breaking news
Jayashankar
-
విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాలి
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రతీ పరీక్షకు ముందు ఫీజుల పేరుతో వేధిస్తున్నారు. ఫీజు కోసం పొద్దంతా ఎండలో నిల్చోపెడుతూ, పరీక్ష రాయనీయడం లేదు. కొంత మందిని ఇంటి వద్ద వ్యాన్లు ఎక్కించుకోవడం లేదు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – నేరెళ్ల జోసఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి -
నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
● ముందుగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేడు (సోమవారం) జరగనుంది. మున్సిపాలిటీ పరిధిలో 30వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మెజారిటీ కలిగిన సభ్యులలో నుంచి చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక చేపడుతారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని నోటీసులను కమిషనర్ అందించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన కాళేశ్వరం: కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సులోచన కళాక్షేత్రం, నాట్య గురువు వేముల రాధిక సతీష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. ఆదివారం కార్తికేయ, వర్ణిక, క్రితిక, శ్రీనిక, అదితి, మీనాక్షి, రితిక, చార్విక, జశ్విత, అక్షిత, హర్ష నందిని, నాగద్రితి, శిరీష, తనుశ్రీ, శ్రీజ వారి ప్రతిభను చాటారు. రాధిక శిష్య బృందం ప్రదర్శించిన విఘ్నేశ్వర కీర్తన, శివ పంచాక్షరి, శివాష్టకం, నీలకంఠ నిరంజన అంశాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాక్టర్ ప్రేమ్ ఆధ్వర్యంలో శార్వాని కూచిపూడి బృందం ఆకట్టుకుంది. నిరంతర విద్యుత్ సరఫరా భూపాలపల్లి రూరల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందించామని సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.మల్చూరునాయక్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సబ్స్టేషన్ను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ పరంగా సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు ముమ్మర ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా అందించామన్నారు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. -
ఘనంగా లింగోద్భవపూజ
కాళేశ్వరం: మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వేదపండితులు లింగోద్భవ పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, రుద్రపఠనాలతో ఆలయం మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని మారెడు దళాలు సమర్పించారు. అనంతరం చండీహోమం, కాళరాత్రి హోమాలు నిర్వహించారు. ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. పూజలో పాల్గొన్న మంత్రి.. శివరాత్రి సందర్భంగా లింగోద్భవ పూజలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని విశేష అభిషేక, అర్చనలు చేశారు. ఆయనకు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో (కాళేశ్వర ముక్తీశ్వరులు) ద్విలింగాలకు మారెడు దళాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఆయనను అర్చకులు శేషవస్త్రాలతో సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మహదేవపూర్ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం రాత్రి ప్రారంభించారు. కాళేశ్వరం వస్తున్న సందర్భంగా మహదేవపూర్లో వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ హసీనభాను, నాయకులు కటకం అశోక్ తదితరులు ఉన్నారు. పాల్గొన్న ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
వాల్పోస్టర్ ఆవిష్కరణ
రేగొండ: మండలంలోని కోటంచలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట మహోత్సవం, స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయన్నారు. స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. అనంతరం గడిపల్లి శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, నాయకులు ఉమేష్ గౌడ్, భిక్షపతి, రవీందర్ రావు, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు. -
కిక్కిరిసిన కాళేశ్వర క్షేత్రం, గణపేశ్వరాలయం
కాళేశ్వరం/గణపురం: మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం కాళేశ్వరాలయం, గణపేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమ గోదావరి, వీఐపీ ఘాటులో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలతో మొక్కులు చెల్లించారు. గోదావరి మాతకు దీపాలు వదిలి, దంపతి స్నానాలు చేశారు. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివార్లకు గోదావరి జలాలతో అభిషేక పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ప్రకారదేవతలకు మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు గోదావరి తీరం, ఆలయ పరిసరాలు, ఆలయంలోని క్యూలైన్లలో బారులుదీరారు. శివనామస్మరణతో కాళేశ్వరాలయం మారుమోగింది. పుర వీధులన్నీ భక్తజనంతో నిండిపోయాయి. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం శ్రీశుభానంద ముక్తీశ్వరుల కల్యాణం, గోదావరిహారతి, తెప్పోత్సవానికి భక్తులు హాజరై భక్తిని చాటారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి బాలశివుడిని దర్శించుకున్నారు. భక్తులు జాగరణతో పాటు ఉపవాస దీక్షలను నియమ నిష్టలతో పాటించారు. ఆలయం ఆవరణలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు భద్రతా చర్యలు చేపట్టారు. గోదావరిలో పుణ్యస్నానాలు.. ఆలయంలో అభిషేకాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తుల రాక -
వైభవంగా గట్టు మల్లన్న జాతర
టేకుమట్ల: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారమైన గట్టు మల్లన్నను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలోని బూర్నపల్లి గట్టుపై కొనసాగే గట్టు మల్లన్న జాతర ఆదివారం అత్యంత వైభవంగా కొనసాగింది. శనివారం చిన్న పట్నంతో మొదలై పెద్ద పట్నం ఆదివారం రాత్రి వరకు కొనసాగిన మల్లన్న పట్నాలకు మండలంతో పాటు పెద్దపల్లి, ముత్తారం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం గట్టు మల్లన్న జాతరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన గట్టు మల్లన్న జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పోటెత్తిన భక్తజనం దర్శించుకున్న పలువురు నేతలు -
భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం
గణపురంలోని గణపేశ్వరాలయం శివ నామస్మరణతో మారుమోగింది. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి స్వామి వారి కల్యాణం ఆలయ ధర్మకర్త అట్లూరి పావన రాజ్యలక్ష్మీనరసింహారావు దంపతులతో అర్చకుల బృందం నేత్ర పర్వంగా నిర్వహించగా భక్తులు కన్నుల పండుగగా తిలకించారు. జాగరణకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి దంపతులు, డీఎస్పీ అవిరినేని సంపత్ రావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఇసుక లారీ
ఏటూరునాగారం: ఓ ట్రాక్టర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మండల పరిధిలోని రొయ్యూర్ సమీపంలో గల 163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలోని నలుగురు, ఇంజిన్పై కూర్చున్న ఇద్దరు ఎగిరిపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన కూలీలు ట్రాక్టర్ యజమాని పూజారి బుచ్చయ్యతో కలిసి మిర్చి తోట నుంచి ఏటూరునాగారం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఆరుగురిని 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులు గాయాలతో బయపడినట్లు వైద్యులు తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొట్టి వెళ్లిన లారీ కోసం స్థానికులు ఆరా తీస్తున్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపునకు కార్తికేయ కేయూ క్యాంపస్: కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 17 నుంచి 23వ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరం (నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు)లో కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, ఎన్ఎస్ఎస్ వలంటీర్ బాలంకి కార్తికేయ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ శనివారం తెలిపారు. ఈ మేరకు కార్తికేయను కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.శైలజ, ఎం.సౌజన్య తదితరులు అభినందించారు. -
ఎదుర్కోలు మహోత్సవం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శివాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. శివ పార్వతుల కల్యాణం ముందు రోజు ఎదుర్కోళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు రాజ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడు, పార్వతి ఇరు పక్షాల గ్రామ పెద్దలు ఎదర్కోళ్లు నిర్వహించి తాంబూలాలను ఇచ్చి పుచ్చుకున్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక ములుగు రూరల్: సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఇటీవల జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో షాట్పుట్లో అండర్–16 విభాగంలో ఆకాంక్ష, రెజ్లింగ్ అండర్–14 విభాగంలో పూజిత, రెజ్లింగ్ అండర్–16 విభాగంలో రేష్మ, వాల్బాల్లో రిజ్వాన, శ్రీవేణి, కబడ్డీలో శ్రావ్య, 600 మీటర్ల పరుగు పందెంలో సన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ విద్యార్థినులు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ రజిని, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. కాజీపేటలో రైల్వేట్రాక్ మరమ్మతు పనులు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో శనివారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రైల్వేట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంలో రైల్వేట్రాక్ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్ (ట్రాక్ రెల్ రిప్లస్) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేదని, ప్రస్తు తం ఎలాంటి జాయింట్ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్, యంత్రాలతో ట్రాక్ రెన్యువల్ పనులు చేపడుతున్నట్లు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పూజారులు కడియం శ్రీహరి, కౌన్సిలర్లను అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందజేశారు. -
భక్తుల సందడి
వెంకటాపురం(ఎం)/మంగపేట: చారిత్రక రామప్ప దేవాలయం, హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రామప్పకు పర్యాటకులు, విద్యార్థులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ పర్యాటకులకు వివరించారు. అలాగే రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శనివారం భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
ఎవరికో?
మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభ పూజ నిర్వహిస్తున్న అర్చకులుచైర్మన్ పీఠం భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల క్యాంపులో, పట్టణంలో ఆ పీఠం ఎవరికి దక్కనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 16న జరగనున్న ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుండగా ఆశావహుల మధ్య పోటీ ఉత్కంఠను రేపుతోంది. క్యాంపులో కౌన్సిలర్లు.. ఎమ్మెల్యే వ్యూహం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి సీపీఐతో కలుపుకొని 17 వార్డు స్థానాలను కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన వార్డు సభ్యులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపకుండా, ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చాకచక్యంగా వ్యవహరించారు. ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ కౌన్సిలర్లు అందరినీ రహస్య క్యాంపునకు తరలించారు. చైర్మన్ ఎన్నిక రోజు వరకు వీరంతా ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే ఉండనున్నారు. చైర్మన్ రేసులో ముగ్గురు కౌన్సిలర్లు.. మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు ఈ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2, 9, 19 వార్డుల నుంచి గెలుపొందిన బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, కురిమిళ్ల శ్రీనివాస్ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నారు. క్యాంపులో ఉన్న ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు ఈ ముగ్గురు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైస్ చైర్మన్కు తీవ్ర పోటీ.. మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. చైర్మన్ స్థానాన్ని బీసీ పురుషుడికి ఇచ్చే అవకాశాలు ఉండటంతో వైస్ చైర్మన్ పదవిని మహిళలకు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. చైర్మన్ స్థానం బీసీలకు కేటాయించినందున వైస్ చైర్మన్ స్థానాన్ని అయినా తమకు అప్పగించాలని కొందరు ఓసీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరుతున్నట్లు తెలిసింది. ఇంకా నిర్ణయానికి రాని ఎమ్మెల్యే.. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాల ఎంపిక విషయమై శనివారం రాత్రి వరకు కూడా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ నాయకులతో చర్చించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది తేల్చుకోనున్నట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి రాకుండా అందరిని కలుపుకుపోయే అభ్యర్థిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు కాకుండా కొత్త వారిని తెరపైకి తీసుకువస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే మనసులో ఎవరు ఉంటే వారే ఆ పీఠాలను అధిష్టించే అవకాశం ఉన్నందున, ఆయన ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. పట్టణానికా.. విలీన గ్రామాలకా.. ? గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు విలీన గ్రామాలకు చెందిన వారే చైర్మన్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈసారి పట్టణానికి చెందిన వారికే పట్టం కడతారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా రేపు భూపాలపల్లి మున్సిపాలిటీ కొత్త సారథి ఎవరనేది తేలిపోనుంది.కురిమిళ్ల శ్రీనివాస్ బుర్ర కొమురయ్య కాంగ్రెస్ క్యాంపులో ముగ్గురి మధ్య పోటాపోటీ వైస్ చైర్మన్ ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యే సత్తన్న మదిలో ఎవరో.. రేపే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక -
కేయూలో పార్ట్టైం లెక్చరర్ల నియామకం!
● 16న నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు ● వివిధ విభాగాల్లో 100 పోస్టుల భర్తీకి నిర్ణయంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్వైజ్గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 100 మంది నియామకం.. కేయూపరిధిలో 130 మంది పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే.. కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. నోటిఫికేషన్ వస్తే ఎంతమందిని నియమిస్తారనే వివరాలు తెలియనుంది. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు. -
నెగ్గి తగ్గిన కారు..
● అధికార కాంగ్రెస్కు తీవ్ర పోటీ ● పక్కా ప్రణాళికతో కాంగ్రెస్కు 16 స్థానాలు ● రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్న కమలం ● తప్పిన కమ్యూనిస్టుల గురి.. ఒక్క స్థానానికే పరిమితంభూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఏకై క మున్సిపాలిటీని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కై వసం చేసుకునేందుకు రెండు నెలల నుంచి పక్కా ప్రణాళికతో ముందువెళ్లి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అధికార పార్టీకి దీటుగా అభ్యర్థులను బరిలో దింపి ప్రచారం నిర్వహించింది. గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పోలైన ఓట్లలో కాంగ్రెస్కు దీటుగా వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. బీజేీపీ ఎప్పటి లాగే రెండు స్థానాలకే పరిమితమైంది. కార్మిక కాలనీల్లో పట్టున్న వామపక్షాలు సైతం ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి. 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పార్టీలు సాధించిన ఓట్లతో పోలిస్తే ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల ఓట్ల సంఖ్య తగ్గింది. తిరుగులేని కాంగ్రెస్ ఎన్నికలు ఏవైనా ఫలితం మాత్రం ఒకటే కాంగ్రెస్ విజయం. భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 30 వార్డుల్లో 16 వార్డులు గెలుచుకుని మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. మున్సిపాలిటీలో త్రిముఖ పోరు నెలకొన్నా కాంగ్రెస్ మాత్రం ఏకపక్షంగా మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొదటి సారిగా కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. అధికార పక్షం కావడంతో కాంగ్రెస్కు ఎదురులేకుండా పోయింది. ముందు నుంచి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. వార్డుల వారీగా గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై సర్వేచేసి వారికే టికెట్ కేటాయించింది. ఏ వార్డులో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఎక్కువగా ప్రచారం చేసింది. మరో మూడు వార్డుల్లో అతివిశ్వాసంతో ఓడిపోయామని కాంగ్రెస్ చెబుతోంది. గట్టిపోటీనిచ్చిన బీఆర్ఎస్ మున్సిపల్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి పట్టణ ప్రజలు ప్రధానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే పురపోరు సాగింది. కాంగ్రెస్ 25, వామపక్షాలు 5 వార్డుల్లో పోటీ చేయగా ప్రతి వార్డులో తీవ్ర పోటీ నిచ్చింది. 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి తొక్కింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెండు నెలల నుంచి మున్సిపల్ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ వార్డులో ఒక్కటి రెండు సార్లు బస్తీ బాట నిర్వహించారు. రెండు మూడు సార్లు గండ్ర దంపతులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించారు. వికసించని కమలం నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు చేదు ఫలితాలనిచ్చాయి. కేవలం రెండు వార్డులను కై వసం చేసుకుంది. 14వ వార్డులో రెండో స్థానంలో నిలవగా.. 22 వార్డుల్లో మూడో స్థానంలో నిలిచింది. 2015లో రెండు స్థానాలు 2020లో ఒక కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఈసారి రెండు స్థానాలకు పరిమితమైంది. పక్కాగా ప్రచారం చేసినా.. చాలా వార్డుల్లో ప్రజలు ఆదరించకపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్లను తీసుకువచ్చి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అయినా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామనుకున్న వార్డుల్లోనూ ఓడిపోవడం ఆ పార్టీని విస్మయానికి గురిచేస్తుంది. పట్టు తప్పుతున్న కమ్యూనిస్టులు గతంలో భూపాలపల్లి పట్టణంలో సీపీఐ, సీపీఎంలకు పట్టు ఉండేది. పార్టీల అనుబంధ సింగరేణి కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూ ఉన్నాయి. ప్రధానంగా ఏఐటీయూసీకి కార్మికుల్లో బలం ఉంది. గత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఐఎన్టీయూసీకి తీవ్రమైన పోటీనిచ్చింది. గత రెండు పర్యాయాలు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒకటి, రెండు చొప్పున కమ్యూనిస్టులు గెలిపొంది అధికార బీఆర్ఎస్కు తీవ్ర పోటీని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి సీపీఐ 4, సీపీఎం 1 స్థానంలో పోటీ చేయగా 24 వార్డులో మాత్రమే సీపీఐ గెలుపొందింది. 28వ వార్డు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. -
కాంగ్రెస్దే పై‘చేయి’
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా భూపాలపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ విజయ దుందుభి మోగించింది. వామపక్షాలతో జతకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎవరితో పొత్తు లేకున్నా చైర్మన్, వైస్చైర్మన్ స్థానాలను కై వసం చేసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీలో నిలిచిన బీఆర్ఎస్ రెండో స్థానంలో, ఎప్పటి మాదిరిగానే బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా అధికా ర కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రచారం నిర్వహించాయి. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లికి వచ్చి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ సభలు, సమావేశాలు నిర్వహించగా మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పొత్తుగా ఏర్పడి.. కాంగ్రెస్ 25 స్థానాలు, సీపీఐ 4, సీపీఎం ఒక స్థానంలో పోటీ చేశాయి. బీఆర్ఎస్ 30 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో బరిలో నిలిచాయి. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 16, సీపీఐ 1, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి మూడుసార్లు ఎన్నికలు జరుగగా.. రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీయే చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుంది. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో బండారి సంపూర్ణరవి, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సెగ్గెం వెంకటరాణిసిద్ధు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. మూడోసారి జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్, వైస్చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ సరిపడా వార్డు స్థానాలు కై వసం చేసుకోవడంతో చైర్మన్, వైస్చైర్మన్ స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కాగా 2, 9, 19, 30 వార్డుల నుంచి గెలుపొందిన బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, కురిమిళ్ల శ్రీనివాస్, బొడ్డు అశోక్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వైస్చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్తో జతకట్టిన వామపక్షాలు ఐదు స్థానాల్లో బరిలో నిలిచినప్పటికీ 24వ వార్డులో వేముల జ్యోతి మాత్రమే గెలుపొందింది. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సత్తా చాటే సీపీఐ, సీపీఎంలు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అంతంత మాత్రంగానే ప్రభావం చూపాయి. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్లు 13 మంది పోటీ చేయగా ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మిగిలిన 28 మంది కొత్తగా ఎన్నికై న వారే ఉన్నారు. దీంతో ఈ పాలకవర్గంలో అన్ని కొత్త ముఖాలే కనిపించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 16 మంది అభ్యర్థులకు టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్ నేడు(శనివారం) విప్ జారీ చేయనున్నట్లు సమాచారం. భూపాలపల్లి పట్టణంలోని క్రిష్ణాకాలనీ కమ్యూనిటీ హాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పర్యవేక్షించారు. విజేతలు వీరే.. వివరాలు 11లో.. 30 వార్డుల్లో 16 స్థానాలు కై వసం ఢీలాపడ్డ కారు.. 10 స్థానాల్లోనే గెలుపు కాంగ్రెస్ సహకరించినా ఒక్క వార్డుకే వామపక్షాలు పరిమితం రెండింటితో సరిపుచ్చుకున్న బీజేపీ మున్సిపాలిటీపై తొలిసారి కాంగ్రెస్ జెండా -
ఓటర్లకు ధన్యవాదాలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన పట్టణంలోని 30 వార్డుల ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తల శ్రమకు ఫలితమన్నారు. రెండేళ్ల ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. -
నేటినుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నేటి (శనివారం) నుంచి సోమవారం వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఉత్సవాలకు భక్తులు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా తరలిరానున్నారు. 14న శనివారం ఉదయం 10గంటలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ, రుత్విగ్వరణం, మృత్సంగ్రహణం, 11 గంటలకు దేవతారాధన, నవకలశారాధన, నవగ్రహారాధనం నిర్వహిస్తారు. 11.30 గంటలకు మండప దేవతారాధన, వృషభ ధ్వజారోహణం చేపడుతారు. సాయంత్రం నాలుగు గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు, ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ప్రసిద్ధ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15న ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్కాటకలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ శుభానంద–ముక్తీశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం నా లుగువేల మంది కూర్చునేలాగా నిర్మించారు. కానీ కల్యాణం జరిగే వేదిక మాత్రం చిన్నగా ఉందని విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. వెనుకవైపు కూర్చునే వారికి కల్యాణం తంతు కనపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు రెండు వైపులా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కాళేశ్వరంలో కల్యాణమహోత్సవం భారీగా తరలిరానున్న భక్తులు -
ప్రజామద్దతుకు నిదర్శనం
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించిన భూపాలపల్లి పట్టణ ఓటర్లకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఽశుక్రవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చూపిన విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజా మద్దతుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల విజయంలో కీలక భూమిక పోషించిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ప్రజా పాలన, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పట్టణ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఓటు వేశారని హర్షం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. తొడుగు బహూకరణ ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి స్వర్ణలత–భాస్కర్ రెడ్డి దంపతులు గణపేశ్వరుడికి రూ.80వేల విలువగల నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును బహూకరించారు. వారికి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నగరంపల్లి మాజీ సర్పంచ్ మాదాటి సత్యలక్ష్మీనారాయణ రెడ్డి, బైరెడ్డి మహేందర్ రెడ్డి, కొమ్మెర శైలజ శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నాగదేవత పడిగె లభ్యం మల్హర్: మండలంలోని దబ్బపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతీర్థం (సమ్మక్క–సారలమ్మ) జాతర నిర్వహించే ప్రదేశంలో నాగదేవత పడిగె లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతూండ్ల గ్రామానికి చెందిన మహిళకు దేవుడి వచ్చి దుబ్బతీర్థం జాతర ఆవరణలో నాగులమ్మ దేవత పడిగె ఉంది బయటకు తీసి పూజలు చేయాలని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈమేరకు జాతర ఆవరణలో తవ్వి చూడక నాగపడిగె దొరికినట్లు చెప్పారు. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని నాగుదేవత పడిగెకు పూజలు చేశారు. కొయ్యూరు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కాళేశ్వరం: కాళేశ్వరం రాజగోపురం వద్ద బారీకేడ్లు ఇనుప పెన్సింగ్తో అడ్డంగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో రాజగోపురం ఎదుట క్యూలైన్లకు మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు నేరుగా ఆలయంలోకి వెళ్లేవారు. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా రాజగోపురం ఎదుట 100 మీటర్ల పొడవుతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో గోదావరివైపు నుంచి వచ్చే భక్తులు, బస్టాండ్ వైపు నుంచి వచ్చే వారంతా క్యూలైన్లో వెళ్లేందుకు క్యూ కాంప్లెక్సు వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఎదుట మార్గం లేకపోవడంపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. -
‘మేడారం’ ఆదాయం
రూ.13,51,76,275హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. -
కదంతొక్కిన కార్మికులు
అంబేడ్కర్ సెంటర్లో ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణంలో సింగరేణి, కాంట్రాక్ట్, అంగన్వాడీ, మధ్యాహ్న, ఆశ వర్కర్లు కదంతొక్కారు. జాతీయ కార్మిక సంఽఘాల పిలుపులో భాగంగా గురువారం టోకెన్ సమ్మెను విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సింగరేణి గనుల వద్ద ధర్నా చేపట్టారు. అత్యవసర కార్మికులు మినహా సింగరేణి కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో ఏరియాలో 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సింగరేణి, కాంట్రాక్ట్, అంగన్వాడీ, మధ్యాహ్న, ఆశ వర్కర్ల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య మాట్లాడారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. – భూపాలపల్లి అర్బన్ -
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అంబేడ్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మూడు ప్రధాన పార్టీలు, 107 మంది అభ్యర్థులు, 30 వార్డుల్లో పోటీ, వీరిలో ఎవరెవరు గెలుపుతీరాలను చేరుతారనే విషయం మధ్యాహ్నంతో స్పష్టత రానుంది. దాదాపు 15 రోజులుగా నెలకొన్న మున్సిపల్ ఎన్నికల హంగామాకు నేడు (శుక్రవారం) జరిగే ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది. ఇందుకు సంబంఽధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నానికే వెలువడనున్న ఫలితాలు భూపాలపల్లి మున్సిపల్ పీఠాన్ని ఎవరు కై వసం చేసుకుంటారనేది మధ్యాహ్నంలోపు స్పష్టత రానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 10 గంటల వరకే ఫలితాల సరళి తెలియనుంది. 30 వార్డుల్లో సగటున 1800 ఓటర్లు ఉంటే వీటిలో సగటున 1100 నుంచి 1300 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్నంలోపే పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందరిలో ఉత్కంఠ.. క్యాంపులు షురూ.. ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే ఉత్కంఠలో అందరూ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగింది. కొన్ని వార్డుల్లో ఓటరు నాడి కనిపెట్టడం కష్టంగా ఉందని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో విపరీతమైన టెన్షన్ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి అభ్యర్థులందరూ ఓట్లు ఎటు పడ్డాయనే విశ్లేషణల్లో ఉన్నారు. కులసంఘాల ఓట్లు, తమ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎటు పడ్డాయనే లెక్కల్లోనే ఇంకా అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే గెలుపొందిన తరువాత పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు అంతగా పోటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. చైర్మన్ స్థానాన్ని ఎవరు కై వసం చేసుకున్నా ఒకటి, రెండు సీట్ల ఆధిక్యంతో మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు క్యాంపు రాజకీయాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి సాయంత్రం ఫలితాల వెల్లడి కాగానే ఆయా పార్టీల నేతలు తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించేందుకు సిద్ధం అవుతున్నారు. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లకు ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు. లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కాపాడేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. -
కోటగుళ్లలో కట్టుదిట్టమైన భద్రత
గణపురం: ఈ నెల 15న కోటగుళ్లలో నిర్వహించే శివ కల్యాణ మహోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. గురువారం కోటగుళ్లను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఎస్పీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో సన్మానించారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భద్రత చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భూపాలపల్లి డీఎస్పీ అవిరినేని సంపత్ రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ రేఖ అశోక్ పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి రూరల్: నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని మండలాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినీయోగం చేసుకోవాలని కోరారు. 99592 26707కు ఫోన్చేసి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని డీఎం కోరారు. కాళేశ్వరాలయంలో పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వొడ్డెపల్లి రామచందర్రావు, ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్ గురువారం వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. త్రివేణి సంగమంలో హంసవాహనం కాళేశ్వరం: ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు త్రివేణి సంగమంలో హంసవాహనంలో తెప్పోత్సవం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయంత్రం హంసవాహనం ఆకృతితో గోదావరిలో కూలీలు తయారు చేశారు. దీంతో సగం వరకు తయారైన హంసవాహనం పర్యాటకులు, భక్తులను ముచ్చట గొలుపుతుంది. కాటారంలో 2కే రన్ మల్హర్(కాటారం): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం కాటారం మండలకేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్బీఐ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు 2కే రన్ సాగగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ మోసాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. తెలియని సందేశాల లింక్లను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. ప్రతీ బ్యాంకు ఖాతాదారు కేవైసీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఎస్సై శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు ప్రవీణ్, హరిరాంనాయక్, సంతోష్, సికందర్, భాస్కర్, రవినాయక్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి రేగొండ: మండలకేంద్రంలోని పరకాల–భూపాలపల్లి రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కోతులపురం గ్రామానికి చెందిన పొట్ట నరేష్ (25) ఇసుక లోడింగ్ కోసం మహదేవపూర్ వెళ్తున్నాడు. మండలకేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా నరేష్ నడిపే లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ క్యాబిన్లో ఇరుక్కుపోయి కాళ్లకు తీవ్ర గాయాలతో పాటు తల వెనుక తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. చికిత్స కోసం 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. -
కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నుంచి తీసుకువచ్చిన తెప్పకు సంబంధించిన సామగ్రితో హంస ఆకృతిని తయారు చేస్తున్నారు. తెప్పను 45 డ్రమ్ముల నుంచి 60 డ్రమ్ముల వరకు సుమారు 40 మంది కూర్చుని ప్రయాణించే విధంగా కూలీలు తయారు చేస్తున్నారు. దీనికి ఒక మోటార్ పడవను అమర్చనున్నారు. మహాశివరాత్రి (ఆదివారం) రోజు రాత్రి 7 గంటలకు విశేష పూజలతో ఉత్సవమూర్తులను జలవిహారం చేయనున్నారు. అంగరంగవైభవంగా జరగనున్న కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. -
‘ఉపాధి’ పనుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం పెద్దాపూర్, సుబ్బక్కపల్లి, రామ్నాయక్ తండాలతో పాటు గుర్రంపేట గ్రామంలోని పొట్టి కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీఓ బాలకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు కొలతల ప్రకారం పని చేసి రోజువారి గరిష్ట కూలి రూ.307లు పొందాలన్నారు. పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, నీడ కోసం టెంట్, తాగునీరు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపేట సర్పంచ్ కోడూరు రమేష్, వార్డు మెంబర్ అరవింద్, అధికారులు, ఏపీఓ రావుల కిరణ్, పీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. రామప్పలో విదేశీయుల సందడి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన మేరి, జాన్ బోమెన్, యోహీ మోబర్ల్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎన్ఐటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సదస్సులో శ్రీది లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఠాకూర్ దేవ్ సింగ్శ్రీ అంశంపై పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్కుమార్ను గైడ్ రవికుమార్, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్లు తదితరులు అభినందించారు. వరంగల్ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్ కంపెనీ అయిన గోల్డ్ మెడల్ కంపెనీని పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీలో టాస్క్ఫోర్స్ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. షాప్ యజమాని కంతి లాల్ అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు, ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పవర్లిఫ్టింగ్లో జాఫర్కు గోల్డ్ మెడల్
కాజీపేట రూరల్: కాజీపేట రాంనగర్ (కడిపికొండ)కు చెందిన నేషనల్ ఐరన్ క్లబ్ జిమ్ కోచ్ కమ్ చైర్మన్ ఎండీ.జాఫర్ మాస్టర్ పంజాబ్ హరిద్వార్లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకున్నారు. 59 కేజీల విభాగంలో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ కాంపిటీషన్లో 317 1/2 కిలోల టోటల్ చేసి తెలంగాణ నుంచి జాఫర్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ను సాధించి రికార్డును బ్రేక్ చేశారు. ఈమేరకు తెలంగాణ నుంచి పాల్గొని గోల్డ్మెడల్ను సాధించిన జాఫర్ను పలువురు అభినందించారు. ఇప్పటి వరకు 15 నేషనల్ పవర్ లిఫ్టింగ్లో పాల్గొని విజయం సాధించినట్లు, ప్రపంచ ఇంటర్నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీలో పాల్గొని విజయం సాధిండమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని జాఫర్ వేడుకుంటున్నారు. -
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్
ములుగు జిల్లా 80.41 శాతం హనుమకొండ జిల్లా 80.18 శాతం వరంగల్ జిల్లా 85.42 శాతం జేఎస్ భూపాలపల్లి 65.18 శాతం మహబూబాబాద్ జిల్లా 78.90 శాతం జనగామ జిల్లా 80.66 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది.గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం -
అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశి రాత్రిని పురస్కరించుకుని న్యాయవాది చండ్రపాటి చిదంబరనాథ్శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. -
మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖకు సూచించారు. దేవాలయం, అన్నదాన సత్రాలు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. 15న సరస్వతీ ఘాట్ వద్ద జరిగే తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ఆలయంలో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. మహదేవ్పూర్, కాటారం, భూపాలపల్లి మార్గంలో ఇసుక వాహనాల రాకపోకలను నిషేధించాలన్నారు. పరిశుభ్రత, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, 104, 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం స్టాండ్బైలో ఉంచాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అర్చన టిక్కెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని దేవస్థాన ఈఓకు సూచించారు. 14 నుంచి 16 వరకు కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో వైన్షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్కు ఆహ్వాన పత్రిక అందజేత కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ రాహుల్ శర్మకు బుధవారం ఆలయ ఈఓ, పూజారి ఆహ్వానపత్రికను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, అర్చకులు కలెక్టర్కు మహాశివరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను వివరించి, ఈ నెల 15 తేదీన నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, జాగరణ, రథోత్సవం తదితర వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ప్రత్యేక బస్సులు మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం ఇందు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి
ములుగు రూరల్: మండల పరిధిలోని రాయినిగూడెంలో గుట్టమీది ముసలయ్య జాతరకు పూజారులు తేదీలను ఖరారు చేయడంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తవిటి నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం గుడిశుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు గుట్టమీది ముసలయ్య జాతర నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొ క్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తవిటి పుష్పక్క, రాములు, సమ్మయ్య, రామస్వామి, విజయ, సర్పంచ్ ఈసం సునీత, ఉప సర్పంచ్ దేవేందర్రావు, ఆలయ ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఓటెత్తారు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ఎన్నికలుపోలింగ్ సరళి ఇలా..భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 34,367 మంది ఓటు హక్కు వినియోగం.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, పురుష ఓటర్లు 26,786, మహిళ ఓటర్లు 25,936, ఇతరులు నలుగురు, మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 34,367 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 65.18 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. యువత ఆసక్తి.. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత ఆసక్తి చూపారు. పలువురు తల్లులు చంటిబిడ్డలను ఎత్తుకొని రాగా, వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ.. ఎన్నికల సరళి, ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పర్యవేక్షించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోల్ చీటీలు లేక ఇబ్బందులు.. పలువురు ఓటర్లకు పోల్ చీటీలు అందక ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల రోజునే కొందరు వివిధ రాజకీయ పార్టీల వద్ద పోల్చీటీలు పొందగా, మరికొందరు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బీఎల్ఓల వద్ద తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన పోలింగ్ శాతం భూపాలపల్లి మున్సిపాలిటీలో 2020లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి 1.81 శాతం పోలింగ్ పెరి గింది. కాగా అత్యధికంగా 2014లో 70.55 శాతం పోలింగ్ జరిగింది. అనంతరం 2020లో 63.37 శాతం పోలింగ్ జరుగగా, బుధవారం జరిగిన ఎన్నికల్లో 65.18 శాతం పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్ రూమ్కు తరలిన బ్యాలెట్ బాక్సులు.. పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. రేపు (శుక్రవారం) ఓట్ల లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. పట్టణంలో 30 వార్డులు ఉండగా 107 మంది అభ్యర్థలు బరిలో ఉన్నారు. ఇందులో స్వతంత్రులు అంతంత మాత్రంగానే ఉనికి చాటుకోబుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు పార్టీలు చెరో 10 స్థానాలను పక్కాగా కై వసం చేసుకోనుండగా మిగిలిన పదింటిలో గట్టి పోటీ ఉంది. ఈ స్థానాల్లో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గట్టెక్కుతారు. అయితే ఈ వార్డుల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కై వసం చేసుకుంటే ఆ పార్టీనే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునే అవకాశం ఉంది.ఓటర్లకు డబ్బులు పంచుతూ పలువురు పట్టుబడ్డారు. 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. లక్షల స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3వ వార్డులో డబ్బులు పంచేందుకు వెళ్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూ. 7,500 స్వాధీనం చేసుకున్నారు. చెదురు ముదురు ఘటనలు.. 6వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఇతర ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను పంపించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన బీఎల్ఓలకు భోజన సౌకర్యం కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. 65.18 శాతం పోలింగ్ నమోదు పోల్ చీటీలు అందక పలుచోట్ల ఇబ్బందులు పోలింగ్ను పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ రేపు కౌంటింగ్..ఫలితాల వెల్లడి -
హుండీ ఆదాయం రూ.10.92లక్షలు
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.10.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా నోట్లు రూ.9,82,050, నాణెములు రూ.1,10,329 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత, సర్పంచ్్ మొగిళి, పంచాయతీ కార్యదర్శి అమూల్య, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి భజన బృందాలు పాల్గొన్నారు. -
మందు.. మనీ.. గిఫ్ట్లు
భూపాలపల్లి: ఓటర్లను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. పంపిణీకి కాదేది అనర్హం అన్నట్లుగా డబ్బు, మందుతో పాటు వివిధ రకాల నజరానాలు అందజేశారు. చీరలు, టవల్స్, క్రికెట్ కిట్లు, చికెన్, కూల్డ్రింక్స్ కూడా ఓటర్లకు పంచారు. రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు... భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ప్రతీ వార్డులో డబ్బు పంపిణీ జరిగింది. ఒక్కో వార్డులో సుమారుగా 1500 నుంచి 2200 ఓట్ల వరకు ఉన్నాయి. అందులో మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, డబుల్ ఓట్లు సుమారు రెండు వందల వరకు ఉన్నాయి. మిగిలిన ఓటర్లకు ఒక్కో వార్డులో ఒక్కో విధంగా అభ్యర్థులు డబ్బు పంపిణీ చేశారు. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఇవ్వగా, పలు వార్డుల్లో రూ.1,500 నుంచి రూ. 2వేల వరకు ఇచ్చారు. ఏ వార్డులో కూడా ఓటుకు రూ.1,500లకు తక్కువగా ఇవ్వలేదు. మొత్తంగా ఒక్కో అభ్యర్థి నగదు పంపిణీ విషయంలోనే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కనిపించని అధికారులు.. ఎన్నికల నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘన జరిగినా, కట్టడి చేయాల్సిన అధికారులు, ప్రత్యేక టీంలు అంతగా కానరాలేదు. అభ్యర్థులు తమ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ డబ్బు, నజరానాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసినా అంతగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నామమాత్రంగా రహదారులపై తనిఖీలు చేపట్టారని, చిన్నచిన్న కేసులు మాత్రం నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చును చూసి సాధారణ ప్రజలు నివ్వెరపోయారు. డబ్బు లేని వారు ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు లేవంటూ పలువురు చర్చించుకుంటున్నారు. డబ్బు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోననే భయంతో కొందరు అభ్యర్థులు ప్రత్యేక నజరానాలు ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రతీ ఇంటికి కేజీ చికెన్, కూల్డ్రింక్స్, ఒక క్వార్టర్ మద్యం, చీరలు, టవల్స్, యువకుల కోసం క్రికెట్ కిట్స్ అందజేశారు. కొన్ని వార్డుల్లో అయితే వాడకొక మేకను గిఫ్ట్గా ఇవ్వడంతో రాత్రంతా దసరాను తలపించింది. మొత్తంగా ప్రత్యర్థుల వైపు ఓటర్లు మళ్లకుండా ఉండేందుకు పలువురు అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. అర్ధరాత్రి వరకు ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారు కోరినవన్నీ అందిస్తూ వచ్చారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చీరలు, టవల్స్, క్రికెట్ కిట్లు, చికెన్, కూల్డ్రింక్స్ కూడా.. అర్ధరాత్రి వరకు ఓటర్ల ఇళ్ల చుట్టూ అభ్యర్థులు -
వాణిజ్య శాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కోర్స్ ద్వారా ట్యాలీ ప్రైమ్ (జీఎస్టీ) ఉపయోగించి వ్యాపార కౌంటింగ్, బిల్లింగ్ ఇన్వెంటరీ నిర్వహణకు సంబంధించి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించే విధానాన్ని శిక్షణార్థులు నేర్చుకుంటారని తెలిపారు. కోర్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు జూనియర్ అకౌంటింగ్, అకౌంట్స్ అసిస్టెంట్, జీఎస్టీ అసిస్టెంట్ బిల్డింగ్ ఆపరేటర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు, హక్కుల పరిరక్షణకు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని అన్ని గనుల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించి కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రద్దు చేయాలన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటా యించి, పర్మనెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని తెలిపారు. ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ● మద్దులపల్లిలో భయాందోళన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం దుమ్ముతో కూడిన సుడిగుండం సుమారు 45 నిమిషాల పాటు కనిపించి స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. సాయంత్రం వేళ చేలల్లో పనుల నిమిత్తం వెళ్లిన పలువురు తిరిగి వస్తున్న క్రమంలో సుడిగుండాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దుమ్ము గాలిలోకి ఎగసిపడటంతో పరిసర ప్రాంతమంతా దుమ్ము మేఘాలతో నిండిపోయింది. దృశ్యం భయానకంగా మారడంతో ఏం జరుగుతుందోనని భయపడ్డారు. మేడారం అడవుల్లో ఏర్పడ్డ టోర్నాడా లాంటిదని భయాందోళనకు గురయ్యారు. ప్రాణ, ఆస్తినష్టం, చెట్లు కూలడం జరగలేదని స్థానికులు తెలిపారు. కొద్దిసేపటి తరువాత సుడిగుండం అదుపులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సుడిగుండం ఎగిసిపడ్డ వీడియోలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
మున్సిపోల్కు సిద్ధం
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలను నేడు (బుధవారం) నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉండగా పురుషులు 26,786, మహిళలు 25,936 ఉన్నారు. నలుగురు ఇతరులు ఉన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటుచేయగా.. మంగళవారం సామగ్రితో ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీరు, టెంట్ సౌకర్యాలు కల్పించి, వీల్చైర్లు అందుబాటులో ఉంచారు.6 జోన్లు.. 8 రూట్లు 30 వార్డుల్లోని 86 పోలింగ్ కేంద్రాలను 6 జోన్లు, 8 రూట్లుగా విభజించారు. ఎన్నికల నిర్వహణకు 561 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఆర్ఓ, ఏఆర్ఓ, మైక్రోఅబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ల వివరాలను తెలిపేందుకు బీఎల్ఓలను అందుబాటులో ఉంచనున్నారు.పోలింగ్ సందర్భంగా ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోకుండా, ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్్ కేంద్రాల్లో అసౌకర్యాలు, ఓటర్ల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. 27 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. 30 వార్డులు.. 86 బూత్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది -
టోకెన్ సమ్మె రాజకీయ స్వార్థమే
భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె పూర్తిగా రాజకీయ స్వార్థంతో, కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ నిర్వహిస్తున్నదని బీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ విమర్శించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం ఒకరోజు సమ్మెలతో కార్మికులకు ఒరిగిందేమిటో సంఘాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు కోడ్లలో కార్మిక వ్యతిరేక అంశాలపై సవరణల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న బీఎంఎస్ ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు మద్దతు ఇవ్వదని స్పష్టం చేస్తూ, కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మెలో పాల్గొని నష్టపోవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎంజీఎంలో రక్తం కొరత!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఓపీ చిట్టీ నుంచి మొదలుకుని చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతీ విభాగంలో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందే రోగులు మెరుగైన వైద్యసేవలు పొందడానికి రక్తనిధి కేంద్రం సేవలు అత్యంత కీలకం. కానీ, ఈ కేంద్రం సేవల సమస్యలను పరిష్కరించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో 1,500 పడకలతోపాటు సీకేఎం, జీఎంహెచ్, ఆర్ఈహెచ్, టీబీ ఆస్పత్రులతో పాటు చుట్ట పక్కల ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా ఈ బ్లడ్బ్యాంకు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్లడ్బ్యాంకులో 300 యూనిట్ల కంటే ఎక్కువగా రక్తం నిల్వ లేదనే విషయాన్ని గమనిస్తే దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. విధుల్లో ఒక వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు.. ఎంజీఎం ఆస్పత్రి రక్తనిధి కేంద్రానికి సిబ్బంది కొరత తలనొప్పిగా మారింది. క్యాంపుల నిర్వహణ కోసం కౌన్సిలర్లు లేకుండా కేంద్రం కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాయకుల జన్మదినం, మానవతా దృక్పథంతో వచ్చే రక్తదాతల సహకారం తప్ప కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. గతంలో మోటిటేటర్గా పనిచేసి అత్యత్తుమ అవార్డులు సాధించిన కల్యాణి అనే ఉద్యోగిని పరిపాలనాధికారులు అకారణంగా తొలగించారు. కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్పై వచ్చిన కౌన్సిలర్ను సైతం వెనక్కి పంపించేశారు. బ్లడ్బ్యాంకులో ముగ్గురు వైద్యాధికారులు, 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, మోటివేటర్, కౌన్సిలర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఒకే ఒక్క వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే కొనసాగుతున్నారు. ఏటూరునాగారంనుంచి ఇటీవల ఓ కేన్సర్ పేషెంట్ చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. రక్తం కావాలని సదరు పేషంట్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. వారు బ్లడ్బ్యాంకుకు వెళ్తే సిబ్బంది ఒక యూనిట్ మ్రాతమే ఇచ్చారు. ఇంకో యూనిట్ కావాలంటే లేదు అని చెప్పారు. దీంతో వారు ప్రైవేట్ బ్లడ్బ్యాంకు వెళ్లి రక్తం ప్యాకెట్ కొనుక్కొని వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క కేన్సర్ పేషంట్ది మాత్రమే కాదు.. ఎంజీఎం ఆస్పత్రిలో అనేకమంది రోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రక్తనిధి కేంద్రంలో నియామకానికి నోచుకోని కౌన్సిలర్లు.. రక్తం కోసం పరుగులు తీస్తున్న పేద రోగులు -
సమ్మెతో కార్మికులకే నష్టం
భూపాలపల్లి అర్బన్: జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం, కోలిండియా పరిధిలో ఉంటాయని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మె కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి నష్టం జరగడం వలన రూ.77 కోట్లు, కార్మికులకు రూ.12కోట్ల నష్టం వాటిల్లితుందన్నారు. నూతన లేబర్ కోడ్ల వలన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు నష్టం లేదన్నారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. కార్మికులు గ్రహించి సమ్మెకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్యాంసుందర్, శ్రావణ్ పాల్గొన్నారు. -
‘రామప్ప శిల్పకళ బాగుంది’
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని శిక్షణ అధికారులు కొనియాడారు. మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు సందర్శించారు. భారత్ దర్శన్ స్టడీ టూర్లో భాగంగా శిక్షణ తీసుకుంటున్న 75 మంది అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని దర్శించుకుని గ్రూప్ ఫొటోలు దిగారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు. -
నిర్భయంగా ఓటేయండి
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ స్టేడియంలోని బ్యాలెట్ బాక్సులు నిల్వచేయడానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఓట్లు లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోనా, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ తరుణ్ప్రసాద్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
450 మందితో పోలీస్ బందోబస్తు..
భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల భద్రత కోసం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు 8 రూట్లలో పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు, ఇంకు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు నిషేధమని, పోలింగ్ బూత్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధమని స్పష్టంచేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తున్న అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ -
ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు
డిపోల వారీగా తిరిగిన బస్సులు, ఆదాయం(రూలలో)డిపో బస్సులు కిలో మీటర్లు ప్రయాణికులు ఆదాయం హనుమకొండ 387 5 18,722 2,55,732 3,90,34,592 జనగామ 180 2,86,666 67,148 1,86,79,760 వరంగల్–1 283 4,05,208 2,64,785 3,23,88,513 వరంగల్–2 217 5,92,450 3,41,593 4,61,28,361 మహబూబాబాద్ 117 2,08,548 46,931 1,06,53,950 నర్సంపేట 152 2,30,372 85,857 1,64,85,955 పరకాల 175 2,50.260 84,574 1,72,40,378 తొర్రూరు 110 1,82,469 40,802 1,06,16,240 భూపాలపల్లి 90 1,31,460 46,163 1,12,00,375 హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124లు ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు.మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 తిరిగిన మొత్తం కిలో మీటర్లు 28,06,155 -
బోనమెత్తిన మహిళలు
మహదేవపూర్ మండల కేంద్రంలో మల్లన్న బోనాల జాతర పండుగ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లించారు. సోమవారం మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి బోనం సమర్పించారు. ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాల నడుమ భక్తులు మల్లన్న స్వామికి ఇష్టమైన గజ్జెల లాగులు వేసుకొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి జాడి శ్రీశైలం, జాడి గట్టయ్య, జాడి వెంకయ్య, సమ్మయ్య, జాడి గట్టయ్య, రాజేందర్, రేగుల భాస్కర్, లక్ష్మి దేవర పూజారులు పాల్గొన్నారు. – కాళేశ్వరం -
ప్రచారం ముగిసింది..
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కోటగుళ్లలో పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆశుతోష్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకటలక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయ అర్చకుడు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. సోమవారం ప్రత్యేక పూజలు కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు స్వా మి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి చిట్యాల: క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతో ఆడాలని డీవైఎస్ఓ చిర్రా రఘు అన్నారు. సోమవారం జూకల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్బాల్, బేస్బాల్ పోటీలకు జిల్లాలోని 12 మండలాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ రఘు మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, ఏఎంఓ విజయపాల్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి, బండి ప్రసాద్, నూకల లింగయ్య, గాజర్ల శ్రీనివాస్, పూర్ణిమ, సమ్మయ్య, హేమలత, కల్యాణి, సులోచన పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం భూపాలపల్లి అర్బన్: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12న దేశ వ్యాప్త ఒక రోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ.. సోమవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గంలో పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు కంపేటి రాజయ్య, మధుకర్రెడ్డి, తిరుపతి, బుచ్చయ్య, పోషం, సమ్మయ్య, రమేష్, సారయ్య పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు ప్రచారానికి తెరవేశారు. పట్టణాల్లో సాగిన, మైకుల మోత, ప్రచారహోరు మూగబోయింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులుగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1073 మంది పోటీ చేస్తుండగా.. ఒక్కో వార్డు నుంచి సగటున నలుగురైదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున ఆ పార్టీల అగ్రనాయకులు ప్రచారం నిర్వహించగా.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎఫ్బీ, రెబల్స్, ఇండిపెండెట్లు కూడా ప్రచారం సాగించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించడంతో ఒక్కసారిగా పట్టణాల్లో మైకుల మోత ఆగిపోయింది. ఆఖరు రోజు ప్రచార హోరు ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందునుంచే ఆయా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ధనసరి సీతక్క తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఆయా నియోజకవర్గాల పరిధి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర, జిల్లా నాయకులు జె.హుస్సేన్ నాయక్, డాక్టర్ కాళీప్రసాద్, చందుపట్ల కీర్తిరెడ్డి తదితరులు అభ్యర్థుల తరఫున ప్రచారంలో తిరిగారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో ప్రధాన పార్టీలు ప్రచారవేడిని పెంచాయి. ఇదిలా ఉండగా.. ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపాలిటీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పంపిణీ కార్యక్రమానికి పార్టీలు సోమవారం రాత్రినుంచే తెర తీశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటర్లకు ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,500.. మద్యం, మాంసం కూడా సరఫరా చేయడం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ రోజు స్థానిక సెలవు● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు అందరూ మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ ఏర్పాట్ల కోసం వినియోగించనున్న ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాల కార్యాలయాలకు నేడు(మంగళవారం) సెలవు ప్రకటించినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్తో పాటు ఎన్నికల కమిషన్ అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, రేషన్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ తదితర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాలకు నేడు అధికారులు, సిబ్బంది.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,72,087లు కాగా, పురుషులు 1,63,088లు. ఆ మేరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అభ్యర్థుల ఖర్చు నామమాత్రంగా టీమ్ల ఏర్పాటు వీడియో రికార్డు లేకుండానే తనిఖీలు నిధులు మిగుల్చుకునే పనిలో అధికారులుఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుమున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరకాల గణపతి డిగ్రీ కాలేజీ నర్సంపేట ఏఎంసీ, నర్సంపేట వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్ వర్ధన్నపేట జనగామ ఏకశిల బీఈడీ కాలేజీ స్టేషన్ఘన్పూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్ మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డోర్నకల్ నిర్మల హైస్కూల్ కేసముద్రం ఏఎంసీ, కేసముద్రం మరిపెడ సెయింట్ అగస్టిన్స్ హైస్కూల్ తొర్రూరు ఆర్యభట్ట హైస్కూల్ ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ -
తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ప్రజాదివస్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యలకు పోలీసులు తక్షణ పరిష్కార మార్గం చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధ్యక్షతన ప్రజాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన 10 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ, సంబంధిత అధికారుల సమన్వయంతో వాటిని పరిష్కరిస్తున్నామని, ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. -
నిబంధనలు తూచ్!
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లిలో ఏర్పాటుచేసిన ఎన్నికల బృందాలకు సదుపాయాలు కల్పించకపోవడంతో నామమాత్రంగా పనిచేస్తున్నాయి. మున్సిపాలిటీలో కనీసం అధికారులు ఎన్నికల కోడ్ను సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రధాన రహదారిపై ఉన్నటువంటి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు కూడా తొడగలేదు. ఖర్చులపై నిఘా కరువు.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎస్ఎస్టీ టీమ్ ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. ప్రచారంలో భాగంగా జన సమీకరణ, అభ్యర్థులు, నాయకుల ప్రసంగాన్ని వీడియో తీయాల్సి ఉండగా.. 30 వార్డుల్లో ఎక్కడ కూడా వీడియో తీసిన సందర్భాలు లేవు. చెక్పోస్టుల వద్ద కూడా వీడియో రికార్డింగ్ లేకుండానే తనిఖీలు చేస్తున్నారు. బెల్ట్షాపుల తనిఖీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలు గురి చేయకుండా ఉండేందుకు కాలనీలో ఎఫ్ఎస్టీ టీమ్ నిత్యం గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. అధికారులు పూర్తిగా పార్టీల నాయకులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సెల్ఫోన్లలో వీడియో.. ఎన్నికల పరిశీలనకు ఏర్పాటు చేసిన టీమ్లలో వీడియో గ్రాఫర్స్ను ఏర్పాటు చేయలేదు. వీడియోగ్రాఫర్కు ఇచ్చే డబ్బులను సొంత జేబులోకి వెసుకునేందుకు జిల్లా స్థాయి అధికారి ఒకరు మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకొని వీడియో గ్రాఫర్స్ను నియమించకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఎనిమిది మంది వీడియోగ్రాఫర్లకు ఇచ్చిన ఆర్డర్లను సైతం రద్దు చేసినట్లు సమాచారం. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని టీమ్లకు కేటాయించి తుతూ మంత్రంగా సెల్ఫోన్లలో వీడియోలు తీయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్డర్లు లేకుండా మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని ఎన్నికల పనులకు వినియోగించుకుంటున్నారు. వారికి వచ్చే పారితోషకాలను మిగుల్చుకునే పనిలో పడ్డారు. -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 14 నుంచి 16 వరకు జరుగు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగొద్దని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన కాళేశ్వరం దేవస్థానం సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర నిర్వహణ ఏర్పాట్లపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన మహాశివరాత్రి జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా భద్రత, రాకపోకలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలు, పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్పోస్టర్లను సబ్ కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఈఓ మహేష్తో కలిసి క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. సబ్కలెక్టర్ పాతనక్ష రహదారిని సర్పంచ్తో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, తహసీల్దార్ రామారావు, డీటీ యూసఫ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, ఎస్సై తమాషారెడ్డి, రెవెన్యూ సిబ్బంది శ్యామ్తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ కాళేశ్వరంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష -
అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని, 420 హామీలను అమలు చేయకపోతే వీపు చింతపండు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన భూపాలపల్లి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి రైతుబంధు ఇప్పటి వరకు పడలేదన్నారు. తులం బంగారం, రూ.4వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, బతుకమ్మ చీరలు మీ ఎమ్మెల్యే సత్తన్న, సీఎం రేవంత్రెడ్డి ఇచ్చారా అని అడిగాడు. వెనుకట ఒకడు మొఖం బాగాలేక అద్దాన్ని పగులగొట్టిండట.. అట్లున్నది మన సీఎం పరిస్థితి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే లాగులో తొండలు చొర్రగొడుతా. గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా.. అని అంటుండన్నారు. అభివృద్ధి చేసిన గండ్ర ఈయన.. భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసిన అసలు గండ్ర ఈయన(వెంకటరమణారెడ్డి) అని, ఇచ్చిన హామీలు అమలు చేయని గండ్ర ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణరావు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి.. కాంగ్రెస్ది అభయ హస్తం కాదని, భస్మాసుర హస్తం అని కేటీఆర్ అన్నారు. భూపాలపల్లి ప్రజలకు హుషారు ఎక్కువ అని, ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. సీఎం వచ్చినా ఓట్లు రావు.. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు వచ్చారని, అయినప్పటికీ గాలి బీఆర్ఎస్ వైపు వీస్తుండటంతో భయపడి సీఎం రేవంత్రెడ్డి వచ్చారని, అయినా కాంగ్రెస్కు ఓట్లు పడవని, ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులతో భూపాలపల్లిలో చేపట్టిన పనులను ఎమ్మెల్యే సత్యనారాయణరావు నిలిపివేయించి బుద్దారంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాడని అన్నారు. ఆయన భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేక బుద్దారం గ్రామ సర్పంచా అని ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజన అశాసీ్త్రయంగా జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో, జిల్లాలను తగ్గిస్తామని సీఎం రేవంత్రెడ్డి మేడారంలో ప్రకటించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, మా జోలికి వస్తే నలిచి పారేస్తామని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఫిబ్రవరి వచ్చినా రైతు భరోసా పడలే 420 హామీలు అమలు చేయకపోతే.. వీపు చింతపండు చేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే ఆగమే: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/మహబూబాబాద్/భూపాలపల్లి/గూడూరు: ‘అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాందీ, రాహుల్ గాందీల మీద ఒట్టేసి హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు అభివృద్ధి,సంక్షేమం గురించి నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అబద్దపు హామీలు, మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్లీ ఆగమైతం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి డబ్బులకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పడంతోపాటు అనేక ఇతర హామీలిచ్చి నెరవేర్చలేని రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకావడం లేదని విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి వరంగల్లోని భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో కార్నర్ మీటింగ్ల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని రేవంత్రెడ్డి కేవలం కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరితరం కాదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్లో నిప్పు పెట్టి తగులబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా.. కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలిస్తే..జిల్లాలు ఉండవు ప్రభుత్వం ప్రజలకు దగ్గరకు చేర్చాలనే ఆలోచనతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల మానుకోట, భూపాలపల్లిని జిల్లాలుగా మార్చారు. ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులను దగ్గర చేర్చారు.. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు తీసివేస్తారటా.. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లాలుండవు.. ఏది కావాలో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. వెనకటి రోజులు తెస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిజం చేస్తున్నారన్నారు. వెనకటి రోజులు అంటే యూరియా కోసం చెప్పుల క్యూ పెట్టడమా.. కరెంట్ లేని రాత్రులు గడపడమా.. అని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, శంకర్నాయక్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాళ్లు గండ్ర జ్యోతి, మాలోతు కవిత, పాల్గొన్నారు. మరుగుజ్జుకు కేటీఆర్ ఆర్థిక హామీ.. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సోమవారం నర్సంపేట మీదుగా వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. భీరవెళ్లి భరత్ కుమార్రెడ్డి కోరిక మేరకు మార్గమధ్యలో గూడూరులోని రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో గల ఓ చాయ్ కొట్టు వద్ద ఆగారు. కేటీఆర్ చాయ్ తాగుతూ ఎదురుగా కనిపిస్తున్న ఓ చిన్న బాలుడి లాంటి వ్యక్తిని చూసి దగ్గరికి పిలిచి అతడిని ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు అని అడిగాడు. అక్కడే ఉన్న భరత్కుమార్రెడ్డి ‘సార్.. ఇతని పేరు ధారావత్ వినోద్కుమార్. 30ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు’అని చెప్పాడు. అది విన్న కేటీఆర్ ఏమైనా చిరువ్యాపారం చేసుకుంటావా? అని అతన్ని అడగ్గా, చేసుకుంటా సార్ అన్నాడు. భరత్కుమార్రెడ్డిని చూపుతూ ‘ఇతను నీకు తెలుసా’అని అడగ్గా తెల్సు సార్ అన్నాడు. వెంటనే ‘ఈయనకు రూ.2లక్షలు పంపిస్తా.. నీకు ఇస్తాడు. ఇంటి వద్ద ఏదైనా కిరాణం పెట్టుకో’అన్నాడు. -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గణపురం మండలం చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం.. -
కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చి దగా చేశారు..
వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.ఆదివారం నాలుగోరోజు 200 మేడారం హుండీలు లెక్కించగా రూ.2,64,75,757 ఆదాయం వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు.రోడ్షోకు హాజరైన పార్టీ శ్రేణులు నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పైసా పని చేయలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయక మో సం చేశారని.. ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆది వారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రోడ్ షోలు నిర్వహించారు. ఆయా చోట్ల కేటీఆర్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నారని, హామీల పేరుతో మోసం చేసిన రేవంత్రెడ్డి సర్కారుకు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. రూ.4వేల పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదని, బతుకమ్మ చీర ఏమైందని, రంజాన్తోఫా రాలేదని, దీంతో పాటు పలు రకాల వాగ్దానాలు విస్మరించిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి గుణపాఠం చెప్పాలన్నారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందన్నారు. వర్ధన్నపేటలో దొంగ, పోలీస్ కలిసి మోసం.. దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును విమర్శించారు. రైతులకు, ప్రజలకు వెనకటి రోజులు తెప్పిస్తానని సీఎం అన్నారని వ్యంగ్యంగా అన్నారు. ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి రైతులు క్యూలైన్లో చెప్పులు పెట్టుకునేలా చేసి వారి అరిగోస పుచ్చుకున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే వర్ధన్నపేటలో జంక్షన్లు, రోడ్డు వెడల్పు, వీధి లైట్లు, డ్రైయినేజీలు అభివృద్ధి చేశా మన్నారు. రెండేళ్లలో చేయలేని వాడు వచ్చే మూడేళ్లలో ఏం పనులు చేస్తారని ప్రశ్నించారు. వంద పడకల ఆస్పత్రి పట్టణం నుంచి ఎందుకు మారుస్తున్నారని, తిరిగి ఇక్కడే అంటూ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తండాలను వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు గిరిజనులకు ఇష్టం లేకుంటే తమ ప్రభుత్వం రాగానే, పాత పంచాయతీ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. చేయిచ్చిన పార్టీని నమ్మకండి.. హామీల అమలులో ప్రజలకు చేయిచ్చిన, చెవిలో పూలు పెట్టే కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. మార్పు కోసం కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, 420 హామీలిచ్చి అమలు చేయకుండా మోసగించారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క తప్పు ఓటు వేస్తే ఐదేళ్లు బాధ పడతారని, ఒక్కసారి వేసే మోసపోయారని మళ్లీ పునరావృతం కావద్దన్నారు. మున్సిపాలిటీల్లో ఓటు అడిగే అర్హత బీఆర్ఎస్కే ఉందన్నారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్లేనన్నారు.11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భస్మాసుర హస్తానికి ఎగనామం పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి ఆదరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, నాగుర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తొర్రూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. తొర్రూరులో రూ.వందల కోట్ల అభివృద్ధి నా హయాంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ పని చేసిందో చెప్పాలి. వంద పడకల ఆస్పత్రి, మినీ ట్యాంకుబండ్, ఇతర పనులు మంజూరు చేయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాకు పేరు వస్తుందనే భయంతో పనులు చేయడం లేదు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి నేను నర్సంపేట పట్టణ అభివృద్ధికి తెచ్చిన నిధులను వాడుతున్నారే తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రౌడీయిజం చెలాయించే విధంగా మాట్లాడుతున్నారే తప్ప అభివృద్ధి పట్ల అంకిత భావం లేదు. నన్ను బెదిరించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు.. వారి వల్ల ఏమీ కాదు. – పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
చింపాంజి వేషంతో..
మల్హర్ మండలం కొయ్యూరులో ప్రజలు కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ కోతుల భయంతో వణికిపోతున్నారు. ఎలాగైనా కోతుల సమస్యను పరిష్కరించాలని ఉపసర్పంచ్ సవేందర్ అనుకున్నాడు. ఆదివారం చింపాంజి వేశధారణలో గ్రామమంతా తిరిగాడు. భయంతో కోతులన్నీ పారిపోయాయి. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అటవీశాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని ఉపసర్పంచ్ సవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎడ్ల మధుసూదన్, లకావత్ లక్ష్మి తిరుపతి, రవళి శేషి వర్ధన్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. – మల్హర్ -
రోజుకు రూ.300
ప్రచారంతో ఉపాధి పొందుతున్న కార్యకర్తలుభూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో మైలేజీ కోసం అభ్యర్థులు కార్యకర్తలకు రోజుకు రూ.300 చెల్లిస్తూ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. పొద్దున ప్రచారానికి రూ.200, సాయంత్రం ప్రచారానికి రూ.100 చెల్తిస్తున్నారు. ర్యాలీలు, రోడ్షోలే కాకుండా వార్డుల్లో ప్రచారానికి కూడా అభ్యర్థులు కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారు. భారీ జనసమీకరణ కనిపించేలా.. భూపాలపల్లి మున్సిపల్లో అభ్యర్థులకు జనసమీకరణ కష్టంగా మారుతోంది. తమ వెంట ఎక్కువ మంది కనిపించేందుకు కార్యకర్తలను ఆశ్రయిస్తున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు వెంట ఉంటే లాభం లేదనుకుంటున్న అభ్యర్థులు భారీగా అనుచరులు, కార్యకర్తలతో ప్రచారంలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా తమ వెంట ఎక్కువ మంది జనాలు పాల్గొనాలని అనుకుంటున్నారు. సగటున రోజుకు రూ.300 ఇస్తామని తమ తరఫున ప్రచారంలో పాల్గొనాలని అడుగుతున్నారు. వీటితో పాటు ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం దాకా వంట ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికయ్యే ఖర్చులన్నింటినీ అభ్యర్థులే చెల్లిస్తున్నారు. ర్యాలీలకు, రోడ్షోలకు.. ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాలకు జనసమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయా వార్డుల్లోని అభ్యర్థులపై పడింది. దీంతో ఎంతోకొంత ఇచ్చి ప్రచార సమయంలో జనాలు ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు, పార్టీలకు సంబంధించిన ముఖ్యనాయకులు వచ్చినప్పుడు కార్యకర్తల వినియోగం ఎక్కువగా ఉంటుంది. రోడ్షోలు, బైక్ ర్యాలీలకు పెట్రోల్ ఖర్చులతో పాటు మందు, విందు ఇతరత్రా ఖర్చులను అభ్యర్థులు భరించాల్సి వస్తోంది. ప్రచారానికి ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులందరూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ.300 వస్తుండటంతో ఇదే లాభసాటిగా ఉందని అనుకుంటున్నారు. ఇలా కొంతమంది వ్యవసాయ కూలీలు ఉపాధి పొందుతున్నారు. మున్సిపాలిటీ విలీన గ్రామాలైన కాశింపల్లి, పుల్లూరు రామయ్యపల్లి, జంగేడు, వేశాలపల్లి గ్రామాల్లో వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల యాసంగి వరి నాట్లపై, ఇతర పంటల సాగుపై కూలీల కొరత ప్రభావం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోసం వాడుకుంటున్న అభ్యర్థులు విలీన గ్రామాల్లో యాసంగి పనులకు దెబ్బ -
రైతులను కాపాడుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు చిట్యాల : దేశానికి అన్నంపెట్టే రైతులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాస్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతు సంక్షేమంపై వివిధ గ్రామాలకు చెందిన అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మాట్లాడారు. రైతులకు చట్టపరమైన ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని పేర్కొన్నారు. ఎరువుల షాపులు, నకిలీ పెస్టిసైడ్స్, నాసిరకం విత్తనాల పర్యవేక్షణకు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి నిత్యం తనిఖీలు చేయాలని కోరుతూ పలు సూచనలు చేశారు. ఈ సదస్సులో పీపీ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.శ్రీనివాస్, స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్, సర్పంచ్ తౌటం లక్ష్మి, న్యాయవాదులు రాజ్కుమార్, మహేందర్ రెడ్డి, పారా లీగల్ వలంటీర్ ఆరెపల్లి తిరుపతి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. నాపాక ఆలయం సందర్శన.. మండలంలోని నైన్పాకలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి సర్వతోభద్ర ఆలయాన్ని సీనియర్ జడ్జి నాగరాజు సందర్శించి ప్రత్యేక పూజాలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకుడు పెండ్యాల ప్రభాకారచార్యులు దేవాలయ విశిష్టతను వివరించారు. కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్ తదితరులు ఉన్నారు. -
నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన
సాక్షిప్రతినిఽధి, వరంగల్ /భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్లైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డిలు శనివారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలు దేరుతారు. 2:00 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. 2:15 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రోడ్డు ద్వారా చేరుకుంటారు. 2:40 గంటల వరకు స్వామి వారి దర్శనం, అతిథి గృహం, ఇతర ఆలయాల ప్రారంభోత్సవం 2:50 గంటలకు గణపురం మండలం చెల్పూరుకు చేరుకుంటారు. 3:15 గంటలకు ఘణపురం మండలం చెల్పూరుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు అవుతారు 5:00 గంటల వరకు ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడుతారు. 6:00 గంటలకు చెల్పూరు హెలిపాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. -
లారీలతో ఇబ్బందులు
కాళేశ్వరం ఇసుక, సింగరేణి బొగ్గు లారీలతో పట్టణంలోని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నివారణకు మోరంచపల్లి నుంచి పట్టణంలోని బాంబులగడ్డ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. –యాకయ్య, పట్టణవాసి కోతుల బెడద లేకుండా చూడాలి పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వాటి నివారణకు మున్సిపల్ అధికారులు, రాబోవు పాలకవర్గం తగు చర్యలు తీసుకోవాలి. – కోల తిరుపతి, వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలి పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న షాపుల యజమానులు ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమించారు. కాలినడకన వెళ్లే వారికి దారి లేక జాతీయ రహదారిపై నడవాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలి. –శ్రీనివాస్రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు -
అభివృద్ధి చేసేవారికే పట్టం
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీని అభివృద్ధి చేసేవారినే గెలిపించుకుంటామని, నీతి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని భూపాలపల్లి పట్టణ ప్రజలు స్పష్టం చేశారు. శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలతో భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల ఎజెండా–సమస్యలు–పరిష్కారాలపై చర్చావేదిక నిర్వహించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతోనే భూపాలపల్లిలో ప్రధాన సమస్యలు పరిష్కారామవుతాయని, మూడు కూడళ్లలో రహదారి విస్తరణ చేపట్టి, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డుల పరిధిలో 52,726 ఓటర్లు ఉన్నారు. చర్చావేదికలో పలువురు వెల్లడించిన సమస్యలు వారి మాటల్లోనే.. రహదారి విస్తరణ చేపట్టాలిపట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రతీ రోజు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతున్నాయి. చౌరస్తా చు ట్టూ నాలుగు వైపులా రహదారి విస్తరణ చేపట్టాలి. అంబేడ్కర్ చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్షెల్టర్ నిర్మాణం చేపట్టాలి. –కొడపాక శంకర్, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలిజయశంకర్ చౌరస్తా వద్ద రోడ్డు ఇరుకుగా ఉంది. సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా మాదిరిగానే అక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. – స్వామి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి సింగరేణి కంపెనీలో 30 ఏళ్లకు పైగా పని చేసి రిటైర్డ్ అయిన వారు వందలాది మంది భూపాలపల్లిలో ఉన్నారు. వారందరి సౌకర్యార్థం సింగరేణి యాజమాన్యం ఒక కమ్యూనిటీ హాల్ను నిర్మించాలి. – మారెపెల్లి రామస్వామి, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పార్కులో సౌకర్యాలు కల్పించాలిజయశంకర్ పార్కును సింగరేణి, మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. పార్కులో ఓపెన్ జిమ్ మొత్తం మరమ్మతుకు గురైంది. సీసీ కెమెరాలు లేవు. దీంతో సాయంత్రం వేళల్లో మహిళలు పార్కుకు వచ్చేందుకు భయపడుతున్నారు. పాముల బెడద కూడా ఉంది. పార్కులో కనీసం తాగునీటి సౌకర్యం లేదు. –అంబటి శంకర్, సింగరేణి కార్మికుడు ర్యాష్ డ్రైవింగ్పై చర్యలు తీసుకోవాలియువకులు ప్రధాన రహదారితో పాటు చిన్నచిన్న వీధుల్లో సైతం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు, మహిళలు రోడ్డెక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. అలాగే చెత్త సేకరణ ట్రాక్టర్లు ప్రతీరోజు కాలనీలకు రావడం లేదు. – కొండపర్తి శ్రీనివాస్, వ్యాపారి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి జంక్షన్లను అభివృద్ధి చేయాలి కోతులు, కుక్కల బెడద నివారించాలి ‘సాక్షి’ చర్చావేదికలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు -
ఇండిపెండెంట్లే కీలకం!
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలుపోటీలో అత్యధికంగా స్వతంత్రులు సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా ఉంది? హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబ ల్స్ కూడా) పోటీలో ఉన్నారు. ఇందులో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అన్ని వార్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
గోశాలలో గో మహత్య ప్రవచనం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శివకృష్ణ గోశాలలో శనివారం గో మహత్య ప్రవచనం నిర్వహించారు. గోశాల నిర్వాహకులు లక్ష్మి,ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచకులు పాలెపు చంద్రశేఖర్ శర్మతో గోమాత ఆధ్యాత్మిక, వైదిక, సంస్కృతిక ప్రాధాన్యతపై భక్తులకు ప్రవచనాలు వినిపిస్తున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆదివారం (నేడు) ప్రవచన కార్యక్రమం ముగియనున్నా నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోకృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు తెలిపారు. కొడుకు పుట్టిన సంబరం తీరక ముందే తండ్రి హఠాన్మరణం ● పదిహేనేళ్లకు సంతానం కాళేశ్వరం: పెళ్లయిన పదిహేనేళ్లకు సంతానం కలిగింది. కొడుకు పుట్టిన సంబురంలో మునిగితేలిన ఆ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన కాళేశ్వరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన పొన్నం వేణు (40), సంధ్యారాణి దంపతులు గత పన్నేండేళ్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వాటర్ప్లాంట్, కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి సంతానం లేక పదిహేనేళ్లుగా మనోవేదనకు గురయ్యారు. వారంరోజులక్రితం వీరికి కుమారుడు జన్మించాడు. దీంతో వారిద్దరి సంబరానికి అవధుల్లేవు. కానీ ఇంతలోనే విధి వక్రిరించడంతో వేణుకు షుగర్ లెవల్స్ బాగా పెరిగి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం చేరాడు. అక్కడే చికిత్సపొందున్న క్రమంలో శనివారం గుండెపోటుతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. కొడుకు పుట్టిన ఆనందం, భార్య సంతోషం అన్నీ వేణు మృతితో ఆవిరైపోయాయి. ఇస్రో సందర్శనకు ఎంపిక చిట్యాల : మండలంలోని జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ఈనెల 26న ఇస్రోను సందర్శించి, రాకెట్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినట్లు ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ శనివారం తెలిపారు. ఎన్నికై న విద్యార్థులను, ప్రధానోపాధ్యాయుడిని, ఉపాధ్యాయులను కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించినట్లు పేర్కొన్నారు. అలాగే భూపాలపల్లి జిల్లాలోని మరిన్ని పాఠశాలల విద్యార్థులు కూడా సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెరిగిన గోదావరి వరద మంగపేట : మండలంలో గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో గోదావరి ఒడ్డు వెంట చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు నిలిచి పోయాయి. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజ్ ఎగువ ప్రాంతం నుంచి వరద ఇన్ఫ్లో పెరగడంతో శనివారం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరిలో వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రం వరకు కరకట్ట బండ్ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వరద నీరు చేరింది. పొక్లెయినర్ల చుట్టూ సైతం నీరు చేరడంతోపాటు బండ్ నిర్మాణానికి వినియోగించే రాళ్లు కూడా నీట మునిగి పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఇదే విషయంపై ఇరిగేషన్ ఏఈ వలీమ్మహ్మద్ను వివరణ కోరగా గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల తాత్కాలికంగా పనులకు అంతరాయం కలిగిందన్నారు. 14,503 క్యూసెక్కుల నీరు విడుదల కన్నాయిగూడెం : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి దిగువకు 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 6,000 క్యూసెక్కుల ఉన్న నీరు శనివారం బ్యారేజ్లోకి ఒక్కసారిగా 14,750లకు వచ్చి చేరింది. రామప్పను సందర్శించిన 13 దేశాల ప్రతినిధులు వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని 13 దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు శనివారం సందర్శించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ శిక్షణ పొందుతున్న లెబనాన్, టర్కీ, ఉజ్జెకిస్తాన్, జింబాబ్వే, ఈజిప్ట్, మొరా కో, ఇథియోపియా, టాంజానియా, లైబీరియా, మాలి, బోట్స్వానా, మారిషన్, గ్వాబెమాల దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో రామప్పను సందర్శించగా అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకతతో నిబంధనల ప్రకారం సమర్థంగా నిర్వహించాలని (స్థానిక సంస్థలు) ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలకు సంబంధించిన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. మున్సిపల్ కమిషనర్ జోనా, మాస్టర్ ట్రెయినర్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. -
కాళేశ్వరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్
● పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసుల చర్యలు ● వంతెన నుంచి కాళేశ్వరానికి పాత రోడ్డుకు హద్దులుకాళేశ్వరం: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ నది అంత్యపుష్కరాలకు గతంలో జరిగినట్లు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తుగా పోలీసుశాఖ దృష్టిసారించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశాల మేరకు శనివారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ తహసీల్ధార్ రామారావు, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కన్నెపల్లి సమీపంలోని అంతరాష్ట్ర వంతెన రోడ్డు నుంచి కాళేశ్వరం మధునపోచమ్మ చెట్టు సమీపం గుండా టవర్ వరకు పాత నక్ష గొలుసు రహదారిని రెవెన్యూశాఖ సర్వే చేసి ఫార్మేషన్ రోడ్డు వేసేందుకు హద్దులు వేశారు. కాగా, 33 ఫీట్ల వెడల్పుతో 25 మంది వరకు రైతులకు చెందిన భూముల గుండా రహదారి వెళ్లనుంది. ఈ రహదారితో ఏర్పాటుతో పుష్కరాలకు వచ్చే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల వాహనాలు లోపలికి కాకుండా అక్కడే పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 25–30 ఎకరాల్లో స్థలాన్ని పరిశీలించారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందని పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పీఆర్ డీఈ సాయిలు, ఏఈ సతీష్, మహదేవ్పూర్ డిప్యూటీ తహసీల్దార్ యూసుఫ్, ఆర్ఐ రఘు, సర్వేయర్ రమేష్, కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, కన్నెపల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్, వీపీఓ శ్యామ్, దేవస్థానం మాజీ ధర్మకర్తలు అశోక్, సమ్మయ్య, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
మంటల్లో స్కూల్ బస్సు... తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండలం జూకల్ ప్రధాన రహదారిపై షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూల్ బస్సు దగ్ధమైంది. రైసింగ్ సన్ స్కూల్కు చెందిన బస్సులో పొగలు రావడం గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై విద్యార్థులను దింపడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో స్కూల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్కూల్ బస్సు ఫిట్నెస్ వివరాలతో పాటు మంటలు వ్యాప్తికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
బస్తీమే సవాల్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. జిల్లా కేంద్రం, నియోజకవర్గ ప్రధాన కేంద్రం కావడంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ఈనెల 11న పోలింగ్ ఉండటం, పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉన్న తరుణంలో ఉన్న మూడు రోజుల్లో అభ్యర్థులు ప్రచారాన్ని గడపగడపకు తీసుకెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉన్న కొద్ది రోజులనే ప్రచారానికి అనువుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా ప్రచారంలో మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఇతర ముఖ్యనాయకులు పాల్గొనటంతో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ముమ్మరంగా వార్డుల్లో పర్యటిస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు ఉండగా 107 మంది పోటీ పడుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఉదయం 7–8 గంటల నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఓటర్ల గడపగడపకు వెళ్తూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక నాయకులతో పాటు బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనచారి తమ అభ్యర్థులను గెలిపించాలని పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గండ్ర సత్యనారాయణరావు వీరితో పాటు బీజేపీ తరఫున భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుదామని ప్రధాన పార్టీలు అనుకుంటున్నప్పటికీ ప్రచారానికి తక్కువ రోజులు సమయమే ఉండటంతో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నెల 8వ తేదీ సీఎం రేవంత్రెడ్డి చెల్పూరు శివారులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ నెల 9న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆ పార్టీ తెలిపింది. స్వతంత్రుల మద్దతు కోసం.. ప్రస్తుతం మున్సిపాలిటీ బరిలో 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని ప్రచారానికి దూరంగా ఉంచేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి వారి మద్దతు పొందితే గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయనే అభిప్రాయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ప్రచార బరిలోకి మంత్రులు, ఎమ్మెల్యే ప్రతీ ఓటు కీలకం.. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం ప్రచారానికి మరో మూడు రోజులే.. బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి, రోడ్ షోకు మాజీ మంత్రి కేటీఆర్ప్రస్తుతం పట్టణంలో ప్రధానంగా మూడు పార్టీలు తలపడుతుండటంతో ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒక్క ఓటు కూడా గెలుపోటములను నిర్ణయించే పరిస్థితి ఉండటంతో ప్రతీ ఓటుకోసం ప్రత్యక్షంగా ఓటర్లను కలుస్తున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు హైదరాబాద్, హనుమకొండలో ఉన్న వారితో మాట్లాడుతూ పోలింగ్ రోజూ తప్పకుండా వచ్చి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పలు వార్డుల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. -
మే తొలి వారంలోపు పూర్తి
కాళేశ్వరం: సరస్వతినది అంత్యపుష్కరాలకు సంబంధించి చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు మే తొలి వారంలోపు పూర్తిచేయాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. మే 21నుంచి జూన్ 1వరకు కాళేశ్వరంలో జరుగు పుష్కరాల ప్రతిపాదిత పనులను శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ కార్యాలయంలో ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంక్తీర్త్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.30.61 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మూడు నెలల సమయం ఉన్నందున పనులకు ప్రాధాన్యత నిర్ణయించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిపై ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపడుతానన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అటవీమార్గంలోని కుదురుపల్లి–బీరసాగర్ రహదారి నిర్మాణానికి అంచనాలు సమర్పించాలన్నారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి, 30–40 ఎకరాల్లో వాహనాల పార్కింగ్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరస్వతీఘాట్ వద్ద పక్షితీర్ధంను అభివృద్ధి చేయాలని అర్కిటెక్చర్ మ్యాప్ ద్వారా వివరించారు. టెంట్సిటీ, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్ల వద్ద జనరేటర్ల ఏర్పాటు చేయాలని, చరిత్ర ఆనవాళ్లు పదిలంగా ఉండేవిధంగా 86 గదుల భవనం సమీపంలో మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ప్రతిపాదనల మార్పుల కోసం.. అంచనా ప్రతిపాదనల్లో మార్పులు అవసరమైతే రెండు రోజుల్లో సవరించిన ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి, సబ్కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి రేగొండ: కోటంచలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ అన్నారు. ఆలయంలో పనులతో పాటు, ఆలయ మాడ వీధులు, షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహ పనులను ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ నెల 8న సీఎం రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆలయ ఈఓ మహేష్ పాల్గొన్నారు. సరస్వతినది అంత్యపుష్కరాల పనులకు డెడ్లైన్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
పులి.. ఒకటా? రెండా?
రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివారులోని పరిశె రాజుకుచెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేష్ అటవీశాఖ డీఎఫ్ఓ కొండల్రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలుగా నిర్ధారించారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దులోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో పులి సంచరించినట్లు శుక్రవారం మద్దూరు సీఐ రమేష్, ఎస్సై ఆసీఫ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు గుర్తించారు. సమీప గ్రామాలైన కట్కూర్, వీఎస్ఆర్ నగర్, బండనాగారం, బంజేరు, మార్మాముల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి. -
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే ● గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు ● రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ● ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చార్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10 నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు..ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డి చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీలు అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. -
రేపు సీఎం బహిరంగసభ
గణపురం: గణపురం మండలం చెల్పూరు శివారులో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం అధికారులతో కలిసి సీఎం బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు జూలసల్లి నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు. చిట్యాల: మండలంలోని వెంచరామి శివారు పూరేడుగుట్ట వద్ద జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఎండోమెంట్ ఈఓ మహేష్ , కార్యనిర్వహణ అధికారి ప్రసాద్, జాతర కమిటీ చైర్మన్ నాయిని స్వామి, కమిటీ సభ్యులు, పూజారుల ఆధ్వర్యంలో జాతరలో ఏర్పాటు చేసిన నాలుగు హుండీలను లెక్కించగా.. రూ.4లక్షల 50 వేల ఆదాయం లభించింది. టెండర్ల ద్వారా రూ.74వేలు, 1 గ్రామ్ బంగారం, 73 గ్రాముల వెండి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వపల్లి సర్పంచ్ పులి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ కచ్చు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు కచ్చు శ్రీనివాస్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రచారానికి వినియోగించే వాహనాలకు సంబంధించి ముందుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో మైక్ పర్మిషన్, ర్యాలీ పర్మిషన్, బహిరంగ సభలకు సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికలు శాంతియుతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. -
ఆహార కల్తీ నియంత్రణ అధికారుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలను శుక్రవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ వరుణ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో ఆహారం తయారు చేసే సిబ్బందికి ఆహార భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఆహార తయారీ సమయంలో తప్పనిసరిగా హెడ్క్యాప్స్, గ్లోవ్స్ ధరించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య రికార్డులను నిర్వహించాలన్నారు. పిల్లల ఆరోగ్యం అత్యంత కీలకమని, నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఆహార భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఏవైనా లోపాలు కనిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. -
కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 31న అధికారికంగా ముగిసినా భక్తుల తాకిడి మాత్రం తగ్గడం లేదు. సమ్మక్క రోజు గురువారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్ద పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, ఒడి బియ్యం, చీర సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క గద్దె వద్ద కోడె ధ్వజస్తంభానికి పలువురు భక్తులు కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి గద్దెల వరకు వాహనాలు బారులుదీరాయి. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. కన్నెపల్లి ఆలయంలో సమ్మక్కకు మొక్కులు కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో తిరుగువారం పండగ సందర్భంగా రెండోరోజు సమ్మక్కకు సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోసారి గుడిని శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించారు. గుడి ఆవరణలో కూడా అందంగా ముగ్గులు వేశారు. సారలమ్మ పూజారులు సమ్మక్కకు నైవేద్యంగా యాటను సమర్పించి మొక్కును చెల్లించారు. పూజారులతో పాటు గ్రామస్తులు సారలమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి యాటలు, కోళ్లను సమర్పించారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తులు సారలమ్మ గుడికి చేరుకొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిగా తరలివచ్చి మొక్కుల చెల్లింపు కన్నెపల్లిలో రెండోరోజు సమ్మక్కకు మొక్కు -
‘పుర’ పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్ నాయకులను ఇన్చార్జ్లుగా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. 12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
భూపాలపల్లి: ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సీఎం పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్య, విద్యుత్, అగ్నిమాపక, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సందర్భంగా శాఖల వారీగా నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కొడవటంచ, చెల్పూరు హెలిప్యాడ్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాలతో సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర వైద్యసేవల కోసం కొడవటంచలో సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలన్నారు. చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే సభా ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చెల్పూరులో పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతంలో ఆయుష్ ఆస్పత్రిలో సేఫ్ హౌస్, మీటింగ్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్కు అవసరమైన వాహనాల ఏర్పాటు, సీఎం ప్రయాణానికి వినియోగించే వాహనాల ఫిట్నెస్ తనిఖీలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొడవటంచ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,వీఐపీల ప్రొటోకాల్, పురోహితులను నియమించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ పూర్తి.. పురపాలక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన రెండో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తూ టీ–పోల్ పోర్టల్ ద్వారా ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు 104 మంది, ఏపీఓలు 104, ఓపీఓలు 312 మందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించి 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పొరపాట్లకు తావివ్వొద్దు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
‘కాళేశ్వరం’ పక్షితీర్థంలో చరిత్ర జాడలు!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ సమీప గోదావరి వద్ద పురాతన చరిత్ర జాడలను ఆర్కిటెక్చర్ బృందం కనుగొంది. గత నెల 28న హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్చర్ బృందం సభ్యులు గోదావరి వద్ద పక్షితీర్థాన్ని సందర్శించారు. 2027 జూలైలో నిర్వహించే గోదావరి పుష్కరాల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి పక్షితీర్థం (వీఐఫీ ఘాట్ ఎగువన) ప్రాంతంలో అన్వేషించారు. దీంతో చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. పక్షులు నీరు తాగిన, స్నానం చేసిన, నీటిని తాకిన ఈ ప్రాంతాన్నే పక్షితీర్థం అంటారు. కాళేశ్వరంలోని పక్షితీర్థం వద్ద పురాతన ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్తల్లో ఆసక్తి నెలకొంది. రాతితో చెక్కిన గుండ్రటి గోతులు (అవతలి మహారాష్ట్ర తీరం వరకు వ్యాపించినట్లు గుర్తింపు), నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన కోనేరు కాల్వలు, మెట్ల మార్గం, శివలింగ ఆకృతిని తలపించే రాతి నిర్మాణాలు దర్శనమివ్వడంతో ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. పక్షితీర్థం పరిసరాల్లో ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్న రాతిలో సొరంగం మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో నీటి నిర్వహణతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఇవి ఉపయోగించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కొన్ని గుంతల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం శైవ సంప్రదాయానికి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తున్న లింగాకృతులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సహజరాతి నిర్మాణాలతోపాటు మానవ నిర్మిత ఆనవాళ్లు కలిసి ఉండడం వల్ల ఇది సాధారణ ప్రకృతి ఏర్పాటుకాదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విలువైన పురావస్తు సంపదపై పురావస్తు శాఖ శాసీ్త్రయ పరిశీలన చేపట్టి సంరక్షణ చర్యలు తీసుకుంటే పక్షితీర్థం ప్రాంతం ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశముందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అరుదైన చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. ఈవిషయమై ఈఓ మహేశ్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. రాతి సొరంగం, కోనేరు కాల్వలు, లింగాకృతులు వారం క్రితం కనుగొన్న ఆర్కిటెక్చర్ బృందం పురావస్తుశాఖ పరిశోధన జరిపితే మరింత సమాచారంఇప్పటికే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో క్షేత్రం అభివృద్ధితో పాటు పలు శాశ్వత నిర్మాణాలపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ దృష్టిసారించారు. మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే మే 21 నుంచి జూన్1 వరకు సరస్వతినది అంత్యపుష్కరాలకు రూ.30.61 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిధులతో చేపట్టే పనులపై చర్చలు జరుగుతున్నాయి. -
లక్ష్యసాధనకు కృషి చేయాలి
భూపాలపల్లి అర్బన్: నిర్దేశించిన లక్ష్యాల సాధనకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యపరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లతో గురువారం డీఎంహెచ్ఓ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసంక్రమిత వ్యాధులు, టీబీ, ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవితో కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పిరేషనల్ బ్లాక్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం కింద రాబోయే రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. టీబీ రహిత సమాజ నిర్మాణం దిశగా క్షేత్రస్థాయిలో తెమడ పరీక్షలు నిర్వహించాలన్నారు. మొబైల్ ఎక్స్రే యూనిట్ ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని ఆదేశించారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, సబ్ సెంటర్ల పరిధిలో నిర్వహించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో నిర్వహించే వీహెచ్ఎన్డీఎస్ సమావేశాల్లో అంగన్వాడీ సిబ్బందితో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దేవేందర్, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి, టీబీ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, దిశా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమ, సీఎస్ఓ సారయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేశ్, ఎస్ఎస్కే మేనేజర్ రజిని, టీబీ సూపర్వైజర్ ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ చల్లా మధుసూదన్ -
సోషల్ సందడి..
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోషల్ మీడియా వేదికగా వారం రోజుల నుంచే మొదలైంది. షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాను తమ ప్రచార అస్త్రంగా చేసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల సెంటిమెంట్ను ప్రధాన ప్రచార అస్త్రంగా బీజేపీ మలుచుకుంటోంది. ఆ పార్టీతో పాటు అనుబంధ సంఘాల పేరిట కూడా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా పరోక్ష ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను హైలెట్ చేస్తూ వార్డుల్లో తమ ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీ వాగ్ధానాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ప్రధాన పార్టీలన్నీ వార్డుల వారీగా ఓ వైపు పార్టీల పేరిట, మరో వైపు థార్మిక సంఘాలు, ఆధ్యాత్మిక యువజన సంఘాల పేరిట గ్రూపులను ఏర్పాటు చేయడంలో తలమునకలవుతున్నాయి. ప్రచారంలో సోషల్ మీడి యా పాత్ర అత్యంత కీలకంగా మారబోతోందని, ఈ ప్రచారమే ప్రధాన అస్త్రం అవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతీ ఓటరు వద్ద సెల్ఫోన్ ఉండడం.. సోషల్ మీడియాను విస్తృతంగా ఫాలో అవుతున్న కారణంగా వాట్సాప్ గ్రూపునకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలను సైతం పార్టీలు తమ ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నాయి. వార్డుల వారీగా ఇన్చార్జ్ల నియామకం.. సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా మలుచుకునే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు వార్డుల వారీగా ఇన్చార్జ్లను నియమించుకొని గ్రూపులను ఏర్పాటు చేసుకొని ప్రచార పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఇన్చార్జ్లంతా తమ వార్డులోని పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించే వారు అలాగే తటస్తులను సైతం గ్రూపులో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఆయా పార్టీల ఇన్చార్జ్లే గ్రూపునకు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ వారు మాత్రమే పోస్టులు పెట్టే విధంగా చూసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా సమన్వయకర్త వార్డుల వారీగా ఇన్చార్జ్లతో టచ్లో ఉంటూ పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల తరఫున జారీ అయ్యే అన్ని ప్రకటనలను అలాగే పథకాల ప్రాధాన్యతను ఈ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఈ ఇన్చార్జ్లు నిరాటంకంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని రకాల పోస్టులను వైరల్ చేస్తూ తమ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసే యువకులకు ఆయా పార్టీల అభ్యర్థులు రోజుకు రూ.1500 చొప్పున పారితోషికం చెల్లిస్తున్నారు. కెమెరాలు, సెల్ఫోన్లలో వీడియో, ఫొటోలు తీసుకుంటూ ఇన్స్ట్రాగామ్ రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ను వార్డు గ్రూపులు, ఓటర్లకు పంపించే పని చేస్తున్నారు. ఎన్నికల కారణంగా సోషల్ మీడియాపై పట్టున్న యువకులకు ఉపాధి సైతం లభిస్తుంది. వార్డుల వారీగా గ్రూపులు ఏర్పాటు వేదికలుగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్లు అన్ని పార్టీల గ్రూపుల్లో వార్డుల ప్రజలు మార్మోగుతున్న ప్రచారం -
నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి
● డిప్యూటీ డీఎంహెచ్ఓ దేవేందర్మల్హర్(కాటారం): ఆస్పత్రి సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ దేవేందర్ అన్నారు. గురువారం మండలంలోని కాటారం ప్రాథమిక ఆర్యోకేంద్రంలో కాటారం, అంబటిపల్లి పీహెచ్సీ డాక్టర్లు, ఎన్సీడీ నర్సింగ్ అధికారులకు, సూపర్వైజర్లకు ఎన్డీసీ ప్రోగ్రాంపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి (డిప్యూటీ డీఎంహెచ్ఓ) డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 30 సంవత్సరాల పైబడిన అందరికీ క్షేత్రస్థాయిలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి సకాలంలో ఆన్లైన్ చేయాలని డాక్టర్లు సూచించారు. డాక్టర్లు సకాలంలో పుట్ అన్ ట్రీట్మెంట్ పెట్టాలన్నారు. సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించలేని వారు రాబోయే రెండు మాసాల్లో వారి లక్ష్యాలను అధిగమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య అధికారి డాక్టర్ మౌనిక, అంబటిపల్లి డాక్టర్ కల్యాణి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ లింగారెడ్డి, మురళీధర్, ఎన్సీడీ కన్సల్టెంట్ విజయ్ పాల్గొన్నారు. -
బాలకుమారస్వామికి మంత్రి సీతక్క పూజలు
ములుగు రూరల్: మండల పరిధిలోని అంకన్నగూడెం బాలకుమారస్వామి జాతరలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మక్క సోదరుడిగా బాలకుమార స్వామిని కొలుస్తారని తెలిపారు. సమ్మక్కకు యుద్ధ సమయంలో అండగా బాలగోముడుగా నిలిచాడని వివరించారు. ఆయనను గండ్ర గొడ్డలి రూపంలో కొలుస్తారని వెల్లడించారు. అనంతరం ఆలయ మరమ్మతులకు ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 5 లక్షల కేటాయించి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్ తనిఖీ చేశారు. గురువారం లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో నిర్మించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలుపాలన్నారు. సర్పంచ్ హసీనా బానో, ఏఈ సందీప్, పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నేడు సరస్వతినది పుష్కరాలపై సమీక్ష కాళేశ్వరం: మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతినది అంత్యపుష్కరాలపై ఉన్నతాధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో మహేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నాను. శుక్రవారం (నేడు) సమీక్షను ఉదయం 10:30గంటలకు కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్తో పాటు జిల్లాస్థాయి అధికారులు హాజరుకానున్నారని తెలిసింది. మేడారం క్లీన్.. ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వారు పడేసిన చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. జాతర సమయంలో, జాతర అనంతరం మేడారానికి వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా అపరిశుభ్రత, చెత్తాచెదారం కనిపించకుండా తొలగిస్తున్నారు. మేడారంతో పాటు పరిసర ప్రాంతాల్లో సైతం ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా రు. డీపీఓ వెంకయ్య సైతం దగ్గరుండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ చెత్తాచెదారం తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన వసతులు కల్పిస్తూ మేడారాన్ని క్లీన్గా చేసి స్థానికులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏటూరునాగారం: ఏటూరునాగారం– మంగపేట మండలాల మధ్యలోని అటవీ ప్రాంతం నుంచి ప్రధాన రోడ్డుపైకి వచ్చి గాయపడి ఉన్న దుప్పిని అటవీశాఖ అధికారులకు పలువురు బాటసారులు అప్పగించారు. గురువారం ఉదయం జీడివాగు సమీపంలో వాహనాలు వెళ్తుండగా గాయపడిన దుప్పి కనిపించింది. దీంతో కమలాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గడ్డి శ్రీనివాస్, వల్స శ్రీనివాస్, సృజన్, రాంబాబు మరికొంత మంది చూసి చలించారు. ఇదే క్రమంలో మరికొన్ని దుప్పులు కూడా రోడ్డు దాటుతుండగా లారీ ప్రమాదానికి గురికాకుండా కాపాడారు. గాయపడిన దుప్పిని ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించి రామన్నగూడెం బీట్ అధికారి దయానంద్కు అప్పగించినట్లు వారు తెలిపారు. అటవీ జంతువులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారని అటవీశాఖ అధికారులు వారిని అభినందించారు. -
ప్రచార హోరు..
భూపాలపల్లి మున్సిపాలిటీలోని వార్డులు 30బరిలో ఉన్న అభ్యర్థులు 107భూపాలపల్లి రూరల్: నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలింది. తుదిగా పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రచార రథాలతో ప్రత్యేక పాటలు, నినాదాలతో గల్లీల్లో హోరెత్తిస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు రంగంలోకి దిగారు. పోటాపోటీగా ప్రచారం.. ప్రత్యర్థులెవరో తేలిపోవడంతో పోటాపోటీగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండడంతో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచారజోరు పెంచారు. ఇంటింటికీ వెళ్తూ తామేం చేస్తామో చెబుతున్నారు. శ్రీఅన్న, అక్క, తమ్మీ, అవ్వ.. అంటూ పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.. ఎక్కడుంటే అక్కడికే.. తమ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఎక్కడెక్కడ ఉంటున్నారు.. అంటూ ఇప్పటికే ఓటర్ల జాబితాలను జల్లెడ పట్టేశారు. ఏ ఓటరు, ఎక్కడ ఉన్నారు. వారి కుటుంబంలో మిగిలినవారు ఎక్కడుంటున్నారు. ఇలా పూర్తి డాటా రాసేసుకున్నారు. దాని ప్రకారం కౌన్సిలర్ అభ్యర్థులు, వారి అనుచరులు లోకల్ ఓటర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇటీవల చాలా కుటుంబాలు రామప్ప కాలనీ, డబుల్ బెడ్ రూంలకు వెళ్లి నివసిస్తున్నారు. వారి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో ఉన్నవారికి ఫోన్లు చేస్తూ ఈ నెల 11న ఓటు వేయడానికి రావాలని కోరుతున్నారు. ప్రతీ వార్డులో కొత్త ఓటర్లు.. మున్సిపాలిటీల్లో ప్రతీవార్డులో ఈసారి కనీసం వందకు తగ్గకుండా ఓటర్లు ఉన్నారు. వీరు ఎక్కడుంటారు, ఎలా కలవాలి, వీరికి ఎవరు దగ్గర ఎవరి ద్వారా వెళ్లి కలిస్తే మనకు ఓటేస్తారు.. ఇలా లెక్కలు వేసుకుంటూ కొత్త ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్నివార్డుల్లో మూడునాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి దగ్గరికి వెళ్లి కలవడంతోపాటు ఎలక్షన్ రోజు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చేలా వాహనాలనూ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కాగా సుభాస్ కాలనీ, రాంనగర్, యాదవ కాలనీ, కృష్ణకాలనీ, టీటూ క్వార్టర్స్, ఎండీ క్వార్టర్స్లోకి వివిధ పార్టీల నాయకులు ఒకరు తర్వాత ఒకరు ప్రచారం నిర్వహించడంతో ఓటర్లు అసహానానికి గురవుతున్నారు. ప్రచార రథాలు, హోరెత్తిస్తున్న పాటలు ఓటర్లను కలిసేందుకు అభ్యర్థుల ఆరాటం -
వేడెక్కిన ఓరుగల్లు
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరుసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రెబల్స్పై బుజ్జగింపుల అస్త్రం మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్ఎస్కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి 06 ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొలిక్కి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకుగాను ఒకచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా 26 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేరు.అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. ఆ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)లను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జేఎస్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం, పరకాలలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్ తదితరులు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం 8న భూపాలపల్లి, పరకాలకు సీఎం రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేంద్ర మంత్రులు వస్తారంటున్న బీజేపీ నేతలుజిల్లా మున్సిపాలిటీ వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు భూపాలపల్లి భూపాలపల్లి 30 107 ములుగు ములుగు 20 83 హనుమకొండ పరకాల 22 101 వరంగల్ నర్సంపేట 30 120 వర్ధన్నపేట 12 50 జనగామ జనగామ 30 127 స్టేషన్ఘన్పూర్ 18 82 మహబూబాబాద్ మహబూబాబాద్ 36 155 డోర్నకల్ 15 64 కేసముద్రం 16 58 మరిపెడ 15 63 తొర్రూరు 16 63 -
ఎన్నికల నియమావళిని పాటించాలి
భూపాలపల్లి: పోటీచేసే అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిపై పోటీ చేసే అభ్యర్థులకు వివరించారు. మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 107 మంది అభ్యర్థుల ఎన్నికల్లో పోటీలో ఉన్నారని, ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థికి ఎన్నికల నియమావళి ప్రకారంగా ఖర్చులు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్ పర్మిషన్, వాహన పర్మిషన్లు తీసుకునే విధానం, వాడుక విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోనా, డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్, నోడల్ ఆఫీసర్ నాగ వైష్ణవి, జిల్లా అబ్జర్వర్ నరేష్, సుకుమార్, ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా అదనపు ఎన్నికల అఽధికారి విజయలక్ష్మి -
తల్లులకు తనివితీరా మొక్కులు
8 లోuమేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్ఎస్ తాడ్వాయి ● మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● భారీగా తరలివచ్చిన భక్తులు..మేడారంలో తిరుగువారం పండుగ -
అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
రేగొండ: వివక్ష, అసమానతలు లేని సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణమే సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎంజేపీ బాలుర గురుకులంలో నిర్వహించిన సామాజిక న్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలోని ప్రతీ వర్గానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బలహీన వర్గాలు, మహిళలు, ది వ్యాంగులు, వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతీపౌరుడు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం సామాజిక న్యాయం పాటింపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతికిరణ్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డీసీఓ స్వప్న, ప్రిన్సిపాల్ అపర్ణ పాల్గొన్నారు. సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు మండలంలోని కొడవటంచ ఆలయానికి ఈ నెల 8న సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి పరిశీలించారు. దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. అంతకుముందు హెలిపాడ్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్శాఖ ఎస్ఈ మల్సూర్ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ రమేష్, ఆర్డబ్ల్యూస్ ఈఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంపీఓ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ
మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వృత్తివిద్య ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జి.వెంకన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన పరీక్షకు 15 మంది విద్యార్థులకు గాను 12 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో 27 మందికి 27 మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెంకట్రెడ్డి తెలిపారు. భక్తులను అవమాన పరిచారని ఫిర్యాదుకాళేశ్వరం: కాళేశ్వరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవమానం జరగొద్దని ఈఓకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వీఐపీ ఘాటులో హైదరాబాద్కు చెందిన సందీప్ తన తండ్రి అస్తికలు కలిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. బుధవారం అస్తికలు గోదావరిలో కలిసి తీరంపైకి రాగానే అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్ ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తారా.. అంటూ తమను బూతులు తిడుతూ అవమాన పరిచారని ఫిర్యాదు చేసినట్లు సందీప్ తెలిపారు. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదని దేవాదాయశాఖ సూచిక బోర్డులు అమర్చలేదన్నారు. భవిష్యత్లో ఇలాంటి అవమానం ఎవరికీ జరగకుండా దేవాదాయశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట జనార్దన్, రాఘవ తదితరులు ఉన్నారు. మల్హర్(కాటారం): జాబ్కార్డు కలిగిన ప్రతిఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్విని యోగం చేసుకోవాలని డీఆర్డీఓ బాలకృష్ణ అన్నారు. మండలంలోని మేడిపల్లి, చిదనపల్లి, కాటారం గ్రామంలోని వాటర్ హర్విస్టింగ్ క మ్యూనిటీ పాండ్ పనులను బుధవారం ఆయన సందర్శించారు. ప్రతీ గ్రామానికి 100 నుంచి 150 మంది కూలీలతో పని చేయించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. రా నున్న రెండు రోజుల్లో లేబర్ సంఖ్య పెంచకుంటే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు రూ.307 వస్తాయని, పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, నీడ, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కాటారం, మల్హర్ ఎంపీఓలు, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంజుల దేవి, డీటీసీ నాగేందర్, కా టారం, మల్హర్ ఏపీఓలు వెంకన్న, హరీష్, ఈసీలు మంగీలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అవగాహనతోనే ఆరోగ్య రక్షణ
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు భూపాలపల్లి అర్బన్: ప్రతీఒక్కరు ఆరోగ్య రక్షణపై అవగాహన కలిగి ఉండాలని, కేన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ కేన్సర్ దినోత్సవాన్ని మున్సిపల్ పరిధిలో ని జంగేడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోజూ తగినంత నీరు సేవించడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తే అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చన్నారు. అనంతరం గైనకాలజిస్టులు ప్రత్యూష, లక్ష్మిలు మాట్లాడుతూ రొమ్ము కేన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, డాక్టర్ నిహారిక, పుప్పాల శ్రీనివాస్, అక్షయ, న్యాయవాది మంగళపల్లి రాజ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇక జోరు ప్రచారం
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వంభూపాలపల్లి: నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఎన్నికల బరిలో రెబల్స్ లేకుండా చేయడంలో అన్ని పార్టీలు సఫలీకృతమయ్యాయి. టికెట్ ఆశించిన వారిని బుజ్జగించి, మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా చూసుకొని అన్ని రాజకీయ పార్టీలు తమ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో నేటినుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. బరిలో 107 మంది.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా నామినేషన్ల స్క్రూటినీ అనంతరం 166 మంది బరిలో నిలిచారు. ఇందులో 59 మంది మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 107 మంది పోటీలో ఉన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ జోన ప్రకటించారు. నో రెబల్స్.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మద్ధతు లభించని వారు ఎక్కువ సంఖ్యలో రెబల్స్గా బరిలోకి దిగారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల మద్ధతుదారుల గెలుపుపై ప్రభావం పడింది. దీంతో ఈసారి అలా జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మందస్తుగా ప్రణాళికతో సాగాయి. టికెట్ ఆశించిన వారిలో గెలుపు గుర్రాలు, ఆర్థికంగా ఉన్న వారిని గుర్తించి, మిగిలిన వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని నేతలు హామీలు ఇచ్చారు. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఇబ్బందులు తప్పాయి. బీ ఫారాలు దక్కని ఒకరిద్దరు అసంతృప్తితో ఉన్నా, వారిని కూడా బుజ్జగిస్తున్నారు. ఏ పార్టీ ఎన్ని వార్డుల్లో పోటీ.. మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంతో కలిసి అభ్యర్థులను పోటీలో ఉంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఎస్పీ 1 వార్డు స్థానంలో, బీజేపీ 25, సీపీఐ 4, సీపీఎం 1, కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 30, టీఆర్పీ 5, డీఎస్పీ 2, జనసేన 3, ఏఐఎఫ్బీ 1 వార్డులో, స్వతంత్రులు పది మంది పోటీలో ఉన్నారు. రెండు వార్డుల్లో ఆరుగురు పోటీలో.. మున్సిపాలిటీలోని అత్యధిక వార్డుల్లో ముగ్గురు, నలుగురు అభ్యర్థులే పోటీలో ఉన్నారు. 7వ, 28వ వార్డుల్లో మాత్రమే అధికంగా ఆరుగురు చొప్పున పోటీ పడుతుండగా 26, 30 వార్డుల్లో ఇద్దరు చొప్పున పోటీలో ఉన్నారు. 2, 4, 6, 8, 11, 12, 14, 15, 17, 18, 19, 20, 21, 24, 25 వార్డుల్లో ముగ్గురు చొప్పున, 1, 3, 5, 10, 13, 16, 22, 23, 27 వార్డుల్లో నలుగురు చొప్పున, 9, 29వ వార్డుల్లో ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు పార్టీల నేతలు ఆశావహులకు బీ ఫారాలు అందించకపోవడంతో కొందరు డైలమాలో పడ్డారు. టికెట్ వస్తుందో.. రాదోనని ఆందోళన చెందారు. చివరకు అన్ని పార్టీలు ఒకే రోజు అభ్యర్థులను ప్రకటించడం, స్వతంత్రులకు గుర్తులు కేటాయించడంతో అసలు ప్రచారం నేటితో ప్రారంభం కానుంది. బరిలో ఉన్న వారంతా గెలుపు కోసం మంగళవారం రాత్రి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారం రథాలకు అనుమతులు, కాలనీల్లో పెద్ద మనుషులను కలవడం, ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తంగా నేటి నుంచి భూపాలపల్లి పట్టణంలో ప్రచారం పర్వం జోరుగా సాగబోతుంది. మున్సిపల్ బరిలో 107 మంది అభ్యర్థులు రెబల్స్ లేకుండా చేయడంలో అన్ని పార్టీలు సఫలం అధిక వార్డుల్లో పోటీలో ముగ్గురు, నలుగురు అభ్యర్థులే నేటినుంచి హోరెత్తనున్న ప్రచార పర్వం -
ట్రాఫిక్ సమస్యల నివారణకు కమిటీ
ములుగు: రాబోయే మేడారం జాతరకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మేడారం మహాజాతరకు హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు 40 రోజుల పాటు విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు శ్రమించామని వెల్లడించారు. మేడారం జాతరకు వచ్చిన కోటిన్నర మంది భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ దేవతలను గద్దెలకు తీసుకరావడం నుంచి వనప్రవేశం వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని వివరించారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే జాతరకు పూజారులకు, మీడియా ప్రతినిధులకు, స్థానిక మేడారం యువతకు, అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. మేడారంలో సమ్మక్క– సారలమ్మ వనదేవతలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మహాజాతరలో 40 రోజుల పాటు శ్రమించాం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల నిర్వహణ
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక అంబేడ్కర్ క్రీడా మైదానంలోని మినీ ఫంక్షన్ హాల్ను, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్ల కోసం గదులను పరిశీలించారు. అంబేడ్కర్ స్టేడియంలో టెంట్లు ఏర్పాటు చేసి, వార్డు వారీగా డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రి సమగ్రంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచేందుకు స్టేడియంలోని గదులలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్లో గాలి, వెలుతురు లేకుండా కిటికీలు, వెంటిలేటర్లను పూర్తిగా మూసివేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం మినీ ఫంక్షన్ హాల్లో వార్డు వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి, బారికేడింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోన తదితరులు పాల్గొన్నారు. ఆహార కల్తీ కట్టడికి చర్యలు.. జిల్లాలో ఆహార కల్తీని కట్టడి చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆహార తనిఖీ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆహార తనిఖీశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, వైద్య, విద్యా, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆహార భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆహార తనిఖీ అధికారి వరుణ్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి.. జిల్లాలోని 2బీహెచ్కే గృహ సముదాయాల్లో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు తదితర శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2 బీహెచ్కే కాలనీల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీ, విద్యుత్ సదుపాయాలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి.. ఉద్యోగులు విరమణ పొందిన అనంతరం తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ)గా పనిచేసి జనవరి 31న ఉద్యోగ విరమణ పొందిన బాబురావుకు మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు పాల్గొని బాబూరావును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
టికెట్ రాని వారు అధైర్యపడొద్దు
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెట్ ఆశించి అవకాశం దక్కని నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, వారికి బీ–ఫారాలు అందజేశారు. బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూములు, రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. పార్టీ శ్రేణులతో చర్చలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. రైతుబంధు సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆశించిన ప్రతీ ఒక్కరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, పార్టీ ‘సెలెక్ట్ అండ్ ఎలెక్ట్’ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. టికెట్ రాని వారికి పార్టీ నిర్మాణంలో, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు, పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరను కూడా దొంగల ముఠాలు వదల్లేదు. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభ్యమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నేజేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్టు చేశారు. జాతరలో ఫేస్ రికగ్నేజేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు.. భక్తుల పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు జాతరలో ఏఐ కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ పేస్ రికగ్నేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) 10 చోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాతనేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను రద్దీ ప్రాంతాల్లో పెట్టారు. గతంలో చోరీలు చేసిన ఇతర రాష్ట్రాల దొంగల ఫొటోలు కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయగా కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరొచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూంలో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల జాతరకు పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించాయి. కమాండ్ కంట్రోల్ రూంకు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు.. మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ ‘ఫేస్ రికగ్నేజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ 70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు. రేపు ఢిల్లీలో ధర్నా భూపాలపల్లి అర్బన్: టెట్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(2)ను ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి ఢిల్లీలో జరిగే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్ను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషనల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. క్యాంపస్లోని పలు కేంద్రాలను పరీక్షల విభాగం అధికారులు సందర్శించారు. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కె.మమత పరిశీలించారు. పలు పరీక్షలు వాయిదామున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 7, 10వ తేదీల్లో నిర్వహించనున్న బీటెక్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని, 10న నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, 11న నిర్వహించాల్సిన ఎంబీఏ పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పును కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని కోరారు. ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను మంగళవారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నల్ల రాతిలో శిల్పులు చెక్కిన శిల్పకళాసంపదను తిలకించారు. అనంతరం ఖుష్మహల్, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతిమట్టికోట అందాలను వీక్షించారు. కోట గైడ్ రవియాదవ్ కాకతీయుల శిల్పకళాసంపద, విశిష్టతను ఆయనకు వివరించారు. కోట అందాలను అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది, టీజీటీఎస్టీడీసీ అజయ్ తదితరులు ఉన్నారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి ధూప దీపాలు వెలిగించి యాటను నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో ఈ సారి మేడారం మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. పుణ్యస్నానాలు.. మొక్కులు జాతర ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ క్రమంలో గద్దెల వద్ద పేరుకుపోయిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని దేవాదాయశాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. -
రామప్ప శిల్పాలు అద్భుతం
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ సంపద మరుపురానిదని స్విట్జర్లాండ్ దేశస్తులు కొనియాడారు. చారిత్రక రామప్ప దేవాలయాన్ని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రైస్ బాస్టియన్, కిస్టినా జాక్వెస్లు మంగళవారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. ఇండియాన్ ఆడిట్ ఆకౌంట్ సర్వీస్ అధికారి అఖిల్ రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా గైడ్ వెంకటేశ్ ఆలయ విశిష్టతను వివరించారు. -
శరణ్(తెల్లపులి) ఇక లేదు
జూ పార్క్లో గుండెపోటుతో మృతి న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని కాకతీయ జులాజికల్ పార్క్ సందర్శకులకు కనువిందు చేసిన తెల్లపులి (శరణ్, 14 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. మగ తెల్లపులిని హైదరాబాద్ నుంచి గతేడాది జూలైలో తీసుకొచ్చి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా ఎన్క్లోజర్ను ప్రారంభించి సందర్శకులు వీక్షించేందుకు వదిలారు. కొద్ది రోజులుగా జూ పార్క్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా తెల్లపులి సగటు వయస్సు 15ఏళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 14 ఏళ్లు ఉన్న తెల్లపులి వృద్దాప్యం వల్ల బీపీ, గుండె సంబంధిత, మూత్రపిండ సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతుందని తెలిపారు. పులికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందించినప్పటికి మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయిందిని జూ పార్క్ ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ మయూరి తెలిపారు. కాగా ఛీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరువెటర్నరీ కళాశాల వైద్యబృందం తెల్లపులికి పోస్టుమార్టం నిర్వహించి జూ పార్క్లోనే ఖననం చేసినట్లు చెప్పారు. -
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సొమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి మాసానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాల ను వెల్లడించారు. గడిచిన మాసంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.45 లక్షల టన్నులు ఉండగా 2.1 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 45శాతంలో నిలిచినట్లు చెప్పారు. రోజువారీ సగటు ఉత్పత్తి 6,497 టన్నులు సాధించి 3.25 లక్షల టన్నులు రవాణా చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి మాసంలో ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 4.21 లక్షల టన్నులు ఉందన్నారు. ఉత్పత్తి పెంపు కోసం ఉద్యోగులు, కార్మికులు అందరూ సమష్టిగా కృషిచేయాలని కోరారు. పనిగంటలను పెంచడం, గైర్హాజరు శాతాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలిపారు. అధికారులు, ఉద్యోగుల అందరూ వర్కింగ్ పర్మిషన్ ఇతర భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. ఈనెల 10వరకు గడువు పెంపు భూపాలపల్లి రూరల్: ఉపకరణాల కోసం దివ్యాంగుల నుంచి స్వీకరిస్తున్న గడువు ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 155326 లో కానీ లేదా 96523 11804లో సంప్రదించాలని సూచించారు. కాళేశ్వరం: మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల టెన్త్ విద్యార్థిని రాష్ట్రస్థాయి సోషల్ టాలెంట్ టెస్టుకు ఎంపికై నట్లు హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన సోషల్ టాలెంట్ టెస్టులో విద్యార్థిని ఎండీ రింషా రెండో స్థానంలో నిలిచింది. రూ.1500 నగదు బహుమతి అందుకుంది. విద్యార్థినిని హెచ్ఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి భూపాలపల్లి అర్బన్: విద్యార్థులను ఉత్తమ విలువలు కలిగిన వ్యక్తులుగా తయారు చేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) విజయపాల్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టుకు జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎంఓ విజయపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విలువలు కలిగిన మనుషులను తయారు చేయడంలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత గొప్పదన్నారు. ఈ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎంఈఓ దేవానాయక్, ఫోరం ఉపాధ్యాయులు పోతర్ల సతీష్, రాంధన్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ధర్నా భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని టీటూ క్వాటర్స్లో విధులు నిర్వర్తిస్తున్న సూపర్వైజర్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి పారిశుద్ధ్య కార్మికులు సోమవారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీటూ క్వాటర్స్లో విధులు నిర్వర్తిస్తున్న సూపర్వైజర్ బొచ్చు రవిని సివిల్ డీజీఎం విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వెంటనే అతనిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జీఎం స్పందించాలని ఐఎన్టీయూసీ నాయకులు దుర్గం రవి మద్దతు తెలిపి మాట్లాడారు. -
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
దోమల మందు పిచికారీ పనులను పరిశీలిస్తున్న డీపీఓ వెంకయ్య, అధికారులుఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాజాతర అనంతరం భక్తుల రద్దీ కాస్త తగ్గడంతో భక్తులు విడిది చేసిన ప్రాంతాల్లోని చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్, ఇతర వస్తువులను సేకరించి ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు సెక్టార్ల పరిధిలోని మేడారం, నార్లాపూర్, చింతల్ క్రాస్, ఊరట్టం, ఆర్టీసీ బస్టాండ్, చిలుకలగుట్ట, కన్నెపల్లి, కొత్తూరు ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. మంత్రి సీతక్క స్వచ్ఛమైన మేడారంగా తీర్చిదిద్ది గ్రామస్తులకు అప్పగించాలని ఆదేశించారు. దీంతో డీపీఓ వెంకయ్య పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా ట్రాక్టర్తో కెమికల్ స్ప్రే చేయిస్తున్నారు. డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు పనులను పర్యవేక్షించిన డీపీఓ వెంకయ్య -
పీఓలు, ఏపీఓల బాధ్యతలు కీలకం
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పీఓలు, ఏపీఓల బాధ్యతలు అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పీఓ, ఏపీఓలుగా విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని మాట్లాడారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాక్ పోలింగ్, ఓటర్ల గుర్తింపు, బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓటింగ్ ముగిసిన తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియల గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు. ఆప్షన్ తీసుకోవాలి.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫిషియోల నుంచి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. సోమవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి 14వ తేదీలోపు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు.. సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ -
ప్రతీ వాహనం తనిఖీ చేయాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారిపై రెండు చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనం తనిఖీ చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. సోమవారం కుందూర్పల్లి, బాంబులగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి ఉన్నారు. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. ఎస్సై మైసయ్య, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ పాపయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య సోమవారం ఉద్యోగ విరమణ పొందగా జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఎస్పీ సత్కరించారు. -
మూడోసారి మున్సిపోల్స్
● పరిశ్రమలతో దినదినాభివృద్ధి ● మండలం, నియోజకవర్గం, జిల్లా కేంద్రంగా మార్పు ● సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, మున్సిపల్లో బీఆర్ఎస్ హవా ● ఈసారి కోల్బెల్ట్ మొగ్గు ఎవరి వైపో..?భూపాలపల్లి: నాడు కమలాపూర్ గ్రామ పంచాయతీలో కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి అనతి కాలంలోనే మండల, నియోజకవర్గ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుంది. సింగరేణి గనులు, కేటీపీపీ పరిశ్రమలతో దినదినం అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే రెండుసార్లు ఎన్నికలు జరుగగా, త్వరలోనే మూడోసారి జరుగనుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి చరిత్ర, అభివృద్ధి, రాజకీయ పార్టీల బలాబలాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బుర్ర, తిక్క కుటుంబాలదే హవా.. 1981 నుంచి 2006 వరకు ఐదు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో భూపాలపల్లి గ్రామ మొదటి సర్పంచ్గా తిక్క వీరస్వామి ఏకగ్రీవం కాగా, అతని సోదరుడు తిక్క లింగమూర్తి ఒకసారి గెలుపొందారు. బుర్ర చంద్రయ్య రెండు పర్యాయాలు, అతని సతీమణి ఒక సారి సర్పంచ్గా విజయం సాధించింది. మొత్తానికి బుర్ర, తిక్క కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులే 26 ఏళ్ల పాటు సర్పంచ్లుగా కొనసాగారు. ఐదు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాల వారు కాంగ్రెస్ మద్ధతుదారులుగానే నిలబడి గెలుపొందడం విశేషం. గ్రామాల విలీనంతో నగర పంచాయతీగా.. 2001 జనాభా లెక్కల ప్రకారం భూపాలపల్లి గ్రామ పంచాయతీలో కేవలం 15 వేలకు పైగా జనాభా ఉంది. నగర పంచాయతీ ఏర్పాటుకు సరిపడా జనాభా లేకపోవడంతో సమీపంలోని జంగేడు, వేశాలపల్లి, కాశీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామ పంచాయతీలను భూపాలపల్లిలో విలీనం చేశారు. ఫలితంగా పట్టణ జనాభా 29 వేల పైచిలుకు చేరుకుంది. దీంతో 25 జనవరి 2012న భూపాలపల్లిని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో జిల్లా కేంద్రంగా ఏర్పడిన భూపాలపల్లి పట్టణాన్ని 2017 ఆగస్టులో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సి‘పోల్స్’లో కారుదే హవా.. భూపాలపల్లి మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఎన్నికలు జరుగగా బీఆర్ఎస్ పార్టీనే సత్తాచాటింది. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బండారి సంపూర్ణ రవి, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన సెగ్గెం వెంకటరాణిసిద్ధు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఈ సారి ఎవరి వైపో.. ఈ నెల 11న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్న ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ, కోల్బెల్ట్లో మరోమారు జెండా ఎగురవేయాలనే ఉద్ధేశంతో బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఈ నెల 13న తేలనుంది.విస్తీర్ణం 47.52 చదరపు కిలోమీటర్లు వార్డులు 30 మొత్తం ఓటర్లు 52,726పురుష ఓటర్లు 26,786మహిళా ఓటర్లు 25,936ఇతరులు 4 -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
మల్హర్(కాటారం): కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కదిలి.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సోమవారం కాటారం మండలంలోని ధన్వాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. సంక్షేమ పథకాలను ఆయుధాలుగా ప్రజలకు వివరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల క్షేత్రంలో పార్టీ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రెండేళ్లలో సీఎం రేవంత్రెడ్డి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడన్నారు. రానున్న మూడేళ్లలో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
ఎవరి వ్యూహం వారిదే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పట్టణాల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ, విపక్ష పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లా.. మున్సిపాలిటీ.. అక్కడి రాజకీయ వెసులుబాటును బట్టి సీపీఐ, సీపీఎం తదితర పార్టీల మద్దతును కూడగట్టుకునేందుకు ఆ పార్టీల నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బల్దియాలలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సోమవారం నాటికి చాలా మున్సిపాలిటీల్లో ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వార్డుల వారిగా బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండటంతో ఉదయమే ‘బీ’ ఫామ్లు ఇచ్చేలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయి. అన్ని పార్టీలకు రెబల్స్ బెడద.. బుజ్జగింపుల తర్వాతే ‘బీ’ఫామ్స్... ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు అభ్యర్థులు 2,372 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో 300లు తిరస్కరణకు గురికాగా 2,072 మంది బరిలో ఉన్నారు. సగటున చూస్తే ఒక్కో వార్డు నుంచి 9 నుంచి 10 నామినేషన్లు దాఖలు కాగా.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లకు రెబల్స్ బెడద అధికంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి రెబల్స్ బెడద ఉండకుండా చూడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి రేవంత్ రెడ్డి, కేసీఆర్లు ముఖ్యనేతలకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్లు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయా మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో రెండు రోజులుగా మంతనాలు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన ప్రజాప్రతినిధులు అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను బట్టి వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు పరకాల, నర్సంపేట, స్టేషన్ఘన్పూర్, జనగామ, తొర్రూరు తదితర మున్సిపాలిటీలలో బరి నుంచి సుమారు 117 మంది వరకు తప్పుకున్నట్లు సమాచారం. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా బరిలో ఉండే అభ్యర్థుల ‘బీ’ఫామ్లు సమర్పించాల్సి ఉండగా అంతకు ముందే రెబల్స్ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్నుంచి 22 వార్డుల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. ‘పుర’ పీఠం లక్ష్యంగా పార్టీల వ్యూహం.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడమే తరువాయి మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నాయి. ఇందుకోసం పార్టీల నాయకుల్ని, శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అందరూ కూడా పార్టీ గుర్తుపై పోటీ చేసేవారి గెలుపునకు కృషి చేసేలా వార్డుల వారీగా బృందాలను నియమిస్తున్నారు. వరుస విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చాలని అధికార కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు అనుకూలంగా మార్చుకుని.. ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒప్పించి ఓట్లు పొందాలన్న ప్లాన్తో బీఆర్ఎస్, బీజేపీలున్నాయి. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా వార్డు కౌన్సిలర్లను ఎంపిక చేసే పనిలో అన్నీ పార్టీలు ఎక్సర్సైజు చేశాయి. ఇదిలా వుండగా మొత్తం 12 బల్దియాలలో 335244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 172087లు కాగా, పురుషులు 163088లు ఉన్నారు. అత్యధికంగా మహిళలే ఉండటంతో వార్డులు, మున్సిపాలిటీల వారిగా అత్యధికంగా వారి ఓట్లను పొందేందుకు కూడా పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జిల్లా మున్సిపాలిటీ దాఖలైన తిరస్కరించిన మిగిలినవి నామినేషన్లు నామినేషన్లు నామినేషన్లుభూపాలపల్లి భూపాలపల్లి 230 64 166 ములుగు ములుగు 192 16 176 హనుమకొండ పరకాల 215 02 213 వరంగల్ నర్సంపేట 291 00 291 వర్థన్నపేట 121 00 121 స్టేషన్ఘన్పూర్ 181 00 181 మహబూబాబాద్ మహబూబాబాద్ 357 127 230 డోర్నకల్ 146 44 102 కేసముద్రం 167 44 123 మరిపెడ 142 03 139 తొర్రూరు 144 00 144 మొత్తం 2,372 300 2,072నామినేషన్ల పరిశీలన రోజు నాటికి అయా మున్సిపాలిటీల్లో దాఖలైన నామినేషన్లు, తిరస్కరించినవి, మిగిలినవి 260 వార్డులకు 2372 నామినేషన్లు... తిరస్కరణ తర్వాత 2072 పోటాపోటీగా నామినేషన్లు.. అన్ని పార్టీల నుంచి రెబల్స్ పరకాలలో బీఆర్ఎస్నుంచి వార్డు అభ్యర్థుల ప్రకటన.. నేడు నామినేషన్ల ఉపసంహరణ.. -
పొత్తు పొడిచింది
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పుర ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 25వార్డులు, సీపీఐ 4, సీపీఎం 1 వార్డులో పోటీ చేయనున్నాయి. బీఆర్ఎస్ 30 వార్డుల్లో బరిలోకి దిగింది. బీజేపీ 25 స్థానాల్లో నామినేషన్లు వేయగా.. ఐదు స్థానాల్లో నామినేషన్ వేయలేదు. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని నిలువరించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని గండికొట్టాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్, సీపీఎంతో బీఆర్ఎస్ పార్టీ జతకట్టింది. నిన్న మొన్నటివరకు బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు ఉంటుందని ఊహాగానాలు వెలువడినప్పటికీ నామినేషన్ల ప్రక్రిమ ముగియడంతో ఈ అంశానికి తెరపడింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పుర ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఒంటరిగానే బీఆర్ఎస్, బీజేపీ మిగతా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు వేరే ఏ పార్టీతో కలిసే పరిస్థితి లేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారే పోటీచేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బీ ఫామ్లు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా తన నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభించి మున్సిపల్ ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది. బీజేపీ బలహీనపడిన వాతావరణం కనిపిస్తున్న తరుణంలో ఆ స్థానాన్ని భర్తీచేసేలా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా మున్సిపల్ ఎన్నికలను వాడుకోవాలనే ఆలోచనలో ఉంది. బీజేపీ పోటీచేయని వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు పలు గ్రామాల్లో సర్పంచ్ల గెలుపునకు కలిసి పనిచేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మెజారిటీ సీట్ల సంఖ్య ఏ మాత్రం తక్కువైనా గతంలో లాగే ఎన్నికల అనంతరం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తుకుదిరే అవకాశం ఉండకపోలేదని పుర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుదిరిన సీట్ల లెక్క కాంగ్రెస్తో జతకట్టిన సీపీఐ, సీపీఎంలకు సీట్ల కేటాయింపు లెక్క తేలింది. మున్సిపాలిటీలో 30 వార్డు వార్డులు ఉండగా 25వార్డులు కాంగ్రెస్, 4 సీపీఐ, 1 సీపీఎం పోటీచేయనుంది. 5, 7, 24, 28 వార్డులో సీపీఐ, 27వ వార్డులో సీపీఎం అభ్యర్థులు నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో నామినేషన్ వేయగా బీజేపీ తరఫున 25 వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్ వేశారు. 8, 18, 25, 26, 30 వార్డుల్లో పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎన్నికల షెడ్యూల్కు ముందు అన్ని పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రచారాన్ని ప్రారంభించారు. పొత్తుల విషయంలో కూడా అన్ని పార్టీల కన్నా ముందుగా వ్యూహాత్మకంగా లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్కు పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా ఆయా పార్టీలు భావిస్తున్నారు. పట్టణంలోని ఓటర్లలో సింగరేణి కార్మికులు అధికంగా ఉండటం, గతంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపొందడం కూటమికి సానుకూలాంశంగా మారింది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ కార్మికసంఘం బలంగా ఉండటం కూటమికి కలిసొచ్చే అంశంగా పార్టీలు భావిస్తున్నాయి. మున్సిపల్లో సీపీఐ, సీపీఎంతో జతకట్టిన కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి బీఆర్ఎస్, బీజేపీ -
బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
భూపాలపల్లి అర్బన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర రమేష్, జనార్దన్, మాడ హరీశ్రెడ్డి, సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు. -
ప్రత్యేకం!
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఓరుగల్లుకు లేదుఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు ప్రత్యేక కేటాయింపులు లేవు. వరంగల్కు కీలకమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. మెడికల్, ఐటీ హబ్లు ఏర్పాటు చేసే నగరాల జాబితాలో చోటు దక్కలేదు. పర్యాటక అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఈ బడ్జెట్లో ఓరుగల్లు పర్యాటకాన్ని పట్టించుకోలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా ఊసేలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీతో పాటు కాళోజీ, కాకతీయ యూనివర్సిటీల ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులకు ఈ సారి మొండిచెయ్యే చూపారన్న చర్చ జరుగుతోంది. ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అంటుండగా.. ఈసారి కూడా అన్యాయం జరిగిందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల ఆశలు నెరవేరలే... వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారి ఆశలు నెరవేరలేదు. ఆ వర్గాలను ప్రభావితం చేసే అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5.28 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలవుతున్న స్లాబులను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్ డిడెక్షన్ను పెంచితే బాగుంటుందన్న వారి కోరిక తీరలేదు. డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్ను 5 నుంచి 2 తగ్గించి చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఆరు నెలల ఊరట ఇచ్చారు. గృహ రుణాల విషయంలో వడ్డీ రాయితీ, చిన్న కమతాలు కలిగిన రైతులకు భరోసా కల్పించే అంశాలు బడ్జెట్లో లేవు. రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్సిటీ పథకం పొ డిగింపుపై స్పష్టత లేదు. బడ్జెట్లో రాయితీలు లేకపోవడంతో అనేకవర్గాలు పెదవి విరుస్తున్నాయి. 6 జిల్లాలకు 6 బాలికల హాస్టళ్లు.. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు.. పర్యాటకం, మెడికల్ హబ్లో దక్కని చోటు ‘ట్రైబల్’ సహా యూనివర్సిటీలకు కేటాయించని నిధులు కేఎంటీపీకి ప్రయోజనం.. రైతులకు ఊరట జిల్లాకో బాలికల హాస్టల్.. ఉపాధి, ఉద్యోగావకాశాలుదేశంలోని అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు బాలికల హాస్టళ్లు రానున్నాయి. రైతులకు ఎరువులపై ఈసారి రాయితీ శాతాన్ని పెంచడం ఊరట కలిగించే అంశం కాగా, 9.17 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,834 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు మేలు జరగనుంది. ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్యం పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్ రోగులకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి. -
భక్తుల కోలాహలం
మంగపేట/వెంకటాపురం(ఎం): మేడారంలోని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం హేమాచలక్షేత్రం, రామప్ప ఆలయానికి తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి, రామలింగేశ్వస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోలాహలంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్కుమార్, శేఖర్శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మేడారం భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తుండడంతో పాటు అదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప ఆలయ గార్డెన్లో భక్తులు సేదతీరి ఉల్లాసంగా గడిపారు. ఏసీబీ తెలంగాణ ఐజీ తరుణ్ జోషి కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.మేడారం నుంచి హేమాచల క్షేత్రం, రామప్పకు తరలివస్తున్న సందర్శకులు -
పోలీస్ యాక్ట్ అమలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ సరిశెట్టి సంకీర్త్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నెల రోజుల పాటు సెక్షన్ 30, 30(ఏ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇతర వ్యక్తులు లేదా రాజకీయ పార్టీలను కించపరిచే వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాధ్యమాలలో అటువంటి పోస్టులు పెట్టినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేటీకే–5 ఇన్కై ్లన్లో భద్రతా పూజ భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే–5వ గనిలో ఆదివారం భద్రతా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన పూజ కార్యక్రమానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం, ఉత్పత్తి తగ్గుదల నేపథ్యంలో, గని భద్రతను మరింత పటిష్టం చేయడం, కార్మికుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో భద్రతా పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. గనిలో భద్రతే అత్యంత ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని స్థాయిల్లో కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని తెలిపారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా సమీక్షించి, అవసరమైన సాంకేతిక, పరిపాలనా చర్యలు ఇప్పటికే చేపడుతున్నామన్నారు. ఉత్పత్తి స్థాయిని పునరుద్ధరించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ భద్రతా పూజ కార్యక్రమంలో గని ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, గని మేనేజర్ మాచర్ల రమేష్, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి పోటీలు భూపాలపల్లి రూరల్: ఇండియన్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్నగర్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 300మంది కళాకారులు హాజరయ్యారు. కళాకా రులు వివిధ నృత్యాలతో అలరించారు. విజేతలకు నిర్వాహకులు షీల్డ్లతో పాటు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దుర్గం రమేష్, డ్యాన్స్ అకా డమీ సభ్యులు, డ్యాన్స్మాస్టర్లు పాల్గొన్నారు. జాతరలో నిరంతర విద్యుత్ సరఫరాహన్మకొండ: మేడారం మహా జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను విజయవంతంగా అందించినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సీఎండీ మేడారంలోనే బస చేసి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి మాట్లాడారు. జాతరలో నిరంతర విద్యుత్ సరఫరా వెనుక ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావం ఉందన్నారు. జాతర విజయవంతం చేయడానికి కృషిచేసిన అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘మేడారం మహాజాతర విజయవంతం’ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర విజయవంతంగా ముగిసిందని మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు అన్నారు. మేడారంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. జాతర నిర్వహణలో ప్రభుత్వం, పూజారులు, ఆదివాసీ యువకులు, సమన్వయంతో పనిచేసినట్లు వివరించారు. -
ఆశావహుల ఎదురుచూపు
కాళేశ్వరం: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాలయంలో ట్రస్టు బోర్డు నియామకం ఎప్పుడు జరుగుతుందనే అంశంపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే మహా శివరాత్రి జాతర నాటికి ట్రస్టు బోర్డు ఏర్పాటవుతుందా? లేదా అన్న సందేహాలు పలువురు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. పరిశీలనలో ధరఖాస్తులు.. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కాళేశ్వరాలయం ట్రస్టు బోర్డు నియామకానికి సంబంధించి 14 మంది డైరెక్టర్లు, ఒక ఎక్స్అఫీషియో సభ్యుడి ఎంపిక కోసం గతేడాది నవంబర్ 18న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పలువురు ఆశావహులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులపై ఎస్బీ పోలీసులు విచారణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ధరఖాస్తులు కమిషనర్ పరిశీలించి, ప్రభుత్వానికి అందజేసిట్లు తెలిసింది. పరిపాటిగా మారిన వాయిదా.. రెండున్నరేళ్లుగా ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి, ఆపై వాయిదా వేయం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతి నది పుష్కరాలను కూడా ట్రస్టు బోర్డు లేకుండానే ఉత్సవ కమిటీతోనే నిర్వహించారని ఆరోపణలు భక్తులు, ప్రజల్లో ఉన్నాయి. రూ.30కోట్లతో ప్రతిపాదనలు.. మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్యపుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల వరకు నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. శాశ్వత నిర్మాణాలు, ఆలయ అభివృద్ధి, నిర్వహణ పక్కాగా సాగాలంటే ట్రస్టు బోర్డు నియామకం తప్పనిసరి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. చైర్మన్ రేసులో మంథనికి చెందిన అవధాని మోహన్శర్మ, కాళేశ్వరానికి చెందిన కామిడి శ్రీనివాస్రెడ్డి, మెంగాని అఽశోక్ పైరవీలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏదేమైనా ట్రస్టుబోర్డు నియామకం జరిపి, ఆలయ నిర్వహణపై గాడిలో పెట్టే వారిని చైర్మన్, డైరెక్టర్లుగా నియమించాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.ఈనెల 15న జరగనున్న మహా శివరాత్రి జాతర వరకై నా ట్రస్టు బోర్డు నియామకం చేస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశించే ఆశావహులు మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్లు వాయిదా వేయడం పరిపాటి మంత్రి శ్రీధర్బాబుపై ఆశలు పెట్టుకున్న నాయకులు -
కలెక్టరేట్లో 24 గంటలు హెల్ప్డెస్క్
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కలెక్టరేట్లో 24/7 గంటల హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలను హెల్ప్ డెస్క్ మొబైల్ నంబర్ 90306 32608కు తెలియజేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ పాల్గొన్నారు. పారదర్శకంగా నిర్వహించాలి.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణీంద్రరెడ్డి సూచించారు. శనివారం ఆయన భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత గల నామినేషన్లను మాత్రమే చెల్లుబాటు చేయాలని, పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రతీ నామినేషన్ను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ -
అరణ్యానికి ఆదిశక్తులు
సమ్మక్క: రాత్రి 7.58 గంటలకుమేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తల్లులారా వెళ్లొస్తాం.. తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. బోసిపోయిన మేడారం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు. భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్కు ఎండోమెంట్ అధికారులు వెల్డింగ్ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. జనం నుంచి వనం చేరిన తల్లులు ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశంవరాల మూటలు భక్తులకిచ్చారు.. వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు. ఆసీనులై అందరి మొర ఆలకించారు.. ఎనలేని కాస్మిక్ ఎనర్జీని ప్రసరించారు. భక్తుల ప్రేమకు మురిసిపోయారు. వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు.. ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి. వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా. ‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది! -
మేడారం టు కాళేశ్వరం
● మేడారం భక్తులతో కిక్కిరిసిన కాళేశ్వరాలయం కాళేశ్వరం: ములుగు జిల్లా మేడారంలో మొక్కులు చెల్లించిన భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరాలయాన్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో పాటు తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే భక్తులు కాళేశ్వరాలయంలో స్వామివారికి పూజలు చేశారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాల వద్ద భక్తులు శనిపూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. -
ఈసారైనా విదిల్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆదివారం) ప్రవేశపెట్టే 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది? అన్న చర్చ ప్రధానాంశమైంది. ఈసారైనా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల విషయమై సీతమ్మ కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2025–26 కేంద్ర బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నేరుగా పద్దులేవీ ప్రకటించలేదు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ను రూపకల్ప న చేసినట్లు చెప్పినా.. నేరుగా ఆ వర్గాలకు చెందిన అందరికీ మేలు జరిగే పరిస్థితి కనిపించలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు పీఎం మిత్ర హోదా, నిధుల కేటాయింపు, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, భూగర్భ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా.. బడ్జెట్లో ఆ మే రకు నిధులివ్వలేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటున్నాయి. ఈసారి బడ్జెట్లోనైనా ప్రాధాన్యమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రాజెక్టులపై చిన్నచూపు.. ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ తదితర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. పలు ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడంపై ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ను ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి ఉన్నా.. గత బడ్డెట్లో నేరుగా పద్దుల్లో చేర్చకపోవడం వల్ల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.350 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు గత బడ్డెట్లో బుట్టదాఖలే అయ్యాయి. లెదర్ పార్కు, సైనిక్ స్కూల్తో పాటు వివిధ పథకాల కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోగా.. రూ.4,174 కోట్ల అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిధుల్లో కేంద్రం వాటా తేలలేదు. ఈసారి నిధులిచ్చి వాటాను క్లియర్ చేయాలని కోరుతున్నారు. నిధులు కేటాయించని కారణంగా సైనిక్ స్కూల్ను ఇతర జిల్లాలకు తరలించాలని చూస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. నిర్మలమ్మపైనే ఆశలు ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్ఫ్యాక్టరీ పూర్తికి నిధులు అవసరం ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులు పెండింగ్ రైల్వే లైన్లు, స్టేషన్లకు విడుదల కాని నిధులు గత బడ్జెట్లో ప్రతిపాదించినా దక్కని ప్రాధాన్యం ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశలు రైల్వేశాఖకు కేటాయింపులపై ఆశలు..ఈసాధారణ బడ్జెట్లోనైనా రైల్వేశాఖకు కేటాయింపులు జరిగితే పలు కొత్త, అసంపూర్తి రైల్వేలైన్లకు మోక్షం కలుగుతుంది. మణుగూరు–రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు. ఆ మేరకు భూసేకరణ, నిర్మాణం పూర్తి కోసం నిధులు ఇవ్వలేదు. హసన్పర్తి–కరీంనగర్, డోర్నకల్–మిర్యాలగూడ రైల్వేలైన్ల సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు పెరగాల్సి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు ఆ మేరకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రి మార్పుపైన ఆశలు ఉన్నాయి. స్టేషన్ఘన్ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్కు నిధులివ్వడంతో పాటు కాజీపేట జంక్షన్ నుంచి ముంబై. విజయవాడ, కాగజ్నగర్ వరకు మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. కాగా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్సిటీ గడువును పెంచి అదనంగా నిధులు కేటాయించాలని నగరవాసులు కోరుతున్నారు. -
గుర్రంపేట జాతరలో కలెక్టర్ పూజలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట గ్రామంలో నిర్వహిస్తున్న మినీ మేడారం జాతరను శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంిపీడీఓ తరుణ్ ప్రసాద్, అధికారులు, ఆలయ సిబ్బంది, పూజారులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. -
అమ్మల దీవెన
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. కోటి మందికిపైగా మొక్కులు.. వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు. సమీప గ్రామాల్లో భక్తుల సందడి మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు. తిరుగు ప్రయాణం.. తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు. సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి.. పూనకాలతో పులకించి పోయాయి. తలనీలాలు తన్మయత్వం చెందాయి.. ఎనలేని భక్తిని చాటాయి. పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి.. పొడిసేటి పొద్దులై ప్రభవించాయి. కోళ్లు, యాటలు సై సై అన్నాయి.. మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి. సాక చుక్కలు నేలపై పారాయి.. ఆనవాయితీకి అద్దం పట్టాయి. ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి.. భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి. ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి.. వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి. గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి.. భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు -
ముగిసిన నామినేషన్ల పర్వం
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో తొలిపర్వం ముగిసింది. మూడురోజుల పాటు నామినేషన్ల స్వీక రణ ప్రక్రియ కొనసాగగా చివరిరోజు భారీ సంఖ్య లో అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేశారు. ఒక్కరోజే 230.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో స్వీకరించారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు 4 నామినేషన్లు, 29న 19 మంది 20 నామినేషన్లు దాఖలు చేశారు. 30న 176 మంది 230 నామినేషన్లు వేసినట్లు ము న్సిపల్ కమిషనర్ జోనా వెల్లడించారు. మొత్తంగా 198 మంది అభ్యర్థులు 254 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు. పార్టీల వారీగా.. బీఎస్పీ 2, బీజేపీ 30, సీపీఐ 7, సీపీఎం 2, కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 83, జనసేన 4, ఏఐఎఫ్బీ 3, ఇతర పార్టీలు 8, స్వతంత్రులు 26 మంది మొత్తంగా 254 నామినేషన్లను దాఖలు చేశారు. గల్ల పెట్టె గలగల... ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం వచ్చింది. నామినేషన్లు వేసే అ భ్యర్థులు ఆస్తి పన్నులు పూర్తిగా చెల్లించాలనే నిబంధన ఉండటంతో 198 మంది తమ ఆస్తి పన్నులను చెల్లించారు. 28వ తేదీన రూ.4,86,492, 29న రూ.8,53,589, శుక్రవారం రూ.6,42,893, మొత్తంగా రూ.19,82,974 ఆస్తి పన్ను వసూలు అయినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ వెల్లడించారు. భూపాలపల్లిలో 30 వార్డులు 198 మంది అభ్యర్థులు 254 నామినేషన్లు చివరి రోజు భారీగా 230 దాఖలు -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకుడు ఫణీందర్రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్ 9030632608కు కాల్ చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, భద్రత, తరలింపులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రాల పరిశీలన.. మున్సిపాలిటీ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకుడు ఫణీందర్రెడ్డిలు వేర్వేరుగా పరిశీలించి నోడల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్నింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన ఫణీందర్రెడ్డి శుక్రవారం నుంచి జెన్కో అతిథి గృహంలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే నేరుగా లేదా ఫోన్ నంబర్ 9949992992 ద్వారా తెలియజేయాలని ఫణీందర్రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ సీమెన్స్, ప్రథం సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లతో పాఠశాల విద్యలో(స్టెమ్) సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్పై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో స్టెమ్ విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, సీమెన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ శివకుమార్, ప్రథం రాష్ట్ర కో ఆర్డినేటర్ సుధాకర్ పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ, పరిశీలకుడు ఫణీందర్రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై నోడల్ అధికారులతో సమావేశం -
జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క
● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు ● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక ● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక ● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక ● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక ● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది. ● జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం ● అడుగుడుగునా భక్తుల నీరాజనాలు ● గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు ● నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. గుట్టపై రహస్య పూజలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ దివాకర టీఎస్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు. హరివిల్లు.. చిలకలగుట్ట దారి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు. మూడుసార్లు లైట్ల ఆర్పివేత.. గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు. నలుగురు వనదేవతలకు పూజలు.. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులు సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు. 6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు పోటెత్తిన భక్తజనం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్, వాటర్ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది. సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు.. చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు. గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు.సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠమేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు. -
సారలమ్మ వచ్చిందిలా..
మంగళవారం మధ్యాహ్నం 4:23కు పూనుగొండ్ల నుంచి బయల్దేరాడు. రాత్రి 1 గంటలకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాడు. బుధవారం ఉదయం 11:23 గంటలకు పస్రా చేరుకున్నాడు. సమ్మక్క గుడికి రాత్రి 7:23కు చేరుకున్నాడు. 12:29 గంటలకు గద్దైపె పగిడిద్దరాజును ప్రతిష్ఠించారు. కొండాయి నుంచి 5:57 గంటలకు పడిగ రూపంలో బయలుదేరాడు. 6:40 గంటలకు కొండాయి ఊరిపొలిమేర దాటారు. 8:20 గంటలకు జంపన్నవాగు దాటారు. 9:20 గంటలకు మేడారం జంపన్నవాగుకు చేరుకున్నారు. 12:29 గంటలకు గద్దెలపై ప్రతిష్ఠించారు. రహస్య పూజలు లోపల.. డోలు వాయిద్య గంభీర ధ్వనులు బయట. పూజారుల మంత్రాల ఉచ్ఛరణ లోపల.. ఆదివాసీల ఆటపాటలు బయట. పసుపు కుంకుమలతో ఆడబిడ్డకు కొలుపు లోపల. నీళ్లారగించేందుకు నిరీక్షించే ఆడపడుచులు బయట. తరలివచ్చేందుకు సిద్ధమైన తల్లి లోపల.. పాద స్పర్శ కోసం వరంపట్టే బిడ్డలు బయట.. ఇలా.. కన్నెపల్లి నుంచి బుధవారం రాత్రి ఆదివాసీ సంప్రదాయంతో సారలమ్మ మేడారానికి బయలెల్లింది. ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు. చిలకలగుట్టపై పూజలు.. సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. రాత్రి 7 గంటలకు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోకి పూజారులు వెళ్లారు. 7:19 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి పూజలు చేశారు. రహస్య పూజల అనంతరం.. 7:38 గంటలకు పూజారులు బయటకు వచ్చారు. 7:40 గంటలకు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. 7:42 గంటలకు సారలమ్మకు నిమ్మకాయలతో దిష్టి తీశారు. 8:51 గంటలకు జంపన్నవాగుకు చేరుకున్నారు. 12:28 గంటలకు గద్దైపె సారలమ్మను ప్రతిష్ఠించారు. -
తొలిరోజు మూడు నామినేషన్లు
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ పార్టీల నేతలకు సవాల్గా మారింది. మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నెల రోజుల ముందు నుంచే ఆశావహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. వార్డుల్లో తమ సామాజిక వర్గం వారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయని, తనకు టికెట్ ఇస్తే సరే, లేదంటే పార్టీని వీడి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని పలువురు ఆశావహులు తమ నేతలకు వెల్లడిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా.. రెబల్స్ ద్వారా పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పట్టణంలోని 7వ వార్డుకు బీజేపీ మద్ధతుదారు ఒకరు, 9వ వార్డుకు బీఆర్ఎస్ మద్ధతుదారైన ఒకే వ్యక్తి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 28వ వార్డు నుంచి సీపీఐ మద్ధతుదారు ఒకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. నేడు.. రేపు భారీగా నామినేషన్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కావడం, మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించడంతో కౌన్సిలర్గా పోటీ చేయనున్న అభ్యర్థులు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. అంతేకాక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదు. బుధవారం రాత్రి వరకు ప్రతీ పార్టీ ఒకటి, రెండు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. దీంతో నేడు(గురువారం), రేపు(శుక్రవారం) భారీ మొత్తంలోనే నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. రెండు పార్టీలతో కలిసి కాంగ్రెస్.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా సీపీఐకి 4, సీపీఎంకు ఒక వార్డు స్థానాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మిగిలిన 25 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పోటీలో నిలబడనున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. నేడు, రేపు భారీగా దాఖలయ్యే అవకాశం కాంగ్రెస్తో సీపీఐ, సీపీఎం పొత్తు ఒంటరిగా బరిలోకి బీఆర్ఎస్, బీజేపీలు -
గోవిందరాజులు..
కొండాయి నుంచి 5:57 గంటలకు పడిగ రూపంలో బయలుదేరాడు. 6:40 గంటలకు కొండాయి ఊరిపొలిమేర దాటారు. 8:20 గంటలకు జంపన్నవాగు దాటారు. 9:20 గంటలకు మేడారం జంపన్నవాగుకు చేరుకున్నారు. 12:29 గంటలకు గద్దెలపై ప్రతిష్ఠించారు. రహస్య పూజలు లోపల.. డోలు వాయిద్య గంభీర ధ్వనులు బయట. పూజారుల మంత్రాల ఉచ్ఛరణ లోపల.. ఆదివాసీల ఆటపాటలు బయట. పసుపు కుంకుమలతో ఆడబిడ్డకు కొలుపు లోపల. నీళ్లారగించేందుకు నిరీక్షించే ఆడపడుచులు బయట. తరలివచ్చేందుకు సిద్ధమైన తల్లి లోపల.. పాద స్పర్శ కోసం వరంపట్టే బిడ్డలు బయట.. ఇలా.. కన్నెపల్లి నుంచి బుధవారం రాత్రి ఆదివాసీ సంప్రదాయంతో సారలమ్మ మేడారానికి బయలెల్లింది. ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు. చిలకలగుట్టపై పూజలు.. సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. -
కన్నెపల్లి.. సిరివల్లి
రక్షించే తల్లికి రహస్య పూజలు. అండగా నిలిచే అమ్మకు హనుమంతుడి జెండా నీడలు. సల్లని తల్లికి నీళ్లారగింపులు.. మహిమగల్ల మాతకు మంగళహారతులు. హోరెత్తించే డోలు వాయిద్యాలు. ప్రొటోకాల్కు పోలీసుల వలయాలు. పసిడి వెన్నెలమ్మకు పొర్లు దండాలు.. వరంపట్టిన భక్తులకు శతకోటి వరాలు. జంపన్నవాగులో తడిసిన పాదాలు.. తమ్ముడు జంపన్నకు దీవెనార్తులు. గద్దైపె కొలువుదీరిన సారలమ్మకు జయజయధ్వానాలు.. – మేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి)కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం అర్ధరాత్రి తర్వాత మేడారం గద్దైపె కొలువుదీరింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, భుజంగరావు, అమృత, కనకమ్మతోపాటు మరికొంత మంది గుడిలో రహస్య పూజలు చేశారు. హనుమాన్ జెండా నీడలో అమ్మవారిని గుడి నుంచి బయటకు తీసుకొచ్చారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్యతోపాటు ఆదివాసీ యువకులు, మహిళలతో కలిసి సారలమ్మ యాత్ర కొనసాగింది. గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి ఎదురెల్లి నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టారు. అమ్మవారిని తీసుకుని డోలు వాయిద్యాలతో ఆదివాసీలు, పోలీసుల రోప్ పార్టీ బందోబస్తు మధ్య అధికారంగా యాత్ర కొనసాగింది.దారి పొడవునా దండాలు.. కన్నెపల్లి నుంచి సారలమ్మ బయల్దేరడంతో భక్తులు అమ్మవారి పాద స్పర్శ కోసం వరం పడుతూ నేలపై బోర్లా పడుకున్నారు. తల్లిని కనులారా చూసేందుకు మేడారం గద్దెల వరకు భక్తులు బారులుదీరారు. అమ్మకు జేజేలు అంటూ పసుపును పైకి చల్లారు. సారలమ్మను జంపన్నవాగులో నుంచి తీసుకెళ్లారు. జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆనవాయితీగా అక్క సారలమ్మ కాళ్లను తమ్ముడు జంపన్న తాకి నమస్కరించినట్లుగా భావించి జంపన్న వాగులో నుంచి మాత్రమే సారలమ్మను గద్దైపెకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తల్లి సమ్మక్క గుడిలోకి వెళ్లి అక్కడ పసుపు కుంకుమ్మ సమర్పించి సారలమ్మ పీఠంపై చీర, రవికను అందించారు. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి కొడుకుగా వచ్చిన పగిడిద్దరాజుకు సమ్మక్క గుడిలో పెళ్లి క్రతువు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ పెళ్లిని సారలమ్మ, గోవిందరాజులు తిలకించి పగిడిద్దరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరారు.కొలువుదీరే ముందు ప్రత్యేక పూజలుసారలమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పవిత్రమైన నీటిని తీసుకొని పూజారులు ఆడపడుచులు కలిసి మేడారంలోని సారలమ్మ గద్దెకు చేరుకొని అలికి ముగ్గులు వేశారు. అనంతరం అమ్మవారి ధ్వజస్తంభానికి కంకణాలు కట్టారు. భక్తులెవరూ చూడకుండా చీర చుట్టి పూజలు చేశారు. సాయంత్రం సారలమ్మను గద్దైపెకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్క పూజారులు, ఆడపడుచులు కూడా మేడారంలోని సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమతో సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. నేడు (గురువారం) సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దైపె రావడానికి ముందుగా పూజారులు సమ్మక్క గద్దెను మట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు.మహా జాతరలో అనూహ్య ఘట్టంఒకే రోజు కొలువుదీరిన నలుగురు దేవతలు !అర్ధరాత్రి 12:28 గంటలకు గద్దైపెకి సారలమ్మ, 12:29 గంటలకు గోవిందరాజులు, పగిడిద్దరాజు..ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి రోజు బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరాల్సి ఉండగా.. పూజారులు సమయపాలన పాటించినప్పటికీ అనివార్య కారణాలతో బుధవారం అర్ధరాత్రి 12:28 గంటల తర్వాత (గురువారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపైకి రానుంది. ఈ నేపథ్యంలో నలుగురు దేవతలను ఒకే రోజు (గురువారం) గద్దెలపై ప్రతిష్ఠించినట్లు అయ్యింది.పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..మేడారం(ఏటూరునాగారం): గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై అడవిమార్గంలో కాలినడకన బయల్దేరారు. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో వారి ఆడబిడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం పస్రా మీదుగా కాలినడకన డప్పుచప్పుళ్లతో మేడారానికి చేరుకున్నారు. మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మ వచ్చిన తర్వాత పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు కలిసి ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు. పూనుగొండ్ల నుంచి మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు 70 కిలోమీటర్లు అడవిలో కాలినడకన పడిగతో బై లెల్లిన పూజారులు -
మహా భక్తులకు కష్టాలు
కాళేశ్వరం: మేడారం జాతరకు తరలిపోతున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులకు మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ వంతెన మీదుగా ఇంజనీర్లు, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు వద్ద భక్తులు నిరీక్షిస్తున్నారు. మంగళవారం ఆయా రాష్ట్రాల నుంచి మేడారం వెళ్లేందుకు తరలిరాగా గేటు వద్ద అనుమతి లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం తమకు అనుమతి కల్పించాలని వేడుకుంటున్నారు. కాళేశ్వరం మీదుగా వెళ్లాలంటే రవాణా కష్టాలతో ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. భూపాలపల్లి అర్బన్: కాటారం–మేడారం ప్రధాన రహదారిలో సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేడారం సమీపంలోని కాల్వపల్లి–మహాముత్తారం మండలం సింగారం గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతు పనులు పూర్తి కాలేదు. రోడ్డుపై గుంతలు పూడ్చే క్రమంలో అధికారులు కంకర పోసి వదిలేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుంచి జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నా.. అధికారులు పనులెప్పుడు పూర్తిచేస్తారని మండిపడుతున్నారు. భూపాలపల్లి రూరల్: ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతానని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవికుమార్ ఆధ్వర్యంలో టీఎన్జీఓ డైరీని కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు విజయలక్ష్మి, అశోక్ కుమార్, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి దశరథ రామారావు, సంఘం నాయకులు షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, సురేందర్రెడ్డి, అన్వార్ భైగ్, వంశీ కృష్ణ, మురళీధర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీదేవి పాల్గొన్నారు. ● ఇద్దరి దుర్మరణం మల్హర్(మహాముత్తారం): మేడారం జాతర నేపథ్యంలో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్తున్న ట్రాక్టర్ మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 10 మందికి పైగా వ్యక్తులు ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో మహాముత్తారం మండలం నిమ్మగూడెం, పెగడపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మి(45), అక్షిత (20) మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలిసింది. -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15ఫైర్ ఫైటర్లు: 268పార్కింగ్ స్థలాలు: 42మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000మొత్తం ట్రిప్పులు: 51,000ఆర్టీసీ సిబ్బంది: 10,441తాగునీటి నల్లాలు: 5,482జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119వైద్య సిబ్బంది: 5,192అంబులెన్సులు: 30 బైక్ అంబులెన్సులు: 40 ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు రోజుకు మెడికల్ క్యాంపులు: 30కమ్యూనికేషన్ – టెక్నాలజీశాశ్వత మొబైల్ టవర్లు: 27తాత్కాలిక మొబైల్ టవర్లు: 33వీహెచ్ఎఫ్ సెట్లు: 450ట్రాన్స్ఫార్మర్లు: 196విద్యుత్ స్తంభాలు: 911విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ విద్యుత్ సిబ్బంది: 350 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్): 28టాయిలెట్లు: 5,700బ్లాకులు: 285గజ ఈతగాళ్లు: 210సింగరేణి రెస్క్యూ: 12ఎస్డీఆర్ఎఫ్ బృందాలు: 100– ములుగుపారిశుద్ధ్య సిబ్బంది: 5,000ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100స్వీపింగ్ మెషిన్లు: 18 జేసీబీలు : 12స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు 2,000 మంది -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక మలుగు/ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు. కోరికలు నెరవేర్చేందుకు నిలువెత్తు బంగారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణం విస్తరణ.. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.హనుమాన్ జెండా నీడలో సారలమ్మ.. సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గుడారాలతో నిండిన మేడారం..గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది. -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. గద్దెలే దేవతామూర్తులుగా.. మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. -
పోరాట స్ఫూర్తిని నింపాలి
భూపాలపల్లి: భవిష్యత్ తరాలకు స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నింపాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని, వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులో.. భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాపోటీల్లో విజేతలైన కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్.దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, పోక్సో స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, అదనపు గవర్నమెంట్ ప్లీడర్లు బల్ల మహేందర్, ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. గణపురం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో జాతీయ జెండా రూపంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా రూపంలో అలంకరించగా భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. 31 వరకు ఇసుక రీచ్లు బంద్ కాళేశ్వరం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచులను కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాలతో నేటి నుంచి ఈనెల 31వరకు బంద్ చేసినట్లు టీజీఎండీసీ పీఓ రామకృష్ణ సోమవారం తెలిపారు. జాతర సమయంలో భక్తులు భారీగా తరలి రానున్నందున ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఇసుక రీచులు బంద్ చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి యథావిధిగా ఇసుక రీచ్లు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. -
టీకా ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో హెల్త్ కేర్ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. స్థానిక పీహెచ్సీలో జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ ఉమాదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి డోసు టీకా ఇవ్వగా, రెండో డోసు ఒక నెల తర్వాత, మూడో డోసు ఆరు నెలల తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు. హెపటైటిస్–బీ వ్యాక్సిన్ ద్వారా పచ్చకామెర్లు, లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ కేన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. -
మహాజాతరకు ముస్తాబు
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం జరగ్గా.. ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు జరుగుతుంది. ఈ మేరకు జాతరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముస్తాబైన నయా మేడారం... మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్ తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే దశ్యకావ్యాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భద్రత వలయంలో మేడారం.. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. జంపన్న వాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తిచేశారు. మేడారం చుట్టూ 10 కి.మీ.ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జాతర సందర్భంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలనుంచి తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 460 సీసీ కెమెరాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండబోతుండగా, ట్రాఫిక్ నియంత్రణకు రెండు కిలోమీటర్లకు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. రూ.251 కోట్లతో పునరుద్ధరణ, జాతర నిర్వహణ పనులు జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు 28 నుంచి 31 వరకు మహా జాతర.. 3 కోట్లమంది వస్తారని అంచనా -
ఆదివాసీ యువత రోప్పార్టీ సిద్ధం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఆదివాసీ యువతతో రోప్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 29న చిలకల గుట్ట నుంచి సమ్మక్కతల్లిని మేడారం గద్దైపెకి తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీతో పాటు మేడారానికి చెందిన ఆదివాసీ యువతతో రోప్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీ కీలకమైనప్పటికీ ఆదివాసీ యువత రోప్ పార్టీ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మక్కతల్లి చిలకలగుట్ట దిగిన నుంచి గద్దైపెకి ప్రతిష్టించే వరకు ఆదివాసీ యువత సంప్రదాయాలను పాటిస్తూ రోప్ పార్టీగా అమ్మవారిని గద్దైపెకి తీసుకొస్తుంది. యువతకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. సోమవారం చిలకలగుట్ట వద్ద ఆదివాసీ యూత్ రోప్ పార్టీ సమావేశమై అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చిలకల గుట్ట వద్ద ట్రాక్టర్ డోజర్తో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
భూపాలపల్లి: పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరు కాగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మెరుగైన వైద్యం.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. జిల్లాలో 39,605 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఇందుకోసం రూ. 88.13 కోట్లు వెచ్చించాం. జిల్లాలో 65 పల్లె దవాఖానాలు, మహదేవపూర్లో డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు అందించాం. మహిళా క్యాంపులు నిర్వహించి 5,690 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. రైతు సంక్షేమం.. వ్యవసాయం.. రైతు భరోసా కింద 1.24 లక్షల మంది రైతులకు రూ. 96 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ రైతులపై ఆర్థిక భారం తగ్గించాం. రైతు బీమా కింద 72,058 మందిని నమోదు చేశాం. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుంది. గృహజ్యోతి.. ఇందిరమ్మ ఇళ్లు.. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే 56,525 మంది వినియోగదారులకు ప్రభుత్వం రూ.37.42 కోట్లు చెల్లించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాకు 3,943 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.51.40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 68,311 మంది లబ్ధి పొందుతున్నారు. సన్నబియ్యం పంపిణీ, పట్టణ అభివృద్ధి.. జిల్లాలో నూతనంగా 15,149 రేషన్ కార్డులు మంజూరు చేశాం. పాఠశాలలు, అంగన్వాడీలకు పోర్టి ఫైడ్ సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.113 కోట్లతో పనులు చేపట్టామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. అలరించిన కార్యక్రమాలు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. పలు ప్రభు త్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాటా రం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ, ప్రసంగిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థుల నృత్యాలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగానికి పెద్దపీట పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం గణతంత్ర వేడుకల్లో రాహుల్ శర్మ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది. జిల్లాలో ఇప్పటివరకు 1.85 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనివలన వారికి రూ. 97.43 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. మహిళా శక్తి పథకం కింద 2,378 సంఘాలకు రూ. 240 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. -
రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి
భూపాలపల్లి: భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సంకీర్త్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం అని, మహనీయులు ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా మనం స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవిస్తున్నామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో ఘనంగా ప్రగతి సాధించిందని, ఆర్థిక, సాంకేతిక వృద్ధి సాధించామని ఎస్పీ అన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
బీఆర్ఎస్ది కమీషన్ల రాజకీయం
భూపాలపల్లి అర్బన్: కమీషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. కమీషన్లు రావని డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో రూ.2కోట్లతో బంజార భవనం, రూ.10కోట్లతో సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పేదవాడికి ఇళ్లు, మహిళలకు భరోసా వంటి ఎన్నో చార్రితక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుంటే కొందరు రాజకీయంగా దివాళా తీసిన నేతలు అబద్దాలు, దుష్ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఒకసారి కాదు, రెండు సార్లు తగిన గుణపాఠం చెప్పారని మూడో సారి కూడా తిప్పి కొట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఇచ్చిన మాటలను చేతల్లో చూపే ప్రభుత్వమని అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. జిల్లా రద్దు చేస్తారని వస్తున్న అసత్య వార్తలు ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, శ్రీదేవి, వైస్ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు. హామీలను నెరవేరుస్తున్నాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
మేడారం జాతర బస్సు ప్రారంభం
మల్హర్(కాటారం): కాటారంలో మేడారం జాతర స్పెషల్ బస్సును భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో డీఎం బస్సును ప్రారంభించి మాట్లాడారు. మేడారం జాతర కోసం ఏర్పాటుచేసిన బస్సును మేడారానికి వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్వైజర్లు రాంప్రసాద్, జీఆర్రెడ్డి, సర్పంచ్లు పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వరరావు, కాటారం ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య, మానేం రాజబాపు, బుర్ర లక్ష్మణ్, మంత్రి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రథసప్తమి పూజలు
అభిషేకం చేస్తున్న అర్చకుడు ఫణీంద్రశర్మ పూజలో పాల్గొన్న భక్తులుకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమిని పురస్కరించుకొని వైభవోపేతంగా పూజలు చేశారు. ఆదివారం ఉదయం దేవస్థానం ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకం, అరుణ పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేకంగా పూలతో అలంకరణలు చేశారు. అనంతరం, పూజలో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, స్వా మి మహా ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రత్యేక అలంకరణలో సూర్యనారాయణస్వామి -
దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
భూపాలపల్లి రూరల్: మున్సిపాలిటీ అభివృద్ధిపై కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మున్సిపాలిటీలోని సుభాష్కాలనీ, రాజీవ్నగర్ కాలనీలో పల్లె దవాఖానాలను డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాలంలో చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలో ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో మేడారం బస్సు పా యింట్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. డిపో నుంచి 80 బస్సు సర్వీసులు మేడారం జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎం ఇందూ, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, వార్డు ఇన్చార్జ్లు, పార్టీ కారకర్తలు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఆర్యూపీపీటీఎస్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా కడెం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా పెనుకుల యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. పండితుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని నూతన కమి టీ సభ్యులు తెలిపారు. వేముల రవికుమార్, పోతుల మురళీధర్, కత్రోజు వెంకటేశ్వర్లు, మడిపల్లి రమేష్, కొలిపాక శ్రీనివాస్, గుండు రమేష్, అశోక్, పూర్ణచందర్లు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ధ్వంసం చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో ధ్వంసం చేసిన శిలాఫలకాలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంజూరు చేసి శంకుస్థాపన చేసిన హెల్త్ వెల్నెస్ సెంటర్ పనులకు సంబంధించిన శిలాఫలకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తామననడం కక్ష్యపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. వారి వెంట స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు పవిత్రమైనది
భూపాలపల్లి అర్బన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, అర్హత కలిగిన ప్ర తీఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పిలు పునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఆదివారం నిర్వహించిన 16వ జాతీ య ఓటరు దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేసి, సీనియర్ సిటిజన్ ఓటర్లను సత్కరించారు. ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థుల సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలరన్నారు. యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన బీఎల్ఓ, సూపర్వైజర్లు చేంజ్, ఆపరేటర్లుకు ప్రశంసపత్రాలు అందించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
చదువులు సాగేదెలా!
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు భూపాలపల్లి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), పాఠశాలల తనిఖీ బృందాల్లో ఉపాధ్యాయులు కొన్ని రోజులుగా పాఠశాలలకు దూరంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ పరీక్ష ఉండడంతో ఉపాధ్యాయులు తీరికలేకుండా ఉన్న తరుణంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులకు శిక్షణ, ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 69 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2,739 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదోతరగతి విద్యార్థులకు జనవరిలోగా సిలబస్ పూర్తిచేసి రివిజన్(పునఃశ్చరణ) తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం, వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. పరీక్షల్లో అవగాహన పెంచుకునేందుకు రోజువా రీగా స్లిప్ టెస్ట్తో పాటు వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన కల్పించాలి. కాని వరుసగా వస్తున్న ఎన్నికలు నాయకులకు, అభ్యర్థులకే కాకుండా విద్యార్థులకూ ఓ పరీక్షలా తయారయ్యా యి. ఇటు ఎన్నికల శిక్షణ, అటు టెట్ పరీక్షలకు సంసిద్ధం కావాల్సి ఉండడంతో ఉపాధ్యాయులు కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్నో తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికలు రావడం మరింత ఇబ్బందిగా తయారైంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వార్షిక పరీక్షలకు ప్రణాళికలతో సన్నద్ధం చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడం ఫలితాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పరీక్షల వేళ తనిఖీ బృందాలా? పరీక్షల సమయం దగ్గర పడుతున్న వేళ జిల్లాలో పాఠశాలల తనిఖీకి ప్రభుత్వం ఉపాధ్యాయులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. పాఠశాలలకు వెళ్లకుండా పూర్తి డిప్యూటేషన్పై ఈ బృందాలు ప్రతీ రోజు పాఠశాలల తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయి బృందాలు రోజుకు రెండు, ప్రామికోన్నత, ఉన్నత పాఠశాలలు రోజుకు ఒక పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, తరగతి విద్యా బోధన, ఎఫ్ఎల్ఎన్, లీప్ కార్యక్రమాల అమలు తీరు, ఇతర వినూత్న కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. తనిఖీ బృందం వచ్చే వరకు పాఠశాలలో ఉపాధ్యాయులు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమవుతున్నారు. దీంతో పాఠశాలల్లో విద్యాబోధన స్తంభించింది. ఆ తర్వాత టెట్ ప్రిపరేషన్ త్వరలో మున్సిపల్ ఎన్నికల శిక్షణ, విధులు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు ఆటంకాలు ‘పది’ ఫలితాలపై ప్రభావంవిద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. దీంతో విద్యాబోధనకు అవాంతరాలు ఎదురయ్యాయి. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, దసరా సెలవులు రావడంతో బోధన అంతంత మాత్రంగానే సాగింది. అంతలోనే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ ఉపాధ్యాయులకే విధులు కేటాయించారు. తర్వాత సంక్రాంతి సెలవులు రావడంతో ఇలా పలు కారణాలతో చదువులు సాగలేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో చదువులు సరిగా సాగక విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారో అన్న భయందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నికల ప్రభావంతో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. -
నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తంకారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి -
మేడారానికి పోటెత్తిన భక్తులు
ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకు భక్తుల తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకం, భక్తిగీతాల ఆలాపాన, భక్తుల సందడితో జంపన్న వాగు కోలాహలంగా మారింది. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె సమర్పించి చల్లగా చూడాలని భక్తులు తల్లులను వేడుకున్నారు. అనంతరం అడవిలో చెట్లకింద వంటలు వండుకొని భోజనాలు చేశారు. మేడారంలో కలెక్టర్ దంపతులు భూపాలపల్లి రూరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ వీరస్వామి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎత్తు బంగారం సమర్పించారు. దర్శించుకున్న వారిలో కలెక్టర్ దంపతులతో పాటు కలెక్టర్ తల్లిదండ్రులు ఉన్నారు. ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శనివారం శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీడీఓ శైలజ మాట్లాడుతూ బాలిక కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగే వరకు వారికి సంక్షేమ శాఖ అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా బాలికలకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. జెండర్ స్పెషలిస్ట్ అనూష మాట్లాడుతూ పిల్లలలో ఏకాగ్రత, పోటీతత్వం, సమన్వయం తప్పకుండా ఉండాలన్నా రు. బాలికలు వివక్షకు గురైతే ప్రశ్నించాలన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన బాలికలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది మమత, సురేష్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ ఎంపీ కావ్య ● జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం భూపాలపల్లి/మొగుళ్ళపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మొగుళ్లపల్లి మండలం పాత ఇస్సిపేటలో రూ. 13.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదాం నిర్మాణానికి శనివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ఇందుర్తి ఓంకార్కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ వద్ద మూడు కూడళ్ల అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. తదుపరి భారత్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు దక్కలేదని, తమ ప్రభుత్వం మొదటి దఫాలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. సన్నబియ్యం పథకానికి రూ.13వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ కింద రూ.3వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. భూపాలపల్లికి రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, టూరిజం హబ్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడానని, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేయించానని, డీపీఆర్ దశలో ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయించానన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్’కు అంతా సిద్ధం
భూపాలపల్లి: ఎన్నికల నిర్వహణకు అధికారులు భూపాలపల్లి మున్సిపాలిటీలో సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేయడంతో పాటు సరిపడా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందిని ఎంపిక చేయగా, త్వరలోనే వారికి శిక్షణ అందించనున్నారు. 86 పోలింగ్ కేంద్రాలు.. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 26,786, మహిళా ఓటర్లు 25,936, ఇతరులు నలుగురు.. మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉన్నారు. 30 వార్డులకు గాను 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తక్కువ ఓటర్లు ఉన్న వార్డుల్లో రెండు, ఎక్కువ ఉన్న చోట మూడు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. 204 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా మరో 90 బాక్సులను అదనంగా సిద్ధంగా ఉంచారు. 14 మంది నోడల్ ఆఫీసర్ల నియామకం.. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 14 మంది నోడల్ అధికారులను నియమించారు. జోనల్ ఆఫీసర్లుగా ఆరుగురు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా 12, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 12 మంది, పీఓలు 102, ఓపీఓలు 306 మంది, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, స్టాటిటిక్స్ సర్వేలెన్స్ టీంలు 4, ఎంసీసీ టీంలు రెండు, ఎక్స్పెండేచర్ అబ్జర్వర్గా ఒక టీంతో పాటు పోలీసు సిబ్బంది 150 మంది విధులు నిర్వర్తించనున్నారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనుండగా, 27 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించనున్నారు. సమస్యాత్మక కేంద్రాలు 19.. మున్సిపాలిటీలో 86 పోలింగ్ కేంద్రాలు ఉండగా సున్నితమైనవి 23 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో చిన్నచిన్న అల్లర్లు జరిగిన, పార్టీల నాయకుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని భావించే 19 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ ప్రక్రియను క్రిష్ణాకాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్నారు. వార్డులు 30, పోలింగ్ స్టేషన్లు 86, ఓటర్లు 52,726 మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కౌంటింగ్ కేంద్రం.. క్రిష్ణాకాలనీ కమ్యూనిటీ హాల్ ఏర్పాట్లు పూర్తిచేస్తున్న మున్సిపల్ అధికారులు -
కంప్యూటర్ విద్యపై దృష్టి సారించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు భూపాలపల్లి అర్బన్: మారుతున్న ఆధునిక సమాజంలో బాలికలకు కంప్యూటర్ విద్య అనివార్యమని.. దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగేడు కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సమస్య సెల్ఫోన్ అడిక్షన్ అని, అవసరానికి మించి ఫోన్ వాడకూడదని సూచించారు. ప్రతీ విద్యార్థినిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, స్వీయ క్రమశిక్షణతో దాన్ని వెలికితీసుకొని ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థినులు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సంస్థ విద్యార్థినులకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ శైలజ, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి, ఎస్సై రవళి పాల్గొన్నారు. -
మునీందర్ ఇంటి నుంచే పాన్పు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026లక్షలాది మంది భక్తులు.. తల్లులను కీర్తిస్తూ జయజయధ్వానాలు.. డోలు వాయిద్యాలు.. కొమ్ము బూరల నాదాలు.. సుగంధ ధూపాల పరిమళాలు.. వీటన్నింటి నడుమ శక్తి స్వరూపాలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే ఆ చేతులు మరెంతో శక్తివంతమైనవి.. ఎన్ని పదవులు అధిరోహించినా, ఎంత ధనమున్నా అంతటి అదృష్టం ఆ అడవి బిడ్డలకు మాత్రమే దక్కుతుంది. తల్లులను గద్దెకు చేర్చడంలో ఆదివాసీ పూజారుల పాత్ర కీలకం. నిష్టతో వనదేవతల సేవలో లీనమైన దాదాపు 25 మంది పూజారులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయిఅడవి తల్లులను వనంలోంచి జనంలోకి తీసుకువచ్చే పూజారులది ఎంతో అదృష్టం. సుమారు 25 మంది పూజారులు ఈ మహా ఘట్టంలో పాలుపంచుకుంటుండగా ప్రధానంగా సారలమ్మ పూజారులు ఆరుగురు, సమ్మక్క పూజారులు ఐదుగురు కీలక పాత్ర పోషిస్తారు. కన్నెపల్లి గుడిలోని సారలమ్మను పూజారి కాక సారయ్య ఈనెల 28న గద్దైపెకి తీసుకురానున్నారు. కాళ్లకు పారాణి ధరించి ఎర్రని వస్త్రాల ముసుగుతో అమ్మవారి రూపంలో వెదురుబుట్టలో అమ్మవారిని తీసుకుని కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు బయల్దేరుతారు. అమ్మవారిని తీసుకొచ్చే ఉదయాన ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్ని మాత్రమే సారయ్య ధరిస్తాడు. తండ్రి వారసత్వంగా ఈ బాధ్యతను సారయ్య గత 8 జాతరల ముందు నుంచి నిర్వర్తిస్తున్నాడు. కాకవంశ పూజారులు అమ్మవారి వెదురు బుట్ట సారయ్య చేతులోకి అందివ్వగానే ఆయనను అమ్మవారు ఆవహిస్తుంది. మిగతా పూజారులు ఆయనను పట్టుకొని గద్దెల వరకు తీసుకొస్తారు. గద్దైపె ప్రతిష్ఠించేంతవరకు ఆయన స్పృహలో ఉండరు. సారలమ్మను తీసుకొస్తున్న కాక సారయ్య(ఫైల్)సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క దేవతకు చేయాల్సిన పూజా క్రతువు, సామగ్రి అంతా ఈ ఇంటి నుంచి వెళ్తుంది. సమ్మక్కను తీసుకురావడానికి ముందుగా మునీందర్ ఇంటి వద్ద పసుపు, కుంకుమ, కంకణాలు, నైవేద్యం, ఊదు, అక్షింతలు, పసుపు బియ్యం, ఇతరత్రా పూజారులకు పూజా సామగ్రి (పాన్పు)ని తయారు చేసుకుని వెళ్తారు. మేడారం సమ్మక్క జాతరలో జరిగే ఏ పూజా కార్యక్రమం అయినా ఈ ఇంటి నుంచి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని మునీందర్ చెబుతున్నాడు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు (ఫైల్)చిలకలగుట్ట నుంచి ధూపం లేనిదే అమ్మవారు గుట్ట దిగదు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం వడ్డె దొబె నాగేశ్వర్రావు ధూపదీప నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. గుట్ట పైనుంచి గద్దెకు చేరే వరకు అమ్మవారికి వడ్డె.. ధూపం వేస్తూనే ముందుకు సాగుతాడు. -
‘మేడారం’ ప్రయాణం దూరమే!
కాళేశ్వరం: మేడిగడ్డ బరాజ్ మీదుగా వాహనాలు రాకపోకలు నిలిపివేయడంతో తెలంగాణ కుంభమేళా మేడారానికి వచ్చే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులు ఇబ్బందులు పడనున్నారు. కనీసం 40 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భక్తులకు రవాణా కష్టాలు.. దూరభారం పెరగడం తప్పేలా లేదు. మేడారం జాతరం ఈనెల 28 నుంచి 31 వరకు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం లైట్ మోటార్ వాహనాలు, టూవీలర్స్కు అనుమతివ్వాలని భక్తులు కోరుతున్నారు. ఎన్డీఎస్ఏ సూచనలతో.. మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగిపోవడంతో రాకపోకలను ఎన్డీఎస్ఏ సూచనలతో ఇంజనీరింగ్ అధికారులు నిలపేశారు. అప్పటి నుంచి బరాజ్ భద్రత ప్రమాణాల నేపథ్యంలో రాకపోకలను కట్టడి చేశారు. కొన్ని రోజుల పాటు టూ, ఫోర్ వీలర్స్ అనుమతి ఇచ్చినప్పటికీ ఆ తరువాత ఇరిగేషన్, పోలీసుశాఖలు నిలిపివేశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని భక్తులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులపై నిర్మించిన వంతెనల గుండా ప్రతి జాతరకు మేడారం తరలి వస్తుంటారు. ప్రస్తుతం రాకపోకలకు అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ మీదుగా అనుమతి లేక ఇబ్బందులు అనుమతిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులకు మేలు వారం పాటు అనుమతివ్వాలని వేడుకోలు -
శక్తిని ప్రసాదించే జలకం..
సమ్మక్క తల్లి గుట్ట దిగే సమయం నుంచి గద్దెలకు చేరే వరకు జలకపు వడ్డె మల్లెల సత్యం పూజారులతో కలిసి ముందుకు సాగుతాడు. తొమ్మిది రకాల పానీయాలతో జలకాన్ని ప్రత్యేకంగా పూజారులు తయారు చేస్తారు. ఈ జలకాన్ని సమ్మక్క పూజారుల వడ్డె మల్లెల సత్యం చేతుల పట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న కృష్ణయ్యతో కలిసి ముందుకు సాగుతాడు. జలకం చల్లితేనే అమ్మవారు ముందుకు కదులుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే కృష్ణయ్య ఎక్కడా నీరస పడకుండా జలకాన్ని దప్పికగా అందిస్తారు. దీంతో ఆయన మరింత శక్తిని పుంజుకుని ముందుకు సాగుతాడు. డోలు దరువుతో తల్లుల యాత్ర షురూ.. సమ్మక్క–సారలమ్మను వారి స్థలాల నుంచి గద్దెలపైకి తీసుకురావాలంటే డోలు దరువు ఉండాల్సిందే. డోలు శబ్దాలు ధ్వనిస్తుంటే పూనకాలతో తల్లుల యాత్ర జోరుగా సాగుతుంది. అమ్మలు వచ్చే తరుణంలో ఒక్క క్షణం ఆగకుండా కళాకారులు డోలు వాయిస్తారు. అలసట లేకుండా కళాకారులు అమ్మవారి శక్తిని ప్రసాదించుకుని వాయిస్తారని పూజారులు చెబుతున్నారు. -
సరస్వతి మహాభాగే
కాళేశ్వరం: చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమిని పురస్కరించుకొని కాళేశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు రామకృష్ణ, బైకుంఠ పాండా, శరత్చంద్ర, పవన్శర్మ, శ్రావణ్కుమార్, రాధాకృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అంతకుముందు సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పట్టువస్త్రాలతో ముస్తాబు చేసి పూలతో అలంకరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలను దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయం తరఫున పలక, బలపాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. దీంతో ఆలయం ఆవరణలో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ప్రసాదం వితరణ చేఽశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వీఐపీఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతిమాత విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎస్.మహేష్, మాజీ దేవస్థానం ధర్మకర్త అశోక్, మాజీ సర్పంచ్ మాధవి, భక్తులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో వసంత పంచమి ప్రత్యేక పూజలు ఆలయంలో సామూహిక అక్షరస్వీకారాలు -
మేడారం.. గుడారం
మేడారంలో వెలిసిన గుడారాలుఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్ కవర్లు, గ్రీన్ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు. మేడారం ఇప్పడు మెగాసిటీ మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్ చార్జింగ్, రెడీ టు ఫుడ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు సందడి.. జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో గుడారాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. జోరుగా వ్యాపారాలు మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్డ్రింక్స్, వాటర్, రెస్టారెంట్ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రెండేళ్లకోసారి ఉపాధి మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటి ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను ఇంటి కుటుంబ సభ్యుల లాగానే చూసుకుంటాం. – సంకెపల్లి జైపాల్రెడ్డి, రెడ్డిగూడెం వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించిన వ్యాపారులుమేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు. -
నేడు మంత్రి తుమ్మల రాక
భూపాలపల్లి రూరల్: నేడు (శనివారం) జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 11:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సుందరీకరణ పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. నేడు డయల్ యువర్ డీఎం భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ సమస్యలపై నేడు (శనివారం) డయల్ యువర్ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం ఇందూ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుస్తులు, విద్యార్థులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 99592 26707 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని భూపాలపల్లి జిల్లా జడ్జి సీహెచ్.రమేష్బాబు, ములుగు జిల్లా జడ్జి సూర్యచంద్రకళ, సీనియర్ సివిల్ జడ్జి కన్యాలాల్ దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ రాజగోపురం వద్ద వారిని ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద జడ్జిలకు అర్చకుడు వెల్ది శరత్చంద్ర శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట ఎస్సై తమాషారెడ్డి తదితరులు ఉన్నారు. మొగుళ్లపల్లి: జాబ్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉపాధిహామీ పని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడిక తీత పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పని వద్ద తప్పని సరిగా నీడ, తాగు నీరు, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. జాతర పనుల పరిశీలన మొగుళ్లపల్లి–ముల్కలపల్లి మధ్యలో సమ్మక్క సారళమ్మ జాతర ప్రాంగణంలో జరిగే అభివృద్ధి పనులు, ఏర్పాట్లను జాతర ప్రత్యేకాధికారి బాలకృష్ణ పరిశీలించారు. సర్పంచ్ విజయ, అధికారులతో మాట్లాడారు. -
ఊరూరా మొక్కులు
కాళేశ్వరం: రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందుగా గ్రామాల్లో మొక్కుల సందడి నెలకొంది. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే ఆనవాయితీతో ఊరూరా ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. కుటుంబసమేతంగా భక్తులు కొత్త దుస్తులు ధరించి కిరాణా దుకాణాల వద్దకు చేరుకొని తూకాలతో బెల్లాన్ని కొని మొక్కులు చెల్లిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతుల మధ్య బెల్లం బుట్టలను తలపై మోసుకుని భక్తులు ఇంటికి చేరి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అనంతరం ప్రసాదంగా బంధువులు, పొరుగువారికి పంపిణీ చేస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణం, వ్యాపార వృద్ధి వంటి కోర్కెలు తీరిన భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉన్నందున ఇంటి వద్ద భక్తులు ముందుగా మొక్కులు చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలు.. మేడారం జాతర నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బెల్లం విక్రయాలకు డిమాండ్ భారీగా పెరిగింది. కిలో బెల్లం ధర రూ.50–60 వరకు పలుకుతోంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పెద్దఎత్తున బెల్లం నిల్వలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కొందరు గుడుంబా తయారీదారులు కూడా బెల్లం విక్రయాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత అధికారులు అటు వైపు చూడాల్సిన అవసరం ఉంది. కొబ్బరికాయలకు డిమాండ్.. జాతర ముందస్తు మొక్కుల కారణంగా కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఒక్కో కొబ్బరికాయ ధర రూ.35–50 వరకు చేరింది. సంక్రాంతి కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేకలు, కోళ్లకు భారీ డిమాండ్ జాతర సందర్భంగా మేకలు, కోళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. స్థానిక మేకలు సరిపోక రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. మామూలు సమయంలో 10వేల లోపు దొరికే మేకలు ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఉండే ఒక మేక ధర రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోంది. కోళ్ల ధరలు కూడా అమాతం పెరిగాయి. బాయిలర్ కోడి కిలో రూ.220, జుట్టు కోడి రూ.220, నాటు కోడి కిలో రూ.600 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు మద్యం.. జాతర వేళ బంధువులు, సన్నిహితులను పిలుచుకుని విందులు ఏర్పాటు చేయడంతో మద్యం దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. బెల్టు దుకాణాలకు మరో దసరా, సంక్రాంతి, కొత్త సంవత్సరం సీజన్లు ఒకేసారి కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. జాతరకు వారం రోజుల ముందే గ్రామాల్లో కోలాహలం మొదలవడంతో మేడారం జాతర సందడితో గ్రామాల్లో జోష్ నింపుతోంది. పెరిగిన బెల్లం, కొబ్బరికాయలు, మేకలు, మద్యం ధరలు కిటకిటలాడుతున్న కిరాణా దుకాణాలు పట్టణాలు, గ్రామాల్లో సమ్మక్క భక్తుల రద్దీ -
రవాణాపరంగా ఇబ్బందులు రావొద్దు
భూపాలపల్లి: మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తులకు రవాణాపరంగా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాటారం నుంచి మహా ముత్తారం వరకు, భూపాలపల్లి నుంచి గొల్లబుద్ధారం వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్డు వెడల్పు, సైన్బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమలాపూర్లో జరుగనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రవాణా నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ


