వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి... | Girl died on Tuesday while undergoing treatment at the hospital | Sakshi
Sakshi News home page

వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి...

Mar 5 2026 12:54 AM | Updated on Mar 5 2026 12:54 AM

Girl died on Tuesday while undergoing treatment at the hospital

బలవంతంగా లొంగదీసుకున్న యువకుడు 

సూసైడ్‌ నోట్‌ రాసి, పురుగుల మందు తాగిన బాలిక 

మూడునెలలుగా చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి 

నిందితుడిపై పోక్సో, రేప్‌ కేసు నమోదు 

ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి..శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్‌ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్‌ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్‌  బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. 

పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్‌ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్‌పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement