంతకాలం నుంచి ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. అతడు ఇక్కడకు వచ్చేటప్పుడే తన వెంట రివాల్వర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. శంకర్కు తన సోదరుడైన రాజం కుటుంబంతో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 15న అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న రాజం భార్య లక్ష్మీపై శంకర్, అతని భార్య అనూష, బావమరిది ముత్తన్న యూపీ యువకుడితో కలిసి దాడి చేశారు.ఈ సంఘటనలో లక్ష్మీ తలకు తీవ్ర గాయం కాగా.. మొదట స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ తీయగా ఆమె తలలో ఇనుప ముక్క లాంటిది ఉందని తేలడంతో వైద్యులు శస్త్ర చిక్సిత చేసి తొలగించారు. ముందుగా తనపై కర్రతో దాడి చేశారని లక్ష్మీ చెప్పడంతో తొలుత మామూలు దాడి అని భావించిన పోలీసులు.. బయటపడింది ఇనుపముక్క బుల్లెట్లాగా ఉండడంతో కంగుతిన్నారు. తర్వాత దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. అది బుల్లెట్టేనని తేలడంతో దర్యాప్తు జరిపి ఆమెపై కాల్పులకు పాల్పడింది యూపీ యువకుడు అని నిర్ధారణకు వచ్చారు.దాడి తర్వాత యూపీకి పరార్..లక్ష్మీపై దాడి అనంతరం అదే రోజు సదరు యువకుడు యూపీకి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదిక రావడంలో జాప్యం నెలకొనడంతో ఇనుప ముక్క విషయంలో స్పష్టత లేక ఇంతకాలం వేచి చూసిన పోలీసులు.. అది బుల్లెట్ అని ఫోరెన్సిక్ విభాగం తేల్చడంతో మూడు రోజుల క్రితం యూపీకి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని మెట్పల్లికి తీసుకొచ్చినట్లు తెలిసింది. నెలకుపైగా మిస్టరీగా ఉన్న ఈ కేసు యువకుడు పట్టుబడడంతో మరో రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది. -
నార్సింగి పరిధిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం...
హైదరాబాద్, మణికొండ: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్పెంటర్ను వాటర్ ట్యాంకర్ వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికకకడే మృతి చెందాడు. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఐ మునీందర్ తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్కు చెందిన సుశీల్కుమార్(28), సురేష్లు కాటేదాన్లోని లక్ష్మీగూడలో నివాసముంటున్నారు.హఫీజ్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో పని ముగించుకుని రాత్రి తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా పుప్పాలగూడ టోల్గేట్ వద్ద అతివేగంగా వచ్చిన నీటి ట్యాంకర్ వీరిని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న సుశీల్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో కారు, మరొక స్కూటీలను కూడా ట్యాంకర్ఢీకొట్టింది. అయితే వారికి ఎవరికీ గాయాలు కాలేదు. ఖానాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రంజిత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక, మట్టి మాఫియాలకు ముగ్గురు బలి
చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్న ఇసుక, మట్టి మాఫియాలకు సామాన్యులు బలవుతున్నారు. అధికారపార్టీ ధన దాహానికి ప్రాణాలు కోల్పోతున్నారు. పాలకుల పాపానికి తాజాగా ముగ్గురు బలయ్యారు. వైఎస్సార్ కడపజిల్లాలో ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు, పల్నాడు జిల్లాలో మట్టి టిప్పర్ చక్రాల కింద నలిగి ఒకరు మరణించారు. ఈ దుర్ఘటనలు అధికారపార్టీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచాయి. అయినా సర్కారులో చలనం లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మాఫియాలను కట్టడి చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజంపేట/సాక్షి, నరసరావుపేట: తెలుగుదేశం కూటమి నేతల ఇసుక, మట్టి మాఫియాలకు బుధవారం ముగ్గురు బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం ఉప్పరపల్లె సమీపంలో ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సుండుపల్లెలో జరిగే గొర్రెల సంతకు చిన్నగొల్లపల్లెకు చెందిన గొర్రెల వ్యాపారులు అబ్బన్నగారి జయరామ (45), రెడ్డిచర్ల రవీంద్ర (42) బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి బైక్ను ఉప్పరపల్లె సమీపంలో బాలరాచపల్లె నుంచి అతివేగంగా వస్తోన్న ఇసుక టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టి, కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.అయినా టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సురేష్బాబు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించడానికి యత్నించారు. దీంతో మృతుల కుటుంబీకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవాలని, డ్రైవర్ను అరెస్టు చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. వారికి పోలీసులు సర్దిజెప్పడంతో ఆందోళనను విరమించారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.20లక్షల పరిహారమివ్వాలని రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబీకులు, స్థానికులతో కలిసి ఆయన రహదారిపై బైఠాయించారు. కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, ఈ ప్రాంతంలో ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.నిద్రిస్తున్న డ్రైవర్పై నుంచి వెళ్లిన మట్టి టిప్పర్..అధికారపార్టీ నేతల అక్రమ మైనింగ్ ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో నల్లఎర్ర చెరువులో మట్టిని టీడీపీకి చెందిన అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. డ్రైవర్లకు ఎక్కువ వేతనం ఆశచూపి పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ ఆవుల నాగార్జున(35) ఎక్కువ జీతం వస్తుందన్న ఆశతో మట్టి టిప్పర్ డ్రైవర్గా చేరాడు. మట్టి మాఫియా ఒప్పందం మేరకు 24 గంటలూ (నైట్షిఫ్టులూ) పని చేస్తున్నాడు.మంగళవారం అర్ధరాత్రి వరకు టిప్పర్ తోలిన అతను అలసి నల్లఎర్రచెరువు వద్దే కింద నిద్రకు ఉపక్రమించాడు. ఈ సమయంలో అతను నిద్రపోతున్న విషయం గమనించని మరో టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని తోలడంతో చక్రాల కింద నలిగి నాగార్జున మరణించాడు. నాగార్జునకు భార్య గంగతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఆరోతరగతి చదువుతుండగా కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో సహచర డ్రైవర్లూ దిగ్భ్రాంతికి గురయ్యారు. విగతజీవిగా పడి ఉన్న నాగార్జున మృతదేహం వద్ద భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.మట్టి మాఫియా బరితెగింపు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించినా మట్టి మాఫియా చలించలేదు. మట్టి తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగకుండా ఘటన జరిగిన వెంటనే మృతదేహాన్ని ఆటోలో గ్రామంలోకి తరలించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్తులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్ ఆందోళనకారులతో మాట్లాడారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ఈడ్చుకెళ్లి... గొంతుకోసి..
చిలకలగూడ (హైదరాబాద్): ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న అత్తపై కూరగాయలు కోసే కత్తితో కోడలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... చిలకలగూడ ఎరుకలబస్తీకి చెందిన దేవరాయ పద్మావతి (57)కి కోడలు విజయలక్ష్మికి మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ ఇరువురి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. పద్మావతి భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతిచెందారు. మొదటి అంతస్తులో అత్త పద్మావతి ఒంటరిగా ఉండగా, గ్రౌండ్ఫ్లోర్లో కుమారుడు, కోడలు విజయలక్ష్మి ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఫస్ట్ఫ్లోర్ను కుమార్తెకి రాసిస్తానని పద్మావతి చెప్పడంతో నాలుగేళ్లుగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీన వివాదం తీవ్రమై అత్తను ఇంట్లోకి ఈడ్చుకెళ్లిన కోడలు కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు, చేతులపై దాడి చేసింది. పద్మావతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్ధలానికి చేరుకుని రక్తపుమడుగులో పడున్న ఆమెను హుటాహుటిన గాం«దీఆస్పత్రికి తరలించారు. కోడలు అత్తపై దాడి చేస్తున్న దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వైద్యసేవల అనంతరం అత్త పద్మావతి కోలుకుంటున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.ప్రాణం తీసిన ప్రయోగం బ్యాటరీ పేలి బాలుడు మృతికుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన చింతలమానెపల్లి: ప్రయోగాలు చేయాలనే ఉత్సాహమే ఆ బాలుడి ప్రాణాలు తీసింది. బ్యాటరీతో ప్రయోగం చేస్తూ బాలుడు మృతిచెందిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నికాడి గణేశ్, శారద దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు లోకేశ్ (14) స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవా రం ఉదయం తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లగా, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. పాఠశాలకు వెళ్లకుండా ఉదయం 10గంటలకు లోకేశ్ ఇంట్లోని బ్యాటరీతో ప్ర యోగాలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. బాలుడి ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి నోటితోపాటు దవడలు ఛిద్ర మై తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటనాస్థలిని కౌటాల సీఐ సంతోష్ కుమార్, చింతలమానెపల్లి ఎస్సై కమలాకర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. లోకేశ్కు చిన్నతనం నుంచే బ్యాట రీలు, ఎలక్ట్రికల్ వైర్లతో ప్ర యోగాలు చేసే అలవాటు ఉంది. ఇంట్లోని సైకిల్కు లైట్లను అమర్చడం, బ్యాటరీతో అనుసంధానించడం వంటి పనులు చేస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అక్రమాస్తులు రూ.400కోట్లు
సాక్షి, హైదరాబాద్: అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో బుధవారం తెలంగాణ పునరుత్పాదక ఇంధనాభివృద్ధి సంస్థ (రెడ్కో) డివిజినల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకట రమణ నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లు సహా 7 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. భారీగా నగదు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. మార్కెట్లో అక్రమాస్తుల విలువ రూ.400 కోట్లుగా తేలింది. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద కేసుగా ఇది రికార్డు సృష్టించింది. ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టు అయిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి అక్రమాస్తులే ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఈమె నుంచి స్వా«దీనం చేసుకున్న వాటి మొత్తం విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.25,70,84,461గా తేల్చారు. దీన్ని తలదన్నుతూ వెంకట రమణ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను రూ.27,65,02,133గా ఏసీబీ లెక్కకట్టింది. వీటి మార్కెట్ విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెంకట రమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ప్రాథమిక దర్యాప్తులో కొందరు బినామీలను గుర్తించారు. ఫ్లాట్లు, భవనాలు, బంగారు.. 2019లోనూ వెంకట రమణ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా చిక్కారు. సాధారణంగా అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కనిపించే రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్, పోలీసు విభాగాలను మించి ఐఎంఎస్, విద్యుత్ శాఖల అధికారులు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ సోదాల్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లిలోని నాలుగు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు (విలువ రూ.1,23,46,000), కూకట్పల్లి అంజనేయ నగర్లో 160 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+3 వాణిజ్య భవనం (విలువ రూ.1,82,00,000), గుట్టల బేగంపేట్లో 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ+5 వాణిజ్య భవనానికి (విలువ రూ.2,90,03,550) సంబంధించిన పత్రాలు లభించాయి. వీటికి అదనంగా తన భార్య పేరుతో నమోదై ఉన్న నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. అంజనేయ నగర్, మూసాపేట, కూకట్పల్లిలో 10 అపార్ట్మెంట్లు నిర్మించగా, వాటి నిర్మాణ వ్యయం సుమారు రూ.20 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. వీటికి తోడు రూ.52,02,585 బ్యాంక్ బ్యాలెన్స్, 2.09 కేజీల బంగారు ఆభరణాలు, కియా, మహీంద్రా, బలెనో కార్లు (విలువ రూ.45 లక్షలు), రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ.2.5 లక్షల విలువైన 20 మద్యం సీసాలు స్వా«దీనం చేసుకున్నారు. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అడ్డదారిలో మళ్లీ పోస్టింగ్ వెంకట రమణ గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేశారు. సైబర్సిటీ సర్కిల్లో డివిజనల్ ఇంజినీర్గా (టెక్నికల్) పనిచేస్తున్న సమయంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. 2019 డిసెంబర్ 12న ఓ కాంట్రాక్టర్కు సంబంధించిన ఫైనల్ ఎస్టిమేట్ ఆమోదం కోసం రూ.25 వేల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కారు. ఆ మర్నాడు వెంకట రమణను అరెస్టు చేశారు. ఆయన కొద్దిరోజులు జైల్లో గడిపాడు. అప్పట్లో చేసిన సోదాల్లో ఏసీబీ అధికారులు రూ.26.52 లక్షల నగదు, రూ.22,60,565 విలువైన బంగారు ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. వాటితో కలిపి వెంకట రమణ మొత్తం ఆస్తుల విలువను రూ.28,14,14,700గా ఏసీబీ తేల్చింది. రమణ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డిప్యూటేషన్పై రెడ్కోలో పోస్టింగ్ పొందారు. అక్కడ కూడా ఆయన తన బుద్ధిని మార్చుకోలేదు. ఇప్పుడు వెంకట రమణను అరెస్టు చేసిన అధికారులు గురువారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నారు. -
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్ఫోన్ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్ముఖ్ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్ముఖ్కు జూన్లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
జత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్!
సాక్షి, విజయవాడ: ముంబై జూనియర్ ఆర్టిస్ట్ కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను పెద్ద బ్లాక్మెయిలర్గా పేర్కొన్న సీఐడీ.. బెదిరింపుల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేల్చేసింది.కుక్కల విద్యాసాగర్ నుంచి బ్లాక్మెయిల్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించింది. సుమారు రూ.1.31 కోట్లు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిందని.. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సాంకేతిక ఆధారాలతో పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని సీఐడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారులపై చర్యల అంశంగతంలో జత్వానీని వేధించారంటూ కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జత్వానీ కేసును అడ్డుపెట్టుకుని గత వైఎస్సార్సీపీ హయాంలో పని చేసిన పోలీసు అధికారులను వేధించేందుకు పెద్ద కుట్ర జరిగిందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జత్వానీని ఏపీకి తీసుకొచ్చి అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారని, ఆమెకు అనుకూలంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని విమర్శలు ఆ సమయంలో వెల్లువెత్తాయి. అంతేకాదు ఐపీఎస్ అధికారులపై కూటమి అధికారంలోని వచ్చాక తీసుకున్న చర్యలను కూడా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. విద్యాసాగర్కు నోటీసులుసీఐడీ ఛార్జ్షీట్ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.జత్వాని లేఖతో మరో మలుపుసీఐడీ ఛార్జ్షీట్ నేపథ్యంలో జత్వాని ఓ లేఖ విడుదల చేసింది. తనను ఈ వ్యవహారంలో బలిపశువును చేశారని ఆమె అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అడ్డంగా దొరికిపోయాక టీడీపీ, దాని అనుకూల మీడియా మళ్లీ కొత్త డ్రామాకు తెర తీస్తున్నట్లు స్పష్టమౌతోంది.జత్వానీ కేసు గతంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జత్వానీకి మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆమెకు స్టార్ హోటళ్లలో వసతి, విమాన ప్రయాణాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించడం కూడా హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా సీఐడీ ఛార్జ్షీట్లో జత్వానీపై బ్లాక్మెయిల్ ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో.. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అభాసుపాలైందనే చర్చ నడుస్తోంది.జత్వాని కేసు నేపథ్యంలో అప్పటి కీలక పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. డీజీపీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ క్రాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. తాజాగా సీఐడీ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలతో ఈ కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. -
మద్యం మత్తులో వేధిస్తున్న కుమారుడిని హత్యచేసిన తల్లి
చల్లపల్లి: తాను ఏరోజైతే బిడ్డకు జన్మనిచ్చిందో అదే రోజు ఆ తల్లి కొడుకుని కొట్టి చంపింది. మంగళవారం పోలీస్స్టేషన్కు వెళ్లి విషయం చెప్పింది. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చల్లపల్లి పడమర వీధిలో నివాసం ఉంటున్న మోతుకూరి నాగమణికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శివ ఏసీ రిపేర్ పని చేసుకుంటూ కొన్నేళ్లుగా దూరంగా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాగమణి పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్(35) వద్దే ఉంటోంది. అతడు ముఠాపని, డెలివరీ బాయ్గా పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్ తరచూ తల్లితో గొడవపడేవాడు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇంట్లో తల్లీకొడుకులు ఇద్దరూ వాదులాడుకున్నారు. తెల్లారిన తరువాత నాగమణి తన పనులు చేసుకుంటూ ఇరుగుపొరుగు వారితో సాధారణంగానే మాట్లాడింది. 10.30 గంటల సమయంలో పోలీస్స్టేషన్కు వెళ్లింది. రాత్రి తాను, తన కొడుకు దుర్గాప్రసాద్ గొడవ పడ్డామని, సహనం నశించి బలమైన వస్తువుతో కొట్టగా తన కొడుకు చనిపోయాడని పోలీసులకు చెప్పింది. అవాక్కయిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా దుర్గాప్రసాద్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన గాయాలు ఏడు నుంచి తొమ్మిది వరకూ గాట్లు ఉన్నట్లు తెలిసింది. చల్లపల్లి పోలీసులు వివరాలు, ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్ ఫేస్బుక్ అకౌంట్లో దొరికిన వివరాలను బట్టి అతను జూలై 20, 1991న జన్మించాడు. పుట్టిన రోజునాడే జన్మనిచ్చిన తల్లి చేతిలోనే దుర్గాప్రసాద్ హతమయ్యాడు. -
రాళ్లతో కొట్టి వైఎస్సార్సీపీ బీఎల్ఏ హత్య
కనగానపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లిలో మంగళవారం వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నగేష్ (42)ను టీడీపీ సానుభూతి పరులు రాళ్లతో దాడి చేసి చంపేశారు. ఇచ్చిన బాకీ అడిగినందుకు.. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న సోదరుడు అంకె నగేష్ కనగానపల్లిలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)గా పనిచేస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నగేష్ అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అంకె మురళికి కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. రెండేళ్లుగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో రెండు రోజుల క్రితం నగేష్ వారి ఇంటికి వెళ్లి అడిగాడు. ఈ సందర్భంలోనే మురళీ కుటుంబ సభ్యులు నగేష్ తో గొడవకు దిగారు. ‘‘నీకు డబ్బులు ఇచ్చేది లేదు’’ అని తేల్చి చెప్పారు. దీంతో వారిపై మంగళవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి నగేష్, తన అన్న కుమారుడు అంకె పురుషోత్తంతో కలిసి వెళ్తుండగా మురళి, అతని కుటుంబ సభ్యులు కాపు కాసి రాళ్లు, ఇటుక పెళ్లలతో దాడి చేశారు. నగేష్కు ఛాతీ, తలపై గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనలో పురుషోత్తం తలకు కూడా తీవ్ర గాయమైంది. సమీపంలో ఉన్న నగేష్ బంధువులు అక్కడికి చేరుకొని గాయపడ్డ ఇద్దరినీ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన నగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నగేష్ హత్యతో కనగానపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగేష్ హత్యకు ఆర్థికలావాదేవీలే కారణంగా కనిపిస్తున్నా.. ఇందులో రాజకీయ దురుద్దేశాలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నగేష్ పార్టీ బీఎల్ఏగా గ్రామంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులూ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వారు ముందుకు రాకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ సానుభూతిపరులు నగేష్ హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడ్ల దస్తగిరి బాబు, నితీష్, వంశీ, వన్నూరప్ప, మురళి, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, అఖిల, లక్షి్మదేవిలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. -
రౌడీషీటర్ దారుణ హత్య
మీర్పేట: రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతీకార హత్య కలకలం రేపింది. తన అక్క, అన్నను చంపాడని పగ పెంచుకున్న నిందితుడు అదను కోసం చూసి, పథకం ప్రకారం రౌడీషీటర్ను హతమార్చాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి (41) వృత్తిరీత్యా కారు డ్రైవర్. తండ్రి చనిపోవడంతో తల్లి యాదమ్మ, రెండో భార్య పూజ, కుమార్తెతో కలిసి కొంతకాలంగా ఉప్పల్ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో నివాసముంటున్నాడు. అంతకుముందు సూరి ఫాతిమాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతో 2022లో ఆమెను హత్య చేశాడు. దీనిపై ఫాతిమా పెద్ద తమ్ముడు సల్మాన్ పలుమార్లు సూరిని బెదిరించడంతో 2024లో అతన్ని కూడా హతమార్చాడు. అనంతరం జైలునుంచి తిరిగివచ్చి నాలుగేళ్ల క్రితం పూజ అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. నందనవనం గణేశ్నగర్లో నివాసముండే రెండో భార్య పూజ సోదరుడు గోవింద్ జన్మదిన వేడుకకు సోమవారం రాత్రి సూరి ఉప్పల్ నుంచి భార్యతో కలిసి వచ్చాడు. అదేప్రాంతంలో ఉండే మొదటి భార్య ఫాతిమా తమ్ముడు అర్ఫాజ్ (24) కొంతకాలంగా సూరిపై రగిలిపోతున్నాడు. తన అక్క, అన్నను చంపిన వాడిని ఎలాగైనా తుదముట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సూరి వచి్చన విషయం తెలుసుకుని పథకం ప్రకారం ఇద్దరు అనుచరులతో కలిసి బర్త్డే వేడుకకు హాజరయ్యాడు. అందరితో కలివిడిగా మాట్లాడి, సరదాగా ఉన్నట్లు నటించి అందరికీ కేక్ తినిపించి సందడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను సూరిపైకి వదిలాడు. దీంతో అప్రమత్తమైన సూరి పారిపోతుండగా, కొంతదూరం వెంబడించి టీకేఆర్ కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి పట్టుకుని ఛాతి, పొట్ట, తొడ భాగాల్లో కత్తితో అర్ఫాజ్ దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న సూరిని పూజ పెద్దనాన్న కుమారుడు వినోద్ గమనించి మరో ఇద్దరితో కలిసి చికిత్స నిమిత్తం డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సూరిపై తెలంగాణలోని 18 పోలీస్ స్టేషన్లలో 40 కిపైగా క్రిమినల్ కేసులతో పాటు రౌడీషీట్ కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి, మీర్పేట ఇన్స్పెక్టర్ శోభన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసిన అనంతరం నిందితుడు అర్ఫాజ్ తన అనుచరులతో కలిసి ఫామ్హౌస్కు వెళ్లినట్లు ఇన్స్టా లైవ్ చాట్ ద్వారా తెలుస్తోంది. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
సైదాబాద్ (హైదరాబాద్): అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఐఎస్సదన్ డివిజన్ వాణీనగర్లో నివసించే వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి షేక్ అబ్దుల్ సయీద్ కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ (48) ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడి మెక్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య నజియా సల్మా (45), కుమార్తె నేహా నహీన్ షేక్ (19), కుమారుడు హఫీజ్ ఉమర్ షేక్ (14), మరో కుమార్తె ఖతీజా షేక్ (8) ఉన్నారు. కాగా నవీద్ కుటుంబంతో కలిసి కారులో తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి కారులో నవేడా అనే ప్రాంతానికి విహార యాత్ర (ఫ్యామిలీ టూర్)కు బయలుదేరారు. అయితే భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నజియా సల్మా, నేహా నహీన్ షేక్, హఫీజ్ ఉమర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలకు గురైన షేక్ అబ్దుల్ నవీద్, ఖతీజా షేక్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాణీనగర్లో విషాద ఛాయలు యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్సదన్ డివిజన్ వాణీనగర్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలవడంతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్లు వాణీనగర్కు చేరుకుని నవీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే తనకు, తన భార్య నజీమున్నీసా, సోదరుడు షేక్ అబ్దుల్ జావీద్లకు అమెరికా వీసాలు ఇప్పించాలని నవీద్ తండ్రి షేక్ అబ్దుల్ సయీద్ అభ్యరి్థంచారు. -
పొరేల్ అరెస్ట్కు రంగం సిద్ధం!
కోల్కతా: బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ పొరేల్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక రేప్ కేసులో నిందితుడిగా 24 ఏళ్ల పొరేల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మొబైల్ ఫోన్ తదితర ఎల్రక్టానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొరేల్ బయటపెట్టే ప్రమాదం ఉండటంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పొరేల్ ఎక్కడున్నా అతడిని అదుపులోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. గత నెలలో రేప్ ఆరోపణలతో మోగ్రా పోలీస్ స్టేషన్లో పొరేల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటాననే హామీతో పొరేల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని... తమ ఇద్దరికి సంబంధించి వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి ఇప్పుడు బెదిరిస్తున్నాడని ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. 2023 నుంచి తమ మధ్య సంబంధం ఉందని ఆమె పేర్కొంది. -
ఆయనకు ఇద్దరు... చిన్నారిపై సవితి తల్లి దారుణం!
నిజామాబాద్, బాన్సువాడ: చిన్నారిపై హత్యాయత్నం చేసిన ఘటనలో తండ్రి, సవతి తల్లిని పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ విఠల్రెడ్డి వివరాలు వెల్లడించారు. బీర్కూర్కు చెందిన టేకు సతీశ్కు ఇద్దరు భార్యలు. సతీశ్ మొదట శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లి సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వైష్ణవి జన్మించింది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి సతీశ్, శైలజతో గొడవలు జరగడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వైష్ణవిని మాత్రం సతీశ్ తన వద్దనే పెంచుకుంటున్నాడు.ఈ నెల 15న ఉదయం చిన్నారి వైష్ణవి పొదల్లో రక్తమడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగానే ఉంది. అయితే, అక్క శైలజ తన కుమార్తెను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్లేడ్తో దాడికి పాల్పడినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వైష్ణవిని పోశించడం భారంగా మారడంతోపాటు కుటుంబంలో విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలని సతీశ్, శైలజ కుట్ర పన్నారు. 14న రాత్రి నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ కలిసి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గాయపర్చారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి వారితో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న ప్రదేశం ముందుగానే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పి ఎలాంటి అనుమానం రాకుండా బంధువులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు గ్రామస్తులు, బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులు సతీశ్, శైలజ వద్ద రెండ్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులులను ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు. -
ఉదయ్ కృష్ణారెడ్డికి సీబీఐ మాజీ అధికారి అండ
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా మారింది. మహిళా ఐపీఎస్ ప్రొబేషనర్ లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసు నమోదు.. మనస్తాపం చెందిన ఉదయ్ అత్మహత్యాయత్నం చేయడం.. ఆపై సంచలన ఆరోపణలతో ఈ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు స్పందించారు.ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ మన్నెం నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగకముందే ఒక అధికారి కెరీర్పై తీవ్ర ప్రభావం పడకూడదని, నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాత్కాలిక సస్పెన్షన్ను కూడా ఆయన తప్పుబట్టారు.కష్టాల నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణాన్ని ప్రస్తావించిన మన్నెం నాగేశ్వరరావు.. అతని ఎదుగుదల ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉదయ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య అమ్మమ్మ సంరక్షణలో పెరిగారని తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆయన.. జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా చేరారు. అయితే ఉన్నత లక్ష్యాన్ని వదులుకోకుండా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివి ఐపీఎస్కు ఎంపిక కావడం అసాధారణ విజయమని, గ్రామీణ యువతకు ఆయన ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందని మన్నెం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.రెండు వాదనలు.. ఆధారాలే కీలకంప్రస్తుత వ్యవహారంలో రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. మహిళా ప్రొబేషనర్ తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తమ మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్నారని వివరించారు. వ్యక్తిగత సంబంధం విఫలమైన తర్వాత ఏర్పడిన వివాదాలను పూర్తిగా నేరపరమైన కోణంలోకి తీసుకెళ్లే ముందు.. వాస్తవాలు, ఆధారాలను పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.సస్పెన్షన్పై ప్రశ్నలుఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిపై తీసుకున్న పరిపాలనా చర్యలపై కూడా మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ పూర్తికాకముందే ఒక యువ అధికారి భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే ఘటనలో ఇద్దరు వ్యక్తులు భాగస్వాములైతే.. పరిపాలనా చర్యలు కూడా సమానంగా ఉండాలనే సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.శిక్షణ సంస్థల బాధ్యతఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దే ఎస్వీపీఎన్పీఏ కేవలం క్రమశిక్షణ అమలు చేసే సంస్థ మాత్రమే కాకుండా.. యువ అధికారులకు మార్గదర్శకత్వం, మానసిక సహకారం అందించే వేదికగా ఉండాలని మన్నెం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక ఆరోపణ లేదంటే వివాదం కారణంగా ఒక అధికారి కష్టపడి సాధించిన కెరీర్ నాశనం కాకూడదని, విచారణ పూర్తయ్యే వరకు న్యాయ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని కోరారు.‘నిష్పక్షపాత విచారణ జరగాలి’ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో చట్టం తన పని తాను చేసుకోవాలని, అదే సమయంలో న్యాయం, సమానత్వ సూత్రాలు పాటించాలని మన్నెం నాగేశ్వరరావు కోరారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన యువ అధికారి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ఆధారాల ఆధారంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మన్నెం నాగేశ్వరరావు నేపథ్యం..మన్నెం నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. 1986 బ్యాచ్కు చెందిన ఆయన ఒడిశా క్యాడర్లో సేవలందించారు. సీబీఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. 2018లో సంస్థలో పరిణామాల సమయంలో తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు.. పోలీస్, దర్యాప్తు విభాగాల్లో కీలక అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.Justice for Uday Krishna Reddy: A Case for FairnessThe allegations levelled by lady IPS probationer Suma H.K. against her co-trainee Uday Krishna Reddy at the Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA), Hyderabad, have ignited intense public debate.Currently,… pic.twitter.com/YSm2pb0pRS— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) July 21, 2026 -
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్కు నోట్ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు! -
రూ.25 లక్షల కార్ లోన్ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు
కర్ణాటక: నగరంలో రూ. 25 లక్షల బ్యాంకు రుణంతో కారు కొని, దానిని అక్రమంగా వేరొకరికి అమ్మేసిన రుణగ్రహీత ఉదంతమిది. వివరాలు.. మధు మోహన్ అనే వ్యక్తి సరస్వతీపురంలోని ఎస్బిఐ బ్యాంక్ శాఖ నుంచి రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేశాడు, ఆ కారును షకీబ్ మన్సూర్ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది సరస్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రియుడిని నరికి, ట్యాప్ కింద పెట్టి..
థానే: మహారాష్ట్రలోని థానేలో మన్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. పూణెకు చెందిన హసిబా అనే మహిళ తన ప్రియుడు హమిదిల్లా ఇస్లామ్ను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధం లేదా వ్యభిచార కూపంలోకి నెట్టేయాలని చూశాడనే అనుమానంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. సుమారు ఐదు రోజుల క్రితం ప్రియుడిని హతమార్చిన నిందితురాలు, మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. అనంతరం దుర్వాసన రాకుండా, త్వరగా కుళ్లిపోవడానికి బాత్రూమ్లోని రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఆ మృతదేహాన్ని గోనెసంచిలో దాచింది.ఈ దారుణానికి పాల్పడిన తర్వాత హసిబా కోల్కతాకు పరారైంది. అయితే ఫ్లాట్ యజమానికి వాయిస్ మెసేజ్ పంపి తాను హత్య చేసినట్లు తెలిపింది. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాళాలు పగలగొట్టి పరిశీలించగా, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితురాలిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కోల్కతాకు పంపారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు! -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని బచేపల్లి గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ప్రయానిస్తున్న స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయింది. ప్రమాదావశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ఉన్నటువంటి భార్యభర్తలతో పాటు 4ఏళ్ల కూతురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నాందేడ్ వాసులుగా తెలుస్తోంది. -
స్కూల్కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి
పట్నా: బిహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన దారుణ ఘటన ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చంపాడు ఓ యువకుడు. సైకిల్పై ఆ అమ్మాయి కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను చంపాక నిందితుడు బైక్పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.బైక్పై వెంబడించి.. వరుసగా కాల్పులుమృతురాలిని పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోనం కుమారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, సోనం ఎప్పటిలాగే ఉదయం సైకిల్పై పాఠశాలకు బయల్దేరింది. ఆమె మంగళ్ స్థాన్ సమీపానికి చేరుకున్న సమయంలో పల్సర్ బైక్పై వచ్చిన ఓ యువకుడు వెంబడించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కేజియా వార్డు-13 సమీపంలో నిందితుడు ఆమె సైకిల్ను ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చాడు. వెంటనే తుపాకీ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. సోనంకు 4 బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న వైని పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) బృందం ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. సదర్ డీఎస్పీ-1 సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తున్నామని, నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. -
50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. బీటెక్ (BTech) లో గోల్డ్ మెడల్ సాధించి, గవర్నర్ చేతుల మీదుగా మెడల్ అందుకున్న 23 ఏళ్ల యువకుడు, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే తీవ్ర మనస్తాపంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆనంద్ కుమార్ ఆనంద్ కాన్పూర్లోని 'ప్రాణ్వీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (PSIT) లో 2024లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసి కాలేజ్ టాపర్గా నిలిచాడు. రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు. కాలేజ్ ఫంక్షన్లో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక 'పవర్ గ్రిడ్' సంస్థలో ఏడాది పాటు అప్రెంటిస్షిప్ పూర్తి చేసి, ఆపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ప్రారంభించాడు. కానీ ప్రతీసారి వైఫల్యం వెక్కింరించడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్డే ప్రత్యేక పూజలు చేసిన నటిఆనంద్ అన్నయ్య పెళ్లి సంబంధం మాట్లాడటానికి కుటుంబ సభ్యులంతా బీహార్లోని తమ సొంతూరికి వెళ్లారు. కాన్పూర్లోని గోవింద్ నగర్లో ఉన్న మూడంతస్తుల ఇంట్లో ఆనంద్ ఒంటరిగా ఉన్నాడు. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో, ఇంట్లో పనిచేసే వ్యక్తి పొరుగువారికి, పోలీసులకు సమాచారం అందించాడు. లోపలికి వెళ్లి చూడగా ఆనంద్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు.ఆత్మహత్య లేఖ పోలీసులు ఘటనా స్థలం నుండి ఐదు లైన్ల చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన తండ్రికి క్షమాపణలు చెబుతూ ఇలా రాశాడు: "సారీ పాపా.. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి దాదాపు 50 సార్లు ప్రయత్నించాను, కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి."ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!రైల్వేస్, ఎస్ఎస్సి (SSC), బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన పలు రిక్రూట్మెంట్ పరీక్షలు రాసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఆనంద్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్లు అతని తండ్రి రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
త్రిపుర డీజీపీ ఆత్మహత్య
అగర్తలా: త్రిపుర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అనురాగ్ ఠాకూర్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఆఫీసు ఛాంబర్ బాత్రూంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. ఠాకూర్ మరణ వార్త విని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జేకే సిన్హా,, ఆరోగ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టె తదితరులు ఆస్పత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అనురాగ్ ఠాకూర్ మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ అనురాగ్ ఠాకూర్ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు 12.48 గంటలకు ప్రకటించారు’అని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి మెడిసిన్ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ వివరించారు. పోస్టుమార్టం అనంతరమే ఠాకూర్ మృతికి దారి తీసిన కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అనురాగ్ ఠాకూర్కు భార్య, కుమార్తె ఉన్నారు. మేలో డీజీపీగా నియమితులైన ఠాకూర్ మరో 11 నెలల్లో రిటైరవ్వాల్సి ఉంది. #BreakingNews | #Tripura Director General of Police (DGP) Anurag Dhankar was found dead at his office at the Police Headquarters in Agartala on Monday.Preliminary reports suggest that the senior IPS officer allegedly died by suicide. However, the exact circumstances surrounding… pic.twitter.com/ks4KYnOB6Z— NORTHEAST TODAY (@NortheastToday) July 20, 2026 కాగా, రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆఫీసులోనే చనిపోవడంపై ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా సీనియర్ ఐపీఎస్ ఆత్మహత్య పాల్పడటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. అవేంటో వెల్లడికావాలి. ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలి. మృతికి కారణాలను వెల్లడించాలి’అని జితేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. డీజీపీ అనురాగ్ ఠాకూర్ మరణంపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరుగుతోందని, నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ అభిõÙక్ దేబ్రాయ్ తెలిపారు. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్, హయత్నగర్: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం శుక్రవారం రాత్రి హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్ చేశారు.సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి నీలాద్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


