breaking news
Crime
-
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది
బటిండా: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని చంపేసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన పంజాబ్లోని బటిండాలో జరిగింది. జస్సీ కౌర్ అనే మహిళకు సుఖ్ప్రీత్ కౌర్ (8) కూతురు, ఫతేవీర్ (6) కుమారుడు ఉన్నారు. జస్సీ కౌర్కు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగా.. పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.అక్రమ సంబంధం మత్తులో ఉన్న జస్సీ కౌర్ తన పిల్లలను హత్య చేయడానికి కుట్ర పన్నింది. రెండు వారాల క్రితం కుమార్తె సుఖ్ప్రీత్ కౌర్కు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. దీంతో ఆ చిన్నారి.. తన తల్లి ఇచ్చిన ఆహారం తిని మృతిచెందింది. ఆ పాప అనారోగ్యం కారణంగానే చనిపోయిందని, చుట్టుపక్కల వారిని, బంధువుల్ని నమ్మించింది. ఆ తర్వాత రెండు వారాల తర్వాత ఆరేళ్ల కొడుకు ఫతేవీర్ కౌర్కు కూడా ఎలుకల మందు కలిపిన ఆహారం పెట్టింది.శనివారం ఆ బాలుడు కూడా మరణించాడు. ఈ విషాదకర ఘటన రెండు వారాల వ్యవధిలో జరిగింది. 15 రోజుల క్రితం ఎనిమిదేళ్ల బాలిక సుఖ్ప్రీత్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించగా, శుక్రవారం రాత్రి ఆమె ఆరేళ్ల తమ్ముడు ఫతేవీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వరుస మరణాలతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఫూల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. కన్నతల్లే హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలు జస్సీ కౌర్ తన నేరాన్ని అంగీకరించిందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు."మొదట 8 ఏళ్ల సుఖ్ప్రీత్ కౌర్ మరణించింది. నిన్న 6 ఏళ్ల ఫతేవీర్ చనిపోయాడు. ఒక పథకం ప్రకారం జస్సీ కౌర్ తన పిల్లలిద్దరినీ చంపేసింది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకుందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. జస్సీ కౌర్కు సహకరించిన ఆమె సోదరి మోటో కౌర్తో పాటు, లాఖీ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సులేమాన్ నగర్లోని తన స్వంత కార్యాలయంలోనే కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే ఖదీర్ మృతి చెందాడు. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం
బిహార్లో జరిగిన ఘటన ఒకటి తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్న మహిళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.బిహార్లోని భోజ్పూర్లో చంద్వా తోలా ప్రాంతంలో జరిగిన స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. వేలాదిమంది గుమిగూడిన జనం మధ్యం వేదికపై న్యృత్య ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో డ్యాన్స్ చేస్తున్న నృత్యకారిణిపట్ల కొంతమంది ఆకతాయిలు నీచంగా ప్రవర్తించారు. ఆమె డ్యాన్స్ చేస్తుండగా కొంతమంది నాణేలు విసిరారు. మరికొంతమంది అంతటితో ఆగలేదు. నాణేలను బలవంతంగా నోటిలోకి దూర్చి, మింగించారు. దీంతో ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో పరిస్థితి అదుపు పోలీసులు జోక్యం చేసుకుని, అత్యవసర చికిత్స కోసం ఆమెను అరా సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గొంతు నుండి నాణేలను తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడవాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుతన భార్య వేదికపై నృత్యం చేస్తుండగా, కొంతమంది ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టడంతో మింగేసిందనీ, వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని బాధితురాలి భర్త రాజు కుమార్ వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులు, ఇతర జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షులు , ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.ఇదీ చదవండి: బెంగళూరులో తొలి స్టోర్ : ఆటోలో స్టైలిష్గా ‘నథింగ్’ సీఈవో -
భార్య ఎఫైర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..
బ్రెజిల్లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్ను రాశారు. చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. -
ఎప్స్టీన్ను చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
లైంగిక కుంభకోణంతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein). మైనర్ బాలికల అక్రమరవాణా, తన పలుకుబడి పెంచుకోడానికి ప్రముఖుల లైంగిక వాంఛలను తీర్చడానికి వారిని వాడుకున్నాడన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో 2005లో మైనర్ బాలికపై లైంగిక వెధింపుల కేసు నమోదు కావడంతో ఎప్స్టీన్ బాగోతం బహిర్గతమైంది. అయితే 2008లో దోషిగా తేలినా మామూలు శిక్షతో బయటకు రావడం వివాదాస్పదమైంది. ఆ తరువాత 2019లో మళ్లీ అరెస్ట్ అయిన కొద్ది రోజులకే న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీన్ని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించినా, జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బడా బాబుల పేర్లు బయటకు రాకూడదనే కారణంతోనే విచారణకుముందు ఎప్స్టీన్ను గుట్టుగా మట్టుబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా జెఫ్రీ ఎప్స్టీన్ మరణంపై అతని కుటుంబం కోసం పోస్ట్మార్టం నివేదిక పరిశీంచిన ఫోరెన్సీక్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత ఆజ్యం పోశాయి.జెఫ్రీ ఎప్స్టన్ కన్నమూసి 7 ఏళ్లు గడుస్తున్నా అతని మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అతని ఆత్మహత్యగా నిర్ధారిస్తూ గతంలో వచ్చిన నివేదికలను ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ మరోసారి సవాలు చేశారు. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జెఫ్రీది ఆత్మహత్య కాదు, గొంతు నులిమి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.డాక్టర్ బాడెన్ కీలక సాక్ష్యాలు-వాదనలుఎప్స్టీన్ కుటుంబం తరపున పోస్ట్మార్టం ప్రక్రియను పరిశీలించిన డాక్టర్ బాడెన్, తన పరిశీలనలో కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ఎప్స్టీన్ మెడలోని మూడు చోట్ల ఎముకలు విరిగి (ఒకటి హ్యోయిడ్ ఎముక, రెండు థైరాయిడ్ కార్టిలేజ్) ఉండటం ఇందులో ప్రధానమైన అంశంగా మారింది. బాడెన్ తన 50 ఏళ్ల కెరీర్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇలా మూడు ఎముకలు విరగడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గొంతు నులిమి హత్య చేసిననప్పుడు (Strangulation) మాత్రమే ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ బార్బరా సాంప్సన్ స్వయంగా పోస్ట్మార్టం సమయంలో లేకపోయినప్పటికీ, దీనిని ఆత్మహత్యగా ప్రకటించారని బాడెన్ ఆరోపించారు. ఎప్స్టీన్ ఉన్న మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో భద్రతా నిబంధనల లోపాన్ని ఎత్తి చూపారు. అలాగే జైలు రికార్డులు తారుమారు చేయబడ్డాయని అమెరికా న్యాయశాఖ (DOJ) నివేదిక కూడా ధృవీకరించింది.ఆ రాత్రి ఏం జరిగింది? – అనుమానాస్పద అంశాలుఎప్స్టీన్ మరణానికి ఒకరోజు ముందు, అతని సెల్మేట్ను వేరే చోటికి మార్చారు. ఆ రాత్రిఅతడిని గదిలో ఒంటరిగానే ఉంచారు. నిబంధనల ప్రకారం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఖైదీని పర్యవేక్షించాల్సి ఉండగా, రాత్రి 10:40 తర్వాత ఎటువంటి తనిఖీలు జరగలేదు. పైగా సిబ్బంది తనిఖీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుసీసీటీవీ ఫుటేజీలో రాత్రి 10:39 గంటల సమయంలో ఎప్స్టీన్ ఉన్న విభాగం వైపు ఎవరో వెళ్లినట్లు నారింజ రంగు నీడ (Orange Flash) కనిపించింది. అది నారింజ రంగు జైలు దుస్తులు ధరించిన మరో ఖైదీ అయి ఉండవచ్చని స్వతంత్ర విశ్లేషణలు చెబుతున్నాయి అంతేకాదు అతని సెల్లో అవసరానికి మించి దుప్పట్లు, బట్టలు ఉన్నాయి. వాటినే తాళ్లుగా మార్చినట్లు గుర్తించారు.అధికారిక నివేదికలు దీనిని ఆత్మహత్యగా చెబుతున్నప్పటికీ, జైలు సిబ్బంది నిర్లక్ష్యం, తప్పుడు రికార్డులు, మెడపై ఉన్న గాయాలతో పలు అనుమానాలకు తావిచ్చాయి. దీనికితోడు డాక్టర్ బాడెన్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల లక్షల పేజీలు, వేలాది ఫోటోలను విడుదల చేసిన తరువాత ఇది మరో కీలక పరిణామం.ఇదీ చదవండి: పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే! -
పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!
బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాలు, స్కాంలపై అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవలి కాలంలో విద్యావంతులు కూడా డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న కేసులను అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను ఎక్స్లో షేర్ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి...… pic.twitter.com/mzA6JNKBrk— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 14, 2026 -
చేపల కోసం వల వేస్తే శవం పడింది!
అన్నానగర్: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్కోయిల్ సుంగాన్ కడైలోని అంబేడ్కర్ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు కొలనులో చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఆ యువతి మృతదేహాన్ని తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది. హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థునా? ఎవరైనా విద్యార్థుని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం.. 30 మంది యువతుల అరెస్ట్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై కేపీహెచ్బీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ లింగం తెలిపిన మేరకు.. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని 6వ ఫేజులోని ఆవాస స్పాలో నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది యువతులతో పాటు, 15 మంది పురుషులను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఊయలే ఉరి తాడైంది
వెల్దుర్తి: ఊయలే ఆ బాలుడికి ఉరి తాడైంది. ఏడేళ్లకే అందని లోకాలకు చేర్చింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన అహ్మద్బాషా, హసీనాబీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు అఫ్రోజ్(7) రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తట్టు వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అఫ్రోజ్ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్కు కట్టిన చీర ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుంది. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మెడకు ఊయల బిగుసుకుని కనిపించడంతో ఆందోళన చెందారు. చీరను తప్పించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందు విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
చిత్తూరులో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కంటైనర్ వాహనం కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
తూర్పు గోదావరి జిల్లా: పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు చెక్పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలైంది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. యానాం పెదపూడి వీధికి చెందిన మహ్మద్ మోమినా తన్వీర్ (21), సయ్యద్ అఫ్రీన్ సుల్తానాలు పటవల పైడా విద్యా సంస్థలో ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నారు. శుక్రవారం నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా పోలేకుర్రు చెక్పోస్టు వద్ద టిప్పర్ ఢీకొనడంతో తన్వీర్ కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్ వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సుల్తానా రెండో వైపునకు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి తండ్రి జిలానీ యానాం మార్కెట్లో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తనీ్వర్ సోదరుడికి రెండు నెలల క్రితం వివాహమైందని, ఇంతలోనే ఇంతటి విషాదం జరగడం దారుణమని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చెక్పోస్టు నిర్వహణ వల్లే.. జాతీయ రహదారిలోని మలుపులో చెక్పోస్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. అటు అమలాపురం నుంచి, ఇటు యానాం నుంచి వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతం, చెక్పోస్టు వద్ద అనేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రజాప్రతినిధులు స్పందించి చెక్పోస్టును సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. -
రూ. 60 లక్షలతో ఏటీఎం వాహన డ్రైవర్ పరార్
గచ్చిబౌలి: ఏటీఎంలలో నింపేందుకు నగదును తీసుకొచ్చిన వాహనంతో డ్రైవర్ ఉడాయించిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. నిందితుడు తెల్లాపూర్లో వాహనం వదిలేసి రూ. 60 లక్షల నగదుతో పరారయ్యాడు. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన ప్రకారం సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ మెయింటెనెన్స్ సర్వీస్ (సీఎంఎస్) విధులు నిర్వహిస్తోంది. తిరుమలగిరి సిక్ రోడ్డులో నివసించే డ్రైవర్ బడిగేరీ అజిత్ కుమార్ అలియాస్ శివ, ఇద్దరు కస్టోడియన్లు ఎస్.రామకృష్ణ, ఎం.డి.మాలిక్, గార్డు పెరుమాల్.. ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసేందుకు సీఎంఎస్ వాహనం (టీఎస్ 10 యూడీ 0393)లో బయలుదేరారు. గురువారం సాయంత్రం 4:45 గంటల సమయంలో గోపన్పల్లిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసేందుకు ఇద్దరు కస్టోడియన్లు లోపలికి వెళ్లగా గార్డు వాష్రూమ్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్ అజిత్కుమార్ వాహనంతో పరారయ్యాడు. ఏటీఎం నుంచి బయటకు వచ్చిన కస్టోడియన్లకు వాహనం కనిపించకపోవడంతో డ్రైవర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోవడంతో డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు జీపీ ఎస్ ట్రాకింగ్ ద్వారా వాహన జాడను జల్లెడపట్టగా తెల్లాపూర్ వైపు వెళ్లినట్లు తేలింది. అక్కడకు చేరుకోగా గద్దర్ చౌరస్తాలోని వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో వాహనం కనిపించింది. నిందితుడు వాహనాన్ని వదిలి అందు లోని దాదాపు రూ. 60 లక్షల నగదుతో పరారైనట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. దీంతో వాహనాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్కు సిబ్బంది ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. -
ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్ట షాకింగ్ విషయాలు
కోర్బా: ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన జర్నలిస్ట్ సల్మా సుల్తానా హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ రాజ్పుత్ చెప్పిన నిజాలతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఆ దారుణాన్ని ఆమె కోర్టులో వివరించారు.పాట పాడుతూ..2018లో తన లివ్-ఇన్ భాగస్వామిని గొంతు నులిమి చంపిన తర్వాత నిందితుడు మధుర్ సాహులో ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించలేదు.. సల్మాను హత్య చేసిన సమయంలో మధుర్ చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. అతను మృతదేహం పక్కనే కూర్చుని సిగరెట్ తాగుతూ, సల్మాకు ఇష్టమైన "తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై.’’ అనే పాటను పాడినట్లు కోర్టుకు కోమల్ సింగ్ రాజ్పుత్ తెలిపారు.ఆ రోజు ఏం జరిగింది?మధుర్ సాహు జిమ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే కోమల్ సింగ్.. ఘటన జరిగిన రోజున శారదా విహార్లోని సల్మా ఇంటికి తనను పిలిచారని చెప్పాడు. దంపతుల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం.. కాసేపటికే హింసాత్మకంగా మారిందన్నారు. వాగ్వాదం జరుగుతుండగానే మధుర్ మొదట సల్మా గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని.. ఘర్షణ తీవ్రం కావడంతో ఆమెను మంచంపైకి నెట్టి గొంతు గట్టిగా నొక్కినట్లు తెలిపారు. సల్మా అరవకుండా ఉండేందుకు మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్ ఆమె నోటిపై దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. కోమల్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. నోరు మూసుకుని ఉండు.. లేదంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది" అంటూ నిందితులు ఆమెను బెదిరించారు.నమ్మించేలా ప్లాన్..హత్య తర్వాత, సల్మా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపాలని మధుర్ తనను, ఇంట్లో పనిచేసే సవితను బలవంతం చేసినట్లు కోమల్ తెలిపింది. ‘‘నేను వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకకండి అంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆమె తనంతట తానుగా వెళ్ళిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశారు. నిందితుడు తన కంప్యూటర్లో పలువురు మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను దాచిపెట్టి, వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని కూడా కోర్టుకు కోమల్ సింగ్ తెలిపారు. తాను ఈ విషయం గురించి పోలీసులకు మరియు సల్మా బంధువులకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం నిందితుడికి తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.రోడ్డుకింద ఆస్థి పంజరం..హత్య అనంతరం సల్మా మృతదేహాన్ని భవానీ దబ్రీ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి కింద పాతిపెట్టారు. ఐదేళ్లపాటు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. కానీ దాని కింద ఒక జర్నలిస్ట్ శవం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. 2023లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు రహదారిని తవ్వి అస్థిపంజరాన్ని వెలికితీశారు. డీఎన్ఏ పరీక్షలో అది సల్మాదేనని తేలింది.తుది దశలో విచారణప్రభుత్వ న్యాయవాది సునీల్ సోన్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 41 మంది సాక్షులను విచారించారు. మరో 10 మంది మిగిలి ఉన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్య తర్వాత నిందితుడు పాట పాడాడనే కోమల్ సింగ్ రాజ్పుత్ సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది. -
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖరీదైన , హైస్పీడ్ కారు ఢీకొని ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.గత ఆదివారం రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివమ్ మిశ్రా కాన్పూర్లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు.శివం మిశ్రా అరెస్ట్ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్ను కోర్టు తిరస్కరించిందన్నారు. రూ.20,000 అండర్ టేకింగ్ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్పై విడుదలైనట్టు తెలిపారు. -
కొంపముంచిన కోతుల రవాణా : ఇండియన్ టూరిస్ట్ అరెస్ట్
రక్షిత వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేయడం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలోనే థాయ్లాండ్ లోని బ్యాంకాక్లోని సువర్ణభూమి విమానాశ్రయంలో భారతీయ టూరిస్ట్ అడ్డంగా బుక్కయ్యాడు. థాయిలాండ్ నుండి రెండు సజీవ కోతులను అక్రమంగా రవాణి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.నేషన్ థాయిలాండ్ నివేదించిన ప్రకారం ముంబైకి విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్నప్పుడు కస్టమ్స్ అధికారులు అతని సామానులో దాచిన జంతువులను కనుగొన్నారు. ఈ సంఘటన ఫిబ్రవరి 3న రాత్రి చోటు చేసుకుంది. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు మరియు మొక్కల సంరక్షణ విభాగం ప్రైమేట్లు థాయిలాండ్లోని రక్షిత జాతి అయిన ఇండోచైనీస్ లుటుంగ్లు అని నిర్ధారించింది. ఈ ప్రైమేట్ల విలువ దాదాపు 100,000 భాట్ (సుమారు రూ. 2.9 లక్షలు) ఉంటుంది. విమానాశ్రయంలోని వన్యప్రాణుల తనిఖీ కేంద్రంతో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ స్వాధీనం జరిగింది.థాయ్ ఎయిర్లైన్స్ విమానం TG351 బ్యాంకాక్ రూట్ (BKK)లో 28 ఏళ్ల భారతీయుడు కార్తీక్ను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. తనిఖీల్లో భాగంగా ఇండో-చైనీస్ లుటుంగ్లు బయటపడ్డాయనీ, వాటిని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు, సంరక్షణ కోసం వన్యప్రాణి నిపుణులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సువర్ణభూమి విమానాశ్రయం లోని ప్యాసింజర్ ఇన్స్పెక్షన్ కస్టమ్స్ ఆఫీస్ డైరెక్టర్ శాంటానీ ఫైరట్టనకోర్న్ ప్రకటించారు. వైల్డ్ యానిమల్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ (2019) మరియు కస్టమ్స్ యాక్ట్ (2017) కింద కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారంఇండోచైనీస్ లుటుంగ్జర్మైన్ లంగూర్ (ట్రాచీపిథెకస్ జెర్మైన్) అని కూడా పిలిచే ఇండోచైనీస్ లుటుంగ్ థాయ్ చట్టం మరియు అంతర్జాతీయ పరిరక్షణ ఒప్పందాల ప్రకారం రక్షిత జాతి. ఇవి ప్రకాశవంతమైన నారింజ రంగు బొచ్చుతో చిన్నగా ఉంటాయి. పెరిగేకొద్దీ బూడిద లేదా నలుపు రంగులోకి మారుతాయి. ఇవి ప్రధానంగా థాయిలాండ్, కంబోడియా, మయన్మార్ మరియు వియత్నాంలో కనిపిస్తాయి.ఈ జాతి అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. దాని వ్యాపారం అంతరించిపోతున్న జాతుల అడవి జంతువులు, వృక్షజాలం (CITES)లో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం ప్రకారం ఖచ్చితంగా నియంత్రించబడుతుంది. అనుమతి లేకుండా అటువంటి జంతువులను దేశం నుండి బయటకు రవాణా చేయడం చట్టవిరుద్ధం. ఇందుకు భారీ జరిమానాలు విధించవచ్చు.అనుమానితుడు ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మొదటి చట్టం రక్షిత వన్యప్రాణులను అనధికారికంగా ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తుంది, రెండవది కస్టమ్స్ ఫార్మాలిటీలను పూర్తి చేయకుండా థాయిలాండ్ నుండి వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధం.ఇదీ చదవండి: కానిస్టేబుల్స్ పెళ్లి : వధువు నేరగాడితో పారిపోయింది -
తెల్లారితే పెళ్లి : నేరగాడితో పారిపోయిన కానిస్టేబుల్
ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మధ్య జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వరుడు సహా బంధువులంతా హతాశులయ్యారు. వధువు కిడ్నాప్ అయ్యిందంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కథ అడ్డం తిరిగింది.ఇద్దరూ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. జోడీ బావుంది అని పెద్దలు వారిద్దరికి ఫిబ్రవరి 8న పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని, మీరట్లోని బహ్సుమా ప్రాంతంలోని అక్బర్పూర్ సదాత్ గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సపరివార సమేతంగా వివాహానికి ఆహ్వానిస్తూ బంధువులందరికి వెడ్డింగ్ కార్డ్స్ పంచారు. బంధువులతో సందడిగా ఉంది. సంధ్య చేతులను కాబోయే భర్త పేరుతో మెహందీ తీర్చి దిద్దారు. ముజఫర్ నగర్లోని మీరాపూర్ నుండి వచ్చే వివాహ ఊరేగింపును స్వాగతించడానికి అంతా బిజీగా ఉన్నారు. సరిగ్గా వివాహానికి ముందు రాత్రి పెళ్లి కూతురు 25 ఏళ్ల సంధ్య భరద్వాజ్ మాయమైంది. ఆమె ప్రస్తుతం అలీఘర్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది. వరుడు అతుల్ శర్మ ముజఫర్నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వధువు కనిపించకుండా పోవడంతో వధువు తండ్రి అంకిత్ ఠాకూర్ను అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే అతను గతంలో (ఫిబ్రవరి 5న) తన కుమార్తెను వివాహం చేసుకుంటే చంపేస్తానంటూ వరుడిని ఫోన్లో బెదిరించాడని శర్మ తన ఫిర్యాదులో హింట్ ఇచ్చాడు. అంకిత్ తన కుమార్తెను బెదిరించి కిడ్నాప్ చేశాడని , ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని తండ్రి ఆరోపించాడు.అసలు సంగతి ఏంటంటే..పోలీసులు ఎనిమిది గంటల్లోనే మీరట్ జిల్లాలోని బక్సర్లో వధువు భరద్వాజ్ను గుర్తించారు. వధువు కిడ్నాప్కు గురికాలేదని ఇష్టపూర్వకంగా ఇల్లు వదిలి ప్రేమికుడు అంకిత్ ఠాకూర్తో వెళ్లిపోయిందని గుర్తించారు.పోలీసుల ప్రకారం గత కొన్నేళ్లుగా భరద్వాజ్ -అంకిత్ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేకపోవడంతో అతని స్వస్థలం ధికోలి గ్రామంలోని ఇంటికి పారిపోయింది. తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. పోలీసు అధికారి మవానా సర్కిల్ ఆఫీసర్ పంకజ్ లావానియా చెప్పారు. ఇక చేసే దేమీ లేక వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. భరద్వాజ్ను కోర్టు ముందు హాజరుపరుస్తామని సీనియర్ ఎస్పి(గ్రామీణ) అభిజీత్ కుమార్ తెలిపారుఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావాకాగా అంకిత్కు నేర చరిత్ర ఉందని, దోపిడీ, హత్య అభియోగాలతో సహా కనీసం తొమ్మిది కేసులు నమోద య్యాయని పోలీసులు నిర్ధారించారు. గత సంవత్సరం ఒక మద్యం దుకాణంలో జరిగిన దోపిడీ కేసులో కూడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.మరోవైపు తన కూతురు ప్రేమ వ్యవహారం, పెళ్లి విఫలమవడం చూసి సంధ్య తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. ఫలితంగా బాజా భజంత్రీలు, విందుభోజనాలతో కళకళ లాడాల్సిన ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది.ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం -
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా -
రూ.500 కోట్ల రియల్ స్కాం, సీఈవో అరెస్ట్
హరియాణాలోని గురుగ్రామ్లో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్ ‘32 అవెన్యూ’ CEO ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి పోలీసుల ప్రకారం, శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది విక్రయించాడు. భారీ మోసపూరిత ఆపరేషన్కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం రూ. 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారుల అంచనా. నకిలీ ఒప్పందాలు, తప్పుదారి పట్టించే హామీలు, లాభాల ఆశ జూపి విక్రయించాడనేది ఆరోపణ.అయితే కొనుగోలుదారులకు సంబంధిత ఆస్తిని స్వాధీనం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేయడం, యాజమాన్య పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మెగా స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతి లావాదేవీని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి అనేక నకిలీ పత్రాలను సృష్టించి కొనుగోలు దారులను మోసం చేశాడు. ఈ విధంగా 2022 - 2023 మధ్యకాలంలో ఈ కాంప్లెక్స్లోని 3,000 చదరపు అడుగుల మొదటి అంతస్తు యూనిట్ను విక్రయించి, శర్మ వివిధ వ్యక్తుల నుండి సుమారు రూ. 500 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు అప్రా మోటెల్స్, 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీసుల ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు బ్యాంకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన షెల్ ఎంటిటీలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు తర్వాత, ధ్రువ్ దత్ శర్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు చేసేఅవకాశంఉందని పేర్కొన్నారు. నిందితుడిని నగర కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు రూ.64 లక్షలు మోసం చేశారని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక జంట ఆరోపించారు. వారి ఫిర్యాదుమేరకు డిసెంబర్లో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీఈఓ ధ్రువ్ శర్మ, అతని సోదరి, తల్లిదండ్రులు, ఇతరులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ లాంటి అభియోగాలు మోపడం గమనార్హం. అంతేకాదు 32వ అవెన్యూ ఉద్యోగి కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతం చెల్లించలేదట.గతంలో ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్న ధ్రువ్ శర్మ అవినీతి వ్యవహారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ గురించి ఆందోళనలను మరింత పెంచింది. -
ఏసీబీ వలలో మాదాపూర్ ఎస్ఐ
హైదరాబాద్: మాదాపూర్ ఎస్సై వినయ్కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ కేసు విషయంలో కోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ బీఎన్ఎస్ఎస్ నోటీసు ఇవ్వడానికి ఎస్సై వినయ్ జాప్యం చేస్తున్నారు. నోటీసు కావాలని బాధితుడు పదేపదే వేడుకోవడంతో రూ.లక్ష లంచం ఇవ్వాలన్నారు. ఒకేసారి ఇవ్వలేననడంతో.. రూ.50 వేల చొప్పున ఇవ్వాలన్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వినయ్ రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
కెనడా పాఠశాలలో కాల్పుల మోత
వాంకోవర్: ప్రశాంత కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని టుంబ్లర్ రిడ్జ్ కొండ ప్రాంత పట్టణంలోని టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఓ ఆగంతకురాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్న ఇద్దరిని అధికారులు హుటాహుటిన హెలికాప్టర్లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమీప ఇంట్లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వినబడగానే వణికిపోయాం.. ‘‘కాల్పుల శబ్దాలు రాగానే అంతా వణికిపోయాం. స్కూల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. పిల్లలంతా వెంటనే మీ క్లాస్రూమ్ను లోపలి నుంచి గడియపెట్టండి అని లౌడ్స్పీకర్లలో అనౌన్స్మెంట్ వినపడింది. వెంటనే మా తరగతి గది తలుపులు మూసేశాం. వాటిని బద్దలుకొట్టకుండా అడ్డుగా టేబుళ్లను పేర్చాం. వాటిని అలాగే రెండు గంటలపాటు అదిమిపట్టాం. పోలీసులు వచ్చాకే మా ప్రాణం లేచొచి్చంది’’అని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న డేరియన్ క్విస్ట్ చెప్పాడు. ‘‘మా స్కూల్ ప్రిన్సిపల్ లాక్డౌన్ అని అరుస్తూ కన్పించారు. వెంటనే విద్యార్థులతోపాటు తరగతి గదిలోకి పరుగెత్తి లోపలి నుంచి గడియ బిగించాం. అడ్డుగా బెంచీలను అడ్డుపెట్టాం. అలా రెండు గంటలు ఉండిపోయాం. కాల్పుల శబ్దాలు మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు చిన్నారులు మళ్లీ పాఠశాలకు అడుగుపెట్టడం కష్టమే’’అని మెకానికల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు జార్బాస్ నోరోన్హా చెప్పారు. పాఠాల ప్రతిధ్వనులు మినహా కాల్పుల మోతలు అస్సలు వినబడని కెనడా పాఠశాలల్లో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు మొదలుకాగానే పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్కు వచ్చారు’’అని బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రతా మంత్రి, సొలిసిటర్ జనరల్ నైనా క్రీగర్ వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే ఆగంతకురాలు తనను తాను తీవ్రంగా గాయపర్చుకుని చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. ఆగంతకురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్ చెప్పారు. ‘బ్రౌన్ రంగు జుట్టు ఉన్న సాయుధురాలు’’అని మాత్రమే పేర్కొన్నారు. స్కూల్కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియరాలేదు. ఘటన జరిగిన పాఠశాలలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. టుంబ్లర్ రిడ్జ్ జనాభా 2,700 మాత్రమే. సమీప బొగ్గు పరిశ్రమకు సహాయకంగా 1981లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని నిర్మించింది. -
ఆస్తి దక్కకుండా చేసిందన్న అక్కసుతో..
గార్ల: అన్నకు రెండో పెళ్లి చేసి మొత్తం ఆస్తి తనకు దక్కకుండా చేసిందన్న కోపంతో నిద్రమత్తులో ఉన్న అత్తకు ఓ అల్లుడు విద్యుత్షాక్ పెట్టి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.సాయికుమార్ కథనం ప్రకారం.. సీతంపేట పంచాయతీ మంగళితండాకు చెందిన బానోత్ రాజేశ్ అన్న రమేశ్కు మూడు రోజుల క్రితం సీతంపేటలో రెండో వివాహం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన ధరావత్ కౌసల్య (50) అలియాస్ కంసాలి తన కూతురును బానోత్ రాజేశ్కు పదేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసింది. వీరి కుటుంబం సజావుగానే సాగుతోంది. రమేశ్కు సైతం 15 ఏళ్ల క్రితం వివాహం జరగగా అతని భార్య ఏడేళ్ల క్రితం అతన్ని వదిలి వెళ్లిపోయింది. రమేశ్కు రెండో పెళ్లి సంబంధంగా కౌసల్య ఇటీవల తన అన్న కూతురు అంజలితో సంబంధం కుదిర్చింది. రమేశ్, అంజలి వివాహం మూడు రోజుల క్రితం సీతంపేటలో జరిగింది. అంతా నిద్రలో ఉండగా.. రమేశ్కు పెళ్లికాకపోతే ఆస్తిమొత్తం రాజేశ్కు దక్కేది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజేశ్ తన అన్నకు రెండో పెళ్లి చేసి తనకు ఆస్తి దక్కకుండా చేసిందనే అక్కసుతో అత్త కౌసల్యను చంపేందుకు ప్లాన్ వేశాడు. మంగళవారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా అత్తమామను చంపేందుకు ఇనుప కడ్డీలకు విద్యుత్ వైరు కట్టి వారు పడుకున్న మంచం తలదిండు కింద పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. కౌసల్యకు మెలకువ వచ్చి కదలడంతో ఇనుపకడ్డీ తాకి విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతిచెందింది. మామ వెంటనే నిద్రలేచి తనభార్యను పట్టుకోగా అతనికి సైతం విద్యుత్షాక్ తగలడంతో కేకలు వేశాడు. ఇంట్లోని అందరూ లేచే సరికి అత్త మృతిచెందగా, మామ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే రాజేశ్ తండ్రి వచ్చి విద్యుత్ బోర్డు ప్లగ్ తీశాడు. రాజేశ్ భార్య ఎందుకు ఇలా చేశావని నిలదీయగా మద్యం మత్తులో కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అంజలిపైనా కత్తితో దాడి చేశాడు. ఇరువురికి గాయాలు కాగా, ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని గార్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి రాజేశ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దివ్యాంగుడైన రాజేశ్కు కొంత ఎలక్ట్రీíÙయన్ పని కూడా వస్తుంది. దీంతో కరెంటుపై కొంత అవగాహన ఉండడంతో ఇనుప కడ్డీలకు విద్యుత్ వైర్లు పెట్టడం, దానిని మంచంలో ఎవరికీ కనిపించకుండా అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
వ్యభిచారం కేసులో చంద్రకళకు 10సంవత్సరాల జైలు
శివమొగ్గ( కర్ణాటక): వ్యభిచారం కేసులో ముగ్గురు మహిళలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ భద్రావతి 4వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్ తీర్పు వెలువరించారు. వివరాలు.. 2021, డిసెంబర్ 24వ తేదీన భద్రావతిలోని ఉజ్జయిన్పూర్లోని మరియమ్మ ఆలయం వెనుక ఉన్న 3వ క్రాస్లోని ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే ఫిర్యాదుపై ఐపీఎస్ అధికారి జితేంద్ర కుమార్ దయామా నేతృత్వంలోని పోలీసు బృందం దాడి చేసింది. భద్రావతిలోని హోసూరులోని జెడికట్టే నివాసి చంద్రకళ అలియాస్ శ్వేత, ఉజ్జయినిపూర్ నివాసి శిల్ప, హోసా సిద్ధాపూర్ నివాసి కవితను అరెస్ట్ చేశారు. ఈ విషయమై పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఇన్స్పెక్టర్గా ఉన్న మంజునాథ్ ఈఓ కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున పి.రత్నమ్మ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితులకు జైలు శిక్షతో పాటు రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్ తీర్పు ఇచ్చారు. -
‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్లో మాట్లాడాలి’
శివమొగ్గ(కర్ణాటక ): గుర్తు తెలియని వ్యక్తి తనకు వీడియో కాల్ చేసి ప్రైవేట్ భాగాలు చూపించాడని ఓ మహిళ శివమొగ్గలోని ఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. శివమొగ్గకు చెందిన ఒక మహిళ మొబైల్ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్లో çవీడియో కాల్ చేశాడు. ‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్లో మాట్లాడాలి’ అని చెప్పాడు. మహిళ కాల్ లిఫ్ట్ చేయగా.. ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ భాగాలు చూపిస్తూ వేధించాడు. మహిళ వెంటనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వీడియోను రికార్డు చేసుకుంది. అనంతరం శివమొగ్గలోని ఈఎన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వీడియోలను చూపించి ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్లు ఢీకొని మహిళ మృతి
రాయచూరు రూరల్: బెళగావి జిల్లాలో చెరకు ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం రాయబాగ తాలూకా హారోగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాను మీరా(29) అనే మహిళ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది. భర్త అల్లావుద్దీన్, కుమారుడు శోయబ్లకు గాయాలయ్యాయి. మరో ఘటనలో ఘటప్రభ పోలీస్ స్టేషన్ పరిధిలో లొళసూరు బస్టాండ్ వద్ద చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీకొని వడ్డరహట్టి అనిత(26) మరణించింది. అనిత భర్త ఎలక్ట్రిక్ వాహనంలో ఓవర్టేక్ చేయబోగా వెనుక నుంచి తగలడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై హోరోగేరి, ఘటప్రభ పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రెండు కార్లు ముఖాముఖీ ఢీసాక్షి,బళ్లారి: రెండు కార్లు ముఖాముఖీ ఢీకొనడంతో పూర్తిగా కాలిపోయాయి. సోమవారం బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా నారాయణపుర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపు తప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోగా, కొన్ని నిమిషాల్లో రెండు కార్లు కాలిపోయాయి. అగి్నమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బసవ కళ్యాణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో వాహనానికి మంటలు కాగా సోమవారం బళ్లారి నగరంలో మోతీ సర్కిల్ వద్ద బొలెరో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఉన్నఫళంగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగి్నమాపక సిబ్బందికి తెలిపారు. రోడ్డు పక్కనే నిలిపిన వాహనంలో మంటలు రావడంతో ఎందుకు వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం
నాగర్కర్నూల్ జిల్లా: మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది. రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
నా చావుకు భార్య, అత్తామామలే కారణం
హైదరాబాద్: తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేకరు.. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది.భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.చదవండి: వాడ్ని ఊరికే వదిలిపెట్టకండి -
తల్లి నగ్నచిత్రాలు ప్రియుడికి..!
సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా, ప్రేమ మోజులో పడి కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. సొంత తల్లి, పెద్దమ్మ నగ్న ఫొటోలను రహస్యంగా తీసి వాటిని ప్రియుడికి పంపించిందో యువతి. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల మహిళ ఇచి్చన ఫిర్యాదు మేరకు కుమార్తె, ఆమె ప్రియుడు వరుణ్పై బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బీబీఎం చదువుతోంది. గతేడాది ఆమెకు మొబైల్ కొనిచ్చారు. నెల రోజులుగా అపరిచిత యువకుడితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానం వచ్చింది. విషయాన్ని బయట పెట్టకుండా యువతి మొబైల్ పాస్వర్డ్ను తెలుసుకున్నారు. తర్వాత ఆ మొబైల్ను పరిశీలించగా అందులో యువతి తల్లి ప్రైవేటు ఫొటోలతో పాటు ఆమె సోదరి అక్క ఫోటోలను యువకుడికి పంపినట్లు గుర్తించింది. అనంతరం కుమార్తె నిర్వాకంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమార్తె ప్రియుడు వరుణ్ ఆ ఫొటోలను పంపించాలని ఒత్తిడి చేసినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి అంటూ చేసుకుంటే తాను ప్రేమించిన యువకుడినే చేసుకుంటా అంటూ ఇంట్లో గొడవ పడి వెళ్లినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవేటు ఫొటోలను ఆ యువకుడు ఇతరులకు పంపించే అవకాశం ఉందని, ఈ క్రమంలో తన కుమార్తె, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. -
తరగతి గదిలో కాల్పుల కలకలం
చంఢీగడ్: లా కాలేజీ తరగదిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తరగతి గదికి గన్తో వచ్చిన ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం, తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పంజాబ్లో తరన్ తారన్ జిల్లాలో చోటు చేసుకుందిపోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన పంజాబ్ ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్గా, మరణించిన విద్యార్థినిని నౌషెహ్రా పన్నువాన్కు చెందిన సందీప్ కౌర్గా గుర్తించారు. కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ప్రిన్స్ రాజ్ కాలేజీ బ్యాగ్తో తరగతి గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ప్రిన్స్ రాజ్ వారిద్దరి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. కొద్దిసేపటికి ముగ్గురూ వెనుక సీట్లలో కూర్చున్నారు. అయితే కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి, బ్యాగ్లోని తుపాకీని బయటకు తీసి, సందీప్ కౌర్పై నేరుగా కాల్పులు జరిపాడు. కౌర్ నేలపై కుప్పకూలగా, మరో క్లాస్మేట్ షాక్తో వెనక్కి తగ్గింది. వెంటనే ప్రిన్స్ రాజ్ తనపై తానే కాల్పులు జరిపి నేలకొరిగాడు.కాల్పులు జరిగిన వెంటనే తరగతి గదిలోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తరగతులు ప్రారంభం కానున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత కలకలం రేపింది. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని సందీప్ కౌర్ తల్లి కాల్పుల ఘటనపై స్పందించారు. ప్రిన్స్ రాజ్ తుపాకీతో కళాశాలలోకి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 🚨 First-year law college student allegedly shot a fellow student inside a classroom in Punjab’s Tarn Taran district Accused identified as Prince Raj opened fire on Sandeep Kaur, he died on the spot. Prince later shot himself with the same weapon and was taken to hospital in… pic.twitter.com/sDghCJiYr0— Nabila Jamal (@nabilajamal_) February 9, 2026 -
బీభత్సం సృష్టించిన అంబులెన్స్.. మహిళ మృతి
పశ్చిమగోదావరి: అత్యవసర స్థితిలో ఉన్న వా రిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్ మృత్యు శకటంగా మారింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బైక్, ఆటోను అంబులెన్స్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం మండలంలోని సీతారామపురం టోల్ప్లాజా సమీపంలో మొగల్తూరు వైపు నుంచి నరసాపురం వస్తున్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ ముందు వెళుతున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. అలాగే అదుపు తప్పి పక్కన వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. మొగల్తూరు బండి ముత్యాలమ్మ ఆల యానికి వెళ్లి తిరిగి స్వగ్రామం యలమంచిలిలంకలోని వైవిలంకకు బైక్పై వెళుతున్న పిప్పళ్ల శ్రీవెంకట మోహన కృష్ణ, అతడి తల్లి, చినమ్మ సత్యలక్ష్మీ పద్మశ్రీ (40)కి తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆటోలోని డ్రైవర్తో పాటు ఇద్దరికీ గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన పద్మశ్రీని పాలకొల్లు తరలిస్తుండగా ఆమె మరణించింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నరసాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
మద్యం మత్తులో వ్యాపారి కొడుకు హల్చల్.. లంబోర్గిని బీభత్సం
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారి కొడుకు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకల దాకా మద్యం సేవించి ఖరీదైన లంబోర్గిని కారుతో పాదచారుల పైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు అతడిని పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.UP tobacco trader’s drunk son rams Lamborghini into vehicles and pedestrians in Kanpur, several injured.Shivam was allegedly drunk and tried to flee before police took action. pic.twitter.com/WDEC8AG9eU— The Tatva (@thetatvaindia) February 9, 2026అయితే, ప్రమాదం జరిగిన వెంటనే శివం ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే మరో కారులో అక్కడికి చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా బౌన్సర్లు స్థానికులపై దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నిందితుడి తండ్రి కేకే మిశ్రా బన్షిదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద పొగాకు కంపెనీకి యజమాని. గతంలో ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ గాయపడినవారు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు శివం పేరు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఎఫ్ఐఆర్లో అతడి పేరు లేకపోవడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు ఎందుకు లేదనే దానిపై పోలీసులు అధికారులు ఇంకా అధికారిక వివరణ ఇవ్వలేదు. -
ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
బెంగళూరు: ప్రేమించి పెళ్లికి సిద్ధమైన సమయంలో ప్రియురాలు మోసం చేసిందని బాడీ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కిరణ్ (26) జిమ్ట్రైనర్గా పనిచేయడంతో పాటు బాడీ బిల్డర్గా రాష్ట్రస్థాయిలో పేరుగాంచాడు. మూడేళ్ల నుంచి ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు, ఆమె కిరణ్ ఇంటికి వచ్చి తమకు పెళ్లి చేయాలని కోరగా కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. తన అన్న వివాహమైన వెంటనే మన పెళ్లి అని కిరణ్ మాట ఇచ్చాడు. కానీ 15 రోజుల క్రితం యువతి ఓ యువకునితో పెళ్లి నిశ్చయమైందని కిరణ్కు పెళ్లిపత్రిక ఇవ్వడంతో ఆవేదన చెందాడు. శనివారం సాయంత్రం కిరణ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆమే కారణమని డెత్నోటు తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లి కారణమని డెత్నోట్ పేరురాసి పెట్టాడని పోలీసులు తెలిపారు. కిరణ్ మృతితో తల్లిదండ్రులు ఆక్రందనలు మిన్నంటాయి. కిరణ్ తన ప్రేయసికి రూ.40 లక్షల వరకూ ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కాగా, కిరణ్ది పేద కుటుంబం, తండ్రి మార్కెట్లో మూటలు మోసే పనిచేసేవాడు, ప్రమాదంలో ఓ చేతి తెగిపోయి దివ్యాంగునిగా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సీతారామపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆదివారం నిద్రమాత్రలు మింగి స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సహచర సిబ్బంది ఆమెను వింజమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామం ఉదయగిరి వెళ్లిన ఆమె అక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు.. ఇటీవల సస్పెన్షన్కు గురైన సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనకు ఎస్ఐతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని అందించారని ఆరోపించారు.అందువల్లే ఎస్ఐ శివకృష్ణారెడ్డి సస్పెన్షన్కు గురయ్యారని చెప్పారు. తిరిగి ఎస్ఐపై ఉన్నతాధికారులకు తప్పుడు ఆరోపణలు చేసి అతని సస్పెన్షన్కు కారణమయ్యానని తనపైనే సీఐ నిందలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన తనతో సీఐ ఐదు నెలలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని, వీటిపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టి నిందారోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై ప్రతి ఒక్కరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వివరించారు. -
ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఉరి
మేడిపల్లి: ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతూ.. ఒక బాలుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. బోడుప్పల్లోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఉద్యోగి నివసిస్తున్నాడు. అతని కుమారుడు గంగాధరి అభినవ్ (17) ఐటీఐ చదువుతున్నాడు. మేడిపల్లిలోని మహేంద్ర కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు రాత్రి షాపింగ్ కోసమని బయటకు వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు క్లాస్మేట్ అయిన ప్రియురాలికి వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. చున్నీతో అభినవ్ ఉరి వేసుకోవడం చూసిన బాలిక.. వెంటనే అతని స్నేహితులకు సమా చారం అందించింది. స్నేహితులు వెంటనే బాలుని ఇంటికి చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి.. అతన్ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. అభి నవ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు. -
చీర చూపించి పెళ్లి ఆహ్వానించిన ప్రియురాలు.. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
బెంగళూరు: వాళ్లిద్దరూ ప్రేమికులు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో ప్రేమికుల రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం అబ్బాయి.. తన ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్ట్లు సైతం కొనుగోలు చేశాడు. కానీ అనూహ్యంగా అమ్మాయి వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. ‘త్వరలోనే నా పెళ్లి. నా పెళ్లికి నువ్వు రావాలి. ఇదిగో చూడు నా పెళ్లి నగలు, పెళ్లి చీర చూపించింది. ఆ పెళ్లి చీర చూసి తట్టుకోలేని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో కిరణ్ అనే యువకుడు బిల్డర్,జిమ్ ట్రైనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్..ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. ఆ యువతి మరో యువకుడితో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ విషయం తెలిసిన కిరణ్కు గుండె పగిలింది. తానెంతో గాఢంగా ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. గత రెండు వారాలుగా మనిషి మనిషిలా లేడు. ఉల్లాసంగా,ఉత్సాహం ఉండే కిరణ్లో డిప్రెషన్ పెరిగింది.ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు పేపర్,పెన్ను కావాలని తల్లిని అడగ్గా.. ఎందుకు అని అనుమానంగా అడిగింది. ఆర్ధిక వివరాలు రాయాలని,పెన్ను,పేపర్ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఇంటి గదిలోకి వెళ్లి సూసైడ్ లెటర్ రాశాడు. ప్రాణం తీసుకున్నాడు. గదిలోకి వెళ్లిన కిరణ్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.డోర్లు బలవంతంగా ఓపెన్ చేసి చూడగా.. తాడుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోటీను స్వాధీనం చేసుకున్నారు.అందులో తన చావుకు తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యువతిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనని సైతం పెళ్లికి రావాలని, ఇందుకోసం కొనుగోలు చేసిన నగదు,దుస్తులు కిరణ్కి చూపించడంతో తట్టుకోలేని ప్రాణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. -
ఉదయం సాఫ్ట్వేర్ జాబ్..రాత్రి అయితే దొంగ
అల్లిపురం: పగలు కంప్యూటర్ ముందు కూర్చు ని కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజదొంగగా మారిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, ఐరన్ రాడ్, డ్రిల్లింగ్ మెషిన్, సుత్తి, స్రూ్కడ్రైవర్, కట్టింగ్ ప్లయిర్, ఫేస్ మాస్కులను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసుల్లో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, నగదు రూ.40,500ను సన్నీ చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే? గత ఏడాది అక్టోబర్ 10న గాజువాకలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న కన్నా శివ రామకృష్ణ తన కుమార్తె డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం తన కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. కాకినాడకు చెందిన సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైం ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, ఆరి లోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీనిని సవాలుగా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కల్యాణ మండపం సమీపంలోని పార్క్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్ రోడ్ వద్ద క్రైం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇదీ సన్నీ నేర చరిత్ర నిందితుడు మహేష్ రెడ్డి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచే విలాసాలకు అలవాటు పడటంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పీఎంపాలెం పరిధిలో నాలుగు దొంగతనాలు చేసి తొలిసారి జువెనైల్ హోంకి వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైలులో 14 నెలలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి, మళ్లీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. -
ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల భారత్ సిటీ సొసైటీలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు బాలికల తండ్రి చేతన్ కుమార్కు చెందిన పాత నేర చరిత్ర తెలియవచ్చింది. 2015లో చేతన్ కుమార్తో సహజీవనం చేసిన ఒక మహిళ, భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం అది ఆత్మహత్యగా తేలడంతో ఆ కేసును మూసివేశారు.ప్రస్తుత ఘటన నేపథ్యంలో పాత కేసు వివరాలను పోలీసులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ కుమార్కు సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు భార్యలు ఉండగా, వీరు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లే కావడం గమనార్హం. మరణించిన బాలికలలో నిషిక (16) సుజాత కుమార్తె కాగా, ప్రాచి (14), పాఖీ (12) హీనా కుమార్తెలు. ఈ అసాధారణ కుటుంబ వాతావరణం, ఇంటి పరిస్థితులు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.బాలికలు రాసిన ఆత్మహత్య లేఖలో కేవలం తండ్రి ప్రస్తావన మాత్రమే ఉందని, తల్లుల గురించి ఏమీ రాయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. బాలికల ఆత్మహత్యకు తండ్రి వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో తొమ్మిది పేజీల డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్, ఫోరెన్సిక్ బృందాలు.. ఆ చిన్నారులు వినియోగించిన ఫోన్లోని డిజిటల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ బబితా సింగ్ బాధిత కుటుంబాన్ని సందర్శించి, ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పిల్లల మానసిక స్థితిని సరైన సమయంలో గుర్తించడంలో కుటుంబం విఫలమైందని పేర్కొంటూ, జిల్లా యంత్రాంగం, పోలీసుల నుండి సమగ్ర నివేదిక కోరారు. ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. -
కూలిన మూడంతస్తుల భవనం.. పలువురు మృతి
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కోటాలో మూడంతస్తుల భవనం శనివారం రాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. దాదాపు 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్లోని కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి భవనం కూలిపోయింది.భవనం కూలిపోయినప్పుడు విద్యార్థులు సహా దాదాపు 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిలో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని బయటకు తీసి చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలో ఒక రెస్టారెంటు కూడా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు పలువురు సిబ్బంది, వినియోగదారులు ఇందులో ఉన్నారు.#BreakingNews कोटा के जवाहर नगर में तीन मंजिला इमारत गिरने से हुआ हादसा। 20 वर्षीय स्टूडेंट की हुई मौत वहीं कोचिंग स्टूडेंटस सहित कई लोगों के दबे होने की सूचना। रेस्क्यू ऑपरेशन जारी ।#KotaBuildingCollapse pic.twitter.com/xVmqJQ2a34— लक्ष्य (@Lakshya_ke_sath) February 7, 2026 ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనే ప్రయత్నంలో బృందాలు శిథిలాలను జాగ్రత్తగా తొలగిస్తున్నాయి. భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు, అయితే చిక్కుకున్న వారికి మరింత గాయాలు కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియదు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత వివరణాత్మక దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు. అత్యవసర పనులు కొనసాగుతున్నందున ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు.#WATCH | Rajasthan: A building collapsed in Kota, people feared trapped. More details awaited.Visuals from the spot. pic.twitter.com/R8IAEjViRj— ANI (@ANI) February 7, 2026 -
ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో శనివారం రాత్రి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ జి.రవికుమార్ తెలిపిన వివరాలు.. కృష్ణానగర్లో నివసిస్తున్న శివశంకర్, పద్మజ (27) ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తేజశ్రీ (7), లాస్య (4)ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో తేజశ్రీ 2వ తరగతి, లాస్య యూకేజీ చదువుతోంది. శివశంకర్ నిరుద్యోగి కావడంతో శనివారం ఉదయం శ్రీసిటీ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు.అయితే పిల్లలను విడిచిపెట్టామని మధ్యాహ్నం 2.30 గంటలకు పాఠశాల నుంచి శివశంకర్కు ఫోన్ వచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఉన్నానని తెలిసిన వారికి పిల్లలను తీసుకెళ్లాలని చెప్పాడు. వారు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన పద్మ జ పిల్లలను తీసుకెళ్లింది. అయితే సాయంత్రం ఇంటికి చేరుకున్న శివశంకర్ తలుపు కొట్టినా ఎంతకూ తీయకపోవడంతో కిటికిలోనుంచి చూడగా అమ్మా యి వేలాడుతూ కనిపించింది.దీంతో ఇరుగుపొరుగువారిని తీసుకువచ్చి తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లగా తల్లీ కుమార్తెలు విగత జీవులుగా వేలాడుతూ కనిపించారు. వారు అందించిన సమాచా రం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా రు.పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, శివశంకర్ను పెళ్లి చేసుకున్న పాపానికి తాను ఎన్నో కష్టాలపాలయ్యానని, ఊరంతా అప్పులే ఉన్నాయని.. పద్మజ సూసైడ్ లేఖలో పేర్కొంది. -
పెట్రోల్ పోసి యువకుడి హత్య
హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం నింకంపల్లి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద సుహేబ్(25) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నింకంపల్లి సమీపంలోని పాడుబడిన బావి నుంచి దుర్వాసన రావడంతో శనివారం సమీప ప్రాంతాల వారు వెళ్లి చూశారు. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించి టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి విచారణ చేపట్టారు. హతుడు హిందూపురం పట్టణం సమీపంలోని హస్నాబాద్కు చెందిన సుహేబ్గా గుర్తించి..తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రెండు, మూడు రోజుల కిందట కొందరు యువకులు మద్యం మత్తులో గొడవపడి సుహేబ్ను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు భావిస్తున్నారు. టూటౌన్ పోలీసులు అనుమానితులైన యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
మహిళా అధికారిణి బెడ్రూంలో రహస్య కెమెరాలు..
కర్ణాటక: విలేకరుల ముసుగులో మహిళా అధికారిణి బెడ్రూం వీడియో దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి వాటిని చూపి బ్లాక్మెయిల్ చేస్తున్న ముగ్గురిని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సదరు మహిళ ప్రైవేట్ దృశ్యాలు ఉన్న వీడియో చిత్రీకరించుకొని ఆ మహిళను విలేకరుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్తతో పాటు ముగ్గురు నిందితులను బెళగావి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గోకాక్ జలాల్ గల్లి నివాసి సమీర్ నిస్సార్ అహ్మద్ షేక్ (32), గోకాక్ తాలూకా యోగికొళ్ల నివాసి అబ్దుల్ రఫీక్ నజీర్ అహ్మద్ మకాందార్(51), గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి మహమ్మద్ దిలావర్ బాళెకుంద్రి(43) అరెస్ట్ అయిన నిందితులు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపునకు వేసిన తాళం చెవిని ఆ పక్కన పెట్టే విషయాన్ని పొరుగింటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు.బల్బు హోల్డర్లో సీసీ కెమెరా అమర్చి.. దుండగులు రహస్యంగా బల్బు హోల్డర్లో సీసీ కెమెరా అమర్చి ఆ మేరకు ఆమె ప్రైవేట్ దృశ్యాలను చిత్రీకరించుకొని బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాతో పాటు న్యూ చానల్లో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. అలా వైరల్ చేయకూడదంటే రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళకు బ్లాక్ మెయిల్ చేసిన వారిపై బెళగావిలోని మాళమారుతి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3 మొబైల్స్, 64 జీబీ పెన్డ్రైవ్, 6 హిడెన్ కెమెరా హోల్డర్లు, ఐక్యూ జెడ్ఎక్స్, రెండు ఓటీజీ, రెండు మెమరి కార్డులు, రీడర్లు, 128 జీబీ 8 మెమరి కార్డులు, ఒక టోయోటా ఇన్నోవా క్రిస్టా కారును పోలీసులు జప్తు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారని బెళగావి నగర పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే మీడియాకు తెలిపారు. -
వీడిన విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీ!
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్పై రైలుకు ఎదురెళ్లి బిడ్డలతో సహా బలవర్మణానికి పాల్పడిన విజయశాంతి రెడ్డి కేసు దాదాపు వీడింది. ఆమె ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో అనే తేల్చే క్రమంలో పోలీసులు దాదాపు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపారు. చివరకు తీవ్ర డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తేల్చారు. గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్తో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఇటు ఆఫీస్లోని తోటి సిబ్బంది సైతం ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లలు ముందు నుంచి కూడా ఆమె కంట్రోల్లోనే ఉన్నారు. దీంతో తల్లి చెప్పినట్లే చేశారు. ఆమెతో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు. అయితే డిప్రెషన్కు గల కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. బహుశా.. పిల్లలను హాస్టల్లో ఉంచాల్సి రావడం, భర్తకు దూరంగా ఉంటుండడం ఆమెకు మానసికంగా కుంగదీసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వాడిన ఫోన్ తాలుకా.. ఫోన్కాల్ డాటాను మరింత లోతుగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం.జనవరి 31వ తేదీన ఉదయం చర్లపల్లి రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని విజయ (35), విశాల్ (17), చైతన్య (18)గా గుర్తించారు. పోస్ట్మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త దుబాయ్ నుంచి వచ్చాక స్వస్థలం బీబీనగర్లో అంత్యక్రియలు జరిపారు. ఘటనా స్థలంలోని విజయ కారు నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. రైల్వేట్రాక్పై బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి తీసుకున్న నిర్ణయంపై.. తెలుగు రాష్ట్రాల సామాజిక మాధ్యమాల్లో అమ్మరాసిన మరణశాసనం అంటూ చర్చ జరిగింది. బంధువులే ఏమన్నారంటే..ఉద్యోగరీత్యా.. పిల్లల భవిష్యత్తు కోసం భార్యభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిననే భావనను పెంచిందని బంధువులు రైల్వే పోలీసుల విచారణలో చెప్పారు. సూసైడ్కు ముందు.. 15 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగదీసినట్లు తెలుస్తోంది. దగ్గరి బంధువులు, స్నేహితులతో ఇదే విషయాన్ని పదేపదే పంచుకుంటూ బాధపడేదంటూ విజయరెడ్డి సమీప బంధువు ఒకరు వివరించారు. ఒంటరిగా ఇంకెంతకాలం అంటూ బాధపడేదన్నారు. సంసారంలో ఇవన్నీ సహజమని భావించామని.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయమని ఆమె స్నేహితులు చెబుతున్నారు. 2007లో సురేందర్రెడ్డి, విజయరెడ్డిలకు వివాహమైంది. సురేందర్రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్లో కొలువురావటంతో అక్కడకు వెళ్లారు. ఉప్పల్ డిపో రాఘవేంద్రనగర్లోతల్లి పుష్పలతతో కలిసి విజయరెడ్డి పిల్లలతో ఉంటున్నారు. ఆమె ఓ ఐటీ కంపెనీలో టీమ్లీడర్గా పనిచేస్తున్నారు. రాత్రి విధులు కావటంతో పిల్లలిద్దర్నీ హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్నారు. ఆనాడు.. విజయరెడ్డి ఇంటి నుంచి సొంత కారులో బయటకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హాస్టల్స్లో ఉన్న బిడ్డల్ని బయటకు తీసుకొచ్చారు. కారును చర్లపల్లి రైల్వేస్టేషన్ పార్కింగ్లో నిలిపారు. మధ్యలో ఏడు గంటలపాటు వాళ్లు ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఆపై పార్కింగ్ స్లిప్ వెనుక వైపు తనకు జీవించాలని లేదని.. తాను దూరమైతే పిల్లలు ఒంటరవుతారంటూ సూసైడ్నోట్ రాసి కారులోనే వదిలేశారు. అదే సూసైడ్లెటర్ను ఆమె ఫొటో తీసి తన వాట్సప్లో స్టేటస్గా ఉంచారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫోన్లు, ల్యాప్ట్యాప్లు వెతికినా.. తమ మధ్య ఎలాంటి గొడవల్లేవని. కుటుంబానికి ఆర్థిక సమస్యలు కూడా లేవని విజయశాంతిరెడ్డి భర్త సురేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయ తల్లి కూడా పోలీసులకు తెలిపింది. దీంతో.. కేసు మరింత క్లిష్టంగా మారింది. చివరకు.. ఆమె ఫోన్, ల్యాప్ట్యాప్లను పోలీసులు విశ్లేషించినా లాభం లేకపోయింది. అందులోనూ ప్రొఫెషనల్ చాటింగ్లే తప్పా.. ఏం దొరకలేదు. ఆమె రెండో ఫోన్ వాడిందనే ప్రచారం తెర మీదకు రాగా.. పోలీసులు దానిని కొట్టిపారేశారు. -
సోఫాకు సిగరెట్ నిప్పంటుకుని..
హైదరాబాద్: మద్యం మత్తులో సిగరెట్ తాగుతుండగా.. సోఫాకు నిప్పంటుకుని విశ్రాంత సైనిక ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన బోరబండ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సెక్టార్ ఎస్ఐ కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నకేశవులు (67) విశ్రాంతి సైనికోద్యోగి. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హెచ్ఎఫ్ నగర్ ఫేజ్–1 బస్తీలో నివాసముంటున్నాడు. ఆయనకు మద్యం, పొగ తాగే అలవాటు ఉంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్న కేశవులు భవనం పైగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆయన ఉన్న గది నుంచి మంటలు రావడంతో భార్య, స్థానికులు వెళ్లి చూడగా.. సోఫాలోనే పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. చెన్నకేశవులు మద్యం మత్తులో సిగరెట్ తాగుతున్న క్రమంలో సోఫాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి కాలిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
అబూజ్మాడ్లో భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/కాళేశ్వరం: మహారాష్ట్ర– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ సంభవించింది. పోలీసులు–మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇన్చార్జి, వెస్ట్ సబ్జోనల్ బ్యూరో ఇన్చార్జి, సీపీఐ (మావోయిస్ట్) కంపెనీ నంబర్ 10 ఇన్చార్జి ప్రభాకర్ (తెలంగాణ, కామారెడ్డి జిల్లా వాసి) కూడా ఉన్నారు. ప్రభాకర్పై తెలంగాణ, మహారాష్ట్రల్లో రూ.50 లక్షల రివార్డు ఉంది. గత మూడు రోజులుగా కొనసాగిన ఆపరేషన్లో గురువారం రాత్రి వరకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, శుక్రవారం ఆపరేషన్లలో మరో నలుగురు (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.మొత్తం మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మిగిలిన మావోయిస్టుల గుర్తింపు.. నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనాస్థలం నుంచి మూడు ఏకే–47 రైఫిళ్లు, 1 ఎస్ఎల్ఆర్, ఒక 303 పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో సీ–60 జవాన్ దీపక్ చిన్న మాడవి (38) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అహేరి తాలూకా మంద్రా గ్రామానికి చెందిన ఆయన గురువారం ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు. అదే సమయంలో గుండెపోటు రావడంతో హెలికాప్టర్లో బామ్రాగడ్ సబ్డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందారు. మరో సీ–60 జవాన్ జోగా మాడవ్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హెలికాప్టర్లో గడ్చిరోలికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను గడ్చిరోలి పోలీసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.1995లో అజ్ఞాతంలోకి..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన సీనియర్ మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ లోకేటి చందర్ రావు (60)ది కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. 1995లో అడవిబాట పట్టిన ఆయన తిరిగి ఇంటిముఖం చూడలేదు. అప్పట్లో తండ్రి చనిపోయినా, మూడేళ్ల కిందట తల్లి చనిపోయినా ఇంటికి రాలేదు. సిర్నాపల్లి దళ కమాండర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు. పోలీసు నిర్బంధం పెరిగిన సమయంలో ఆయన్ను దండకారణ్యానికి పంపించారు.అక్కడ పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి ప్రభాకర్ నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నాయకత్వంలో ఆయన పనిచేసినట్టు ఈ మధ్య లొంగిపోయిన ఓ మావోయిస్టు నేత చెప్పారు. ప్రభాకర్ వెళ్లిన కొంత కాలానికి ఆయన భార్య నవత అలియాస్ లోకేటి సులోచన కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది. ఎనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో దండకారణ్యంలో చనిపోయింది. ఆయన కొడుకు రమేశ్ అలియాస్ అశోక్, కూతురు లావణ్య కూడా తల్లిదండ్రుల బాటలో నడిచారు. రెండు నెలల కిందట రమేశ్ లొంగిపోగా, లావణ్య ఛత్తీస్గఢ్లో అరెస్టయి జైల్లో ఉన్నారు. -
కౌండిన్య, మోర్థానలో.. వీరప్పన్లు!
మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. పలమనేరు: దక్షిణ భారతదేశంలో గజరాజుల మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఏనుగు దంతాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వాటిపై కన్నేశారు. కార్ణటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని మోర్థానాలో మాటు వేసి మరీ వేటాడుతున్నారు. ఆపై గుట్టుచప్పుడు కాకుండా వాటి కోరలు పీకి విదేశాలకు తరలిస్తున్నారు. గతంలో కర్ణాటకలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించిన మూలాలు చిత్తూరు జిల్లాలోని వారికి సంబంధం ఉందనే విష యం బయటపడింది. తాజాగా తమిళనాడులోని గుడియాత్తంలో అక్కడి ఫారెస్ట్ అధికారులకు పట్టుబడిన ముఠాతో పలమనేరు మండల వాసికి సంబంధాలున్నాయనే విషయం సంచలనమైంది. ఏనుగు మృతి చెందితే దాన్ని జూ అధికారులు పోస్టుమార్టం చేసి దాని దంతాలను తొలగించి ఆపై పాతిపెడుతుంటారు. కానీ వందల కిలోమీటర్లున్న అడవిలో మృతిచెందే ఏనుగుల పరిస్థితి ఏంటో మరి.గతంలో కర్ణాటకలో వెలుగులోకి కర్ణాటకలోని హెబ్బాళ్ల పోలీసులకు గతంలో ఏనుగుదంతాల కేసులో చిత్తూరు జిల్లా చెందిన స్మగ్లర్ల విషయం వెలుగుచూసింది. కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అడవుల్లో సంచరించే ఏనుగుల దంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మృతిచెందిన ఏనుగు దంతాల తొలగింపు సాధారణంగా మృతిచెందిన ఏనుగు నుంచి దంతాలను తీసి ఆపై పూడ్చి పెడుతుంటారు. కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటిదాకా 20 ఏనుగులు మృతిచెందాయి. వీటిని పాతిపెట్టేముందు సంబంధిత ఎఫ్ఆర్వో ఉన్నతాధికారుల నుంచి కస్టోడియల్ ఫామ్ను పొంది ఆపై జూ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహించాలి. దంతాలను కత్తిరించాక పాతిపెట్టిన ప్రదేశాన్ని జియోరెఫరెన్స్ చేసి ఇందుకు సంబంధించిన కేస్ రిపోర్ట్లో ఉంచాలి. దంతాలను ఫారెస్ట్ కస్టోడియన్ స్టోర్ రూమ్లో భద్రపరుస్తారు. ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా? ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్ అడవుల్లో వీరప్పన్ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మగ ఏనుగులకు మాత్రమే దంతాలుపలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యం దాదాపు 250 చ.కి.మీగా ఉంది. ఇందులో సుమారు వంద దాకా ఏనుగులున్నాయి. ఇక ఇదే అడవికి ఆనుకొని ఉన్న మోర్థా నా రేంజ్ 130 చ.కి.మీగా ఉండగా ఇందులో 26 దాకా, కృష్ణగిరి, మైసూరు జిల్లాలో 320 చ.కిమీ విస్తీర్ణలో 46 దాకా ఏనుగులున్నట్టు తెలుస్తోంది. వీటిలో మగ ఏనుగులు (టస్కర్స్) 27 దాకా ఉన్నట్టు సమాచారం. ఇందులో కొన్ని మదపుటేనుగులు కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని దాటి భాకరాపేట అడవుల మీదుగా శేషాచలం అడవుల్లోనూ సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అటు తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం ఫారెస్ట్లోని మోర్థాన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గట్టల నుంచి తరచూ కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. జిల్లాలో మొత్తం 12 మదపుటేనుగులుండేవి. వీటిలో ఆరు మృతిచెందగా ఇప్పుడు ఆరు మగ ఏనుగులు మాత్రమే ఉన్నాయి.విదేశాల్లో భలే డిమాండ్ చైనా, జపాన్, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల్లో ఏనుగు దంతాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి విలువ కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. వీటితో అందమైన కళాఖండాలు, బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, ఫియోనో, చందరంగ చిహ్నాలు, విలాసాలు, హోదాలకు కోటీశ్వరులు కొంటున్నట్టు తెలిసింది.తాజాగా తమిళనాడులో... కౌండిన్య అభయారణ్యానికి ఆనుకొని ఉన్న తమిళనాడులోని మోర్థాన ఫారెస్ట్లో గత డిసెంబర్ 4న మూడు ఏనుగుల కళేబరాలు భయపడ్డాయి. వీటిలో మదపుటేనుగు దంతాలు కనిపించకపోవడంతో అక్కడి ఫారెస్ట్ అధికారులు శోధిస్తుండగా నాలుగురోజుల క్రితం గుడియాత్తంలో ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా తమకు పలమనేరు మండలంలోని ఓ వ్యక్తి ద్వారా వచ్చాయనే విషయం వెలుగుచూసింది. -
కడపలో మహిళా హెచ్ఎం ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్: కడపలోని మున్సిపల్ హై స్కూల్ (మెయిన్)లో ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49) శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు.పోలీసులు, బాధితురాలి బంధువులు, సహచర ఉపాధ్యాయులు అందించిన వివరాలు.. జింకా జమీమా సుందరం, ఆమె భర్త పుష్ప రాజు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. వారు ఐఐటీల్లో చదువుతున్నారు. కొన్నేళ్లుగా మున్సిపల్ హైసూ్కల్ మెయిన్లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జమీమా సుందరం ఇటీవల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయులు, సిబ్బంది రికార్డుల వ్యవహారాలు, జీతభత్యాల నిర్వహణ వంటి బాధ్యతలతో పని ఒత్తిడి పెరిగింది. భర్త పుష్ప రాజ్ మొదట్లో రికార్డుల నిర్వహణలో సహాయం చేసినా.. ఇటీవల పట్టించుకోకపోవడంతో మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో హెచ్ఎం జమీమా సుందరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు వాయిస్ మెసేజ్ పాఠశాల గ్రూప్లో పెట్టడంతో సహచర ఉపాధ్యాయులు వెంటనే ఇంటికి వెళ్లారు. వేలాడుతున్న ఆమెను కిందికి దించి ఎర్రముక్కపల్లె రహదారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డీఈవో షంషుద్దీన్, ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పని ఒత్తిడా.. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యకు యతి్నంచారా అన్నది తేలాల్సి ఉంది. -
సీఐపై కత్తితో దాడి
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీప్రాంతంలో హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిపై మోస్ట్వాంటెడ్ క్రిమినల్ కావడి నాగేంద్ర కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆత్మరక్షణలో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. శుక్రవారం టేకులోడు అటవీప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి 2024లో చిలమత్తూరు మండలం టేకులోడు పంచాయతీ నల్ల»ొమ్మనపల్లి వద్ద అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటనలో హిందూపురం పట్టణం గుడ్డం ప్రాంతానికి చెందిన కావడి నాగేంద్ర ప్రధాన నిందితుడు. బెయిల్పై బయటకు వచి్చన అతను కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో అతను ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో హిందూపురం అప్గ్రేడ్ స్టేషన్ సీఐ ఆంజనేయులు, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్ మూడు బృందాలుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో హిందూపురం రూరల్ స్టేషన్ కానిస్టేబుల్ రవికి నిందితుడు నాగేంద్ర కనిపించడంతో అతను పట్టుకునేందుకు వెళ్లాడు. దీంతో నాగేంద్ర తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ రవిపై దాడి చేసి అడవిలోకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రవి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న సీఐ ఆంజనేయులు అక్కడికి చేరుకుని రవిని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాగేంద్రను వెంబడిస్తూ అడవిలోకి వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక నాగేంద్ర కనిపించడంతో లొంగిపోవాలని సీఐ కోరినా అతను వినిపించుకోలేదు. పైగా పట్టుకునేందుకు వెళ్లిన సీఐపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ ఆంజనేయులు తన సర్వీసు రివాల్వర్తో నాగేంద్ర కాళ్లపై కాల్చడంతో అతను కింద పడిపోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు సీఐ ఆంజనేయులుతోపాటు, నిందితుడు నాగేంద్రను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రవి, సీఐ ఆంజనేయులు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చట్టప్రకారం శిక్షిస్తాం నిందితుడు కావడి నాగేంద్రకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నాగేంద్ర చేసిన దాడిలో గాయపడిన సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవీంద్రను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్పీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగేంద్ర 2024లో టేకులోడు ఫ్యాక్టరీ వద్ద అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అలాగే జిల్లాలో అతడిపై 41 కేసులు, కర్ణాటకలో 70 కేసులు నమోదైనట్లు తెలిపారు. అంతకుముందు ఆయన ఘటన జరిగిన టేకులోడు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. -
గంజాయి బ్యాచ్ గ్యాంగ్రేప్
కోవూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి బ్యాచ్ అరాచకానికి ఓ బాలిక బలైపోయింది. ఇద్దరు మృగాళ్లు కలిసి ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి పరిస్థితి విషమించగా వారం రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. అయితే, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టుచేసిన పోలీసులు.. బాధిత కుటుంబం ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో బాలిక మృతి ఘటన ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు కేసు తారుమారుకు యత్నాలు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి వారితో మరో రకంగా ఫిర్యాదు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రేమ వ్యవహారం అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసుల తీరుతో అర్ధమవుతోంది. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఏం జరిగిందంటే.. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి దుకాణానికి వెళ్లొస్తుండగా, గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు ఆమెపై కన్నేశారు. బాలికను సమీపంలోని చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే వారు విచక్షణ మరిచి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచి్చన తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత కోవూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన ఆ బాలిక చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు తారుమారుకు పోలీసుల యత్నం బాలిక మృతి చెందడంతో చెన్నైలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వాకబు చేసినట్లు సమాచారం. అయితే, బాలిక స్వగ్రామానికి కాకాణి శనివారం వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు కేసు తారుమారు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కథలు అల్లుతున్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదు.. రేప్ జరగలేదంటూ బుకాయింపు.. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఘటనా స్థలాన్ని సైతం పరిశీలించారు. అక్కడ కొన్ని ఆధారాలు సేకరించి, మైనర్లు అయిన ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. అయితే, గంజాయి బ్యాచ్ అరాచకాల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకే అవకాశం ఉండడం వల్ల కూడా వారు కేసు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి ఆగడాలు.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయి. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖలు అవినీతి మత్తులో జోగుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను ఇటీవలే గంజాయి విక్రేతలు దారికాచి తరిమితరిమి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షితోపాటు ఆమె సోదరుడు, అనుచరులు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక గంజాయి విక్రయ మూలాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనడానికి తరచూ భారీస్థాయిలో పట్టుబడుతున్న గంజాయే నిదర్శనం. నిజానికి.. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న కోవూరు అడ్డాగా గంజాయి విక్రయాల దందా జరుగుతోంది. ఒడిశా నుంచి రైళ్లల్లో, బస్సుల్లో తెస్తూ.. పడుగుపాడు, ఇనమడుగు ప్రాంతాల్లో విక్రేతలు పాగా వేసి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఆ ఇద్దరే కారణం.. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు. అభం శుభం తెలియని మా బిడ్డపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటకట్టడం చాలా పాపం. అవన్నీ తప్పుడు ప్రచారం. మా బిడ్డను కొందరు బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేసిన విషయం నిజమే. అందుకే కోవూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఇద్దరు పిల్లలే. వారిని కఠినంగా శిక్షించాలి. – ఎస్కే రసూల్, బాలిక తండ్రి మా బిడ్డకు ఇలా జరగడం దారుణం.. పోయిన శుక్రవారం ఏదైనా కొనుక్కుంటానంటే నేనే రూ.10 ఇచ్చి పంపాను. దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు పిల్లలు బలవంతంగా తీసుకెళ్లి మత్తు నీళ్లు తాగించడంతో చెట్ల పొదల మధ్యన పడిపోయింది. గంటసేపైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది అంతా వెతికాం. ఇంతలో ఇద్దరు పిల్లలు అక్కడ కూర్చొని ఉంటే అడిగాం. ముందు చూపిస్తామని, ఆ తర్వాత మాకు తెలియదని చెప్పారు. చివరకు చెట్ల పొదల్లో చూడగా అక్కడ మా బిడ్డ స్పృహలేకుండా పడిపోయి ఉంది. అప్పుడు కోవూరు ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే.. నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చెన్నైకు తీసుకెళ్లమన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మా కళ్ల ముందు ఆడుకుంటున్న బిడ్డకు ఇలా జరగడం దారుణం. – బాలిక పిన్ని అంతా అబద్ధంగుమ్మళ్లదిబ్బలో బాలికపై అసలు అత్యాచారమే జరగలేదు. అదంతా అబద్ధం. ఆ బాలికకు బాలుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ బాలిక తన స్నేహితులతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారేమోనని సమీపంలో ఉన్న గుర్తుతెలియని లిక్విడ్ తాగింది. ఆ కారణంగానే చనిపోయింది. – సుధాకర్రెడ్డి, కోవూరు సీఐరాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా ప్రభుత్వ హయాంలో గంజాయి, అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాం. కానీ, నేడు చంద్రబాబు కనుసన్నల్లో రాష్ట్రమంతా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఈ మత్తు పదార్థాలవల్ల పసిబిడ్డల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనికరంలేదు. కూటమి ప్రభుత్వ అక్రమాలకు కొందరు పోలీసులు వంతపాడటం సిగ్గుచేటు. బాలిక అత్యాచారం కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీమంత్రి -
బైక్ కోసం తండ్రిని చంపిన కొడుకు
రేగోడ్ (మెదక్): బైక్ కొనివ్వాలని గొడవ పడి.. ఓ కొడుకు తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ పోలీస్స్టే షన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై పోచయ్య కథనం మేరకు.. రేగోడ్ గ్రామానికి చెందిన షకీర్ (51) కూరగాయలు అమ్ముతూ జీవనం సాగి స్తున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమా రుడు ఉన్నారు. కుమారుడు మహమ్మద్ హుస్సేన్ కొంతకాలం ట్రాక్టర్ డ్రైవర్గా పని చేశాడు.అయితే ఏడాది నుంచి పని చేయకుండా ఇంట్లో నే ఉంటున్నాడు. ఈ క్రమంలో బైక్ కొనివ్వా ల ని, భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించసాగాడు. నెల క్రితం డబ్బుల కోసం తండ్రిపై దాడి చేయగా అతని తలకు గా యమైంది. గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కు దిర్చారు. కాగా, గురువారం రాత్రి ఇంట్లో నిద్ర పోతున్న షకీర్ను, కుమారుడు బయటకు లాక్కొ చ్చి కొట్టడంతో తలకు బలంగా గాయాలై షకీర్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఘటనా స్థలా న్ని అల్గాదుర్గం సీఐ రేణుకారెడ్డి సందర్శించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఘజియాబాద్లో అక్కాచెల్లెళ్ల కేసులో కొత్త ట్విస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరి ఆత్మహత్యలకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతుల తండ్రి.. అప్పుల్లో కూరుకుపోవడం, వారి చదువులు మాన్పించడం వంటి అంశాలు ఆత్మహత్యకు దారి తీసినట్టు తెలిసింది. వారికి పెళ్లి చేస్తానని చెప్పడం కూడా ఇందుకు ఇక కారణమని పోలీసులు గుర్తించారు.ఘజియాబాద్కు చెందిన ఫారెక్స్ వ్యాపారవేత్త చేతన్ కుమార్కు ముగ్గురు భార్యలు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాకుండా చేతన్ కుమార్ సోదరి కూడా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా కలిసే ఉంటున్నారు. అయితే, కోవిడ్ కారణంగా లాక్డౌన్ సమయంలో చేతన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ క్రమంలో చేతన్ తన అవసరాల కోసం అప్పులు చేశాడు. అది కాస్తా ఇప్పుడు రెండు కోట్లకు చేరుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో.. స్కూల్, కాలేజీ ఫీజులు కట్టలేక వారి చదువు ఆగిపోయింది. దీంతో, వారంతో ఇంట్లోనే ఉంటున్నారు.⚠️ Shocking News :- गाजियाबाद में तीन नाबालिक बच्चियों के बाप चेतन ने तीन शादियां कर रखी थी ।दो हिंदू बीवी जो आपस में बहने थी और एक मुस्लिम बीवी थी जबकि एक साली को अपने पास रखता था तो इससे समझ में आता है कि वह तीन बीवियों और एक साली में इतना उलझा था कि अपनी बच्चियों को ध्यान… pic.twitter.com/ENYMVUWWCo— 𝗦𝗨𝗡𝗶𝗟 𝗣𝗥𝗔𝗧𝗔𝗣 ᵖʳᵃʲᵃᵖᵃᵗⁱ (@SunilPtp) February 6, 2026ఆర్థిక అవసరాల కోసం పేరెంట్స్ కూడా పనులు చేసుకుంటున్నారు. దీంతో, పిల్లలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతన్.. పిల్లలను సరిగా పట్టించుకునే వాడు కాదని సమాచారం. ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్కు బానిసైపోయారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పాఖి(12).. ‘కొరియన్ లవ్ గేమ్’కు అడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచారు. గేమ్కు బానిసలుగా మారడాన్ని గుర్తించిన తండ్రి.. పది రోజుల క్రితం కుమార్తెల మొబైల్స్ను తీసుకుని దాచిపెట్టేశాడు. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఇంతలోనే కోపంతో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించాడు. అయితే తాము భారతీయులం చేసుకోమని.. కొరియన్లనే చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ విషయాన్ని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.Location: Ghaziabad, UPThree minor girls committed suicide by jumping from the ninth floor.The father says that the girls were addicted to a Korean game.The father is a share trader, his two wives and a sister-in-law live with him in the flat, all three are biological sisters. pic.twitter.com/viPezTN3H1— M Amir (@ResponsiveAmir) February 4, 2026ఈ క్రమంలో వారి బాధనంతా డైరీలో వెళ్లగక్కారు. ‘క్షమించండి నాన్న.. నిజంగా క్షమించండి’ అంటూ ఒక సూసైడ్ నోట్ ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్థులోని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. కిందనున్న స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. -
పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె ఆపరేషన్ థియేటర్లోనే కుప్పకూలి మరణించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక(26) అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె బుధవారం ప్రభుత్వాస్పత్రి ‘సీ’ బ్లాక్లోని జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో మరో పీజీ వైద్య విద్యార్థినితో కలిసి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమె రాత్రి పది గంటలకు సహచర విద్యార్థితో క్యాంటీన్ నుంచి ఆహారం తెప్పించుకుని తిన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో డాక్టర్ దీపిక నలతగా ఉందని, వాంతులు అయ్యేట్లు ఉన్నాయని చెప్పడంతో సహచర పీజీ విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్ ఇంజక్షన్ చేసినట్లు చెబుతున్నారు. అనంతరం డాక్టర్ దీపిక ఆపరేషన్ థియేటర్ చాంబర్లోని రూమ్లో ఉండగా, మరో విద్యార్థి 1.10 గంటల సమయంలో సర్జరీకి కేసును తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆమె తిరిగి 1.40 గంటలకు ఆపరేషన్ థియేటర్ చాంబర్కు వచ్చి చూడగా, డాక్టర్ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసే థియేటర్కు వెళ్లగా, డాక్టర్ దీపిక ఒక మూలన కుప్పకూలి ఉంది. దీంతో ఇతర సిబ్బందిని పిలిచి పరిశీలించగా, అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే ఆర్ఐసీయూకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. కాగా, డాక్టర్ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితోపాటు తల్లి భారతి కూడా వైద్యశాఖలో పని చేస్తున్నారు. సోదరి డాక్టర్ మౌనిక హైదరాబాద్లో గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మృతికి తెలియని కారణం తొలుత హార్ట్ అరెస్ట్ కారణంగా డాక్టర్ దీపిక మృతిచెంది ఉండవచ్చని సహచరులు, వైద్యులు భావించారు. ఆ తర్వాత ఇంజక్షన్ విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంజక్షన్ వికటించి మరణించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఐవీ ఇచ్చినప్పుడు హార్ట్ అరెస్ట్ కావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. కాగా, డాక్టర్ దీపిక నోటి వెంట నురగ రావడం, చేతికి కాన్సులా పెట్టి ఉండటం, మరోచోట బ్యాండెడ్ వేసి ఉండటంతో ఆమె ఇంకా వేరే ఇంజక్షన్ ఏమైనా చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమెకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి 1.10 గంటల వరకు బాగానే ఉన్న తమ కుమార్తె 30 నిమిషాల్లోనే మరణించడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డాక్టర్ మౌనిక ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు వచ్చి ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బుధవారం రాత్రి వైద్యులు మినహా బయటి వ్యక్తులు ఎవరూ ఆపరేషన్ థియేటర్కు వెళ్లలేదని నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ దీపిక తన రూమ్ నుంచి థియేటర్కు వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి. డాక్టర్ దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు తెలిపారు. -
కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
చిత్తూరు అర్బన్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్లయి, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాలుడితో ఉన్న బంధం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపేయాలని ఆ మహిళ, బాలుడికి అతను చెప్పడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రేరేపించిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. -
ఇంట్లో కొరియన్ భూతాలు
పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తూ ఉండాలి. ఫోన్లు వారిని ఏ మూలకు నెడుతున్నాయో గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చేసే స్నేహం, సంభాషణ, చర్చ మాత్రమే వారిని మంచి దారిలో పెట్టగలదు. ఢిల్లీలో ముగ్గురు ఆడపిల్లలు ‘కొరియన్ గేమ్స్’లో పడి ప్రాణాలు తీసుకున్నారు. మన దేశంలో టీనేజ్ పిల్లలు కె–పాప్ కోసం వెర్రెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇళ్లల్లోని ప్రేమ, స్నేహాల కొరత వల్లేమోనని చెక్ చేసుకోవడం అవసరం. ఇంతకు కొరియన్ లవ్ గేమ్స్ అంటే ఏమిటి? పిల్లలకు వీటి గురించి ఎలా జాగ్రత్త చెప్పాలి?‘వాస్తవంలో ఏదీ దొరకకపోతే ఊహలనే వాస్తవం అనుకోవాల్సి ఉంటుంది’ఇది నిపుణుల మాట.నిజజీవితంలో తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితులు, ఆటలు, హాబీలు, స్కూల్లో క్లాస్మేట్లతో అనుబంధం, టీచర్ల నుంచి వాత్సల్యం... వీటిలో ఏవీ లేని పిల్లలు... టీనేజ్లో వచ్చిన వారు ఊహల్లో కాకుండా వేటిలో సాంత్వన వెతుక్కుంటారు.ఇవాళ దేశాన్నే కాదు... ప్రపంచంలోని యువతను కొరియన్ డ్రామాలు, కొరియన్ పాప్ సంగీతం, సినిమాలు, గేమ్స్ ఆకర్షిస్తున్నాయంటే కారణం... అక్కడ ఊహలు చాలా అందంగా ఉంటాయి. అబ్బాయిలు రాకుమారుల్లా ఉంటారు. అమ్మాయిలు రాకుమార్తెలుగా ఉంటారు. వారి మధ్య ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని కాలు కందకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ల జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది... ఈ అద్భుత ప్రపంచం చూసే కొద్దీ టీనేజ్లోని అమాయకత్వం, ఆకర్షణ వల్ల యువతీ యువకులు తాము అలాగే ఉన్నట్టూ, తమకూ అలాంటి లోకం కావాలన్నట్టు ఉంటుంది.మానసిక నిపుణులు ఏమంటున్నారంటే కొరియన్ ప్రపంచాన్ని ఇష్టపడే వారు ఎక్కువగా భ్రమాజనిత ప్రపంచంలో ఉంటున్నారు... వాస్తవిక ప్రపంచంతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నారు అని. దీనికి తార్కాణం తాజాగా ఢిల్లీలో జరిగింది.ఢిల్లీ విషాదం...ఢిల్లీలో ముగ్గురు అమ్మాయిలు (ఇద్దరు ఒక తల్లికి, మరొకరు మరో తల్లికి జన్మించారు– తండ్రి ఒకడే) కరోనా సమయం నుంచి కొరియన్ డ్రామాలకు, గేమ్స్కు, పాప్కు అలవాటు పడ్డారు. సోషల్ మీడియాలో వారి ఐడెంటిటీలు కొరియన్ పేర్లతోనే పెట్టుకున్నారు. వాళ్లలో మధ్య అమ్మాయిని గేమ్స్లోలానే ‘లీడర్’గా ఎంచుకున్నారు. మధ్య అమ్మాయి అన్నం తినకపోతే వారు తినరు. మధ్య అమ్మాయి స్కూలుకు వెళ్లొద్దంటే వాళ్లు వెళ్లరు. తండ్రి, అతని ఇద్దరు భార్యలు కలిసి ఒకే ఫ్లాట్ ఈ పిల్లలతో ఉండగా ఈ ముగ్గురూ ఒక జట్టు, కొడుకు ఒక జట్టుగా మిగిలారు. ‘మా సోదరుడంటే మాకు ఇష్టం లేదు’ అని ఆ అమ్మాయిలు అనడం మొదలుపెట్టారు. తల్లిదండ్రుల పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ ముగ్గురు ఆడపిల్లలు రెండేళ్లుగా స్కూల్లు వెళ్లకుండా పూర్తిగా భ్రమల్లోకి వెళ్లిపోయారు. ఏనాటికైనా కొరియా వెళ్లి అక్కడ జీవించాలని వారి కోరికట. ‘మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా ఆపగలరా’ అని రాసి తాము నివాసం ఉంటున్న తొమ్మిదో అంతస్తు నుంచి దూకి మరణించారు.కొరియన్ లవ్ గేమ్స్...కొరియన్ ఆన్లైన్ గేమ్స్ కేవలం బయట ఉండి ఆడేవి కావు. ఆటగాళ్లు ఆ గేమ్లో భాగం అవుతారు. ఆ ఆటగాళ్లకు కొరియన్ నేమ్స్ ఇవ్వబడతాయి. అలాగే గేమ్లోని ఒక వర్చువల్ (కృత్రిమ) యువకుడు లేదా యువతి గేమ్ ఆడే నిజమైన అమ్మాయి లేదా అబ్బాయికి సోల్ మేట్స్ అవుతారు. ఈ సోల్మేట్స్ ఈ నిజమైన అమ్మాయిని అబ్బాయిని చాలా పేంపర్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్ల్లో పలకరిస్తారు. రహస్యంగా కబుర్లు చెబుతారు. వీరి మాయలో పడ్డ టీనేజ్ యువతీ యువకులు ఇక మెల్లగా తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరమవుతారు. ఆ తర్వాత ఈ వర్చువల్ యువకుడు లేదా యువతి నిజ యువకుడు యువతికి టాస్క్లు ఇవ్వడం మొదలెడతారు. ఫలానా టైమ్లో మేల్కోమని, ఫలానా టైమ్లో చాట్లో రమ్మని, ఫలానా విధంగా డ్రస్సు వేసుకొని ఫోటోలు పెట్టమని... ఇలా నెమ్మదిగా బానిసలుగా మార్చి స్క్రీన్ టైమ్ను దారుణంగా పెంచేస్తారు. పిల్లలు ఇలా ఫోన్కు అతుక్కుని పోవడం ఎప్పటికైనా తల్లిదండ్రులకు తెలుస్తుంది. వారు మందలించి ఫోన్ లాగగానే ఒక్కసారిగా భ్రమాత్మక ప్రపంచం మాయమై, డ్రగ్స్ అందని అడిక్ట్స్లాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆత్మహత్యలకు పూనుకుంటారు. ఢిల్లీలో జరిగింది ఇదే. మరో విధంగా చెప్పాలంటే ఈ గేమ్స్లోని వర్చువల్ పాత్రలు కూడా ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు.బ్లూవేల్ తర్వాత...గతంలో బ్లూవేల్ గేమ్ ఆత్మహత్యలకు పురిగొల్పి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత పరోక్షంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను దివాలా తీయించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇప్పుడు కొరియన్ ప్రపంచం వారిని అతలాకుతలం చేస్తోంది. వాస్తవానికి కొరియాలో శారీరక కరెక్షన్స్ ఒక తప్పనిసరి. వారు సన్నగా ఉండటానికి అందంగా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అందుకు ‘బ్యూటీ లోన్స్’ ఇచ్చే బ్యాంకులూ ఉంటాయి. పాప్ సింగర్లను సన్నగా కనిపించడం కోసం స్కూల్ వయసు నుంచే ఎంచుకుని ఆహారం ఇవ్వకుండా మాడుస్తారు. దాంతో యుక్తవయసులోనే చనిపోయిన సింగర్స్ ఉన్నారు. ఇన్ని తెర వెనుక వ్యవహారాలుండగా తెర మీద అందంగా కనిపిస్తూ కొరియన్ అబ్బాయిలు, అమ్మాయిలు భారత దేశ టీనేజ్ పిల్లలను పూర్తి భ్రమాత్మక ప్రపంచంలోకి ఈడుస్తున్నారు.తల్లిదండ్రులూ జాగ్రత్త...1. పిల్లలతో పదే పదే మాట్లాడండి. 2. జరుగుతున్న విషాదాలను మెల్లగా వివరించండి.3. ఎవరు చెప్తే వింటారో వారితో చెప్పించండి.4. కౌన్సిలర్ల సాయంతో వారిని మెల్లగా ఫోన్ నుంచి భ్రమాత్మక జగత్తు నుంచి బయట పడేయండి.5. విపరీతమైన ప్రేమ, స్నేహితులు, ఆటపాటలు, సొంత ఊర్లూ పరిసరాలు ఇవి వారిని వాస్తవిక ప్రపంచంలోకి తెచ్చేలా చేస్తాయి. ఓపికగా పిల్లలను మార్చుకోండి.– ఫ్యామిలీ డెస్క్ -
చర్లపల్లి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. తల్లికి ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, విజయ కుటుంబం మృతి మిస్టరీపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు.. విజయ భర్తను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. కానీ, వారి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు.చర్లపల్లి ఐటీ ఉద్యోగి విజయ(విజయశాంతి రెడ్డి) కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకునే రోజు.. కొడుకు, కూతురిలో సహా కారులో విజయ రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్కు వెళ్లింది. రైల్వే స్టేషన్కు వెళ్లిన తర్వాత తాము ఫంక్షన్ వచ్చినట్టు తల్లికి ఫోన్ చేసి చెప్పింది. చనిపోయేందుకు ముందు రోజే కూతురిని హాస్టల్ నుంచి ఇంటి తీసుకువచ్చిన విజయ. ముగ్గురూ రైల్వే స్టేషన్లో ప్రశాంతంగా మాట్లాడుతూ తిరిగినట్టు సీపీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు పట్టాల మధ్యలో నుంచి నడుచుకుంటూ విజయ, పిల్లలు వెళ్లారు. ఈ క్రమంలో వారిని రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.అయితే, పిల్లలను రైల్వేస్టేషన్కు ఏమని చెప్పి తీసుకువచ్చారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇలా చనిపోవడానికి సిద్దమై ముగ్గురు వచ్చారా? లేక తల్లి విజయే బలవంతంగా తీసుకువచ్చిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. తన ఉద్యోగం ద్వారా విజయకు లక్ష రూపాయల జీతం వస్తోంది. ఇంటి అద్దెల ద్వారా మరికొంత ఆదాయం వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయ అకౌంట్లో జమ అవుతోంది. పిల్లలకు ఐఐటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో హాస్టల్లో ఉంచి చదివిస్తున్న దంపతులు. పిల్లల చదువులకు అధిక డబ్బుల కోసమే విజయ భర్త దుబాయ్కు వెళ్లినట్టు తెలిసింది.కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్ రెడ్డితమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు. తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను విజయశాంతి రెడ్డి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అని మరో మెసేజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
సోనమ్ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఆ దంపతులకు పెళ్లయి అప్పటికే మూడు నెలలే అయ్యింది. కొత్త కాపురంలో ఎంతో అన్యోన్యంగా మెలిగారు వాళ్లు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఓ సరదా సాయంత్రం ఇద్దరూ హైవేపై వాకింగ్కని బయల్దేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. భర్త అశీష్కు వాహనం బలంగా తగలడంతో స్పాట్లోనే చనిపోయాడు. భార్య అంజూ అపస్మాకర స్థితిలో రోడ్డ పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. అశీశ్ మృతదేహం స్ట్రెచ్చర్ మీద ఉంది. తన ప్రియాతిప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలు అవిసెలా రోదిస్తున్న అంజూను చూసి అంతా ‘‘అయ్యో పాపం’’ అనుకున్నారు. ఈ ఘటనను తొలుత హిట్ అండ్ రన్ కేసుగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజూ తడబడింది. పైగా తన బంగారు చెవి పొగులు కనిపించడం లేదని.. ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరపగా.. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.హనీమూన్ పేరిట భర్తను రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సోనమ్. ఆపై ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్ మర్డర్ కేసుగా మేఘాలయాలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలో.. తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్గా పని చేసే తేజేశ్వర్ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్ స్కెచ్తో మర్డర్ చేయించింది. ఈ రెండు ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్పకాలంలో జరగడంతో.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చే నడిచింది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటనే.. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్ మర్డర్ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్ను ప్రియుడి&కోతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్ అండ్ రన్ కేసుగా క్లోజ్ చేయించేందుకు శతవిధాల ప్రయత్నించింది. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగింది ఇదే.. అశీష్-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి అప్పగించి.. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది అంజూ. అక్కడే దొరికింది.. అయితే వాంగ్మూలాల సమయంలో ఒక్కోసారి ఒక్కోలా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్.. ఆమెను అడ్డంగా దొరికిపోయేలా చేసింది. అనుమానంతో అంజూ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అందులో సంజూ అనే వ్యక్తితో తరచూ ఆమె మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. అశీశ్ కలిశాక ఆ కాల్స్ మరింత ఎక్కువ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అంజూ-సంజూలు నిజం ఒప్పేసుకున్నారు. అశీశ్తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్ అండ్ రన్గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్ను అరెస్టు చేశారు. సోనమ్ కూడా..కిందటి ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంంది. సోనమ్ తన తండ్రి దగ్గర పని చేసే రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని ప్రేమించి.. ఆపై భర్త రాజా రఘువంశీని ఇష్టంలేని పెళ్లి చేసుకుని.. మంచిగా నటిస్తూ హనీమూన్ పేరిట భర్తను మేఘాలయాకు తీసుకెళ్లి అక్కడ ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేయించిది. ఆపై ఏం ఎరగనట్లు కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఆపై రోడ్డుపై ఓ దాబాకు దీనావస్థలో(డ్రామా) చేరి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. -
కడపలో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. బైక్పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. -
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఏపీలోని ఐ పోలవరం(కోనసీమ) మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన ఉండ్రు సతీష్(31) నగరంలో ఐటీ ఉద్యోగి. కిందటి ఏడాది రవళి అనే యువతితో వివాహం అయ్యింది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తూ.. మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఊరెళ్లగా.. తమ్ముడు సతీష్ వెంకటకృష్ణ అన్నకు తోడుగా ఉండిపోయాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం ఎంతకీ సతీష్ బెడ్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు, స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు. తీరా చూస్తే.. సతీష్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. అన్నేసి పని గంటలతో మానసికంగా అతను కుంగిపోయినట్లు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పని ఒత్తిడి గురించి మరోసారి చర్చకు దారి తీసింది. -
బ్లాక్మెయిల్తో బలవన్మరణం
చిక్కడపల్లి (హైదరాబాద్): ఆన్లైన్ లోన్ యాప్ల అరాచకాలు సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. కేవలం మూడు వేల రూపాయల స్వల్ప రుణం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాప్ ఏజెంట్ల అసభ్యకర బెదిరింపులు, మానసిక వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఇన్స్పెక్టర్ మల్లేశం తెలిపిన వివరాలివి.ముంబై నుంచి వచ్చి.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి, శాస్త్రిచౌక్కు చెందిన ప్రేమ్ కుమార్ రాజు బర్ల (30) బతుకుతెరువు కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. చిక్కడపల్లి రిసాల అంబేడ్కర్నగర్లో తన భార్య నాగమణితో కలిసి నివసిస్తున్నారు. వీరికి వివాహమై రెండేళ్లు అవుతోంది. దంపతులిద్దరూ కలిసి ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీకర హాస్పిటల్లో ఒక క్యాంటీన్ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.చిన్న మొత్తం.. పెద్ద శాపమై.. గతంలో తన అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా ప్రేమ్ కుమార్ రూ.3 వేల రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రేమ్ కుమార్కు ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రుణం చెల్లించడంలో జాప్యం జరిగితే, ప్రేమ్ కుమార్తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలుగా మారుస్తామని ఏజెంట్లు హెచ్చరించారు. వాటిని కుటుంబ సభ్యులకు పంపడమే కాకుండా, సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని అత్యంత దారుణంగా బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. వరుస కాల్స్తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురైన ప్రేమ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో ప్రేమ్కుమార్ మంగళవారం రాత్రి తన అద్దె ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఫోన్లోని కాల్ డేటా, లోన్ యాప్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్ఐ అభిలాష్లు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
కన్నతల్లి చూస్తుండగానే చెల్లిని చంపిన అన్న
మొయినాబాద్ రూరల్: భూ పంపకం విషయంలో అన్నాచెల్లి మధ్య నెలకొన్న మనస్పర్థలు.. చెల్లి హత్యకు కారణమయ్యాయి. రక్తం పంచుకుపుట్టిన సొంతచెల్లిని అన్న దారుణంగా చంపేశాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్తయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మల్లమ్మకు సంతానం లేకపోవడంతో వెంకటమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కొడుకు రాజు, కూతుళ్లు సరస్వతి, స్వప్న ఉన్నారు. సరస్వతికి వివాహం కాగా, స్వప్న (34) న్యాయవాదిగా కొనసాగుతున్నారు. నెల రోజుల్లో ఆమె వివాహం జరగనుంది. వెంకటమ్మకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆరెకరాలు రాజుకు, నాలుగెకరాలు స్వప్నకు ఇవ్వాలంటూ గతంలోనే తీర్మానం చేసుకున్నారు. దీంతో ప్రైవేటు ఓ సర్వేయర్ను రప్పించిన స్వప్న బుధవారం ఉదయం 9 గంటలకు తల్లి వెంకటమ్మతో కలిసి భూమి కొలుస్తున్నారు. అక్కడే ఉన్న రాజు, మరో వ్యక్తితో కలిసి వచ్చి చెల్లి తలపై రాయితో కొట్టాడు. కన్నతల్లి చూస్తుండగానే కత్తితో గొంతుకోసి ఇద్దరూ పరారయ్యారు. చుట్టు పక్కల వారి సాయంతో స్వప్నను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. నిందితుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.న్యాయవాదుల ఆందోళనజూనియర్ న్యాయవాది స్వప్న హత్యకు గురైందనే విషయం తెలుసుకున్న పలువురు న్యాయవాదులు వివరాలు తెలుసుకునేందుకు మొయినాబాద్ పీఎస్కు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై వారు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ జామ్ కావడంతో డీసీపీ యోగేశ్ గౌతమ్ న్యాయవాదులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం అందజేశారు. -
మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టిచ్చిన ‘రోబో’
విశాఖపట్నం: రైల్వే స్టేషన్ అంటేనే నిత్యం వేలాది మందితో కిటకిటలాడే ఒక జనసముద్రం. ఆ రద్దీలో సామాన్య ప్రయాణికులను, మారువేషంలో తిరిగే నేరగాళ్లను వేరు చేసి చూడటం మానవమాత్రులకు కత్తిమీద సామే. కానీ.. ఆధునిక సాంకేతికత తోడైతే అసాధ్యం సుసాధ్యమని ‘రైల్ రోబోకాప్ – ఏఎస్సీ అర్జున్’ నిరూపించింది. సోమవారం నిశ్శబ్దంగా సాగిపోతున్న రాత్రి వేళ, ప్లాట్ఫారంపై తన గస్తీని కొనసాగిస్తున్న ఈ రోబో రూపంలోని కృత్రిమ మేధస్సు ఒక్కసారిగా అప్రమత్తమైంది. దాని డిజిటల్ కళ్లు రద్దీలో ఉన్న ప్రతి ముఖాన్ని నిశితంగా స్కాన్ చేస్తుండగా, ఇద్దరి వ్యక్తుల ముఖకవళికలు తన డేటాబేస్లోని ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాతో సరిపోలాయి. కనురెప్పపాటు కాలంలోనే ఆ రోబో తన విశ్లేషణను పూర్తి చేసి, కంట్రోల్ రూమ్కు ప్రమాద హెచ్చరికలను పంపింది. అప్పటివరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోబో పంపిన నిక్కచ్చి సమాచారంతో ఆరీ్పఎఫ్ ఎస్ఐ వి. కీర్తిరెడ్డి నేతృత్వంలోని బృందం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెన్షన్ స్క్వాడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎటు నుంచి ముప్పు వస్తుందో ఊహించలేక ఆ ఇద్దరు అనుమానితులు తచ్చాడుతుండగానే, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ప్రాథమిక తనిఖీలో వారి వద్ద కనీసం టికెట్లు కూడా లేకపోవడం అధికారుల అనుమానాన్ని బలపరిచింది.అయితే అసలు సంచలనం వారి గతాన్నితవ్వినప్పుడు బయటపడింది. పట్టుబడిన హడప శివ, జె. బంగారు సాధారణ దొంగలు కాదని, రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, దాడులు, డకాయిటీలతో భీభత్సం సృష్టించిన గజదొంగలని తేలింది. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నేరగాళ్ల ఆటను ‘ఏఎస్సీ అర్జున్’ తన ఏఐ మేధస్సుతో కట్టిపడేసింది. ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్ఎం లలిత్ బోరా స్పందిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించడంలో ఏఐ సాంకేతికత ఒక తిరుగులేని ఆయుధమని ప్రశంసించారు. -
పసి మొగ్గలపై 'విషపు కాటు'
తాచుపాముల తావుల్లో విషపు కాటుకు గురై.. పువ్వంటి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆకులు రాలి, మోడువారిన చెట్టులా వెక్కివెక్కి ఏడుస్తోంది. పరమాన్నం పెట్టేవాడు పరమాత్మ కాదని, ఆటబొమ్మలిచ్చే వాడు ఆదుకొనేవాడు కాడని గుర్తించలేక.. పసిప్రాయం కామాంధుల దాహానికి కర్కశంగా బలవుతోంది. మృగాళ్ల కాటుకు బలై.. తల్లై.. ప్రసవ వేదనతో చిక్కిశల్యమై.. కన్నవారికి బరువై తల్లడిల్లిపోతోంది. కాకినాడ క్రైం: ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ ఆ శ్రీమహాలక్ష్మి తమ కడుపున పుట్టిందని తల్లిదండ్రులు మురిసిపోతారు. రెక్కలు విచ్చుకున్న సీతాకోకచిలుకలా.. ఘల్లుమనే గజ్జెల సవ్వడితో నట్టింట్లో నడయాడుతూంటే ఆనందపరవశులవుతారు.. అటువంటి పసిమొగ్గలు.. లోకం పోకడలు తెలియని ప్రాయంలోనే కామాంధుల చేతుల్లో బలైపోతున్నారు. రేపటి తరాన్ని అందించాల్సిన బాలికలపై.. అక్క, చెల్లి, కూతురు, మనవరాలు.. ఇలా అన్ని వావివరుసలనూ మరచిన మృగాళ్లు.. ముక్కుపచ్చలారని వయస్సులోనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఆ బాధిత బాలికలు పసి ప్రాయంలోనే గర్భవతులై జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడాది వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 13 మంది బాలికలు మృగాళ్ల అఘాయిత్యాలకు గురై, గర్భం దాల్చారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఉంటుందన్నది అంచనా. గర్భం దాల్చిన వారు కాకుండా.. లైంగిక దాడులకు గురైన వారు మరెంతో మంది ఉంటున్నారు. విలువలు లుప్తం.. లోపిస్తున్న భయం » సమాజంలో నానాటికీ విలువలు లుప్తమవడం ఈ అకృత్యాలకు జరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు అవగాహన లోపం, బలప్రయోగాలకు గురవడం, సరైన పెంపకం లేకపోవడం వంటివి కూడా కారణాలవుతున్నాయి. » బాలికలపై అత్యాచారం చేసి, హత్య కూడా చేసిన సంఘటనలు దేశంలో, రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. అయినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం లేదు. చట్ట ప్రకారం చర్యలున్నా, అవి తీవ్ర స్థాయిలో లేకపోవడంతో ఘాతుకానికి పాల్పడుతున్న వారికి భయం లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకోవచ్చనే భావనను కలిగిస్తోంది. కేసులు ఆలస్యంగా నమోదవడం, సాక్ష్యాలు లభించకపోవడం, రాజీ యత్నాలు, బాధిత బాలలు ఫిర్యాదు చేయలేకపోవడం మృగాళ్లకు కలిసొస్తున్నాయి. ఫలితంగా బాధితులకు తక్షణ న్యాయం లభించడం లేదు. దీంతో, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమైపోతున్నాయి. » కొన్ని సందర్భాల్లో పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ ఉండని దుస్థితి. కొంత మంది పిల్లలను బంధువుల ఇళ్లల్లో ఉంచి, జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అలా తల్లిదండ్రులు లేని లోటుతో జీవితాన్ని గడుపుతున్న పిల్లలకు కామాంధులు రకరకాల ఆకర్షణలు ఎరగా వేస్తున్నారు. అలాగే, బాల కార్మికులు, బిచ్చగాళ్లుగా జీవిస్తున్న చిన్నారులు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. » అసురక్షిత పరిస్థితుల్లో లైంగిక దాడులు జరుగుతూండటంతో పలువురు బాలికలు గర్భవతులవుతున్న దుస్థితి నెలకొంది.పెడోఫిలిక్ డిజార్డర్తో.. పెడోఫిలిక్ డిజార్డర్ అనే మానసిక సమస్య వల్ల కూడా పసివాళ్లపై లైంగిక వాంఛలకు లోనవుతూంటారు. వారితో తమ కోరిక తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. అలాగని ఘాతుకానికి పాల్పడిన ప్రతి వాడూ పెడోఫైల్ కాదు, ప్రతి పెడోఫైల్ నేరం చేస్తాడనీ లేదు. ఈ సమస్య వల్ల నేరం చేశానని తప్పించుకునే అవకాశం లేదు. వ్యక్తి సమస్యతో బాధపడుతున్నాడా లేదా అన్నది గుర్తించడం వైద్యపరంగా సులభమే. చిన్న పిల్లలపై చెడు ఆలోచనలు కలిగితే తక్షణమే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సైకియాట్రిక్ కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ, ఇంపల్స్ కంట్రోల్ మెడిసిన్ ద్వారా సమస్యను నియంత్రించవచ్చు. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వ్యాధుల నిపుణుడు, హెచ్ఓడీ (ఇన్చార్జి), రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు ఇలాంటి దురాగతాల్లో బాధిత బాలికను పెళ్లి చేసుకుంటామని ఎర వేయడం పరిపాటిగా మారింది. నిరుపేద, వెనుకబడ్డ, తల్లిదండ్రులు లేక సంరక్షకుల వద్ద బతుకీడుస్తున్న అనాథ బాలల వర్గాల్లో ఇది పరిపాటిగా మారింది. వివాహం చేసుకుంటే కేసు రద్దవదు. కేసుతో పాటు నేరం చేసినందు వల్ల చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పరిధిలో చట్ట పరమైన చర్యలు తప్పవు. ఇది కాక, పోక్సో చట్టం వర్తిస్తుంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. నేరంలో క్రూరత్వం స్పష్టమైతే మరణ దండనకూ ఆస్కారం ఉంటుంది. మైనర్లపై లైంగిక దోపిడీలో ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు. – ఎండీ జవహర్ ఆలీ, ప్రముఖ న్యాయవాది, కాకినాడ » గత మే నెలలో కిర్లంపూడిలో 13 ఏళ్ల బాలికకు పక్కింటి వృద్ధుడు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఓ తాతయ్య చాక్లెట్లు ఇస్తున్నాడని ఆ బాలిక పాఠశాలలో తోటి స్నేహితులకు చెప్పడంతో.. ఆ పిల్లలు కూడా చాక్లెట్ల కోసం వెళ్లగా.. వారిపై కూడా ఆ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. » ఇలా ఏడుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఓ బాలిక గర్భవతి కావడంతో అధికారుల అనుమతితో అబార్షన్ చేయించారు. » గండేపల్లి మండలం సూరంపాలెంలో 13 ఏళ్ల బాలికపై ఓ లారీ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెద్దమ్మ ఇంటికి వెళ్తే కన్ను వేసి, బెదిరించి పలుమార్లు దారుణానికి తెగబడ్డాడు, ఆ మృగాడి నిర్వాకంతో ఆ బాలికకు జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగి, ఆడ శిశువు జని్మంచింది. » కాకినాడ జగన్నాథపురంలో 14 ఏళ్ల బాలికపై పొరుగింట్లో ఉంటున్న 40 ఏళ్ల దుర్మార్గుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. గర్భవతి అయిన ఆ చిన్నారికి అబార్షన్ చేయించేందుకు ఇంటర్ చదువుతున్న ఓ యువకుడికి చెప్పాడు. అతడు కూడా ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి ఘాతుకానికి బలైపోయిన ఆ బాలిక.. ఆడపిల్లకి జన్మనిచ్చింది. » గత నవంబర్లో ఉప్పాడకు చెందిన 16 ఏళ్ల బాలికకు తినుబండారాలు కొనిచ్చి, తాతయ్య వరుస అయ్యే వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. గర్భం దాలి్చన ఆ బాలికకు కాకినాడ జీజీహెచ్లో అధికారుల ఆదేశాలతో అబార్షన్ చేశారు. » కాకినాడ అచ్చంపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను ఓ వివాహితుడు ప్రేమ పేరుతో మోసగించి, దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఆ బాలిక గత నవంబర్ 29న బాబును ప్రసవించింది. ఆ శిశువును శిశుగృహకు అప్పగించారు. » బాబాయి అత్యాచారం చేయడంతో తాళ్లరేవులో 16 ఏళ్ల బాలిక గత అక్టోబర్లో పాపను ప్రసవించింది. » పిఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలికపై సొంత బంధువే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అధికారుల ఆదేశాలతో ఆమెకు అబార్షన్ చేశారు. » కరప మండలం నడకుదురుకు చెందిన ఓ బాలికను తెలిసున్న వ్యక్తే నమ్మించి మోసం చేశాడు. కాకినాడ కోకిల సెంటర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ బాలిక మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువును అధికారులకు అప్పగించారు. » ఇవన్నీ కేవలం ఏడాది వ్యవధిలో జరిగిన దారుణాలు. మచ్చుకు కొన్నే అయినా, అభంశుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలు ఏ రీతిలో జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.చైల్డ్ పోర్నోగ్రఫీ అరచేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణం పరిపాటిగా మారింది. వీటిని వీక్షిస్తున్న వారిని సాంకేతికత ఆధారంగా గుర్తించి భరతం పట్టాల్సిన పోలీసు శాఖ ఈ విషయంలో విఫలమవుతోంది. అశ్లీల వీడియోలు చూస్తున్న ఎంతో మంది వికృత చేష్టలతో పసిమొగ్గలను చిదిమేస్తున్నారు.చేతులెత్తేసిన సర్కారు బాలికలపై దురాగతాల్ని నిలువరించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధ్యత వహించాల్సిన పోలీస్, మాతా శిశు సంక్షేమ శాఖ అనుబంధ విభాగాలు, రూ.కోట్లు వెనకేసుకుంటున్న ఎన్జీవోలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అవగాహన కార్యక్రమాల పేరుతో ఫొటోలకే పరిమితమవుతున్నారు. అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అవి ఫలవంతంగా జరగడం లేదనే విమర్శలున్నాయి. పాఠశాల లేదా మరేదైనా ప్రాంతంలో ఒకసారి సదస్సు నిర్వహించి వదిలేస్తున్నారు. దీనివలన ప్రయోజనం ఎంతవరకూ ఒనగూడిందనే పరిశీలన ఉండటం లేదు. అలాగే, బాధిత బాలికలు చేరి, సాంత్వన పొందే విభాగంలో కనీసం వారి డేటా కూడా తగిన రీతిలో నిర్వహించడం లేదు. -
‘బ్లాక్ హ్యాట్’వలకు చిక్కొద్దు
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లు దాన్ని ఆసరాగా చేసుకొని రకరకాల పద్ధతుల్లో మోసాలకు తెరతీస్తున్నారు. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో బ్లాక్ హ్యాట్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ) ఆధారిత అక్రమ వెబ్సైట్ల ప్రచారంపై కేంద్ర హోంశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర హోంశాఖకు చెందిన భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్సీటీఏయూ) బ్లాక్ హ్యాట్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది. నెటిజన్లతోపాటు వెబ్సైట్ల నిర్వాహకులు సైతం బ్లాక్హ్యాట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఏమిటీ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ?సాధారణంగా మనం ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. అందుకోసం కీ వర్డ్స్ను టైప్ చేయగానే సెర్చ్ ఇంజన్ వాటికి సంబంధించిన సమాచారాన్ని చూపుతుంది. అక్కడ మొదటగా వచ్చే 3–4 లింకులే సరైనవని భావించి వెంటనే క్లిక్ చేస్తాం. సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. పేరొందిన వెబ్సైట్లలోని భద్రతా లోపాలను ఉపయోగించుకొని సెర్చ్ ఇంజన్ ఫలితాలను మోసపూరితంగా మారుస్తున్నారు. ఇలా సెర్చ్ ఇంజన్ల ద్వారా వెబ్సైట్ల ర్యాంకింగ్ను అక్రమంగా పెంచడాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటారు. ఈ విధానంలో హానికరమైన లేదా మోసపూరిత కంటెంట్ను అనధికారికంగా చొప్పించి వినియోగదారులను అక్రమ బెట్టింగ్, జూదం, అశ్లీల వెబ్సైట్లు, పైరేటెడ్ కంటెంట్ వైపు మళ్లిస్తున్నారు. తద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ముప్పు ప్రధానంగా వెబ్సైట్ నిర్వాహకులకే ఎక్కువగా ఉంటుందని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.ప్రజలు, వెబ్సైట్ల యజమానులకు భద్రతా నిపుణుల సూచనలివీ..» ఆన్లైన్లో ఏదైనా సమాచారం కోసం సెర్చ్ ఇంజన్ల ఫలితాలపై క్లిక్ చేసే ముందు అవి అసలైన వెబ్సైట్లో కాదో పరిశీలించాలి. » అనుమానాస్పద లేదా రీడైరెక్ట్ అయిన వెబ్సైట్లలోని యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. » వెబ్సైట్లలో ఉపయోగించే సీఎంఎస్ ప్లాట్ఫామ్లు, ప్లగిన్లు, థీమ్లు, సర్వర్ సాఫ్ట్వేర్ను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి.» మాల్వేర్, అనధికార రీడైరెక్ట్లు, అనుమానాస్పద ఎస్ఈఓ కార్యకలాపాలపై వెబ్సైట్లను నిరంతరం పర్యవేక్షించాలి.» బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ వల్ల వెబ్సైట్ల బ్రాండ్ ఇమేజీ దెబ్బతినడం, డొమైన్ బ్లాక్ అయ్యే ప్రమాదం, వెబ్సైట్కు ట్రాఫిక్ తగ్గిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలి. సాధారణంగా జరిగే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మోసాలు ఇవి..కీవర్డ్ స్టఫింగ్: అవసరం లేకుండా ఒకే కీవర్డ్ను పదేపదే కంటెంట్లో చొప్పించడం.ఫేక్ బ్యాక్లింక్స్: నకిలీ వెబ్సైట్ల నుంచి వేల లింకులు ఇచ్చి వెబ్సైట్ ర్యాంక్ పెరుగుతుందని నమ్మించడం.నెగెటివ్ ఎస్ఈఓ దాడులు: ప్రత్యర్థి వెబ్సైట్పై స్పామ్ లింకులు వేసి దాని ర్యాంక్ పడేలా చేయడం.బ్లాక్ హ్యాట్ మోసాన్ని గుర్తిస్తే ఎలా ఫిర్యాదు చేయాలి?బ్లాక్ హ్యాట్ మోసం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. -
పోరంకి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సూసైడ్ కేసులో ట్విస్ట్
సాక్షి, కృష్ణాజిల్లా: పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్లో పవన్ కుమార్కి తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జనవరి 5న పవన్పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. కొట్టిన దృశ్యాలను విద్యార్థులు ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్పై విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. హాస్టల్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లను పవన్ చేతిపై రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు గోప్యంగా ఉంచిన శ్రీచైతన్య యాజమాన్యం.. సాక్ష్యాలను తారుమారు చేసింది. చేతిపై ఉన్న పేర్లను శ్రీచైతన్య సిబ్బంది తుడిచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను జువెనైల్ కోర్టుకు తరలించారు. కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జేఎల్లు రాజేష్, ఆనంద్, కృష్ణ, మెస్ బాయ్ హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..
రంగారెడ్డి జిల్లా: చెరువు ఒడ్డున ఆడుకుంటూ అందులో జారిపడిన ఇద్దరు చిన్నారులు శవాలుగా తేలారు. సీఐ వెంకటేశ్వర్లు, స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్వాల్చెరువుతండాకు చెందిన జాటోత్ బద్రీనాథ్ (8), జాటోత్ మోహన్రామ్ (రిషీ 7), కరణ్టోత్ శోభిత్ ముగ్గురూ స్నేహితులు. వీరు ఆదివారం సాయంత్రం తండా సమీపంలోని కొత్వాల్చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు ఒడ్డుమీద ఉన్న బండరాయిపై కూర్చుని ఆడుకుంటుండగా బద్రీనాథ్, మోహన్రామ్ నీటిలో పడిపోయారు. ఇది గమనించిన శోభిత్ భయంతో ఏడుస్తూ తండాకు పరుగెత్తి, తల్లిదండ్రు లకు చెప్పాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఆదివారం అర్ధరాత్రి వరకూ ఆచూకీ దొరక లేదు. సోమవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బద్రీనాథ్ తండాలోనే మూడో తరగతి, మోహన్రామ్ ఒకటో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సబితారెడ్డి నివాళి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి చిన్నారుల మృతదేహాలకు నివాళులరి్పంచారు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చెరువు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. -
ముక్కలుగా కోసి.. చెత్తకుప్పలో వేసి
కామారెడ్డి క్రైం: ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా కోసి.. సంచిలో మూటకట్టి చెత్తకుప్పలో వేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పట్టణంలోని అశోక్నగర్ కాలనీలోని ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం వేస్తుంటారు. ఉద యం ఓ సంచిలో పురుషుడికి సంబంధించిన నడుము నుంచి కింది శరీర భాగాన్ని స్థానికులు గమనించారు. వారి సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఎక్కడో వ్యక్తిని హత్య చేసి మూటను ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరాన్ని రెండు, లేదా మూడు ముక్కలు చేసి ఓ భాగాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానిస్తు న్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆ«ధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. -
కపటనాటక సూత్రధారి
బెంగళూరు: వివాహ రిసెప్షన్కు వెళ్తున్న వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటనను చామరాజనగర్ జిల్లా కొల్లేగాళ టౌన్ పోలీసులు ఛేదించారు. వధువుతోపాటు, ఆమె ప్రియుడు దర్శన్, ఒక మైనర్ను అరెస్టు చేశారు. గోకుల్, మరో నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్.రవీశ్కు కొళ్లేగాల తాలూకాఆ హొసఅణగళ్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కొళ్లేగాల పట్టణంలోని వేంకటేశ్వర మహల్లో గతనెల 30న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వరుడు రవీశ్ తన గ్రామం నుంచి కారులో వస్తుండగా ఎంజీఎస్వీ రోడ్డు వద్ద దుండగులు అడ్డుకొని కత్తితో దాడి చేశారు. గాయపడిన రవీశ్ను ఆస్పత్రికి తరలించారు. అయితే కొన్ని రోజుల క్రితం అతనికి గుర్తు తెలియని యువకుడు ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని బెదిరించాడు. ఈ విషయంపై యువతిని ప్రశ్నించగా తాను గతంలో అతన్ని ప్రేమించిన విషయం వాస్తవమేనని, అయితే ఇప్పుడు విడిపోయామని, ఇష్టంతోనే పెళ్లికి అంగీకరించినట్లు పేర్కొంది. అయితే వరుడు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. కాగా రవీశ్పై జరిగిన దాడికి సంబంధించి కేసు దర్యాప్తును చామరాజనగర్ ఎస్పీ ముత్తురాజ్ ఒక ప్రత్యేక బందానికి అప్పగించారు. కొల్లేగల్ డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ శివమాదయ్య, కొల్లేగల్ టౌన్ ఎస్ఐ వర్షలు యువతి ప్రియుడు దర్శన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రియురాలి సూచనతోనే దాడి చేసినట్లు వెల్లడించడంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కారును స్వా«దీనం చేసుకున్నారు.సంబంధిత వార్త వరుడిపై కత్తితో దాడి.. ఆగిపోయిన పెళ్లి -
మొబైల్, ల్యాప్టాప్ల పైనే ఆశలన్నీ!
ఆమె.. ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదు.. ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యలూ లేవు. ఐటీ కంపెనీలో 15 మందికి దిశానిర్దేశం చేసే స్థాయి ఆమెది.. మరి ఎందుకు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది? అనేది సికింద్రాబాద్ రైల్వే పోలీసుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన బలవన్మరణాల మిస్టరీ క్లూ ఇంతవరకు లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి (37), ఆమె ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి∙(18), విశాల్రెడ్డి (17)లు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విజయశాంతిరెడ్డి తల్లి మొదలు ఇరువైపులా కుటుంబ సభ్యులు ఒకవైపు, ఆమె పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులు మరోవైపు.. చివరకు ఆమె పిల్లలు చదువుతున్న కళాశాలల్లోని కరస్పాండెంట్లు, క్లాస్ టీచర్లను ఇంకోవైపు.. పోలీసులు ఎవరిని విచారించినా ఒకే మాట. 'విజయశాంతిరెడ్డి స్ట్రాంగ్ విమెన్'. కారులో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె ఆత్మహత్య నిర్ణయం సొంతంగానే తీసుకున్నట్టు నిర్థారణ అవుతున్నప్పటికీ కారణం ఏంటన్న కోణంలో చేస్తున్న దర్యాప్తుకు తెరపడడం లేదు. దుబాయి నుంచి వచ్చి భార్య పిల్లల అంత్యక్రియలకు హాజరైన భర్త సురేందర్రెడ్డి కూడా అదే విషయం చెబుతున్నారు. భర్త సురేందర్రెడ్డిని మరికొన్ని ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని పోలీసులు భావించినప్పటికీ దశదిన కర్మ తరువాత మాత్రమే కలిసి వివరాలు రాబట్టాలని వారు భావిస్తున్నారు. ‘డిప్రెషన్ ’ దిశగా దర్యాప్తు ఒంటరి తనంతోనే డిప్రెషన్కులోనై ఆత్మహత్య నిర్ణయం తీసుకుంని ఉంటుందా అనే కోణంలోదర్యాప్తు చేస్తున్నా ఆధారాలు లభించడం లేదు. తన కూతురు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడిన సందర్భాలు లేవని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లేదని, మిగతా ఐదు రోజులు ఇంటి దగ్గర నుంచే పనిచేసేదని తెలిపింది. ఆమె ముఖంలో డిప్రెషన్ వంటి ఆనవాళ్లు కనిపించలేదని పేర్కొంది. సైబర్ నిపుణులపైనే ఆశ విజయశాంతిరెడ్డి (Vijayashanti Reddy) వాడిన ఫోన్,ల్యాప్టాప్ పైనే పోలీసులు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ రెండింటినీ సైబర్ క్రైం విభాగానికి పంపించారు. అందులోని వివరాలు బయటపడితే మాత్రమే కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలు ఒకటి, రెండు రోజుల్లోవచ్చే అవకాశముంది. చదవండి: పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్ -
సవతుల పోరు.. శింగనమలలో దారుణం
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. సవతుల మధ్య పోరుతో.. రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొదటి భార్య కొడుకులు పిన్ని, ఆమె కొడుకును దారుణంగా హతమార్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తరిమెల గ్రామంలో ఈ దారుణం జరిగింది. నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆస్తి విషయంలో ఇద్దరు భార్యలు చాలా కాలంగా తగాదాలు పడుతున్నారు. ఈ క్రమంలో.. మొదటి భార్య కొడుకులు రెండో భార్య అయిన యల్లమ్మ (38).. ఆమె తనయుడు చిన్నా (22) లను హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ ఘాతుకానికి పాల్పడింది సమీప బంధువులేనని పోలీసులు చెబుతున్నారు. యల్లమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి కావటం లేదని.. హుసేన్సాగర్లో దూకిన యువతి..
హైదరాబాద్: పెళ్లికాలేదనే మనస్థాపంతో ఓ యువతి హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ భైంసాకు చెందిన టి. విజయలక్ష్మి (26) తల్లి సరస్వతీతో కలిసి కూకట్పల్లిలోని మైత్రీనగర్లో నివాసం ఉంటోంది. తల్లికి మనస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కూతురు విజయలక్ష్మీ చూసుకుంటోంది. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వివాహం అనంతరం తల్లి కూడా తనతో పాటే ఉంటుందని చెబుతుండటంతో సంబంధాలు వెనక్కుపోతున్నాయి. దీంతో మనస్తాపం చెంది జనవరి 31న ఉదయం ర్యాపిడో బుక్ చేసుకుని రెండు రోజుల్లో తిరిగి వస్తానని తల్లికి చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కజిన్ బ్రదర్ ఆదివారం కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు సాయంత్రం హుస్సేన్ సాగర్లో గుర్తు తెలియని యువతి మృతదేహం తేలి ఉందని సమాచారం రావడంతో లేక్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుప్రతికి తరలించి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ ఉండటంతో విజయలక్ష్మిగా గుర్తించడంతో లేక్ పోలీసులు కేసులు కూకట్పల్లి పోలీసులకు బదిలీ చేశారు. -
కోఠి దోపిడీ యూపీ గ్యాంగ్ పనే!
సాక్షి, హైదరాబాద్: కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం చోటు చేసుకున్న దోపిడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్గా, వాళ్లు పోలీసుల దృష్టి మళ్లించి కాచిగూడ నుంచే పరారైనట్లు గుర్తించారు. నగరంలో వీరు ప్రయాణించిన మార్గా ల్లోని సెల్ టవర్ల నుంచి సేకరించిన సెల్ఫోన్ నంబర్ల డంప్లో దొరికిన రెండు నంబర్ల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లకు బయలుదేరి వెళ్లాయి. ఏటీఎం కేంద్రంలో రిన్షాద్పై కాల్పులు జరిపి, రూ.6 లక్షలు దోచుకున్న ఈ ద్వయం ఏమాత్రం భయం లేనట్లు వ్యవహరించారు.ఏ దశలోనూ తమ ముఖాలు దాచుకోవడానికి మాస్క్ లు వాడడం, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రధాన రహదారిని వదిలి గల్లీలను వినియోగించారు. యూపీ నుంచి వచ్చిన ఈ ద్వయం పహాడీషరీఫ్ సమీపంలోని షహీన్నగర్లో తలదాచుకుందని అధికారులు గుర్తించారు. అక్కడ నుంచే బయలుదేరి, ఆటోలో వచ్చి, కోఠిలో నేరం చేసిన వీరు బాధితుడి ద్విచక్ర వాహనంపై కాచిగూడ వెళ్లారు. అక్కడ నుంచి ఆటోల్లో షహీన్నగర్కు వెళ్లారు. అక్కడ కాసే పు ఉండి...మళ్లీ కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకొని ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.దాదాపు 880 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను అధ్యయనం చేసిన ప్రత్యేక బృందాలు ఈ అంశాలు నిర్ధారించాయి. మరోపక్క షహీన్నగర్ ప్రాంతంలో ఢిల్లీ, యూపీలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉండటంతో నిందితులకు తేలిగ్గా షెల్టర్ దొరికిందని భావిస్తున్నారు. ఏ ఇంట్లో బస చేశారన్నది గుర్తించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. నగరం మొత్తం ఆటోల్లో ప్రయాణించిన వీరు ఎక్కడా ఆటో బుకింగ్, నగదు చెల్లింపు కోసం యాప్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.నేరగాళ్లు తిరిగిన మార్గాల్లోని సెల్ టవర్ కేంద్రంగా ఆయా సమయాల్లో పని చేసిన ఫోన్ నంబర్ల వివరాలను పోలీసులు సేకరించారు. షహీన్నగర్–కోఠి–కాచిగూడ–షహీన్నగర్–కాచిగూడ మార్గాల్లోని టవర్లలో ఒకే సమయంలో పని చేసిన కామన్ నంబర్లను గుర్తించారు. ఇలా నిందితులు వినియోగించిన రెండు సెల్ఫోన్ నెంబర్లు అధికారులకు తెలిశాయి. వీటి ఆధారంగా విశ్లేషించిన టాస్క్ఫోర్స్ నిందితులు పాత నేరగాళ్లని, ఉత్తరప్రదేశ్కు చెందిన వారని తేల్చినట్లు సమాచారం. -
కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం
మంచిర్యాల క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ శాఖకు మచ్చతెచ్చాడు. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదాడు. మంచిర్యాల రెడ్డికాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై వీడియో సోమవారం వైరల్గా మారింది. స్థానిక పోలీసు స్టేషన్లోని కానిస్టేబుల్ రవిప్రసాద్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. నాలుగు గోడల నడుమ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా అర్ధరాత్రి రోడ్డుపైకి చేరింది. అర్ధనగ్నంగా ఉన్న అతడు భార్యతోపాటు కూతురిని కూడా రోడ్డుపై చితకబాదాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న పోలీసు శాఖలోని వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడటం, కట్టుకున్న భార్యపై కాఠిన్యాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. రవిప్రసాద్ కానిస్టేబుల్గా పని చేస్తుండగా.. ఆయన భార్య పోలీసుశాఖలోని మరో విభాగంలో సూపరింటెండెంట్గా పని చేస్తోంది. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసు.. భార్యను రోడ్డుపైకీడ్చిన దాష్టికాన్ని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ ప్రమోద్రావును సంప్రదించగా విషయం తెలిసిందని, కుటుంబ సమస్య అయినందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని వెల్లడించారు. -
రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దీంతో, బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల మేరకు.. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం సాయంత్రం రెండు పల్సర్ బైక్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రాజమండ్రి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోఠి చోరీ కేసు.. ఎట్టకేలకు దొంగల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గన్ ఫైర్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు ఇద్దరు నిందితుల్ని గుర్తించగలిగారు. వాళ్లను ట్రేస్ చేసి పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శనివారం ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి దుండగులు క్యాష్ బ్యాగుతో పారిపోయారు. బుల్లెట్ గాయమైన బాధితుడ్ని సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.6 లక్షల చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును ఐదు బృందాలను నియమించారు. అయితే.. బాధితుడి స్కూటీపైనే పారిపోయిన నిందితులు.. కాచిగూడ దగ్గర ఆ బండి వదిలేసి పారిపోయారు. ఈ క్రమంలో.. 800కు పైగా సీసీకెమెరాలను పరిశీలించిన ప్రత్యేక బృందాలు వాళ్ల ఆచూకీని కనిపెట్టగలిగాయి. నిందితుల్లో ఒకడ్ని పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు.. సెల్ఫోన్ పవర్ డంపింగ్ ద్వారా వాళ్ల మొబైల్ నెంబర్లు సేకరించగలిగారు. ఆ నెంబర్ల ద్వారా వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు. ఫోన్ డంప్.. డిజిటల్ ఫోరెన్సిక్స్లో ఉపయోగించే ప్రక్రియ. ఇందులో ఒక మొబైల్ ఫోన్లోని మొత్తం డేటా (కాంటాక్ట్స్, మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, యాప్ సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ డేటా) బయటకు తీసి విశ్లేషిస్తారు. ముఖ్యంగా పోలీస్ విచారణలు, క్రిమినల్ కేసులు, సివిల్ లిటిగేషన్, లేదా కార్పొరేట్ దర్యాప్తుల్లో ఆధారాలు సేకరించడానికి ఉపయోగపడుతుంది. -
బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!
అసలే బంగారం ధరలు కొండెక్కి కూచున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. తనకిష్టమైన మెమోల కోసం లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేశాడో టీనేజర్. చివరికి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ కర్ఖానా పోలీస్ పరిధిలోని ఒక గ్రామంలో 14 ఏళ్ల కుమారుడి నిర్వాకాన్ని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వారణాసికి చెందిన పూజారి విమ్లేష్ మిశ్రా దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు ప్రకారం కొడుకు అమాయకత్వాన్ని వాడుకుని స్థానిక మోమోల దుకాణాల యజమానులు సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని దోచేశారు.ఇంట్లో అడిగితే డబ్బులు ఇవ్వరనుకున్నాడో ఏమోగానీ, ఏడవ తరగతి విద్యార్థి ఒక రోజుబీరువాలోని నగ తీసుకెళ్లి, దుకాణదారులకిచ్చి కావాలను కున్నప్పుడల్లా చెక్కగా మోమోలను లాగించేవాడు.ఈ చోరీనిఇంట్లో వాళ్లు కూడా గుర్తించక పోవడంతో దాన్నే అలవాటుగా మార్చుకున్నాడు. అటు దుకాణాదారులు కూడా పిల్లవాణ్ని వారించడంగానీ, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంగానీ చేయలేదు. పైగా ఆభరణాలు తెస్తేనే మెమోలు ఇస్తామని బాలుడు బెదిరించినట్టు సమాచారం.ఎలా బైట పడిందంటేబాలుడి అత్త పుట్టింటికి వచ్చి, తన నగలకోసం ఆరా తీయడంతో, బీరువాలో నగలు మాయమయ్యాయన్న సంగతిని గమనించారు. అనుమానం వచ్చిన బాలుడిని విచారించగా, ఆభరణాలను మోమోలు అమ్మేవారికి ఇచ్చేసినట్లు బాలుడు తన చేసిన పని గురించి చెప్పుకొచ్చాడు. బాలుడి అత్త తన ఆభరణాలను తీసుకోవ డానికి పుట్టింటికి వచ్చినప్పుడు నిజం బయటపడింది. కనిపించకుండా పోయిన ఆభరణాల ప్రస్తుత విలువ రూ. 85 లక్షలు దాకా ఉంటుందని దిగ్భ్రాంతికి గురైన విమ్లేష్ మిశ్రా, ముగ్గురు దుకాణ యజమానుల పేర్లను పేర్కొంటూ లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేశారు.దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ధృవీకరించారు. వివరాలను ధృవీకరించి, నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. అధికారులు ఇప్పుడు నిందితులైన విక్రేతలను గుర్తించి సబంధిత ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఎంత బంగారం పోయింది? దాని విలువ ఎంత అనే వివరాలను కూపీ లాగుతున్నారు.ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా? -
కాళ్లు నరికి ఇంట్లో పూడ్చేశాడు
సాక్షి,బెంగళూరు: బతుకుతెరువు కోసం చిత్రదుర్గ జిల్లా నుంచి విజయనగర జిల్లాకు వచ్చి కొట్టూరులో స్థిరపడిన భీమరాజ్ కుటుంబాన్ని కన్న కొడుకే కాలయముడై హత్య చేశాడు. కొట్టూరు పట్టణంలో తల్లిదండ్రులు భీమరాజ్ (50), (45) సోదరి అమృత (17) కాళ్లు నరికేసి, ఇంట్లో పాతిపెట్టినట్లు అక్షయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆదివారం ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కర్కోటక తనయుడు అక్షయ్ కుమార్ పోలీసుల విచారణలో పలు విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈ హత్యలు పరువు కోసమా లేదా డబ్బు కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది.చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మి, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృతతో కలిసి కొట్టూరులో నివసిస్తున్నారు. అమృత ఓ యువకుడితో ప్రేమలో పడి గర్భవతి అయినట్లు తెలిసింది. ఈ విషయమై కుమారుడు అక్షయ్.. తల్లిదండ్రులు, చెల్లి అమృతతో గొడవ పడ్డాడు. అమృతకు అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని ఈ హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో అక్షయ్ నోరు విప్పినట్లు తెలుస్తోంది. డబ్బు కోసమేనా? అయితే ఇది పరువు హత్య కాదని.. డబ్బు కోసమే తల్లిదండ్రులు, సోదరిని అక్షయ్ కుమార్ హత్య చేసి ఉంటాడనే మరో కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇటీవల భీమరాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలని అక్షయ్ పట్టుబట్టాడు. అయితే చెల్లి పెళ్లికి డబ్బు అవసరం అవుతుందని కొడుకుకు నచ్చజెప్పాడు. డబ్బు ఇవ్వలేదని కక్ష పెంచుకున్న అక్షయ్.. జనవరి 26వ తేదీన ముందుగా తల్లి, సోదరిని హత్య చేశాడు.ఆ తర్వాత తండ్రిని హతమార్చాడు. బాడుగ ఇంట్లో గుంత తవ్వి ముగ్గురిని ఒకే గుంతలో పాతిపెట్టే క్రమంలో తండ్రి కాళ్లు పొడవు ఉండటంతో రెండు కాళ్ల నరికి పక్కన పడేశాడు. మృతదేహాలను గుంతలో ఒకటిపై ఒకటి వేసి పూడ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా టైల్స్తో కప్పేశాడు. అనంతరం బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లీదండ్రులు, సోదరి కనబడటం లేదని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి
తూర్పు గోదావరి జిల్లా: వైద్య విద్య పూర్తయ్యింది.. మరో వారం రోజుల్లో ఇంటికి వస్తానన్న కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల్లో విషాదం నిండింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23) రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెంటిస్ట్గా బీడీఎస్ పూర్తి చేసింది. ఐదేళ్ల కోర్సు పూర్తి కావడంతో ఈ నెల 7న ఇంటికి వచ్చేస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై దివాన్చెరువులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. స్థానిక జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో ఇంటర్న్షిప్ చేస్తున్న లిఖిత తనతో పాటే ఇంటర్న్షిప్ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన వట్టూరి వాత్సల్యసాయి, తునికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్ చదువుతున్న కిశోర్తో కలసి, అతని కారులో శనివారం రాత్రి స్నేహితుల పుట్టినరోజు వేడుకలకు రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని అటుగా ప్రయాణిస్తున్న వారు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయ్యింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బొమ్మూరు ఎస్సై తెలిపారు. శోకసంద్రంలో చాగల్లు లిఖిత మృతితో చాగల్లులో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్య విద్య పూర్తి చేసి దంత వైద్యురాలుగా సేవలందించాలనే తల్లిదండ్రుల కోటి ఆశలు తీరకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి చాగల్లులో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. లిఖిత మృతదేహం వద్ద తహసీల్దార్ ఎం.మెరికమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.ఆశారోహిణి, ఏఎంసీ చైర్మన్ నాదేండ్ల శ్రీరామ్, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు. -
ఉరేసుకునేందుకు భార్య యత్నం.. స్టూల్ తన్నేసిన భర్త
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తను బెదిరించి భార్య స్టూలెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించంది. మద్యం మత్తులో ఉన్న భర్త స్టూలును కాలితో తన్నడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిలింనగర్కు చెందిన కొండల్ కూలీగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం అరుణతో వివాహం అయింది. అరుణ ఓ మెడికల్ షాపులో పనిచేస్తోంది. కాగా, కొండల్ రోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడే విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కొండల్ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అరుణ ఆత్మహత్య చేసుకుంటానంటూ స్టూల్ వేసుకొని సీలింగ్ ఫ్యాన్కు చున్నీ బిగించింది. భర్తను బెదిరిద్దామని స్టూలు వేసుకొని ఉరి పె ట్టుకోగా మద్యం మత్తులో ఉన్న కొండల్ స్టూల్ను తన్నాడు. దీంతో అరుణ ఊపిరి ఆడక మరణించింది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రశ్నించగా అరుణ ఆత్మహత్య చేసుకుందని కొండల్ చె ప్పా డు. అయితే మృతురాలి కుమారుడు తన తండ్రి స్టూల్ త న్నడం వల్లనే తల్లి మరణించిందని చెప్పడంతో పోలీసులు కొండల్ను అదుపులోకి ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు పదార్థాలిచ్చి బాలికపై అఘాయిత్యం
కోవూరు: గంజాయి మత్తులో ఇద్దరు బాలురు ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. విచక్షణ మరిచి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని కొత్తకాలనీలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కోవూరుకు చెందిన మైనార్టీ బాలిక(12)పై అదే కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు కన్నేశారు.శుక్రవారం గంజాయి మత్తులో ఉన్న వీరు బాలిక దుకాణానికి వెళ్లొస్తుండగా మాటేసి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళారు. అప్పటికే వైట్నర్ను కలిపి సిద్ధం చేసిన నీటిని తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే మృగాల్లా మారి లైంగిక దాడి చేశారు. మత్తు దిగిన తర్వాత బాధిత బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని, తల్లిదండ్రులకు తనపై జరిగిన అమానుషాన్ని వివరించింది. పోలీసులకు సమాచారం అందించడంతో బాలికను నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!
బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం ఏం జరిగిందంటే..మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్లను ఇంటికి పిలిచింది.కాళ్లు, చేతులు కదలకుండా..వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్తో కిటికీ గ్రిల్కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది. -
ఘోరం: మంచంపైన అవ్వ, బాక్స్లో బాలుడి..!
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పదమూడేళ్ల బాలుడి హత్య కలకలం రేపింది. నిందితుడు ఆ బాలుడిని నైలాన్ తాడుతో ఎనిమిది సార్లు ఉరి బిగించి.. ముఖంపై ఇటుకతో దాడి చేసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం బాక్స్లో దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను అదే మంచంపై పడుకోబెట్టాడు.పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆ బాలుడు ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆధారాలు దొరకకుండా.. మృతదేహాన్ని నాలుగో అంతస్తులోని ఫ్లాట్కు తరలించి అక్కడ ఒక మంచం(బెడ్ బాక్స్)లో దాచాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడు అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం సోదాలు నిర్వహించగా.. సమీపంలోని భవనంపై బాలుడి జాకెట్, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించగా.. బాలుడు ఆ భవనంలోకి వెళ్లడం రికార్డయ్యింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రెహాన్ పోలీసులనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. గాలింపు సమయంలో నిందితుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. పోలీసుల వెంటే తిరిగాడు. అయితే, అతని చేతులు, మెడపై ఉన్న గీతలను చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పోలీసులు ప్రశ్నించగా.. పని చేసే చోట గాయాలయ్యాలంటూ బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు గత నాలుగు నెలలుగా పనికి వెళ్లడం లేదని తేలింది. చివరికి రెహాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. బెడ్ బాక్స్లో బామ్మ పడుకున్న మంచం కిందే మృతదేహం ఉందని చెప్పాడు. పోలీసులు ఆ వృద్ధురాలిని పక్కకు జరిపి మంచం తెరవగా, దుప్పటిలో చుట్టిన బాలుడి మృతదేహాం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ.. అప్డేట్స్కాసేపట్లో ఎర్రవెల్లి తన నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ బయల్దేరాక మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్,హరీష్ రావుబీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభివాదంవిచారణ అనంతరం బయటకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసిన కేసీఆర్కేసీఆర్ నందినగర్ వివాసానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులునందినగర్కు బీఆర్ఎస్ నేతలుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను నందినగర్కు పిలిచిన కేటీఆర్తెలంగాణ భవన్ నుంచి నందినగర్కు బీఆర్ఎస్ నేతలుపార్టీ నేతలతో కేసీఆర్ సమావేశంసిట్ విచారణ పరిణామాలను పార్టీ నేతలతో వివరించనున్న కేసీఆర్ నంది నగర్లో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణనాలుగు గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణఆధారాలను ముందు పెట్టి కేసీఆర్ను ప్రశ్నించిన సిట్ బృందంగతంలో విచారణకు హాజరైన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నించిన అధికారులుకేసీఆర్ స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసిన సిట్ బృందంకేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంనందినగర్ కేసీఆర్ ఇంట్లో కొనసాగుతున్న సిట్ విచారణ మూడుగంటలకు పైగా కేసీఆర్ను విచారిస్తున్న సిట్ సభ్యులు కేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంతెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తతప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన తెలంగాణ భవన్కు భారీగా తరలి వచ్చిన శ్రేణులునందినగర్కు అనుమతి లేదన్న పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులురోడ్డుపై బైటాయించిన బీఆర్ఎస్ శ్రేణులునందినగర్ కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు యత్నంకేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణంతెలంగాణ భవన్ నుంచి నందినగర్ వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలుఅనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులుపోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటతోపులాటలో క్రింద పడిపోయిన మహిళసీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలునందినగర్ కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తతఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నంబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసనపలువురు బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టునందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నిస్తున్న సిట్ బృందంసిట్ బృందంలో రీతిరాజ్, విజయ్కుమార్, అరవింద్కుమార్, నారాయణరెడ్డి, కేఎస్ రావు హరీష్రావుతో పాటు అందరినీ బయటకు పంపించేసిన అధికారులుకేసీఆర్ న్యాయవాదులకు అనుమతి నిరాకరణనంది నగర్ కేసీఆర్ నివాసం పై డ్రోన్ కలకలంకొనసాగుతున్న కేసీఆర్ సిట్ విచారణనందినగర్ నివాసం పై డ్రోన్ కలకలంఅప్రమత్తమైన పోలీసులు నంది నగర్ కేసీఆర్ నివాసంలో ప్రారంభమైన సిట్ విచారణ.రెండో అంతస్తులో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న నలుగురు అధికారుల బృందం.మొత్తం విచారణలో పాల్గొన్న 15 మంది అధికారులు.కేసీఆర్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న సిట్ బృందంసిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావున్యాయ సహాయం కోసం అందుబాటులో రామచంద్రరావుకుటుంబ సభ్యుడిగా ఇంట్లోనే మరో ఫ్లోర్ లో ఉండనున్న కేటీఆర్విచారణ తర్వాత నందినగర్ నివాసంలో పార్టీ ముఖ్యనేతలను కేసీఆర్ కలిసే అవకాశంవిచారణ ముగిశాక నందినగర్ కు తరలివెళ్ళనున్న బీఆర్ఎస్ క్యాడర్బాల్కానీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అబివాదం చేసే అవకాశం?ట్రంక్ పెట్టెలు,డాక్యుమెంట్స్ కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ బృందంసిట్ బృందంలో నారాయణ రెడ్డి, రవీందర్.సిట్ అధికారులతో పాటు మరో ఐదుగురు సీఐ స్థాయి అధికారులు.రెండు ట్రంక్ పెట్టెలు, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన సిట్ బృందంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు కేసీఆర్ ఇంటిలోని రెండో అంతస్తు గదిలో విచారణ విచారణ గదిని పరిశీలించిన అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావువిచారణ దృష్ట్యా కేసీఆర్ నందినగర్ నివాసంలో మూడంచెల భద్రతవిచారణ గదిలోకి లాయర్ల అనుమతి నిరాకరించిన సిట్ బృందం కేసీఆర్ ఒక్కరినే విచారణ చేయనున్న అధికారులు డీఐజీ విజయ్ కుమార్ ఆధ్వరంలో నలుగురు అధికారులు బృందం విజయ్ కుమార్, వేంకటగిరి,కేఎస్ రావు, శ్రీధర్ అధికారుల బృందం మూడు గంటలకు ప్రారంభం కానున్న విచారణ కేసీఆర్ వెంట డాక్యుమెంట్స్..నందినగర్ నివాసం వద్ద కేసీఆర్ని రిసీవ్ చేసుకున్న కేటీఆర్.ఫామ్ హౌస్ నుంచి ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన కేసీఆర్.సిట్ అడిగే ప్రశ్నలను నోట్ చేసుకోనున్న కేసీఆర్.నంది నగర్ ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.కేసీఆర్ నివాసానికి చేరుకున్న విచారణ యంత్ర సామాగ్రి.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నించనున్న సిట్.మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ విచారణ ప్రారంభం.కేసీఆర్ను ప్రశ్నించే సిట్ టీం ఇదేఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నించనున్న సిట్మధ్యాహ్నాం 3గం. ప్రారంభం కానున్న విచారణనందినగర్లోని నివాసం వద్ద భారీ బందోబస్తునాలుగు అంచెల పోలీస్ వ్యవస్థ.. వందల మంది పోలీసుల కాపలాఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ఇంతకు ముందు విచారణలో క్రియాశీలకంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి.. ఇవాళ్టి విచారణకు మాత్రం దూరం!కేసీఆర్ను విచారించే టీంలో.. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావులువిచారణ గదిని క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు ఎస్పీ కేఎస్ రావుఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా.. ఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతల విచారణబీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, చిరుమర్తి లింగయ్యల విచారణకల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. బీఆర్ఎస్ కీలక నేతలు.. మాజీ మంత్రులు హరీష్రావు, కేటీఆర్లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావుల విచారణఇప్పుడు కేసీఆర్ విచారణనందినగర్ చేరుకున్న కేసీఆర్..కేసీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు.మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ను విచారించనున్న సిట్. విచారణను వీడియో తీయనున్న పోలీసులు. కేసీఆర్ ఇంటికి సిట్.. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ బృందం, పోలీసులు. నందినగర్ కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో విచారించనున్న సిట్.కేసీఆర్ ఇంట్లో విచారణ గదిని పరిశీలిస్తున్న పోలీసులు.కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం.నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరణ.కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్, సంతోష్కు మాత్రమే అనుమతి.విచారణను వీడియో రికార్డు చేయనున్న అధికారులు.ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ బృందం.పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు. భారీగా ట్రాఫిక్ జామ్.. రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్.గజ్వేల్ నుండి వంటి మామిడి వరకు భారీ ట్రాఫిక్.వంటి మామిడి దగ్గర కేసీఆర్ కాన్వాయ్కు మాత్రమే అనుమతి.మిగతా వాహనాలను నిలిపివేసిన పోలీసులు.తుర్కపల్లి దాటిన కేసీఆర్ కాన్వాయ్.కాసేపట్లో నందినగర్ చేరుకోనున్న కేసీఆర్పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు.కేసీఆర్ నివాసానికి వెళ్లే వీధులన్నీ మూసివేసిన పోలీసులు.నందినగర్ వద్ద నాలుగు అంచెల పోలీసు భద్రత. నందినగర్ నివాసంలో ఉన్న హరీష్ రావు. రోడ్లన్నీ గులాబీమయం..ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్కు బయలు దేరిన కేసీఆర్.కేసీఆర్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ అభిమానులు. రోడ్డు మార్గంలో అభిమానులకు అభివాదం చేసిన కేసీఆర్.వందలాది వాహనాల్లో కేసీఆర్ వెంట నందినగర్కు వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..ఖమ్మం జిల్లా..మాజీ సీఎం కేసీఆర్కు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై నిరసనలు.ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..అజయ్ కుమార్ కామెంట్స్...ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధండైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసీఆర్కు నోటీసులు..ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్కి ఏం సంబంధం?గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టి ఏం చేశారు?.ఇది మరొక ఫేక్ కేసు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు..ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్. కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పుకాస్త ఆలస్యంగా నందినగర్ నివాసానికి కేసీఆర్మరికాసేపట్లో బయల్దేరనున్న బీఆర్ఎస్ అధినేత12.30కి నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశంబీఆర్ఎస్ నేతల భేటీ వాయిదా పడే చాన్స్?నేరుగా సిట్ విచారణకే హాజరు కానున్న గులాబీ బీస్??తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కేసీఆర్ సిట్ విచారణ వేళ.. తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్లు పంపిన ఇంటెలిజెన్స్బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాలుముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారుల ఆదేశాలువిచారణ పూర్తయ్యే దాకా అప్రమత్తంగా ఉండాలని సూచనఎక్కడికక్కడే అప్రమత్తమైన పోలీసులురాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎక్కడికక్కడే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుఇప్పటికే విచారణ జరిగే నందినగర్ నివాస ప్రాంతంలో 1,000 మంది దాకా పోలీసుల మోహరింపుతెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ నేతలను ఎక్కడిక్కడే హౌజ్ అరెస్ట్ చేసే అవకాశంఎర్రవల్లి గ్రామస్తుల వెరైటీ నిరసనఎర్రవల్లి కేసీఆర్ ఫామ్హౌజ్ వద్ద వినూత్న నిరసనసీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలుకేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆగ్రహంకేసీఆర్ ఫొటోకు దిష్టి తీసిన ఎర్రవల్లి గ్రామస్తులుఫాంహౌజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులురాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుతెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలుకేసీఆర్కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నిరసనలుబైక్ ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేస్తున్న కేడర్ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులుకేసీఆర్ సిట్ విచారణ టైంలో.. తెలంగాణ భవన్లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలంతాతెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ వేళ.. నగరంలో ఉద్రిక్త వాతావరణంతెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులుతెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ ఆంక్షలుభవన్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు11 గంటల నుంచి తెలంగాణ భవన్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలునందినగర్లో.. 800 మంది పోలీసులునందినగర్ ఏరియాలో భారీగా పోలీసుల ఆంక్షలుకేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాస పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపునందినగర్ బస్టాప్, బసవతారకం, స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ మార్గాల్లో డైవర్షన్లు.. భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల కంట్రోల్కు బారికేడ్లు సైతం ఏర్పాటుమరికాసేపట్లో నందినగర్ నివాసానికి రానున్న కేసీఆర్నందినగర్ నివాస పరిసరాల్లో.. ఐదు అంచల భద్రతసుమారు 800 మంది పోలీసుల మోహరింపుమధ్యాహ్నాం విచారణకు రానున్న సిట్ అధికారులుHeavy police deployment was seen near KCR’s residence in Nandi Nagar as the former chief minister prepares to appear before the SIT. The state police have been placed on high alert as a precautionary measure.#KCR #NandiNagar #Telangana #TelanganaPolitics #SITInquiry… pic.twitter.com/3lQzn6fr1g— Hyderabad Mail (@Hyderabad_Mail) February 1, 2026మరికాసేపట్లో నందినగర్ నివాసానికి కేసీఆర్ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి హైదరాబాద్లోని నందినగర్కు నివాసానికి పాముల పర్తి, గౌరారం, ములుగు, వంటి మామిడి, షామీర్ పేట, జేబీఎస్ మీదుగా చేరుకోనున్న బీఆర్ఎస్ అధినేత ఫామ్హౌజ్లో విచారించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిట్నగర పరిధిలోనే విచారణ సాధ్యమని పేర్కొంటూ.. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ఆధారంగా నందినగర్ నివాసానికి నోటీసులునందినగర్ నివాసంలో కీలక భేటీ నందినగర్లోని నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీసిట్ విచారణ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యతమరికాసేపట్లో నివాసానికి చేరుకోనున్న కేసీఆర్రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్న హరీష్ రావుకేటీఆర్తో పాటు మరికొందరు కీలక నేలలతో కాసేపు చర్చించనున్న కేసీఆర్ఇటు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో పాటు నగర శివారు ముఖ్య నేతలకు గులాబీ బాస్ ఆదేశంకేసీఆర్ విచారణకు నిరసనగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన ర్యాలీలు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ నేపథ్యంలో నిర్ణయంఎక్కడిక్కకడ శాంతియుత నిరసనలు చేయాలని కీలక నేతల పిలుపు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధానికి బీఆర్ఎస్ శ్రేణుల ప్రయత్నాలుఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామంఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణఇప్పటిదాకా పోలీస్ అధికారులు, కేసీఆర్ పేషీ అధికారులు, బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించిన సిట్వాళ్ల నుంచి వాంగ్మూలాల సేకరణఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశామన్న పోలీస్ ఉన్నతాధికారులువాళ్ల వాంగ్మూలాలను ముందుంచి కేసీఆర్ను విచారించే అవకాశంట్యాపింగ్ కేసులో సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కేసీఆర్కు నోటీసులుసాక్షిగానే కేసీఆర్ను విచారించనున్న సిట్ మధ్యాహ్నాం 3గం.ల నుంచి కేసీఆర్ను విచారించనున్న సిట్ అధికారులుకేసీఆర్ను ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్ పీఎస్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం -
ముంబయిలో కలకలం.. స్టార్ డైరెక్టర్ ఇంటిపై కాల్పులు.!
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే బైక్పై పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల భారీ భద్రతను మోహరించారు. ముంబయి పోలీసు కమిషనర్ దేవన్ భారతి ఈ సంఘటనను ధృవీకరించారు. అయితే రోహిత్ శెట్టి కుటుంబం ఈ సంఘటనపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.సినిమా కెరీర్..కాగా.. రోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు. -
అన్న మరణవార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి
వరంగల్ జిల్లా: తోడబుట్టిన అన్న మరణించాడనే వార్త విన్న చెల్లెలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్)లో శనివారం జరిగింది. ధర్మారం గ్రామానికి చెందిన గట్టికొప్పుల లక్ష్మి (35)–వీరేశం దంపతులకు కుమారుడు సిద్ధార్థ, కూతురు సిరి ఉన్నారు. వారు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి వనదేవతలకు మొక్కులు చెల్లించి ఉదయం ఇంటికి తిరిగొచ్చారు. లక్ష్మి అన్న ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వడ్డేపల్లి వెంకటేశ్వర్లు (52) ఉదయం 9 గంటలకు అనారోగ్యంతో మృతి చెందాడని అతడి కుమారుడు ఉదయం 11 గంటలకు ఫోన్ చేశాడు. లక్ష్మి భర్త వీరేశం ఫోన్ తీసుకుని మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఆమె అది విని అక్కడే గుండెపోటు వచ్చి కింద కూలిపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.కాపీ కొడుతూ చిక్కిన బీటెక్ విద్యార్థి జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రీన్ ఇండ్రస్టియల్ పార్కులోని ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలోని సల్యేంద్రనాగ సైమా కాలనీకి చెందిన రౌనాక్రాజ్ (20) ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో జరిగిన సెమిస్టర్ పరీక్షలో కాపీ కొడుతూ ఇని్వజిలేటర్కు పట్టుబడ్డాడు. దీంతో ఆయన జవాబుపత్రాన్ని స్వా«దీనం చేసుకొని రౌనాక్రాజ్ను పరీక్ష కేంద్రం నుంచి బయటికి పంపించాడు. దీన్ని అవమానంగా భావించిన విద్యార్థి క్యాంపస్లోని çహాస్టల్ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ కమలాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఘోస్ట్ ఎంట్రీ!
సుశిక్షితులైన వేలాది మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ చేసిన ప్రసంగం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఉగ్రవాది కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో అరెస్టు అయ్యాడు. ఇతడిని విడిపించడానికే ‘కాందహార్ హైజాక్’గా పిలిచే ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్ జరిగింది. అజహర్ జైల్లో ఉండగా ఏర్పడిన పరిచయాలతోనే కోల్కతాలో ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్ జరిగింది. బర్మన్ను విడుదల చేయడానికి డిమాండ్ చేసిన రూ.3 కోట్లు హైదరాబాద్ నుంచే చేతులు మారాయి. ఈ మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడుల కోసం వినియోగించారు. బర్మన్ కిడ్నాప్లో పాల్గొన్న ముఠా నుంచే కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పుట్టింది. గోకుల్చాట్– లుంబినీ లేజేరియంల్లో 2007, దిల్సుఖ్నగర్లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ల్లో 2013ల్లో జరిగిన విధ్వంసాలకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థే. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ మూలం– అజహర్ మసూద్ భారత్ రావడం, తిరిగి వెళ్లడమే!పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న బహవల్పూర్కు చెందిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుమారుడు. పాఠశాల విద్యను ఎనిమిదో తరగతిలోనే వదిలేసిన ఇతగాడు కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియాలో చేరాడు. 1989లో ఆలీమ్గా పట్టభద్రుడై ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా మారాడు. పాకిస్తాన్కు చెందిన జిహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీ అప్పట్లో అఫ్గానిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో జిహాదీ శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇలాంటి ఓ శిబిరంలో చేరిన మసూద్ ఆ శిక్షణ పూర్తి కాకుండానే సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ చేరిన అజర్ హర్కత్లో యువత చేరేలా ప్రేరేపించే విభాగాన్ని పర్యవేక్షించాడు. ఆపై పాకిస్తాన్కే చెందిన ఉగ్రవాది ఫజల్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేసిన హర్కత్ ఉల్ ముజాహిదీన్లో (హెచ్యూఎం) చేరాడు. ఇక్కడే అజర్ భారత్లోకి రావడానికి మార్గం ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–అన్సార్లో విభేదాలు ఏర్పడతాయి. దీంతో ఇది హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్–ముజాహిదీన్ అనే రెండు గ్రూపులుగా మారింది. వీరి మధ్య స్పర్థలు 1993లో తారస్థాయికి చేరాయి. ఫలితంగా కశ్మీర్లో తన ఆపరేషన్స్ కుంటుపడ్డాయని హర్కత్ ఉల్ అన్సార్ భావించి, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను అజర్కు అప్పగించింది. దీంతో 1994లో పోర్చుగీస్ పాస్పోర్టు తీసుకున్న అజర్, నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్, అయోధ్య సహా అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు కశ్మీర్ చేరుకుని రెండు గ్రూపుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చాడు. అత్యంత కీలక ఉగ్రవాది అయిన అజర్కు హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ కశ్మీర్లో ఓ గన్మెన్ను కేటాయించింది. అజర్ అదే ఏడాది ఫిబ్రవరి 11న ఓ కారులో హెచ్యూఎం చీఫ్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ, తన గన్మ్యాన్తో కలిసి కారులో ప్రయాణిస్తుంటే, అనంత్నాగ్లోని కనాబాల్ చౌక్ వద్ద కారు పాడయింది. దీంతో అక్కడ నుంచి వీళ్లు ఆటోలో బయలుదేరారు. ఆటో అక్కడి కప్రాన్ అటవీ ప్రాంతం వద్దకు చేరుకునే సమయానికి జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ అది నిత్యం జరిగేదే అయినా, హడావుడి చూసి భయపడిన అజర్ గన్మ్యాన్ తుపాకీతో కాలుస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆర్మీ అప్రమత్తమై అతడితో పాటు అజర్, సజ్జద్లను అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ తరలించి విచారణ ప్రారంభించింది. తొలుత వీరితో పాటు స్థానిక పోలీసులూ అజర్ను సాధారణ వేర్పాటువాదిగా భావించారు. కొందరు అనుమానితులు పట్టుబడిన విషయం శ్రీనగర్ చేరుకునే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) టీమ్ చేపట్టిన విచారణలోనే అజర్ పూర్వాపరాలు బయటకు వచ్చాయి. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కొన్నాళ్లు జమ్మూలోని కోట్ భల్వాల్ జైలులో ఉంచి, తర్వాత ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అజర్ను విడిపించడం హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ ఇల్యాస్ కశ్మీరీ, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్లను రంగంలోకి దింపింది. ఈ ద్వయం 1994లోనే ‘ఆపరేషన్ అల్–హదీద్’ పేరుతో ప్రత్యేక ఉగ్రవాద చర్య చేపట్టింది. ఢిల్లీలో ఇద్దరు గైడ్స్తో పాటు నలుగురు విదేశీ పర్యాటకులను అపహరించి, నిర్బంధించింది. వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మసూద్ అజర్ సహా మరికొందరు ఉగ్రవాదుల్ని వదలాలంటూ షరతు విధించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు వీరి స్థావరంపై దాడి చేశాయి. ఫలితంగా ఒమర్ సయీద్ షేక్ గాయపడి చిక్కగా, ఇల్యాస్ కశ్మీరీ తప్పించుకుని పారిపోయాడు. బందీలుగా ఉన్న టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఒమర్ సయీద్ షేక్ని కూడా తీహార్ జైలుకు తరలించింది. (తీహార్ జైలు నుంచే మరో కథ మొదలైంది. అక్కడే తరచు కలుసుకున్న అజర్, ఒమర్ సయీద్ షేక్ సాధారణ కొందరు నేరగాళ్లను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీళ్లే ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన ‘పార్ట్–2 ‘జైల్ టు జీహాద్’ వచ్చే వారం) -
ఒకరినొకరు హత్తుకొని.. రైలుకు ఎదురెళ్లి..
సికింద్రాబాద్/బోడుప్పల్: కన్న తల్లి, కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు సహా ఒకరినొకరు హత్తుకుని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. శనివారం తెల్లవారు జామున చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తల్లి, ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వెనుకగల కారణాలు ఇంకా తెలియరాలేదు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ బి.సాయీశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.... బోడుప్పల్ సమీపంలోని చెంగిచర్ల హరితవనం కాలనీలో పిన్నింటి సురేందర్ రెడ్డి కుటుంబం ఎనిమిదేళ్లుగా నివసిస్తోంది. సురేందర్ రెడ్డి దుబాయిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఉంటున్న ఆయన ఏటా రెండు మూడు సార్లు భార్యా పిల్లల వద్దకు వచ్చి వెళ్తుంటాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లికి చెందిన సురేందర్ రెడ్డి బోడుప్పల్ హరితవనంలో సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో నివసిస్తున్న తన భార్య పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి (38) హైటెక్ సిటీలోని ఒక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రూప్ లీడర్గా ఉద్యోగం చేస్తోంది. కుమార్తె చైతన్య రెడ్డి(18) పటాన్ చెరులోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు విశాల్ రెడ్డి(17) అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరూ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇంట్లో పూజలు నిర్వహించి...భర్త దుబాయ్లో, పిల్లలు హాస్టల్లో ఉంటుండగా హరితవనంలోని సొంత ఇంటి మొదటి అంతస్తులో సురేందర్ రెడ్డి తల్లితో కలిసి విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) నివాసం ఉంటున్నారు. తన కుమార్తె చైతన్య రెడ్డికి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉండడంతో గురువారం ఇంటికి తీసుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న విజయశాంతి రెడ్డి ఫ్రెష్ అయి దేవుడికి పూజలు చేసింది. అదే రోజు కొద్ది సేపటి తర్వాత తమ బంధువులు చనిపోయారని చెప్పి కాలేజీ నుంచి కుమారుడు విశాల్ రెడ్డిని కూడా తీసుకువచ్చింది. అనంతరం రాత్రి తన తల్లి పుష్పకు తమ ఆఫీసులో ఫంక్షన్ ఉందని, తనతోపాటు పిల్లలను కూడా తీసుకువెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. రాత్రి 11 గంటలకు కారు ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పార్కింగ్కు చేరుకుంది. కొద్ది సమయం కారులోనే గడిపిన ముగ్గురు ఆ తర్వాత రైల్వేస్టేççషన్లోకి ప్రవేశించారు. రైలుకు ఎదురుగా పరుగు...శనివారం తెల్లవారు జామున 12.40 గంటల ప్రాంతంలో తల్లి ఇరువురు పిల్లలు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని పట్టాలపై ప్రత్యక్షమయ్యారు. వారిని గుర్తించిన గూడ్స్ రైలు పైలట్ సుషౌన్ మహతో పలుమార్లు హారన్ చేసినా వారు పక్కకు తప్పుకోకపోగా రైలుకు ఎదురుగా పరుగు తీశారు. రైలు ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. లోకోపైలట్ వాకీటాకీ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైల్వే పట్టాల మధ్యలో తీవ్రగాయాలతో మృతి చెందిన మూడు మృతదేహాలను గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన పిన్నింటి విజయ అలియాస్ విజయశాంతి రెడ్డి, కూతురు చైతన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగా చేసుకున్న ఆత్మహత్య ఘటనగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్ రెడ్డితమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు. తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను విజయశాంతి రెడ్డి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అని మరో మెసేజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలు గుర్తింపు...కారు పార్కింగ్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరగా స్టేషన్ లోపలికి వెళ్లి వెంటనే వస్తామని చెప్పి హడావుడిగా విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో స్టేషన్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లోకి వెళ్లిన వారు టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద చాలా సేపు వేచి ఉన్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. టికెట్లు తీసుకునేందుకు ప్రయత్నించిన వారు తర్వాత టికెట్లు తీసుకోకుండానే ప్లాట్ ఫారం వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నాతో పాటు పిల్లలు కూడా... చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విజయశాంతి పార్కు చేసిన కారులో పోలీసులు ఓ సూసైడ్ నోటు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. కారు గేర్ బాక్సు పక్కనే ఒక చిన్న పేపరులో ఆమె చేతిరాతతో రాసినట్లుగా ఉన్న నోట్ లభించింది. ఆ నోట్లో ‘అమ్మా.... నేను బతకడానికి చాలా ప్రయత్నం చేశాను.. నా వల్ల సాధ్యం కావడం లేదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా... నాతో పాటే నా పిల్లలను కూడా తీసుకుపోతున్నా’ అని ఆ నోట్లో రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కారు తాళాలు ఆమె కుమారుడి ప్యాంటు జేబులో పోలీసులకు లభించాయి. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
8 రోజులు మృత్యువుతో పోరాడి..
లక్డీకాపూల్ (హైదరాబాద్)/నిజామాబాద్ అర్బన్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్ను మూశారు. నిజామాబాద్లో గంజాయి స్మగ్లింగ్ ముఠాను అడ్డుకునే క్రమంలో దుండగులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గాజుల సౌమ్య (23)ను జనవరి 25న నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 9.41 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కాలేయం దెబ్బతినడం, మెదడులో వాపు కారణంగా ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితంలేకపోయింది. గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకునే ప్రయత్నంలో.. జనవరి 23న గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ముఠా సభ్యులు తమ కారుతో సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ఎనిమిది రోజులపాటు సౌమ్య ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. బాసటగా నిలిచిన ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి ఆమెకు చికిత్స చేయించారు. ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆమెను పరామర్శించారు. సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా మోస్రాకు చెందిన సౌమ్యది సామాన్య కుటుంబం. 2024 సంవత్సరంలో సౌమ్య ఉద్యోగంలో చేరింది. అంతలోనే ఆమె మరణించడంతో కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. -
ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ
నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని సుజాత, నగేష్ ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. -
హైఎండ్ కార్లు, చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య?
బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, సీజే రాయ్ అలియాస్ చిరియాంకందత్ జోసెఫ్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన నివాసంలో మృతి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోరారాజులా వెలిగిన రాయ్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ప్రయణాలతో, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన రాయ్ గురించి కొన్ని ఆసక్తి కర సంగతులను పరిశీలిద్దాం57 ఏళ్ల CJ రాయ్ మరణం బెంగళూరు రియల్ ఎస్టేట్ , వ్యాపార వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్, తమ చైర్మన్ సీజే రాయ్ పై తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ దారుణమైన చర్య తీసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐటీ నిఘా నీడలోఉన్న బడా బడా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన మరణం వెనుక ఉన్నకారణాలపై పోలీసులు కారణాలు దర్యాప్తులో ఉన్నాయి.రాయ్ తన కరీర్ ప్రారంభంలో, రాయ్ టెలివిజన్ రియాలిటీ షోల డీల్స్, విజేతలకు బహుమతులివ్వడం, బ్రాండింగ్ వ్యూహంగా ఉపయోగించాడు. విజేతలకు రియల్ ఎస్టేట్ బహుమతులను అందించేవాడు. మీడియాతో ఎక్కువ సంబంధాలను కలగి ఉండేవాడు. ఇది అతని కంపెనీ పబ్లిక్ ప్రొఫైల్ను గణనీయంగా పెంచింది. అలా తన సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా, ముఖ్యంగా బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో పేరున్న సంస్థగా తీర్చిదిద్దాడు. రాయ్ సోషల్ మీడియా ఉనికిని పెంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అతనికి దాదాపు 1.3 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ఫీడ్లో కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రాజెక్టులను ప్రదర్శించే పోస్ట్లతో పాటు, హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ఇతర ప్రయాణ స్టోరీలను క్రమం తప్పకుండా తన ఫాలోయర్లతో పంచుకునేవాడు. అతని చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. View this post on Instagram A post shared by Dr Roy Chiriankandath Joseph (@dr.roy.cj) జనవరి 30న సెంట్రల్ ఆదాయపు పన్ను శాఖకు వాంగ్మూలం ఇవ్వడానికి రాయ్ బెంగళూరులోని లాంగ్ఫోర్డ్ రోడ్లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి జోసెఫ్తో కలిసి వచ్చారు. ఆ తర్వాత రాయ్ తన క్యాబిన్కు వెళ్లి తన తల్లితో మాట్లాడారు. ఆ తర్వాత తన క్యాబిన్లోకి ఎవ్వరినీ అనుమతించవచ్చని సెక్యూరిటీకి చెప్పాడు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపు లోపలి నుండి లాక్ చేయబడిందని గ్రహించి,బలవంతంగా క్యాబిన్ తలుపు బలవంతంగా తెరిచారు. తుపాకీ గాయాలతో పడిపోయి కనిపించారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు కేరళకు చెందిన ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ కుటుంబం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకారం, డిసెంబర్ 3, 6, జనవరి 28 తేదీల్లో బెంగళూరు , ఇతర ప్రాంతాలలో రాయ్ మరియు అతని వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన సోదాలు అనేక సందర్భాల్లో జరిగాయి. దీనిపై బెంగళూరులోని అశోక్నగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో, కాన్ఫిడెంట్ గ్రూప్ ఎండీ రాయ్ మరణానికి దారితీసిన సంఘటనలపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని కోరారు. సోదాల సమయంలో జరిగిన సంఘటనల క్రమం సహా అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.భూమి కొనండి, ఇంట్రస్టింగ్ రాయ్ సందేశంరాయ్, తాను 25 ఏళ్ల వయసులో 1994లో కొనుగోలు చేసిన తన తొలి కారును కనిపెట్టిన వారికి 10 లక్షల బహుమతిని ప్రకటించాడు. ఎర్ర మారుతి 800ను చివరకు తిరిగి పొందారు.1994లో, తన సొంత డబ్బులతో ఆ కారును రూ.1.10 లక్షలకు కొనుగోలు చేశాడట. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 27 సంవత్సరాల తర్వాత దానిని తిరిగి సాధించాడట. 1997లో ఈ మారుతి 800 కారును అమ్మేసి, మారుతి ఎస్టీమ్ కొనుగోలు చేశాడు. అప్పటికి భారతీయ రోడ్లపై అత్యంత ఖరీదైన , ఉత్తమమైన కారు. తానెపుడూ ఎప్పుడూ కారు ప్రేమికుడినే కానీ ఫస్ట్ కారు ప్రేమే వేరు అని ఒక పోస్ట్లో వెల్లడించడం విశేషం ఈ రోజు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లు ఉన్నప్పటికీ, తన మొదటి మారుతి 800 అతని అత్యంత విలువైన జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు.ఆయన ఇంకో విషయం కూడా చెబుతారు. తన తొలి కారు కొన్నిసమయంలో ఆ డబ్బుతో సర్జాపూర్లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయగలిగేవారు. ఈ రోజు, ఆ 2 ఎకరాల విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని ఒక సందర్బంగా చెప్పాడు. కారు కొనండి.. కారుతోపాటు, ఎంతో కొంత భూమిని కూడా కొనండి. భూమి కుటుంబ సంపదగా మారుతుంది అనేది ఫిలాసఫీ. View this post on Instagram A post shared by Dr Roy Chiriankandath Joseph (@dr.roy.cj) -
తల్లిదండ్రులను, సోదరిని చంపి ఇంట్లోనే పూడ్చాడు
సాక్షి,బళ్లారి: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని, కుమారుడి భవిష్యత్తు కోసం కలలు కన్న తండ్రిని, ఆప్యాయత అనురాగాలను పంచిన సోదరిని కూడా ఓ కర్కోటకుడు దారుణంగా హత్య చేసిన ఘటన విజయనగర జిల్లా కొట్టూరులో వెలుగు చూసింది. కొట్టూరు పట్టణంలో కన్న తల్లిదండ్రులను, సోదరిని హత్య చేసిన నిందితుడు అక్షయ్ బెంగళూరులోని తిలక్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తల్లిదండ్రులు, సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తల్లిదండ్రులు భీమరాజ్(50), జయలక్ష్మి(45), సోదరి అమృత(17)లను తానే హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టానని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సమాచారాన్ని విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవికి అందించారు. దీంతో ఎస్పీ నేతృత్వంలో కొట్టూరు డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, సీఐ, వేలిముద్రల నిపుణులు, జాగిలంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరో వైపు నిందితుడిని వెంటబెట్టుకొని బెంగళూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఎందుకు, ఎప్పుడు హత్య చేశాడు? అనే కోణంలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కొట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆహారం వడ్డింపులో జాప్యం.. ఇద్దరి హత్య
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖోడా ప్రాంతంలోని ఒక హోటల్లో ఆర్డర్ చేసిన ఆహారం రావడం ఆలస్యమైందన్న చిన్న కారణంతో మొదలైన వివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకునేవరకూ వెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను బహ్రైచ్ జిల్లాకు చెందిన శ్రీపాల్ (25), సత్యం (26)గా పోలీసులు గుర్తించారు. వీరు ఖోడాలోని నెహ్రూ విహార్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో రెండు వర్గాలకు చెందిన యువకులు మద్యం మత్తులో ఉన్నారు. ఆర్డర్ చేసిన భోజనం వడ్డించడంలో జాప్యం జరగడంతో ఇరు గ్రూపులవారు ఒకవైపు హోటల్ సిబ్బందితోను, మరోపైపు పరస్పర వర్గంతోను వాగ్వాదానికి దిగారు. ఇది క్షణాల్లో పెను వివాదంగా మారి, ఇరు వర్గాలు పరస్పరం పదునైన ఆయుధాలతో దాడి చేసుకునేవరకూ దారి తీసింది. హోటల్ ప్రాంగణంలో రక్తం చిందింది.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రీపాల్, సత్యంలు మృతి చెందినట్లు వైద్యులు వైద్యులు ప్రకటించారు. మూడవ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కావడంతో పాటు, అతను కూడా మద్యం మత్తులో ఉండటంతో అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనపై డిసిపి నిమిష్ పాటిల్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఇది కూడా చదవండి: ర్యాగింగ్ కలకలం.. ఎనిమిది మంది మెడికోలపై వేటు -
వసంతా.. నిన్ను చంపి నీ భర్తతోనే సంసారం చేస్తా!
వికారాబాదు జిల్లా: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండల పరిధిలోని బిల్కల్లో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చేరాల నర్సింలు (39) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. మూడు నెలలుగా తన ప్రియురాలితో నర్సింలు కొంత దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె తరచూ నర్సింలుకు ఫోన్ చేస్తోంది. నర్సింలు ఆమెతో మాట్లాడుతుండగా భార్య వసంత ఫోన్ లాక్కుని హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింలు ప్రియురాలు వసంతను దుర్భాషలాడింది. నిన్ను చంపి, నీభర్తతోనే ఉంటానని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేసిన నర్సింలు పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. ఉదయం పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో వసంత ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. కొద్ది సమయం తర్వాత గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో నర్సింలు విగత జీవిగా, రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది.డాగ్స్క్వాడ్తో తనిఖీలువిషయం తెలుసుకున్న మర్పల్లి ఎస్ఐ రవూఫ్, మోమిన్పేట్ సీఐ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయగా ఘటనా స్థలం వద్ద పలు బండరాళ్లను గుర్తించారు. అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ వెంచర్ వద్దకు వెళ్లిన జాగిలం అక్కడే ఆగిపోయింది.కుటుంబీకుల ఆందోళననిందితులను గుర్తించే వరకూ శవాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని మృతుడి బంధవులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాడీని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వసంత, కుమారులు సాయికృష్ణ, శ్రీహరి ఉన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి తన భర్తను బండరాళ్లతో కొట్టి హత్య చేశారని వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
వరుడిపై కత్తితో దాడి.. ఆగిపోయిన పెళ్లి
కర్ణాటక: నిశ్చితార్థానికి బయలుదేరిన వరుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో వరుడు గాయపడ్డాడు. అనంతరం పెళ్లి కూడా రద్దు అయింది. ఈ ఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. కొళ్లేగాల తాలూకా కుణగళ్లికి చెందిన ఎల్.రవీశ్ (34) అనే వరుడు గాయపడ్డాడు. ఇతనికి కొళ్లేగాల తాలూకా హొసఅణగళ్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. కొళ్లేగాల పట్టణంలోని వేంకటేశ్వర మహల్లో శుక్రవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కోసం తన గ్రామం నుంచి కారులో కుటుంబ సభ్యులతో కలసి రవీశ్ బయలుదేరాడు. కొళ్లేగాల ఎంజీఎస్వీ కాలేజీ రోడ్డు వద్ద దుండగులు వరుని కారును వెంబడించి కత్తితో దాడి చేశారు. రవీశ్ ఎడమ తొడకు గాయమై రక్తస్రావమైంది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం రవీశ్ మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం ఒక యువకుడు ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని బెదిరించాడన్నారు. తాను అదేమీ పట్టించుకోలేదన్నారు. ఇలా దాడిచేస్తారని అనుకోలేదన్నారు. భవిష్యత్తులో కూడా తనకు ప్రమాదం ఉండొచ్చని, అందుకే ఈ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. అతను యువతి మాజీ ప్రేమికుడని తనకు తెలిసిందన్నారు. ఈ విషయంపై యువతిని అడగ్గా గతంలో ప్రేమించిన మాట వాస్తవమేనని, ఇప్పుడు విడిపోయామని, తాను ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పిందని వివరించారు. కొళ్లేగాల పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి ఆగిపోవడంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. -
Hyderabad: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్లో విషాదం నెలకొంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య (శనివారం) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై మృతదేహాలను గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైలట్ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయ(38), కూతురు చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. చేతన ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, విశాల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలిసింది. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటున్నాడని పోలీసులు నిర్ధారించారు. విజయ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని.. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందని పోలీసుల విచారణలో తేలింది. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: కోఠి చోరీ కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద చోరీ కేసులో పురోగతి చోటు చేసుకుంది. బాధితుడి స్కూటీ మీద పారిపోయిన నిందితులు.. దానిని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని క్లూస్ను పోలీసు ప్రత్యేక బృందాలు సేకరించాయి. చోరీ అనంతరం నేరుగా కాచిగూడ డీమార్డ్ సమీపంలోని ఓ ప్రార్థనా మందిరంలోకి వెళ్లిన నిందితులు.. దుస్తులు మార్చుకున్నారు. అటుపై స్కూటీని స్టేషన్ దగ్గర వదిలి వెళ్లిపోయారు. అయితే అక్కడి నుంచి రైలెక్కి పారిపోయారా? లేదంటే బస్సు, ఇతర వాహనంలో పారిపోయారా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కాచిగూడ పరిధిలోని ప్రధాన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కోఠిలో ఈ ఉదయం జరిగిన చోరీ.. నగరవాసుల్ని ఉలిక్కి పడేలా చేసింది. రిన్షాద్(26) అనే వ్యక్తి శనివారం ఉదయం 7గం. ప్రాంతంలో తన డబ్బు డిపాజిట్ చేయడానికి కోఠి హెడ్ ఆఫీస్ బయట ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన ఐదుగురు దుండగులు.. తుపాకీతో బెదిరించారు. వాళ్లను అడ్డుకునేందుకు రిన్షాద్ ప్రయత్నించగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రిన్షాద్ కాలి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ కంగారులో నగదు బ్యాగుతో బాధితుడి బైక్ మీదే దుండగులు పారిపోయారు. గాయపడిన రిన్షాద్ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణహాని తప్పిందని వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న సుల్తాన్బజార్ పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారి అని, తన రూ.6 లక్షల నగుదును డిపాజిట్ చేసేందుకు వచ్చిన క్రమంలోనే చోరీ జరిగిందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి మీడియాకు వెల్లడించారు. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి రెండు షెల్స్ని స్వాధీనం చేసుకున్నాయన్నారు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే కాలిలో కాల్చి నగదు ఎత్తుకెళ్లి ఉంటారని.. నిందితులు పాత నేరస్తులై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారామె. నిందితుల పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారామె. -
నాతో కలిసి షికార్లు చెయ్.. లేదంటే నీ సంగతి చూస్తా
హైదరాబాద్: నాతో పబ్కు రావాలి.. నాతో కలిసి షికార్లు తిరగాలి.. లేదంటే నీ సంగతి చూస్తా అంటూ తోటి ఉద్యోగిని వేధిస్తున్న హెచ్ఆర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న స్వామిరెడ్డి అదే కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగిని తనతో కలిసి పబ్కు రావాలని వేధిస్తున్నాడు. కార్యాలయం విధుల్లో భాగంగా ట్రిప్కు వెళ్లిన సందర్భంలో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. దీనికి యువతి నిరాకరించడంతో ఆమెను డిమోట్ చేశాడు. తోటి ఉద్యోగుల వద్ద బాధితురాలి గురించి అసభ్యంగా మాట్లాడుతుండేవాడు. దీంతో అతని వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పట్టణంలోని మార్కండేయపురం జగనన్న ఎల్–3 లేఅవుట్ కాలనీలో ర్యాలీ ఆంజనేయకుమార్, భాను శిరీష దంపతులు. వారికి జెస్సీ (2) అనే కుమార్తె ఉంది. శుక్రవారం జెస్సీ తల్లి భాను శిరీష, నాన్నమ్మ వెంకట రమణ పనిమీద పట్టణానికి వచ్చారు. మధ్యాహ్న కావడంతో జెస్సీ తండ్రి ఆంజనేయకుమార్ అన్నం కలిపి చిన్నారికి తినిపిస్తున్నాడు. ఆ సమయంలో చిన్నారికి అన్నం ముద్ద గొంతు నుంచి దిగక ఉక్కిరిబిక్కిరైంది. దీంతో తండ్రి పక్కనే నివసిస్తున్న వరాల దుర్గను పిలిచాడు. ఆమె వచ్చి చిన్నారికి సపర్యలు చేసింది. అయినా బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే ఆంజనేయకుమార్ అక్కంపేటలో ఉంటున్న తన అక్క మాటూరి పద్మావతి, బావ రాంబాబులకు ఫోన్ చేశాడు. వారు వచ్చి చిన్నారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్నింగ్వాకే పాపమై పోయింది, పాడు కుక్క
వీధికుక్కల కేసుపై తీవ్ర చర్చోప చర్చలు నడుస్తుండగానే కుక్కల దాడికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది. బెంగళూరులోని ఒక నివాస ప్రాంతంలో పెంపుడు కుక్క ఒక మహిళపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలతో నెటిజనులను కలవరపాటుగా గురిచేశాయి. పలు మీడియా నివేదికల ప్రకారం ఈ ఘటన జనవరి 26న చోటు చేసుకుంది. ఉదయం సుమారు 6:54 గంటలకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని టీచర్స్ కాలనీలో మార్నింగ్ వాక్కోసం వెళ్లిన మహిళపై ఒక పెంపుడు కుక్క దాడి చేసింది. తనదారిన తాను పోతూ ఉండగానే ఉన్నట్టుడి దాడిచేసింది. మెడ, ముఖం, చేతులు మరియు కాళ్లను కరిచేసింది. దీంతో ఆమెకు 50కి పైగా కుట్లు పడ్డాయి. ఆమెను రక్షించడానికి వచ్చిన వ్యక్తిపై కూడా దాడి చేసి, నానా బీభత్సం చేసింది. మరో ఇద్దరు కూడా సాయానికి ముందుకు వచ్చారు. మొత్తంమీద చాలా ధైర్యంగా మహిళ తనను తాను విడిపించుకుంది.బాధితురాలి నుండి కుక్కను దూరం చేయడానికి ఆ వ్యక్తి దాని మెడ పట్టుకుని లాగడం ఫుటేజీలో కనిపిస్తుంది. మహిళ ఎలాగోలా లేచి, ఇంటి లోపలికి వెళ్లి, తన వెనుక గేటు మూసివేసింది. ఆమెకుముఖం, చేతులు , కాళ్ళకు గాయాలయ్యాయి మరియు ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుక్క యజమాని నిర్లక్ష్యంపై హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Bengaluru A woman was seriously injured in a pet dog attack during her morning walk in HSR Layout’s Teachers’ Colony. The dog bit her neck, face, hands and legs, leaving her with 50+ stitches. A rescuer was also attacked. Police have registered a case and are investigating. pic.twitter.com/NBmRPgmDRb— Smriti Sharma (@SmritiSharma_) January 30, 2026 -
‘ముందస్తు సమాచార’మిచ్చేసి కోట్లు పోగేశాడు
వామ్మో.. ఈయనగారి తెలివి మామూలుగా లేదు. పనిచేస్తున్న సంస్థకే పంగనామం పెట్టి మస్తు పైసలు వెనకేసుకున్నాడు. అవినీతిని నిరోధించాల్సిన పోలీసే లంచాలు మరిగి పెడదారి పట్టాడు. కోట్ల రూపాయల అక్రమాస్తులు వెనకేసుకుని అడ్డంగా దొరికిపోయాడు. పాపం పండడంతో కోర్టు మెట్లు ఎక్కి విచారణ ఎదుర్కొంటున్నాడు. విజయనగరం క్రైమ్/గుర్ల: విజయనగరం అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)లో 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరిన నెట్టి శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు అక్షరాలా రూ.20 కోట్లుగా ఏసీబీ అధికారులు నిగ్గుతేల్చారు. ఏసీబీ విభాగంలో పనిచేసిన సమయంలో ఏసీబీ దాడుల వివరాలను సంబంధిత వ్యక్తులకు ముందుగానే ఆయన చేరవేసేవాడు. దీనికోసం రూ.వేలు, రూ.లక్షల్లో తీసుకునేవాడు.ఆయనపై అనుమానం వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారులు ఏడాదిన్నర క్రితం ఎస్పీ ఆఫీస్కు బదిలీ చేసి నిఘా పెట్టారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు విజయనగరం గోకపేటలో శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్మెంట్, బంధువుల ఇళ్లలో గురువారం సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావును అరెస్టుచేసి విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. చదవండి: పాపం.. మహిళా కానిస్టేబుల్ విషాదగాథ -
సంగారెడ్డి: ఫుడ్పాయిజన్ ఘటన.. విద్యాశాఖ సీరియస్
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజన పథకం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ విచారణ అనంతరం చర్యలకు ఉపక్రమించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోని ఓ శుభకార్యంలో మిగిలిపోయిన పప్పు, కూరలను.. మధ్యాహ్న భోజనంలో వడ్డించారని.. వాటిని తినడంవల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ప్రచారం నడిచింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆరోగ్య శాఖ సమన్వయంతో విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. విచారణలో.. కుకింగ్ ఏజెన్సీ పీఎం పోషణ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా బయట వండిన ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డించినట్లు తేలింది. అలాగే మధ్యాహ్నా భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఎండీఎం(మిడ్ డే మీల్స్) టీచింగ్ స్టాఫ్ కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎండీఎం ఇంఛార్జి టీచర్ను సస్పెండ్ చేయడంతో పాటు రూల్స్ ఉల్లంఘనకు పాల్పడ్డ ఆ ఏజెన్సీని తప్పిస్తున్నట్లు స్యూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. -
శబరిమల కేసులో నటుడు జయరామ్ విచారణ
శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్ని సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి సిట్ ఆరా తీసినట్లు సమాచారం. శుక్రవారం చెన్నైలోని జయ్రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి?. ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్.. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకూ సుపరిచితుడే. శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక (కాపలాదారు) విగ్రహాలు మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్ల నుండి బంగారం పోయినట్లు ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తర్వాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్.. ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఇక.. ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు మురారి బాబు, శ్రీకుమార్లు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో(90 రోజుల) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ.. మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: శబరిమల గోల్డ్ కేసు.. ఏపీకి లింకు! నటుడ్ని ప్రశ్నించే చాన్స్ -
పుట్టింటికి వచ్చేయమన్నా వినలేదు
అత్తింట ఆమెకు వేధింపులు ఎదురవుతున్నాయనే విషయం.. మాకు తెలిసే సరికి ఆలస్యమైంది. అతను చెయ్యి చేసుకున్న విషయం తెలిసి పంచాయితీ పెట్టాం. క్షమాపణలు చెప్పి.. ఇంకొసారి కొట్టానంటూ బిడ్డ మీద ఒట్టేశాడు. అయినా వేధించడం ఆపలేదు. కడుపుతో ఉందని చూడకుండా గొడ్డు చాకిరీ చేయించాడు. చనిపోయే ముందు కూడా నా సోదరి తన కష్టం చెప్పుకుంది. పగవాడికి కూడా ఇలాంటి చావు రాకూడదు.. కాజల్ కేసులో ఆమె సోదరుడు నిఖిల్ భావోద్వేగంగా జరిగింది వివరించాడు. అసలేం జరిగింది?.. ఢిల్లీ స్వాట్(Special Weapons and Tactics) కమాండో అయిన కాజల్ చౌద్రి.. జనవరి 22న భర్త అంకుర్ చేతిలో దారుణ హత్యకు గురైంది. అంకుర్ రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్. కాజల్ సోదరుడు నిఖిల్ పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్లో కానిస్టేబుల్. హత్యకు కొన్ని నిమిషాల ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడిన నిఖిల్.. సిబ్బందితో హుటాహుటిన అంకుర్ నివాసానికి చేరుకున్నాడు. ఒక పక్క పెద్ద డంబెల్.. మరో పక్క రక్తపు మడుగులో పడి ఉన్న సోదరి.. ఇంకోపక్క అంకుర్, అతని కుటుంబ సభ్యులు నిల్చుని ఉన్నారు.ఆలస్యం చేయకుండా కాజల్ను ఆస్పత్రికి తరలించాడు నిఖిల్. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిందామె. ఆమె మరణించిన కొద్ది గంటలకే అంకుర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడతను. అయితే.. ఈ కేసు వెనుక వరకట్న వేధింపుల కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం కాస్త..అంకుర్, కాజల్ చౌద్రీ పానిపట్లో కాలేజీలో చదివే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 2023 నవంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పగింతల సమయంలో అంకుర్ కోరినవన్నీ కాజల్ తల్లిదండ్రులు అప్పగించారు. అయినా కూడా అంకుర్ సంతృప్తి చెందలేదు. కాజల్ ద్వారా తనకు కావాల్సినవన్నీ అత్తింటి నుంచి కానుకల రూపంలో అందుకున్నాడు. ఈ క్రమంలో పిల్లనిచ్చిన మామ దగ్గర విడిగా అప్పు కూడా చేశాడు. ఆపై కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది. ఆ తర్వాతే ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా ఓపికగా భరించింది. ఈలోపు కాజల్ మరోసారి గర్భం దాల్చింది. అయినా కూడా భర్త ఆమెతో అన్ని పనులు చేయించేవాడు. ఒకపక్క స్వాట్ డ్యూటీ.. మరోపక్క ఇంటి పనులు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి విషయాలను చేరవేసింది. అప్పటిదాకా ఆ విషయాలేవీ తెలియని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు నిఖిల్ షాక్ తిన్నారు. బిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చేయమని బతిమాలారు. ఆమె వినలేదు. చావైనా బతుకైనా భర్తతోనేనని తేల్చేసింది. దీంతో కాజల్ తల్లిదండ్రులు పెద్దలను కూర్చోబెట్టి పంచాయితీ ద్వారా అంకుర్కు సర్దిచెప్పించారు. ఆ రాత్రి ఏం జరిగిందంటే.. ఇంత జరిగినా.. అంకుర్ వేధింపులు ఆపలేదు. జనవరి 22న రాత్రి కాజల్తో గొడవపడ్డాడు. 10గం. ప్రాంతంలో అంకుర్ తన బావమరిది నిఖిల్కు ఫోన్ చేశాడు. ‘‘ఈ కాల్ రికార్డ్ చేసి పెట్టుకో. ఆధారాంగా పనికొస్తుంది. నీ అక్కను చంపేస్తున్నా’’ అంటూ ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడాడు. దీంతో కంగారుపడ్డ నిఖిల్ శాంతంగా ఉండమని, ఫోన్ తన సోదరికి ఇవ్వమని కోరాడు. అయితే అంకుర్ అరుస్తూ ఫోన్ పెట్టేశాడు. దీంతో నిఖిల్ తన సోదరికి కాల్ చేశాడు. ఆమె మాట్లాడుతున్న.. ఫోన్ లాక్కుని కట్ చేసేశాడు. మరో ఐదు నిమిషాలకు నిఖిల్ ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి ఆమెను చంపేశానని.. ఆస్పత్రికి రావాలని చెప్పాడు. భయపడ్డ నిఖిల్ తన సిబ్బందితో వెస్ట్ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ఎక్స్టెన్షన్లోని అంకుర్ కుటుంబం ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే జరగాల్సింది జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. జనవరి 22వ తేదీన రాత్రి 10-10.30 గం. ప్రాంతంలో ఘటన జరిగింది. కాజల్ నాలుగు నెలల గర్భిణి అని, మృతదేహాంపై మరిన్ని గాయాలు ఉన్నాయని పోస్ట్మార్టం నివేదికలో తేలింది. కాజల్ బిడ్డను తామే పెంచుకుంటామని.. ఎట్టి పరిస్థితుల్లో అంకుర్ కుటుంబం నీడ కూడా పడనివ్వబోమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. -
ప్రియుడితో నవ వధువు జంప్.. భర్త, మేనమామ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం (కర్ణాటక): సమాజంలో కట్టుబాట్లకు ఏమాత్రమూ విలువ లేకుండా పోతోంది. అనైతిక మార్గాలలో ప్రయాణిస్తూ కాపురాలను నాశనం చేసుకోవడం అధికమైంది. ఈ తరహాలో దావణగెరె జిల్లా గుమ్మనూరులో వివాహం జరిగిన రెండు నెలలకే నవ వధువు ప్రియునితో వెళ్లిపోవడంతో అవమానం భరించలేని భర్త సూసైడ్ నోట్ రాసి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు నిందితురాలు సరస్వతిని తాజాగా అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు నెలల క్రితమే హరీష్కు సరస్వతిని ఇచ్చి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. యువతి మేనమామ రుద్రేశ్ (36) ఈ సంబంధాన్ని ఖాయం చేసి దగ్గరుండి వివాహం చేయించారు. అయితే, ఇటీవల ఆమె గుడికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి ప్రియుడు శివకుమార్తో పారిపోయింది. అంతకుముందే ఆమె భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.వరుసగా మరొకరు..ఇది తట్టుకోలేని హరీష్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. భార్య, ఆమె ప్రియుడు, ఆమె బంధువులు గణేశ్, అంజినమ్మ తనను బెదిరించి వేధించారని, తన ఆత్మహత్యకు వారే కారణమని హరీష్ సూసైడ్ నోట్లో రాశాడు. ఈ ఘోరాలను చూసిన రుద్రేశ్ ఆవేదన చెంది పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఇద్దరి ఆత్మహత్యలకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరస్వతిని దావణగెరెలోని ఎలెబేతూరులో బంధువుల ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. సరస్వతి చేసిన చిన్న తప్పిదం కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం మిగిలింది. -
వారిద్దరి వల్లే నా జీవితం నాశనం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: పోకిరీల ఆటకట్టించే పోలీసే వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుఏకుంది. ఇద్దరు యువకుల వేధింపులతో మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్య చేసుకుంది. ఒకడు ప్రేమించి మోసం చేయగా.. మరొకడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురిచేయడంతో అనిత ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. అయితే, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్.. అనితకు బంధువు అవుతాడు. అనితను పెళ్లిచేసుకుంటానని రాజేందర్ గత నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని.. వేరే ఎవరితోనూ చనువుతో మాట్లాడవద్దని కొంతకాలంగా వేధింపులకు పాల్పడ్డాడు. రాజేందర్ వైఖరి నచ్చకపోవడంతో ఈ విషయాన్ని అనిత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అనితను ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని రాజేందర్కు తెగేసి చెప్పాడు. అయినా అనితను ఇచ్చి పెళ్లి చేయాలని బతిమిలాడుతూనే ఉన్నాడు.ఈ క్రమంలో అనితకు తన క్లాస్మేట్ జబ్బార్ లాల్తో చనువు ఏర్పడింది. అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం రాజేందర్కు తెలిసింది. దీంతో, కోపంతో జబ్బార్కు రాజేందర్ ఫోన్ చేసి అనిత గురించి తప్పుగా చెప్పాడు. అప్పటి నుంచి జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇద్దరి వేధింపులతో మానసికంగా కుంగిపోయిన అనిత ఈ నెల 27న రాజేందర్కు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంది.నువ్వు, జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు.. మీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. కానీ రాజేందర్ ఆ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో వెంటనే గడ్డిమందు తాగి అనిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు అనితను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అనిత మరణించింది. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.కాగా, ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్లు విలువైన విదేశీ గంజాయిని పట్టుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది.హైడ్రోపోనిక్ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్తో సమానమైన మత్తు కలిగిస్తుంది. హైడ్రోపోనిక్ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్లాండ్ నుంచి అక్రమంగా భారత్కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. -
సాధ్వి ప్రేమ్ బైసా మృతి వెనుక మిస్టరీ ఏంటి?
జైపూర్: పశ్చిమ రాజస్థాన్కు చెందిన సాధ్వి ప్రేమ్ బైసా మరణం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఆమె అనుమానాస్పద మరణంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని ఆర్ఎల్పీ (RLP) నేత హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేశారు. బుధవారం(జనవరి 28) సాయంత్రం జోధ్పూర్లోని బోరనాడ ఆశ్రమం నుంచి సాధ్వి ప్రేమ్ బైసాను ఆమె తండ్రి వీరమ్ నాథ్, మరొక సహాయకుడు కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.వైద్యుడు ప్రవీణ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్విని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమె శరీరంలో ఎటువంటి చలనం లేదని.. సాధ్వికి జ్వరం రావడంతో ఆశ్రమానికి ఒక కాంపౌండర్ను పిలిపించామని, ఆయన ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఆమె తండ్రి తనకు చెప్పినట్లు డాక్టర్ వెల్లడించారు. అయితే, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు తాను అంబులెన్స్ ఇస్తానన్నా, నాథ్ నిరాకరించి తన సొంత కారులోనే ఆమెను తీసుకెళ్లినట్లు డాక్టర్ తెలిపారు.ఆమె చాలా కాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతోందని వీరమ్ నాథ్ మీడియాతో చెప్పారు. అందుకే కాంపౌండర్ను పిలిపించాం. కానీ ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆమె స్పృహ కోల్పోయిందన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ కాంపౌండర్ను అదుపులోకి తీసుకుని, అతని వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా ఉండగా.. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సంచలన రేపుతోంది. సాధ్వి మరణించిన నాలుగు గంటల తర్వాత ఆమె సోషల్ మీడియా ఖాతా నుండి ఒక పోస్ట్ రావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ‘‘నేను ప్రతి క్షణం సనాతన ధర్మ ప్రచారం కోసం జీవించాను. నా జీవితాంతం జగద్గురు శంకరాచార్యులు, యోగా గురువులు, సాధు సంతుల ఆశీస్సులు అందుకున్నాను. అగ్ని పరీక్ష కోరుతూ నేను వారికి లేఖలు కూడా రాశాను. కానీ ప్రకృతి ఏం తలపెట్టిందో? నేను ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్తున్నాను. నా జీవిత కాలంలో కాకపోయినా, నా మరణం తర్వాతైనా నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను’’ అంటూ తన అనుచరులను ఉద్దేశించి అందులో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Sadhvi prem baisa (@sadhvi_prembaisa)ఈ పోస్ట్ ఆమె మొబైల్ నుండే షేర్ అయినట్లు ఆమె తండ్రి ధృవీకరించారు. ఒక తోటి గురువు ఆ సందేశాన్ని పంపారని ఆయన చెబుతూ, తన కుమార్తె మరణంపై దర్యాప్తు జరగాలని కోరారు. గత ఏడాది ప్రేమ్ బైసా, ఆమె తండ్రి ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఒక గదిలో ఆమె తన తండ్రిని హత్తుకుని ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఒక మహిళ గదిలోకి వచ్చి దుప్పటి తీసి వెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. అయితే, అది తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనురాగానికి నిదర్శనమని, ఆ బంధాన్ని కించపరచడానికే ఎవరో ఆ వీడియోను వైరల్ చేశారని సాధ్వి అప్పట్లో మండిపడ్డారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు కూడా.. -
ఆడవాళ్లున్నారుగా ఆగు అన్నందుకే చంపేశాడు!
క్షణికావేశంతో తోటి ప్రయాణికుడు, కాలేజీ ప్రొఫెసర్ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కదులుతున్న లోకల్ రైలు నుండి దిగుతున్నప్పుడు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చేసుకుంది. మలాడ్ రైల్వే స్టేషన్లో దిగేందుకు ప్రయాణికులు సిద్దమవుతున్నారు. ఫుట్బోర్డు దగ్గర ఇద్దరు మహిళలు నిలబడి ఉన్నారు. ఇంతలో వారిని తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించాడు. 27 ఏళ్ల షిండే. దీంతో ముందు మహిళలు ఉన్నారు కదా.. కనపించడం లేదా అని మందలించాడు వారి వెనుక ప్రొఫెసర్ అలోక్ కుమార్ సింగ్. చాలా సాధారణంగా చెప్పిన ఆ మాటలే తన పాలిట మరణ దండనగా మారిపోతాయని ఆయన అస్సలు ఊహించి ఉండడు. కోపోద్రిక్తుడైన షిండే స్టేషన్లో దిగగానే ఫ్లాట్ఫామ్మీదే సింగ్ను అతి దారుణంగా పొడిచాడు. దీంతో సింగ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఇది చూసి నిందితుడు షిండే అక్కడినుంచి పారిపోయాడు. సింగ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఈయన విలే పార్లేలోని ఒక ప్రముఖ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గత వారం ఈ సంఘటన జరిగింది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా సింగ్ తనను నెట్టి, అవమానించాడని, ఆ మహిళలు వెనక్కి తిరిగి తన వైపు చూశారు. దీంతో అవమానానికి గురయ్యానని పోలీసులకు చెప్పాడు. అందుకే అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నానని, ఆయన చనిపోయిన విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించాడు. షిండేకు జనవరి 29 వరకు పోలీసు కస్టడీ విధించారు. పోలీసు వర్గాల ప్రకారం, షిండే తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మలాడ్లో నివసిస్తున్నాడు. తల్లి గృహిణి, తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అతని సోదరుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిందితుడు గ్రాంట్ రోడ్లో చిన్న నకిలీ ఆభరణాల దుకాణాన్ని నడుపుతున్నాడు. తన కొడుకుకు కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇబ్బంది ఉందని షిండే తండ్రి పోలీసులకు తెలిపారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి! -
పోలీస్ కమెండోపై దారుణం.. డంబెల్తో దాడి చేసి..
న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్పై డంబెల్తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు -
పడవ ప్రమాదంలో మరొకరు బలి
కర్ణాటక: సరదా ప్రయాణం కాస్తా ప్రాణాంతకంగా మారింది. ఉడుపి నగరం అరేబియా సముద్రంలో డెల్టా బీచ్లో పర్యాటకుల పడవ పలీ్టకొట్టిన ప్రమాదంలో నీటమునిగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి దిశ (23) బుధవారం చనిపోయారు. మైసూరుకు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగులు 26వ తేదీన రెండు పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. ఓ పడవ బోల్తా పడడంతో ఆ రోజే సింధు (23), శంకరప్ప (27) అనే యువతీ యువకులు చనిపోవడం తెలిసిందే. అస్వస్థతకు గురైన దిశ, ధర్మరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దిశ మృతితో మరణాల సంఖ్య 3కు పెరిగింది. పడవల తనిఖీ: కలెక్టరు జిల్లా కలెక్టరు స్వరూప మాట్లాడుతూ అక్రమ టూరిస్టు బోట్లను అరికడతామని, బోట్ యజమానులందరూ అధికారులకు డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించారు. అనుమతులు లేని టూరిస్టు పడవలను సీజ్ చేస్తామని చెప్పారు. భద్రతా నిబంధనలను పాటించాలని తెలిపారు. -
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బెంగళూరు: రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు ఏ క్షణంలో ప్రమాదానికి గురవుతాయోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తాజాగా కర్ణాటక శివమొగ్గ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. హోసనగర నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన హోసనగర తాలూకా రిప్పన్పేట పోలీసు స్టేషన్ పరిధిలో అరసాళు–సూడురు గ్రామాల మధ్య జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు కావడంతో శివమొగ్గ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ.. మంటలు అన్నపూర్ణేశ్వరి ప్రైవేటు స్లీపర్ బస్సు హోసనగర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో హఠాత్తుగా పొగలు వచ్చి మంటలు రేగాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన చెట్టును ఢీ కొట్టించి బస్సును నిలిపాడు. బస్సు అత్యవసర తలుపు, కిటికీల ద్వారా ప్రయాణికులు బయటకు దూకారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులోని ఇద్దరు డ్రైవర్లకు కూడా స్వల్ప గాయాలు తగిలాయి, పోలీసులు వారిని ఘటనపై విచారిస్తున్నారు. రవాణా, ఫైర్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. -
అక్క కోసమని వెళ్లి.. అనంతలోకాలకు!
అమెరికా లాంటి కొన్ని దేశాల్లో.. పిల్లలను స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు లేదంటే దింపేటప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు కొద్దిదూరం వెళ్లిన తర్వాతే వాహనాలు ముందుకు కదులుతాయి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్.. లేదంటే పోలీసు అవసరం ఉండదు. పిల్లల సేఫ్టీ అనేది అక్కడి ప్రజల జీవనశైలిలో ఇదొక భాగమైపోయింది. కానీ, మన దేశంలో.. !ముంబై నగరంలో అంతా చూస్తుండగానే ఘోరం జరిగింది. స్కూల్ బస్సు దిగిన ఓ చిన్నారిని ఆమె నాయనమ్మ రోడ్డు దాటిస్తున్న క్రమంలో.. బస్సు ముందుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ చేతిలో ఉన్న ఏడాది పసికందు ప్రాణం విడిచింది. ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళవారం మధ్యాహ్నాం ఖేట్వాడీ ఏరియాలోని గిర్గావ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రకళ అనే పెద్దావిడ తన ఏడాది మనవడిని చంకలో వేసుకుని.. స్కూల్ నుంచి వచ్చే మనవరాలిని ఇంటికి తెచ్చేందుకు వెళ్లింది. అయితే ముగ్గురూ బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్ అది గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీ కొట్టి ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి పక్కకు పడిపోగా.. చంద్రకళ, ఆమె ఏడాది మనవడి మీదుగా బస్సు వెళ్లింది. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది చిన్నారి అప్పటికే మరణించగా.. గాయపడిన చంద్రకళను ఆస్పత్రికి తరలించారు. డీబీ మార్గ్ పోలీసులు స్కూల్బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు కాగా.. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.मुंबई में स्कूली बस ने ही दो बच्चों और उनकीअभिभावक को कुचल दिया! एक बच्चे की मौत हो गई दूसरा घायल है। अभिभावक भी बस के नीचे आ गई और वो भी गंभीर रूप से घायल है। मैं जानता हूं कि ये भारत है अमेरिका नहीं लेकिन फिर भी ये लिख रहा हूं कि जब भी अमेरिका जाता हूं, देखता हूं और आप भी… pic.twitter.com/RHcmGOUmEp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 28, 2026 -
హెచ్ఐవీ లేకున్నా.. ఉన్నట్టు తప్పుడు రిపోర్టు
‘హెచ్ఐవీకి మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం’ ఈ ప్రకటన ఆరోగ్యశాఖ ద్వారా మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది నయం కాని వ్యాధి అని అందరికీ తెలుసు. డాక్టర్ ఉన్నట్టుండి హెచ్ఐవీ లేకున్నా ఉందని రిపోర్టు ఇస్తే ఆ వ్యక్తికి ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇలాంటి ఘటనే వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వాసులో ఐదేళ్ల క్రితం జరిగింది. సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: మోడంపల్లెకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో 2020 అక్టోబర్, 14న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది సూచన మేరకు ఆమెకు హెచ్ ఐవీ పరీక్ష చేయించగా అందులో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రిపోర్టు ఇచ్చారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఆమెను వదిలేసి దూరంగా పారిపోయారు. ఆమెకు నొప్పులు అధికం కావడంతో పాడుబడిన ఒక గదిలోకి తీసుకెళ్లి స్వీపర్ల చేత కాన్పు చేయించారు. నర్సింగ్ సిబ్బంది దూరంగా ఉండి సూచనలు ఇస్తుండగా స్వీపర్లు ఆమెకు సుఖప్రసవం చేయడంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మళ్లీ చేయమని ప్రాధేయపడినా.. గర్భిణీకి హెచ్ఐవీ ఉందని రిపోర్టు వచ్చిన వెంటనే సంబంధిత సిబ్బంది ఆమె పేరును ఆన్లైన్ చేసి హెచ్ఐవీ జాబితాలో చేర్చారు. తన భార్యకు ఈ వ్యాధి రావడానికి అవకాశమే లేదని, మళ్లీ ఒకసారి పరీక్షలు చేయాలని భర్త వైద్యాధికారులను ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. దీంతో భర్త ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ నెగిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని అతను ఆస్పత్రికి వెళ్లి అధికారులకు తెలిపాడు. తనకు ఈ వ్యాధి లేనప్పుడు భార్యకు ఎలా వస్తుందని వైద్యులను ప్రశ్నించాడు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వ్యాధి బయట పడలేదని, కొన్ని నెలల తర్వాత నీకు కూడా వస్తుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. రిపోర్టు ఆధారంగా ఏఆర్టీ అధికారులు ఆమెకు మందులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల వయసులో చిన్నారి చనిపోయింది. హెచ్ఐవీ ఉందనే కారణంతో ఆస్పత్రి సిబ్బంది తల్లిపాలు పాపకు తాగించవద్దని చెప్పారని, ఈ కారణంతోనే నీరసించి చనిపోయినట్లు పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పసిపాప చనిపోయిన తర్వాత ఆమె ఏఆర్టీ మందులు వాడటం మానేసింది. ఆస్పత్రికి వచ్చి మందులు తీసుకెళ్లాలని సిబ్బంది ఫోన్లు చేసి చెప్పినా ఆమె వెళ్లలేదు. మందులు వాడటం మానుకున్న తర్వా త తన భార్య పూర్తి ఆరోగ్యంగా ఉండటాన్ని గమనించిన భర్త ఇక ఏఆర్టీ మందులు వాడొద్దని చెప్పాడు. ఐదేళ్ల తర్వాత హెచ్ఐవీ లేదని పరీక్షల్లో నిర్ధారణ మళ్లీ గర్భవతి అయిన ఆమెను భర్త ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఈసారి ఆమెను కాన్పు నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.ఈ ప్రక్రియలో భాగంగా హెచ్ఐవీ పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు 2025 ఫిబ్రవరి, 25న సుఖప్రసవం చేయగా ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా భర్త గతేడాది మార్చి నెలలో జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వరుసగా పలుమార్లు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతడి ఫిర్యాదును ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయడంతో ఆస్పత్రి అధికారులు పిలిపించి మళ్లీ హెచ్ఐవీ పరీక్షలు చేయగా అతడి భార్యకు నెగిటివ్గా నిర్ధారణ అయింది. హెచ్ఐవీ లేదని నిర్ధారణ అయిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి ఆన్లైన్లో ఉన్న తన భార్య పేరును తొలగించాలని కోరినా అధికారులు వినిపించుకోలేదని భర్త తెలిపాడు. దీనిపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఐదేళ్లుగా బంధు వుల వద్ద, వీధిలో తలెత్తుకోలేక జీవించామని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.రిపోర్టు ఆధారంగా.. పాజిటివ్ రిపోర్టు ఆధారంగా ఆన్లైన్ చేసి మందులు ఇవ్వడం అనేది మా బాధ్యత. మందులు ఇచ్చిన తర్వాత ఆయా వ్యక్తులు వాడేలా మా సిబ్బంది ఫోన్లు చేస్తూ పర్యవేక్షిస్తుంటారు. నెగిటివ్ వచ్చిన తర్వాత రిపోర్టు తీసుకొని ఆమె మా వద్దకు రాలేదు. ఆరు నెలల క్రితమే ఏఆర్టీ నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్లు పోకుండా పేరు బ్లాక్ చేశాం. ఆన్లైన్లో ఆమె పేరు తొలగింపు కోసం పైఅధికారులకు విన్నవించాం.:::సూర్యనాగలక్షి్మ, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్, ప్రొద్దుటూరు. -
బెంగళూరులో భారీ చోరీ.. కిలేడీ జంట ఎక్కడ?
బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ జంట.. ఆ ఇంటికే కన్నం పెట్టారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సుమారు రూ. 18 కోట్ల విలువైన ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని మారతహళ్లి పరిధిలో యెమలూరు కెంపాపుర నివాసి, బిల్డర్ షిమంత్ అర్జున్ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. దాదాపు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంటి యజమాని షిమంత్ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రామానికి వెళ్లగా అదే అదనుగా ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట దినేష్, కమలా మరో నేపాలితో కలిసి చోరీకి పాల్పడ్డారు. షిమంత్ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు.యజమానులు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే, వీరు గత కొంతకాలంగా సదరు బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా ఉంటూ యజమానికి నమ్మకంగా ఉంటున్నారు. ఇంటి గురించి పూర్తి అవగాహన ఉండటంతో, వీరు అతి సులువుగా లాకర్లను గుర్తించి చోరీకి పాల్పడ్డారు. నేరం చేసిన వెంటనే వారు సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల పరిశీలించి నిందితులకోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పనిమనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.కాగా, నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో, బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. పని మనుషులను పెట్టుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. -
స్నేహితుల ఆనంద ప్రయాణం… విషాదాంతం
మేడ్చల్ జిల్లా: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిఖిల్ (23), సాయివరుణ్ (23), వెంకట్ (23), రాకేశ్, అభినవ్, యశ్వంత్రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ బీటెక్ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మౌలాలిలోని తమ స్నేహితుడు అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా అతన్ని కలిసేందుకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మహేంద్ర ఎక్స్యూవీ 700 కారులో బోడుప్పల్ వైపునుంచి పోచారం వెళ్తుండగా రాత్రి 2.15 నిమిషాల సమయంలో వరంగల్ జాతీయ రహదారిలో ముందున్న రెండు బైకులను తప్పించి సైడ్ తీసుకుంటున్న సమయంలో అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 97ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో కారును నడుపుతున్న నిఖిల్తో పాటు సాయివరుణ్ అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్, రాకేశ్లకు తీవ్రగాయాలు కాగా, అభినవ్, యశ్వంత్రెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్ బయటపడ్డారు. మేడిపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నోట్లో టవల్ పెట్టి.. భర్తను దారుణంగా చంపిన భార్య..
నల్గొండ జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం సీత్యాతండాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీత్యాతండా గ్రామానికి చెందిన రమావత్ రవి(34)కి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాకు చెందిన లక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి తల్లిదండ్రులు కూడా అతడితో పాటే ఇంటి ముందు గుడిసెలో నివాసముంటున్నారు. రవి సొంత సోదరి కుమారుడైన మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామానికి చెందిన మాలోతు గణేశ్కు లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఇదే విషయమై రవి పలుమార్లు లక్ష్మిని మందలించాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగా లక్ష్మి సంవత్సరం క్రితం తన తల్లిగారింటికి వెళ్లింది. రవి తల్లిదండ్రులు పెద్దమనుషులతో మాట్లాడించి లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయితే లక్ష్మి ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. మంగళవారం ఉదయం రవి చిన్న కుమారుడిని హాస్టల్లో విడిచిపెట్టేందుకు అతడి తండ్రి సూర్యాపేటకు వెళ్లాడు. మధ్యాహ్నం రవి మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తుండగా.. లక్ష్మి తన ప్రియుడు గణేశ్ను ఇంటికి పిలిచింది. అనంతరం రవి నోట్లో టవల్ పెట్టి కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం లక్ష్మి, గణేశ్ అక్కడి నుంచి పారిపోయారు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా రవి విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ కృష్ణయ్య ఘటనా స్థలంలో క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
కాకినాడ ప్రత్తిపాడులో నడిరోడ్డుపై ఘోరం
సాక్షి, కాకినాడ: ప్రత్తిపాడులోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోరం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళ్తున్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది మరో కంటైనర్ లారీ. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు వాహనాల క్యాబిన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇరువురు డ్రైవర్లు బయటకు దూకేయగా.. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నవరం పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
‘పప్పా.. నేను అజిత్ పవార్తో వెళ్తున్నాను’.. పింకీ మాలి చివరి మాటలు ఇవే..!
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు ముందు విమాన సిబ్బంది పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలికి చేసిన చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన పింకీ..ప్రయాణానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ, ‘పప్పా, నేను అజిత్ పవార్తో బారామతి వెళ్తున్నాను. ఆయనను అక్కడ దింపిన తర్వాత నేను నాందేడ్కి వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం’ అని చెప్పింది. ఆ మాటలు ఆమె తండ్రికి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.పింకీ మాలీ మరణంపై ఆమె తండ్రి శివకుమార్ మాలి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా కూతురు ఫోన్ చేస్తే మాట్లాడాను. చివరిగా.. ‘రేపు నీ పని అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని అన్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాలేదు. తన కూతురు ఇక లేరని తెలుసుకున్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.ఆయన మాట్లాడుతూ..‘నేను ఆమెతో రేపు మాట్లాడతానని అనుకున్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. నా కూతురు నాకు దూరమైపోయింది. ఆమె ఇటీవల అజిత్ పవార్తో అనేక ప్రయాణాల్లో పాల్గొనేది. నాకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. నాకు టెక్నికల్ విషయాలపై అవగాహన లేదు. నేను పూర్తిగా కుంగిపోయాను. నాకు కావలసింది ఒక్కటే. నా కూతురి భౌతిక కాయం. గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయడానికి మాత్రమే నేను కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మాటలు ఒక తండ్రి హృదయవేదనను, ఒక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పింకీ మాలి చివరి మాటలు ఇప్పుడు వారి కుటుంబానికి శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయాయి. -
ఢిల్లీలో దారుణం : ఆరేళ్ల బాలికపై మైనర్ల అఘాయిత్యం
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల లోపు ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ ముగ్గురూ గత ఏడాది చనిపోయిన బాలిక సోదరుడికి స్నేహతులే. ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలో జనవరి 18న ముగ్గురు బాలురు ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. నిందితుల వయస్సు 10, 13 , 14 సంవత్సరాలు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మూడో నిందితుడు, అతని కుటుంబం పరారీలో ఉంది.ఏం జరిగిందంటే..బాధితురాలి తల్లి అందించిన వివరాల ప్రకారం జనవరి 18న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బాలిక తీవ్ర రక్తస్రావంతో ఇంటికి తిరిగి వచ్చింది. మొదట తాను కింద పడిపోయానని చెప్పింది. పక్కింటి 13 ఏళ్ల అబ్బాయి కూడా అదే కథ చెప్పాడు. అయితే బాలిక అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆమె తట్టి లేపిన తల్లి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. 13 ఏళ్ల పక్కింటి అబ్బాయి, మరో ఇద్దరు బాలురు ఆహారం ఇస్తామని ఆశ చూపి తనను తీసుకెళ్లారు. ఆ అబ్బాయిలు అక్కడే ఆమెను పట్టుకుని చావ్మిన్ ఇస్తామని చెప్పారు. ఆ తరువాత సమీపంలోని ఖాళీగా ఉన్న రెండు అంతస్తుల భవనంలోకి తీసుకెళ్లి, ఆమె చేతులు కట్టి, నోటికి గుడ్డ కట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో వారు వెంటనే జాఫరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికకు జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్య నివేదికలో ఆమె నడవలేకపోతోందని,తీవ్ర రక్తస్రావం అవుతోందని పేర్కొన్నారు. హెచ్ఐవి, ఇతర వ్యాధుల కోసం పరీక్షలు చేయించుకోవాలని కూడా వైద్యులు సూచించారు.ఇదీ చదవండి: 78 ఏళ్లకు లవ్ ప్రపోజల్..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!విచారణ సమయంలో బాలిక కూడా ఈ వివరాలను పంచుకుందని ధృవీకరించారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులను జనవరి 19న అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచినట్టు చెప్పారు. ప్రస్తుతం బాధిత బాలిక నిలకడగా ఉందని, ఇంట్లోనే కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్ : అమెజాన్లో వేలాది మంది ఉద్యోగులపై వేటుఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కూడా రేకెత్తించింది. నిందితులు సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు ముస్లిం అబ్బాయిలు కావడంతో హిందూ కార్యకర్తలు న్యాయం కోరుతూ రహదారిని దిగ్బంధించారు. సోమవారం, హిందూ మితవాద సంఘాలు మూడవ నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపాయి. దీంతో పోలీసులు కేసును భజన్పురా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దర్యాప్తు అధికారులు ఆ భవనాన్ని సందర్శించి,ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.నడవలేక నరకయాతన పడుతోంది : బాధితురాలి తల్లిబాలిక ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. నడిచినా లేదా ఆడినా రక్తస్రావంతో, నొప్పితో ఇబ్బందిపడుతోందని తల్లి వాపోతోంది. ఆ బాలిక తండ్రి, రిక్షా కార్మికుడు, నిందితులను వయోజనులుగా పరిగణించి విచారించాలని డిమాండ్ చేశాడు. వారికి కఠినమై శిక్షపడాలని డిమాండ్ చేశాడు. తన బిడ్డను అలా చూసి కుమార్తెల భద్రతపై భయంతో తాను ఇంకా పనికి తిరిగి వెళ్లలేదని ఆ తండ్రి చెప్పాడు. ఇదీ చదవండి: Ajit Pawar jet crash : హాట్ టాపిక్గా ఆ ఇద్దరు పైలట్లు -
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కారణం ఏంటంటే?
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం పొగమంచు, వెలుతురు లేమి కారణంగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రయాణిస్తున్న విమానం బుధవారం ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్, విదీప్ జాదవ్,పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శంభవి పాఠక్లు ప్రాణాలు కోల్పోయారుఅయితే, ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలెట్ల గురించి నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ మంగళవారం ఉదయం ముంబై నుంచి లియర్జెట్ 45 విమానంలో బయలు దేరారు. అయితే, ఈ విమానం, బరామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ ప్రయత్నం చేస్తుండగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. విమాన ప్రమాదంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, అలాగే పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ శంభవి పాఠక్ అక్కడికక్కడే మరణించారు.కెప్టెన్ సుమిత్ కపూర్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ పైలట్. ఆయనకు బిజినెస్ ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉంది. శంభవి పాఠక్ కూడా శిక్షణ పొందిన కమర్షియల్ పైలట్. గతంలో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. ఇద్దరూ వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు పనిచేస్తున్నారు.విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయిందో, సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్నది పరిశీలిస్తున్నారు. బరామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విమానయాన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. -
వికారాబాద్లో దారుణం.. పాయిజన్ సిరంజీతో తల్లిదండ్రులను కడతేర్చింది
వికారాబాద్ జిల్లా: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో కులాంతర వివాహానికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులపై కక్ష గట్టింది. అమ్మానాన్న బతికి ఉంటే పెళ్లి చేసుకోనివ్వరని, వారిని చంపితేనే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించింది. ఒకరి తర్వాత మరొకరికి అధిక మోతాదు మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం వివరాలు వెల్లడించారు. బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి లక్ష్మి, దశరథ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడితో పాటు ముగ్గురికి వివాహం కాగా, చిన్నకూతురు సురేఖకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్స్టాలో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే కులాలు వేరు కావడంతో వారు ఎంతకూ అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రుల హత్యకు సురేఖ కుట్ర పన్నింది.పథకం ప్రకారం.. తాను పనిచేసే ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే మత్తు కలిగించే అట్రాకూరియం (అర్టాసిల్) 2.5 ఎంఎల్ సీసాలు నాలుగు దొంగిలించింది. ఈ నెల 24న ఆస్పత్రిలో వీక్లీ ఆఫ్ తీసుకుని ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో మోమిన్పేట మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాప్లో 3 సిరంజిలు తీసుకుంది. పొలం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన సురేఖ.. మళ్లీ ఆ యువకుడితో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. వారు కుదరదంటే కుదరదన్నారు. దీంతో తన పథకం అమలు చేయాలని సురేఖ నిర్ణయించుకుంది. తల్లి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో.. కీళ్లు, ఒళ్లు నొప్పులు తగ్గేందుకు ఇంజెక్షన్ తెచ్చానని నమ్మబలికి 5 ఎంఎల్ డోస్ ఇవ్వడంతో ఆమె కుప్పకూలిపోగా దుపట్టా కప్పింది. ఆ తర్వాత ఆరు బయట చలిమంట కాచుకున్న తండ్రి లోనికి రాగా, అమ్మకు కీళ్లు, కాళ్ల నొప్పులు తగ్గేందుకు ఇంజెక్షన్ ఇచ్చానని, ఆమె నిద్రపోతోందని, నీకు కూడా ఇంజెక్షన్ తెచ్చానని చెప్పి, అతనికి కూడా 5 ఎంఎల్ అట్రాకూరియం ఇచ్చింది. దీంతో కొద్దిసేపటికే దశరథ్, లక్ష్మి తుదిశ్వాస విడించారు. సహజ మరణంగా చిత్రీకరించే యత్నంతన తల్లిదండ్రులవి సహజ మరణాలుగా చిత్రీకరించాలని సురేఖ ఎత్తుగడ వేసింది. తన అన్న అశోక్కు ఫోన్ చేసి అమ్మానాన్న చనిపోయారని, తనకు భయమేస్తోందని, త్వరగా రావాలని చెప్పింది. అశోక్ వచ్చాక.. నాన్న తనతో మాట్లాడుతూ అన్నతో మంచిగా ఉండు, అన్న చెప్పినట్లు విను, వాడే అన్నీ చూసుకుంటాడని చెబుతూ పడిపోయాడని చెప్పింది. విషయం అమ్మకు చెప్పడంతో షాక్కు గురైన ఆమె స్పృహ తప్పి పడిపోయిందని, సీపీఆర్ చేసినా బతకలేదంటూ విలపించింది.అనుమానమే నిజమైంది..అప్పుల బాధ భరించలేక తన తండ్రి విషం తాగి చనిపోయాడని, ఇది చూసిన తన తల్లి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొంటూ అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు సిరంజిలు గుర్తించారు. వాటికి రక్తం కూడా అంటుకుని ఉండటం గమనించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కొందరు కుటుంబ సభ్యులు సైతం సురేఖపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను విచారించారు. దీంతో ఆమె నేరం అంగీకరించింది. బుధవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన సీఐ రఘురాం, బంట్వారం ఎస్ఐ విమలను డీఎస్పీ అభినందించారు. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన యువతివికారాబాద్ జిల్లా, బంట్వారం మండలం, యాచారంలో జరిగిన దారుణం సంగారెడ్డిలో నర్సుగా పని చేస్తున్న సురేఖకి ఒక యువకుడితో పరిచయంఆ పరిచయం ప్రేమగా మారగా.. పెళ్లి చేసుకోవాలని ప్రేమజంట నిర్ణయంమరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించిన సురేఖ… pic.twitter.com/b8gfri2YV7— PulseNewsBreaking (@pulsenewsbreak) January 28, 2026 -
పేర్ని నానిపై మరో కేసు నమోదు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నూజివీడులో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది. ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది. -
రోడ్డు ప్రమాదంలో వైద్యురాలి మృతి
రామన్నపేట: వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వైద్యురాలు మృతి చెందారు. మృతురాలి భర్త డాక్టర్ సాలు రాఘవేంద్ర తెలిపిన వివరాలివి. డాక్టర్ రాఘవేంద్ర వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ ఫైనలియర్ చదువుతున్నారు. ఆయన భార్య డాక్టర్ మమతారాణి (33) ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగిసిన తర్వాత మమతారాణిని.. రాఘవేంద్ర స్కూటీపై ఇంటికి తీసుకొస్తున్నారు. హంటర్రోడ్డులోని జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన మమతారాణికి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అన్సారీ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు 9 నెలల గర్భిణి కావడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది -
నాటు కోడి మృతి.. 11 మందిపై కేసు
సాక్షి, మహబూబాబాద్: నాటు కోడి చనిపోతే 11 మందిపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మరిపెడ మండలం మూలమర్రితండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. కోడి చనిపోతే కేసు ఏంటి అనుకుంటున్నారా?.. అయితే ఇది చదివేయండి. భూక్యా మంచా అనే వ్యక్తి ఓ నాటు కోడిని అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో.. ట్రాక్టర్ కింద పడి అది మరణించింది. దీంతో మంచా గుండె బద్ధలైంది. తన కోడిని చంపింది ఇసుక మైనింగ్ మాఫియాదేనంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అతని ఫిర్యాదుతో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా బాధితుడు మంచా మాట్లాడుతూ.. మూలమర్రితండా శివారు పాలేరు వాగు నుంచి 11 మంది రెండు నెలలుగా నిత్యం అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించాడు. మైనర్లతో ఇసుక ట్రాక్టర్లను మూగ జీవాలపై నుంచే నడుపుతున్నారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన కోడిపై నుంచి ఓ ట్రాక్టర్ ఎక్కించి చంపారని తెలిపాడు. మంచా ఫిర్యాదుతో పోలీసులకు కేసు నమోదు చేయని పరిస్థితి ఎదురైంది. ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాంకుడోతు రవి, భూక్యా రఘు, వాంకుడోతు చింటు, తేజావత్ నెహ్రూ, తేజావత్ సక్రాం, తేజావత్ సీత్య, రమేశ్, భూక్యా వీరన్న, పి.హరీశ్, భూక్యా దేవా, గణేశ్పై మంగళవారం మరిపెడ పోలీస్ స్టేషన్లో కేసు నమోద చేశారు. విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని మంచాను పోలీసులు పంపించేశారు. అయితే వ్యవహారంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఫిర్యాదుదారుడు చెబుతుండడం గమనార్హం. -
బోడుప్పల్లో ఘోర ప్రమాదం.. బీటెక్ విద్యార్థుల దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: మితిమీరిన వేగం ప్రాణాలు తీసింది. నగరంలోని బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి పిల్లర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఐటీ పోచారం వెళ్తున్న ఓ కారు.. బోడుప్పల్ వద్ద పిల్లర్ 97ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడినవాళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను, క్షతగాత్రులను వనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటన సమయంలో కారులో ఎనిమిది మంది యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీళ్లంతా వనపర్తిలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు. అతివేగంతో దూసుకెళ్లే క్రమంలో వాహనం కంట్రోల్ కాకపోవడంతో ఫిల్లర్ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నారు. మృతులను వరుణ్, నిఖిల్గా గుర్తించారు. ఆ మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గాయపడిన వెంకట్, రాకేష్,యశ్వంత్లకు చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
‘నా చితికి నా మూడేళ్ల కూతురే నిప్పు పెట్టాలి’
పాట్నా: ‘అమ్మా,నాన్న. నన్ను క్షమించండి. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చితికి నిప్పు నా భర్తతో కాదు.. నా మూడేళ్ల కూతురితో పెట్టించండి’అంటూ ఓ మహిళా ఉపాధ్యాయురాలు బలవన్మరణం చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిహార్ రాష్ట్రం వైశాలీ జిల్లాకు చెందిన ప్రియా భారతి ప్రభుత్వ స్కూల్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భారతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఇలా ఉంది.‘అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నేను చనిపోతున్నాను. అనారోగ్య సమస్యల వల్ల ప్రాణం తీసుకుంటున్నాను. నా మరణానికి ఎవరూ కారణంగా కాదు.నాకు నచ్చినట్లు నా అంత్యక్రియలు నిర్వహించండి. నేను మరణించిన నా భౌతిక కాయాన్ని నా స్వగ్రామానికి తీసుకుని వెళ్లొద్దు. నా చితికి నా కుమార్తెతో నిప్పుపెట్టించండి.నా భర్తతో వద్దు. 5.5లీటర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నా పర్సులో నుంచి తీసుకోండి. నా ఫోన్ని నాభర్తకు ఇవ్వండి. అందులో కొన్ని ఆడియో,వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఫోన్ పాస్వర్డ్ ఏంటో నా భర్తకు తెలుసు.నా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. పోస్టుమార్టం నిర్వహించవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా భర్త, కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు చేయద్దు. ఈ చర్య నా వ్యక్తిగత నిర్ణయం. అమ్మా, నాన్న, మీ కూతురు ఓడిపోయింది. క్షమించండి అమ్మా’అని నోట్లో రాశారు.అయితే, భారతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. భారతి తన భర్త దీపక్ రాజ్, అత్తింటివారి వేధింపులకు గురయ్యిందని, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి కూడా చెప్పిందని తెలిపారు. కాగా, బాధితురాలి తల్లి తండ్రుల ఆరోపణలకు.. ఆత్మహత్యా లేఖలోని మాటలకు విరుద్ధంగా ఉండటం వల్ల కేసు మరింత క్లిష్టంగా మారింది. -
HR మేనేజర్ను ముక్కలు చేసి, గోనె సంచిలో కుక్కి ; తలకోసం గాలింపు
ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాల్ని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసిన వైనం కలకలం రేపింది. అనుమానంతోనే ఈ హత్యకు తెగబడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఆగ్రాలో యమునా నదిపై ఉన్న వంతెన సమీపంలో 32 ఏళ్ల హెచ్ఆర్ మేనేజర్ను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి, తల నరికి, ఆ తర్వాత ఒక గోనె సంచిలో కుక్కి పడేశాడని పోలీసులు సోమవారం తెలిపారు. వినయ్సింగ్ (30) ఆగ్రాలోని తేధి బగియా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ (32) గత రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోంది. అదే సంస్థలో నిందితుడు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అయితే, గత ఆరు నెలలుగా మింకీ మరో వ్యక్తితో సంబంధంలో ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే వారి మధ్య తరచుగా గొడవలకు దారి తీసింది. పోలీసుల ప్రకారం, జనవరి 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మింకీ తన కార్యాలయానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయలు దేరింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. జనవరి 24 తెల్లవారుజామున, ఎత్మదుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ వంతెనపై ఒక గోనె సంచి పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సంచిని తెరిచి చూడగా, అందులో తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా, గోనె సంచిని లాక్కెళ్లడం, ఆ తర్వాత స్కూటర్పై జవహర్ వంతెన వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. మారుతి ప్లాజా, ఎంజీ రోడ్, హైవేతో సహా పలు ప్రాంతాల నుండి సేకరించిన ఫుటేజ్ ఆధారంగా, బాధితురాలి స్కూటర్ను నడుపుతున్నట్లు కనిపించిన వినయ్ సింగ్ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించి విచారించారు. దీంతో సింగ్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?జనవరి 23న వినయ్, మింకీని కార్యాలయానికి పిలిచాడు. ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన అతను కత్తితో పదేపదే దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి, ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి, తలను ఒక బ్యాక్ప్యాక్లో పెట్టాడు. మింకీ స్కూటర్పైనే ఆమె మృతదేహాన్ని జవహర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి యమునా నదిలో పడేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బరువైన సంచిని ఎత్తలేక, అటుగా వెళ్తున్న వారిని గమనించి, అతను దానిని వంతెన సమీపంలో వదిలి పారిపోయాడు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. అందులో మొండెం, బాధితురాలి బట్టలు, మొబైల్ ఫోన్, బ్యాగ్ను ఒక మురుగు కాలువ సమీపంలో పారవేసి, స్కూటర్ను ఒక నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయాడని పోలీసులు తెలిపారు.నేరానికి ఉపయోగించిన స్కూటర్, కత్తి, బాధితురాలి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింగ్, శర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమె నిరాకరించచడంతోనే హత్య చేశాడని డీసీపీ అబ్బాస్ తెలిపారు. మృతురాలి తల, నేరానికి సంబంధించిన ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.ఇదీ చదవండి: యాక్సిడెంట్ కాదు.. డాష్బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్ -
‘నేను ఇపుడు ఎవరికి అన్నం తినిపించాలి బిడ్డా’
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు.కరీంనగర్క్రైం/వీణవంక: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రా మానికి చెందిన మ్యాకల గణేశ్(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్లపై గణేశ్ బైక్ స్పేర్ పార్ట్స్ కోసం మధ్యాహ్నం కరీంనగర్ వచ్చారు. అనంతరం గణేశ్, సందీప్రెడ్డి బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో హౌసింగ్బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రైవేట్ సూ్క్ల్ బస్సును ఢీకొని బైక్పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్ తెలిపారు.మామిడాలపల్లిలో విషాదంకరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్ ఇంటర్లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్రెడ్డి. ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. -
యాక్సిడెంట్ కాదు.. డాష్బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్
కర్ణాటకలోని బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో ఆదివారం సాయంత్రం ఎలక్ట్రానిక్స్ సిటీలోని అనంతనగర్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. మద్యం మత్తులో కారును అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదీ తొలుత అందరూ అనుకున్న స్టోరీ. కానీ ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులో వచ్చింది. ప్రమాదంగా భావించిన ఈ ఘటన చివరికి ఒళ్లు గగుర్పొడిచే హత్యగా తేలింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రశాంత్, రోషన్ ఇద్దరు స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్గా పనిచేస్తుండగా, రోషన్ డొమ్లూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కారులోని డాష్క్యామ్ను డీసీపీ (ఎలక్ట్రానిక్స్ సిటీ) ఎం నారాయణ గమనించి, ఆ ఫుటేజీని పరిశీలించమని ఆదేశించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.ఆదివారం సాయంత్రం కమ్మసంద్రలో కొంతమందితో కలిసి క్రికెట్ ఆడిన వీరు తరువాత మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రశాంత్ లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చి అతనిని దుర్భాషలాడాడని, దీనితో వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నాడు. పరిస్థితి దిగజారడంతో, రోషన్ తన టాటా సఫారీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రశాంత్ కారును వెంబడించి, కదులుతున్న వాహనం ఎడమవైపు ఫుట్బోర్డ్పైకి ఎక్కి డోర్ను పట్టుకుని వేలాడాడు. కారు ఆపమని ప్రశాంత్ వేడుకుంటున్నా రోషన్ పట్టించుకోలేదు. సుమారు 600 మీటర్ల దూరం వరకు కారును వేగంగా, ప్రమాదకరంగా నడిపాడు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే మొదట ఓ కాంపౌండ్ గోడను, ఆ వెంటనే వెనక్కి తిప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విజువల్స్ డాష్క్యామ్లో రికార్డయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.ఇది ఉద్దేశపూర్వకమైన హత్య అని తేలడంతో, తీవ్ర గాయాలతో రోషన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి విచారణకోసం అదుపులోకితీసుకున్నామని అధికారి నారాయణ తెలిపారు. రోషన్కు నాలుక దాదాపు తెగిపోయిందని, చిన్న శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు మాకు తెలిపారు. సోమవారం అతన్ని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Drunk Driving Nightmare: Bengaluru Roads Claim Another Life in Shocking Car-Ramming IncidentShocking incident from Bengaluru.A drunken brawl turned deadly when Prashanth M (33), a bodybuilder, was killed after Roshan Hegde (37), a software engineer from Mangaluru, allegedly… pic.twitter.com/sJ2c3zldMM— Karnataka Portfolio (@karnatakaportf) January 26, 2026 -
ఒంటరితనం తట్టుకోలేక..
తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న ప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాల ప్రకారం.. ప్రియాంక ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం విఫలమైన నేపథ్యంలోనే ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరదా ప్రయాణం శాశ్వత వీడ్కోలుగా మారింది
తూర్పు గోదావరి జిల్లా: ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది.. సరదాగా సాగిపోతున్న ప్రయాణంలో విషాదం అలముకుంది.. కడియం మండలం వేమగిరి శివారులో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య, కుమార్తెలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం మండలం కేదారిశెట్టిపల్లి గ్రామానికి చెందిన చిట్టూరి వెంకటేష్ (36) రాజమహేంద్రవరంలోని టాటా మోటార్స్లో పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలసి కడియం మండలం వేమగిరిలో నివాసం ఉంటున్నాడు.అయితే సోమవారం సెలవురోజు కావడంతో భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలను తీసుకుని రావులపాలెంలోని బంధువుల ఇంటికి మోటారు సైకిల్పై బయలు దేరారు. వేమగిరి సమీపానికి వచ్చేసరికి అక్కడి ఒక నర్సరీ వద్ద నుంచి హైవేపైకి ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా ఒక కారు వేగంగా వచ్చి, వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ను ఢీకొంది. దీంతో వెంకటేష్, భార్యా పిల్లలతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ తల బలమైన గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కల్పన, తొమ్మిదేళ్ల పెద్ద కుమార్తె లోహతాశ్రీ, ఏడాదిన్నర వయసుగల చిన్న కుమార్తె సౌర్యశ్రీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బంధువులు ఇంటికి వెళ్లేందుకు ఆనందంగా బయలు దేరిన వారు కొద్దిసేపటికే ప్రమాదం బారిన పడి, వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషయం నెలకొంది. భార్య, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా కడియం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ లక్ష్మీప్రసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం తీసుకురాలేదని.. భార్య ఎంత పని చేసిందంటే..!
హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. శివకుమార్, రాజేశ్వరి(45) దంపతు లు. వారు యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమా రులు ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఆమె మద్యం సేవించింది. తనకు ఇంకా మద్యం కావాలని భర్తకు తెలిపింది. భర్త మద్యం తీసుకురానని చెప్పాడు. దాంతో అతనితో గొడవ పెట్టుకుని ఇంటి లోపలికి వెళ్లి చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత చిన్న కుమారుడు గౌతమ్కుమార్ తల్లి కోసం వెదికాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు పగలకొట్టి ఆమెను కిందకు దించారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు రాజేశ్వరి సోదరుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో కారు ప్రమాదం.. ఒకరి మృతి
కర్ణాటక: మద్యం తాగి కారు నడుపుతూ చెట్టును ఢీకొనగా ఒకరు మరణించారు. ఈ ఘటన నగరంలో హెబ్బగోడి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. తరువాత కారులో ఇళ్లకు బయల్దేరారు. కానీ ఏదో విషయమై కారులోనే వాదులాట మొదలైంది. కారు డ్రైవింగ్ చేస్తున రోషల్ హెగ్డేను ప్రశాంత్ దూషించడంతో అతడు అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ చనిపోగా,, రోషన్హెగ్డే తీవ్రంగా గాయపడ్డాడు. కారు ప్రమాద దృశ్యాలు డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనుమానం.. పెనుభూతమై..
పెద్దతిప్పసముద్రం: అనుమానం పెనుభూతమైంది. ప్రియురాలు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపేశాడు. ఆపై ప్రాణ భయంతో తానూ ఇంటికి వెళ్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం సరిహద్దు చేలూరులో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతులిద్దరూ అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలానికి చెందినవారే. వివరాలు ఇలా.. మండలంలోని కందుకూరుకు చెందిన మస్తాన్ కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన సల్మా (40)ను వివాహం చేసుకుని చేలూరులోని గెరిగిరెడ్డిపాళ్యలో స్థిర పడ్డాడు. ఇదే పంచాయతీలోని నిలువురాతిపల్లికి చెందిన బావాజాన్ (42) కర్ణాటక రాష్ట్రం చింతామణిలోని తస్లీమ్ను వివాహం చేసుకుని చేలూరులోని రంగుండ్లులో కాపురం పెట్టారు. మూడేళ్ల కిందట బావాజాన్ భార్యా, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బావాజాన్ గెరిగిరెడ్డిపాళ్యంలో ఉన్న సల్మాతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.ఇటీవల సల్మాపై అనుమానం పెంచుకున్న బావాజాన్ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సల్మా ఇంటికి వెళ్లిన బావాజాన్ మాయమాటలతో ఆమెను మంచంపైనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. విషయం వెలుగులోకి వస్తే తనను బతకనీయరని భావించిన బావాజాన్ ప్రాణభయంతో ఇంటికి వెళ్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ వార్తతో చేలూరు గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రకాష్, సీఐ ఎం.శ్రీనివాస్ ఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాగేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. -
మంత్రి స్వగ్రామంలో అమానుషం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి స్వగ్రామమైన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్లలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు..గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వృద్ధురాలు (65) ఈ నెల 15న పశువుల కోసం గడ్డిమోపు ఎత్తుకుని పొలం నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దాట్ల అమర్నాథ్ (24) వెనుకవైపు నుంచి వచ్చి ఆమె నెత్తిన ఉన్న గడ్డిమోపును కిందకు నెట్టేశాడు. ఆపై ఆమె నోరు మూసి అత్యాచార యత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వృద్ధురాలి ఛాతీ, శరీరంపై గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న మద్దిలేటి గట్టిగా అరవడంతో అమర్నాథ్ వృద్ధురాలిపై దాడి చేసి పరారయ్యాడు.ఈ ఘటనను ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. అవమాన భారంతో వారం పాటు మానసిక బాధను అనుభవిస్తూ అన్న పానీయాలు మానేసింది. దీంతో అస్వస్థతకు గురై ఈ నెల 22న మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బనగానపల్లె పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అమర్నాథ్ గతంలో కూడా గ్రామంలో కొంత మంది మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలున్నాయి. ఈ క్రమంలో ఆ యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది.వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సొంత ఊరు కావడంతో పోలీసులు కేసు విషయంలో పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య
నగరంపాలెం (గుంటూరు): నిద్రమాత్రల పొడిని కలిపిన బిర్యానీని భర్తకు వడ్డించి, మత్తులోకి జారుకున్నాక దారుణంగా హత్యచేసిన భార్యను, అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్ఎంపీని దుగ్గిరాల పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసు వివరాలను సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివనాగరాజు (48)కి 2008లో లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. శివనాగరాజుకు ఉల్లి వ్యాపారం, షేర్ మార్కెట్లో నష్టాలు రావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో.. భార్య లక్ష్మీమారుతి తొలుత దుగ్గిరాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, తర్వాత విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో పనికి చేరింది.అక్కడి బుకింగ్ కౌంటర్లో పనిచేసే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి గోపీతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గోపీని భర్తకు పరిచయం చేయగా వీరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో.. గతంలో హైదరాబాద్లో గోపీ పనిచేసిన కార్యాలయంలో డ్రైవర్గా చేరిన శివనాగరాజు ఇటీవల దుగ్గిరాల వచ్చాడు. భార్య, పిల్లలతో గోపీ ఓ ఫ్లాట్లో ఉంటున్నట్లు తెలిసి పలుమార్లు హెచ్చరించాడు.దీంతో శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీమాధురి, గోపీ నిర్ణయించుకున్నారు. గోపీ తన స్నేహితుడైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎర్రగుంట్లపాడుకు చెందిన ఆర్ఎంపీ కంభంపాటి సురేష్ వద్ద నిద్రమాత్రలు సేకరించాడు. వాటిని లక్ష్మీమాధురికి ఇవ్వగా, ఆమె వాటిని పొడిచేసి బిర్యానీలో కలిపి ఈనెల 18న భర్తకు వడ్డించింది. భర్త నిద్రలోకి జారుకున్నాక లక్ష్మీమాధురి, గోపీ, సురేష్ కలిసి శివనాగరాజు ముఖంపై దిండుతో నొక్కిపెట్టి హత్యచేశారు. గుండెపోటు అంటూ నాటకం.. మర్నాడు ఉదయం భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరినీ నమ్మించేందుకు భార్య యత్నించింది. కానీ, శివనాగరాజు మృతిపై తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా భార్యను ప్రశి్నంచగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు లక్ష్మీమాధురి, గోపీ, సురేష్ ను అరెస్టుచేశారు. వారి నుంచి 4 సెల్ఫోన్లు, మత్తుమాత్రల షీట్లు, అప్పడాల కర్ర, బుల్లెట్, కారు స్వా«దీనం చేసుకున్నారు. -
ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 11 మంది మృతి
మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఫుట్బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.గ్వానజువాటో రాష్ట్రం సాలమంకాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. "సాకర్ మ్యాచ్ చివరి దశలో ఉండగా సాయుధులు స్టేడియం లోపలికి లోపలికి ప్రవేశించారు. వచ్చీ రావడంతోనే కనిపించిన వారిపైకి యధేచ్ఛగా కాల్పులకు దిగారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల పనేనని అందరికి తెలుసు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. నేర ముఠాలు అధికారులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు" అని సలామాంకా మేయర్ సీజర్ ప్రిటో పేర్కొన్నారు.కాగా మెక్సికో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఎక్కువ హత్యలు జరిగిన రాష్ట్రంగా గ్వానజువాటో నిలిచింది. ఇక్కడ ప్రధానంగా శాంటా రోసా డి లిమా, న్యూ జెనరేషన్ డ్రగ్ కార్టెల్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఈ రెండు ముఠాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా సామాన్య ప్రజలు బలి అవుతున్నారు. -
46 ఏళ్ల ఆంటీతో.. 23 ఏళ్ల యువకుడు ఏం చేశాడంటే?
హైదరాబాద్: ఆమె వివాహిత. వయసు 46. అతడు 23 ఏళ్ల యువకుడు. వీరిద్దరికీ ఇన్స్టాలో పరిచయం ప్రణయానికి దారి తీసింది. ఆదివారం వీరు నగరం నుంచి అదృశ్యమయ్యారు. జూబ్లీహిల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. బిహార్కు చెందిన మహిళ (46)కు భర్త, 19, 16 ఏళ్లున్న కుమారుడు, కూతురు ఉన్నారు. 2004లో నగరానికి వలస వచ్చారు. జూబ్లీహిల్స్లో ఆమె భర్త వంట మనిషిగా, సదరు మహిళ పని మనిషిగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన 23 ఏళ్ల యువకుడితో ఆమెకు ఇన్స్టాలో పరిచయమైంది. ప్రేమలో పడిన వీరు నగరంలో తరచూ కలుసుకునేవారు. ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి పరారయ్యారు. భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో వివాహితతో పాటు యువకుడు బైక్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీరి కోసం గాలిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత మృతికి అల్లుడే కారణం..!
గీసుకొండ/నెక్కొండ: కేరళలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన సింగారపు కుమారస్వామి, మంజుల దంపతుల కూతురు శ్వేత (25)కు రెండేళ్ల క్రితం సంగెం మండలం కుంటపల్లికి చెందినసీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జంగం విక్రంతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా విక్రం కేరళలో విధులు నిర్వర్తిస్తుండగా బీటెక్ చదివిన శ్వేత అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈనెల 21న శ్వేత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాకలోని విక్రం ఇంటికి తీసుకొచ్చారు. తన కూతురు మృతికి అల్లుడే కారణం అంటూ మృతురాలి బంధువులు, సూరిపల్లి గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు. కొట్టడంతోపాటు ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతదేహంతో అక్కడే నిరసన తెలిపారు. విక్రంకు సంబంధించిన జాన్పాక, కుంటపల్లిలోని ఆస్తిని మృతురాలి బంధువులకు రాసి ఇవ్వాలంటూ పట్టుబట్టి అంగీకార పత్రం రాయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కు మార్, సిబ్బంది వెళ్లి గొడవ చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. చివరికి రాత్రి బంధువులు శ్వేత మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సూరిపల్లికి తీసుకెళ్లారు. -
కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ దూసుకెళ్లి..
రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్ను పట్టుకున్న ఎస్ఐ కిలోమీటర్ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు సిబ్బందితో సాగర్ హైవేపై డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్ను పట్టుకున్న ఎస్ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్పైనే ఉండి కిలోమీటర్ దూరం వెళ్లిన ఎస్ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ్, హయత్నగర్కు చెందిన శ్రీకర్, నితిన్లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్సిటీ సీపీ సు«దీర్బాబు సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధుతో ఫోన్లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. -
రెండు కంటైనర్లు.. రూ.400 కోట్లు.. అసలేం జరిగింది?
బెంగళూరు (బనశంకరి): గోవా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.400 కోట్ల నగదు తరలిస్తున్న రెండు ట్రక్ కంటైనర్లు కర్ణాటకలో అదృశ్యమయ్యాయి. అక్టోబర్లో బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా చోలార్ఘాట్లో ఈ కంటైనర్లు మాయమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ సేఠ్ ఈ నగదును తరలిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల పోలీసులు కంటైనర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిట్ ఏర్పాటుకు ఆదేశించారు.మహారాష్ట్రలో స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచడానికి ఈ నగదు తరలిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖానాపుర తాలూకాలో ప్రమాదకర అటవీ ప్రదేశమైన చోలార్ఘాట్ ఈ కంటైనర్లు అదృశ్యమైన కొద్దిరోజులకు మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన సందీప్పాటిల్ను నగదును యజమాని కిశోర్ సేఠ్ అనుచరులు బంధించారు. నగదు నువ్వే అపహరించావని ఆరోపించి, వెనక్కి ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామంటూ చిత్రహింసలు పెట్టారు.వారి చెరనుంచి తప్పించుకున్న సందీప్పాటిల్ ఈ నెల 1వ తేదీన నాసిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూ.400 కోట్ల నగదు కంటైనర్లు మాయం కావడంతో తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. నాసిక్ పోలీసులు గోవా, బెళగావి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదుగురిని.. విరాట్గాం«దీ, జయేశ్ కదమ్, విశాల్నాయుడు, సునీల్ దుమాల్, జనార్దన్ దైగుడేలను అరెస్టు చేసి విచారిస్తున్నారు. వీరిలో విరాట్గాంధీ రాజస్థాన్కు చెందిన హవాలా ఆపరేటర్. ఇద్దరు నిందితులు.. అజార్ బిల్డర్, కిశోర్ సావ్లా పరారీలో ఉన్నారు. -
10వేల కిలోల పేలుడు పదార్థాలు.. డిటోనేటర్లు లభ్యం
జైపూర్: గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. హార్సౌర్ గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్ను 187 సంచుల్లో నింపి ఒక పొలంలో దాచినట్లు గుర్తించారు. నాగౌర్ జిల్లా జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చావా ఈ వివరాలను వెల్లడించారు.అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు తెలిపారు. ముఖ్యంగా, 2025 నవంబర్లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తుచేశారు. హార్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.అమోనియం నైట్రేట్తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు,12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూస్ వైర్లు, 12 కార్టన్లు, ఐదు బండిల్స్ రెడ్ ఫ్యూస్ వైర్లు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎక్స్ప్లోజీవ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంత భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తోంది. -
గేమింగ్ యాప్ విన్జోపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని ప్రమోటర్లపై చార్జిషీట్లు వేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం తెలిపింది. కృత్రిమ మేధను ఉపయోగించుకుని ప్రజల నుంచి ప్రమోటర్లు రూ.734 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించింది. ఈ మేరకు బెంగళూరులోని ఈడీ జోనల్ కార్యాలయం ఈ నెల 23న మనీలాండరింగ్ కేసుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. విన్జో ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు పావన్ నందా, సౌమ్యా సింగ్ రాథోడ్లతోపాటు అనుబంధ సంస్థలైన విన్జో యూఎస్, జో ప్రైవేట్ లిమిటెడ్, విన్జో ఎస్జీల పేర్లను చార్జిషీటులో నిందితులుగా చేర్చామంది. విన్జో మొబైల్ యాప్లో ఆఫర్ చేసిన 100కు పైగా గేమ్లకు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, వీరిలో అత్యధికులు టయర్–3, టయర్–4 నగరాల పరిధిలోని వారేనని ఈడీ వివరించింది.కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్ట్లో ఆన్లైన్ గేమ్లను నిషేధించాక కూడా ఈ యాప్ పనిచేసిందని, ఆ సమయంలో జనం నుంచి వసూలు చేసిన సుమారు రూ.48 కోట్లను తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. -
దళిత యువతిపై లైంగికదాడి
తిరుపతి క్రైమ్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మాయ మాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన యశ్వంత్రాజ అనే వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 21న ఆ యువకుడు తిరుపతికి వస్తున్నానని యువతికి తెలిపాడు.ఇదే క్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లోని ఓ హోటల్ రూమ్కి తీసుకువెళ్లి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన యువతి డీలాగా ఉండడంతో తల్లి గమనించి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 24వ తేదీ రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధం మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది
చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపథ్యంలో రేగిన చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట మల్లేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా కొడుకుతో కలిసి తెనాలిలోని సీఎం కాలనీలో ఉంటున్న కొల్లా దుర్గ(28)తో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. కొంతకాలంగా మల్లేష్కు, దుర్గకు మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇవి కేసుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మల్లేష్ ఇంటికి వెళ్లిన కొల్లా దుర్గతో అతని కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆవేశంలో దుర్గతోపాటు మల్లేష్ కుటుంబ సభ్యులు పరస్పరం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో దుర్గకు 80శాతం శరీరం కాలిపోయింది. మల్లేష్ భార్య, పిల్లలతో సహా తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కొల్లా దుర్గ ఆదివారం ఉదయం మరణించింది. కేసును పక్కదారి పట్టిస్తున్నారు తన కుమార్తె దుర్గది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి ప్రతివాడ చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని ఆరోపించారు. మృతురాలి తల్లి, అక్కచెల్లెళ్లు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ దుర్గపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా చంపారని కన్నీరుమున్నీరయ్యారు. -
ఐదుగురూ ఆహుతి!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్లోని సాయి బిశ్వాస్ చాంబర్స్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తంమీద బచ్చాస్ ఫర్నిచర్ సంస్థ 18 గంటల పాటు మండింది. సెల్లార్లో మొదలైన మంటలు సాయి బిశ్వాస్ చాంబర్స్ సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతోపాటు నాలుగు అంతస్తుల్లో నిర్మితమైంది. దీని గ్రౌండ్ ఫ్లోర్లో బచ్చాస్ దుకాణం ఎంట్రన్స్తోపాటు మరో ఫర్నిచర్ దుకాణం ఉంది. బచ్చాస్ ఫర్నిచర్ మూడు అంతస్తుల్లో విస్తరించి ఉండగా... సబ్–సెల్లార్, సెల్లార్లతోపాటు భవనం కుడి వైపు ఉండాల్సిన సెట్ బ్యాక్కు రేకులు వేసి గోదాములుగా వాడుతున్నారు. రెండు రోజుల క్రితం చైనా నుంచి భారీగా సరుకు వచ్చింది. వీటిని దుకాణంతోపాటు గోదాముల్లోనూ భద్రపరిచారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో బచ్చాస్ దుకాణం సెల్లార్ వెనుక వైపు మంటలు అంటుకున్నాయి. ఇవి గ్రౌండ్తోపాటు మొదటి అంతస్తుకు పాకాయి. రెండు, మూడు, నాలుగు అంతస్తులతో పాటు సబ్–సెల్లార్లోకి పొగ విస్తరించింది. సబ్–సెల్లార్లో ఉన్న సరుకు మాత్రం యథాతథంగా ఉంది.కెమికల్స్ కూడా ఉండటంతో... ఈ భవనం సెల్లార్లో బచ్చాస్ ఫర్నిచర్కు సంబంధించిన సరుకుతోపాటు పెయింట్స్, కొన్ని రసాయనాలు ఉన్నాయి. వీటి వల్లే మంటల ధాటి ఎక్కువై ప్రమాద తీవ్రత పెరిగింది. సెల్లార్లో వెనుక వైపు కుడి పక్కగా రెండు చిన్న గదులు ఉన్నాయి. మెట్లకు సమీపంలో రేకులతో పార్టిషన్ చేసి వీటిని నిర్మించారు. ఈ మెట్లతోపాటు మిగిలిన చోట్ల ఉన్న గ్రిల్స్కు యజమానులు తాళాలు వేశారు. చిన్న గదుల్లోని ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్గా పనిచేస్తున్న బేబి (46), మరో గదిలో వాచ్మన్ తోకల యాదయ్య, తన భార్య లక్ష్మి, కుమారులు ప్రణీత్ (11), అఖిల్ (8) ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాదయ్య, లక్ష్మి బయటకు వెళ్లగా... 1.10 గంటలకు సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయి. ఇవి అక్కడ ఉన్న సరుకుతోపాటు కెమికల్స్ కారణంగా వేగంగా విస్తరించాయి. కాపాడటానికి వెళ్లి...: సుభాన్నగర్కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ (28), శాస్త్రీపురం వాసి హబీబ్ (35) బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అర్టిప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న వీరిద్దరూ మంటల్ని చూసి అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతోపాటు ప్రణీత్, అఖిల్లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. దీనికి ఎడమ చివరన ఎంట్రన్స్ ఉండగా, కుడి చివరన వీరు ఉన్న గదులు ఉన్నాయి. అక్కడ వరకు వెళ్లిన ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. బేబీని తీసుకొని గది నుంచి బయటకు వచ్చిన హబీబ్కు బయటపడే మార్గం కనిపించలేదు. మంటల ధాటి పెరిగిపోవడంతో తాను లోపలకు ప్రవేశించిన మార్గం వరకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్లే మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్కు తాళం వేసి ఉండటంతో అక్కడే బేబీతో సహా పడిపోయాడు. మంటలతో ఇద్దరు... ఊపిరాడక ముగ్గురు ! కిందపడినపోయిన హబీబ్, బేబీ మంటలు అంటుకొని చనిపోయారని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ఇంతియాజ్ వారు ఉన్న గదిలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతం మొత్తం పొగ నిండిపోవడం, అది ప్లాస్టిక్, ఫైబర్తో పాటు కెమికల్స్ వల్ల వచి్చంది కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఈ గదిలోనే ఊపిరి ఆడక ఇందియాజ్ సహా ఇద్దరు చిన్నారులు చనిపోయి ఉండారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయినా పొగ తగ్గకపోవడం, సెల్లార్, సబ్–సెల్లార్ సామాన్లతో నిండిపోవడంతో లోపలకు ప్రవేశించడానికి రెస్క్యూ టీమ్స్ శ్రమించాల్సి వచి్చంది. మొత్తమ్మీద ఆదివారం ఉదయం 9.10 గంటలకు సెల్లార్లోకి ప్రవేశించిన బృందాలు 9.15 గంటలకు హబీబ్, బేబీల మృతదేహాలు గుర్తించారు. 9.45 గంటల సమయంలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు దొరికాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. బేబీ కుమారులు లాల్ఖాన్, సమీర్ ఖాన్లు బచ్చాస్లోనే పని చేస్తున్నారు. వీరికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. చిన్నారులతోపాటు ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను వారి కుటుంబీకులకు ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వీరంతా ఎలా చనిపోయారన్న పూర్తి వివరాలు తెలుస్తాయి. బిశ్వాస్ చాంబర్స్ను జేఎనీ్టయూకు చెందిన నిపుణుల బృందం ఆదివారం ఉదయం పరిశీలించింది. ప్రొఫెసర్ శ్రీధర్రెడ్డి నేతృత్వంలోని టీమ్ వివిధ కోణాల్లో పరిశీలించింది. వీరు అందించే నివేదిక ఆధారంగా భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లేనని అనుమానిస్తున్నాందుకాణ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానిస్తున్నాం. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దుకాణ యజమాని సతీశ్ బచ్చాను అరెస్టు చేశాం. రెండు రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్నకు మరమ్మతు జరిగింది , అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చు.సెల్లార్లో ఫర్నిచర్ నిల్వ ఉంచడంతో మంటలు తొందరగా వ్యాప్తి చెందాయి. – అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా: మంత్రి పొంగులేటిబచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఆ పరిహారం అందే విధంగా చర్యలు తీసు కోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను ఆదేశించినట్టు రెవెన్యూ మంత్రి కార్యాలయ వ ర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు అమాయకు లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
రైల్వేస్టేషన్లో దారుణం.. ప్రొఫెసర్ దారుణ హత్య
ముంబై: ఒక చిన్న తగాదా ప్రాణం తీసింది. మలాడ్ రైల్వే స్టేషన్లో ఓ కళాశాల ప్రొఫెసర్ను ప్రయాణికుడు.. దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ప్రొఫెసర్, ఒక ప్రయాణికుడి మధ్య చిన్న వివాదం విషాదాన్ని మిగిల్చింది. ఆ రైలు స్టేషన్ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్ను కత్తితో పొడిచి.. పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రొఫెసర్గా అలోక్ సింగ్.. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. రైలులో సీటు విషయంలో ఓ ప్రయాణికుడు, ప్రొఫెసర్ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్ మలాడ్ స్టేషన్ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో వారి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ వ్యక్తి.. ప్రొఫెసర్ అలోక్ సింగ్ కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం స్టేషన్లోని జనం రద్దీలో కలిసిపోయి పరారయ్యాడు. దీంతో కత్తి పోట్లుతో అలోక్ సింగ్ కుప్పకూలి మరణించాడు.ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే(27)గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పారిపోతుండటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. షిండేను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవకే ప్రొఫెసర్ను షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి మధ్య గతంలో శత్రుత్వం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నా భర్తకు విడాకులు ఇచ్చి గోపీతో వెళ్లిపోతా..!
తాడేపల్లి రూరల్: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన నాగరాజు (45)ను ఈ నెల 18వ తేదీన భార్య, ప్రియుడు కలిసి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ హత్య ఉదంతంలో విస్తుపోయే నిజాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి...భర్త హత్యకు ఐదు నెలల ముందే భార్య తన ప«థకాన్ని అమలు చేసినట్టు తాజాగా తెలుస్తోంది. అంతేగాక ఆ రాత్రి భర్తను హత్యచేసిన అనంతరం భార్య లక్ష్మీ మాధురి ఫోర్న్వీడియోలు చూస్తూ గడిపినట్టు సమాచారం. భర్తను హత్య చేసేందుకు తన ప్రియుడితోపాటు ఆమెకు మరో వ్యక్తి కూడా సహకరించినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఆర్ఎంపీనాగరాజు హత్యకేసులో మరో వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నాగరాజును ఐదు నెలల క్రితమే హత్యచేయాలని భార్య లక్ష్మీ మాధురి , ప్రియుడు గోపి పధకం పన్నినట్లు తెలియవచ్చింది. దీనిలో భాగంగా నాగరాజు తనను వేధిస్తున్నాడని లక్ష్మీ మాధురి తన కుటుంబ సభ్యులతో కలసి దుగ్గిరాల పోలీస్స్టేషన్లో ఆగస్టు 1వ తేదీన ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని మొత్తం పోలీసుల ముందు నాగరాజు వివరించడంతో చివరకు లక్ష్మీ మాధురి ప్లేటు ఫిరాయించి ప్రియుడిని తమ్ముడిగా చెబుతూ నమ్మబలికింది. అవసరమైతే భర్తకు విడాకులు ఇచ్చి గోపీతో వెళ్లిపోతానని పోలీసుల ముందు తేల్చి చెప్పడంతో నాగరాజు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యి, నాగరాజుతో కాపురం చేయనవసరం లేదు, వెళ్లి పొమ్మని తేల్చిచెప్పారు. అయితే నాగరాజు తన 12 సంవత్సరాలు, 3 సంవత్సరాల కుమారులు తల్లిలేక ఇబ్బంది పడతారని రాజీ పడి లక్ష్మీ మాధురికి నచ్చజెప్పి ఇంటికి తెచ్చుకున్నాడు. ముందే అనుమానం వ్యక్తం చేసిన నాగరాజు తనను భార్య హత్య చేయిస్తుందని అప్పటికే తన స్నేహితుల వద్ద నాగరాజు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆగస్టు 1వ తేదీ తరువాత ఇంటికి వచ్చిన లక్ష్మీ మాధురి ప్రియుడు గోపీతో నాగరాజు బతికి ఉండగా మనిద్దరం కలవడం కష్టం, అతడిని ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేద్దామని చెప్పడంతో గోపీ స్నేహితుడి సలహా మేరకు 20 నిద్ర మాత్రలు సేకరించారు. ఈనెల 18వ తేదీ రాత్రి నాగరాజుకు భార్య బిర్యానీ చేసి అందులో నిద్రమాత్రలు కలిపినట్లు విశ్వసనీయ సమాచారం. బిర్యానీ తింటుండగానే నాగరాజు మగతగా ఉందని బెడ్రూమ్లోకి వెళ్లి పడుకున్నాడు. ఎంతసేపటికీ నాగరాజు ప్రాణం పోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇంటిలో లైట్లు వేసుకుని లక్ష్మి మాధురి ఫోర్న్ వీడియోలు చూస్తూ ప్రియుడితో పలుమార్లు మాట్లాడిందని తెలుస్తోంది. ఆర్ఎంపీ డాక్టర్ సహకారం ... ఆ రాత్రి ఎంతసేపటికీ నాగరాజు ప్రాణం పోకపోవడంతో ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుంది. అతడి స్నేహితుడైన ఆర్ఎంపీ కూడా వచ్చి నాగరాజును హత్యచేయడంలో సహకరించినట్లు సమాచారం. నాగరాజు రెండు చేతులను గోపీ పట్టుకోగా, గోపీ స్నేహితుడు రెండు కాళ్లు పట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాధురి నాగరాజు ముఖంపై దిండుపెట్టి ఛాతీపై కూర్చోవడంతో నాగరాజు మృతి చెందినట్లు ఆర్ఎంపి డాక్టర్ గుర్తించి వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. హత్య బయట పడిందిలా.. తెల్లవారుజామున నాలుగు గంటలకే లక్ష్మీ మాధురి నాన్న లేవడం లేదంటూ కుమారుడికి చెప్పడంతో పక్కనే నివాసం ఉంటున్న నాగరాజు తండ్రిని పిలుచుకురాగా, అతడితో పాటు మరికొంతమంది వచ్చి మృతి చెందినట్లు గుర్తించి, ఏసీ బాక్సులో మృతదేహాన్ని ఉంచారు. ఉదయం నాగరాజు స్నేహితులు వచ్చి చెవి కమిలిపోయింది, ముక్క నుంచి రక్తం వచ్చింది అని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ కేసు పెడతామని నాగరాజు తండ్రికి చెప్పడంతో హత్య ఉదంతం బయట పడింది. మొదటి నుంచి నాగరాజు తండ్రి తన కొడుకుని ఇద్దరు చంపడం జరగదని, అందులో ఇంకా కొంతమంది ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు ఈ హత్య కేసులో మరొక వ్యక్తి ఉన్నట్లు దుగ్గిరాల పోలీసులు గుర్తించి ఆర్ఎంపీ డాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
Nandyala: గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి,నంద్యాల: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య విధులు ముగించుకుని గన్ హ్యాండోవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గన్ మిస్ ఫైర్ అయ్యాయింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా,బాధితుడు హుబ్లీ నుంచి విజయవాడ వెళ్తున్న రైలులో విధులు నిర్వహించగా ..అతడిది సి. బెలగల్ గ్రామానికి చెందినట్లు సమాచారం. -
చెంప దెబ్బకు చంపేశాడు!
న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని మౌజ్పూర్లోని ఆ కేఫ్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ, ఒక్కసారిగా పేలిన తుపాకీ గుళ్లు అలజడి రేపాయి. వెల్కమ్ ప్రాంతానికి చెందిన ఫైజాన్ అలియాస్ ఫజ్జీ (24) అనే యువకుడు కేవ్లో ఉండగా.. తల, ఛాతీలో తూటాలు దిగి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర గాయాలైన ఫైజాన్ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే హంతకుడు ఇన్స్ట్రాగామ్లో ప్రత్యక్షమై నేరాన్ని అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది. ఔను.. నేనే చంపేశా.. హత్య జరిగిన కొన్ని గంటలకే నిందితుడు తన ఇన్స్ట్రాగామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేని ఆ గొంతు వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ‘నేనే ఫైజాన్ను చంపాను. నాలుగు నెలల క్రితం వాడు నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయాను.. అందుకే ఇప్పుడు వాడి ప్రాణం తీశాను. ఇందులో మా కుటుంబానికి, స్నేహితులకు సంబంధం లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత కక్ష!’.. అంటూ నిందితుడు కెమెరా ముందు ఒప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పు తీర్చమన్నందుకే.. హత్యకు కారణం పాత కక్ష అని నిందితుడు బుకాయిస్తున్నా, బాధితుని కుటుంబం మాత్రం మరో భయంకరమైన కోణాన్ని బయటపెట్టింది. నిందితుడు ఫైజాన్ దగ్గర రూ.40,000 అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకే పక్కా ప్లాన్తో చంపేశాడని మృతుని సోదరుడు సల్మాన్ ఆరోపిస్తున్నాడు. ‘వాడు కేవలం కాల్చడమే కాదు, కత్తితో కూడా పొడిచాడు. నా తమ్ముడు ప్రాణాల కోసం ఎంత పోరాడాడో ఆ గాయాలే చెబుతున్నాయి’.. అంటూ సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమ కేఫ్ సీజ్ ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. అక్రమంగా నడుస్తున్న ఆ కేఫ్ను వెంటనే సీజ్ చేశారు. నిందితుడు పోస్ట్ చేసిన వీడియో నిజమేనా? లేక తప్పుదోవ పట్టించే కుట్రా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ట్రావెల్స్ బస్సు బీభత్సం
కొనకనమిట్ల: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని, ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... శుక్రవారం రాత్రి కనిగిరి నుంచి వెదురుకర్రల లోడుతో గిద్దలూరుకు వెళ్తున్న బొలేరో వాహనం చినారికట్ల సమీపంలో మరమ్మతులకు గురైంది. డ్రైవర్ పీరయ్య బొలేరోను రోడ్డు పక్కన నిలిపి వాహనం లోపల నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వాసవి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్ను కూడా ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న వెదురు కర్రలు ట్రావెల్స్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకుపోయాయి. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు ముందు సీటులో కూర్చున్న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్రెడ్డి (54) పొట్టలోకి వెదురు కర్ర చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు బస్సుల డ్రైవర్లతోపాటు మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొనకనమిట్ల పోలీసులు కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. జనార్ధన్రెడ్డి మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో వచి్చన భారీ శబ్దానికి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి ఏమైందో తెలియక చీకట్లో తీవ్ర భయాందోళనలకు గురై ఆర్తనాదాలు చేశారు. -
వైద్యురాలి భర్తపై కన్నేసిన మహిళ.. భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్తో దాడి
కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తపై కన్నేసిన ఓ మహిళ భార్యాభర్తలను విడదీసేందుకు హెచ్ఐవీ ఇంజెక్షన్తో దాడి చేసి, పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. కర్నూలు నగరం గణేష్ నగర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నివాసముంటున్నారు. నందికొట్కూరు రోడ్డులోని మల్లారెడ్డి వెంచర్లో నివాసముంటున్న బీచుపల్లి బోయ వసుంధరకు మహిళా వైద్యురాలి భర్తతో పరిచయం ఉంది. భార్యాభర్తలను విడదీస్తే తాను మరింత దగ్గర కావొచ్చన్న దురుద్దేశంతో ఆదోని ఇందిరాగాంధీ నగర్కు చెందిన కొంగె జ్యోతి, భూమా జస్వంత్, భూమా శృతితో కలిసి వైద్యురాలిపై దాడికి పథకం పన్నింది. వైద్యురాలికి హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చి, ఆమెకు హెచ్ఐవీ సోకిందని చెబితే ఆ జంట విడిపోతుందని భావించింది. ఈ నెల 9న ఆమె ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా లక్ష్మీనగర్ కేసీ కెనాల్ గట్టు వద్ద వైద్యురాలి వాహనాన్ని ఢీకొట్టారు. ఆమెను ఆటోలో ఎక్కించేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి, హెచ్ఐవీ ఇంజెక్షన్ వేసి పరారయ్యారు. జరిగిన విషయాన్ని వైద్యురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ పేర్కొన్నారు. -
వేధింపులు తట్టుకోలేక స్టాఫ్నర్సు ఆత్మహత్యాయత్నం
చల్లపల్లి (అవనిగడ్డ): చంద్రబాబు ప్రభుత్వంలో పనిభారం, అధికారుల ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురైన స్టాఫ్నర్సు కాజ అనిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పనిచేయడం కంటే చావడమే మేలనుకుని నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. అనిత తల్లి నాగమణి, అత్త పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. కాజ అనిత (34) నాలుగేళ్లుగా శ్రీకాకుళం పీహెచ్సీలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త శ్రీకాంత్, కుమారుడు ఆనంద్కుమార్, కుమార్తె బేబీ సునైన ఉన్నారు. భర్త శ్రీకాంత్, కొడుకు ఆనంద్కుమార్కు అనారోగ్య సమస్యలున్నాయి. భర్త, కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో గుడివాడలో ఉన్న అత్తమామల వద్దే ఉంటూ అక్కడి నుంచే రోజూ విధులకు హాజరవుతోంది. ఈ క్రమంలో కొంత కాలంగా పనిభారం ఎక్కువైంది. రాత్రి, పగలూ విరామం లేకుండా వెంటవెంటనే డ్యూటీలు వేస్తున్నారు. భర్త, కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించేందుకు అనితకు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడం లేదు. నాలుగు నెలల క్రితం వచ్చిన వైద్యురాలు మరింత వేధింపులకు గురి చేస్తూ మెమోలు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక వైపు జిల్లా అధికారుల చుట్టూ తిప్పుతూ, మరోవైపు అదనపు పనిభారం మోపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉండగా నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. తోటి సిబ్బంది వెంటనే చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఈ ఘటన జరిగితే శనివారం సాయంత్రం వరకూ ఏ ఒక్క అధికారీ వచ్చి పలకరించలేదని అనిత కుటుంబ సభ్యులు వాపోయారు. అనితకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా పెరిగిన పనిభారం రెండేళ్ల నుంచి పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, ప్రాణం మీదకు వచ్చినా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వడం లేదని అనితను చూసేందుకు చల్లపల్లి ఆస్పత్రికి వచ్చిన శ్రీకాకుళం పీహెచ్సీ వైద్య సిబ్బంది వాపోయారు. తాము అనారోగ్యానికి గురైతే చేతికి సెలైన్ సీసాలు కట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, తమ కష్టం ఎవరికీ రాకూడదని వేడుకొంటున్నారు. స్టాఫ్నర్సుల పరిస్థితే ఆత్మహత్య చేసుకునేలా ఉందంటే కింది స్థాయి సిబ్బంది ఇంకెంత దయనీయస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలని పలువురు సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేశారు.


