breaking news
Crime
-
ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలి దుర్మరణం
బత్తలపల్లి: బస్సు రాగానే ఎక్కేందుకు ప్రయాణికుల నడుమ తోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు అదే బస్సు కింద పడి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో ఆదివారం జరిగింది. కదిరికి చెందిన భాగ్యమ్మ(80) తన కోడలు మాధవితో కలిసి ఆదివారం ధర్మవరంలో సమీప బంధువుల ఇంట్లో శుభకార్యం చూసుకుని బత్తలపల్లికి చేరుకున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో కదిరి వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా బస్సు రావడంతో ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ కారణంగా తోపులాట జరిగింది. భాగ్యమ్మ ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడింది. బస్సు ముందుకు కదలగానే ఆమె తలపై నుండి వెనుక చక్రాలు వెళ్లాయి. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ బస్సులో మహిళ మృతిజంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ శ్వాస ఆడక మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పిడి జ్యోతిరెడ్డి (50) ఆదివారం జంగారెడ్డిగూడెంకు వెళ్లేందుకు గోపాలపురంలో కొవ్వూరు ఆర్టీసీ డిపో బస్సు ఎక్కింది. బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్కు వచ్చేసరికి జ్యోతిరెడ్డి స్పృహ తప్పి పోయిఉంది. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారమివ్వగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్టు చెప్పారు. జ్యోతిరెడ్డి కుమారుడు తన తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఆమె మృతిపై అనుమానాలూ లేవని చెప్పి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు. కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
వలిగొండ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామంలో ఆది వారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.తుర్కపల్లికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసు కుందామని మత్స్యగిరిని ఇటీవల మమత కోరగా అతడు నిరాకరించాడు. ఆదివా రం మమత తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్ల గా.. ఆమె సోదరి భవాని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాను ప్రే మించిన వ్యక్తి మోసం చేశాడని మమత సూసై డ్ నోట్ రాసి, సోదరికి ఫోన్ చేసి ‘అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పి చున్నీతో ఫ్యాన్కు ఉరేసు కుంది. మమత సోదరి బావి వద్ద నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కని పించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
బీమా డబ్బుల కోసం భర్త హత్య
ఖమ్మం రూరల్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు కథనం ప్రకారం.. ఖమ్మం గాంధీనగర్కు చెందిన చాగంటి రవి (55) పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కాగా, రవిపై ఇన్సూరెన్స్ చేయించి, బీమా డబ్బులు కాజేయాలని భార్య ప్రశాంతితో పాటు మరో నలుగురు కలిసి ప్లాన్ చేశారు. ప్రశాంతికి వరుసకు సోదరుడైన దేశబోయిన శ్రీనివాస్తో పాటు జోగి రాజ్కుమార్, జోగి వెంకటేశ్, జోగి రాంబాబు కలిసి రవి పేరున రూ.66 లక్షలకు బీమా చేయించారు. సమయం చూసి అతడిని హతమార్చి ఆ సొమ్ము కాజేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి దేశబోయిన శ్రీనివాస్.. రవి ఇంటికి వచ్చి మద్యం తాగుదామంటూ తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగాక ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం వైపు తీసుకెళ్లి గ్రామ శివారులో రవిని దింపి శ్రీనివాస్ వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ముందస్తు ప్లాన్ ప్రకారం జోగి వెంకటేశ్కు చెందిన కారును రాజ్కుమార్ వేగంగా నడుపుతూ వచ్చి రవిని ఢీకొట్టి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భార్య ప్రశాంతి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చి.. విచారించగా నిందితులు అసలు విషయం ఒప్పుకున్నారు. దీంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి
సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్లో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్ వార్డెన్పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీఎంఐఎస్)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న బ్రూస్పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు. -
పెంచలేక ముగ్గురు పిల్లల్ని చెరువులోకి తోసేసిన తండ్రి
సాక్షి,కామారెడ్డి: ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. పెంచలేక తన కుమార్తెలను చెరువులోకి తోసేసినట్లు తండ్రి ఇస్మాయిల్ అంగీకరించాడు.పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి ఆర్బీ నగర్కు చెందిన ఇస్మాయిల్,షబీనా దంపతులు. వారికి షీపత్(8), ఆయత్ (7), మరియం(5) కుమార్తెలు. ఇస్మాయిల్ ఆటో నడుపుతుండగా.. షబీనా కూలి పనులకు వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే, ఇటీవల ఇస్మాయిల్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రూ.5లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి, మరోవైపు పిల్లల్ని పెంచడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇస్మాయిల్ దారుణానికి ఒడిగట్టాడు. పిల్లల్ని పెంచలేక స్థానిక చెరువులో తోసేశాడు. ప్రాణాలు పోయాయా? లేవా? అని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నాడు.పిల్లల అదృశ్యంపై ఇస్మాయిల్ భార్య షబీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. తండ్రి ఇస్మాయిల్ను సైతం ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో తండ్రి ఇస్మాయిల్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. విచారణలో కుమార్తెలను తాను ప్రాణం తీసినట్లు అంగీకరించాడు. చెరువులో నుంచి పిల్లల్ని వెలికి తీశారు. -
కన్న తండ్రే కాలయముడయ్యాడు..
కామారెడ్డి క్రైం: పోషించడం చేతకాక కన్న తండ్రే తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన చేతులతోనే అభం శుభం ఎరుగని చిన్నారులను చెరువులో తో సేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డిలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కుమార్తెలను దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని తీసుకెళ్లాడు. దగ్గర్లోని దుకాణానికి వెంట తీసుకువెళ్లిన తండ్రి, పిల్లలలు ఇంటికి తిరిగి రాలేదు. కొద్ది సేపటికి షబీనా భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదని అడిగింది. తాను పిల్లలకు తినుబండారాలు కొనిచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని సూచించి ఆటో నడిపేందుకు బయటకు వెళ్లిపోయాన ని బుకాయించాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అందరూ కలిసి చాలా సేపు సమీప ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాయంత్రం చీకటిపడే వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా పిల్లల ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్ను విచారించగా తానే పిల్లలల్ని చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వెంటనే పెద్ద చెరువు వద్దకు చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియంల మృతదేహాలు లభించాయి. షీపత్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి కనుగొన్నారు. విషయం బయటకు తెలియడంతో పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోషణ భారమై పిల్లలను తానే హత్య చేసినట్లు ఇస్మాయిల్ అంగీకరించాడని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. -
వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాలలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సుమిత్రానగర్లోని ఓ అపార్టుమెంట్లో వ్యభిచార కేంద్రంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్ (47), మరో మహిళ(47)ను అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు, రవికుమార్లను రిమాండ్కు తరలించారు. అదే విధంగా అదే కాలనీలోని మరో అపార్టుమెంట్లో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో మహిళను (32) హోంకు తరలించారు. -
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తణుకు సురేశ్, స్వప్న (42) దంపతులకు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్మిల్లు ఉంది. 2021–2022లో కస్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వీరి రైస్మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. అలాగే వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లో బాత్రూములోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లుండగా పెద్దకూతురు వివాహం చేశారు. చిన్నకూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు
హైదరాబాద్: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్ చేసి సినిమా షూటింగ్ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్ మీడియాలో పోస్టే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్లో నివసిస్తున్న శంకర్(25) రీల్స్తో పాటు వెబ్సిరీస్లకు దర్శకత్వం వహిస్తుంటాడు. కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో వేషం ఉందంటూ శంకర్ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్ నిర్వహించి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్లు సన్నివేశాలను పోస్ట్ చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువ దర్శకుడు శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుని హత్యతో రణరంగం.. వాహనాల దహనం, రాస్తారోకో
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన హోలీ సంబరాలు విషాదానికి దారితీశాయి. రంగుల పండుగ వేళ జరిగిన స్వల్ప వివాదం చివరికి యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నైరుతి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో శుక్రవారం ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ), భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 4న హోలీ వేడుకల సందర్భంగా జేజే కాలనీలోని ఒక ఇంటి పైకప్పు నుంచి 11 ఏళ్ల బాలిక నీటి బెలూన్లను కింద ఉన్న తన బంధువులపైకి విసురుతోంది. అయితే, ప్రమాదవశాత్తూ ఆ రంగు నీళ్లు మరో వర్గానికి చెందిన మహిళపై పడ్డాయి. ఇది ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ మహిళ తన కుటుంబ సభ్యులు, మరికొందరితో కలిసి తరుణ్ కుటుంబంపై దాడికి దిగారు. తరుణ్ను 10 మంది చుట్టుముట్టి కర్రలు, రాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తలకి తీవ్ర గాయాలవ్వడంతో తరుణ్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ దాడిలో తరుణ్ తాత మాన్ సింగ్తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. STORY | Vehicles set ablaze, massive protest blocks road in Delhi's Uttam Nagar after man killed in Holi clashTension escalated in southwest Delhi's Uttam Nagar on Friday as a car and a motorcycle were set on fire, and a massive protest by Hindu political outfits blocked… pic.twitter.com/4qsI4PkQEo— Press Trust of India (@PTI_News) March 6, 2026తరుణ్ మృతితో ఆగ్రహించిన స్థానికులు ఉత్తమ్ నగర్ తూర్పు మెట్రో స్టేషన్ వద్ద భారీ నిరసన చేపట్టారు. వందలాది మంది రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఆందోళనకారులు ఆగ్రహంతో ఒక కారును, మోటార్ సైకిల్ను తగులబెట్టారు. ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన బాధితుడి తండ్రి, నిందితులను కఠినంగా శిక్షించే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.ఈ ఘటనపై ద్వారక డీసీపీ కుశాల్ పాల్ సింగ్ స్పందిస్తూ.. ‘తహోలీ బెలూన్ వివాదమే ఈ ఘర్షణకు మూలమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశాం. ఒక మైనర్ను అదుపులోకి తీసుకున్నాం. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఉత్తమ్ నగర్ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, శాంతియుతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: పగిలిన ఇటుకలు.. వలస గుండె చప్పుళ్లు! -
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు చోరీకి గురైంది.దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. -
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
ఇరాన్పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగింది. ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే! -
పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యమరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్పీ సునీతా రావత్ తెలిపారు.గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు. -
వ్యసనాల కొడుకును వధించి..
ఇందల్వాయి (నిజామాబాద్ రూరల్): మత్తు వ్యసనాలకు బానిసైన కొడుకును ఒక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. నల్లవెల్లికి చెందిన కొత్తగొల్ల లక్ష్మి, కిషన్ దంపతులకు ఇద్దరు కొడుకుల్లో భాను ప్రకాశ్ (23) చిన్నవాడు. పదో తరగతి వరకు చదివిన భాను ప్రకాశ్ పైచదువులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. అయిదారేళ్లుగా చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు బానిసై తల్లిదండ్రులను వేధిస్తూ జులాయిగా తిరుగుతున్నాడు. భాను ప్రకాశ్ తరచూ గొడవ పడటంతో.. అతని అన్న గ్రామాన్ని విడిచి హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కొద్ది రోజులుగా వేరే వారి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో కొడుకుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తండ్రి కిషన్ ఇంట్లో నిద్రిస్తున్న భానుప్రకాశ్ను బుధవారం అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
అప్పులు చేయొద్దని తల్లి మందలించిందని..
నవాబుపేట: అప్పులు ఎక్కువగా చేస్తున్నారని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన భార్యతో కలిసి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం జంగమయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగమయ్యపల్లికి చెందిన మురగని రవి (25), లావణ్య (23) భార్యాభర్తలు. రవి కొంతకాలంగా ఎక్కువగా అప్పులు చేస్తుండటంతో బుధవారం రాత్రి అతడి తల్లి పద్మమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రవి భార్య లావణ్యతో పాటు 11 నెలల కూతురిని తీసుకుని పొలానికి వెళ్లాడు. రాత్రి పొలంలోనే వారు నిద్రించారు. గురువారం ఉదయం రవి తన సోదరుడు ఆనంద్కు వీడియో కాల్ చేసి.. చెట్టుపై తాను, తన భార్య కూర్చున్నామని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆనంద్ గ్రామస్తులతో కలిసి పొలానికి వెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వారిని కిందికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే లావణ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రవి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇద్దరు స్నేహితుల ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా: ప్రేమ విఫలమైందని ఒకరు.. స్నేహం కోసం మరొకరు.. ఇద్దరు యువకులు కలిసి ఒకేచోట మద్యంలో గడ్డిమందు (గ్లైఫోసెట్) కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన లోడె పవన్, కోనేటి అఖిల్లిద్దరూ క్లాస్మేట్స్తోపాటు ప్రాణ స్నేహితులు కూడా. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. నల్లగొండలో ఐటీఐ కూడా కలిసే చదివారు. ఈ క్రమంలోనే పవన్ కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పవన్, ఆ బాలిక పది రోజుల కిందట ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కట్టంగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయాన్ని పవన్ కుటుంబీకులకు తెలియజేయగా.. అడ్రస్ తెలుసుకొని పవన్ను, ఆ బాలికను రప్పించారు. ఆపై బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ప్రేమ విఫలమైందని పవన్ కుమిలిపోతున్నాడు. ఇద్దరూ కలిసి..: పవన్, అఖిల్ రోజు మాదిరిగానే బుధవారం కలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గడ్డిమందు, మద్యం, కూల్డ్రింక్ కొనుగోలు చేసి వాటిని తీసుకొని పవన్ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగారు. ఆ తర్వాత తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పారు. వారు వచ్చేసరికి ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. -
దంతేవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్: దంతేవాడ-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు రాజీవ్ పునేమ్ మరణించాడు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఐఎస్ఎస్ఏఎస్ రైఫిల్స్,పిస్టల్స్తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. -
అత్త పోరు.. మహిళా టెక్కీ ఆత్మహత్య
యశవంతపుర(కర్ణాటక): మంచి ఉద్యోగం, దండిగా జీతం.. కానీ కుటుంబ కలహాలతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు అబ్బిగెరెలో జరిగింది. అత్త వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) డెల్ సంస్థలో ఐటీ ఇంజనీరు, ఐదేళ్ల క్రితం పునీత్కుమార్తో పెళ్లి కాగా, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇంటిలో చిన్నచిన్న విషయాలపై అత్త కల్పనతో సుష్మకు గొడవలు జరిగేవి. మంగళవారం అత్తతో పోట్లాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన సుష్మ ఇంటిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. అత్త, భర్త వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందని, అదనపు కట్నం తేవాలని సతాయించేవారని సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, సోలదేవనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. -
27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
ఇద్దరూ కూతుళ్లే అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోలేదు. భారంగా భావించనూ లేదు. తాహతుకు మించి పెంచారు.. ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న పెద్దమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చాలనుకున్నారు. మంచి సంబంధం చూసి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన ఆ తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరి అయిపోయింది. పెళ్లికూతురి ముస్తాబులో కళకళలాడాల్సిన కుమార్తె పట్టాల మీద ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడం వారిని కలచి వేసింది. ఇంతకూ ప్రవల్లిక మరణానికి కారణం ఏమిటి..! బలవన్మరణానికి పాల్పడిందా? పెళ్లి ఇష్టం లేదా?? ఇంకేదైనా బలమైన కారణం ఉందా??? పోలీసు దర్యాప్తులోనే తేలుతుంది.టెక్కలి రూరల్/నందిగాం: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ సెకెండియర్ చదువుతున్న కింతలి ప్రవల్లిక(19) బుధవారం రైలు కింద పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కింతలి గోపాలరావు, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రవల్లిక ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండగా, చిన్న కుమార్తె హారిక గుంటూరులో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. గోపాలరావు తాపీమేస్త్రీ కాగా శిరీష గృహిణి. ప్రవల్లికకు ఈ నెల 27న వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఎప్పట్లాగే బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక టెక్కలి మండలం తలగాం సమీపంలో సాయంత్రం వచ్చే రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు ఐడీ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెలవిసేలా రోదించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా,కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక నందిగాం వైపు రాకుండా నౌపడ రూట్ ఎందుకు వెళ్లింది.. మృతి చెందడానికి కారణాలు ఏంటనే విషయాలు తెలియాల్సి ఉంది. -
వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి...
ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి..శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్ బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వెజ్ బిర్యానీ షాప్ ఫ్రీజర్లో డెడ్బాడీ, షాకైన ఓనర్
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, నాలుగు రోజులుగా మూసి ఉన్న వెజ్ బిర్యానీ దుకాణం ఫ్రీజర్లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నోలోని GCRG కళాశాల ఎదురుగా ఉన్న బిర్యానీ దుకాణ యజమాని అజయ్ పాల్ కొనుగోలు కోసం బైటికి వెళ్లాడు నాలుగు రోజుల తర్వాత తిరిగి షాప్కు వచ్చి, డీప్ ఫ్రీజర్ను చెక్ తనిఖీ చేస్తుండగా లోపల డెడ్ బాడీని గుర్తించి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలుసుai మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం మిత్తం తరలించారు.మృతుడి జేబులో దొరికిన మొబైల్ ఫోన్ ,ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని బక్షి కా తలాబ్ (BKT)లోని కిషున్పూర్ గ్రామానికి చెందిన విజయ్ పాల్గా గుర్తించారు. ఈ దుకాణం మూడు వైపులా టిన్ షీట్లతో నిర్మించిన తాత్కాలిక నిర్మాణం అని, సరైన గేట్ లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహం తీవ్ర గాయాలైన గుర్తులు లేవు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నామని వెల్లడించారు.పోస్ట్మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: లిఫ్ట్లో షాకింగ్ యాక్సిడెంట్.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!ప్రాథమిక దర్యాప్తులో అతని చెప్పుల్లో ఒకటి కళాశాలకు దగ్గరగా ఉన్న రోడ్డు మూలన, మరొకటి మరొకటి దుకాణం లోపల గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మృతుడు దుకాణంలోకి ఎలా, ఎప్పుడు ప్రవేశించాడు, చివరిగా ఎప్పుడు తెరిచారు అనే విషయాలను కూపీ లాగుతున్నారు.ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! -
కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు.. టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు: కూర చేసే విషయంలో అత్తతో మనస్పర్ధలు తలెత్తడంతో టెక్కీగా విధులు నిర్వహిస్తున్న కోడలు ఆత్మహత్య చేసుకుంది. కోడలి ఆత్మహత్యతో అత్త పరారైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారత్ సిలికాన్ సిటీ బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టెక్ కంపెనీ డెల్ మాజీ ఉద్యోగి సుష్మ(35) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్తో సుష్మ వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు. బెంగళూరులో నివాసం ఉంటున్నారు.అయితే, పునీత్కుమార్ దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం సుష్మ, ఆమె అత్త కల్పన మధ్య వంట చేసే విషయంలో వాగ్వాదం జరిగింది. అత్త తనను వంట చేసేందుకు అనుమతించకపోవడంతో పాటు ఇతర విషయాల్లో తనని వేధిస్తుందని మనోవేధనకు గురైంది. దీంతో ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కానీ సుష్మ కుటుంబ సభ్యులు మాత్రం అత్తింటి అరళ్లకు తాళలేక తమ కుమార్తె ప్రాణం తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుష్మ కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త పునీత్కుమార్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అత్తకోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
బొబ్బిల్లంకలో మాజీ భార్య, అత్త హత్య
సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సుబ్బారావుపేటలో మాజీ భార్య, అత్త దారుణ హత్య సంచలనం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుబ్బారావుపేటకు చెందిన సోడదాసి సీతారామరాజు (పండు), అదే వీధిలో ఉంటున్న లత (30)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీతారామరాజు ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. గతంలో పోక్సో కేసులో కొన్నాళ్లు రిమాండ్లో ఉన్నాడు. అతడి బెయిల్ కోసం లత ఫైనాన్స్ వ్యాపార లావాదేవీలు చూసుకునేది. బెయిల్పై వచి్చన సీతారామరాజు భార్య లతపై అనుమానం పెంచుకున్నాడు. ఒకసారి మద్యం మత్తులో ఆమెను తీవ్రంగా కొట్టాడు. భర్తపై అప్పట్లో సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మనస్పర్థలు పెరగడంతో ఏడాదిన్నర కిందట విడిపోయారు. పిల్లలు ముగ్గురూ తండ్రి సీతారామరాజు వద్దే ఉంటున్నారు. రెండో పెళ్లి చేసుకున్న సీతారామరాజు సీతారామరాజు తన ఇంటి ఎదురుగా ఉంటున్న కుమారిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె గర్భిణి అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలోని తన చెల్లి, బంధువుల ఇంట్లో ఉంటున్న లత ఇటీవల బొబ్బిల్లంకలోని తల్లి గుమ్మడి లక్ష్మి (50) వద్దకు వచ్చింది. ఆమెను సీతారామరాజు గమనించాడు. తనను వదిలేసిన మొదటి భార్య లత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోందని, పిల్లల ఆలనా పాలనా తానే చూసుకోవాల్సి వస్తోందని, ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కత్తులు తీసుకుని ముగ్గురు స్నేహితులతో కలిసి మాజీ అత్త లక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు గేటు బయట ఉండగా, మరో స్నేహితుడు గుమ్మం వద్ద నిలబడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన సీతారామరాజు నిద్రిస్తున్న తన మొదటి భార్య లత చేతులు, భుజాలు, మెడ, ముఖంపై కత్తితో నరికాడు. ఆమె భయంతో కేకలు వేసింది. అది గమనించిన అత్త లక్ష్మి గట్టిగా అరుస్తూ అతడికి అడ్డం వచ్చింది. ఆమెను కూడా సీతారామరాజు కత్తితో నరికి హతమార్చాడు. కత్తిని గోదావరిలోకి విసిరేసి, నేరుగా సీతానగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణ.. సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మంగళవారం సందర్శించారు. నిందితుడు సీతారామరాజుకు నేర చరిత్ర ఉందని తెలిపారు. పన్నెండేళ్ల కిందట రోడ్డుపై ఓ వ్యక్తిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడని, అటువంటి వాడు బతకకూడదదని కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద రోదించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యల్లో సీతారామరాజుకు సహకరించిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ వేళ విషాదం
సుభాష్నగర్/బోధన్/ఆర్మూర్టౌన్/హాలియా: హోలీ వేడుకలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. హోలీ సంబరాలను ముగించుకొని నది/చెరువులోకి స్నానాలకని వెళ్లిన వారు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. విగత జీవులైన పిల్లలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూరారంలో... పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీకి చెందిన సాగర్, అజయ్, ఛత్రపతి, కృష్ణనగర్కు చెందిన అభిషేక్, శ్రీరామ్నగర్కు చెందిన విగ్నేష్ స్నేహితులు. వీరు బహదూర్పల్లిలోని తాము చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విశ్వకర్మ కాలనీని ఆనుకొని ఉన్న రామన్ చెరువులో స్నానానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అజయ్, విగ్నేష్, ఛత్రపతి.. షాపులో షాంపూలు కొనితెస్తామని చెప్పగా.. సాగర్, అభిషేక్ చెరువు వద్దకు వెళ్లి లోపలికి దిగారు. అంతలోనే మిగతా ముగ్గురు స్నేహితులు అక్కడికి రాగా ఆ ఇద్దరు చెరువులో మునిగిపోతూ చేతులు ఊపారు. దీంతో బయట ఉన్న ముగ్గురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నీళ్లలోకి దిగారు. అయితే, అక్కడ లోతుగా ఉండటంతో సాగర్, అభిషేక్ మునిగిపోయారు. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం తొగుట గ్రామానికి చెందిన ఏసు, జ్యోతిల కుమారుడు అభిషేక్. విశ్వకర్మ కాలనీకి చెందిన సంతోష్ కుమార్, రేఖ దంపతుల చిన్న కుమారుడు సాగర్. మంజీరలో మునిగి... స్నేహితులతో హోలీ సంబరాలు జరుపుకుని మంజీరనదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఒకటో వార్డు పరిధిలోని ఆచన్పల్లికి చెందిన సాయికుమార్ (20), రోని చౌదరి (18) మంగళవారం సాలూర సమీపంలోని మంజీర నదికి వెళ్లారు. స్నానాలు చేస్తూ నీటిలో గల్లంతై మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు నదికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. సాయికుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రోని చౌదరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్మూర్లో విషాదం : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్థానిక గోల్ బంగ్లా ప్రాంతానికి చెందిన బోగడ నరేష్ పెద్ద కుమారుడు హర్షిత్ (15) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. హర్షిత్ మంగళవారం స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. అనంతరం గుండ్ల చెరువు వద్ద ఉన్న ట్యాంక్బండ్కు వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో హర్షిత్ నీటిలో మునిగిపోయి మరణించాడు. సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు గల్లంతు నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్(14), అదే మండలం శాఖాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని స్నేహితులు. వీరు హాలియాలో నివాసముంటున్నారు. బబ్లూచారి బైక్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. నాని ఆటోలకు రెగ్జిన్ పనిచేస్తున్నాడు. ముగ్గురు కలిసి బిర్యానీ పార్సిల్తో మంగళవారం సాయంత్రం హాలియాలోని అక్విడెక్ట్ వద్దకు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం కార్తీక్ చేతులు కడుక్కోవడానికి సాగర్ ఎడమ కాల్వలోకి దిగుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. కార్తీక్ను రక్షించేందుకు బబ్లూచారి కాల్వలోకి దిగుతుండగా.. అతడు కూడా కాలుజారి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. నాని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిగా ఉండటంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఏపీలో... గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిగలో ముగ్గురు స్నేహితులు చెరువులోకి దిగి మృతిచెందారు. బోళ్ల సాయి (15), ముచ్చు వెంకట జోసఫ్ (15), దుప్పుల వినయ్కుమార్(12) హోలీ పండుగ జరుపుకొని అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. కాలుజారి సాయి, వెంకట జోసఫ్, వినయ్కుమార్ చెరువులో పడి మృతిచెందారు. వీరు గొల్లనపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నారు. -
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
భువనగిరి, వలిగొండ: భర్తతో గొడవల కారణంగా ఇద్దరు కన్నబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్కు వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఎరుపుల యాదయ్య, పద్మ దంపతుల కుమార్తె ఐశ్వర్య (28)తో 2020లో వివాహం జరిగింది. మహేశ్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత వారికి కుమార్తె ఝాన్సీ (2) జన్మించింది. ఆ తర్వాత మహేశ్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఐశ్వర్య అతన్ని నిలదీసేది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని ఐశ్వర్యను మహేశ్ వేధిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో గొడవల వల్ల పుట్టింటికి వెళ్లి అక్కడే కుమారుడి (10 నెలలు)కి జన్మనిచ్చింది. అప్పట్నుంచి అక్కడే భార్య ఉంటుండగా మహేశ్ తన కుమారుడిని చూసేందుకు ఒక్కసారీ రాలేదు. పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇప్పుడైనా రావాలని భర్తను భార్య కోరగా తొలుత ఆమెనే అత్తారింటికి రావాలన్నాడు. దీంతో సోమవారం సాయంత్రం ఐశ్వర్య తన పిల్లలతో కలిసి అత్తారింటికి చేరుకుంది. రాత్రికి మహేశ్ విధులకు వెళ్లగా ఐశ్వర్య తన పిల్లలతో ఓ గదిలో నిద్రించింది. మంగళవారం ఉదయం ఎంతకీ ఐశ్వర్య నిద్ర లేవకపోవడంతో అత్తమామలు గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఐశ్వర్య ఫ్యాన్కు ఉరేసుకుంది. అయితే గొల్లగూడెం చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తే ఐశ్వర్యను, పిల్లలను హతమార్చాడని ఆరోపించారు. భువనగిరి డీఎస్పీ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి గదిలో మూడు పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని.. వారిని జైలుకు పంపాలని లేఖలో ఐశ్వర్య రాసింది. తన వెంట తెచ్చిన పిల్లలను తన వెంటే మృత్యుఒడికి తీసుకెళ్తన్నట్లు లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పెయింటింగ్స్ రూపంలో డ్రగ్స్ రవాణా
బనశంకరి: చూస్తే ఆకర్షణీయమైన పెయింటింగ్స్ మాదిరిగా ఉంటాయి, కానీ అవి కోట్ల రూపాయల విలువజేసే డ్రగ్స్తో తయారైనవని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేరళ జంటని పోలీసులు అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేరళకు చెందిన అశ్విన్ (24), ముబీనా (25) బెంగళూరులో బీబీఏ చదవడానికి వచ్చి మధ్యలోనే చదువును ఆపేసి మత్తు పదార్థాల వ్యాపారంలోకి దిగారు. థాయ్లాండ్ నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు.ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ ఫ్లాట్పై దాడి చేసి అశ్విన్, ముబీనాను అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన 8,335 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 5 కేజీల హైడ్రో గంజాయి, 534 గ్రాముల చరస్ తదితరాలను సీజ్ చేశారు. పెయింటింగ్స్ రూపంలో ఎల్ఎస్డీ స్ట్రిప్స్ను తయారు చేసి కావలసినవారికి విక్రయించేవారు. దీనివల్ల ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. అలాగే చాక్లెట్లు, బిస్కెట్ బాక్సుల్లో హైడ్రో గంజాయి ప్యాక్ చేసి తరలించేవారు. -
స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు.. 20 మంది అరెస్ట్
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రెండు స్పా సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో అరెస్టైన 20 మందిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. -
బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు..
హైదరాబాద్లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతినగర్లోని ఓ ఫర్నీచర్ షాపులో ఈ ఘోర అగ్నప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంతేకాకుండా దీంతో పుట్పాత్పై ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నించారు. రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. అయితే షార్డ్ సర్ప్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్కడే ఉన్న కమాన్ వద్ద వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒక ఓ దుకాణంలోమంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామగ్రికి అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #Telangana | #HyderabadMassive fire in Bachupally gutted a furniture store near Vignan VNR College under Nizampet Circle limits.Firefighters rushed with multiple engines. No casualties reported. Further details awaited. pic.twitter.com/VSrkerhxfn— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) March 3, 2026 -
కూలర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఎగిసి పడుతున్న మంటలు
సాక్షి, కర్నూలు: వేసవి వచ్చింది లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్లో వరుస పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా కర్నూల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కర్నూలు బాలాజీ నగర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండుగ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఫలితంగా చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళలను నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో -
చిన్న వయసులో ఏ కష్టం వచ్చిందో..
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని నడింపల్లె ఎస్సీహాస్టల్లో చదువుకుంటున్న తలారి నరసింహులు (16) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు, గంగాదేవి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఉంటున్న గంగాదేవి సోదరి నాగలక్ష్మికి పిల్లలు లేరు. దీంతో ఆమె మూడేళ్ల వయసు నుంచి నరసింహులును పోషించుకుంటోంది. అతను 6వ తరగతి నుంచి ప్రొద్దుటూరులోని నడింపల్లె హాస్టల్లలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. నరసింహులు ప్రస్తుతం పదోతరగతి చదువుకుంటున్నాడు. ప్రతి ఆదివారం పోట్లదుర్తిలో ఉంటున్న తమ పెద్దమ్మ వద్దకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఆదివారం కూడా అతను పోట్లదుర్తికి వెళ్లాడు. రాత్రి ఇక్కడే ఉండమని పెద్దమ్మ చెప్పినా వినలేదు. స్టడీ క్లాస్ ఉందని చెప్పి సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చాడు. రాత్రి పడుకున్నాడు.. ఉదయం శవమై కనిపించాడురాత్రి అందరితో పాటు నరసింహులు చదువుకున్నాడు. భోజనం చేసి తోటి పిల్లలతో సరదాగా కొంతసేపు ఆడుకున్నాడు. అయితే అదరూ 10 గంటలకు పడుకున్నా అతను మాత్రం రాత్రి 11 గంటల వరకు పడుకోకుండా దిగాలుగా కూర్చొని ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. పడుకుందాం రారా అని పిలిచినా అతను రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విద్యార్థులు బయటికి రాగా హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని నరసింహులు వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్ బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణం ఉంటుందేమోనని అందరూ కలిసి చెట్టుకు వేలాడుతున్న నరసింహాలును కిందికి దించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడు. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసింహులు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. విద్యార్థులను దిక్కులేని వారిగా వదిలేశారని, రాత్రి ఒక్కరు కూడా పిల్లలను చూసువడానికి హాస్టల్లో ఉండలేదని వాపోయారు. ఏ ఒక్కరు రాత్రి హాస్టల్లో ఉన్నా నరసింహులు ప్రాణాలతో ఉండేవాడని తెలిపారు. టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకెళ్లేందుకు విద్యార్థి బంధువులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తాంవిద్యార్థి నరసింహులు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభ పేర్కొన్నారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. కాగా విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా తమ కుమారుడి మరణానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. -
కొత్త ప్రియుడుతో కలిసి పాత లవర్ హత్య
బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్లో ఫిబ్రవరి 18న జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.గత కొన్ని రోజులుగా టీవీ నటి నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్ నాగేష్ తెలిపారు.ఇదీ చదవండి: న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్తో కలిసి మోహన్ రావుపై ఎటాక్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. -
తాళిబొట్టు తెంపేసి భార్యపై దాడి.. భర్తపై కేసు నమోదు
బషీరాబాద్: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం.. ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
టెక్సాస్లో కాల్పుల కలకలం.. ఇరాన్ పనేనా
వాష్టింగన్: అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనలో ఇరాన్ హస్తం ఉందేమోనని ఎఫ్బీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఆస్టిన్ నగరానికి చెందిన బార్ బయట అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేవలం 59సెకన్లలో నిందితుణ్ని హతమార్చారు. అయితే, ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధం ఉందా అనే దానిపై ఫెడరల్ దర్యాప్తు ప్రారంభమైంది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడి అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో, ఈ కాల్పులు ప్రతీకార దాడిగా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్బీఐ ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా పరిగణించి, దాడి చేసిన వ్యక్తి నేపథ్యం, అతని సంబంధాలు, అంతర్జాతీయ లింకులు అన్నింటినీ పరిశీలిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. -
ప్రియుని చేతిలో వివాహిత హత్య
కర్నాటక: ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో అక్రమ సంభందం పెట్టుకొన్న సందీప్ అనే దుండగుడు తేజస్విని (32) అనే మహిళను పొడిచి చంపాడు. ఇది చిక్కబళ్లాపురం నగరంలో జరిగింది. వివరాలు.. భర్తతో విడిపోయిన తేజస్విని ఓ హోటల్లో పని చేస్తూ అందులోనే ఓ గదిలో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సందీప్ (26) అనే యువకుడు ఆమెకు పరిచయమై వేరే ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. తేజస్విని తన స్నేహితురాలు అరుణను ఇంటికి తీసుకొచ్చింది. ఇది నచ్చని సందీప్ తాగి గలాటా చేశాడు. అదే మత్తులో కత్తితో తేజస్వినిపై దాడి చేశాడు. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక తేజస్విని చనిపోయింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. తల్లి దూరమై ఆమె పిల్లలు అనాథలయ్యారు. -
కాటికి చేరిన నవ దంపతులు
ఇంకా పెళ్లి బట్టలు కూడా మాసిపోలేదు. గోరింటాకు చెదిరిపోలేదు. పెళ్లింట బంధువుల సందడి అలాగే ఉంది. నవ దంపతులు చిలకా గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారని ఊరంతా సంబరపడ్డారు. కానీ విధికి మాత్రం కన్నుకుట్టింది. పట్టుమని 15 రోజులకే కొత్త దంపతులు మరణించారు. కలిసి జీవిస్తామని బాసలు చేసినవారు కలిసే చనిపోయారని అందరూ కన్నీరు పెట్టారు.బెంగళూరు: నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని బంధుమిత్రులు చేసిన దీవెనలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ దుస్సంఘటన హావేరి జిల్లా శిగ్గావ్ తాలూకా కడహళ్లి గ్రామం సమీపంలోని 48వ జాతీయ రహదారిపై జరిగింది. ఆలయానికి వెళ్లి వస్తుండగా.. వివరాలు.. శిగ్గావ్ నివాసులు కార్తీక్ హుగార్ (34), ఐశ్వర్య (30)కు 15 రోజుల క్రితమే ఆడంబరంగా వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బంధువులతో కలిసి గదగ్ జిల్లా నవలగుందలోని కామణ్ణ ఆలయ దర్శనానికి కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఘటనాస్థలిలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. దంపతులు గాయాలతో అక్కడే కన్నుమూయగా, మల్లికార్జున, వినాయక అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి నుజ్జయిన కారులో నుంచి శవాలను, క్షతగాత్రులను బయటకు తీసి శిగ్గావ్ ఆస్పత్రికి తరలించారు. శోకసంద్రం.. ఇంటికి వస్తున్నామని చెప్పిన నవ దంపతులు కాటికి చేరారని తెలిసి ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆస్పత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ యశోద వంటగోడి పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తుకు గురవడం వల్లనే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
నెల్లూరు జీజీహెచ్లో మంటలు
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఎమ్సీహెచ్ బ్లాక్లోని హెచ్డీ వార్డులో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీలు పేలిపోయాయి. అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి సిబ్బంది సాయంతో అద్దాలు పగులగొట్టారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఒక్కసారిగా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని భయంతో అరుస్తూ చీకట్లోనే బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ వచ్చేలోపు అగి్నమాపక పరికరాల సాయంతో మంటలను ఆర్పేశారు. అప్పటికే రెండు బెడ్లకు మంటలు అంటుకోగా, వాటినీ అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి అధికారులు డాక్టర్ సుశీల్, డాక్టర్ కళారాణి పిల్లలను ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్ తదితరులు పరిశీలించారు. -
ప్రియుడికి వివాహమైందని తెలిసి.. ఏం చేసిందంటే..?
న్యూఢిల్లీ: ఓ యువతి తనతో రెండేళ్లుగా సంబంధం నెరపుతున్న యువకుడికి అప్పటికే పెళ్లయిందని తెలుసుకుని కక్షతో రగిలిపోయింది. నమ్మకంగా పిలిపించుకుని, మత్తు మందిచ్చి, అతడి మర్మావయవాలను కోసేసింది. తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు(22) హిందూరావ్ ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చేరాడు. ఆస్పత్రి అధికారుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడిని యూపీలోని రాంపూర్కు చెందిన ఆర్ఎంపీగా పనిచేసే విసర్జీత్గా గుర్తించారు. ఇతడికి రెండేళ్ల క్రితం ఢిల్లీలోని వజీరాబాద్కు చెందిన అమీనా ఖాతూన్తో పరిచయమేర్పడింది. ఫిబ్ర వరి 24వ తేదీన అమీనా వద్దకు విసర్జీత్ వచ్చాడు. ఆ రోజు రాత్రి అతడికి అమీనా మత్తు పదార్థం కలిపిన పాలను తాగించింది. మత్తులోకి జారుకున్నాక అతడి మర్మాయవాలను పదునైన ఆయుధంతో కోసేసింది. అప్పటికే పెళ్లయినా కాలేదని విసర్జీత్ చెప్పడంతో ఆగ్రహంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. తెల్లారాక విసర్జీత్ గాయాలతో దగ్గర్లోని హిందూరావ్ ఆస్పత్రిలో చేరాడు. వివిధ సెక్షన్ల కింద అమీనాపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె కోసం గాలిస్తున్నారు. అమీనా స్వస్థలం బిహార్లోని కటిహార్ ప్రాంతం. -
హాహాకారాలు.. ఆర్తనాదాలు
పిఠాపురం: తల ఒకచోట.. మొండెం మరోచోట.. కాలు ఒకచోట.. చెయ్యి మరోచోట.. ఇలా ఏ అవయవం ఎక్కడుందో.. అది ఎవరిదో తెలీనంత అతి దారుణంగా బాణాసంచా పేలుడులో మృతుల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఏది ఎవరి అవయవమో కూడా తెలీనంతగా కాలిపోయాయి. తమ వారి మృతదేహం ఎక్కడుందో తెలుసుకోడానికి మృతుల బంధువులు పడుతున్న వేదన.. చేస్తున్న ఆర్తనాదాలు అంతాఇంతా కాదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనలో అసలు అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎంతమంది చనిపోయారు అనేది కూడా చెప్పడానికి ఎవరు లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా..సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమ వాళ్లు బతికున్నారో చనిపోయారో తెలీక ‘మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగుచేస్తుంటే.. ఆ పోగులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడకోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు. మొత్తం మీద 20 మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించగా.. తమవారి ఆచూకీ తెలీలేదంటూ కొందరు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.అప్పుడు తప్పించుకుని.. ఇప్పుడు కాలిపోయాడు..గతంలో గ్రామంలో జరిగిన కొట్లాటలో గంపల నాగరాజు (55)ను కత్తులతో చంపడానికి కొందరు ప్రయత్నించగా అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అంటూ మళ్లీ తన బతుకు తాను బతుకుతుంటే మృత్యువు పేలుడు రూపంలో అతడ్ని దహించేసిందని నాగరాజు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన గంపల నాగరాజు, గంపల మంగ భార్యాభర్తలు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో వీరు పనిచేస్తున్నారు. శనివారం జరిగిన విస్ఫోటంలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అంత పెద్ద గొడవలోనూ బతికి బయటపడ్డాడనుకుంటే ఇప్పుడు మంటల్లో ఆహుతయ్యాడని.. తండ్రితో పాటు తల్లి కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయిందని.. ఇక తమకు పెద్ద దిక్కెవరంటూ నాగరాజు కుమారుడు వెంకటన్న రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.నా మాట వినుంటే అల్లుడు బతికేవాడు..ఆ పని ప్రమాదకరమైంది.. ఆ పనిలోకి వెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా బాణసంచా తయారీకి వెళ్లి చివరకు మృత్యువాతపడ్డాడని.. తన మాట వినుంటే తన అల్లుడు బతికేవాడని బాణసంచా ప్రమాదంలో మృతిచెందిన వల్లూరి రవి అత్త ముప్పిడి భద్రమ్మ కన్నీరుమున్నీరవుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన భద్రమ్మ కుమార్తె లక్ష్మికి, వేట్లపాలేనికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె సోఫియా ఉంది. రోదిస్తున్న మృతుడు రవి అత్త భద్రమ్మ అయితే, మృతుడు రవికి కుట్టు మెషీన్, పెయిటింగ్ వంటి పనులు వచ్చు. కానీ, ఆ పనులు చేయకుండా బాణసంచా తయారీకి మాత్రమే వెళ్లేవాడు. దీంతో, ఆ పనికి వెళ్లొద్దంటూ తాను చాలాసార్లు వారించానని భద్రమ్మ రోదిస్తూ చెప్పింది. కావాలంటే కొత్త మెషీన్ కొనిస్తానని, దానిని కుట్టుకుని బతకమని ఎన్నోసార్లు చెప్పానని, అయినా తన మాట వినకుండా ఆ పనిలోకి వెళ్లి, తన అల్లుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తన కూతురుకు మనవరాలికి దిక్కెవరంటూ భద్రమ్మ గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవ్వరి తరం కాలేదు.మా అమ్మను చూపించండి..‘మా అమ్మ మందుగుండు సామగ్రి తయారుచేయడానికి వెళ్లింది. అందరూ చనిపోయారంటున్నారు.. మా అమ్మ కనిపిస్తే చూపించండి’.. అంటూ ఈ దుర్ఘటనలో అసువులు బాసిన వేట్లపాలేనికి చెందిన దూకెళ్ల దేవి కుమార్తె చంద్రకళ శోకతప్త హృదయంతో దీనంగా అడుగుతోంది. దీంతో ఏం చెప్పాలో తెలీక ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు.. పేలుడులో మృతిచెందిన దేవి మృతదేహాన్ని సామర్లకోట ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచడంతో అక్కడ తన తల్లిని చూపించడంటూ చంద్రకళ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. -
శ్రమజీవుల జీవితాల్లో చిచ్చు
సాక్షి నెట్వర్క్: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా విస్ఫోట ఘటనతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఈ జిల్లాలోనే జరుగుతుండడం విషాదకరం. ఇక ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో చిచ్చుబుడ్లు కూరుతుండగా జరిగిన ప్రమాదాలే అధికం. వెరసి పొట్టకూటి కోసం పనిచేస్తున్న కూలీల కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి విషాద ఘటనల్లో కొన్ని...ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలుఅక్టోబర్ 2025: చిచ్చుబుడ్లు కూరే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో బాణసంచా విస్ఫోటం. గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్ యజమానితో పాటు పది మంది మృతి. సెప్టెంబర్ 2025: అయినవిల్లి మండలం విలసలో ఎలాంటి అనుమతులూ లేకుండా అనధికారికంగా బాణసంచా విక్రయించేందుకు సిద్ధమవుతుండగా మందుగుండు పేలిపోయి దంపతులు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహలక్ష్మి మృతి.అక్టోబర్ 2019: తాళ్లరేవు మండలం వేమవరం బాణసంచా తయారీ కేంద్రంలో చిచ్చుబుడ్డి కూరుతుండగా ప్రమాదం. ముగ్గురు మృతి. ఎనిమిది మందికి గాయాలు. అక్టోబర్ 2019: సామర్లకోట మండలం జి.మేడపాడు బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన ప్రమాదంలో ఆరుగురు మృతిఅక్టోబర్ 2014: ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని మణికంఠ ఫైర్ వర్క్స్లో విస్ఫోటం. 18 మంది దుర్మరణం. లైసెన్స్ లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడం, మందుగుండు భారీగా నిల్వ కారణం. అక్టోబర్ 2014: మండపేట మండలం ఏడిదలో బాణసంచా తయారు చేస్తూండగా ప్రమాదం. ఒకరు మృతి.అనకాపల్లి జిల్లాలో.. ఏప్రిల్ 2025: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో గల ‘విజయలక్ష్మీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు.నెల్లూరు జిల్లాలో..సెప్టెంబర్ 2024: నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో గల భవానీ ట్రేడర్స్ బాణసంచా విక్రయ దుకాణం/ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో వాచ్మెన్ సుబ్బయ్య సజీవదహనం.ఎన్టీఆర్ జిల్లాలో...సెప్టెంబర్ 2025: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి భీమేశ్వర కాలనీలో రెంటపల్లి కోటమ్మ ఇంట్లో భారీ పేలుడు. గుట్టుచప్పుడు కాకుండా కాలనీలోని కొన్ని ఇళ్లల్లో గుంటూరుకు చెందిన కొందరు వ్యక్తులు దీపావళి సామాగ్రి తయారు చేయిస్తున్నట్లు అప్పట్లో బయటపడిన నిజం. పేలుడు ధాటికి చుట్టుపక్కల కొన్ని ఇళ్ల గోడలు అద్దాలు, కిటికీలు, రేకులు షెడ్లు ధ్వంసం. గోపి అనే ఒక వెల్డర్ మృతి. మరో వ్యక్తికి అంగవైకల్యం. పరిహారం కోసం గోపి భార్య ఏడాది వయస్సు బిడ్డతో పేలుడు జరిగిన ఇంటి వద్ద జరిగిన ఆందోళన అప్పట్లో సంచలనం. స్పందించని చంద్రబాబు ప్రభుత్వం.ప్రాణాలు హరిస్తున్న నిర్లక్ష్యం» నిబంధనలకు నీళ్లొదలడం ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..» బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. అగ్ని నిరోధక పరికరాలు సిద్ధంగా ఉండాలి.» షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధించగలగాలి.» షెడ్ల గుమ్మాలు 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.» పనిచేసే కార్మికులు ఫైర్ ఫైటింగ్ కోర్సులో తర్ఫీదు పొందాలి.» అగ్నిమాపక సిలిండర్లు, ఐదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు అందుబాటులో ఉండాలి.» మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు.» ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఎక్స్ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్ఫాం తగినంత దూరంలో ఉండాలి. -
నేను బతికే ఉన్నానా!
పిఠాపురం: ‘నేను బతికే ఉన్నానా. బతికి ఉన్నానంటే నాకే నమ్మకం కుదరటం లేదు’అంటూ భయం నిండిన కళ్లతో వణికిపోతూ అడిగాడు సామర్లకోట మండలం వేట్లపాలెంలో పెను విస్ఫోటనం నుంచి బయటపడ్డ చాపల శామ్యూల్. పెద్దాపురానికి చెందిన శామ్యూల్ జరిగిన ఘోరాన్ని కళ్లారా చూసి.. పడిపోతూనే పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయుడిగా మిగిలాడు. నిద్ర ముంచుకురావడంతో పడుకునేందుకు వెళ్తున్న శామ్యూల్ ప్రమాదం నుంచి తప్పించుకుని.. సామర్లకోట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పెను విషాదంలో అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి అతడు తప్ప మిగిలిన వారెవరూ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ‘సాక్షి’తో శామ్యూల్ మాట్లాడుతూ.. ‘నేను పని చేస్తున్న బాణసంచా షెడ్లో నాతోపాటు ఆరుగురం ఉన్నాం. ఆర్డర్ ఎక్కువగా ఉంది. ఎక్కువ సరుకు కావాలన్న ఉద్దేశంతో మందుగుండు సామగ్రి ఎక్కువగా తయారు చేయిస్తున్నారు. అందుకే రోజూ కంటే శనివారం ఎక్కువ మంది పనిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరం భోజనాలకు లేచాం. భోజనాలు పూర్తయ్యాక కొందరు ఒకచోట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నాతో సహా మరి కొందరు షెడ్లలోనే ఉన్నారు. ఇంతలో నాకు నిద్ర వచ్చింది. కునుకుపాట్లు పడుతుండటంతో అందరితో మాట్లాడుతున్న నేను సెల్ఫోన్ తీసుకుని పాటలు పెట్టుకుందాంమని పైకి లేచాను. షెడ్ చూరుకు తగిలించి ఉన్న నా చొక్కా జేబులో ఉన్న సెల్ తీసుకుందామని వెళ్లబోతుండగా నా వెనుక నుంచి భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడటం కనిపించింది. వెంటనే పరుగు తీశాను. అప్పటికే నాకు మంటల వేడి తగిలి పరుగెత్తలేక కిందపడ్డాను. అయినా తెగించి మళ్లీ లేచి పరుగెత్తాను. కొంత దూరం వచ్చి పడిపోయాను. ఇంతలో నేను పని చేస్తున్న షెడ్లో ఉన్నవారు వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. వారు కూర్చున్న చోటు నుంచి లేచే అవకాశం కూడా లేకుండా మంటల్లో కాలిపోయారు. నాకు నిద్ర రాకపోతే మంటల్లో కాలిపోయేవాడిని. ఎలా పరుగెత్తానో నాకే తెలియదు. నేను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’అని శామ్యూల్ చెప్పాడు. -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
సెక్రటేరియట్ : మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన సీఎం.. ప్రమాదం లో గాయపడిన ఒకరి కి 3 లక్షల పరిహారం.. నవంబర్ 17, 2025 న సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన 44 మంది హైదరాబాద్ వాసులు..కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ,ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు,నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్,హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా,తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒబేదుల్లా కొత్వాల్.సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యల పైన కేంద్రం తో మాట్లాడాను..మంత్రి అజారుద్దీన్ ను మదీనా పంపించాను..బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం..దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు..కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం..నాంపల్లి అగ్ని ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం..ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం..అందుకే కుటుంబాలను సెక్రటేరియట్ కి పిలిచి పరిహారం అందించాం…ఇది మీ ప్రభుత్వం..ఆందోళన వద్దుమీ కష్టం,ఆనందం లో మీతో ఉంటుంది..ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది..అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దాం..కొడంగల్ లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున నేను హజ్ కు పంపిస్తున్న.. -
ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం
భువనేశ్వర్ : ఒడిశాలో 23 ఏళ్ల మహిళ హత్యాచార ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆమెపై అత్యాచారం చేసి వదిలేశాడు. ఆ తరువాత సాయం చేస్తానని చెప్పి నమ్మించిన మరో అగంతకుడు ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా తీవ్ర ఆందోళన రేపిన హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పోలీసుల సమాచారం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకుందామని బాధితురాల్ని ప్రియుడు నమ్మించాడు. దీంతో ఫిబ్రవరి 22న ఆ మహిళ తన ఇంటి నుండి పారిపోయింది. అయితే ప్రియుడు ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి రహమా బస్ స్టాండ్లో వదిలేశాడు. ఒంటరిగా ఉన్న ఆమెను చూసి జార్ఖండ్కు చెందిన మరో వ్యక్తి గమనించాడు. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకొని సాయం చేస్తానని నమ్మించి ఆమెను పారదీప్ పట్టణంలోని అద్దెకు తీసుకున్న వసతి గృహానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. చివరికి బాధిత మహిళను నాలుగు అంతస్తుల భవనం పైకప్పు నుండి తోసేశాడు. ఆ మహిళ మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం గుర్తించామని జగత్సింగ్పూర్ పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ కుమార్ వర్మ తెలిపారు. బాధితురాలి సోదరుడు ఫిబ్రవరి 25న పారదీప్ మోడల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలుబిజు జనతాదళ్ (BJD) అధినేత మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిపై తీవ్రంగా స్పందించారు. మైనర్లు, వికలాంగుల సహా ఎవరికీ రాష్ట్రంలో రక్షణ లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయని ప్రశ్నించారు. పట్టపగలు కూడా భయానక వాతావరణం నెలకొంది. ఇటువంటి దారుణాలు పదేపదే జరుగుతున్నా కనీస చర్యలు లేవనీ, అసలు రాష్ట్రంలో పాలన ఉందా అని ఆయన మండిపడ్డారు. అంగుల్లోని కనిహాన్, సంబల్పూర్లోని కుచిండా , పారాదీప్ ప్రాంతాల నుండి వస్తున్న దుశ్చర్యల వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..18 మంది సజీవ దహనం -
కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..23 మంది సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడుధాటికి మృత దేహాలు స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.అందిన సమాచారం మేరకు మృతుల వివరాలు : అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గోడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిలు ఉన్నారు.డీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతదేహాల అప్పగింతడీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతదేహాలను అప్పగించే పనిలో పడ్డారు అధికారులు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన తర్వాత మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రమాదం సమయంలో 70 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. గతంలో భారీ పేలుళ్లు, విషాదాలు బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. బాణా సంచా తయారీకి ప్రసిద్ధి చెందిన వేట్లపాలెం, పరిసర గ్రామాల్లో ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడం, పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామం, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అలాగే గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడిక్కడే మరణించారు. -
వికారాబాద్లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా: వికారాబాద్లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. దివ్య గత ఐదేళ్లుగా ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.దివ్య మృతదేహం వద్ద పోలీసులు ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ” ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక ఈ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా. అమ్మా.. నీకు నేను భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. నాన్న ఉంటే బాగుండే అమ్మ. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా” అని అందులో రాసి ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దివ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. -
నిలదీసిన భర్తను నరమేధం చేసిన ప్రియుడు..!
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి బంధం ఎగతాళి అయ్యింది.. భార్య అక్రమ సంబంధానికి మూడుముళ్లు వేసిన భర్తే బలైపోవాల్సి వచ్చింది.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను, ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటకు చెందిన బక్కా నాగేంద్ర (32) భార్య వీరలక్ష్మితో రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన తోరాటి శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర, వీరలక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన భార్య వీరలక్ష్మితో కలసి శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు. ఆగ్రహానికి గురైన నాగేంద్ర.. శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పడుతూ పక్కనే ఉన్న పంట బోదె వరకూ వచ్చేశారు. ఈ నేపథ్యంలో శివ బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక భార్య వీరలక్ష్మి, అత్త హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సీఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.ఎన్నడూ లేని విధంగా హత్యలు, దాడులు : మాజీ ఎమ్మెల్యేపెద్ద దొడ్డిగుంట గ్రామంలో హత్య జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణం నుంచే హత్యలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల పందలపాక, రంగాపురంలలో మహిళల హత్య, అదే గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం, ఇప్పుడు దొడ్డిగుంటలో హత్య.. ఇవన్నీ కూటమి పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండ ఉందన్న ధైర్యం పెరిగిందని, నేరస్తులకు స్టేషన్ బెయిల్లు, బాధితులకు శిక్షలు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నిందితుడు తోరాటి శివను, అతని బైకును రంగంపేట పోలీస్ స్టేషన్కు హత్యకు గురైన బక్క నాగేంద్ర అప్పగించినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా అతనిని విడిచిపెట్టారని, అదే నిర్లక్ష్యం ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని అని సూర్యనారాయణరెడ్డి అన్నారు. బిక్కవోలు, రంగంపేట మండలాల ఎస్సైలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారని అన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట ఎస్సై శివప్రసాద్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నేరస్తులకు రాజకీయ అండ, పోలీసుల నిర్లక్ష్యం పెరిగి, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు.ఎస్సైపై చర్యలకు డిమాండ్వివాహేతర సంబంధంపై ఈ నెల 6న రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మృతుడి నాగేంద్ర తండ్రి బక్కా వెంకటేశులు, తల్లి లక్ష్మి, చిన్నాన్న బక్కా వీర్రాజు, చిన్నమ్మ మంగ, సోదరుడు వీరబాబు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో పాటు అక్రమ సంబంధం నడుపుతున్న తోరాటి శివకు సంబంధించిన బైక్ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి న్యాయం చేయమని ఎస్సై శివప్రసాద్ను వేడుకున్నామన్నారు. అయినా ఎస్సై పట్టించుకోలేదని, నిందితుడు శివ వద్ద లంచం తీసుకుని తాము అప్పగించిన బైక్ను కూడా ఇచ్చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన శివ విచ్చలవిడిగా వీరలక్ష్మి వద్దకు వచ్చేవాడని, తాము ఫిర్యాదు చేసినప్పుడే శివపై చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని వాపోయారు. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సీఐ సుమంత్, డీఎస్పీ విద్య వద్ద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఎస్సై శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని వారికి సీఐ, డీఎస్పీ హామీ ఇచ్చారు. -
పెళ్లయిన ఐదు నెలలకే.. కానరాని లోకాలకు..
బ్రహ్మంగారిమఠం/బద్వేలు అర్బన్: వారు సామాజిక మాధ్యమం ద్వారా కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. జీవితంపై ఎన్నో కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా లారీ రూపంలో ఇరువురిని మృత్యువు కబళించింది. శుక్రవారం బద్వేలు – మైదుకూరు రహదారిలోని నందిపల్లె సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బద్వేలు పట్టణంలోని మార్తోమానగర్ సమీపంలో పాలూరు సుబ్రమణ్యం, లక్ష్మీదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి గురప్ప, ప్రసాద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పాలూరు ప్రసాద్ (28) పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల ఓ మెకానిక్ షాపులో మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇన్స్ర్ట్రాగామ్లో రెండేళ్ల క్రితం కాకినాడకు చెందిన కావ్య (26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరువురి పెద్దలను ఒప్పించి గతేడాది అక్టోబర్లో వివాహం చేసుకున్నారు. దైవదర్శనం వెళ్లి వస్తుండగా.. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువజంట అన్యోన్యంగా జీవనం సాగిస్తుండే వారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ప్రసాద్, కావ్య బ్రహ్మంగారిమఠానికి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో దొడ్ల డెయిరీ వద్ద ఐస్క్రీమ్ తిన్నారు. రోడ్డు దాటుకునేందుకు ద్విచక్ర వాహనంలో యూటర్న్ తీసుకుంటుండగా.. నెల్లూరు నుంచి బద్వేలు మీదుగా తాడిపత్రికి వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కింద పడిన ద్విచక్ర వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లడంతో.. ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి బి.మఠం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని శివప్రసాద్ తెలిపారు. పెళ్లి చేసుకున్న 5 నెలలకే మృత్యువాత పడటంతో ప్రసాద్ కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. జీవితాంతం కలిసి ఉండాలని కన్న కలలు కల్లలుగా మారాయని విలపించారు. -
ఏడు కిలోమీటర్లు.. బైక్ను ఈడ్చుకెళ్లిన థార్
లక్నో: ఓ ఎస్యూవీ వాహనం టూవీలర్ను ఏడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది.ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో మహీంద్రా థార్ ఎస్యూవీ పెద్ద కలకలం రేపింది. పెట్రోల్ బంక్లో ఇంధనం నింపుకుని డబ్బులు చెల్లించకుండా థార్ యజమాని వాహనంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఉద్యోగి థార్ యజమానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.వేగంగా వెళ్తున్న థార్ను వెంబడించాడు. తప్పించుకునేందుకు థార్ యజమాని సదరు పెట్రోల్ బంక్ ఉద్యోగి బైక్ను ఢీకొట్టాడు. ఆపకుండా ఏడుకిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థార్ యజమానికి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఎస్యూవీ బైక్ను లాగుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఘటన జరిగే సమయంలో మోటార్ సైకిల్ మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. -
మల్లికార్జున ముత్యాకు మూడింది.. వైరల్ వీడియోతో ‘అప్పాజీ’పై పోక్సో కేసు
బెంగళూరు: తనను తాను ‘నడిచే దేవుడు’గా ప్రచారం చేసుకుంటున్న మహల్ రోజా మఠాధిపతి మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాలల రక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు మహల్ రోజా మఠాధిపతి మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గోగి పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ సెక్షన్ 12 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదనంగా బీఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. అయితే, ముత్యా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వచ్చే వారం విచారణకు రానుంది.మఠాధిపతి నేపథ్యంమల్లికార్జున ముత్యా కర్ణాటక యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠం అధిపతి. ఆయనను స్థానికంగా ‘నడిచే దేవుడు’గా కొలుస్తారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు. మఠం ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.సంఘటన వివరాలుఫిబ్రవరి 19న మహల్ రోజా మఠంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఓ మైనర్ బాలిక, ఆమె కుటుంబ సభ్యులు మఠానికి వచ్చారు. మఠంలో అందరూ చూస్తుండగానే ముత్యా బాలికను ఎత్తుకోవడం, ఆమె శరీరాన్ని తాకడం వంటి దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదం చెలరేగింది.పోలీసు చర్యలువీడియో ఆధారంగా పోలీసులు చిన్నారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె తల్లిదండ్రులను కూడా విచారించారు. మఠానికి నోటీసులు జారీ చేసి, ముత్యా విచారణాధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించారు. మఠంలో ముత్యా అనుచరులు, భక్తులు సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు. ‘కమిషన్ వీడియోను సరిగా పరిశీలించకుండా తొందరపడి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అధికారులను ఆదేశించింది. 48 గంటల్లో ఎఫ్ఐఆర్ను ఉపసంహరించకపోతే, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం ముందు నిరసన చేపడతాం’ అని యాదగిరి సీఎంసీ మాజీ చైర్పర్సన్ లలితా అన్పూర్ మీడియాకు తెలిపారు.మల్లికార్జున ముత్యా ఒక స్వయంఘోషిత దేవుడు. ఆయనకు భక్తులలో గౌరవం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలు, కేసు కారణంగా పెద్ద వివాదం చెలరేగింది. ఎఫ్ఐఆర్ నిజమా, వీడియో ఎడిట్ చేసిందా అన్నది కోర్టు విచారణలో స్పష్టత రావాల్సి ఉంది. -
కామంతో కాటేసిన జనసేన కార్యకర్త
గుంటూరు రూరల్: పదో తరగతి విద్యార్థినిపై కన్నేసిన జనసేన కార్యకర్త తన పశువాంఛ తీర్చుకున్నాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వివరాలు వెల్లడించకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. నిందితుడు జనసేన కార్యకర్త కావటం, అధికార పార్టీ నాయకులు చేసే అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా పోలీసులు గోప్యత పాటిస్తున్నట్టు తెలిసింది. తనపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్న సమాచారం తెలుసుకున్న జనసేన కార్యకర్త పరారైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓబులునాయుడు పాలెం గ్రామానికి చెందిన మాదల నాగరాజు(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో చురుగ్గా పనిచేసిన అతడు చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నాడు. కాగా.. డంపింగ్ యార్డు సమీపంలోని ఓ కాలనీకి చెందిన ఒక మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహిళ ఇంటి పరిసరాల్లో మైనార్టీ వర్గానికి చెందిన పదో తరగతి బాలికపై నాగరాజు కన్నుపడింది. అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ సైతం నాగరాజు ఇచ్చే డబ్బుకు ఆశపడి చిన్నారిని సమిధగా మార్చి అతడి కామవాంఛ తీర్చేందుకు సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యంగా కనిపించటంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులకు వాస్తవం తెలిసిపోవడంతో నాగరాజు అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కలిసి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులు నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో అతడు పరారైనట్టు తెలిసింది. బాలికను నాగరాజుతో చనువుగా ఉండేందుకు కృషిచేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడికి అధికార పార్టీ పెద్దల అండ ఉండటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని తెలిసింది. -
పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో
ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.In a chilling daylight killing in Meerut's Ramraj market, Pradeep Dhiman allegedly shot dead Sunil Gaba — his wife Poonam's lover — with multiple bullets (reports cite 3 shots from different bores: .12, .32 & .315) yesterday. Poonam had eloped with Gaba ~1.5 years ago, leaving… pic.twitter.com/AkhR2gKCSo— Megh Updates 🚨™ (@MeghUpdates) February 26, 2026 ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాంరాజ్లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్సైకిల్పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు , విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు .ఇదీ చదవండి: ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్, సుధీర్ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రదీప్ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్ టార్గెట్ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. -
డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య భర్త దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జెడ్ మేడపాడకు చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తోంది. అయితే, సంధ్య.. వేములపల్లికి చెందిన బట్టల వ్యాపారి సూర్య ప్రకాష్ రావును ప్రేమించింది. ఈ క్రమంలో వీరిద్దరూ అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, పెళ్లి అయిన కొన్ని గంటలకే అర్ధరాత్రి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు విచక్షణ రహితంగా దాడి చేశారు.తమ చెల్లెలు సంధ్య కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కోపంతో సూర్య ప్రకాష్ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దాడి కారణంగా సూర్య ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
నెల్లూరు జిల్లాలో దాష్టీకం
నెల్లూరు జిల్లా: కావలిలో దాష్టికం చోటు చేసుకుంది. పాఠశాల ముందు తినుబండారాలు అమ్మే ఒక చిరు వ్యాపారి, చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తూ నెలల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.తినుబండారాల ఆశ చూపి బాలికలను తన వలలోకి దింపిన ఈ వ్యక్తి, పాఠశాల పరిసరాల్లోనే దుష్కార్యాలకు పాల్పడినట్లు సమాచారం. బాధిత బాలికలు భయంతో మౌనం పాటించగా, చివరికి పాఠశాల హెడ్మాస్టర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే, మొదట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం స్థానికులలో ఆగ్రహాన్ని రేపింది.ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు రంగంలోకి దిగారు. వారు బాధిత బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, అధికారికంగా ఫిర్యాదు చేయించేలా ముందడుగు వేశారు. దీంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఈ కేసును కేవలం సాధారణ నేరంగా కాకుండా పోక్సో చట్టం కింద నమోదు చేయాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు జరగడం సమాజానికి మచ్చ అని వారు పేర్కొంటూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. -
ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు.. అరసమరపేటకు చెందిన యోగనాథన్(63) సత్వచ్చారిలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి పదవీ విరమణ చేశాడు. బుధవారం ఉదయం యోగనాథన్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. బంధువులకు విషయం తెలిసి వేలూరు సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై విచారణ చేపట్టారు. యోగనాథన్ కుమార్తె వినోదిని ఏడాది కిందట ప్రేమవివాహం చేసుకుంది. విషయం తండ్రికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇంట్లో తండ్రికి తన భర్త కనిపించకుండా చూసుకునేది. ఈ విషయం యోగనాథన్కు తప్పా మిగతా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఇటీవల ప్రేమ వివాహం గురించి యోగనాథన్కి తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో యోగనాథన్ ఇంట్లో మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులను నమ్మించారు. విచారణలో యోగనాథన్ది హత్య అని తేలడంతో పోలీసులు మృతుడి భార్య విమలాదేవి, కుమారుడు గోవిందరాజ్, స్నేహితులు అశ్వథామన్, శివదాస్, కుమార్తె వినోదినిని గురువారం అరెస్ట్ చేశారు. -
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చావ్!
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ను భయభ్రాంతులకు గురి చేసి, అందినకాడికి దోచుకున్నారు సైబర్ నేరస్తులు. ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులుగా పేర్కొంటూ 76 ఏళ్ల వృద్ధుడిని నట్టేట ముంచేశారు. ఈమేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన రిటైర్డ్ కెనరా బ్యాంక్ మేనేజర్కు జనవరి 17న గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది.తాను ముంబై ఏటీఎస్ నుంచి పరిచయం చేసుకున్న సైబర్ నేరస్తుడు.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినందుకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ ఫోన్ కాల్ ఏటీఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న సులేక్ కుమార్, ముఖేష్ వర్మ, అజయ్ కుమార్ బన్సాలీలకు బదిలీ అయింది. అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకర్తలతో ముడిపడి ఉన్న బహుళ బ్యాంకు ఖాతాలను తెరవడానికి నా ఆధార్ కార్డ్ వివరాలను వినియోగించారని తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి, ఎఫ్ఐఆర్లో తన పేరును తొలగించాలంటే బ్యాంక్ ఖాతా వివరాలను ధ్రువీకరించాలని సూచించారు. దీంతో నిందితుల సలహా మేరకు బాధితుడు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 19 మధ్యకాలంలో నేరస్తులు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు 13 లావాదేవీల్లో రూ.1.44 కోట్లను బదిలీ చేశాడు. ఆ తర్వాత నుంచి నిందితులతో ఫోన్ సంభాషణలు, మెసేజ్లు లేకపోయేసరికి మోసపోయాననిగ్రహించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. -
లాడ్జిలో అగ్ని ప్రమాదం..ఒకరి సజీవదహనం
రాజంపేట: లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో 38 మంది గాయాలతో బయటపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్రోడ్లో ఉన్న దీప్లాడ్జిలోని రిసెప్షన్ కౌంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన పొగతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు లాడ్జిపైకి చేరుకున్నారు. జనసంచారం తక్కువగా ఉండే సమయంలో లాడ్జిపై నుంచి కేకలు వినిపించడం, దట్టమైన పొగ రావడంతో కొందరు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీల గుండా కిందకు దించి కాపాడారు. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్(32) సజీవ దహనమయ్యాడు. ఇతడు కే–సూపర్ మార్కెట్లో ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను సబ్కలెక్టర్ భావన, ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే పరామర్శించారు. ఘటనాస్థలాన్ని రాజంపేట అర్బన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించడంలో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఘటనాస్థలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. -
చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం
జగ్గంపేట: భార్యాభర్తల మధ్య నెలకొన్న కీచులాట 11 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ, సాయి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికంఠ మద్యానికి బానిసై జీవనోపాధికి కూడా ఇబ్బంది పడడంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. గురువారం కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అత్తింటి వారు పరుషంగా మాట్లాడడంతో కోపంతో ఊగిపోయిన మణికంఠ 11 నెలల కుమార్తెను తీసుకుని స్థానికంగా ఉన్న పోలవరం కాలువలోకి మోటార్ సైకిల్తో సహా దూసుకుపోయాడు. గుర్తించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు కేసు నమోదు చేశారు. -
ఫొటోలు ఆన్లైన్లో పెడతాం...
ఘట్కేసర్: లోన్యాప్ నిర్వాహ కుల బ్లాక్మెయిల్కు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ లోని రాంనగర్కు చెందిన సాయికుమార్ (35) ఓలా ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో భార్య పేరు మీద ఓ లోన్యాప్లో రుణం తీసు కున్నాడు. గడువు లోపల లోన్ చెల్లించాలని యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయసాగారు. అ యినా లోన్ చెల్లించకపోవడంతో ఆమె ఫొటో లు ఆన్లైన్, సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేయడంతో ఒత్తిడికి లోనయ్యా డు. బెదిరింపులు భరించలేక మనస్తాపం చెంది గురువారం ఉదయం కొండాపూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభాకర్ ఎన్క్లేవ్లో ఓ వేప చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మా ర్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నబిడ్డను హతమార్చిన వైద్యురాలు, 911 కాల్ రికార్డు సంచలనం
భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ నేహా గుప్తా కన్నకూతుర్నే హతమార్చి ఏమీ తెలియ నట్టుగా 911 కాల్ చేసింది. ఒక్లహోమాకు చెందిన పిల్లల వైద్యురాలు కాల్ రికార్డును దర్యాప్తు అధికారులు తాజాగా విడుదల చేశారు. అలాగే 2025 జూన్లో జరిగిన సంఘటనను వివరించేందుకు గాను నిందితురాల్ని తాజాగా విడుదల చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని స్వల్పకాలిక అద్దె ఇంటిలోని తన నాలుగేళ్ల కుమార్తెను కొలనులో ముంచి చంపినట్లు పై అభియోగం మోపబడిన నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..ఒక్లహోమాకు చెందిన 36 ఏళ్ల నేహా గుప్తా పిల్లల డాక్టర్. వైద్యుడైన భర్త సౌరభ్ నుంచి ఆమె విడిపోయింది. నాలుగేళ్ల కుమార్తె అరియా ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నది. ఆ బాలిక కస్టడీ వివాదం కోర్టులో ఉంగానే నాలుగేళ్ల అరియా కన్నుమూయడం విషాదాన్నినింపింది. కుమార్తె అరియాతో కలిసి నేహా గుప్తా ఫ్లోరిడాకు వెళ్లింది. అక్కడ తాత్కాలిక అద్దె ఇంట్లో బస చేసింది. అయితే అక్కడి నీటి కొలనులో పడి అరియా మునిగినట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని హాస్పిటల్కు తరలించారు. ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.పోస్ట్మార్టం రిపోర్ట్లో అసలు విషయం తెలియడంతో ఆమెను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.పోస్ట్మార్టం నివేదికశవపరీక్షలో బాలిక ఊపిరితిత్తులలో లేదా కడుపులో నీరు కనిపించలేదు. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి, ఆ తరువాతే ఆమెను కొలనులో వేసినట్టు నిర్ధారించారు. సంఘటన జరిగిన సమయంలో, ఆరియా తలతి తండ్రి పూర్తి కస్టడీని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. గుప్తా మానసిక స్థితి గురించి. తన కుమార్తెను ఫ్లోరిడాకు తీసుకెళ్లారని తనకు తెలియదని వాపోయాడు.🇺🇸 📹 PEDIATRA ACUSADA POR MUERTE DE SU HIJA EN PISCINA Las cámaras de seguridad captaron a la madre y la niña en la vivienda de alquiler antes del hallazgo en la piscina. ¿Noticias y tendencias? ¡Sigue @ULTIMAHORAENX para MAS!🔔 Neha Gupta pediatra de Oklahoma… pic.twitter.com/ol8cVhh9BR— ⓍULTIMAHORAENX (@ULTIMAHORAENX) February 26, 2026911 రికార్డింగ్ వివరాలు"మేము నిద్రపోతున్నాము, నాకు ఏదో శబ్దం వినిపించింది ఆమె కొలనులో ఉంది, ఆమెను కాపాడటానికిప్రయత్నించాను, కానీ నాకు ఈత రాదు" అని అధికారులు విడుదల చేసినమె చెప్పినట్లు వినబడుతుంది. "నేను ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను." అని ఆమె డిస్పాచర్తో చెప్పింది.ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, గుప్తా, "లేదు, ఇక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాము... నేనే... ఆమెను బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసాను" అని తెలిపింది. ఆ అమ్మాయి మేల్కొని ఉందా అని డిస్పాచర్ ఆమెను అడిగారు., గుప్తా, "లేదు, ఆమె కొలను అడుగున ఉంది... కదలడం లేదు" అని చెప్పింది.ఆ తర్వాత గుప్తా తన కూతురిని కొలను నుండి బయటకు లాగడానికి ప్రయత్నించమని అడిగాడు. అప్పుడు మీరు ఎప్పటికీ చేరుకుంటారని ఆమె డిస్పాచర్ను అడిగింది. "వారు దారిలో ఉన్నారు, కానీ మీరు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి, ఆమెను బయటకు తీసుకురావడానికి మీరు ఏదైనా మార్గాన్ని కనుగొనాలి" అని డిస్పాచర్ ఆమెకు చెప్పారు.ఆ తర్వాత డిస్పాచర్ ఆమెను కొలను ఎంత లోతు ఉంటుంది లాంటి వివరాలు అడిగాడు. ""తొమ్మిది అడుగులు ఉందని నేను అనుకుంటున్నాను, ఎంత లోతు ఉందో నాకు తెలియదు," అని గుప్తా చెప్పింది. "సరే, మీరు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి, మేడమ్," అని డిస్పాచర్ మళ్ళీ చెప్పినపుడు నేను ప్రయత్నిస్తున్నాను," అని సమాధాన మిచ్చింది. కొన్ని క్షణాల తర్వాత, పోలీసు అధికారులు వచ్చినప్పుడు, గుప్తా వారి కోసం తలుపు తెరిచింది. అప్పుడు అధికారులు తన కుమార్తెను నీటిలో నుండి బయటకు తీశారు.మరోవైపు ఆరియా మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని గుప్తా, ఆమె న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆమె మే నెలలో తిరిగి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు..
నన్నెందుకు చంపావమ్మా? నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు.. ఒంటరిగానే నన్ను పెంచావు.. నీ సుఖం చూసుకుని ఊహాలోకంలో విహరించావు.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించావు.. మాయాలోకంలో పడి నన్ను వదిలించుకోవాలనుకున్నావు.. నీ కడుపుచించుకుపుట్టిన నన్ను కర్కశంగా గొంతు నులిమి చంపేశావు.. నీకు తోడుగా నిలిచిన వాడితో కలిసి స్వర్ణమ్మలో కలిపేశావు.. నేనేం తప్పు చేశానమ్మా.. నాకెందుకీ శిక్ష వేశావమ్మా..?.. అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం.ఓ కసాయి తల్లి ప్రియుడి మోజులో పడి రెండున్నరేళ్ల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. తిరుపతి: ‘11 నెలల చిన్నారి ‘పునర్విక’ ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన రూ.16 కోట్లు సమకూర్చేందుకు ఏ సంబంధం లేని లక్షల మంది ఒక్కటయ్యారు. తమవంతు సాయమందించి సమాజంలో మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు. ఈ కసాయి తల్లి కామాంధకారంతో కళ్లు మూసుకుపోయి కడుపుచించుకుని పుట్టిన అపురూప పాపాయిని అత్యంత పాశవికంగా చిదిమేసింది. ఆపై స్వర్ణమ్మ ఒడిలో పాతిపెట్టేసి చేతులు దులుపుకుంది. పోలీసులు తమదైన విచారణలో అసలు విషయం బయటపడింది. ఏ‘పాప’ం చేసిందని? తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్తో విడిపోయి తిరుపతి పోస్టల్ కాలనీలో రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఉంటోంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గను అంతమొందించాలని భావించింది. ఈ నెల 19వ తేదీన దుర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడు రెడ్డికుమార్ సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బైక్పై తీసుకుని ప్రియుడి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో అవ్వ ప్రశ్నించింది. తల్లి సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన ప్రతి హృదయం ద్రవించింది. ఏ పాపం చేసిందని పాప ప్రాణం తీశావంటూ ప్రతి గొంతు ఘోషించింది.గుండెలవిసేలా రోదించిన అవ్వ ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశాలత, రెడ్డికుమార్తోపాటు వారికి సహకరించిన మరికొందరిని పోలీ సులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కళ్లు బైర్లు కమ్మేలాంటి చిన్నారి హత్యోదంతాన్ని వారు బయటపెట్టారు. బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్ పోలీసులు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాపానాయుడుపేట సమీపంలో పాపను పూడ్చిపెట్టిన స్వర్ణముఖి నదిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి వారి వెంట వచ్చిన చిన్నారి దుర్గ అమ్మమ్మ నాగరత్నమ్మ బోరున విలపించింది. నువ్వేం పాపం చేశావమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కదిలించింది. -
ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోనలుగురి హత్య తీవ్ర కలకలం రేపింది. వీరిలో గర్భిణీ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హత్యలు జరిగిన తీరు చేసిన పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయిపోలీసులు అందించిన సమాచారం ప్రకారం బిహార్లోని పాట్నా జిల్లాకు చెందినఈ కుటుంబం ఢిల్లీలోని సమయ్పూర్ బద్లీలో గత రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. కేవత్ ఆజాద్పూర్ మండిలో కూరగాయల విక్రేతగా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం అద్దె ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అనిత (30), మూడు, నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఆమె కుమార్తెలు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వీరిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీప బంధువు పోలీసులుకు, ఇతరులకు సమాచారం ఇవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. భర్త కేవత్ పరారీలో ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.ఈ సంఘటనతో పొరుగువారు కూడా ఒక్కపారిగా షాక్కు గురయ్యారు. మొదట్లో కొంచెం గొడవపడినా, వీరంతా ఆ తరువాత సంతోషంగా ఉండేవారని పొరుగువారు చెప్పారు. అటుఅనిత వదిన, 36 ఏళ్ల సుగ్ని దేవి మాట్లాడుతూ, తన 10 ఏళ్ల కుమారుడు రక్తపు మడుగులో పడి వున్నవారిని గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని, ఆ జంట మధ్య ఎటువంటి వైవాహిక విభేదాలు లేవని, అంతా బాగానే ఉందని చెబుతోంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని మరో వదిన సోని దేవి వాపోయింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారి మధ్య గొడవ జరిగిందని. కేవత్ తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ముందు వారిని మద్యం తాగించి ఉండవచ్చని ప్రాథమికంగా తేలిందని, నిర్దిష్ట కారణం వెలుగులోకి రాలేదని పోలీసు అధికారి తెలిపారు, వివాహేతర సంబంధం, మగపిల్లవాడి కోసం, సహా ఇతర అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భర్తను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పారిపోయినట్టు గుర్తించారు.క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
యూట్యూబర్ కోమలి వన్సైడ్ లవ్.. అఖిల్ స్టేట్మెంట్
హైదరాబాద్: యూట్యూబర్ కోమలి బోను(21) ఆత్మహత్య కేసు దర్యాప్తును రాయదుర్గం పోలీసులు ముమ్మరం చేశారు. చిత్రపురి కాలనీలో నివాసముంటున్న గాజువాకకు చెందిన కోమలి ప్రేమ విఫలం కావడంతో సోమవారం ఉరేసుకున్న విషయం తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోమలి డైరీ, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. తన ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని డైరీలో రాసిందని, ప్రియుడు అఖిల్రెడ్డి మోసం చేసినట్లుగా పేర్కొనలేదని పోలీసులు చెబుతున్నారు. చిత్రపురి కాలనీలో మరో బ్లాక్లో సోదరి ఇంట్లో ఉంటున్న అఖిల్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అఖిల్రెడ్డి ఫోన్ను స్వా«దీనం చేసుకుని, ఇద్దరి చాటింగ్లను పరిశీలిస్తున్నారు. మరో యువతితో రిలేషన్లో ఉన్నానని, తన వెంట పడొద్దని చెప్పినా ఆమె వినిపించుకోలేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు, స్నేహితులకు ‘మీరు బాగుండాలి’అని కోమలి వాయిస్ మేసేజ్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మూడేళ్లుగా ప్రేమించుకుని... మూడేళ్లుగా ప్రేమించుకున్న కోమలి, అఖిల్ సంవత్సరకిత్రం బ్రేకప్ చెప్పారు. ఈ క్రమంలో మరో యువతితో అతడు చనువుగా ఉండటాన్ని జీరి్ణంచుకోలేక పోయిన కోమలి ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు యతి్నంచినట్లు తెలుస్తోంది. మూడురోజుల క్రితం అఖిల్, కోమలి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, కోమలిని అఖిల్ ట్రాప్ చేసి మోసం చేశాడని ఆమె తల్లి వరలక్ష్మి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. YouTuber Dies by Suicide After Alleged Relationship Dispute📍HyderabadKomali, 21, a BSc student and YouTuber, allegedly died by suicide after ex-bf Akhil Reddy visited her home and rejected her request to reunite. Ongoing marriage disputes with Nikhil Reddy also contributed… pic.twitter.com/xMBKHrYAUy— زماں (@Delhiite_) February 25, 2026 -
ప్రేమా.. తల్లిదండ్రులా..?
పెదగంట్యాడ: ప్రేమించిన వ్యక్తి ఒకవైపు. తల్లిదండ్రులు మరోవైపు. ఎవరు కావాలో తేల్చుకోలేక తన ఆవేదనను సూసైడ్ నోట్లో రాసి, ఒక ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ వుడా కాలనీలోని వినాయకనగర్లో నివసిస్తోంది. హెచ్పీసీఎల్లో సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పైడి రజిని (20) మధురవాడలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రిపరేషన్ హాలీడేస్ ఇవ్వడంతో ఇంటికొచ్చింది. సత్యం భార్య, చిన్న కుమార్తె బుధవారం శ్రీకాకుళంలోని స్వగ్రామానికి వెళ్లారు. కుమారుడిని స్కూల్ ఆటో ఎక్కించి, సత్యం డ్యూటీకి వెళ్లాడు. అనంతరం కుమార్తె రజినీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెంది, ఎదురింటివారికి ఫోన్ చేశాడు. వారు డోర్ కొట్టినా తీయకపోవడంతో.. కిటికీలోంచి చూడగా రజిని చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న సత్యం హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. డోర్ పగులగొట్టి లోపలకి వెళ్లారు. అప్పటికే రజిని చనిపోయింది. ఇంట్లో రజిని సూసైడ్ నోట్ దొరికింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్లో రజినీ ఆవేదన: డాడీ.. మమ్మీ.. నాకు ఏమీ తెలియడం లేదు. నేను తప్పు చేశా. లవ్ చేశా. నేను మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఆ అబ్బాయిని వదిలేశా. కానీ.. అతనితోనే నాకు ఉండాలని ఉంది. కానీ నాకు వద్దు. ఎందుకంటే మీరే ఇంపార్టెంట్ నాకు. నేను మీ కోసం ఏమీ చేయలేకపోయా. కానీ తప్పు అయితే చేయాలని అనుకోవట్లేదు. నేనే లేకపోతే తప్పు అవ్వదు కదా. అందుకే బై. చెల్లి, తమ్ముడు జాగ్రత్త. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 590 కోట్ల కుంభకోణం కేసు.. ఇంటి దొంగలు దొరికారు!
చండీఘడ్: హర్యానా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 590 కోట్ల కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు తీగ లాగితే కుంభకోణం డొంకంత కదులుతోంది. తాజాగా, ఈ కేసులో ఇద్దరు మాజీ ఉద్యోగులు, నలుగురు బయటి వ్యక్తులను హర్యానా రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు.పంచకులాలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏఎస్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కామ్కి మాస్టర్ మైండ్స్గా మాజీ మేనేజర్లు రిభవ్ రిషి, అభయ్ కుమార్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసిన ఈ కేసులో తాజాగా రిభవ్ రిషి, అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లాలను అదుపులోకి తీసుకున్నారు.బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడిగా రిభవ్ రిషి అనే మాజీ మేనేజర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పటికీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో పనిచేసిన సమయంలోనే ఈ స్కామ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లా అనే వ్యక్తులు కూడా ఈ మోసంలో భాగమని విచారణలో తేలింది.ఈ ఘటన వెలుగులోకి రావడంతో హర్యానా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ను కూడా ప్రభుత్వ లావాదేవీల నుండి తొలగించింది. అన్ని ప్రభుత్వ నిధులను ఇతర బ్యాంకులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.బ్యాంక్ కుంభకోణం యాజమాన్యానికి తలొంపు కాగా.. బ్యాంక్ షేర్ మార్కెట్పై కూడా తీవ్రంగా పడింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఒక్క రోజులోనే 20 శాతం పడిపోయాయి. పెట్టుబడిదారుల సంపదలో రూ.14వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా. -
మాజీ సీఎం మనవడు అనుమానాస్పద స్థితిలో మృతి
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సొరేన్ 19 ఏళ్ల మనవడు వీర్ సోరెన్ హఠాత్తుగా కన్నుమూశారు. ఫఙబ్రవరి 24, మంగళవారం, హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో స్నేహితులతో ట్రిప్లో ఉండగా అనుమానాస్పదంగా మరణించడంతో విషాదం అలుముకుంది.తన మనవడి విషాద వార్తనుస్వయంగా చంపాయ్ సోరెన్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు.వీర్ నిష్క్రమణతో, తమ కుటుంబం ఛిన్నాభిన్నమైందంటూ విచారం వ్యక్తంచేశారు.अत्यंत दुःख के साथ सूचित करते हैं कि हमारे प्रिय पोते वीर सोरेन का 24 फरवरी 2026 को असामयिक निधन हो गया है। हिमाचल प्रदेश के मनाली में अचानक तबियत बिगड़ने के बाद उन्हें अस्पताल ले जाया गया, लेकिन नियति को कुछ और ही मंजूर था। वीर के जाने से हमारा परिवार बिखर गया है। शोकाकुल,…— Champai Soren (@ChampaiSoren) February 25, 2026పోలీసుల నివేదికల ప్రకారం సిమ్సా ప్రాంతంలోని హోమ్స్టేలో బస చేసింది. ఫిబ్రవరి 23న హమ్తా పాస్ సమీపంలోని సోలాంగ్ వ్యాలీ ,సేథాన్ గ్రామాన్ని సందర్శించి సాయంత్రంతిరిగి వచ్చారు. ఫిబ్రవరి 24 ఉదయం, తిరిగి బైటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, వీర్ తన గదిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి వచ్చినప్పుడు, తలనొప్పిగా ఉందని చెప్పిన కొద్దిసేపటికే పరిస్థితి విషాదకరంగా మారింది. మంచం మీదనుంచి పడిపోయి, అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నోటిలోంచి నురుగు కూడా వచ్చింది. వెంటనే మనాలిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు CPR చేసి అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటి అనే విషయం ఇంకా దర్యాప్తులో ఉన్నప్పటికీ, సీనియర్ పోలీసు అధికారులు హైపోక్సేమియా కారణంగా ఉండవచ్చని సూచించారు. హమ్తా పాస్ మార్గంలోని ఎత్తైన ప్రదేశాలకు వెల్లడం, పర్వత గాలికి అలవాటు పడని ప్రయాణికులలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ,తలనొప్పి వస్తుంది అని చెబుతున్నారు.ఇదీ చదవండి: ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్ -
Gachibowli ATM: రూ.22 లక్షలు కొట్టేసి రోజుకు 2 లక్షలు జల్సా!
గచ్చిబౌలి: ఏటీఎంలోని డబ్బుల ట్రంక్ పెట్టెతో పరారైన నిందితుడు అజిత్ కుమార్ను రిమాండ్కు తరలించినట్లు నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం బొమ్మనహాల్కు చెందిన బడిగేరి అజిత్ కుమార్ అలియాస్ శివ (34) సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ వద్ద నివాసం ఉంటూ ఆరు నెలల క్రితం సంగం సెక్యూ రిటీ సొల్యూషన్స్లో డ్రైవర్గా చేరాడు. ఆ సంస్థ యాక్సిస్ బ్యాంక్ల ఏటీఎంల్లో క్యాష్ మెయింటెనెన్స్ చేస్తోంది. ఈ నెల 12న గోపన్పల్లిలో క్యాష్ లోడ్ చేసేందుకు కస్టోడియన్స్ రామకృష్ణ, మాలిక్లు ఏటీఎం లోపలికి, గార్డు పెరుమాళ్ బాత్రూంకు వెళ్లారు. ఇదే అదనుగా అజిత్ కుమార్ డబ్బులున్న వాహనం తీసుకొని ఉడాయించాడు.టీ తాగుతున్నట్లు నమ్మించి.. బయటకు వచ్చిన సిబ్బంది ఫోన్ చేయగా పక్కనే టీ తాగుతున్నానంటూ అజిత్ కుమార్ నమ్మించాడు. దాదాపు 3 గంటలవుతున్నా అతడి ఆచూకీ లేకపోవడంతో కస్టోడియన్ రామకృష్ణ గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించాడు. ట్రంక్ పెట్టెను తీసుకొని వాహనాన్ని తెల్లాపూర్ గద్దర్ క్రాస్ రోడ్డులో వదిలి అజిత్ ఆటోలో పారిపోయాడు. లాడ్జీలో పెట్టెను యాక్సెల్ బ్లేడ్తో కోసి జొమాటో బ్యాగ్లో రూ. 57 లక్షల నగదును సర్దాడు. మియాపూర్లో పుణె వెళ్లే బస్సు ఎక్కాడు. డ్రైవర్ బ్యాగ్ చెక్ చేయాలనడంతో బస్సు దిగి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి మరో బస్సులో అనంతపురం వెళ్లాడు. వైజాగ్ సబ్బవరంలో ఉండే ప్రేమికురాలికి అజిత్ ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ యువతిపై ఆరా తీశారు. దీంతో తనను పోలీసులు వెతుకుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతపురం నుంచి బళ్లారి, హోస్పేట్ నుంచి బెంగళూర్కు వెళ్లాడు. అనంతరం అక్కడి వెళ్లి పుణె, ముంబైల్లో గడిపాడు. రాత్రి సమయంలో ఖరీదైన మద్యం తాగుతూ.. జల్సాలు చేస్తూ విలాసవంతంగా గడిపాడు. మంగళవారం శంషాబాద్ సమీపంలో బ్యాగ్తో ఉన్న అజిత్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.34,90,000 నగదు, సెల్ ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు, డీఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.జీతం ఇవ్వలేదని కసి పెంచుకుని.. ప్రతి రోజూ లక్షల్లో డబ్బు రవాణా చేసే సెక్యూరిటీ సంస్థ.. నాలుగు నెలలుగా జీతం ఇవ్వక పోవడంతో నిందితుడు అజిత్ కుమార్ కసి పెంచుకున్నాడు. డబ్బు కొట్టేసి విలాసవంతంగా గడపాలకున్నాడు. 20 రోజులుగా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాదాపు 11 రోజుల పాటు ఆయా నగరాలు తిరుగుతూ జల్సాలు చేస్తూ సగటున రోజుకు 2.లక్షల చొప్పున రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులను తికమకపెట్టేందుకు దాదాపు ఏడు ఫోన్లు కొనుగోలు చేశాడు. ముంబైలో ఉన్న అజిత్ అనంతపురంలోని తన బావకు ఫోన్ చేసి కేర్ టేకర్గా పని చేసి బాగా సెటిల్ అయ్యానని, కారు కొనుక్కొని విహారయాత్రలకు వెళదామని చెప్పాడు. ఎక్స్యూవీ కారును కొనుగోలు చేద్దామని చెప్పాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. -
రూ. 30 వేల లంచం, కట్ చేస్తే విజిలెన్స్ అధికారులే షాక్
భువనేశ్వర్: ఒడిశాలో వెలుగు చూసిన భారీ అవినీతి తిమింగలం వ్యవహారం కలకలం రేపింది. కటక్ సర్కిల్లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతికి సంబంధించిన అనేక ప్రదేశాలలో సోదాల సందర్భంగా ఒడిశా విజిలెన్స్ విభాగం రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఏజెన్సీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు.పాటియాలోని శ్రీ విహార్లోని నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్లోని మొహంతి నివాసంలో బుధవారం విజిలెన్స్ దాడులు జరిగాయి. భువనేశ్వర్ ఫ్లాట్, భద్రక్లోని తల్లిదండ్రుల ఇల్లు, కటక్లోని ఆఫీస్ ఛాంబర్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించాయి. దీంతోపాటు, ఆయన ఆఫీస్ డ్రాయర్ నుండి మరో రూ.1.20లక్షలను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని రెండంతస్తుల భవనం, సుమారు 130 గ్రాముల బంగారం, ఇతర ఆస్తులను కనుగొన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతంబొగ్గు డిపోను నడపడానికి మరియు బొగ్గు రవాణాకు అనుమతి ఇవ్వడానికి బదులుగా లైసెన్స్ పొందిన బొగ్గు విక్రేత నుండి రూ. 30,000 లంచండిమాండ్ చేశాడన్న ఫిర్యాదుదారు ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిందితుడైన ప్రభుత్వ అధికారిని అరెస్టు చేశారు. ఈ విచారణలో భాగంగా తాజా సోదాలు జరిగాయి. దాడి సమయంలో, లంచంసొమ్మను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో మొహంతిపై అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018లోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. PHOTO | Odisha Vigilance apprehended Debabrata Mohanty, Deputy Director of Mines, Cuttack Circle, for allegedly taking a Rs 30,000 bribe. During searches at his Bhubaneswar flat and other locations, over Rs 4 crore in cash — the highest ever seizure in the agency’s history — was… pic.twitter.com/A5zopN2pur— Press Trust of India (@PTI_News) February 25, 2026 ఇదీ చదవండి: పింక్ ప్యారడైజ్గా బెంగళూరు, వైరల్ వీడియోలు : హీరో ఈయనేమరోవైపు 2024 జనవరి నుంచి 2025 డిసెంబర్ 31, మధ్య లంచం తీసుకోవడం, ప్రభుత్వ నిధులలో ఆర్థిక అవకతవకలు, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై విజిలెన్స్ విభాగం మొత్తం 416 కేసులు నమోదు చేసిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు. -
కట్టుకున్నవాడే యముడయ్యాడు..
విశాఖపట్నం: ఆరిలోవ ప్రాంతంలో మరో దారుణం జరిగింది. దుర్గానగర్లో 14 రోజుల కిందట ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం మరువక ముందే.. తాజాగా బాలాజీనగర్లో మరో హత్య చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 11వ వార్డు పరిధిలోని బాలాజీనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో బి.దేవుడు, దుర్గ (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ సిరిపురంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న దేవుడు.. తరచూ ఇంట్లో ఆమెతో గొడవ పడేవాడు.ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే దుర్గను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మెడకు ఉరితాడు బిగించి, ఇంటికి లోపలి నుంచి గడియ పెట్టి దాక్కున్నాడు. ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన దుర్గ.. తొమ్మిది గంటలైనా బయటకు రాకపోవడం, తలుపులు తెరవకపోవడంతో పెదగదిలికి చెందిన ఆమె స్నేహితురాలు పలుమార్లు ఫోన్ చేసింది. ఆమె స్పందించకపోవడంతో వెంటనే దుర్గ తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆయన అక్కడికి చేరుకుని చూడగా తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి.. ఆమె మెడకు తాడు బిగించి, కింద పడి ఉంది. దుర్గ ఉరి వేసుకుందని భావించిన తండ్రి.. స్థానికుల సాయంతో ఆమెను విమ్స్ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐలు కృష్ణ, వరహాలు నాయుడు సాయంత్రం తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి బయట బైక్, లోపల సెల్ఫోన్ ఉండి, ఆ సమయంలో భర్త కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. ఇంట్లో క్షుణ్ణంగా గాలించగా.. ఫ్రిజ్ వెనుక నక్కిన దేవుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, భార్యపై అనుమానంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
తాతా.. అమ్మ ఉరి వేసుకుంది
అనంతపురం సెంట్రల్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంత వేదన అనుభవించిందో తెలియదు కానీ.. కన్న కుమారుడు వద్దని వారిస్తున్నా... వినకుండా ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనతో బాలుడి ఒక్కసారిగా చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. విషాదకరమైన ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన సాయిప్రసాద్ కుమార్తె లలిత (30)కు ఆత్మకూరు మండలానికి చెందిన మోహన్కృష్ణతో పదేళ్ల క్రితం వివాహమైంది. పోలీసు కానిస్టేబుల్ కావడంతో అప్పట్లో 15 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదును వరకట్నంగా ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న కుమారుడు ధర్మయోగి ఉన్నాడు. మోహన్ కృష్ణ ప్రస్తుతం నగరంలోని నివాసముంటూ వన్టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఎస్పీ దృష్టికి వేధింపులు పైళ్లైన తొలినాళ్లలో వీరి సంసారం సజావుగా సాగినా... ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఆజాద్ నగర్లోని సొంతమింట్లో కుమారుడితో కలసి లలిత నివాసముంటోంది. అదే ఇంట్లో వేరే గదిలో మోహన్ కృష్ణ నివాసముండేవాడు. పలుమార్లు పోలీసు స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇచ్చినా మోహన్ కృష్ణ తీరు మారలేదు. తాజాగా డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీస్ను లలిత కలసి తన దీన స్థితిని విన్నవించుకుంది. న్యాయం చేయాలని వేడుకుంది. అదే రోజు సాయంత్రం దిశ పీఎస్లో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ ఇంటికి పంపారు. లలిత తల్లిదండ్రులు కూడా రాత్రి కుమార్తె నివాసంలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు మార్గమధ్యంలో ఉండగానే ఉదయం 8 గంటల సమయంలో మనవడు ధర్మయోగి ఫోన్ చేసి తాతా.. అమ్మ ఉరి వేసుకుందని తెలిపాడు. వారొచ్చే సమయానికి ఉరికి విగతజీవిగా వేలాడుతూ లలిత కనిపించింది. మనిషి కాదు రాక్షసుడు ‘తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు నరకం చూపించాడు. వాడు మనిషి కాదు.. రాక్షసుడు’ అంటూ లలిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహేతర సంబంధాల మోజులో తమ కుమార్తెను నిత్యం వేధించాడని వాపోయారు. అతన్ని ఉరి తీస్తేనే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని విజప్తి చేశారు. అదనపు కట్నం కోసం వేధించేవాడని, తనకు లవర్ ఉందని, ఆమెతోనే జీవిస్తానంటూ మాటలతోనే హింసించేవాడని వివరించారు. తనకు అందుతున్న పింఛన్ సొమ్ముతోనే కుమార్తె, మనవడిని పోషిస్తున్నట్లు తెలిపారు. మోహన్కృష్ణపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్ మాట్లాడుతూ.. దంపతుల మద్య మనస్పర్థలు ఉన్నాయని, ఇరువురూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. -
టీనేజ్ డ్రైవర్ : విషాదాంతమైన గోవా టూర్, వీడియో వైరల్
గోవాలోని అందమైన ప్రదేశాలను చూసి తరించాలని ఆశపడిన టూరిస్టు కుటుంబంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాలోని అస్సాగావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయిభోపాల్కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు భగత్రామ్ శర్మ (65) కుటుంబంతో కలిసి హ్యుందాయ్ i20 కారులో గోవాకు బయలుదేరారు.ఉత్తర గోవాలోని 'హ్యాపీ బార్' జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన ఒక అద్దె మహీంద్రా థార్ (Thar) కారు, పర్యాటకులు వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు భగత్రామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదు నెలల చిన్నారి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడింది.సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రకారం, థార్లోని ఒక యువకుడు ఫోన్లో మాట్లాడుతూ "నాన్న, నేను ఇంటర్సెక్షన్ దగ్గర ఉన్నాను..." అని చెప్పడం వినిపించింది. కారు వెనుక సీట్లో ముగ్గురు యువతులు ఉన్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే థార్ కారులోని వ్యక్తులు సీట్లు మారడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అసలు డ్రైవర్ను (నిందితురాలిని) కాపాడేందుకు వారు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 19 ఏళ్ల టీనేజరే ఈ విషాదానికి కారణమని అనుమానిస్తున్నారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అద్దె వాహనాన్ని సీజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ , నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైనట్లు కేసు నమోదు చేశారు. అలాగే నిజంగా డ్రైవర్ను మార్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంక్షన్ వద్ద ఉన్న CCTV ఫుటేజీని, ఫోరెన్సిక్ సాక్ష్యాలను ,ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను సేకరిస్తున్నారు.Not all Thar, but Always a Thar!Thar Accident in Goa!pic.twitter.com/bmebwnUEBt— My Vadodara (@MyVadodara) February 24, 2026 t> -
ప్రియుడి మోజులో పడి.. 9 నెలల బిడ్డను హత్యచేసి పూడ్చి పెట్టింది
తిరుపతి: తిరుపతిలోని పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19) అనే యువతి తన 9 నెలల బిడ్డను హత్యచేసి, దేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆశాలతకి గతంలో వివాహం అవ్వగా భర్తతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త నుండి విడిపోయి కొంతకాలం తన తల్లి వద్దే ఉంది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.ఆ ఇద్దరూ సహజీవనంలో ఉంటూ పెళ్లి చేసుకోవాలని సైతం నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టింది. కాగా తన బిడ్డ, మనవరాలు ఈ నెల 19వ తేదీ నుండి కనిపించడంలేదు అంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఆశాలత తన బిడ్డను హత్య చేసినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సినిమా ఛాన్స్ పేరిట యువతితో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ యువతిని తన కార్యాలయానికి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సినీ నటిని కావాలని ఆశతో ఓ యువతి ఇటీవల హైదరాబాద్కు వచ్చి తన స్నేహితురాలి వద్ద ఉంటోంది. ఈ నెల 18న సినిమాల్లో ఛాన్స్ ఉందని, హీరోయిన్ను చేస్తానంటూ జీఎం రవి అనే యువకుడు ఆమెను మాదాపూర్కు పిలిపించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెను పలు విధాలుగా పరీక్షించి ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ వద్ద ఉన్న గ్రీన్మార్ట్ ఆఫీసుకు సాయంత్రం రమ్మన్నాడు. దీంతో ఆమె తన స్నేహితురాలిని తీసుకుని గ్రీన్మార్ట్ ఆఫీసుకు వెళ్లి రవిని కలిసింది. ఆయన తన గదిలోకి పిలిపించి టెస్ట్ పేరిట అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనతో పాటు తన స్నేహితురాలితో కూడా అనుచితంగా వ్యవహరించాడని, సినిమాల్లో వేషం పేరుతో, తనను పరీక్షల పేరుతో ఇష్టానుసారంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బీఎస్సీ విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్కు చెందిన కోమలి (21)చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద ఉంటూ బీఎస్సీ చదువుతూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వైజాగ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం కోమలి ఆత్మహత్యా యత్నం చేయడంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. అఖిల్ దూరంగా ఉంటానని చెప్పినా కోమలి వినిపించుకోలేదు. రెండు రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అఖిల్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని స్వా«దీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అఖిల్ రెడ్డిని విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తన కూతురు కోమలిని అఖిల్ రెడ్డి మోసం చేయడంతో చనిపోయిందని తల్లి వరలక్ష్మీ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసుల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఐదు మంది ప్రయాణిస్తున్న ఒక కారుపై గుర్తు తెలియని వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) మధుర్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనను ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదు మంది సియాజ్ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి దాడి జరిగింది. సీటు వెనుక కూర్చున్న సందీప్ అనే వ్యక్తి భుజం దగ్గర బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. కారులో ఉన్న మరో వ్యక్తి దీపక్ ఖత్రి, తాను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు అడ్వకేట్ అని పోలీసులకు తెలిపాడు. అయితే విచారణలో ఆయన భార్య రాజ్ని ఖత్రి బిష్ణోయ్కు న్యాయవాది అని, సందీప్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులు స్కూటర్పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కారులో ఉన్నవారి వాంగ్మూలాలు, స్థానికుల స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ టీమ్ను సంఘటనా స్థలానికి తరలించారు. స్థానికి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
తల్లిని చంపి... తండ్రితో కలిసి ఆత్మహత్య
అంబర్పేట: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి... హోటల్ వ్యాపారం చేసిన తండ్రీకొడుకులు తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సామూహిక బలవన్మరణాలకు పాల్పడాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున తల్లిని హత్య చేసిన కుమారుడు తండ్రితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యను చంపడానికి ఆమె భర్త కూడా సహకరించడం గమనార్హం. ఈ విషాద ఘటన నగరంలోని అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న బాపూనగర్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం ప్రకారం...కాకతీయలైన్లో నివసించే వ్యాపార కుటుంబానికి చెందిన రామరాజు (54)కు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఈయన గత కొన్నేళ్లుగా హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు శశాంక్ రాజ్ (27) సైతం తండ్రితో కలిసి అదే వ్యాపారం చూసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో వీరికి అప్పుల భారం పెరిగింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు అప్పు ఇచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించమంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో రామరాజు, శశాంక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై సోమవారం రాత్రి చాలాసేపు వీరిద్దరూ చర్చించుకున్నారు. చివరకు అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరు నివసిస్తున్న భవనంలోనే కింది పోర్షన్లో ఉంటున్న రామరాజు సోదరుడి ఇంటికి వెళ్లిన వీరి కుటుంబం అక్కడ కొద్దిసేపు గడిపి వచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శశాంక్ రాజ్ తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన మిత్రుడు రవికి ఫోన్ ద్వారా సందేశం పంపారు. ఆపై తాము ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ సైతం రాయగా... దీనిపై అతడి తండ్రి రామ రాజు సంతకం చేశారు. అయితే వీళ్లు తీసుకున్న నిర్ణయం రామరాజు భార్య మాధవికి (50) తెలుసా? లేదా? అన్నది స్పష్టత రాలేదు. తాము లేకపోతే తన తల్లి మాధవి (50) జీవనం సాగించడం కష్టమని శశాంక్ భావించినట్లు తెలిసింది. దీంతో తండ్రితో కలిసి బెడ్రూమ్లో నిద్రిస్తున్న తల్లి ముఖంపై దిండుతో అదిమిపట్టి చంపేశాడు. అక్కడి పరిస్థితుల్ని బట్టి పోలీసులు ఈ అంచనా వేస్తున్నారు. ఆపై తండ్రి రామరాజు అదే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయారు. మరో బెడ్రూమ్లోకి వచ్చిన కుమారుడు శశాంక్ ముందు కత్తితో చేతి నరాల్ని కోసుకుని చనిపోయే ప్రయత్నం చేశారు. కొన్ని గాట్లు పెట్టుకున్న తర్వాత తన నిర్ణయం మార్చుకుని అక్కడే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శశాంక్ పంపిన సందేశాన్ని రవి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చూశాడు. వెంటనే వారింటికి వచ్చి చూసే సరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. శశాంక్ను కిందకు దింపి పరిశీలించగా అతడు మృతి చెందినట్లు తేలింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీంను సైతం పిలిపించి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రామరాజు కుమార్తె అమూల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి రామరాజు సోదరులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద అన్న జగదీశ్వర్ 2009లో బీఆర్ఎస్ తరపున అంబర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తన తమ్ముడు ఎప్పుడూ చెప్పలేదని, విషయం తెలిస్తే తాము ఆదుకునేవారమంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు. -
కాళ్లూ, చేతులూ కట్టేసి.. కట్టెల పొయ్యిలో పడేసి!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: హైదరాబాద్ శివార్లలోని బౌరంపేటలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తొలి కాన్పు తర్వాత కొందరు మహిళలకు వచ్చే పోస్ట్పార్టుం సైకోసిస్కు గురైన ఓ మహిళ కన్న బిడ్డను కర్కశంగా హతమార్చింది. పగలు–రాత్రి తేడా లేకుండా ఏడుస్తోందనే కారణంగా రెండు నెలల చిన్నారి కాళ్లు–చేతులు కట్టేసి, నోట్లో వ్రస్తాలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ పోలిశెట్టి సతీష్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్కు చెందిన రాజేంద్ర ఆదివాసి కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం సనారెల్లిలో కూలీగా పని చేస్తున్నాడు. ఆ భవనంలోని తాత్కాలిక నిర్మాణంలో భార్య మమత అహిర్వార్ (22)తో కలిసి జీవిస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి రెండు నెలల చిన్నారి ఉన్నాడు. మమత శారీరకంగానూ బలహీనంగా ఉండటంతోపాటు ఈమెకు ఇది తొలి కాన్పు. చిన్నారి నిత్యం ఏడుస్తుండటంతో సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం ఈమెకు సాధ్యం కావట్లేదు. దీంతో పోస్టుపార్టుం సైకోసిస్ బారినపడిన ఆమె చిన్నారి కాళ్లు చేతుల్ని తాడుతో కట్టేసింది. నోట్లో వ్రస్తాలు కుక్కి ఇంట్లో మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. 11.05 గంటలకు ఇంట్లోకి వచ్చిన రాజేంద్ర శిశువును బయటకు తీశాడు. అప్పటికే ఆ చిన్నారి సగం కాలిపోయి మృతిచెందాడు. భార్యను నిలదీయగా అతడి పైనా అరుస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రవర్తించింది. పోలీసులు మమతను పోలీసుస్టేషన్కు తీసుకెళ్లగా.. ఠాణాలోనూ ఆమె ప్రవర్తన విపరీత ధోరణిలోనే ఉంది. తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న ఆమె పోలీసులు ఏ ప్రశ్న అడిగినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అరుస్తూ, దూషిస్తూ ఊగిపోతోంది. తొలి కాన్పు తర్వాత ఆరు నెలలు కీలకం అనేక మంది మహిళల్లో తొలి కాన్పు తర్వాత పోస్టుపార్టుం డిప్రెషన్ లేదా పోస్టుపార్టుం సైకోసిస్ బారినపడతారు. డెలివరీ తర్వాత ఏర్పడే హార్మోన్ల అసమతుల్యం వల్ల ఇలా జరుగుతుంది. సరైన సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, ఫ్యామిలీ దూరంగా ఉండటం కూడా వీటికి కారణాలు. ఈ దశ శిశువు పుట్టిన నాటి నుంచి ఆరు నెలల పాటు ఉంటుంది. సైకోసిస్ బారిన వారు విచక్షణ కోల్పోవడం, శిశువుకు హాని చేయడం వంటివి చేస్తారు. బాలింతల్ని ఆరు నెలలపాటు జాగ్రత్తగా గమనిస్తుండాలి. సమయానికి నిద్ర, ఆహారం అందేలా చూడాలి. డిప్రెషన్ను గమనిస్తే కౌన్సెలింగ్, వైద్యం చేయించాలి. – డాక్టర్ అనిత రాయిరాల, సూపరింటెండెంట్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల -
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు. అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆలయంలో దళిత నవదంపతులకు అవమానం : వీడియో వైరల్
తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోమల్లన్న జాతరలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. మరోవైపు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుల వివక్షకు సంబంధించిన మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దళిత కుటుంబాన్ని అవమానించి, ఆలయం నుండి బహిష్కరించిన ఘటన ఘర్షణకు దారి తీసింది. ఈఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతంప్రత్యక్ష సాక్షుల ప్రకారం గోని గ్రామంలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దళిత జంట ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చినప్పుడు నారాయణప్ప అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన నారాయణప్ప, ఎలాగైనా వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నానాయాగీ చేశాడు. తనకు దేవత సోకిందంటూ నాటకం ఆడాడు. మెకాళ్లపై అమ్మవారికి అడ్డంగా కూర్చొని, వారిని దర్శనం చేసుకోనీయకుండా అడ్డుపడటం ఫుటేజ్లో ఉంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి వెంటనే వెళ్లి పోవాలంటూ గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు."Dalits can't enter Hindu temple." 🚨A newly married Dalit couple was humiliated and forced out of temple in Karnataka.Where are those "South Indians" who mock "North" over such acts? Speak up, saar..😭Be it North or South, when it comes to caste, entire nation is doomed.… pic.twitter.com/RtJ2ol9Zub— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) February 24, 2026 దీంతో ఆవేదనకు గురైన వరుడు జగదీష్ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద తురువేకెరె పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ అశోక్ తురువేకెరె పోలీస్ స్టేషన్లో తమకు అందిన ఫిర్యాదు మేరకు ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం! -
కన్న కొడుకులా ఆదరిస్తే ఆస్తికోసం పెద్దమ్మనే కడతేర్చాడు, చివరికి
తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం తెలిసింది. జయలక్ష్మి సోదరి, ఆమె కొడుకే హత్య చేశారని చిక్కనాయకనహళ్లి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్షిప్లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మ , శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి రావాల్సిన సాయం అందదని, ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట. -
అతని కోసం రూ. 8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!
జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్(Jharkhand Air Ambulance Crash) లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాంచీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో రోగి సంజయ్ కుమార్ షా (41), అతని భార్య అర్చన దేవి, బంధువు ధ్రువ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, నర్సు సచిన్ కుమార్ మిశ్రా , ఇద్దరు పైలట్లు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్దీప్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన అత్యంత విషాదకరమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి.సంజయ్ గత సోమవారం, జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలోని చాంద్వాలోని తన హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకున్నాడు. 65 శాతం కాలిన గాయాలతో రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, వైద్యులు అతన్ని ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రికి పంపించాలనుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే అవకాశం లేకపోవడంతోఅతని కుటుంబం బంధువులను సంప్రదించి ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 7.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. క్షణాల్లో అంతా అయిపోయిందిరాంచీ విమానాశ్రయంలో సంజయ్ను అలా పంపించి ఇంటికి వచ్చారో లేదో ప్రమాదం జరిగిందని, అంతా ఒక్క క్షణంలో ముగిసిపోయిందంటూ సంజయ్ అన్నయ్య విజయ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సంజయ్తోపాటు, అతని భార్య అర్చన కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలను అనాథలుగా మారారని కుటుంబం వాపోయింది. రాంచీలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటే, సంజయ్ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదనీ,అతనికి సరైన చికిత్స అందించి ఉంటే, విలువైన ప్రాణాలను కాపాడగలిగేవారమని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.#WATCH | Chatra, Jharkhand | On air ambulance crash, father of deceased pilot Vikas Bhagat, DS Bhagat says," My son saved many lives by piloting an air ambulance, but today he has lost his life. He had spoken to his mother before the incident...I saw my only son's mortal… pic.twitter.com/8mq5ffk5wv— ANI (@ANI) February 24, 2026 మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. తన కొడుకును డాక్టర్గా చేయడానికి ఉన్న భూమ నంతా అమ్మేశానని, ఇపుడు అతనే లేకుండా పోయాడని భావోద్వేగానికి లోనయ్యారు. అతని ఏడేళ్ల కొడుకు ఉన్నాడు... అతను ప్రతిభావంతుడు మరియు ఒడిశాలోని కటక్ నుండి MBBS పూర్తి చేసి రాంచీలోని సదర్ హాస్పిటల్లో డాక్టర్గా చేరారని గుప్తా తండ్రి బజరంగీ ప్రసాద్ తెలిపారు.VIDEO | Jharkhand air ambulance crash: A relative of one of the deceased, says, "My younger brother, Sachin Kumar Mishra, was everything to me. He was like my own child. He was my whole life and my entire world. Since my father is no more, he was my only support. He worked as a… pic.twitter.com/oamIF8qdu2— Press Trust of India (@PTI_News) February 24, 2026ఎంతోమంది ప్రాణాలు కాపాడిన పైలట్ దుర్మరణంఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో మరణించిన పైలట్ వికాస్ భగత్ తండ్రి డీఎస్ భగత్ తన కొడుకు మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ అంబులెన్స్ నడపడం ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడిని తన కొడుకు ఈ రోజు అతను ప్రాణాలు కోల్పోయాడని వాపోయారు. సంఘటనకు ముందు తన తల్లితో మాట్లాడాడు అంటూ తన ఏకైక కుమారుడి మరణాన్ని తలుచుకుని కుమిలిపోయారు. -
గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మెక్సికన్ కార్టెల్ కింగ్, కరడుగట్టిన నేరస్థుడు జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధినేత 'ఎల్ మెంచో'(Nemesio Oseguera Cervantes) నెమెసియో ఒసేగురా సెర్వంటెస్ని మెక్సికో సైనిక ఆపరేషన్లో మట్టు బెట్టింది. మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న ఎల్ మెంచో అధ్యాయం ముగిసిపోవడంతో మెక్సికోలో హింస చెలరేగింది. అయితే ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నందున, మెక్సికో అంతటా హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఎల్ మెంచో అంతం వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ ఆపరేషన్ ఎలా జరిగింది. కీలక సమాచారాన్ని అందించింది ఎవరు? తెలుసుకుందాం.జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో మెక్సికన్ సైన్యం నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఎల్ మెంచో మరణ వార్తతో అతని అనుచరులు మెక్సికో వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు వందలాది వాహనాలకు, పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారు. ప్రధాన నగరాల్లో భారీగా కాల్పులు, పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా, గ్వాడలజారా వంటి నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది.మెక్సికన్ భద్రతా దళాలు నిర్వహించిన హై-స్టేక్స్ ఆపరేషన్ చారిత్రాత్మక విజయం తరువాత డ్రగ్స్ అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆపరేషన్ ఎలా జరిగింది. అతని గర్ల్ఫ్రెండ్ కదలికలే అతన్ని పట్టించడంలో కీలక పాత్ర పోషించాయని మెక్సికన్ అధికారులు సోమవారం తెలిపారు."ఎల్ మెన్చో"తో రాత్రి గడిపిన తర్వాత, ఆ మహిళను ట్రాక్ చేసి, ఆ ప్రాంతంలోనే ఉంటున్నట్లు ధృవీకరించిన తర్వాత, ప్రత్యేక దళాలు తమ ప్లాన్ అమలు చేశాయని మెక్సికన్ రక్షణ కార్యదర్శి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపారు.ఆపరేషన్ ఎలా జరిగింది?మెక్సికన్ రక్షణ మంత్రి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎల్ మెంచో ప్రియురాలిపై నిఘా పెట్టిన మెక్సికన్ నిఘా వర్గాలు ఈ సారి విజయాన్ని సాధించాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఎల్ మెంచో అక్కడ ఉన్నాడని నిర్ధారించుకున్న మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.మెక్సికన్ సైన్యం, నేషనల్ గార్డ్, ఆరు హెలికాప్టర్లతో ఈ దాడి జరిగింది. ఎల్ మెంచో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అతని అనుచరులు సైన్యాన్ని అడ్డుకోవడానికి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు.భీకర పోరాటం కాల్పుల మధ్య ఎల్ మెంచో ఒక పొదలో దాక్కున్నాడు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో అతను, అతని ఇద్దరు బాడీగార్డ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఈ ఆపరేషన్ , దాని తర్వాత చెలరేగిన హింసలో మొత్తం 70 మందికి పైగా మరణించారు. ఇందులో 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు, ఒక జైలు అధికారి మరియు 30 మందికి పైగా నేరస్థులు ఉన్నారు.మరోవైపు ఎల్ మెంచో మరణం తరువాత అనతి ని కుడిభుజంగా చెప్పుకునే ఎల్ తులి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చనిపోయిన ప్రతి సైనికుడికి 20,000 పెసోలు (సుమారు రూ. 84,000) బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. జాలిస్కో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధనం, నిప్పు పెట్టడం వంటి దాడులకు పాల్పడ్డాడు. అయితే, సైన్యం అతన్ని కూడా గుర్తించి కాల్చి చంపింది. అతని వద్ద నుండి 1.4 మిలియన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నామని భద్రతా కార్యదర్శి ఒమర్ గార్సియా హర్ఫుచ్ తెలిపారు.కాగా ఇలాంటి డ్రగ్ మాఫియా కింగ్లను పట్టుకోవడంలో వ్యక్తిగత సంబంధాలు కీలకమైన బలహీనమైన లింక్గా ఎలా మారుతాయో తాజాగా ఘటన పెద్ద ఉదాహరణ. గత పదేళ్లుగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ని అంతర్జాతీయ నెట్వర్క్గా క్రూరమైన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతని వ్యక్తిగత సంపద ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) పై మాటేనని అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అంచనా. ఎల్ మెన్చో ఒక్కడే కాదు అతని కుటుంబం పాత్ర కూడా ఈ నేర కార్యకలాపాలలో తక్కువేమీ కాదు. అతని కుమారుడు, కుమార్తె, సోదరుడు. వీరు ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారు లేదా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇతని భార్య రోసలిండా గొంజాలెజ్-వాలెన్సియాను 2021 నవంబరులో అరెస్టు చేశారు. -
మూడేళ్లలో ఆరుగురు దుర్మరణం
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–1లోని జలగం వెంగళరావు పార్కు మలుపు మృత్యువుకు పిలుపుగా మారింది. రోజూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అటు జీహెచ్ఎంసీ ఇటు ట్రాఫిక్ పోలీసుల్లో చలనం కరువైంది. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఆ దిశగా ముందడుగు పడడం లేదు. రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ వాహనదారులు, పాదచారులను మృత్యువు కాటేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మూడేళ్లలో ఈ రోడ్డులో వెంగళరావు పార్కు మలుపు వద్ద 46 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వాహనాలు నుజ్జునుజ్జయి పోలీస్స్టేషన్ల ఆవరణలో తప్పుపట్టిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయడంలోగానీ, ఈ మలుపులో ప్రమాదం పొంచి ఉందన్న జాగ్రత్తలను సూచించడంలోగానీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రోడ్డు ప్రమాదాలు జరగగానే అటు పంజగుట్ట పోలీసులు, ఇటు బంజారాహిల్స్ పోలీసులు ఆ రోజు హడావుడి చేసి కేసులు నమోదు చేసి చేతుల దులుపుకొంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిమ్స్ ఆస్పత్రి వైపు నుంచి ఎఫ్సీఎల్ చౌరస్తాకు వెళ్లే ఈ మలుపు వద్దనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నా తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..జలగం వెంగళరావు పార్కు ప్రారంభమైన చోట ఫుట్పాత్ను కొంత తగ్గించి రోడ్డును విస్తరించాలి. ఫుట్పాత్పై ఆక్రమణలు తొలగించి పాదచారులు రోడ్డెక్కకుండా చూడాలి. ఈ మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అడ్డుగా ఉన్న భారీ చెట్లను తొలగించాలి. రోడ్డు విస్తరణపై, ప్రమాదాలకు గల కారణాలపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేసి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ఈ పరిధి మాది కాదంటే మాది కాదంటూ పోలీసులు చేతులెత్తేయకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించాలి. చదవండి: వెంటాడిన విధి.. దూసుకొచ్చిన మృత్యువు -
భార్య, భర్త మధ్యలో హెడ్ కానిస్టేబుల్..!
కర్ణాటక: శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలోని హొస సిద్ధాపురలో స్వాతి (27) అనే వివాహిత ఆత్మహత్య కేసులో స్థానిక మాలూరు హెడ్ కానిస్టేబుల్ మోహన్పై కేసు దాఖలైంది. ప్రభుత్వ క్లర్కు అయిన ఆమె భర్త జగదీష్ శివరాత్రి రోజున ఉరివేసుకుని చనిపోయాడు. దీనికి కారణం స్వాతి అని మోహన్ తప్పుడు ప్రచారం చేసి, ఆమెను మానసికంగా వేధించాడని, అందువల్ల ప్రాణాలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. స్వాతి తల్లి భద్రావతి న్యూటౌన్ ఠాణాలో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ నిఖిల్ ఆదేశాలతో నిందితునిపై కేసు నమోదు చేశారు. కేసులో నిజాన్ని బయటకు తీసుకురావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భర్తను కోల్పోయిన మహిళకు పోలీసు అధికారి వేధింపులు! -
చెల్లెలి ముందే తండ్రిని తుపాకీతో కాల్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోగల ఆషియానాలో సభ్యసమాజం తలదించుకునే ఘోరం చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మధ్య చదువు విషయంలో తలెత్తిన వివాదం చివరకు తండ్రి ప్రాణాలను బలిగొంది. మద్యం వ్యాపారంతో పాటు పాథాలజీ ల్యాబ్ను నిర్వహిస్తున్న మన్వేంద్ర సింగ్ (49)ను అతని కుమారుడు, బీకామ్ విద్యార్థి అక్షత్ సింగ్(21) అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది.పోలీసుల కథనం ప్రకారం.. అక్షత్ సింగ్ను ‘నీట్’ పరీక్షకు సిద్ధం కావాలని తండ్రి మన్వేంద్ర సింగ్ కోరేవాడు. అయితే అక్షత్, బీకామ్ చదవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది మీరట్లో జరిగిన ఒక హత్య ఉదంతం (సౌరభ్ రాజ్పుత్ కేసు) గురించి సోషల్ మీడియాలో చదివిన అక్షత్, తన తండ్రిని కూడా అదే తరహాలో వదిలించుకోవాలని ప్లానింగ్ చేశాడు.ఫిబ్రవరి 20 తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో తండ్రీ కొడుకుల మధ్య చదువు విషయమై మరోసారి ఘర్షణ చెలరేగింది. ఆగ్రహంతో అక్షత్ తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్తో అతనిపై కాల్పులు జరిపాడు. ఈ ఘోరం అక్షత్ చెల్లెలి ముందే జరిగింది. ఆ సమయంలో నోరు విప్పితే చంపేస్తానని చెల్లెలిని చంపేస్తానని అక్షత్ బెదిరించాడుహత్య అనంతరం సాక్ష్యాలను రూపుమాపేందుకు అక్షత్ మూడవ అంతస్తులో ఉన్న మృతదేహాన్ని కిందకు ఈడ్చుకొచ్చి, ఇంట్లోని పనిముట్లతో శరీర భాగాలను ముక్కలు చేశాడు. తల, మొండెం భాగాలను ఒక నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి, చేతులు, కాళ్లను తన కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతమైన సద్రౌనాలో పడేశాడు. ఆ తర్వాత తన తండ్రి ఢిల్లీ వెళ్లారని, ఫోన్ కలవడం లేదంటూ, అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తండ్రి కనిపించడం లేదంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు.అక్షత్ పొంతన లేని సమాధానాలు, కారును అత్యంత శుభ్రంగా కడగడం తదితర చర్యలపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్షత్ను తమదైన శైలిలో విచారించారు. మొదట తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని బుకాయించినప్పటికీ, చివరకు అక్షిత్ నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫోరెన్సిక్ బృందాలు సద్రౌనా ప్రాంతంలో మన్వేంద్ర సింగ్ శరీర భాగాల కోసం గాలిస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘చుక్కలు చూపిస్తా’: అమెరికా అధ్యక్షుని హెచ్చరిక -
ర్యాపిడో ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది..!
హైదరాబాద్: ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యువతి.. పార్ట్టైమ్ ర్యాపిడో డ్రైవర్గా అదనపు సంపాదన కోసం కష్టపడుతున్న హోంగార్డు.. వేర్వేరు ప్రాంతాలు.. సోమవారం రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ మృతి చెందారు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం... ఏపీలోని విజయనగరానికి చెందిన కొల్లూరు అక్షిత (20) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చింది. చింతల్లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్న ఆమె సోమవారం ఉదయం మెహిదీపట్నంలో దుబాయ్ వెళ్లే ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూకు హాజరై ర్యాపిడో బుక్ చేసుకుంది. సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ (40) ఉదయం 8 గంటలకు విధులు ముగించుకున్న అనంతరం ర్యాపిడో విధుల్లోకి చేరాడు. మెహిదీపట్నంలో అక్షితను బైక్పై ఎక్కించుకుని పంజగుట్ట వైపు వెళుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–1 వెంగళరావు పార్కు టర్నింగ్ వద్ద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి బైక్ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ట్యాంకర్ వెనుక టైర్ ఇద్దరి మీదుగా వెళ్లడంతో అక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న హుస్సేన్ను నిమ్స్కు తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు. బంజారాహిల్స్ ఇబ్రహీంనగర్కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఖాజాపాషా (30)ను హత్యాయత్నం కింద పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చాంద్రాయణగుట్ట అల్జుబెల్కాలనీకి చెందిన హుస్సేన్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తెల్లారితే దుబాయ్ వెళ్లే ఆనందంలో అక్షిత ఉండగా, కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన హుస్సేన్.. అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. -
మద్యం మత్తులో తండ్రిని నరికి చంపిన తనయుడు
కొండిపర్రు(పామర్రు): పొయ్యిలో మంట ఎందుకు ఎక్కువగా పెట్టావని తిట్టిన తండ్రిని మద్యం మత్తులో ఉన్న కుమారుడు హత్య చేశాడు. ఈ ఉన్మాదం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పామర్రు పోలీసుల కథనం మేరకు.. కొండిపర్రు గ్రామశివారు డీపీగూడెంలో చదువుల సురేష్(45)కుమారుడు చంద్ర మహేష్ నివసిస్తున్నారు. సురేష్ భార్య గతంలో మృతి చెందింది. 22 ఏళ్ల చంద్రమహేష్ పనీపాట చేయకుండా తాగి తిరుగుతుంటాడు. ఆదివారం రాత్రి చంద్ర మహేష్ పొయ్యి వెలిగించి నీరు కాస్తున్నాడు.ఆ సమయంలో తండ్రి సురేష్ వేడి నీరు తోడుతూ ఎందుకు ఇంత పెద్ద మంట పెట్టావు అని తిట్టాడు. మద్యం మత్తులో ఉన్న చంద్రమహేష్ ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తి తీసి తండ్రి మెడతో పాటు ఇంకా రెండు చోట్ల నరికాడు. సురేష్ రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా స్థానికులు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యంలోనే సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు సీఐ సుభాకర్ తెలిపారు. -
మరో ‘బ్లూ డ్రమ్’ తరహా హత్య.. తండ్రి ప్రాణాలు బలితీసిన కుమారుడు
లక్నో:21ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేసిన ఘటనతో లక్నో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తండ్రికి కుమారుడ్ని డాక్టర్ని చేయాలని కోరిక. కుమారుడిది తనకు నచ్చిన రంగంలో స్థిరపడాలనే కోరిక. ఈ సంఘర్షణే చివరికి తండ్రి హత్యకు కారణమైంది.పోలీసుల వివరాల మేరకు..49 ఏళ్ల మన్వేంద్ర సింగ్ లక్నోలో ఫార్మాస్యూటికల్, మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అయితే,మన్వేంద్ర తన కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ను చేయాలనే కోరిక ఉండేది. ఇదే విషయంలో గతంలోనూ తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తండ్రిని విభేదించి రెండు మూడుసార్లు ఇంట్లో నుంచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి.ఫిబ్రవరి 21న సాయంత్రం 4.30 గంటల సమయంలో కుమారుడు అక్షత్కు తండ్రి మన్వేంద్ర సింగ్కు ఇదే విషయంపై మరోసారి వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగింది. ఈ క్రమంలో కోపోద్రికుడైన అక్షత్ ఇంట్లో ఉన్న రివాల్వర్ని తెచ్చి తండ్రిపై కాల్పులు జరిపాడు.అనంతరం మూడో అంతస్తు నుంచి శరీరాన్ని కిందికి తీసుకువచ్చి, ఖాళీ గదిలో ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతని సోదరి చూసినా, ఆమెను బెదిరించి మౌనంగా ఉంచాడు.శరీర భాగాలను ప్లాస్టిక్లో ప్యాక్ చేసి, కొన్నింటిని సమీప ప్రాంతంలో పారేశాడు. మిగతా భాగాలను ఇంట్లోని బ్లూ డ్రమ్లో ఉంచాడు. పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని పిలిచి, ఇంట్లో సాక్ష్యాలు సేకరిస్తున్నారు. శరీర భాగాలను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.అక్షత్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. లభించిన ఆధారాల ఆధారంగా సంబంధిత న్యాయ విభాగాల కింద కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లక్నో అషియానా ప్రాంత సీనియర్ అధికారి విక్రాంత్ వీర్ తెలిపారు. -
నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని మృతి
సాక్షి,తిరుపతి: రేణిగుంట నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థిని మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.ఇంజక్షన్ ఇవ్వడంతో విద్యార్థిని చర్మంపై వాపై వచ్చింది. తిరుపతి రుయా ఆస్పత్రికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె మరణించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్ ఔటింగ్
స్నేహితులతో బీచ్లో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి విధి తీవ్ర విషాదం మిగిల్చింది. శనివారం చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మరొకరు ఆచూకీ ఇంకా దొరకలేదు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వారిలో 22 ఏళ్ల మయూరి హరిశ్చంద్ర చౌదరిగా ప్రాణాలు కోల్పోయింది. 24 ఏళ్ల మరొకరు కనిపించకుండా పోయారు.మూడో వ్యక్తిని జాలర్లు రక్షించారు. ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సిరుసేరి క్యాంపస్లో ఇంటర్న్షిప్ చేస్తున్న ట్రైనీలు 26 మంది శనివారం సెలవు కావడంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (పుదుచ్చేరి రోడ్) వెంబడి ఉన్న బీచ్కు విహారయాత్రకు వెళ్లారు. అధిక ఆటుపోట్ల కారణంగా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో దాదాపు 10 -15 అడుగుల ఎత్తులో అలలు రావడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరి ఆచూకీ తెలియరాలేదు. మహారాష్ట్రకు చెందిన పదిహేను మంది ఇంటర్న్షిప్ కోసం చేరిన వారిలో వీరు ముగ్గురు కూడా ఉన్నారు.మృతురాలిని భండారా జిల్లాలోని మోహది తాలూకాలోని వర్తి గ్రామానికి చెందిన మయూరి హరిశ్చంద్ర చౌదరిగా గుర్తించారు. జల్గావ్ జిల్లాలోని జామ్నేర్కు చెందిన జై పాటిల్ ఆచూకీ కనిపించడం లేదు. ఒడ్డుకు దూరంగా నిలబడి ఉన్న పూణేకు చెందిన రాజ్ కేదారి చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కసారిగా అల విరుచుకుపడటంతో ముగ్గురం కొట్టుకు పోయామని, ఈత కొడుతూ మయూరిని బయటకు లాగగలిగాను కానీ జైని కనుగొనలేకపోయాను అని కేదారివిచారం వ్యక్తం చేశాడు. మయూరి చౌదరిని ఇంజంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గుర్తుచేసుకున్నాడు.సంఘటన జరిగిన వెంటనే కనత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది గాలింపు, రక్షణ చర్యను ప్రారంభించారు.జై పాటిల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ప్రకటనలో తెలిపింది. జై పాటిల్ బంధువులు ,మయూరి చౌదరి కుటుంబ సభ్యులు చెన్నై చేరుకున్నారు.चेन्नई (तामिळनाडू) येथील गोल्डन बीचवर फिरण्यासाठी गेलेल्या महाराष्ट्रातील विद्यार्थ्यांच्या गटासोबत पाण्यात उतरताना दुर्घटना घडली असून या घटनेत महाराष्ट्रातील काही विद्यार्थी अडकल्याची माहिती समोर आली आहे. या घटनेची माहिती मिळताच मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी तात्काळ…— CMO Maharashtra (@CMOMaharashtra) February 22, 2026 -
9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!
తొమ్మిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భర్త అత్తమామలు వేధింపులకు పాల్పడి, ఇంట్లోంచి గెంటేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరింది.ఫిర్యాదు ప్రకారం, జ్యోతి పాండే (34)కు 2017లో ఉత్తరప్రదేశ్లోని బనారస్లో అనురాగ పాండేతో వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వెళ్లింది. తొలి నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే తొలిసారి గర్భం దాల్చింది మొదలు వివాదాలు ప్రారంభమైనాయి. అనుమానంతో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. తమిళనాడులో ఉన్నప్పుడు, తన భర్త, అత్త మామలు తనతో గొడవపడి శారీరకంగా దాడి చేశారని కూడా జ్యోతి ఆరోపించింది. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిఇంతలో జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. తనపై వేధింపుల్లో భాగంగా మళ్లీ,తనపై దాడి చేశాడని, ఇంటి నుండి వెళ్ళగొట్టాడని ఆరోపించింది. తొమ్మిది నెలల గర్భవతిని అయినా, తన ఆరోగ్యం గురించి పట్టించు కోకుండా మానసిక, శారీరక హింసకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కొంతకాలం తన తల్లి ఇంట్లో ఉండి బెంగళూరుకు తిరిగి వచ్చింది. అయినా తనను అవమానించి, వేధిస్తున్నారంటూ దక్షిణ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళల హెల్ప్లైన్లో కుటుంబ కౌన్సెలింగ్ తరువాత, కేసు నమోదు చేసిన పోలీపులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ -
ఘోర ప్రమాదం: రెయిలింగ్లోకి దూసుకెళ్లిన కారు
తూర్పు గోదావరి జిల్లా: మండలంలోని సింగన్నగూడెం వద్ద జాతీయ రహదారి–30లో ఆదివారం కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన పురేష్గౌడ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన 9 మంది కూలీలు తమిళనాడుకు కూలి పనుల నిమిత్తం వెళ్లి కారులో తిరిగి స్వరాష్ట్రం వెళుతున్న క్రమంలో సింగన్నగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొన్నారు. రెయిలింగ్ విరిగిపోవడంతో పాటు కారు ముందు భాగం నుంచి మధ్యలోని సీటు భాగంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పురేష్ గౌడ్ కడుపులోకి రెయిలింగ్ గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ఇందులో జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ సురేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక స్నూకర్ క్లబ్లో మైనర్ల మధ్య వివాదం, ప్రతీకార దాడి తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అక్కడితో వారి ప్రకోపం చల్లారలేదు. నిందితులే స్వయంగా సీసీటీవీ ఫుటేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.పోలీసుల సమాచారం ప్రకారం టీనేజర్ల మధ్య వివాదం పెరిగి ప్రాణాంతక దాడికి దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నబాధిత 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థి స్నూకర్ క్లబ్కు రెగ్యులర్గా వెళ్లేవాడు. నిందితులు, బాధితుడు ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లోనే చదువుకుంటున్నారు. సినిమా ఫక్కీలో దాడి, 30 సెకన్లలో 27 సార్లుఇద్దరు మైనర్లు క్లబ్లోకి ప్రవేశించి సినిమా ఫక్కీలో దాడిచేశారు. 30 సెకన్లలో 27సార్లు కత్తితో పొడిచారు. అనంతరం అంతే వేగంగా అక్కడి నుండి పారిపోయారు. 10 కంటే ఎక్కువ లోతైనగాయాలయ్యాయి. రెండు వేళ్లు తెగి పోయాయి. భుజం, వీపుపై కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి తరువాత ఏదో విధంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందు తున్నాడు. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిదర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ దాడికి కారణం ప్రతీకారమే కారణం. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, పూల్ గేమ్ సందర్భంగా ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. ఈ సమయంలో బాధితుడు ఇద్దరు నిందితులను చెంపదెబ్బ కొట్టాడట. దీంతో కక్ష పెంచుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 15 రాత్రి పథకం ప్రకారం దాడి చేశారు. ఈ ఫుటేజ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసు కున్నారు. నోటీసుల అనంతరం విడుదల చేశారు. వైద్య నివేదిక ఆధారంగా మరిన్ని అభియోగాలు నమోదు చేస్తామని సబ్-ఇన్స్పెక్టర్ మణిపాల్ సింగ్ భడోరియా తెలిపారు.ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం -
కరీంనగర్లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
కరీంనగర్రూరల్/గోదావరిఖని: అత్తింటి వేధింపులను భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త ఆదివారం మృతిచెందాడు. వారం రోజుల వ్యవధిలో దంపతులు మరణించడం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు..గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కంబాల నరేశ్(30) ఏడాదిక్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలి్లకి చెందిన లింగంపల్లి మమత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని గంగానగర్లో నివాసముండగా వరకట్నం కోసం కుటుంబంలో గొడవలేర్పడ్డాయి. సోదరుడు మహేశ్కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చినప్పటికి మమతపై కుటుంబసభ్యుల వేధింపులు ఆగకపోవడంతో ఈ నెల 15న నస్పూర్కాలనీలోని బంధువుల ఇంటికి మమత వెళ్లింది. మరుసటిరోజు ఇంటి యజమాని ఫోన్ చేసి నరేశ్ మెట్లమీదనుంచి కిందపడిపోయి ఆపస్మారకస్థితిలో ఉన్నాడని చెప్పడంతో మమత గోదావరిఖనికి వచ్చింది. సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా నరేశ్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17న ఆస్పత్రిలో ఉన్న మమతను అత్తింటివాళ్లు దూషించడంతో మనస్తాపానికి గురై తీగలగుట్టపలి్లలోని రైల్వేట్రాక్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత తండ్రి పోషం ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఆదివారం వేకువజామున 4గంటలకు చికిత్స పొందుతూ భర్త నరేశ్ మృతిచెందాడు. దంపతులకు గోదావరిఖనిలో గొడవలు కావడంతోపాటు నరేశ్ శరీరంపై గాయాలుండటంతో తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని గోదావరిఖనికి పంపించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నరేశ్ మృతిపై తండ్రి కంబాల భూమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని వన్టౌన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేశారు. -
భర్తను కోల్పోయిన మహిళకు పోలీసు అధికారి వేధింపులు!
శివమొగ్గ(కర్ణాటక): భర్త ఆత్మహత్య చేసుకుని దుఃఖంలో ఉన్న యువతిని పోలీసు వేధించడంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులకే దంపతులు పరలోకానికి చేరారు. ఈ విషాదం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి నగరంలోని హోస సిద్ధాపురలో జరిగింది. వివరాలు.. స్వాతి (26), పోలీసు శాఖ ఆఫీసులో డీ–గ్రేడ్ ఉద్యోగి అయిన జగదీష్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీష్ శివరాత్రి రోజున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రావతిలోని న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం అతని భార్య స్వాతి కూడా ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అంతకుముందు స్వాతి తన తల్లికి వాట్సాప్ సందేశం పంపింది, తీర్థహళ్లి తాలూకాలోని మలూరు ఠాణాకు చెందిన ఓ పోలీసు అధికారి నీ భర్త మరణానికి నువ్వే కారణమని బెదిరించాడని, పలు రకాలుగా ఒత్తిడి చేశాడని వాపోయింది. ఇది జిల్లాలో చర్చనీయాంశమైంది. తన కూతురి మృతిపై విచారణ జరిపి కారకులను శిక్షించాలని ఆమె తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కర్ణాటక: అల్లుని ఇంటిపై...
మండ్య( కర్ణాటక): యువతి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రౌద్రరూప దాల్చాడు, అల్లుని ఇంటికి నిప్పంటించిన సంఘటన మండ్య తాలూకాలోని చుంచగహళ్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. అదే గ్రామంలో ఒకే వీధిలో నివసించే చెందిన వినోద్, కావ్య ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. కానీ యువతి తండ్రి చన్నేగౌడకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. నవంబర్ 19న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని దగ్గర్లోనే ఓ చోట కాపురం పెట్టారు. డబ్బు, బంగారం బూడిద.. కుమార్తె, అల్లుడు ఏ ఇంటిలో ఉన్నారో తెలుసుకున్న మామ చన్నేగౌడ శనివారం ఉదయం వెళ్లి ఇంటిలోకి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో దంపతులు లేరు. మంటలు వ్యాపించి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫరి్నచర్, టీవీ తదితరాలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇంట్లోని రూ.10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం కూడా కాలిపోయినట్లు వినోద్ కుటుంబీకులు విలపించారు. ఈ సమయంలో చన్నేగౌడ కూడా గాయపడ్డాడు, అతనిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు, క్లూస్ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. డీఎస్పీ యశ్వంత్ కుమార్, సీఐ నవీన్ కేసు నమోదు చేశారు. భార్యాభర్తలను మద్దూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత యువతి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది. -
‘హీరో’ను చేస్తానని నమ్మించి మోసం
గచ్చిబౌలి: సినీ హీరో చేస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో పోలీసులు ఓ మహిళకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందజేశారు. మరో సారి తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళను నిందితురాలిగా నానక్రాంగూడలో ఉంటూ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఆకాష్ కుమార్ వర్మకు మాధవి అలియాస్ సిరిచందన పరిచయమైంది. ఆమె ద్వారా పరిచయమైన సాయి బొల్లా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తన వద్ద ఓ కథ ఉందని హీరోగా అవకాశంకల్పిస్తానని నమ్మించి సినిమా రిజి్రస్టేషన్ పేరిట 2023 నుంచి 2025 వరకు దాదాపు రూ.93.35 లక్షలు తన అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సినిమా తీయకపోగా డబ్బులు తిరిగి వ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదుతో గత అక్టోబర్ 6న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విస్తు పోయే విషయాలను కనుగొన్నారు. సాయి బొల్లా అనే వ్యక్తి మాధవి భర్తే అని గుర్తించారు. పక్కా వ్యూహం ప్రకారంమే భార్య భర్తలిద్దరూ కలిసి అకాశ్ కుమార్ వర్మను మోసగించినట్లు గుర్తించారు. మాధవిని నిందితురాలిగా పేర్కొంటూ కేసునమోదు చేశారు. రెండు రోజుల క్రితం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వీరి చేతిలో ఇంకెవరైనా మోస పోయి ఉంటే ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ బాలరాజు సూచించారు. -
ఏపీలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చౌడేశ్వరినగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మూత్రం నిలిచి.. వాంతులతో ప్రారంభమై..రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించడంతో అత్యవసరంగా విచారణ ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రిని డీఎంహెచ్వో, జిల్లా సర్వైలెన్స్ అధికారి, జిల్లా ఎపిడమాలజిస్ట్తో పాటు ఎపిడమిక్ సెల్ బృందం బాధితులను పరిశీలించింది. వైద్యుల ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు, కేసు హిస్టరీ ఆధారంగా ఆకస్మికంగా మూత్రపిండాలు వైఫల్యం చెందినట్టు అనుమానం వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణలో బాధితులందరూ ఒకే పాల విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించామన్నారు. ఇటువంటి మరో నలుగురు బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆస్పత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కాగా.. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలు సేకరించారు. దీనిపై నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.ల్యాబ్కు నమూనాలుకల్తీ పాలతో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
భార్యను హత్యచేసి నగలు ఎత్తుకెళ్లిన భర్త
చేగుంట (తూప్రాన్): ఇల్లరికం వచ్చిన భర్త భార్యను హత్యచేసి నగలను ఎత్తుకెళ్లాడు.ఈ సంఘటన మండల కేంద్రమైన చేగుంట స్టేషన్ రోడ్డులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి(35)కి, ఏపీ నెల్లూరుకు చెందిన త్రిమూర్తులుతో 2015లో వివాహమైంది. త్రిమూర్తులు చేగుంటకు ఇల్లరికం వచ్చి జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో వరలక్ష్మిని పారతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పుస్తెలతాడు, నగలు, డబ్బులు, సెల్ఫోన్ తీసుకొని పారిపోయాడు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతురాలి బావ సాయిబాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కాబోయే వరుడి వేధింపులు.. తట్టుకోలేక తనువు చాలించిన యువతి
సాక్షి,జోగులాంబ: వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవ్వాల్సిన ఇద్దరి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. వధువు ఇంట విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడు తరచూ ఫోన్లో అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక యువతి తనువు చాలించింది.జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక యువతి స్నేహ ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్పై కాబోయే వరుడు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. తరుచూ ఫోన్ వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. -
కాసేపట్లో పెళ్లి.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
జైపూర్: కాసేపట్లో వివాహ వేడుక.. ఇళ్లంతా సందడిగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలకలలాడుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేయడంతో అక్కడంతా సందడి నెలకొంది. ఇంతలో పెద్దగా ఏడుస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీశారు. కట్ చేస్తూ.. వివాహం చేసుకోవాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లులు జరగాల్సిన ఇంట్లో.. ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామానికి చెందిన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ అక్కాచెల్లళ్లకు కుటుంబ సభ్యులు ఒకేరోజు వివాహం చేసేలా ముహుర్తం పెట్టారు. శనివారం ఇద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అయితే, శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ సందర్బంగా జస్వంత్ సింగ్ మాట్లాడుతూ.. వారిద్దరిదీ ఆత్మహత్యేనని ఆరోపించారు. బాధితుల తండ్రి, సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అన్నారు. మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వారికి పెళ్లి నిశ్చయించారని, ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు.అనంతరం, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. కాగా, వీరిద్దరూ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. -
డేటింగ్ యాప్.. సహజీవనం.. చివరికి..
డేటింగ్ యాప్లో పరిచయం.. సహజీవనం.. అనుమానం.. చివరకు పైశాచిక చేష్టలు.. గురుగ్రామ్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవడానికి త్రిపుర నుండి గురుగ్రామ్ వచ్చిన 19 ఏళ్ల యువతి.. ఓ యువకుడితో సహజీవనం సాగిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న శివం.. యువతిపై అమానుషంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ నిలదీసినందుకు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. చిత్రహింసలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన శివమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.యువతికి గత ఏడాది సెప్టెంబర్లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివం పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ కలిసి సెక్టార్-69లో ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన శివం ఆమెను గదిలో బంధించాడు. స్టీల్ బాటిల్తో తలపై కొట్టి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కత్తితో కూడా దాడి చేశాడు.మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతి.. తన తల్లికి ఫోన్ చేసిన జరిగిన ఘోరాన్ని వివరించింది.. తల్లి ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. అంనతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు శివంను అరెస్ట్ చేసిన పోలసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఫిబ్రవరి 16న జరిగిన గొడవ తర్వాత శివం తనపై అత్యంత క్రూరంగా దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె తలపై స్టీల్ బాటిల్తో, మట్టి కుండతో కొట్టాడు. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు వివరించింది. దారుణమైన దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. ఫిబ్రవరి 18 రాత్రి ఆమె నిందితుడి ఫోన్ నుండే తన తల్లికి ఫోన్ చేసింది. శివంకు అర్థం కాకుండా ఆమె బెంగాలీ భాషలో తన బాధను వివరించింది. తనను ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే వచ్చి కాపాడండంటూ ఆమె తన తల్లితో చెప్పింది. బాధితురాలి తల్లి వెంటనే 112 హెల్ప్లైన్కు సమాచారం అందించారు. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
నీ భర్తను అడ్డు తొలగించుకో.. నిన్ను బాగా చూసుకుంటా!
చేవెళ్ల: ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడి మోజులో పడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులైన మృతుడి భార్య, ఆమె ప్రియుడిని జైలుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడెం కృష్ణ(35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి చంద్రారెడ్డినగర్లోని అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా, చేవెళ్ల మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన శరత్ అనే వ్యక్తి చేవెళ్లలోని గణేశ్నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం రాజేశ్వరితో ఇతనికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇతని మోజులో పడిన రాజేశ్వరి భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఇదే అదనుగా భావించిన శరత్ నీ భర్తను అడ్డు తొలగించుకో, నిన్ను బాగా చూసుకుంటా అని నమ్మించాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచి్చన భర్తతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. గాఢ నిద్రలో ఉన్న కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. అతడు చనిపోయిన తర్వాత, తెల్లవారుజాము వరకూ ఇంట్లోనే ఉన్న ప్రియుడు ఆతర్వాత జారుకున్నాడు. శుక్రవారం ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్ర లేవడం లేదంటూ, ఆటోను పిలిపించి పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని చెప్పడంతో, బాడీని ఇంటికి తీసుకెళ్లి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. తన కొడుకు మృతికి కోడలే కారణమని కృష్ణ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భూపాల్శ్రీధర్, డీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని, ఆమె ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు శరత్తో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఇరువురినీ కోర్టులో హాజరుపర్చిన అనంతరం శనివారం రిమాండ్కు తరలించారు. -
చంపుతానని బెదిరించి.. అన్నంత పనిచేసి
రామగిరి(మంథని): తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి ఇద్దరు కారణమని, ఎప్పటికైనా వారిద్దరినీ చంపుతానని సుమారు 15ఏళ్లపాటు బెదిరిస్తూ వచ్చిన ఆ వ్యక్తి అనుకున్నట్లే మొలుగూరి కొమురయ్య(58)ను హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని బంధువుల వివాహ వేడుకకు హాజరైన కొమురయ్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మొలుగూరి కొమురయ్య, మొలుగురి సత్తయ్య అన్నదమ్ములు. కొమురయ్య బేగంపేటలో ఉంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సత్తయ్య సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లిలో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సత్తయ్య బావమరిది బుర్ర రాజకొమురయ్య కొడుకు తిరుపతి 2011లో కమాన్పూర్ మండలం గుండారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే, తన కుమారుడికి కొమురయ్య, సత్తయ్య యాక్సిడెంట్ చేయించారని రాజకొమురయ్య అప్పట్నుంచి అనుమానిస్తూనే ఇద్దరితోనూ గొడపడుతూ వస్తున్నాడు. ఎలాగైనా ఇద్దరినీ చంపుతానని బెదిరించేవాడు. ఈనేపథ్యంలోనే సెంటినరీకాలనీలోని కమ్యూనిటీహాల్లో శనివారం జరిగే బంధువుల వివాహ వేడుకలకు కొమురయ్య, సత్తయ్య కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న రాజకొమురయ్య హఠాత్తుగా సత్తయ్యపై కత్తితో దాడి చేయగా కుడి చేతికి గాయమైంది. అక్కడే ఉన్న కొమురయ్య అడ్డుకునేందుకు యత్నించగా అతడిపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య ఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర రాజకొమురయ్య తన భర్తపై దాడి చేశాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బంధువుల వివాహ వేడుకల్లో విగతజీవిగా పడిఉన్న కొమురయ్యను చూసి స్థానికులు కంటతడిపెట్టారు. -
25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..!
హైదరాబాద్: వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన యువతి(25) ఎస్ఆర్నగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే క్రమంలో బంజారాహిల్స్కు చెందిన మల్లికార్జున్రెడ్డి(50) పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2024లో ఆమెకు వేరే వ్యక్తితో వివాహమైంది. గతేడాది నుంచి మల్లికార్జున్రెడ్డి మళ్లీ ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇటీవల మధురానగర్లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని వేధించాడు. స్నేహితురాలి సాయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును మధురానగర్ పీఎస్కు బదిలీ చేశారు. -
ఢిల్లీలో ఘోరం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. సరితా విహార్ ప్రాంతంలోని ఓ మహిళ(35), ఆమె ఆరేళ్ల కుమార్తె తమ ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పొరుగు వ్యక్తే నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆలీ విహార్లోని ఓ ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నట్లు శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, ఇంటిలోని మంచం స్టోరేజ్ బాక్స్లో మహిళ, బాలికను గుర్తించారు. వెంటనే వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులను జ్యోతి, ఆమె ఆరేళ్ల కుమార్తెగా గుర్తించారు.ప్రాథమిక పరీక్షల్లో బయటకి ఎటువంటి గాయాలు కనిపించలేదు. అయితే శనివారం నిర్వహించిన పోస్ట్మార్టం రిపోర్టులో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే వారు మరణించినట్లు తేలింది. అదే భవనంలో నివసించే అకౌంటెంట్ దీన్ దయాళ్ (35) ఈ కేసులో ప్రధాన నిందితుడి ప్రాథమిక విచారణలో తేలిసింది. ఇతడు బాధితుల కుటుంబానికి బంధువు (మేనల్లుడు) అని స్థానికులు చెబుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ ఇంట్లో దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నారు. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు బయటే కూర్చుని ఉన్నారు. తలుపు లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, కానీ ఏ వస్తువు పోలేదని తెలిపారు. నిందితుడు దీన్ దయాళ్ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి
రంగారెడ్డి జిల్లా: గడువు ముగిసిన ఇంజక్షన్ ఇవ్వడంతో ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు, బాలుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... చేవెళ్ల ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్రెడ్డి తన భార్య అఖిల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు(ఆరు నెలలు)తో కలిసి బండ్లగూడ అభ్యుదయనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం కుమారుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్రేయాన్స్ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్ అభిõÙక్ మహంతి ఆధ్వర్యంలో చిన్నారికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరుసటిరోజు శిశువును మళ్లీ ఆసుపత్రికి తీసుకురాగా కొన్ని మందులు ఇచ్చి పంపించారు. జ్వరం తగ్గకపోవడంతో శనివారం ఉదయం విష్ణువర్ధన్రెడ్డి మరోసారి కుమారుడిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు సెలైన్ ద్వారా వ్యాసోకన్ ఇంజక్షన్ ఇవ్వగా, కొద్దిసేపటికే శిశువు మృతి చెందాడు. తల్లిదండ్రులు అనుమానంతో ఇంజక్షన్ ను పరిశీలించగా, దాని గడువు ముగిసి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టిన మగబిడ్డ కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని తల్లిదండ్రులు బోరున విలపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కుమారుడు మృతి చెందాడని, వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన మందులపై తేదీని సైతం గుర్తించలేని డాక్టర్ల సరి్టఫికెట్లను రద్దు చేసి, ఆసుపత్రిని సీజ్ చేయాలని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. -
మా ఆయన తేడా..
ధర్మవరం అర్బన్: ‘నా భర్త నపుంసకుడు. అతనికి స్నేహితుడితో అసహజ సంబంధాలున్నాయి. నేను బయట పెడతానన్న భయంతో నన్ను చంపాలని చూస్తున్నారు’ అని ధర్మవరం పట్టణంలోని రామ్నగర్లో నివాసముండే బాధితురాలు తెలిపింది. ఈ మేరకు ఆమె శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో విలేకరులకు వివరాలు వెల్లడించింది. ఆమె మాటల్లోనే... ‘నాకు 13 ఏళ్ల క్రితం రామ్నగర్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్తో పెళ్లయ్యింది. మొదట్నుంచే అతని ప్రవర్తనలో తేడా కనిపించింది. ఏదో ఒక కారణంతో నన్ను దూరం పెడుతూ వచ్చేవాడు. అతని ప్రవర్తనలో రోజురోజుకూ మార్పులు వచ్చాయి. రాత్రిపూట నేను నిద్రపోయిన తర్వాత బీరువాలోని నా బంగారు నగలు తీసి మెడలో వేసుకునేవాడు. చీర కట్టుకుని, అద్దం ముందు కూర్చుని సంబరపడిపోయేవాడు. కాళ్లు, చేతుల గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటూ మురిసిపోయేవాడు. తోటి లైన్మెన్ నా భర్తకు క్లోజ్ ఫ్రెండ్. వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. రాత్రి నేను నిద్రపోయాక నా భర్త మహిళలా అందంగా అలంకరించుకుని స్నేహితుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేవాడు. ఇద్దరూ పక్క గదిలో నగ్నంగా పడుకునేవారు. ఒకరోజు ఈ దృశ్యం చూసి నా గుండె పగిలింది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల బయటకు చెప్పుకోలేకపోయా. నాలో నేనే కుమిలిపోయా. వారి బాగోతం నాకు తెలిసిపోవడంతో అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధించడంతో నా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపలేదు. నేను బతికుంటే ఏదోఒక రోజు వారి బండారం బయటకు వచ్చి జనంలో పరువు పోతుందన్న ఉద్దేశంతో చంపాలని చూస్తున్నారు. నేను భయపడి మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయా. భర్త నుంచి భరణం కావాలని కోర్టును ఆశ్రయించా. అప్పట్నుంచీ నన్ను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను, మా నాన్న ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరిస్తున్నారు. ఈ విషయంపై ఎస్పీ సతీష్ కుమార్కు ఫిర్యాదు చేయగా..ధర్మవరం టూటౌన్ పోలీస్స్టేషన్కు పంపించారు. నా భర్తను, అతని స్నేహితుడిని టూ టౌన్ సీఐ పిలిపించి మందలించారు. అయినా మార్పు రాలేదు. వారి నుంచి ప్రాణహాని ఉంది. నన్ను రక్షించాలి. నాలా మరో ఆడపిల్ల మోసపోకూడదని వారి బాగోతం బయట పెడుతున్నా.’ భర్త, స్నేహితుడిపై కేసు నమోదు రామ్నగర్కు చెందిన మహిళను చంపుతామని బెదిరించిన భర్తతో పాటు అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టామన్నారు. -
కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..
హైదరాబాద్: కరెంటు పని కోసం వచ్చిన ఓ ఎల్రక్టీషియన్ ఇంటి యజమాని కూతురిని ఇన్స్టాలో పరిచయం చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని ఓ బస్తీలో నివసించే యువతి(24) తమ ఇంట్లో కరెంటు పనులు, విద్యుద్దీపాల అలంకరణ కోసం ఎలక్రీషియన్ కొమ్ము వంశీకృష్ణ(20)ని సంప్రదించింది. కరెంటు పనులు చేసిన మరునాడు వంశీకృష్ణ ఆ యువతిని ఇన్స్టాలో హాయ్ అంటూ పలకరించాడు. ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. తనకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ వంశీకృష్ణ ప్రారంభంలో రూ.20 వేల వరకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను విడతలవారీగా బ్లాక్మెయిల్ చేస్తూ మరో రూ.2 లక్షలు కాజేశాడు. కొద్దిరోజుల తర్వాత మరో రూ.2 లక్షలు విడతలవారీగా తీసుకున్నాడు. పదే పదే డబ్బులు అడుగుతుండటంతో కొంతకాలంగా దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న వంశీకృష్ణ ఆమె కార్యాలయానికి వెళ్లే క్రమంలో రాకపోకలపై దృష్టిపెట్టి అడ్డగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం బస్తీలో ఆటో కోసం ఎదురుచూస్తున్న ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించగా భయంతో రూ.2 వేలు ఇచ్చింది. సదరు యువకుడితో తనకు ప్రాణహాని ఉందని, తాను బయట తిరగలేకపోతున్నానని, కార్యాలయానికి కూడా వెళ్లడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
విశాఖ కేజీహెచ్లో శిశు మృతదేహం కలకలం
మహారాణిపేట (విశాఖ): నగరంలోని కేజీహెచ్లో శనివారం నవజాత శిశువు మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది. సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలోని లిఫ్ట్ పక్కన, భవనాల వెనుక భాగంలో ఈ మృతదేహం కనిపించడంతో ఆస్పత్రి వర్గాల్లో కలకలం రేగింది. కొద్దిరోజులుగా అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది పరిశీలించగా, గోనె సంచిలో కుళ్లిన స్థితిలో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని పిల్లల విభాగం, ప్రసూతి వార్డుల్లో ఈనెల 12 నుంచి జన్మించిన శిశువుల వివరాలు, మరణాల వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 12 తరువాత వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఎనిమిది మంది శిశువుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, లభ్యమైన ఈ శిశువు మృతదేహం ఎప్పటినుంచి అక్కడ ఉందనే విషయంపై వైద్య సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వన్టౌన్ పోలీస్స్టేషన్ సీఐ పూడి వరప్రసాద్ తెలిపారు. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
చిన్నారి ప్రాణం తీసిన తోపులాట?
నాగర్కర్నూల్ క్రైం: దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఆలయ నిర్వాహకులు, కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడిన రెండు నెలల చిన్నారి మూ డురోజుల అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న మల్లన్న జాతర జరుగుతుండగా ఇదే గ్రామానికి చెందిన చంద్రకళ తన కూతురు కీర్తి, కుమారుడు గణేష్, కోడలు మౌనికతోపాటు రెండు నెలల చిన్నారి (మనుమరాలు)తో కలిసి మల్లన్న దర్శనానికి వెళ్లింది. అయితే జాతర నిర్వాహకులు దర్శనానికి రూ.వంద చెల్లించాలని కోరగా నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కొందరు జాతర నిర్వాహకులు గణేష్, చంద్రకళను కొబ్బరికాయల రూంలోకి తీసుకెళ్లి గణేష్ను చితకబాదారు. కొబ్బరికాయల రూంలో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి. కొబ్బరి కాయల రూం బయట ఉన్న చంద్రకళ కోడలు మౌనిక, రెండు నెలల మనుమరాలు, కూతురు కీర్తి గణేష్ను కొట్టవద్దని అడ్డు వెళ్లగా జాతర నిర్వాహకులు తోసివేయ డంతో రెండు నెలల చిన్నారితో సహా అందరూ కిందపడిపో యారు. ఈ క్రమంలోనే చిన్నారికి అంతర్గతంగా గాయాలయ్యాయని బాధితులు ఆరో పించారు. అయితే శనివారం ఉదయం ఇంట్లోనే చిన్నారి అనుమానా స్పద స్థితిలో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఆలయ నిర్వాహకులు దాడి చేయ డంతోనే చిన్నారి మృతి చెందిందని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గోవర్ధన్ అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.జిల్లా ఆస్పత్రి ఎదుట ధర్నాబాధిత కుటుంబసభ్యులను డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ పరామర్శించి బాధితులకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
అమ్మకు భారం కావొద్దని..
చెన్నూర్: చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్లాడు. అమ్మే కూలీ పనులు చేస్తూ.. ఇద్దరు కొడుకులను పోషిస్తూ డిగ్రీ వరకు చదివించింది. అమ్మమ్మ కూడా వీరికి సాయంగా ఉంటోంది. పెద్ద కొడుకు ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్న కొడుకు రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ రాసినా ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో మనస్తాపం చెందిన నిరుద్యోగి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్లో జరిగింది. పట్టణంలోని కోటబొగూడ కాలనీకి చెందిన ఒద్ది కిరణ్ (24) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి కష్టాన్ని చూడలేక ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్–2, 3, 4 రాసినా రాలేదు. దీంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు చెన్నూర్కు వచ్చాడు. తల్లి, అమ్మమ్మ కుటుంబ పోషణకు పడుతున్న కష్టాన్ని చూసి మనస్తాపం చెందాడు. ఈనెల 19న ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. -
ఆపరేషన్ మ్యాట్రిక్స్: భారీ సెక్స్టార్షన్ ముఠా గుట్టురట్టు
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ సెక్స్టార్షన్, 'డిజిటల్ అరెస్ట్' రాకెట్ను పోలీసులు ఛేదించిన వైనం కలకలం రేపింది. 'ఆపరేషన్ మ్యాట్రిక్స్' పేరుతో చేపట్టిన ఈ దాడిలో 20 మంది అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 1.07 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్ ఈ అరెస్టులను ధృవీకరించారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్లో గ్వాలియర్ జోన్ ఐజీ అరవింద్ కుమార్ సక్సేనా, డీఐజీ అమిత్ సంఘీ ఆదేశాల మేరకు తొమ్మిది ప్రత్యేక బృందాలు శివపురి జిల్లాలోని కరేరా, భోంతి, పిచ్చోర్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయని ఆయన తెలిపారు.అసలేంటీ రాకెట్పకడ్బందీ పథకం ప్రకారం ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడేవారు. మొదట వాట్సాప్లో మహిళల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించేవారు. డేటింగ్ ,టింగ్ యాప్ల ద్వారా బాధితులను ఆకర్షించి, వారితో అసభ్యకరమైన చాట్లు,వీడియో రికార్డింగ్లు చేసేవారు. ఆతరువాత బాధితుల వ్యక్తిగత వీడియోలు సేకరించిన తర్వాత, తమ నిజప్వరూపాన్ని బయటపెట్టేవారు. తాము పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుని, బాధితులపై అత్యాచారం, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు నమోదయ్యాయని భయపెట్టి, బెదిరింపులకు పాల్పడేవారు. ఈ కేసుల నుండి తప్పించుకోవాలంటే భారీగా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడం వీరి మోడస్ ఒపరాండీ.గత వారంలో నమోదైన నాలుగు ఎఫ్ఐఆర్లలో మొత్తం 32 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా, మరో 12 మంది పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో అంగద్ లోధి, విశాల్ లోధి, సుఖ్దేవ్, అర్జున్, దీపక్ ప్రజాపతి తదితరులు ఉన్నారు. వీరిలో మెజారిటీ నిందితులు శివపురి మరియు ఝాన్సీ ప్రాంతాలకు చెందినవారే.రూ. 1.20 లక్షల నగదు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్బుక్కులతోపాటు 7 నాలుగు చక్రాల వాహనాలు, 29 స్మార్ట్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 1.07 కోట్లు అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: సుందర్ పిచాయ్తో సరదాగా, సర్ప్రైజింగా : వైరల్ వీడియోలుపోలీసుల హెచ్చరిక అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాథోడ్ ప్రజలను ఈ సందర్బంగా కోరారు. తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్లను ఎత్తవద్దనీ, ఒకవేళ ఎవరైనా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బెదిరింపులకు పాల్పడితే, వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు. ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం -
మైనర్ బాలుడితో కోడలు వివాహేతర బంధం..!
చిత్తూరు అర్బన్: వివాహేతర సంబంధం మోజులో భర్త, అత్తను చంపడానికి ప్లాన్ చేసిన కవిత అలియాస్ వేలాంగని (37) అనే మహిళను చిత్తూరు వన్టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గిరింపేటకు చెందిన ఈ మహిళ, ఓ మైనర్ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని.. అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది ఆపై ఆమె అత్త గొంతు కోసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మరుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి.. తిరుపతి జువెనైల్ హోమ్కు తరలించారు. పరారీలో ఉన్న మహిళను ఎస్ఐ నాగప్ప నాయక్ అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. -
దంపతులకు మరణ శిక్ష.. యూపీ కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ భవన్, అతని భార్య దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైనర్ బాలురపై (3 ఏళ్ల చిన్నారులతో సహా) దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.అంతేకాకుండా, 2 లక్షలకు పైగా అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను దాదాపు 47 దేశాలకు ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మిశ్రా, నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునాదులనే కదిలించిందని పేర్కొన్నారు. బాధితులైన 33 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది. -
ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: కామాంధుడి వికృతానికి రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకునేందుకు ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఓ ఊరుకు వచ్చింది. భార్యాభర్తలు కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కుమారుడు విజయవాడలో చదువుతుండగా కుమార్తెను మంగళగిరిలోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థినిని అదే కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యర్రబాలేనికి చెందిన రహీమ్ ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో విద్యార్థినికి తెలియకుండా వీడియోలు తీశాడు. రహీమ్ ప్రవర్తనలో మార్పురావడంతో ఆ విద్యార్థిని అతడి ఫోన్ నంబర్ను బ్లాక్చేసింది. ఈ నేపథ్యంలో రహీమ్ తాను, ఆ విద్యార్థిని కలసి ఉన్న వీడియోను ఆమెకు వాట్సాప్ చేశాడు. ఈ పరిణామంతో దిక్కుతోచని ఆమె గతరాత్రి ఇంట్లో మౌనంగా ఉంది. ఏంజరిగిందని తండ్రి, అన్న అడగటంతో.. తాను ఒకరిని ప్రేమించానని, అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. దీంతో కాలేజీకి వెళ్లవద్దంటూ మందలించిన తల్లి కుమార్తె వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకుంది. విద్యార్థిని వద్ద నుంచి స్పందన లేకపోవడంతో రహీమ్ కొన్ని వీడియోలను పలువురు విద్యార్థులకు పంపించాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన సీనియర్ విద్యార్థికి ఈ వీడియోలు పంపించినట్లు తెలియడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానాన్ని తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో సీలింగ్ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని మృతిచెందింది. పనికి వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఉరికి వేళ్లాడుతున్న కుమార్తె కనిపించింది. దీంతో గుండెలు పగిలేలా రోదిస్తూ భర్తకు, కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన తండ్రి ‘ఒకసారి నేనుమాట్లాడతాను. నువ్వు ఏమీ చేసుకోవద్దు. నిన్ను వేరే కాలేజీలో చేర్పిస్తాను’ అని చెప్పినా ఇలా చేసుకున్నావేంటమ్మా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కాలేజీలు, చదువులు బాగుంటాయని సొంత ఊరునుంచి ఇక్కడికి వచ్చి కూతుర్ని బలిచేసుకున్నానంటూ రోదిస్తున్నాడు. జరిగిన విషయాన్ని తాడేపల్లి ఎస్ఐ వెంకటసాయికుమార్కు వివరించాడు. నెలరోజులుగా బ్లాక్మెయిల్ ఆ విద్యార్థినిని రహీమ్ నెలరోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. తోటి విద్యార్థుల వద్ద అది నా దగ్గరకు ఎందుకురాదు? నా కోరిక ఎందుకు తీర్చదో చూస్తాను.. అంటూ పలుమార్లు అశ్లీలంగా మాట్లాడాడని సమాచారం. గురువారం సాయంత్రం కూడా.. రేపు నాతో మాట్లాడుతుంది.. అంటూ తోటి విద్యార్థులతో చాలెంజ్ చేసిన రహీమ్ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ విద్యార్థినికి పంపించినట్లు తెలిసింది. నాలుగు రోజులుగా వీడియోలను కాలేజీ విద్యార్థులు పలువురికి పంపించినట్లు తెలిసింది. కొందరు విద్యార్థుల ద్వారా అధ్యాపకులకు కూడా ఈ వీడియోలు షేర్ అయినట్లు సమాచారం. కనీసం అప్పుడైనా కాలేజీ యాజమాన్యం స్పందించి ఉంటే ఈ విద్యార్థిని ప్రాణాలు దక్కేవని భావిస్తున్నారు. -
కంటిపాపను కాటేసిన కామోన్మాదులు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి మానవ మృగంలా ప్రవర్తించాడు. చీకటి పడగానే కామపిశాచిలా మారిపోయి సొంత కుమార్తెపైనే కొన్నేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే అదునుగా మేనమామ కూడా అర్ధరాత్రి వేళ బాలికపై లైంగికదాడికి పాల్పడేవాడు. కొన్నేళ్లుగా విజయవాడ జక్కంపూడి కాలనీలో సాగుతున్న ఈ దారుణ కీచకపర్వం బాధితురాలి స్నేహితురాలు, ఓ టీచర్ చొరవతో వెలుగుచూసింది. కామోన్మాదులు ఇద్దరికీ స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ అమానుష ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కిందట జక్కంపూడి కాలనీకి వలస వచ్చింది. ఆ దంపతులకు ఓ ఆడపిల్ల సంతానం. భర్త పని చేయగా వచ్చిన డబ్బులతో మద్యం తాగి ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య వేరుగా వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలిక తండ్రి వద్దే ఉండిపోయింది. ఆ పాప ఆలనాపాలన స్థానికులతోపాటు మేనత్త చూసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్న తండ్రి కన్ను బాలికపై పడింది. ఆ బాలిక తండ్రి మూడు నెలల క్రితం చెల్లెలు వరసయ్యే బావమరిది భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె వారుంటున్న ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అప్పటి నుంచి మూడు నెలలుగా బాలికపై తండ్రి లైంగికదాడికి పాల్పడేవాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అర్ధరాత్రి రెండు గంటల తర్వాత మేనమామ ఇంటికి వచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. చీకటి పడేసరికి భయకంపితురాలు కావడంతో రోజూ చీకటి పడేసరికి బాలిక కంగారుపడడం, భయం భయంగా ఉండడంతో అదే బ్లాక్లో నివసిస్తున్న స్నేహితురాలికి అనుమానం వచ్చి ఆరా తీసింది. దీంతో తనపై జరుగుతున్న అమానుషాన్ని బాధితురాలు చెప్పుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే ఆ స్నేహితురాలు గురువారం సాయంత్రం స్కూల్ టీచర్కు విషయం చెప్పడంతో ఆమె వెంటనే కృష్ణలంకలో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం ఉదయం జక్కంపూడి కాలనీకి వచ్చి బాలికను ప్రశ్నించగా, జరిగిన విషయం వాస్తవమేనని తేలింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో తమ మధ్యే ఉన్న మానవ మృగాలు తండ్రి, మేనమామకు దేహశుద్ధి చేశారు. ఇంతలో కొత్తపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలిక తండ్రిని, మేనమామను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాలికను ప్రజ్వల హోమ్కు తరలించారు. కొత్తపేట సీఐ కొండలరావు బాలిక నుంచి రిపోర్టు తీసుకున్నారు. -
ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్ చేస్తే అధికలాభాలు వస్తాయని నమ్మించి మోసగించారని అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందాన క్రికెట్ బెట్టింగ్ వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్కు చెందిన ఓ వ్యాపారికి బుచ్చిరెడ్డిపాళెం రామకృష్ణానగర్కు చెందిన కె.వేణుగోపాల్తో పరిచయమైంది. ఆయన ఆన్లైన్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన వ్యాపారి పలుమార్లు ఆ యాప్లో రూ.53 లక్షలు డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా ఆదాయం రాకపోవడంతో వేణుగోపాల్ను బాధితుడు సంప్రదించగా కాలయాపన చేయడంతోపాటు ఇటీవల బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెంలోని ఇంటిపై దాడి చేసి వేణుతోపాటు అక్కడే ఉన్న బి.వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా క్రికెట్ బెట్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వేణుగోపాల్ అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కలిసి రాధే ఎక్స్చేంజ్ యాప్ (ఆర్777) ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు, వెంకటరమణ బెట్టింగ్ తాలుకు నగదును తీసుకుని జూదరులకు ఇస్తున్నట్లు వెల్లడైంది. ఎవరైనా బెట్టింగ్ విషయంలో గొడవ చేస్తే కత్తులతో చంపుతామని నిందితులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారికి చెందిన నగదును సైతం నిందితులు బెట్టింగ్లో పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. క్స్చేందీంతో పోలీసులు వేణుగోపాల్, వెంకటరమణను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34,65,800 నగదు, ల్యాప్టాప్, టీవీ, 13 మొబైల్స్, రెండు కత్తులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1,64,74,600.60 నగదును సీజ్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష పాల్గొన్నారు. -
కాకరకాయ కూర వండిందని తల్లినే హత్యచేశాడు!
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకరకాయ కూర వండటంపై తలెత్తిన వివాదం ఓ తల్లి ప్రాణాలను తీసింది. చంద్రపూర్లోని మూల్ తహసీల్ పరిధిలోని డోంగర్గావ్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. మృతురాలిని సుమిత్ర పెట్కులే (65)గా గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ర పెట్కులే కుమారుడు జగదీష్ పెట్కులే (37) మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి ప్రవర్తన నచ్చక భార్య రెండు నెలల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుండి నిందితుడు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఘటన జరిగిన రోజు రాత్రి జగదీష్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. అయితే తనకు నచ్చని కాకరకాయ వండటం గురించి అతడు తన తల్లితో గొడవకు దిగాడు. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో సహనం కోల్పోయిన జగదీష్.. తల్లిని విచక్షణారహితంగా కాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్దాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సుమిత్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఈ సంఘటన తర్వాత నిందితుడు ఏ మాత్రం భయం లేకుండా తన తల్లిని చంపానని గట్టిగా కేకలు వేస్తూ గ్రామంలో తిరిగాడు. అయితే అతడు మద్యం మత్తులో ఉండడంతో గ్రామస్తులు పట్టించుకోలేదు. తరువాత వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కాకరకాయ వంటకం విషయంలో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందని ముల్ ఇన్స్పెక్టర్ విజయ్ రాథోడ్ స్పష్టం చేశారు. -
పచ్చని పందిట్లో తీవ్ర విషాదం.. డీజేకు విద్యుత్ షాక్.. ఐదుగురు మృతి
జైపూర్: రాజస్థాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిట్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. డిగ్ జిల్లా నియామత్పూర్లో జరిగిన పెళ్లి ఊరేగింపు డీజేలో విద్యుత్ షాక్ సంభవించింది. విద్యుత్ షాక్ గురై ఐదుగురు మృతి చెందారు. 11కే విద్యుత్వైర్లకు డీజే వాహనం తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో వలసాడ్ జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. లారీ - కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వలసాడ్ జిల్లా కప్రాడా ప్రాంతంలోని కుంభఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు,లారీ ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న వెంటనే కారులో ఉన్న పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే క్షతగాత్రులు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. #WATCH | Valasad, Gujarat | Kaprada Tehsildar says, "7 people died following a collision between a truck and a car...Further investigation is underway..." pic.twitter.com/1Y6fCYucDj— ANI (@ANI) February 20, 2026 -
కుక్క కోసం తలలు పగిలేలా కొట్టుకున్నారు, ప్రేమ పెళ్లి రద్దు!
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కను కొట్టిన కారణంతో రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా రెండేళ్ల ప్రేమను, బంధాన్ని కాదనుకుంది వధువు. అసలు ఏమైంది అంటే..ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ ఫతేపూర్ జిల్లాలోని ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నిజానికి అప్పటికే రెండేళ్లుకుగా ప్రేమలో ఉన్న సుమీత్, తాన్య జంట పారిపోయి కాన్పూర్లోని ఆర్య సమాజ్లో పెళ్లిచేసుకున్నారు. అయితే విషయం తెలిసిన పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి, ఫతేపూర్లో బంధువుల సమక్షంలో మరోసారి ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.పెళ్లి గ్రాండ్గా నిర్వహించేందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరుల కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. బారాత్, జైమాల వేడుక సంతోషంగా పూర్తైంది. ఇక తెల్లవారుజామున ముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రగడ మొదలైంది. పూజామందిరంవద్ద ఆభరణాల సమర్పణ ఆచారాలు జరుగుతుండగా, వధువు పెంపుడు కుక్క అవిశ్రాంతంగా మొరగడం మొదలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన వరుడు తరపు బందువు ఒకరు ఆ కక్కను కొట్టాడు. దీంతో వధువు, ఇతర బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతవరణం ఉద్రిక్తంగా మారిపోయింది. బంధువులంతా కర్రలు, కుర్చీలతో తలలు పగిలేలా కొట్టుకోవడంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. దీంతో వధువు వైపు ముగ్గురు, వరుడి వైపు ఇద్దరు గాయపడ్డారు. వధువు వేలు కూడా విరిగింది.ఇదీ చదవండి: గ్లోబల్ జాబ్స్కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్ ఈ విషయం ఖాగా పోలీస్ స్టేషన్కు చేరడంతో అధికారులు జోక్యం చేసు కున్నారు. గాయపడిన వారిని సెంట్రల్ హెల్త్ సెంటర్ (CHC)లో చికిత్స చేసి, ప్రయాగ్రాజ్కు తిరిగి పంపించారు. అనంతరం ఇరు వర్గాల సీనియర్ సభ్యుల మధ్య చర్చించారు. ఈ క్రమంలో వధువు తాను ఇకపై తానీ పెళ్లిని కొనసాగించ లేనని వధువు స్పష్టం చేసింది. చివరికి కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చు కునేందుకు రాజీ కుదిరింది. ఏ పక్షమూ అధికారికంగా ఫిర్యాదేమీ లేదు కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలు
లైంగిక కుంభకోణం నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసులోబాధితురాలు రినా ఓహ్ (Rina Oh) ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్స్టీన్ లాంటిపవర్పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది.21 ఏళ్ల వయసులో ఉన్న తాను జెఫ్రీ ఎపిస్టీన్ వల్ల తాను అనుభవించిన నరకాన్ని ,ప్రస్తుత పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 1990ల చివరలో రీనా 21 ఏళ్ల ఆర్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు, చిన్నతనంలోనే వేధింపులు గురికావడం, భయం, ఒంటరితనం మగ్గుతున్న తనకు ఎప్స్టీన్ ఒక ‘లైఫ్ లైన్’ లా కనిపించాడని, అయితే తన మౌనాన్ని అతను స్వార్థానికి వాడుకున్నాడని చెప్పింది. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నపుడు తనకు ఎటువంటి షరతులు లేని స్కాలర్షిప్ ఇస్తానని నమ్మబలికి, ఫ్లోరిడాలోని ఎప్స్టీన్ ఎస్టేట్ లోపల, తనను బంధించారని, డబ్బు, రవాణా సౌకర్యం లేక తాను అక్కడ చిక్కుకు పోయానని వాపోయింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని తనను బెదిరించారని తెలిపింది.ఆమె అతన్ని కలవడానికి నిరాకరించినప్పుడు, "నువ్వు విధేయత చూపడం లేదు" అని చెప్పి ఆ ఆర్థిక సహాయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 21 వయస్సులోనే ముసలి దానిలా ఉన్నావని అవమానించాడని గుర్తు చేసుకుంది. తనకున్న రాజకీయ పలుకుబడితో (వాషింగ్టన్లో అందరూ తెలుసని చెప్పి) ఆమెను భయపెట్టాడు. తన తల్లిదండ్రుల వివరాలు కూడా అతనికి తెలుసని, మాట్లాడితే హాని చేస్తాడనే భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయానని చెప్పింది. ఎప్స్టీన్ డార్క్సీక్రెట్స్ అన్నీ తనకు చెప్పాడని, బాధితులను కేవలం శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా కృంగదీసేవాడని, దాని నుండి కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడొక ర్యాగింగ్ నార్సిసిస్ట్"గా అభివర్ణించింది.అంతేకాదు ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న ప్రతి ఒక్కరినీ,వారు ఎంతటి శక్తివంతమైన వారైనా (రాజకీయ నాయకులు లేదా ధనవంతులు), విచారించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే అమెరికా ప్రభుత్వం ఈ కేసులో తీసుకుంటున్న చర్యలు సరిపోవని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అన్నీ తెలుసు, ఆయన పేరు కూడా ఫైళ్లలో ఉంది, కాబట్టి ట్రంప్ కచ్చితంగా నిజాలు చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆండ్రూ అరెస్టుపై స్పందనఎప్స్టీన్ కేసులో మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్బాటెన్-విండ్సర్ (Prince Andrew) అరెస్టు కావడంపై స్పందిస్తూ, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, ఇది ఒక ఉదాహరణగా నిలవాలని ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలోయూరప్ దేశాలు వేగంగా స్పందిస్తున్నాయని, కానీ అమెరికా ప్రభుత్వం జవాబుదారీతనం వహించకుండా తప్పించుకుంటోందని ఆమె విమర్శించారు.కాగా ఎప్స్టీన్ వేధింపుల నుండి బయటపడిన రినా ఓహ్ఆత్మగౌరవం కోసం పోరాడుతోంది. తనను తప్పుగా చిత్రీకరించిన వారిపై కోర్టులో కేసులు వేశారు. 2 మిలియన్లకు పైగా ఉన్న ఎప్స్టీన్ కేసు దర్యాప్తు ఫైళ్లను బహిరంగపరచాలని ఆమె కోరుతున్నారు.ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
పగలు సెలూన్ యజమాని.. రాత్రి లేడీ డాన్
ఢిల్లీ: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున డ్రగ్స్ సిండికేట్ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలియాస్ నేహాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన కీలక షూటర్, ఆయుధ సరఫరాదారుడు బాబీ కబూతర్కు చిరకాల భాగస్వామి. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నేహా ఉత్తర-తూర్పు ఢిల్లీలో బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తూ సాధారణ మహిళగా చలామణి అయ్యేది. అయితే, బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, పోలీసుల విచారణలో నేహ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో వీరిని అరెస్ట్ చేసినప్పుడు భారీ మొత్తంలో డ్రగ్స్ లభించాయి. నేహా, బాబీ గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.బాబీ కబూతర్.. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు ప్రధాన లాజిస్టిక్స్ లింక్గా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. దాదాపు ఏడేళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బాబీ కబూతర్ చివరికి పోలీసులకు చిక్కాడు. నేపాల్-భారత సరిహద్దు సమీపంలో ఇటీవల అరెస్ట్ అయిన దేశంలోనే అతిపెద్ద అక్రమ ఆయుధ వ్యాపారిగా పేరున్న సలీం పిస్టల్ నుంచి ఆయుధాలను సేకరించి ముఠా సభ్యులకు అందించేవాడు. సలీం పిస్టల్ వద్ద నుంచి బాబీ కబూతర్ ఆయుధాలను సేకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. సలీం పిస్టల్ను పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అధికారులు వెల్లడించారు.బాబీ కబూతర్.. మొదట నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నాసిర్ గ్యాంగ్లో ఉండేవాడు. ఆ తర్వాత హషీమ్ బాబాతో కలిసి లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్లో చేరాడు. పలు సంచలన కేసులలో నిందితుడిగా ఉన్నాడు. బరేలీలోని నటి దిశా పటాని ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఢిల్లీలోని జాఫ్రాబాద్లో ఇద్దరు సోదరులపై జరిగిన కాల్పుల్లో బాబీ కబూతర్ స్వయంగా పాల్గొన్నట్లు సమాచారం. ఆ ఘటనలో సుమారు 48 రౌండ్ల కాల్పులు జరిగాయి. 2024లో గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన ఈ హత్యలో షూటర్లకు లాజిస్టిక్ సాయం అందించాడని పోలీసుల విచారణలో తేలింది. -
ర్యాపిడో డ్రైవర్గా పనిచేసే నాని(23)తో రేవతి (33) కొంతకాలంగా...
బంజారాహిల్స్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ప్రేమ జంట తమ ఖర్చు కోసం ఈజీ మనీపై దృష్టిపెట్టి స్నాచింగ్ అవతారమెత్తి పోలీసు వలలో చిక్కారు. ఈ మేరకు స్నాచర్ల జంటను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. గుంటూరుకు చెందిన గిద్దల నరేంద్ర అలియాస్ నాని (23), కాకినాడకు చెందిన చేశెట్టి రేవతి (33) గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ సనత్నగర్లో ఉంటున్నారు.ర్యాపిడో డ్రైవర్గా పనిచేసే నరేంద్ర రేవతితో కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల కదలికలపై దృష్టిపెట్టసాగాడు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడలో నుంచి వెనుక కూర్చొన్న రేవతి గొలుసు తెంచుకుని పరారయ్యారు. వీరిద్దరినీ రిమాండ్కు తరలించగా గొలుసును రికవరీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. వార్త చదవండి : ఆమెకు 33.. అతనికి 23..ఇద్దరూ కలిసి సనత్నగర్లో గది అద్దెకు తీసుకుని -
బొగ్గుల శ్రీనివాస్ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
కూసుమంచి: ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లి ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ నిర్వహించారు.ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించడం, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా ఆరా తీసినట్లు సమాచారం. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని బయటపడినట్లు తెలుస్తోంది.శ్రీనివాస్ మిత్రుడైన ఆయన తన వ్యాపార లావాదేవీల కోసం శ్రీనివాస్ జీఎస్టీ నంబర్ను దుర్వినియోగం చేస్తుండటంతో నిలదీయగా కక్ష పెంచుకుని అతనిని హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడనున్నట్లు తెలుస్తోంది. -
మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై విజయవాడ కొత్తపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ లంబాడీపేట ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. తల్లి ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగించే హేమంత్ నాగసాయి (23) ఆ బాలికకు పరిచయమై ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. కొద్దిరోజులుగా బాలికకు ఒంట్లో బాగోకపోవడంతో తల్లి ప్రశ్నించగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాలిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హేమంత్ నాగసాయిపై పోక్సో కేసు నమోదు చేశారు. మూడేళ్ల బాలికపై లైంగిక దాడి పెదగంట్యాడ: మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన విశాఖలోని గంగవరం పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గంగవరంలోని ఓ కుటుంబానికి పరిచయం ఉన్న 17 ఏళ్ల బాలుడు.. బుధవారం బాలిక ఇంటికి వచ్చాడు. బిస్కెట్లు కొనిస్తానంటూ బాలికను తన వెంట తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తిరిగి ఇంటి వద్ద వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఏడుస్తూ, మానసిక ఆందోళనలో ఉన్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా, బాలిక జరిగిన ఘటనను చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని జువైనల్ మెజి్రస్టేట్ ముందు హాజరుపరిచి, బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. -
ఫార్మసీ విద్యార్థినులపై పచ్చమూకల లైంగిక వేధింపులు
బొబ్బిలి రూరల్: అధికార మదంతో టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినులను రోడ్లపై అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా.. గంజాయి మత్తులో అర్ధరాత్రిళ్లు విద్యార్థినుల ఇళ్ల తలుపులు తడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులేమో.. అధికార నాయకుడి జోక్యంతో వారిని బయటకు వదిలేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని ఓ ఇంట్లో కొందరు ఫార్మసీ విద్యార్థినులు అద్దెకు ఉంటూ కాలేజీకి వెళ్లివస్తున్నారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు కుమారుడు ఆవాల మణికంఠ,అతని అన్న గురువులు కుమారుడు మోహన్కుమార్, కర్రిగణేష్, పెంట వినాయక ఆ విద్యార్థినులపై కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ గంజాయి మత్తులో విద్యార్థినులు నివసిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి.. తలుపులుతడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చదువుకు ఆటంకం కలుగుతుందేమోనని విద్యార్థినులు భయపడుతుండడంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. బుధవారం కాలేజీకి వెళ్లే దారిలో బైక్లపై వచి్చన కామాంధులు.. విద్యార్థినులను అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధించారు. బాధిత విద్యార్థినులు వెంటనే ఈ విషయాన్ని సహచర విద్యార్థులు, అధ్యాపకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వారు అక్కడకు చేరుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ గ్రామం నుంచి ఎలా బయటకు వెళ్తారో చూస్తామంటూ నిందితులు బెదిరించారు. అదే సమయంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాపారావు అక్కడకు చేరుకుని.. ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. నేను చేయాల్సింది నేను చేస్తా. అంతు తేలుస్తా’ అంటూ బెదిరించాడు. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు.. బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనకు తెలియజేశారు. కేసుల నుంచి తమను తప్పించాలని కోరారు. ఆయన ఆదేశాలతో సీఐ నారాయణరావు.. నిందితులను బైండోవర్తో సరిపెట్టి బయటకు వదిలేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తమకు ఫిర్యాదే అందలేదని సీఐ చెబుతున్నారు. దీంతో విద్యార్థినులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలాగైతే తాము చదువుకునేదెలా? అని వాపోతున్నారు. విద్యార్థినులపై వేధింపుల మీద ఫిర్యాదు చేశా.. మా కాలేజీ విద్యార్థినులతో బుధవారం ఉదయం కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన అధ్యాపకులు, విద్యార్థులను బెదిరించారు. తమ గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. – కె.రాజేష్, ప్రిన్సిపాల్, ఫార్మా కాలేజీ -
మద్యం తాగించి.. కత్తితో బెదిరించి
మణికొండ: షాపింగ్ చేద్దామంటూ మాయమాటలు చెప్పి.. ఆపై బలవంతంగా మద్యం తాగించి బాలికపై ఓ యువకుడు, ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి సర్కిల్ నెక్నాంపూర్ డివిజన్ పాషా కాలనీలో అమ్మమ్మ వద్ద ఓ బాలిక (16) నివసిస్తోంది. ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్తుతున్నానంటూ ఇంట్లోంచి వెళ్లింది. సా యంత్రం 4.30 గంటలవుతున్నా బాలిక ఇంటికి చేరుకోకపోవటంతో అమ్మమ్మతో పాటు ఆమె కూ తురు కాలనీలో తెలిసిన వారందరి వద్ద వెతికారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో నార్సింగి పో లీసులకు సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పోలీసులు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ నెల 7న షాపింగ్ కోసం చార్మినార్కు వెళ్లిన బాలికకు తలాబ్కట్టాకు చెందిన బాలుడి (16)తో పరిచయమైనట్లు తెలుసుకున్నారు. అప్పటినుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 16న ఆ బాలుడు పిలవడంతో ఇంట్లోంచి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. బాలుడి ఫోన్ నంబర్ను ట్రేసింగ్లో పెట్టగా చెంగిచర్లలో ఉన్నట్టు లొకేషన్ తెలిసింది. బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి బాలికను నిందితులు ఇమ్రాన్ (23) ఇద్దరు బాలుర (16)ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మరో బాలుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గురువారం కోర్టు ఎదుట హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇమ్రాన్పై పలు పోలీస్స్టేషన్లలో దోపిడీ, దొంగతనం, శారీరక నేరం వంటి కేసులతో పాటు రౌడీïÙట్ ఉందని వారు వివరించారు. అసలు ఏం జరిగింది? బాధితురాలు బాలికను తలాబ్కట్టకు చెందిన బాలుడు చార్మినార్కు పిలిపించుకున్నాడు. మదీనాతో పాటు చారి్మనార్ చుట్టు పక్కల రాత్రి వరకు ఇద్దరూ కలిసితిరిగారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో ఘట్కేసర్ మండలం చెంగిచర్లకు వెళ్లారు. అక్కడి డబుల్ బెడ్రూం గృహాల్లోకి బాలికను తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
చివ్వెంల(సూర్యాపేట): తనను దూరం పెడుతోందనే అక్కసుతో లా విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిపై ప్రేమెన్మాది సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిండ్ల మహేశ్, సమీప గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఆ యువతి హైదరాబాద్లో లా నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆమె స్వగ్రామానికి వచ్చింది. అక్కడ నుంచి చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని స్నేహనగర్లో అద్దెకు ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చి ఉంటోంది. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని ఆమెపై మహేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మహేశ్ సూర్యాపేట పట్టణంలోని ఓ షాపులో సుత్తి కొనుగోలు చేసి గురువారం ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. యువతి అక్క, బావ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో తనతో తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయడంతో ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు వచ్చి మహేశ్ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. మహేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. -
అమానుష ఘటన.. 4 ఏళ్ల చిన్నారిపై మైనర్ బాలుడి లైంగిక దాడి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై ఒక మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి గురించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. -
ఇంట్లో తమ్ముడి దొంగతనం.. అన్న పెళ్లితో బయటపడింది
సాక్షి,హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన సొంత కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని కట్టుకథ అల్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు భాస్కర్ ప్రమోద్ ముల (32 ఏళ్లు) బీటెక్ పూర్తి చేశాడు. చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు. అయితే, భాస్కర్ ప్రమోద్ 2014లో బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ మధ్యలోనే చదువులు మానేసి తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి 2024 నుండి తన నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4,60,000 నగదు పొందాడు.ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ బంగారాన్ని పెళ్లి కోసం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్, తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఒక పథకం వేశాడు.ఈ ఫిబ్రవరి 9న తన పెంట్ హౌస్లో దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ చేపట్టారు.ఈ దర్యాప్తులో ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో రెండు బంగారు ఉంగరాలు (సుమారు 3 తులాలు), ఒక వెండి ప్లేటు, రెండు వెండి గిన్నెలు, అలాగే హెచ్డీఎఫ్సీ,ఎస్బీఐ ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన 80 గ్రాముల బంగారం మార్టిగేజ్ స్లిప్పులు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ. 12 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత కుటుంబాన్ని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరికి తనే ఇరుక్కున్నాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, నిజం బయటపడకుండా దాచడం అసాధ్యం అనేది ఈ కేసు నిరూపించింది. ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఐపీఎస్ రక్షితా కృష్ణమూర్తి , అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య మార్గదర్శకత్వంలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఎం. మల్లేశం, ఎస్ఐ మొహమ్మద్ కరీమ్ క్రైమ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించారు. -
ఎప్స్టీన్ ఫైల్స్ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్
దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో, బ్రిటన్ రాజుగ కింగ్ చార్లెస్-3 సోదరుడు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్బాటన్-విండ్సర్ (Andrew Mountbatten)ను సాండ్రింగ్హామ్ ఎస్టేట్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నార్ఫోక్కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ చట్టం ప్రకారం నిందితుడి పేరును వారు అధికారికంగా వెల్లడించలేదు.సమగ్రమైన పరిశీలన తర్వాతే ఆయనను అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారని బీబీసీ నివేదించింది. 2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅంతకుముందు రోజు ఉదయం, సాండ్రింగ్హామ్ ఎస్టేట్లోని వుడ్ ఫామ్ వద్దకు గుర్తు తెలియని ఆరు పోలీసు కార్లు , సుమారు ఎనిమిది మంది సాదా దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు చేరుకోవడం కనిపించిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు మాజీ యువరాజు ఈరోజు 66 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
‘మంట’గలిసిన మానవత్వం
చైబాసా (జార్ఖండ్): ఆమె గుండెలకు హత్తుకున్నది తన ప్రాణాన్ని.. ఆ గుంపు నిప్పు పెట్టింది ఆ ప్రేమనే.. ముక్కుపచ్చలారని ఏడాది పసికందును, గుండెల్లో హత్తుకున్న తల్లిని.. మూఢత్వం రగిలించిన మంటలు బూడిద చేశాయి. చేతబడి అనే ఒక అబద్ధపు ముద్ర.. కన్నపేగును, అమ్మ ఒడిని నిలువునా దహించివేసిన వేళ, అక్కడ కాలిపోయింది ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. ఈ సమాజపు మానవత్వం.. నాగరిక సమాజం తలదించుకునేలా జార్ఖండ్లో మంత్రగత్తె నెపంతో ఒక మహిళను, ఆమె ఏడాది వయసున్న పసికందును సజీవ దహనం చేసిన ఘోరం వెలుగు చూసింది.మంత్రగత్తె నెపంతో..పశ్చిమ సింగ్భూమ్ జిల్లా కుమారదుంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనమిది. మృతురాలి బంధువు ఒకరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. అయితే, ఆ మహిళ చేసిన చేతబడి వల్లే అతను చనిపోయాడని స్థానికులు కొందరు నమ్మారు.ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు 12 మంది వ్యక్తులు ఆమె ఇంటిపై దాడి చేశారు. భార్యాభర్తలిద్దరినీ బయటకు లాగి ఘర్షణకు దిగారు. గందరగోళం మధ్య, ఆమె చేతిలో ఏడాది బాబు ఉండగానే దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. తల్లి, బిడ్డ అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ దాడిలో భర్త కూడా గాయపడగా, అతను ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని రాత్రంతా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు.చదవండి: కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకుని..బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు జగన్నాథ్పూర్ ఎస్డీపీవో రాఫెల్ ముర్ము తెలిపారు. కేవలం మూఢనమ్మకాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడిలో పాల్గొన్న ఇతర మహిళలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం కుమారదుంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పక్షవాతంతో భర్త.. 70 ఏళ్ల మహిళ హత్య : రూ. 65 లక్షల గోల్డ్ చోరీ
బెంగళూరు: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. పెద్ద వయసులో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులను టార్గెట్గా చేసుకున్నాడో వ్యక్తి. 70 ఏళ్ల మహిళను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నగలతో పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన శోభ, రంగనాథ్ దంపతులు. నెలమంగళలోని హీరాపూర్ ప్రాంతంలోని కోటే బీడీలో నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. పైగా గత 15 ఏళ్లుగా భర్త రంగనాథ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. భార్య శోభ అతణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సంఘటన జరిగిన రోజు, ఆ జంట తమ దినచర్య ఉదయం వాకింగ్కు వెళ్లి ఇంటికి వచ్చారు. ఇదే అదనుగా భావించిన హోల్సేల్ దుకాణ యజమాని శివకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆభరణాల దుకాణ యజమాని కుమార్తె శోభ ఒంటిమీద ఉన్న గొలుసు, గాజులు, ఇతర బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మరికొంత బంగారం, డబ్బు కోసం ఇంట్లో వెతికాడు. దాదాపు రూ. 65 లక్షల విలువైన దాదాపు 450 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు ప్రేక్షకుడిగా నటిస్తూ నేరస్థలానికి తిరిగి వచ్చాడు. .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగనాథ్కు ఫిజియోథెరపీ చేయడానికి వైద్యుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ హత్య విషయం వెలుగు చూసింది. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి వచ్చేసరికి శోభ రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. పక్షవాతంతో బాధపడుతున్న భర్త కూడా ఆమె పక్కనే పడి ఉనన్నాడు. బహుశా ఈ దాడి గురించి తనికి తెలిసి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మోటార్ సైకిల్పై పారిపోతున్న దృశ్యాలను గుర్తించారు. స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా శివకుమార్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. శివకుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు మోటార్ సైకిల్, హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్ను సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఆమెకు 33.. అతనికి 23..గది అద్దెకు తీసుకుని..
బంజారాహిల్స్ : జల్సాల కోసం స్నాచింగ్లకు పాల్పడుతున్న ప్రేమజంటను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పేట్లవారిపాలెంకు చెందిన నరేంద్ర అలియాస్ నాని(23) ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రేవతి (33)తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సనత్నగర్లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే సినిమాలు, షికార్లు, హోటళ్లు, పబ్లకు డబ్బులు సరిపోకపోవడంతో స్నాచింగ్ల బాటపట్టారు.బంగారం ధర అమాంతం పెరగడంతో ఒక గొలుసు కొట్టేస్తే సుమారు రూ. 2 లక్షల దాకా వస్తుండటంతో ఇద్దరూ కలిసి పథకం వేశారు. మంగళవారం ఉదయం ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె ఫోన్లో నిమగ్నమైందని గుర్తించిన ఈ ఇద్దరూ బైక్పై వెంబడించారు. వెనుక కూర్చొన్న రేవతి.. యువతి మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడంతో పాటు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. స్నాచింగ్ చేసిన గొలుసు తీసుకుని బైక్పై గుంటూరు వైపు ఉడాయించారు. వరుసగా సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులకు టోల్గేట్లు దాటుకుని వెళ్తున్న ఈ జంట కనిపించింది. ఉదయం 9.06 గంటలకు స్నాచింగ్ జరగ్గా రాత్రి 8 గంటలకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్కు తరలించి గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. వీరిద్దరిపై గతంలో ఎలాంటి స్నాచింగ్ కేసులు లేవని, కేవలం తమ రోజువారీ ఖర్చులు, అవసరాల కోసం ఈ స్నాచింగ్కు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కడతేర్చి.. కపట నాటకం
మదనపల్లె: ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న కులవర్ధన్ ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలోనూ.., అంతకుముందు స్థానికులతో మాట్లాడినప్పుడు నాటకీయంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటిలోకి పోలీసులు రావడంతోనే.. ‘నా పనైపోయింది సార్’ అని చెప్పి తర్వాత బెదిరింపు ధోరణితో మాట్లాడటం.. అంతకుముందు సోమవారం రాత్రి చిన్నారిని వెతుకుతున్నారా..?, కనిపించిందా..? అంటూ ఏమీ తెలియనట్లు చుట్టుపక్కల వారిని ఆరా తీసినట్టు తెలిసింది. అతడు వ్యవహరించిన తీరు చూస్తుంటే చిన్నారి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించాలన్న ఆలోచనతో ఉండి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతదేహం తరలించడం సాధ్యం కాకపోవడం వల్లే రాత్రంతా మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు బాలిక అదృశ్యం తర్వాత కులవర్ధన్ తీరుపై ఆసక్తికర విషయాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. పోలీసులను చూడగానే.. బెదిరింపు ధోరణితో మాట్లాడి..మంగళవారం ఉదయం పోలీసులు అనుమానితుడు కులవర్ధన్ ఇంటికి వెళ్లారు. తలుపు తట్టినా తీయలేదు. పై కప్పు కిటికీ నుంచి లోపలికి తొంగిచూడగా పడుకొని ఉన్నాడు. మళ్లీ తలుపు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులను చూడగానే.. నా పని అయిపోయింది సార్.. అని అన్నాడు. బాలిక హత్య విషయం ఇక దాగదనుకుని.. అలా మాట్లాడి ఉంటాడని తెలుస్తోంది. తర్వాత పోలీసులు ఇల్లంతా గాలించి చివరకు నీటి డ్రమ్ము మూత తీసి చూడగా బాలిక అందులో మృతదేహం ఉండటంతో వెంటనే సీఐ మొహమ్మద్ రఫీకి ఫోన్ చేశారు. ఓ పోలీసు అధికారితో కులవర్ధన్.. మూడు నెలలు జైల్లో ఉండి మళ్లీ తిరిగి వస్తాను సార్, అప్పుడు చూస్తాను అంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి బంధువు కూడా అతని బెదిరింపు ధోరణిని బహిరంగంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కులవర్ధన్ ప్రవర్తన ఎలాంటిదో అర్థమవుతుందని స్థానికులు అంటున్నారు. బాలిక బంధువులకు సలహాలిస్తూ... సోమవారం సాయంత్రం చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన కులవర్ధన్ ఆ రాత్రి 11 గంటలలోపే హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వర్గాలు చెబుతున్న దాన్నిబట్టి పరిశీలిస్తే.. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిలో నుంచి బయటకు వచ్చిన కులవర్ధన్.. చిన్నారి బంధువులతో మాట్లాడాడు. పాప దొరికిందా? వెతుకుతున్నారా..? అంటూ వారినే ప్రశ్నించాడు. రోడ్లపై దుకాణాల సీసీ కెమెరాలు ఉన్నాయని, పరిశీలించాలంటూ సలహాలు కూడా ఇచ్చాడు. అంటే ఆ సమయంలో చిన్నారి అతని ఇంటిలోనే ఉన్నట్టు, అప్పటికే నీటి డ్రమ్ములో ముంచి చంపేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యాచారం తర్వాత.. రాత్రంతా మద్యం సేవిస్తూనే.. సోమవారం రాత్రి తన ఇంటిలో బాలికను హతమార్చిన తర్వాత కులవర్ధన్ అక్కడే నిద్రించాడు. పోలీసులు ఇంటిలోకి వెళ్లినప్పుడు ఆరేడు ఖాళీ మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఈ ఘటనకు పాల్పడిన తర్వాత విపరీతంగా మద్యం సేవించి ఉంటాడని తెలుస్తోంది. ఆ మద్యం మత్తు వల్లే తలుపు తట్టినా లేవలేదని తెలుస్తోంది. పోలీసులకు దొరికిపోతానన్న ఆందోళనతో ఇలా అతిగా మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని తరలించాలనుకున్నాడా? కులవర్ధన్ చిన్నారిని చంపేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు తరలించాలన్న యత్నం జరిగిందా అన్న అనుమానాలు అతని ప్రవర్తనను బట్టి వ్యక్తమైనట్టు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి ఘటన జరిగిన ప్రాంతంలోనే ఓ అగ్నిప్రమాదం జరగడంతో పోలీసులు అక్కడే ఉన్నారు. దాంతో ఇతను అనుకున్నది చేయలేకపోవడంతోనే.. ఇంటిలోకి పోలీసులు వచ్చినప్పుడు నా పనైపోయింది సార్ అని చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం దొరక్కపోయి ఉంటే తప్పించుకునే అవకాశం ఉండేదన్న భావన అతడిలో కలిగిందని చెబుతున్నారు. ఎదురింటిలోనే మృగాడున్నా.. కులవర్ధన్, అతడి చేతిలో హతమైన బాలిక నివాస గృహాలు ఎదురెదురుగానే ఉంటాయి. మధ్యలో వీధి రోడ్డు ఉంటుంది. పడమర దిశలో బాధిత చిన్నారి కుటుంబం, తూర్పుదిశలో నిందితుడు ఉంటున్న ఇల్లు ఉంది. అతడు దుర్బుద్ధి కలవాడని తెలిసినా, అనుమానం ఆ వైపు వెళ్లేసరికే ఆలస్యమైపోయింది. ఈలోపే కులవర్ధన్ బాలిక ప్రాణాలు తీసేసి తాపీగా మద్యం సేవించి నిద్రించాడు.మృగాడు ఆత్మహత్యచెరువులో శవమై కనిపించిన బాలిక హత్యాచార కేసు నిందితుడు అదుపులోకి తీసుకున్నాక రక్షక్ వాహనం నుంచి తప్పించుకున్నాడన్న ఎస్పీ రెండు బృందాలు గాలిస్తుండగా చెరువులో మృతదేహం గుర్తించామని వెల్లడిమదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్(27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లె వద్ద హైవే సర్వీసు రోడ్డు పక్కనున్న తిరుగంగులప్ప చెరువులో అతడి మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మదనపల్లెలో మీడియా సమావేశంలో కేసు వివరాలు ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం... ‘‘సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యంపై ఫిర్యాదు అందగానే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం బాలిక ఇంటికి ఎదురింట్లో నివసిస్తున్న కులవర్ధన్పై అనుమానంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. తలుపులు వేసుకుని లోపలే ఉండడంతో గడియ పగులగొట్టి లోపలికి వెళ్లారు. బాలిక మృతదేహాన్ని నీటి డ్రమ్ములో పోలీసులు గుర్తించి నిందితుడైన కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న 50 మంది గ్రామస్తులు గుమిగూడి అతడిపై దాడికి యత్నించారు. పోలీసులు రక్షక్ వాహనంలో తరలిస్తుండగా, ప్రజలు ఆందోళన చేస్తూ రహదారిని స్తంభింపజేశారు. ఈ క్రమంలో రక్షక్ వాహనం ఆగినప్పుడు కులవర్ధన్ పరారయ్యాడు. ఆ సమయంలో రక్షక్ వాహనం డ్రైవర్ ఒక్కడే ఉండడంతో కులవర్ధన్ను పట్టుకోలేకపోయాడు. నిందితుడి ఆచూకీ కోసం రెండు బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం కనసానివారిపల్లె వద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. వెళ్లి చూడగా కులవర్ధన్దిగా నిర్ధారణ అయింది. అతడు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కులవర్ధన్పై గతంలో ఒక కేసు ఉంది. ఫిర్యాదితో లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకున్నాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లె వీఆర్వో సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు’’ అని ఎస్పీ వెల్లడించారు. బాలికకు అంత్యక్రియలు వీరబల్లి: హత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు బుధవారం జరిగాయి. వైఎస్సార్సీపీ ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు స్థానిక నాయకులు హాజరై బాలికకు కన్నీటి నివాళులు అర్పించారు. -
కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకొని..
హస్తినాపురం: తనపై కేసులు పెట్టి.. తన జీవితాన్ని నాశనం చేసి... తన తల్లిచావుకు కారణమైందంటూ మాజీ భార్యను కత్తితో తలపై నరికి పడక గదిలోనే అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ తోట మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన మహేశ్, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్లాపూర్ ప్రాంతానికి చెందిన సునీత (29)లకు 2022లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా, కెనడాకు వెళ్లారు. కుటుంబ కలహాల కారణంగా వారి దాంపత్య జీవితం సాఫీగా సాగలేదు. దీంతో కెనడా వెళ్లిన 4రోజులకే సునీత తిరిగి ఇండియాకు వచ్చింది. తన స్వగ్రామమైన బల్లాపూర్ పీఎస్లో తనను మహేశ్ వేధింపులకు గురిచేస్తున్నాడని కేసు పెట్టింది. 2024 డిసెంబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 2025 ఏప్రిల్లో సునీత రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన శ్రీనివాస్ను రెండో వివాహం చేసుకుని హరిహరపురంలోని కెఎన్ఆర్ మెడోస్ గ్రీన్సిటీ కాలనీలోని అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. కాగా 2025 మార్చి నెలలో మహేశ్ తల్లి గుండెపోటుతో మరణించడంతో కెనడా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. తనపై మాజీ భార్య సునీత క్రిమినల్ కేసులు పెట్టడం మూలంగానే తన తల్లి మృతి చెందిందని, తన జీవితం ఆగమైందని, తనను వేధింపులకు గురిచేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తోందని భావించి సునీతపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సునీతను హతమార్చాలని నెల రోజుల క్రితం తుర్కయంజాల్లోని ఓబాయ్స్ హాస్టల్లో ఉంటూ సునీత కదలికలను గమనిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఆమె నివాసం ఉంటున్న ఇంటికివెళ్లాడు.ఇంట్లోని పడకగదిలో సునీత కనిపించడంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో తలపై విచక్షణారహితంగా నరకడంతో సునీత బెడ్పైనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన సునీత అత్త భయబ్రాంతులకు గురై ఇరుగుపొరుగువారికి చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి ఇంట్లోనే తలుపునకు గడియపెట్టి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను గదిలో పోసి తానూ ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడంతో వెంటనే పక్కనే ఉన్న బాత్రూమ్లోకి వెళ్లి తాను కాల్చుకుంటానని పోలీసులను బెదిరించసాగాడు. పోలీసులు మహేశ్కు నచ్చజెప్పి బయటికి రప్పించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. -
దారుణానికి ఒడిగట్టిన ఇస్రో మాజీ సైంటిస్ట్
బెంగళూరు: డిప్రెషన్. ఈ డిప్రెషన్లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బ్లింకిట్కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్ బ్లింకిట్కు ఎదురుదెబ్బ తగిలింది.తన ఆన్లైన్ మార్కెట్ప్లేస్ ద్వారా నిషేధిత కత్తులను అమ్మకానికి అందిస్తున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఆయుధ చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఖ్యాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలు చేసిన కత్తులను ఉపయోగించి జరిగాయని ఆరోపించారు. ఆ సంఘటనల తర్వాత, అధికారులు అమ్మకానికి ఉన్న కత్తులను జాబితా చేస్తూ ఇ-కామర్స్ , రాపిడ్-డెలివరీ సేవలను పరిశీలించారు.ఇందులో భాగంగానే కానిస్టేబుల్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 3.43 గంటలకు ఆన్లైన్ లావాదేవీ ద్వారా రూ. 710 చెల్లించి కత్తి కోసం ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ చిరునామాను ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ అడ్రస్ ఇచ్చారు. ఆ వస్తువు అదే రోజు సాయంత్రం 4.05 గంటలకు స్టేషన్ ప్రాంగణంలో డెలివరీ అయింది. కొనుగోలుకు సంబంధించిన పన్ను ఇన్వాయిస్ విక్రేతను ఆన్లైన్ ప్లాట్ఫామ్గా గుర్తించిందని, పశ్చిమ ఢిల్లీలోని తిహార్ గ్రామంలోని చిరునామాతో ఉంది. దీని ఆధారంగా ఆయుధ చట్టంలోని సెక్షన్ 25, 54 మరియు 59 కింద కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే!బ్లింకిట్ ద్వారా ఆర్డర్ తమకు డెలివరీ అయిన ‘గరారిదార్’కత్తి ప్రమాణాలునిర్ధిష్టప్రమాణాలకు మించి ( గరిష్ట బ్లేడ్ పొడవు 7.62 సెం.మీ బ్లేడ్ వెడల్పు 1.72 సెం.మీ) కంటే ఎక్కువగా ఉందని ప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) దారాడే శరద్ భాస్కర్ తెలిపారు.కత్తి బ్లేడ్ పొడవు 8 సెం.మీ. వెడల్పు 2.5 సెం.మీ ఉది ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, స్వాధీనం చేసుకున్న వస్తువులో స్టీల్ బ్లేడ్ ,స్టీల్ స్ట్రిప్ మెకానిజంతో అమర్చబడిన బ్లాక్ మెటల్ హ్యాండిల్ ఉన్నాయి.అనంతరం ఢిల్లీ అంతటా ప్లాట్ఫామ్కు సంబంధించిన అనేక స్టోర్లు,ఇతర అవుట్లెట్లపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు దాడులు కొనసాగాయి. హర్యానాలోని గుర్గావ్లోని ఫరూఖ్నగర్లో ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న గిడ్డంగి నుండి 32 అదనపు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం 50 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఆయుధాల సోర్సింగ్, నిల్వ మరియు పంపిణీకి బాధ్యతను నిర్ణయించడానికి తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఈ పరిణామంపై బ్లింకిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
87 ఏళ్ల ప్రముఖ న్యాయవాది, మిలియనీర్ దారుణ హత్య
ప్రముఖ న్యాయవాది (87) కోటీశ్వరుడు, దాత రాబర్ట్ ఫుల్లర్ జూనియర్ దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని మేరీల్యాండ్ లోని పోటోమాక్లోని కోగిర్ పోటోమాక్ సీనియర్ లివింగ్ (Cogir Potomac Senior Living)) ఫెసిలిటీలో తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. ఆయన్ని గుర్తు తెలియని తుపాకీతో కాల్చి చంపినట్టు అదికారులు భావిస్తున్నారు.న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, ఉదయం 7:34 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్పాండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫుల్లర్ తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. ఆ గాయం తుపాకీ కాల్పులదేనని, ఇది హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రస్తుతం నిఘా కెమెరాల (surveillance footage) ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అనుమానితులుగా గుర్తించలేదు, అరెస్టు చేయలేదు.యాజమాన్యం స్పందనఆయన మరణంపై సంతాపం ప్రకటించింది. తమ నివాసితుల , సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్న కోగిర్ పొటోమాక్ యాజమాన్యం, భద్రతాపరమైన మార్పుల గురించి లేదా సిబ్బంది ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరీ రాబర్ట్ ఫుల్లర్ జూనియర్ అమెరికా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మెల్విల్ ఫుల్లర్ మునిమనవడు రాబర్ట్ ఫుల్లర్. మైనే (Maine) రాష్ట్రంలో 35 ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. యు.ఎస్. నావల్ రిజర్వ్లో సీనియర్ అధికారిగా పనిచేశారు.(జస్ట్ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)ప్రముఖదాతగా గుర్తింపు ఆగస్టా నగరంలోని కోనీ హైస్కూల్ అథ్లెటిక్ సౌకర్యాల మెరుగుదల కోసం 1.64 మిలియన్ డాలర్ల భారీ విరాళం ఇచ్చారు. మైనే జనరల్ మెడికల్ సెంటర్, కెన్నెబెక్ హిస్టారికల్ సొసైటీ వంటి సంస్థలకు కూడా ఆయన మద్దతుగా నిలిచారు. రాబర్ట్ పుల్లర్ మరణానంతరం ఆగస్టా నగరం నివాళులర్పిస్తూ, ఫుల్లర్ కేవలం దాత మాత్రమే కాదు, ఆగస్టా ప్రజల పట్ల, నగర భవిష్యత్తు పట్ల గొప్ప విశ్వాసం ఉన్న గొప్ప వ్యక్తి అని కొనియాడింది. సిటీ కౌన్సిల్ , ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.ఇదీ చదవండి: పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే! -
అభ్యంతరకరంగా రీల్స్.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మహా శివరాత్రి రోజు శివుడికి మాదకద్రవ్యాలను ప్రసాదంగా పెడుతున్నామంటూ రీల్స్ చేసిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. ఇన్స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్ రవీందర్ నాయక్ నగర్ కాలనీకి చెందిన సభావత్ శ్రీచరణ్(, వడ్త్యా విజయ్ కృష్ణ జిమ్లో పని చేసేవారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న వీరు శంషాబాద్ శివారులోని ఓ శివాలయానికి వెళ్లి ‘శివుడికి అందరూ కొబ్బరి కాయలు కొడతారు...కాని మేము స్పెషల్ ప్రసాదం పెడుతున్నామంటూ గంజాయి’ చూపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్గా మారిన ఈ వీడియోను చూసిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? –సీపీ సజ్జనార్ దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా...? ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? అంటూ ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మహా శివరాత్రి భక్తికి నిదర్శనం...ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు...ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగిస్తే...జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.లైక్ల కోసం–లోకాన్ని మరిచి...వ్యూస్ కోసం–విలువలనే వదిలి..రీల్స్ కోసం–రోడ్డున పడి...మత్తులో మునిగి–జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి...వ్యసనాలకు వాకిలిగా కాదు’......అంటూ చెప్పుకొచ్చారు. -
అత్తపై పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లుడు
పల్నాడు జిల్లా: అత్తపై అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. దాచేపల్లికి చెందిన వాసం లక్ష్మిపై ఆమె అల్లుడు శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవి పెట్రోలు పోసి నిప్పంటించడంతో శరీరం కొంత మేర కాలింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు.దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి –నార్కెట్పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. రవి కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు తీవ్ర ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో బాధితురాలు ఆందోళన చేయాల్సి వచ్చింది. -
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతిచెందాడు. కురబలకోట మండలం కరసానివారిపల్లి చెరువులో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి ముదివేలు పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. -
AP: బ్యూటీ పార్లర్ మహిళతో ఎస్ఐ సహజీవనం..!
విజయనగరం క్రైమ్: జిల్లాలో ఓ పోలీసు అధికారి అనుసరించిన వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది. ఖాకీ దుస్తులు వేసుకున్న ఓ ఇన్స్పెక్టర్ స్థాయి యవ్వారం ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. న్యాయం చేయాల్సిన ఓ పోలీస్ అధికారే మహిళను మోసం చేస్తున్నారన్న గుసగుసలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారి ఆ శాఖే ఖంగుతింది. విజయనగరంలో పార్లర్.. గంట్యాడకు చెందిన ఓ మహిళ విజయనగరంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. గతంలో విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ పోలీస్ అధికారి ఆమెకు గాలం వేసినట్టు తెలిసింది. అయితే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వదిలించుకునే చర్యలు చేపట్టారట. అతడికి భార్య, పిల్లలు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పార్లర్ నడుపుతున్న మహిళ తనను ఎక్కడ వదిలించుకుంటాడేమోనని.. తనకు దక్కించుకునే చర్యలు చేపట్టింది. కొన్నాళ్లు ఇద్దరి మధ్య ఆ యవ్వారం నడిచిందట. బదిలీతో దూరం.. ఆ ఎస్ఐకి వేరొక ప్రాంతానికి బదిలీ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం చెడింది. సదరు పోలీస్ అధికారి దూరం వెళ్లడం, ఆమెను కలవడం మానేశారు. దీనిపై ఆమె పోలీస్ అధికారిని నిలదీసి, తనకు, బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇక లాభం లేదనుకుని ఆమె ఏకంగా ఐజీ వద్దే పంచాయితీ పెట్టింది. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేందుకు సదరు పోలీస్ అధికారి బాధిత మహిళకు డబ్బులు ఆశ చూపినట్లు సమా చారం. ఒకటి, రెండు కాదు నాలుగు లక్షలు.. అయితే ఆమె మాత్రం నన్ను, నా బిడ్డను సాకాలని, ఆపై నన్ను ఏలుకోవాలని నాకు డబ్బులు వద్దంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ఖాకీ పంచాయితీ ఎస్పీ వరకు వెళ్లడం, ఐజీ దృష్టిలో పడడంతో పోలీసు శాఖ మొత్తం విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు సమాచారం. ఫిర్యాదు వచ్చింది తనకు రక్షణ కావాలంటూ ఓ మహిళ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను సీఐగా చార్జ్ తీసుకోక ముందు అప్పటి ఇన్చార్జ్ సీఐగా ఉన్నప్పుడు ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ ఆరీ్వ.కె.చౌదరి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
సాక్షి,పాడేరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పాడేరు మండలం వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్(25), హుకుంపేట మండలం గొందిరాపకు చెందిన రేగం సూర్యప్రకాష్(28), తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు(18) సోమవారం మత్స్యగుండం జాతరకు వెళ్లారు. తిరిగి ముగ్గురు బైక్పై బయలుదేరారు. రమేష్ వాహనాన్ని నడుపుతుండగా మిగిలిన ఇద్దరు వెనుక కూర్చున్నారు. గుత్తులపుట్టు సంతబయలు దగ్గరలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి దూసుకుపోయి విద్యుత్ స్తంభాల ప్రాంతంలో ప్రహరీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగం సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరూ తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన యువకులు 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా..గెమ్మెలి రమేష్ మృతి చెందాడు. సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపినాయుడు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. -
కంటి‘పాప’ను చిదిమేశాడు
సర్కారు నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మరో పసిపాప బలైపోయింది. మత్తెక్కిన నర రూప రాక్షసుడి కబంధ హస్తాల్లో విలవిల్లాడి విగతజీవిలా మారిపోయింది. కామాంధుడి పైశాచికత్వానికి డ్రమ్ములో నిర్జీవంగా దర్శనమిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన మాతృహృదయాలు తల్లడిల్లిపోయాయి. ఇన్నాళ్లూ అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ హృదయవిదారక ఘటనపై అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె కదిలిపోయింది. చలనం లేని మొద్దు సర్కారుపై కన్నెర్రజేసింది. తక్షణం న్యాయం చేయాలని నినదించింది. మదనపల్లె / మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైంది. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేసినట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్ మంగళవారం రాత్రి ప్రకటించారు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. నిందితుడే చిన్నారిపై లైంగిక దాడి చేసి డ్రమ్ములో పెట్టాడని తెలియడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజలూ ఈ ఘటనపై రగిలిపోయారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఆందోళనలు మిన్నంటాయి. సర్కారు, పోలీసుల తాత్సారం, నిర్లక్ష్యంపైనా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు, బంధువులు పట్టుబట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడాన్ని అడ్డుకున్నారు. ఎట్టకేలకు కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి అంగీకరించారు. లైంగిక దాడి చేసి, హత్య చేశాడు: డీఐజీ కులవర్ధన్ బాలికపై లైంగిక దాడి చేసి.. ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడని డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇంటి తలుపులు పగలగొట్టి బాలిక మృతదేహాన్ని గుర్తించామని, అయితే నిందితుడు పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని వివరించారు. నిందితుడి ఇంటిపై నిఘా పెట్టామని వెల్లడించారు. ఎస్పీ, సబ్ కలెక్టర్ ప్రయత్నం విఫలం బాలిక హత్యాచారాన్ని నిరసిస్తూ మదనపల్లె అన్నమయ్య సర్కిల్ జాతీయ రహదారిపై ప్రజలు మంగళవారం ఉదయం నుంచే ఆందోళన చేపట్టారు. బాలిక తల్లి ప్రజలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించింది. గంటలు తరబడి ఆందోళన కొనసాగించారు. ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి డీఎస్పీ కృష్ణ్ణమోహన్ మదనపల్లె చేరుకున్నారు. బాలిక తల్లితో చర్చించారు. నిరసన విరమించాలని కోరారు. అయినా తల్లి అంగీకరించలేదు. న్యాయం చేయాలని ఎస్పీ, సబ్ కలెక్టర్ను వేడుకుంది. పోలీస్ గోబ్యాక్ అని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కులవర్ధన్ సైకో: బాలిక తండ్రి తన బిడ్డను పొట్టన పెట్టుకున్న కులవర్ధన్ సైకో అని బాలిక తండ్రి హోం మంత్రి అనితతో తన ఆవేదన వెలిబుచ్చాడు. బాలిక మరణంపై అనిత ఫోన్లో తల్లిదండ్రులతో మాట్లాడారు. తన బిడ్డను చంపిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తండ్రి డిమాండ్ చేశాడు. బాలిక మరణంపై ఆధారాలు సేకరించాలంటే పోలీసులకు సహకరించాలని మంత్రి కోరారు. నిందితుడికి బెయిల్ రాకుండా జైలులోనే ఉంచి, ఆపై శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి బాలిక తల్లితో మాట్లాడారు. కాగా, నిందితుడు పారిపోయాడని పోలీసులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. తలుపులు వేసుకుని లోపలే ఉన్న అతను ఎలా పారిపోయాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిందితుని ఇల్లు ముట్టడి, ఉద్రిక్తత నిందితుడు కులవర్ధన్ ఇంటిని మంగళవారం ఉదయం స్థానిక ప్రజలు ముట్టడించారు. చిన్నారిని చిదిమేసిన ఉన్మాదిని తక్షణమే శిక్షించాలని పట్టుబట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు బిడ్డకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు వచ్చి చెప్పినా వినలేదు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహేంద్ర విజయవాడ వెళ్లడంతో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు జాప్యం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రజలు నిందితుడి ఇంటివద్దే సాయంత్రం వరకు ఉన్నారు. రాక్షసుడిని తమకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. గంజాయికి బానిస నిందితుడు కులవర్ధన్ గంజాయికి బానిసని స్థానికులు చెబుతున్నారు. అతడికి నేరచరిత్ర కూడా ఉన్నట్టు సమాచారం. స్థానికులు చాలాసార్లు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబు తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా గంజాయి మత్తులోనే ఉన్నాడని, అందువల్లే తలుపులు తట్టినా తీయలేదని పోలీసులే చెబుతున్నారు. -
సిద్ధార్థ్రెడ్డికి జైలు
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్ లేవంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. గత నవంబర్లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. డాక్టర్ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్ప్రొఫెషనల్’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కాదు: కూల్డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్థ్ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సర్వైవింగ్ పార్ట్నర్దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.ఆ రోజు ఏం జరిగింది? 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్డ్రింక్లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. -
జట్టుగా చందా... గుట్టుగా గాంజా దందా!
సాక్షి, హైదరాబాద్: మత్తుమహమ్మారికి బలవుతున్న విద్యార్థులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కొందరు విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించడం వంటి అత్యంత ప్రమాదకర ధోరణిని వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్పీఎస్) ప్రత్యేక బృందం బయటపెట్టింది. దీనిపై విస్తుపోయే విషయాలు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈగల్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టుబడిన విద్యార్థులు తొలుత వినియోగదారులుగా మొదలై, పెడ్లర్లుగా మారి ఆ తర్వాత పెద్ద సరఫరాదారుల దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందం ముగ్గురిని అరెస్టు చేసి 36.878 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్ మీదుగా కరీంనగర్కు గంజాయి తరలిస్తుండగా వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరీంనగర్కు చెందిన బీటెక్ విద్యార్థి బుచ్చల ఆదిత్య అలియాస్ ఇంద్ర (20), ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గొల్లపల్లి నిఖిల్ అలియాస్ చింటు (19) పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారంతో మరొక నిందితుడు వడ్లకొండ యశ్వంత్ అలియాస్ మింటును పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఇతను ఇంతకు ముందు రెండు ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్) కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రాథమిక విచారణలో బుచ్చల ఆదిత్య పలు విషయాలు వెల్లడించాడు. మొదటగా అలవాటు.. ఆ తర్వాత విక్రయాలు బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా హాస్టల్మేట్ అమ్ముల త్రినేశ్ ద్వారా ఆదిత్య గంజాయికి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించాలని ప్రణాళిక రూపొందించాడు. ఆదిత్య రూ.11,600 ఇవ్వడంతోపాటు తన స్నేహితులు గొల్లపల్లి నిఖిల్ (రూ.12,000), వడ్లకొండ యశ్వంత్ (రూ.15000), అమ్ముల త్రినేశ్ (రూ.2000), సుందరగిరి సంజయ్ (రూ.30,000), అజయ్ (రూ.5,000), సిద్ధూ (రూ.2,000), శ్రీధర్ (రూ.3,000)...ఇలా మొత్తం రూ.80,600 జమ చేశారు. ఈ డబ్బుతో కరీంనగర్కు చెందిన, ప్రస్తుతం ఒడిశాలోని పసుపులంక ప్రాంతంలో నివసిస్తున్న కలవేన ప్రవీణ్ కుమార్ అలియాస్ చంటి ద్వారా గంజాయి కిలో రూ.2వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కొంత వాళ్లు వాడుకునేందుకు పెట్టుకుని మరికొంత జల్సాలు చేసేందుకుగాను ఈజీ మనీ కోసం హైదరాబాద్ , కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. గతంలోనూ 2025 జనవరి, జూలై, డిసెంబర్ నెలల్లో 12 కిలోల చొప్పున మూడు సార్లు గంజాయి కొనుగోలు చేసి మేడ్చల్, కరీంనగర్ జిల్లాల పరిసరాల్లోని విద్యార్థులకు విక్రయించినట్టు విచారణలో బయటపడింది. దీంతో అమ్ముల త్రినేశ్, సుందరగిరి సంజయ్, అజయ్, సిద్ధూ, శ్రీధర్తోపాటు వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన భగవాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతను రక్షించడంలో, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్ధారించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని, డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే 1908 టోల్ఫ్రీ నంబర్లో లేదా 8712671111లో సమాచారం ఇవ్వాలని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సూచించారు. -
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య


