breaking news
Jayashankar
-
తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్కుమార్, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్కుమార్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇల్లు స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్కుమార్ను అందరూ అభినందిస్తున్నారు. లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన నక్కపల్లి ప్రసాద్ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చెల్లెళ్లను ఉన్నత చదువులు చదివించాడు. అతడి చెల్లెళ్లు రాజేశ్వరి, అరుణ పెళ్లిళ్లు చేశాడు. అమ్మానాన్నల లోటు లేకుండా పెంచి పెద్ద చేసిన అన్న ప్రసాద్ అంటే వారికి ఎనలేని ప్రేమ. ఎక్కడున్నా అన్నకు ప్రతీ ఏడాది రాఖీ కడతారు. చెల్లెళ్లకు సైతం ప్రసాద్ తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన దుబ్బాక శ్రీనివాస్కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు. డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంక్ స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీపాద వెంకటేశ్వర్లు, సరోజ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు శ్రీపాద సురేశ్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ప్రతీ సంవత్సరం పర్వతగిరికి వస్తుంటాడు. మిగిలిన నలుగురు అన్నదమ్ములు సతీశ్, రఘు, రవి, రాము పర్వతగిరికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు. ఐదుగురు అన్నదమ్ములంటే తనకు ప్రాణమని ఏటా వారికి రాఖీ కడతానని ప్రియాంక చెబుతోంది. తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి -
స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకం
మొగుళ్లపల్లి: మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మండల పరిధిలోని రంగాపురం, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, ఎల్లారెడ్డిపల్లి, కోర్కిశాల, గణేశ్పల్లి గ్రామాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన వీవో భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే మొగుళ్లపల్లి, రంగాపురం, ఆకినపల్లి గ్రామాల్లోని రైతువేదికల్లో స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణారావు మాట్లాడుతూ వీవో భవనాల నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తోందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ సుభాశ్చంద్రబోస్, ఏపీఎం రమాదేవి, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీనిచ్చి 30 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడంతో పాటు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ నాలుగు నెలలుగా హెల్త్ స్కీమ్ సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ స భ్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నంబర్ 25తో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యారంగంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, శ్రీనివాసరావు, రాజకుమార్, తిరుపతి, అజహర్, శ్రీనివాస్, శ్రీదేవి ప్రవీణ్, సాంబశివరావు, కిరణ్ కుమార్, నక్క తిరుపతి, దశరథ రామారావు, షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, మురళీధర్రెడ్డి, కుమారస్వామి, మందల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా -
ఏరియా స్పోర్ట్స్ క్రీడల కమిటీ నియామకం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో 2026–27 సంవత్సరానికి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(డబ్ల్యూపీఎస్) క్రీడల కమిటీని గురువారం ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన నియమించారు. స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా ఏరియాలోని కేటీకే ఓసీ–3కి చెందిన ఫిట్టర్ జి.నాగేశ్వర్రావు, జనరల్ కెప్టెన్గా కేటీకే–5వ గనికి చెందిన సీహెచ్ ప్రసాద్ను నియమించినట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్.శ్యాంసుందర్ తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.శ్యాంసుందర్, ప్రధాన సమన్వయకర్తగా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, గౌరవ కార్యదర్శిగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎం.సాయికృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్లను నియమించారు. ఫుట్బాల్కు టి. పురుషోత్తం, హాకీ బి.విక్రమ్, క్రికెట్ పి.రాజు, కబడ్డీ టి.గణేశ్, వాలీబాల్ లక్ష్మణ్, బాల్ బ్యాడ్మింటన్ టి.తిరుపతి, బాస్కెట్బాల్ ప్రణయ్, లాన్ టెన్నిస్ శ్రీరాములు, క్యారమ్ ఎంవీ.రావు, చెస్ జి.రాజ్కుమార్, టేబుల్ టెన్నిస్ ఆకుల శ్రీనివాస్ తదితరులు ఎంపికయ్యారు. -
అర్హులందరికీ ఓటుహక్కు ఉండేలా చూడాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం: అర్హులైన ఓటర్లందరికీ ఓటుహక్కు ఉండేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్ ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో గుర్తించిన అనామలిస్, మ్యాపింగ్ కేసులు, నోటీసుల జారీ విచారణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనల మేరకు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు నెలలుగా సర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సర్లో భాగంగా బూత్స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందించారని తెలిపారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టి ఫారాలను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వివరించారు. డ్రాఫ్ట్ జాబితాలో ప్రధానంగా నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ కేటగిరిల్లో ఉన్న ఓటర్లకు బీఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేస్తామని వారు విచారణ హాజరై అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో సుమారు 35వేల అనామలీస్, నో మ్యాపింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. నోటీసులు జారీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో డ్రాఫ్ట్ ప్రక్రియకు ముందు 33,493 మంది ఓటర్లు ఉండగా సర్ ప్రక్రియలో 3,371 ఓట్లు తొలగించడంతో ప్రస్తుతం 30,122 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలో ప్రస్తుతం 36 పోలింగ్ స్టేషన్లు ఉండగా కొత్తగా మరో మూడు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్రావు, స్థానిక సర్పంచ్ కట్కూరి రాధిక తదితరులు పాల్గొన్నారు.భూ రీసర్వేకు చర్యలుభూపాలపల్లి: జిల్లాలో భూదార్ కార్డుల జారీకి చేపట్టిన రీసర్వే పనులకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు 22ఏ నిషేధిత భూములపై అర్జీలు, భూభారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడారు. ఈ నెల 31న రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున అధికారులు పూర్తి సమాచారంతో సన్నద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో గుర్తించిన 70 గ్రామాల్లో రీ సర్వేలో ఖచ్చితమైన కొలతలు నిర్వహించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, సబ్ రిజిస్ట్రార్ బాలకిషన్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ క్రీడా దినోత్సవంపై వర్చువల్ కార్యక్రమం
భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి కే సాత్’ వర్చువల్ కార్యక్రమాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మోదీ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు సైతం సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రఘు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, మై భారత్ ప్రోగ్రాం ఆర్గనైజర్ సురేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కవిత, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
విజయగణపతితో మొదలు..
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం రాతి కట్టడాలకు ఒక్కో అడుగు పడుతోంది. ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా పాత ఆలయాల తొలగింపు పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. డ్రాయింగ్, డిజైన్లలో స్వల్ప మార్పులు, చేర్పుల తర్వాత మార్కింగ్లు మొదలు పెట్టారు. పడమర, దక్షిణ గోపురాల మధ్య నైరుతి మూలన పూర్వం నుంచి ఉన్న విజయగణపతి ఆలయం స్థలంలోనే గురువారం మళ్లీ రాతి నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చి ముగ్గుపోశారు. ప్రాకారానికి ముగ్గుపోసి మార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 12 ఫీట్ల మేర లోతు తవ్వకాలు జరిపి దిగువన భూమి నుంచి పైకి కాంక్రీట్, ఇనుముతో బేస్మెంట్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. క్రషర్ పనులు చేపట్టడానికి పక్కనే నీటి ట్యాంకు కూడా నిర్మించారు. ఇప్పటికే గ్రానైట్ స్టోన్, ఇనుము, సిమెంట్, ఇసుకను కాంట్రాక్టర్లు తెప్పించారు. పడమర వైపున నైరుతి నుంచి ఉత్తరం వైపున వాయువ్యం మూల వరకు 12 ఫీట్ల లోతు వరకు ప్రొక్లైయిన్తో తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 360 ఫీట్ల పొడవుతో 280 ఫీట్ల వెడల్పుతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాన ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని గురజపల్లిలో కృష్ణశిలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. చురుగ్గా కాళేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు -
విధులకు సకాలంలో హాజరు కావాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోఎస్ఎస్తాడ్వాయి: వైద్యాధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల పరిధిలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. రోగుల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా అని ఆరా తీశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రోగుల సహాయకులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నివాస ప్రాంతాల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (ఐఆర్ఎస్) చేపడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని నివాస ప్రాంతాల్లో ఐఆర్ఎస్ కవరేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మందుల నిల్వ గదిని తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పంపిణీ చేసే మందుల వివరాలను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఫార్మసీని తనిఖీ చేసిన ఆయన రోగులకు మందులు పంపిణీ చేసే తీరును పరిశీలించారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రేగొండ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట, దుంపిల్లపల్లి, మడతపల్లిలో బుధవారం నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎస్ఓ కిరణ్ కుమార్, డీఎం రాములు, తహసీల్దార్ శ్వేత, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, కోటంచ ఆలయ మాజీ చైర్మన్ సంపత్ రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, పంట పొలంలో కలుపు తీస్తుండగా నాటు బాంబు పేలి తీవ్ర గాయాలపాలైన మండలంలోని గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె స్వర్ణలతను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం చిట్యాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని చల్లగరిగ, జూకల్, గోపాలపూర్, జడలపేట, నైన్పాక, వరికోల్పల్లి, బావుసింగ్పల్లి, ఒడితల, లక్ష్మీపూర్ తండా, పాసిగడ్డ తండా, దూత్పల్లి, కొత్తపేట, గిద్దెముత్తారం, కాల్వపల్లి, అందుకు తండా, చైన్పాక, వెంచరామి, తిర్మలాపూర్, రాంచంద్రాపూర్, ముచినిపర్తి, కైలాపూర్, గుంటూరుపల్లి, చిట్యాల, ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట, చింతకుంట రామయ్యపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాములు, తహసీల్దార్ వసంతరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
● జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డిభూపాలపల్లి అర్బన్: ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఏరియా జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరియా సేఫ్టీ అధికారి మాటూరి రవీందర్ సమావేశానికి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమీక్షలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను జీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. భద్రతే ప్రధానం అనే భావనతో ప్రతీ అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జీఎం తెలిపారు. సమావేశంలో ఏరియా ఇంజనీర్ సాంబశివరావు, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, జీవీటీవీ మేనేజర్ నజీర్, సేఫ్టీ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో ధరల వ్యత్యాసం ఇలా..
భూపాలపల్లి: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న.. ధరలిట్లా మండవట్టె నాగులో నాగన్న అనే ఓ పాత సినిమా పాట ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. నెల రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. కూలీనాలి చేయగా వచ్చిన డబ్బులతో కనీస సరుకులు కొనలేని దుస్థితి నెలకొందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ౖపైపెకి నిత్యావసర సరుకుల ధరలు నెల రోజుల క్రితం వరకు కొంతమేర అదుపులో ఉండగా ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కందిపప్పు, వంటనూనెలు, మసాలాలు, కారంపొడి, ఎండు చేపలు, రొయ్యల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చక్కెర, బొమ్మిడాయల ధరలు మాత్రం డబుల్ అయింది. పెరుగుతున్న ధరలను చూసి పేదలు ఖంగుతింటున్నారు. చక్కెర కిలో రూ.45 నుంచి రూ.70కి.. చక్కెర ధర వ్యాపారులు సైతం ఊహించని రీతిలో పెరిగింది. నెల రోజుల క్రితం వరకు కిలో ధర రూ.42 ఉండగా, అనంతరం రూ.43, 45, 48, రూ.50కి చేరుకొని ఇప్పుడు ఏకంగా రూ.70కి చేరువలో ఉంది. నాణ్యమైన మొదటి రకం చక్కెర రూ.73కు లభిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా స్వీట్లు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సమయంలో చక్కెన ధర పెరగడంతో వ్యాపారులు పలు రకాల స్వీట్ల ధరలను కూడా పెంచేశారు. ఘాటెక్కిన మసాలాలు వారం రోజుల క్రితం కిలో ఇలాచీల కిలో ధర రూ.4,200 ఉండగా, ఇప్పుడు రూ.5 వేలకు చేరింది. అలాగే, ధనియాల ధర నెల క్రితం కిలోకు రూ.160కి విక్రయించగా, ప్రస్తుతం రూ.220కి అమ్ముతున్నారు. అల్లం మాత్రం కొంత ఉపశమనం కలిగించింది. పది రోజుల క్రితం వరకు కిలో రూ.240కి లభించగా ఇప్పుడు కొత్త అల్లం మార్కెట్లోకి రావడంతో రూ.200కే విక్రయిస్తున్నారు. ఎండు చేపలు కొనలేం.. రాష్ట్రంలో సాధారణంగా కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన సమయంలో ప్రత్యామ్నయంగా ఎండు చేపలు, రొయ్యలను ప్రజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి. అంతేకాక పచ్చి వాటిని ఎండబెట్టేందుకు అవకాశం లేదు. దీంతో వాటి ధర డబుల్ అయింది. గతంలో బొమ్మిడాయలు కిలోకు రూ.450 ఉండగా, ఇప్పుడు రూ.900, ఎండు రొయ్యలు రూ.450 కాగా, ప్రస్తుతం రూ.700కు విక్రయిస్తున్నారు. ధర పెరిగినప్పటికీ బొమ్మిడాయలు లభించడం లేదని, నాణ్యత లేనివే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే, మెత్తలు గతంలో రూ.380 నుంచి రూ.400 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.450కి అమ్ముతున్నారు. పండుగల వేళ ధరల మోత శుక్రవారం రాఖీ పౌర్ణమి, అక్టోబర్లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ఈ సమయంలోనే నిత్యావసర సరుకులైన ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మసాలాలు, పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే, ధరలు ఇలాగే కొనసాగితే పండుగల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు తప్పేలా లేవు. శ్రావణం ప్రభావంతో.. మసాలాలు, సరుకుల ధరలు తీవ్రంగా పెరుగుతుండగా శ్రావణమాస ప్రభావంతో కోడిగుడ్లు, చికెన్ ధరలు కొంత మేర తగ్గాయి. పక్షం రోజుల క్రితం వరకు ఒక కోడిగుడ్డును రూ.7కు విక్రయించగా, ఇప్పుడు రూ.6 నుంచి రూ.6.50 వరకు లభిస్తోంది. శ్రావణ మాసానికి ముందు చికెన్ ధర కిలో రూ.320 నుంచి రూ.340 వరకు ఉండగా, ఇప్పుడు విత్ స్కిన్ రూ.240, స్కిన్లెస్ రూ.260కి అమ్ముతున్నారు.సరుకులు పాత ధర ప్రస్తుత ధర (కిలో రూ.లలో) చక్కెర 45 70 ఉల్లిగడ్డ 35 60 ఎల్లిగడ్డ 120 250 పల్లీలు 145 180 వంటనూనె 170 185 కారంపొడి 300 340 కందిపప్పు 120 160 రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల రేట్లు చక్కెర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ పిరం నశాలానికి అంటుతున్న మసాలాలు ఎండు రొయ్యలు, బొమ్మిడాలు కొనలేని పరిస్థితి శ్రావణం ఎఫెక్ట్తో కాస్త తగ్గిన గుడ్లు, చికెన్ వెలలు -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
ఎస్ఎస్తాడ్వాయి/మంగపేట: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో రూ.4.46 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏటూరునాగారం మండలం శివాపూర్లో రూ.80లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, డ్రెయినేజీలు ప్రారంభించారు. గోగుపల్లిలో రూ.55 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటూరునాగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు రూ.2.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా మంగపేట మండలంలో బుధవారం సాయంత్రం మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీఓ భద్రునాయక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. -
మేడిగడ్డకు ప్రాణహిత వరద
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది వరద మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తింది. బుధవారం ఉదయం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి తరలిరాగా, సాయంత్రానికి 1.29 లక్షల క్యూసెక్కులకు తగ్గి మేడిగడ్డకు చేరుతోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిపోయింది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పడుతున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. నేటి నుంచి గ్రామసభలు ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ములుగు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని వివరించారు. పేరు లేకపోయినా, కొత్త ఓటరు కావాల్సిన వారికి ఫామ్ 6తో దరఖాస్తు చేయాలని, ఫామ్ 7 సవరణలు, ఫామ్ 8 ద్వారా బదిలీ చేపట్టాలని వెల్లడించారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలని కోరారు.రామప్పలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యంగార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళకు తలమానికం రామప్ప దేవాలయమని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించి బోటింగ్ చేశారు. వారివెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూ రిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దేవాదాయ, పురా వస్తు,టూరిజం శాఖల అధికారులు ఉన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి ములుగు: జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్శాఖ ఏఈకి వినతి పత్రాన్ని కాలనీ వాసులు బుధవారం విద్యుత్శాఖ కార్యాలయం వద్ద బుధవారం అందజేశారు.కృష్ణకాలనీలోని 15వ వార్డులో లోవోల్టేజీ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని వార్డు కౌన్సిలర్ వాణికుమార్ ఏఈకి వివరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు సంపత్, గండ్రకోట కుమార్, రమేశ్, నాగేశ్వర్రావు, సుధాకర్, శంకర్, కుమార్, సంపత్, ఇక్బాల్ పాల్గొన్నారు. రాఖీ మహోత్సవం ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయిపల్లికి చెందిన సంతోష్, రాజేందర్, సమ్మయ్య తదితరుల ఆధ్వర్యంలో బుధవారం రాఖీ మహోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు 1200 మందికి కట్టించి రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్కుమార్ తెలిపారు. పాఠశాలల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు. -
35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
భూపాలపల్లి అర్బన్: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో పట్టణంలోని సీఆర్ నగర్కాలనీకి చెందిన పావనపు రాజు (డ్రైవర్), నీలుగొండ రమేష్ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం కేసును పోలీస్ స్టేషన్కు అప్పగించారు. -
ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు
● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్మల్హర్ (కాటారం): కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలోని గొంతెమ్మ గుట్టపై ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చీఫ్ కన్జర్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి గొంతెమ్మ గుట్టను ఆయన బుధవారం సందర్శించారు. ట్రెక్కింగ్ చేసి గుట్టపైకి చేరుకున్నారు. గొంతెమ్మ గుట్ట చరిత్ర, పర్యాటక విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాచీన ఆనవాళ్లు, ప్రాముఖ్యంపై ఆరా తీశారు. పర్యాటకం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, పర్యాటకుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ ప్రభాకర్ మాట్లాడుతూ గొంతెమ్మ గుట్టను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం, వన మహోత్సవంలో భాగంగా ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో అధికారులతో కలిసి పలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహాదేవపూర్, భూపాలపల్లి ఎఫ్డీఓలు సందీప్, అప్పలకొండ, ఎఫ్ఆర్ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, ఎఫ్బీఓలు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. నిట్తో ఎంఓయూ..ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తాయి. రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది.నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ -
మళ్లీ ‘లేఖల’ లొల్లి?
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో ఇన్స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భూపాలపల్లిలో కీలక మార్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్బీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి ఎస్హెచ్ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్ను మల్టీజోన్–1, హైదరాబాద్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్ చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఇదే జోన్ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. వరంగల్కు ముగ్గురు.. ఒకరు బయటకు.. వరంగల్ కమిషనరేట్కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, రామగుండం కమిషనరేట్ లీగల్ సెల్లో పనిచేస్తూ మల్టీజోన్–1 కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉన్న అనుముల శ్రీనివాస్ను కూడా వరంగల్ కమిషనరేట్కు పంపారు. హైదరాబాద్ టీజీఐసీసీసీ ఇన్స్పెక్టర్ భరత్ సుమన్ను కూడా కమిషనరేట్లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్ కమిషనరేట్ సీఎస్బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్కు బదిలీ చేశారు. ‘లేఖ’ ఎవరిది.. పోస్టింగ్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్, కమిషనరేట్ లేదా కీలక విభాగంలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టీజోన్–1 పరిధిలోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్ల కోసం మరికొందరు ఇన్స్పెక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్ కమిషనరేట్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్ల నుంచి కొందరు వరంగల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’ మల్టీజోన్–1 పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్ మారింది? అన్నదానిపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మల్టీజోన్–1లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ కమిషనరేట్కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు.. గతంలోనూ ఇదే తరహా వివాదాలు -
సీఈఆర్ క్లబ్ అభివృద్ధికి చర్యలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి సీఈఆర్ క్లబ్ను అభివృద్ధి చేసి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలో సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులతో జీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్లోని మౌలిక సదుపాయాల మెరుగుదల, అవసరమైన మరమ్మతులు, కొత్త సౌకర్యాల కల్పన, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. క్లబ్ను మరింత ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. అనంతరం సీఆర్ క్లబ్ కమిటీ సభ్యులు జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి కృష్ణ, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతేల్లి మధుకర్రెడ్డి, సీఈఆర్ క్లబ్ సంయుక్త కార్యదర్శి కాపు చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శ్రీనివాస్, మధిర కొమరయ్య, క్రీడల కెప్టెన్ పాక శ్రీనివాస్, సాంస్కృతిక కెప్టెన్ అడిచెర్ల శ్రీనివాస్, శ్రీనివాసరావు, తాజుద్దీన్ పాల్గొన్నారు. ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి -
అనుమతుల చర్యలు వేగవంతం
భూపాలపల్లి: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలు వల నిర్మాణానికి సేకరించిన భూముల యజమానులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించడం, అటవీ శాఖ సంబంధిత అనుమతుల చర్యలు వేగవంతం చేశామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్తో కలిసి రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్లో ఐడీఓసీ నుంచి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, భూ సేకరణ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. పర్యాటకంగా తీర్చిదిద్దుతాం.. తెలంగాణను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డా లర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడంలో పర్యాటక రంగాన్ని కీలక భాగస్వామిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. మంగళవారం హైదరా బాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి పర్యాటక ప్రాంతాలు గుర్తింపు, విజన్ 2047 కార్యాచరణ అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, పర్యాటక అధికారి రఘు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
మరణానంతరం ఇద్దరికి చూపునివ్వొచ్చు
భూపాలపల్లి అర్బన్: నేత్రదానం చేయడం ద్వారా మరణానంతరం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. 41వ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేత్రదానం ఒక కుటుంబ సంప్రదాయంగా మారాలని, సమాజంలో నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశం అనంతరం ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సందీప్, డాక్టర్ రాహుల్, ఆప్తాలమిక్ అధికారి బూరుగు రవికుమార్, సత్యనారాయణ, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, హెచ్ఈఓ మురళీధర్రెడ్డి, జమాలుద్దీన్, సుధీర్ పాల్గొన్నారు. ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి -
నిష్పక్షపాతంగా సేవలు అందించాలి
చిట్యాల: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిష్పక్షపాతంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్, చిట్యాల సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్, బ్లూకోల్ట్స్, సీసీ కెమెరాల పని తీరుపై సమీక్షించారు. వనమహోత్సవంలో భాగంగా స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా పర్యవేక్షించాలని, లోపాలు ఉన్న కెమెరాలను వెంటనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. రిసెప్షన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో నవీకరించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ప్రజలకు స్నేహపూర్వకంగా, పారదర్శకంగా సేవలు అందించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, ఎస్సై పోచంపల్లి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డీఎఫ్ఓ కిష్టగౌడ్తో కలిసి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సి పల్ కమిషనర్ ఉదయ్కుమార్, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్భూపాలపల్లి రూరల్: మండల స్థాయి నుంచి గ్రామ, బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడితోపాటు మండల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడారు. సమావేశంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కటకం అశోక్, తాళ్లపల్లి భాస్కరరావు, పున్నం రవి, అనిల్, రఫీ, శీను, జాడి రాజయ్య, రాజేందర్, కృష్ణారెడ్డి, ఓం ప్రకాశ్ పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం అమ్మితే కార్డు రద్దు
రేగొండ: రేషన్ లబ్ధిదారులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం విక్రయిస్తే కార్డులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని పలుగ్రామాల్లో వీఓ బిల్డింగ్లకు శంకుస్థాపన, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు పొందవచ్చని తెలిపారు. అలాగే మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయ సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కార్యక్రమంలో డీసీఎస్ఓ కిరణ్ కుమార్, డీఆర్డీఓ బాలకృష్ణ, తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ సురేష్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓంప్రకాశ్, నాయకులు సంపత్రావు, కిష్ట య్య, మటికే సంతోష్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టల వద్ద మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి.. మానవాళికి అమూల్యమైన వరమని, అడవులు వానవ జీవనానికి ప్రాణాధారమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎఫ్ఓ కిష్టగౌడ్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి అప్పలకొండ, ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రమౌళి, సర్పంచ్ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పచ్చదనమే ప్రగతికి నిదర్శనం
మల్హర్: పచ్చదనమే ప్రగతికి నిదర్శనమని అటవీ శాఖ సీసీఎఫ్ ప్రభాకర్రెడ్డి అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ఆవరణలో ఏఎ మ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీసీ ఎఫ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల ఆవరణలో పచ్చదనం పెంపొందించడం అభినందనీయమని వెల్లడించారు. డీఎఫ్ఓ కృష్టగౌడ్, ఎఫ్ఏఓలు అప్పలకొండ, సందీప్, డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎమ్మార్ సేఫ్టీ మేనేజర్ సురేష్బాబు, తాడిచర్ల సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రాజు పాల్గొన్నారు. సీసీఎఫ్ ప్రభాకర్ -
సీనియర్ సివిల్ జడ్జిని కలిసిన న్యాయవాదులు
భూపాలపల్లి అర్బన్: సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొంది, మంగళవారం భూపాలపల్లి సీనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తాడూరు మహతి వైష్ణవిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కునూరు సురేష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను నూతన సీనియర్ సివిల్ జడ్జికి పరిచయం చేశారు. అనంతరం భూపాలపల్లి కోర్టుల వివరాలు, న్యాయవాదుల వివరాలను తెలియజేస్తూ బార్, బెంచ్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు బార్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కేసుల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆకుల రాములు, న్యాయవాదులు ఇందారపు శివకుమార్, అకినపల్లి రవికుమార్, నాగరాజు, గార్లపాటి ప్రియాంక, కనుకుంట్ల కవిత, మచ్చ వసంత, రజనీకాంత్, అజయ్, రాజు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నది వరద ప్రవాహం పెరిగి మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి మేడిగడ్డకు చేరుతోంది. మంగళవారం మేడిగడ్డ వద్ద 1,44,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిరావడంతో మొత్తం గేట్లు ఎత్తి నీటి ని దిగువకు తరలిస్తున్నారు. రాత్రి వరకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి అవకాశాలకు స్క్రీనింగ్ క్యాంపు భూపాలపల్లి అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం, యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు, కనీసం 10వ తరగతికిపైగా చదివి శారీరక వైకల్యం, వినికిడి లోపం, స్వల్ప చూపులోపం ఉన్నవారు అర్హులని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ఈ శిబిరానికి విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఫోన్ నంబర్లు 73306 37711, 92814 08587 సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జిల్లాలో వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ బీసీ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇంటింటా అటోమేటిక్ ఇందిరమ్మ కుట్టు మిషన్లు నూరు శాతం సబ్సిడీతో అందించేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవ్సరాలనుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన నిరుద్యోగ మహిళలు, పేదలు, వితంతు, ఒంటరి, దివ్యాంగులు, అనాథ మహిళలకు టైలరింగ్ ట్రెయినింగ్ సర్టిఫికేట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తెల్ల రేషన్కార్డుతోపాటు కనీస అక్షరాస్యత 5వ తరగతి పాసైన వారు వెబ్సైట్ http://tgobmms.cgg. gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని కుల, ఆదాయ, నివాసం, ఆధార్, రేషన్ కార్డు, విద్యా అర్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రామీణులు ఎంపీడీఓ కార్యలయం, పట్టణ వాసులు మున్సిపల్ కమిషనర్కు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు. ఇద్దరు సీఐల బదిలీ భూపాలపల్లి: జిల్లాలోని ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) సీఐగా పని చేస్తున్న చెన్నూరి శ్రీనివాస్ను భూపాలపల్లి సీఐగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎస్బీ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న యడ్లపల్లి సతీష్ను చిట్యాల సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం భూపాలపల్లి సీఐగా పని చేస్తున్న డి.నరేష్కుమార్ త్వరలోనే వరంగల్ ఏసీబీకి వెళ్లనున్నట్లు సమాచారం. అలాగే చిట్యాల సీఐగా పని చేస్తున్న డి.మల్లేష్ను మల్టీజోన్ –1 ఐజీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఐలు శ్రీనివాస్, సతీష్ -
27న మహాధర్నా
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న కలెక్టరేట్లో నిర్వహించనున్న మహాధర్నాకు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బూరుగు రవికుమార్, కన్వీనర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ.. మహాధర్నాలో అన్ని భాగస్వామ్య సంఘాలు, యూనియన్ల ప్రతినిధులు తమ సంఘాల బ్యాడ్జీలు ధరించి, నల్ల రిబ్బన్లు కట్టుకుని పాల్గొనాలని కోరారు. 27నుంచి విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న మహాధర్నా–చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని భాగస్వామ్య సంఘాలు, యూనియన్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అశోక్కుమార్కు నిరసన కార్యక్రమాల పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు సుభాకర్రెడ్డి, దశరథ రామారావు, షఫీసర్కార్ పాల్గొన్నారు. టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవికుమార్ -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరుడికి భక్తులు అభిషేకాలు నిర్వహించి అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందచేసి ఆశీర్వచనలు అందచేశారు. తప్పిదాలపై విచారణ జరిపించాలి భూపాలపల్లి రూరల్: జిల్లావ్యాప్తంగా 22(ఏ) నిషేధిత భూముల జాబితాలో చోటుచేసుకున్న తప్పిదాలు, అక్రమ చేర్పులపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ జాబితాలో జరిగిన చేర్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి, గ్రామం, మండలం, సర్వేనంబర్ వారీగా పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి, భూ భారతి తదితర డిజిటల్ భూ రికార్డుల్లో జరిగిన మార్పులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు, నాలుగో వార్డ్ కౌన్సిలర్ కన్నం యుగంధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు, జన్నే మొగిలి, ఎరుకల గణపతి పాల్గొన్నారు. బురద రోడ్డుపై నాట్లువేసి నిరసన రేగొండ: కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రోడ్డుపై గ్రామస్తులు సోమవారం నాటువేసి నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాలు పడటంతో రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. గుంతలలో నీరు నిలిచి కనిపించకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. రోడ్ల దుస్థితిపై అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో సోమవారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రతీ గదిని సందర్శించిన ఎమ్మెల్యే పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. సుమారు 242 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్ నిర్మాణాన్ని వేగవంతం చేసి సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం హాస్టల్ చుట్టూ ప్రహరీతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాలేజీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరితగతిన పరిష్కారించాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకుని, వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, వారి వినతులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 27 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నామి‘లేట్’ పదవులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆ పదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరి కొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొ చ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మా పేర్లు పరిశీలించండి..ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. 47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణి మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు -
నాటు బాంబులు స్వాధీనం
రేగొండ: ఇద్దరు వ్యక్తుల నుంచి నాటు బాంబులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగిర్థిపేట ఆర్చ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి మండలంలోని భాగిర్థిపేట గ్రామానికి చెందిన పసునూటి రమేష్, దేవరకొండ సారంగం పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద ఐదు నాటు బాంబుల లభించాయి. గణ పురం మండలం బుర్రకాయలగూడెం గ్రామానికి చెందిన బుర్ర మల్లయ్య వద్ద అడవి పందుల వేట కోసం కొనుగోలు చేసినట్లు తెలి పారు. వాటిని గూడెపల్లి శివారులోని రాజనర్సయ్య వ్యవసాయ భూమి సమీపంలోని అటవీ ప్రాంతంలో అమర్చినట్లు తెలిపారు. ఈ నెల 22న గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె స్వర్ణలత వ్యవసాయ భూమిలో కలుపు తీస్తుండగా కొడవలి తాకి బాంబు పేలి గాయాలు కాగా మిగతా బాంబులను చెరువులో పడేయడానికి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పోటీల్లో ఆటలివే..
భూపాలపల్లి అర్బన్: పాఠశాల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడలు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, కస్తూర్బా, గురుకుల, మోడల్ స్కూల్స్, ఇంటర్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యాశాఖ నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి గాను షెడ్యూల్ విడుదలైంది. ఈ పోటీల్లో జిల్లాలోని 116 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, 70 ప్రైవేట్ పాఠశాలలు, కేజీవీబీ, మోడల్, గురుకుల, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు పాల్గొనే అవకాశం ఉంటుంది. నాలుగు దశల్లో క్రీడలు వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఎస్జీఎఫ్ క్రీడాపోటీలను నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో మండలస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం నియోజకవర్గ/బ్లాక్ స్థాయి పోటీలు జరుగుతాయి. వీటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు సన్నద్ధమవుతారు. జిల్లాస్థాయిలో రాణించిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. కమిటీ చైర్మన్గా కలెక్టర్ ఈ పోటీలకు ఎస్జీఎఫ్ జిల్లా కమిటీ చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించనున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. అండర్–14, అండర్–17 విభాగాలకు పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ), అండర్–19 విభాగాలకు పీడీలను ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నియమిస్తారు. వీరి కాలపరిమితి రెండేళ్లు కాగా గడువు ముగిసిన వెంటనే కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. జిల్లాలో గత ఏడాదే కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి క్రీడల నిర్వహణపై చర్చించారు. నిధులు సమకూరేదెలా? క్రీడల షెడ్యూల్, కమిటీల నియామకం బాగానే ఉన్నా.. పోటీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో విద్యార్థుల నుంచి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.14 ప్రయాణ ఖర్చుల కోసం ఉపాధ్యాయులు ఉపయోగిస్తుండగా, రూ.6 ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణ కోసం చెల్లించాల్సి ఉంటుంది. చాలా పాఠశాలల్లో అడ్మిషన్, పరీక్ష ఫీజుల సమయంలోనే ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. పాల్గొనే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉంటోంది. దీంతో భారమంతా నిర్వాహకులపై పడుతుండటంతో.. బహుమతులు, భోజన వసతి కోసం దాతల విరాళాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా ప్రభుత్వం స్పందించి క్రీడల నిర్వహణకు తగిన నిధులను సమకూర్చాలని పలువురు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు అండర్–14, అండర్–17 విభాగాల్లో పోటీపడనున్నారు. ఇంటర్ విద్యార్థులు అండర్–19 విభాగంలో పాల్గొంటారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బేస్బాల్, వాలీబాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, నెట్బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, యోగా తదితర అంశాల్లో పోటీలు జరుగుతాయి. కొన్ని పోటీలను మండల స్థాయిలో, మరికొన్నింటిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. -
క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే అవకాశం..
విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడాపోటీలు దోహదపడుతాయి. ఇక్కడి నుంచే విద్యార్థులో క్రీడల పట్ల ఉన్న మక్కువ తెలుస్తుంది. ఎస్జీఎఫ్ ద్వారా పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రతీ ఏడాది జిల్లా నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడల్లో పాల్గోనే విధంగా కృషి చేయాలి. – లావుడ్య జయపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి● -
సర్ లో చిత్రవిచిత్రాలు
భూపాలపల్లి: తప్పులు లేని ఓటరు జాబితాను అందించాలనే ఉద్ధేశంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతీ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాన్ని అందించి, పూర్తి వివరాలను నింపించి తీసుకొని, డిజిటలైజేషన్ చేసింది. అయినప్పటికీ అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగానే ఉంది. ఓటర్ల జాబితాలో పలువురు చాలామంది ఓటర్ల ఫొటోలకు బదులుగా ఆధార్కార్డులు, ఏకంగా ‘సర్’ ఫారాలే ముద్రించబడ్డాయి. డబుల్ ఓట్లను సైతం తొలగించలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమం వృథాయేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఏడాది, రెండేళ్ల క్రితం మృతి చెందిన వారి ఓట్లు సైతం భూపాలపల్లి నియోజకవర్గం ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నట్లు తెలిసింది. -
పోలీసు అధికారుల సంక్షేమానికి ప్రాధాన్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్భూపాలపల్లి: పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. కొత్తగా ఎన్నికై న జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసో సియేషన్ కార్యవర్గ సభ్యులు సోమవారం ఎస్పీ సంకీర్త్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గ వివరాలు.. జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం జరుగగా అధ్యక్షుడిగా గుగులోత్ నరేష్, ఉపాధ్యక్షుడిగా మహదేవపూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై మచ్చ సాంబమూర్తి, కార్యదర్శిగా గణపురం ఎస్సై బి.అశోక్, జాయింట్ సెక్రటరీలుగా కానిస్టేబుల్ ఎ.రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కానిస్టేబుల్ ఎ.సతీష్, కోశాధికారిగా చిన్నన్న, కార్యవర్గ సభ్యులుగా బి.సతీష్, డి.శ్రావణ్, పి.విజయ్, ఎం.అంబిక, ఎం.యాదిరెడ్డి, క్రాంతిలను ఎన్నుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 15 ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు ఇతర పోలీస్ సంబంధిత అంశాలపై వచ్చిన ప్రతి వినతిని ఎస్పీ ఓర్పుగా విన్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మ్యూజియం మూసివేత?
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మించారు. ఈ ఏడాదిలో నిర్వహించిన సరస్వతీనది అంత్య పుష్కరాల సందర్భంగా మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్శుక్లా, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతిస్వామి, మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. మ్యూజియంలో కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి పురాతన విగ్రహాలు, వాటి పేర్లు ఇతర వివరాలు పొందుపరిచారు. కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ నేపథ్యంలో ఆదిముక్తీశ్వరాలయంలోకి మార్చారు. ఈ సాకుతో మ్యూజియం మూసి ఉంటుందని భక్తుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. పుష్కరాల అనంతరం భక్తులకు మ్యూజియం తెరిచి ఉన్న దాఖలాలు మాత్రం లేవని తెలిసింది. కాగా మ్యూజియం పనులు కూడా ఇంకా అసంపూర్తిగానే దర్శమిస్తున్నాయి. మ్యూజియం పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
భూపాలపల్లి అర్బన్ : సింగరేణి యాజమాన్యం ఈ నెల 27లోగా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అన్ని జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్లడం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు పనిముట్లు అందించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. అరిగిపోయిన పనిముట్లతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గనుల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని, సాధారణ మరణాల సందర్భంలో కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెర్క్స్పై ఆదాయపన్ను విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. 31 డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా 20 డిమాండ్లను అంగీకరించినప్పటికీ అమలులో జాప్యం చేస్తోందన్నారు. డిస్మిస్ కార్మికుల సమస్యలు, క్యాడర్ స్కీం, వైద్య సౌకర్యాలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాతంగి రామచందర్, జి.సుధాకర్రెడ్డి, జి. శ్రీనివాస్, ఎం.డి. ఆసిఫ్పాషాలు పాల్గొన్నారు. -
పత్తిదే పైచేయి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది. అంచనాలు మించిన పత్తి సాగు.. ఉమ్మడి వరంగల్లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనాలను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. పెరిగిన పప్పుధాన్యాల సాగు.. పప్పుధాన్యాల సాగు భారీగా పెరగడం ఈసారి మరో ఆసక్తికర పరిణామం. సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే 387.29 శాతం ఎక్కువగా సాగైంది. మహబూబాబాద్లో సాధారణ అంచనా 4,696 ఎకరాలు కాగా.. 23,815 ఎకరాల్లో సాగు చేశారు. వరంగల్లో 1,355 ఎకరాల అంచనాకు 11,742 ఎకరాల్లో, భూపాలపల్లిలో 352 ఎకరాల అంచనాకు గాను 9,670 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగయ్యాయి. జనగామలో 7,777 ఎకరాల అంచనాకు 11,059 ఎకరాల్లో సాగు నమోదైంది. తక్కువ నీటితో సాగు, వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతులు పప్పుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వరిసాగు 66.88 శాతం మాత్రమే సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. దీంతో సాధారణ సాగు విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. అధిక నీటి అవసరం ఉండే వరి సాగు.. వర్షపాతం లోటు నెలకొన్న ప్రాంతాల్లో కొంత మందగించింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాగులో మానుకోట ముందంజ.. భూపాలపల్లి టాప్ మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు ఉంది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్ వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు వర్షాభావ పరిస్థితులతో పంటమార్పిడికి రైతుల మొగ్గునాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. భూపాలపల్లిలో 11.98 మీటర్లకు భూగర్భజలాలు.. వర్షాభావం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 430.1 మిల్లీమీటర్లు కాగా.. నాలుగు జిల్లాల్లో తీవ్ర లోటు నమోదైంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 547.8 మిల్లీమీటర్లకు 298.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 45.5 శాతం లోటు నమోదైంది. వరంగల్లో 43.1 శాతం, జనగామలో 43.2 శాతం, మహబూబాబాద్లో 30.8 శాతం లోటు ఉంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరుసగా 8.5, 7.9 శాతం స్వల్ప లోటు ఉన్నా.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం సాధారణ వర్షపాతం పరిధిలోనే ఉన్నాయి. మహబూబాబాద్లో 6.02 మీటర్లు, వరంగల్లో 6.65, ములుగులో 7.11, హనుమకొండలో 7.71, జనగామలో 9.14 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. భూపాలపల్లిలో మాత్రం భూగర్భజల మట్టం 11.98 మీటర్ల లోతున చేరడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది.అవగాహనతో పంటల మార్పువర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్సీడ్స్, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ -
ఆధారం చూపితేనే ఓటు
ములుగు: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ములుగు నియోజక వర్గం పరిధిలో అధికారులు నో మ్యాపింగ్, అనామలిస్ (గుర్తింపు లేని) ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించిన అధికారులు డిజిటలైజేషన్ చేసి ఈనెల 14న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఇందులో 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. జిల్లాలో నో మ్యాపింగ్, అనామలిస్ కలిపి 41,412 మంది ఓటర్లకు నేటి నుంచి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ నోటీసులు ఎవరికి వస్తాయోనని ఓటర్లలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోటీసులు అందుకున్న పక్షం రోజుల్లోగా ఈఆర్ఓలకు సరైన ఆధారం చూపితేనే తుది జాబితాలో ఓటు దక్కనుంది. ముసాయిదా ఓటరు జాబితాకు తుది ఓటరు జాబితాకు భారీ వ్యత్యాసం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎల్ఓ, బీఎల్ఏలే కీలకం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కాలంటే బీఎల్వో, బీఎల్ఏల పాత్ర కీలకంగా మారనుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19న అన్ని రాజకీయ పార్టీల నేతలతో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న బీఎల్వోలు ఓటర్లకు సర్ ప్రక్రియపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటర్లకు నోటీసులు అందజేసే సమయంలో దాని ఉద్దేశం, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. డిక్లరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 16 వరకు కొనసాగనుంది. నోటీసులు, రీ–హియరింగ్, క్లెయిమ్స్కు సంబంధించిన ప్రక్రియ వచ్చేనెల 20వ తేదీ వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరుకు ఓటుహక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితా విశ్వసనీయంగా ఉండేలా సమష్టిగా కృషి చేసేందుకు నాయకులు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీఎల్ఏలు, బీఎల్వోలు ఓటర్లకు అందించే సహకారంతోనే సర్ ప్రక్రియ విజయవంతం కానుంది. జిల్లాలో 41,412 మందికి సర్ నోటీసులు నేటి నుంచి అందించనున్న బీఎల్ఓలు రాజకీయ పార్టీలతో ముగిసిన సమావేశం12 రకాల ధ్రువపత్రాలు.. ముసాయిదా ఓటరు జాబితాలో వివరాలు తప్పుగా ఉండి పేరు, ఇంటి పేరు, చిరునామా అక్షర దోషాలు ఉన్నట్లు గుర్తించిన అనామలిస్ (గుర్తింపు లేని) ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మ్యాపింగ్ కానీ ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. నియోజకవర్గంలో నో మ్యాపింగ్ ఓటర్లు 11,308 మంది, అనామలిస్ ఓటర్లు 30,104 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి బూత్ స్థాయి అధికారులతో నేటి నుంచి నోటీసులు ఇవ్వనున్నారు. ఎన్నికల సంఘం తెలిపిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి చూపి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న వార్లు సక్రమంగా స్పందిస్తేనే అనామలిస్ ఓటర్లు తగ్గే అవకాశం ఉంటుంది.9,589 3,586 6,633 2,227 5,342 648 4,945 3,772 3,056 1,614మంగపేట ఏటూరునాగారం ములుగు గోవిందరావుపేట కొత్తగూడ మల్లంపల్లి వెంకటాపురం(ఎం) ఎస్ఎస్తాడ్వాయి కన్నాయిగూడెం గంగారం -
రెండ్రోజుల్లో పూడికతీత పనులు!
కాళేశ్వరం : కాళేశ్వరం దేవస్థానం కూల్చివేత పనులు కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాయింగ్, డిజైన్ల ఆలస్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెండ్రోజుల్లో మట్టి పూడికతీత పనులు ప్రారంభం కానున్నాయని ఓ ఆర్కిటెక్చర్ పేర్కొన్నారు. డ్రాయింగ్లు ఇప్పటికే తమ సంస్థ నుంచి దేవాదాయ, ఆర్అండ్బీ శాఖకు అందజేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మేడిగడ్డకు 54,820 క్యూసెక్కుల ప్రవాహం కాళేశ్వరం : మహదేవపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్కు ఎగువన మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ప్రాణహిత నది ద్వారా వరద ప్రవాహం తరలివస్తోంది. ఆదివారం బరాజ్ వద్ద 54,820 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. వృక్షాలు భద్రమేనా! కాళేశ్వరం : కాళేశ్వరం దేవస్థానం కూల్చివేతల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి, కదంబ వృక్షాలు తొలగించడం లేదు. కానీ, ఆ వృక్షాలను తొలగించకుండా భద్రంగా కాపాడేందుకు దేవాదాయ శాఖ, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. పడమర వైపు ఉన్న ఉసిరి చెట్టు చుట్టూ మట్టి తీసి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే శుభానంద దేవి (పార్వతీ) అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉండే కదంబ వృక్షాన్ని కూడా భద్రంగానే ఉంచుతున్నారు. ఈ రెండు వృక్షాలను భక్తులు విశ్వసిస్తారు. సమస్యలు పరిష్కరించడంలో విఫలం భూపాలపల్లి అర్బన్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి మూడేళ్లు కావొస్తుందన్నారు. ఎన్నికల్లో గుర్తింపు సంఘం గెలుపొందిన యూనియన్ కార్మికుల సమస్యలను విస్మరించింది తెలిపారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సింగరేణి కార్మికుల మారుపేర్లు సవరిస్తామని, మెడికల్ బోర్డును పాత పద్ధతులు నిర్వహిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని, నూతన బొగ్గు గనులను ఏర్పాటు, సింగరేణి కారిడార్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాలను గుర్తు చేశారు. భూ హక్కులను కాపాడాలి వాజేడు : ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి అనుగుణంగా భూముల రీ సర్వే చేపట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకిరమణ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనుల భూములకు ప్రత్యేక రక్షణ ఉందని 5వ షెడ్యూల్ స్ఫూర్తికి అనుగుణంగా భూ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజనుల భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. రూ. రెండున్నర కోట్లతో ఉడాయించిన ట్రేడర్? నర్సంపేట: నర్సంపేటలో ట్రేడర్గా కొనసాగుతూ రైతులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన సుమారు రూ.రెండున్నర కోట్ల విలువ చేసే మక్కలు, ఇతర సరుకులతో ఓ ట్రేడర్ ఉడాయించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన వ్యాపారి గతేడాది నర్సంపేటలో ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మక్కలు కొనుగోలు చేస్తున్నాడు. మొదట్లో కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించి మంచి పేరు పొందిన తర్వాత ఈ ఏడాది ఇతర వ్యాపారుల కంటే ఎక్కువ రేటు వెచ్చించి భారీ మొత్తంలో సరుకులు కొనుగోలు చేశాడు. ములుగు ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసి సుమారు రూ.రెండున్నర కోట్ల మేర బకాయిపడి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ములుగుకు చెందిన ఓ వ్యాపారి ఈ విషయంపై ఏసీపీ రవీందర్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
పత్తిమొక్కలతో నిరసన
భూపాలపల్లి రూరల్: తమ కళ్లముందే ఫారెస్టు అధికారులు పత్తి పంటను తొలగించి అన్యాయం చేశారని.. తమకు న్యాయం చేయాలని భూపాలపల్లి మండలం దీక్షకుంటకు చెందిన అజ్మీర హరిలాల్, రాజు, అమర్ సింగ్, ప్రేమ్, రైతులు శనివారం కలెక్టరేట్ ఎదుట పత్తి మొక్కలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేసవిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తమ వద్ద ఎకరాకు రూ.25వేల చొప్పున మొత్తం రూ.5 లక్షల వరకు వసూలు చేసి పంటలు వేసుకోండని అనుమతి ఇచ్చారని ఆరోపించారు. అధికారుల మాట నమ్మి అప్పులు చేసి పత్తి సాగు చేస్తే, ఇప్పుడు అదే అధికారులు వచ్చి పంటను ధ్వంసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. క్రీడాజట్ల ఎంపికలు భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర సివిల్ సర్వీసెస్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్–2026–27లో పాల్గొనే రాష్ట్ర జట్ల ఎంపిక కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారమ్స్, హాకీ, పవర్లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, ఖోఖో, యోగా, లాన్ టెన్నిస్, బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్బాల్ తదితర క్రీడల్లో పురుషులు, మహిళలకు ఎంపికలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 96180 11096 నంబర్ను సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జాతీయ మారకద్రవ్యాల నిరోధక ప్రణాళిక (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద జిల్లాలో డి–అడిక్షన్ (డీడీఏసీఎస్) ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థల(ఎన్జీఓఎస్)నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ సంక్షేమ అధికారి మల్లీశ్వరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల సంస్థలు ఇ–అనుధాన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎస్పీకి వినతి భూపాలపల్లి అర్బన్: నల్లగొండ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జిల్లాలో పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ ట్రస్మా నాయకులు శనివారం ఎస్పీ సంకీర్త్కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. పాఠశాలల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఉడుత సాంబయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సభ్యులు సతీశ్, హరీశ్, జోసఫ్ పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గతంలో పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో జాయిన్ అయ్యే వారని తెలిపారు. ఈ జీఓ ద్వారా మళ్లీ ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సమయం వృథా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది. తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేధ్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. -
పనులు నాణ్యతతో పూర్తిచేయాలి
● ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో కాళేశ్వరం: జిల్లాలో జరుగుతున్న గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ పనులను నాణ్యతతో చేయాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శనివారం మహదేవపూర్ మండలంలోని గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ పనులపై అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్లు అందించే ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని డీటీడీఓను ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాం వస్త్రాల సరఫరా, సంబంధిత స్వయం సహాయక బృందాల ద్వారా వస్త్రాలు కుట్టే ఏర్పాట్లపై ఆరా తీసి, కుట్టుపని ప్రారంభించడానికి సంబంధిత అధికారులకు వస్త్రాలను అందజేసేలా చూడాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలలో మరమ్మతు పనుల స్థితిపై సమీక్షించి, పనుల కేటాయింపును వేగవంతం చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత డీఈఈ, ఏఈఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, డీఈఈ హరీశ్, ఏటీడీఓ శివకృష్ణ, ఏఈఈ శ్రీనివాస్, హెచ్ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింటి మేళవింపే తీజ్. మంచి జీవిత భాగస్వామి దొరకాలని బంజారా యువతులు నిష్టతో చేసే సంప్రదాయ పూజలు.. తీజ్ ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తండాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రావణ మాసంలో ఈ తొమ్మిది రోజుల తీజ్ పండుగ (తాండేమా తీజ్ తేవార్)తో గిరిజనుల మనస్సులో కాంతి నిండాలి అని ఆశిస్తూ ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులుపవర్ టిల్లర్తో ప్రయోజనాలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ప్రస్తుతం పవర్ టిల్లర్ పత్తి, మిరప రైతుకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ యంత్రం. -
నాణ్యతా ప్రమాణాలతో పనులు
● కలెక్టర్ రాహుల్శర్మ ● యంగ్ ఇండియా మోడల్ స్కూల్ పనుల పరిశీలనగణపురం: యంగ్ ఇండియా మోడల్ స్కూల్ నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శనివారం గణపురం మండలం మైలారం గుట్టల వద్ద పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. నాలుగు అకాడమిక్ బ్లాక్లు, సీనియర్, జూనియర్ డార్మీటరీలు, కిచెన్, డైనింగ్ హాళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ల నిర్మాణ ప్రణాళికను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దన్నారు. కాంక్రీట్ గోడల నిర్మాణంలో షియర్ వాల్ టెక్నాలజీని వినియోగించి పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో చెట్లను తొలగించవద్దని ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పకుండా అటవీశాఖ అనుమతులు తీసుకోవాలన్నారు. పాఠశాలలో 2,640 మంది విద్యార్థులు 300మంది సిబ్బందికి వసతి కల్పించాల్సి ఉందన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్య, వసతులను అందుబాటులో ఉండేలా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీజీఈడబ్ల్యూడీసీ ఈఈ అరుణ్కుమార్, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఏఈ జీవన్, సర్పంచ్ సమ్మయ్య నాయక్ పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి కృషి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్దఎత్తున కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జె.జీవన్కుమార్ సూచించారు. శనివారం న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, మోటార్ వాహన, మ్యాట్రిమోనియల్, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.రాములు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.అక్షయ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. -
రికార్డులు సిద్ధం చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్టేకుమట్ల: సాదాబైనామాకు రికార్డులను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సాదాభైనామా, భూభారతి రికార్డులను పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పైళ్లను వెంటనే పూర్తిచేయాలని తహసీల్దార్ స్వరూపరాణిని ఆదేశించారు. కార్యాలయంలోని అన్ని రికార్డులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంతోష్బాబు, సీనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్, జీపీఓ, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. -
90 మంది కండక్టర్లు ‘ఔట్’!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మరునాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కు రూ.లక్షనుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరోపించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైరాజర్కు రూ.600లకు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు. వరంగల్ రీజియన్లో 274మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా.. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ -
వయోవృద్ధులను గౌరవించాలి
భూపాలపల్లి రూరల్: కుటుంబాలకు పునాది పెద్దవారేనని, వారిని గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఓల్డేజ్ హోమ్లో వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. జీవన్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దవారిపట్ల గౌరవ మర్యాదలు పాటించాలన్నారు. వారిని ఇబ్బంది పెడితే చట్టాలు కఠినంగా శిక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోమ్ నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్, శైలజ, కోర్డు సూపరింటెండెంట్ రఘురాం,సీనియర్ అసిస్టెంట్ సురేందర్, సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రమేశ్ పాల్గొన్నారు. -
రాత్రి వేళలో సరఫరా..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. రేషన్షాపుల డీలర్లు బియ్యం వ్యాపారులకు సహకరిస్తున్నారు. డీలర్లు కార్డుదారులకు కిలో బియ్యానికి రూ.12–15 వరకు చెల్లిస్తూ.. బియ్యాన్ని అక్రమంగా రూ.18లకు వ్యాపారులకు అమ్ముతున్నారు. సివిల్ సప్లయీస్ అధికారులు మాత్రం దృష్టిసారించడం లేదు. దీంతో డీలర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. గతంలో ఏజెంట్ల పద్ధతి.. గతంలో జిల్లావ్యాప్తంగా పీడీఎస్ వ్యాపారులు గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకునేవారు. వారి ద్వారా ఉదయం అంతా బియ్యం సేకరించేవారు. గ్రామాల్లోని వాడల్లో ఇంటింటికీ వెళ్లి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి గ్రామంలో ఓ ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసేవారు. ఏజెంట్ల ద్వారా సేకరించిన బి య్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళలో తరలించేవారు. బియ్యం వ్యాపారులు వారి పంథా మార్చుకున్నారు. కొత్త పద్ధతిలో వ్యాపారాన్ని నడిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించకుండా నేరుగా రైస్మిల్లులకు తరలిస్తున్నారు. రైస్మిల్లులో రీసైక్లింగ్ చేస్తున్నారు. 444క్వింటాళ్ల పట్టివేత మూడు రోజుల క్రితం రేగొండ మండల కేంద్రంలోని ఓ రైస్మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 444 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. గణపురం మండలకేంద్రంలోని ఇంట్లో నిల్వ చేసిన 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గత నెల 20వ తేదీన టాస్క్పోర్స్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక మండలంలో రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అధికారుల కనుసన్నల్లోనే.. జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో పీడీఎస్ దందా రేషన్షాపుల ద్వారానే నడుస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సివిల్సప్లయీస్ అధికారులకు ఈ దందా గురించి తెలిసినప్పటికీ ప్రత్యేక దృష్టిసారించడం లేనట్లు తెలుస్తోంది. 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రేషన్షాపుల్లో దాడులు చేసినట్లయితే బియ్యం అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయని జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది.నగదు బదిలీ సాగుతుందిలా.. జిల్లాలో రేషన్షాపుల నుంచి బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. బియ్యం సరఫరాపై పర్యవేక్షణ చేస్తున్నాం. గతంలో జిల్లా వ్యాప్తంగా 8 షాపులను కూడా సీజ్ చేశాం. బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రేషన్బియ్యం అక్రమాలపై అడ్డుకట్ట వేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. – కిరణ్కుమార్, డీీసీఎస్ఓజిల్లావ్యాప్తంగా 277 రేషన్ దుకాణాలు ఉండగా 1.39 రేషన్కార్డులు ఉన్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యానికి బదులుగా నగదు బదిలీ పథకం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రేషన్షాపు డీలర్లు కార్డుదారులను ఇంటికి పిలుచుకొని వేలిముద్రలు వేయించుకుంటున్నారు. వేలిముద్ర వేసినట్లయితే కార్డుదారులు బియ్యం తీసుకున్నట్లే. కొంతమంది రేషన్ డీలర్లు ఒక్కో కేజీకి రూ.12 నుంచి రూ.15ల వరకు వెంటనే చెల్లిస్తున్నారు. మరికొంత మంది డీలర్లు వారి పేర్లు రాసుకొని బియ్యాన్ని తరలించిన రెండు రోజుల తరువాత ఇంటింటికి వెళ్లి డబ్బులు ఇస్తున్నారు. రేషన్షాపుల్లో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని రాత్రి వేళలో తరలిస్తున్నారు. బియ్యం వ్యాపారుల కనుసన్నల్లో రేషన్ డీలర్లు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. బియ్యం వ్యాపారులు ప్రత్యేకమైన డీసీఎం వ్యాన్లు, బొలోరో వాహనాలు ఏర్పాటు చేసుకొని పైలెట్ వాహనాల మధ్య తరలిస్తున్నారు. -
వివాదరహిత జీవితాలను గడపాలి
భూపాలపల్లి అర్బన్: పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృథా కావడంతో పాటు తీవ్రంగా నష్టపోతారని ప్రతి ఒక్కరూ వివాద రహిత జీవితాలను గడపాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా మున్సిపాలిటీ పరిఽధిలోని మంజూర్నగర్, మహిబూబ్పల్లిలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు, ప్రామిసరీ నోట్, కుటుంబ, సివిల్ తదితర వివాదాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ.. కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదాలకు దూరంగా జీవించాలని కోరారు. న్యాయ సహాయం కోసం నల్సా టోల్ఫ్రీ నంబర్ 15100ను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, మహిత, వెంకటేష్, రాజ్కుమార్, గౌతమి, కార్తీక్ పాల్గొన్నారు. -
ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం
భూపాలపల్లి: వానాకాలం ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర వానాకాలం ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి హాజరైన అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు తదితరులు పాల్గొన్నారు. రుణాల మంజూరులో వేగం పెంచాలి భూపాలపల్లి రూరల్: వెనుకబడిన రంగాలకు రుణాల మంజూరులో వేగంపెంచాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అధికారులకు సూచించారు. జిల్లాస్థాయి సమావేశం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ లక్ష్యం రూ.2,599.49 కోట్లు కాగా.. జూన్ త్రైమాసికం నాటికి రూ.451.73 కోట్లు అంటే 17.38 శాతం సాధించారని స్పష్టంచేశారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.611.03 కోట్ల లక్ష్యానికి గాను రూ.261.51 కోట్లు, 42.80 శాతం రుణాలు అందించారని వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో లీడ్ డిస్టిక్ర్ట్ మేనేజర్ నాగరాజు,బ్యాంకులఅధికారులు, సంబంధితశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు
● కలెక్టర్ రాహుల్శర్మచిట్యాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ కోరారు. శుక్రవారం మండలకేంద్రంలోని సివిల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ప్రసూతి విభాగం, ఐసీయూ, రక్త పరీక్షల ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులకు వైద్యసేవలు, మందులు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యసేవలకు వచ్చే ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్త నియామకాల ద్వారా వైద్యులు, సిబ్బంది అందుబాటులోకి రావడం, మాతా శిశుసంరక్షణ సేవలు, ప్రసవాల సంఖ్య పెరగడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. రోగుల నమూనాలను టీ హబ్కు పంపించి పరీక్షల నివేదికలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం వైద్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్లడ్బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డులలో ర్యాక్లు, డిస్పోజల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ ప్రోబ్ సమస్యను పరిష్కరించి యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, తహసీల్దార్ వసంతరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సాదాబైనామా, భూభారతి, బల్క్ ల్యాండ్ సర్వే వేగవంతం చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు భూపాలపల్లి: ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలి పారు. శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించామని, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు,బూత్ సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎన్నికల సెక్షన్ డీటీ అబ్బాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు డెంగీ కేసులు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని కాకతీయకాలనీ, హన్మాన్నగర్ కాలనీల్లో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఎపిడమిక్ టీమ్ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి శుక్రవారం ఆయా కాలనీల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. డెంగీ బారిన పడటానికి గల కారణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, 18వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్రావు, ఏఎంఓ సుధాకర్, సభ్యులు రమేశ్బాబు, పరమేష్, గోపి, సతీష్, హెల్త్ అసిస్టెంట్ శ్యాంప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్–1, కామర్స్–1 పోస్టులకు అతిథి అధ్యాపకులను నియమించేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు బయోడేటాతో పాటు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఒక జత జిరాక్స్ ప్రతులతో కళాశాలకు హాజరై డెమో, ఇంటర్వ్యూలో పాల్గొనాలని ప్రిన్సిపాల్ సూచించారు. వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు రేగొండ: వర్షాలు సమృద్ధిగా కురువాలని ఆకాంక్షిస్తూ మండలంలోని తిరుమలగిరి గ్రామస్తులు శుక్రవారం పాండవుల గుట్టల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై ఉన్న పాండవుల గుహలో బోనం వండి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరుణ దేవుడు కరుణించాలని పాటలు పాడారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వారు ఈ సందర్భంగా కోరారు. సర్పంచ్ భర్త స్మార్ట్రేషన్ కార్డుల పంపిణీ మహాముత్తారం: కొర్లకుంట సర్పంచ్ కోట రజిత భర్త రాంనారాయణగౌడ్ శుక్రవారం అధికారికంగా స్మార్ట్ రేషన్కార్డులు పంపిణీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు, ప్రోటోకాల్ను పాటిస్తూ ఎన్నికై న ప్రజాప్రతినిధులే అధికారికంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సంబందిత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన నిబంధనలు ప్రొటోకాల్పై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. రామప్పను సందర్శించిన శిక్షణ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు భారత్ దర్శన్లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థ ప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవాన్ని వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, ఎంసీహెచ్ఆర్డీ అధికారులు శంకర్, నందకిషోర్, రవి, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు. -
ఓవర్ టు ఢిల్లీ..!
ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ ● సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక ● సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు ● మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ ● అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠసాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో మీడియా ముందుకు సురేఖ? ఇదిలా ఉండగా.. శుక్రవారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి. హైకమాండ్ వద్దకు ‘హస్తం’ పేచీ.. ఇప్పటికే షోకాజ్ నోటీసు, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్లో ఏ విధంగా వ్యవహరి స్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివా దానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. -
జవాబుదారీతనంతో సేవలు
● కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్కిశోర్ఝాకాళేశ్వరం/మల్హర్: పోలీసులు ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించాలని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ఝా పోలీసు అధికారులకు సూచించారు. గురువారం ఎస్పీ సంకీర్త్తో కలిసి కొయ్యూరు పోలీస్స్టేషన్, మహదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలందించడం ప్రతీ పోలీస్ అధికారి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలన్నారు. కేసులను సకాలంలో పరిష్కరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సేవలందించాలని ఆదేశించారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం, మహదేవపూర్ సీఐలు నాగార్జునరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆదమరిస్తే ఆస్పత్రికే..
జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై గల రోడ్డు మైసమ్మ ఆలయం పక్కనే చిన్నవాగు ప్రవహిస్తుంది. ఆ వాగుపై నేషనల్ హైవే అధికారులు బ్రిడ్జిని నిర్మించారు. వాగుకు ఇరువైపులా రక్షణ గోడను అతి చిన్నగా నిర్మించారు. దీంతో గతంలో కారు, లారీలు అదుపు తప్పి వాగులో పడిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోకపోయినప్పటికీ తీవ్ర గాయాలైన ఘటనలు ఉన్నాయి. పట్టణం మీదుగా భారీ వాహనాలు వందలసంఖ్యలో వెళ్తుండటంతో ఏ ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
నేడు కోటంచలో కుంకుమార్చన పూజలు
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నేడు (శుక్రవారం) సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ బిళ్ల శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం గజవాహన సేవపై అమ్మవారిని ఊరేగించి, తదుపరి ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. కోటగుళ్లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం ● రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్ గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్ల శిల్పసంపద అద్భుతంగా ఉందని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్ అన్నారు. గణపసముద్రం చెరువు కట్టపై నిర్మిస్తున్న రిసార్ట్స్తో పాటు కోటగుళ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్లు, గణపసముద్రం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ సిద్ధంగా ఉందన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు శివాజీ, రఘు, ఏఐ కీర్తికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం ● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుభూపాలపల్లి రూరల్: దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు అవకాశాలు కల్పించడం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన గొప్పనాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి, మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ సంక్షేమాధికారి మల్లీశ్వరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 (నేటి) నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రహదారుల పక్కన పొంచి ఉన్న ప్రమాదం
జిల్లాలో రోడ్డు పక్కన బావులు, పాడుబడిన గోతులు వాహనదారులకు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రోడ్డు పక్కన చెట్లు, చెత్తాచెదారంతో బావులు కనిపించకపోవడం, రాత్రివేళల్లో గుర్తుపట్టక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. గతంలో పలు ప్రమాదాలు జిల్లాలో జరిగిన ఘటనలు సైతం ఉన్నాయి. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే దారుల్లో సంబంధిత అధికారులు బావులను గుర్తించి భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ప్రమాదకరమైన బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించడమో లేక పూడ్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని రహదారుల పక్కన ఉన్న ప్రమాదకరమైన బావులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. – భూపాలపల్లి/రేగొండ/టేకుమట/మొగుళ్లపలి/మహాముత్తారం -
ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం
భూపాలపల్లి: పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధ్యమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, పాఠకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ ఏర్పాట్లు, మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడారు. అభ్యర్థులకు అవసరమైన కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు కంప్యూటర్స్ సదుపాయం, ఆర్ఓ వాటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. గడువులోగా పూర్తి చేయాలి.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనామలిస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ అంశాలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బూత్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. 30 రోజుల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో వేగవంతం చేయాలని సూచించారు. కాలువల నిర్మాణ పనులతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, మెగా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 119 మంది ఎమ్మెల్యేలలో 81మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో వెల్లడించగా.. వారిలో 58 మంది తీవ్రమైన కేసుల వివరాలను కూడా పేర్కొన్నారు. చట్టసభ సభ్యులపై నమోదైన కేసుల విచారణలో జాప్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వ్యవహారంలో సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా అమికస్ క్యూరీగా సమర్పించిన తాజా 22వ నివేదికతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తమపై నమోదైనట్లు పేర్కొన్న 28 కేసుల వివరాలు వెల్లడించారు. మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేలపై కేసుల ‘చిట్టా’ ● ఎన్నికల ఉల్లంఘనల నుంచి అల్లర్ల వరకు నమోదైనవే.. ఉమ్మడి వరంగల్లో ఆరుగురిపై 28 క్రిమినల్ కేసులు ● కొండా సురేఖ అఫిడవిట్లో హత్యాయత్నం.. అభ్యర్థుల స్వీయ అఫిడవిట్ల ఆధారంగానే వివరాలు ● ‘సుప్రీం’కు విజయ్ హన్సారియా తాజా నివేదికలో వెల్లడి తుది తీర్పు వచ్చేవరకు ఆరోపణలే..● ఉమ్మడి వరంగల్లో మొత్తం 12మంది శాసనసభ్యులు ఉండగా ఆరుగురిపై కేసులు ఉన్నట్లు అమికస్ క్యూరీ రిపోర్టులో పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తన అఫిడవిట్లో 8 క్రిమినల్ కేసులు ప్రకటించారు. వీటిలో ఐపీసీ 307 (హత్యాయత్నం), 332, 333, 353 వంటి ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం/దాడికి సంబంధించిన సెక్షన్లతో పాటు 143, 149, 188, 341, 504 తదితర సెక్షన్లు ఉన్నాయి. ● రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తన అఫిడవిట్లో 6 కేసులు ప్రకటించారు. వీటిలో ప్రధానంగా ఐపీసీ 143, 149, 341 సెక్షన్లతో కూడిన కేసు ఉండగా.. మిగిలిన కేసుల్లో సీఆర్పీసీ 151 కింద నిర్బంధానికి సంబంధించినవి ఉన్నాయి. కేసులన్నీ నిరసనలు తెలిపిన సందర్భంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ● కొండా సురేఖపై 5 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. వీటిలో ఐపీసీ 307 (హత్యాయత్నం) కేసు ఒకటి ఉంది. ఒక కేసులో ఆరమ్స్ ఆక్ట్ సెక్షన్ 27 కూడా నమోదైనట్లు రికార్డు పేర్కొన్నారు. ● డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్పై 4 కేసులు ప్రకటించారు. వాటిలో ఐపీసీ 294, 506, 149; 109, 147, 324, 341, 427, 506, 149; 452, 448, 143, 188, 353, 149 వంటి సెక్షన్లు ఉన్నాయి. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్పై 3 కేసులు ఉన్నట్లు ప్రకటించారు. మూడు కేసుల్లోనూ ప్రధానంగా అక్రమ సమూహం, విధులకు ఆటంకం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన తదితర ఆరోపణల సెక్షన్లు కనిపిస్తున్నాయి. ● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై రెండు కేసులు ప్రకటించారు. ఒకటి ఐపీసీ 188 కింద, మరోటి ఐపీసీ 171–ఇ, కింద నమోదైనట్లు రికార్డులో ఉంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల వేగవంతమైన విచారణ అవసరంపై సుప్రీంకోర్టు పలుమార్లు దృష్టి సారించింది. ఎన్నికల అఫిడవిట్లలో కేసుల వివరాలు వెల్లడించడం ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఉపయోగపడుతున్నప్పటికీ.. కేసుల తుది పరిష్కారంలో జాప్యం కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. కేసు నమోదైనంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని, న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చే వరకు ఆరోపణలను నిర్ధారిత అంశాలుగా పరిగణించరాదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. -
పొంచిఉన్న ప్రమాదం..
పక్కనున్న ఫొటో రేగొండ మండలం గూడెపల్లి శివారులో మలుపు. భాగిర్తిపేట క్రాస్ నుంచి గూడెపల్లి మీదుగా కోటంచకు వెళ్లే రహదారి ఇది. కోటంచ జాతర సమయంలో ఈ రోడ్డు గుండా ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. రోజువారీగా మాత్రం జాతరకు వెళ్లే వాహనాలతో పాటు, గ్రామాలకు ప్రైవేట్ వాహనాలు వందల సంఖ్యలో వెళ్తుంటాయి. అదే విధంగా ద్విచక్రవాహనదారులు కూడా ఈ మార్గం గుండా వందలాది మంది నిత్యం ప్రయాణం చేస్తుంటారు. గూడెపల్లి శివారులో మలుపు వద్ద ఉన్న బావితో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. బావి ఉందనే సమాచారం గానీ, హెచ్చరిక బోర్డులు గానీ లేవు. రక్షణ గోడలు సైతం లేవు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే తీవ్ర ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కొడవటంచ ఆలయంతో పాటు రహదారులు, కాంప్లెక్స్లు, అతిథిగృహలను దాదాపు రూ.100 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దీంతో ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువైంది. కావున రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
బొగ్గు గనిలో విషాదం
● గుండెపోటుతో సింగరేణి కార్మికుడి మృతి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1వ గనిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. బుధవారం నైట్షిఫ్ట్లో విధులు నిర్వహిస్తూ కోల్కట్టర్ గోపాల్ గోపి (39) అస్వస్థతకు గురై మృతి చెందారు. ఛాతిలో నొప్పి, చెమటలు పట్టడంతో సహచరులు ఆయనను గని నుంచి బయటకు తరలించగా, ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఆస్పత్రి వద్ద సంఘాల ఆందోళన గోపి మృతిపై ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అస్వస్థతకు గురైన గోపిని స్ట్రెచర్కు బదులుగా మ్యాన్రైడింగ్లో కూర్చోబెట్టి పైకి తీసుకొచ్చి, అక్కడి నుంచి అంబులెన్స్ వరకు నడిపించారని సంఘాల నాయకులు ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో కార్మికులను సురక్షితంగా తరలించేందుకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అంబులెన్స్, ఆక్సిజన్, ప్రథమ చికిత్స పరికరాలు, అత్యవసర మందులు, శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కోరారు. యాజమాన్యం తరఫున ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్ సంఘాల నాయకులతో చర్చించి, గోపి కుటుంబానికి నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆస్పత్రికి చేరుకుని గోపి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గనుల్లో ప్రమాదాలు లేదా అకస్మాత్తుగా అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణ వైద్యం అందేలా ప్రత్యేక అంబులెన్స్, వైద్యుడు, సాంకేతిక సిబ్బంది, ప్రథమ చికిత్స పరికరాలు అందుబాటులో ఉంచాలని సింగరేణి అధికారులను కోరారు. 31న అష్టతీర్థాలకు టెండర్ కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీఘాటు ఎగువ నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు అష్టతీర్థాలు నిర్మించడానికి ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో రూ.60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 8న, 14న టెండర్లు నిర్వహించాల్సి ఉండగా..టెక్నికల్ సమస్యలతో వాయిదాపడింది. మళ్లీ ఈనెల 31న టెండర్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నిర్మాణాలు వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు నిర్వహించే గో దావరి పుష్కరాల వరకు పూర్తి కావాల్సి ఉంది. -
ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రజాస్వామ్య హక్కులు, రా జ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు పోరాడుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ రైతు పోరాట వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఈనెల 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించినున్న ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులు, ఆదివాసీలు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కే సులు నమోదు చేసి జైళ్లలో నిర్భందించడం సరికాదన్నారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గట్టయ్య, పీక కిరణ్, దాసరి రమేష్, దుబాసి పార్వతి, రాదండి దేవేందర్, అ యిత బాపు తదితరులు పాల్గొన్నారు. -
444 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రేగొండ: మండలకేంద్రంలోని ఓ పాత రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండలకేంద్రంలోని పాత రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులకు సమాచారం రావడంతో మంగళవారం రాత్రి అధికారులు రైస్ మిల్లులో తనిఖీ చేయగా పీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మిల్లులో ఉన్న బియ్యం బస్తాలను తనిఖీ చేశారు. ఇందులో సుమారు 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మారుతి రైస్ మిల్లుకు తరలించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు. రైస్ మిల్లు యాజమాని శ్రీనివాస్, వెహికిల్ డ్రైవర్ సాంబశివుడుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
శాసీ్త్రయ గని మూసివేతకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: శాసీ్త్రయ పద్ధతిలో గని మూతవేత, పునర్వినియోగం చేసేలా చూడాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆదేశించారు. బుధవారం ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాసీ్త్రయ గని మూసివేత, గని పునర్వినియోగం, భూముల సుస్థిర వినియోగంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశంలో 42 బొగ్గు గనులను శాసీ్త్రయ పద్ధతిలో మూసివేయడం అతిపెద్ద మైలురాయి అన్నారు. భవిష్యత్లో మొత్తం 105 బొగ్గు గనులను శాసీ్త్రయంగా మూసివేయడమే లక్ష్యమన్నారు. ఈ వీసీలో కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏరియా జీఎం రాజేశ్వరరెడ్డి, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీసీ సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 20,876 అనామలీస్, గత ప్రత్యేక ఓటరు సవరణతో అనుసంధానం లేని ఓటర్లు 11,739 మంది, యుఈఎఫ్లు 35,918 మంది మొత్తం 68,533 ఓటర్ల వివరాలు గుర్తించామన్నారు. నిబంధనల మేరకు పరిశీలించి, అవసరమైన చోట విచారణ నిర్వహించి పరిష్కరిస్తామన్నారు. ఏఈఆర్ఓలు, బూత్ సూపర్వైజర్లకు విచారణ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ నిర్వహించి, తహసీల్దార్ స్థాయి నుంచి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సవరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ వీసీలో ఆర్డీఓ హరికృష్ణ్ణ, శిక్షణా డి ప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, భూపాలపల్లి, రేగొండ మండలాల తహసీల్దార్లు లక్ష్మీరాజయ్య, శ్వేత, పర్యవేక్షకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ దశనుంచే గంజాయి కిక్కుకు బానిసలు.. కళాశాలలే లక్ష్యంగా సరఫరా..
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026●● మత్తులో పెరుగుతున్న నేరాలు.. విద్యార్థులే ‘క్యారియర్లు’ ● నల్లగొండ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపాటు ● మేల్కోకపోతే మరిన్ని ఘోరాలు.. నేరాలువరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు)విద్యార్థులకు అవగాహన, విక్రేతలపై కఠినచర్యలు పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విక్రయాలు, సరఫరాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి బానిసలైన యువతను గుర్తించి వారిపై చట్టపరమైన ప్రక్రియతోపాటు డీ–అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్, చికిత్స మార్పు తెచ్చే చర్యలు చేపడుతున్నాం. – పి. రమేశ్కుమార్, డీఎస్పీ, నార్కొటిక్స్ ఈగల్ ఫోర్స్ మాదక ద్రవ్యాల అనుకూల పంటల సాగు వద్దు యువత దేశ భవిష్యత్కు వెన్నెముక. వారు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, మాదక ద్రవ్యాల తయారీకి అనుకూలమైన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకుండా చూడాలి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం, ఆచార్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – డా. గాదె సమ్మయ్య, ప్రముఖ విద్యావేత్తసాక్షిప్రతినిధి, వరంగల్: చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నచిన్న గొడవలనుంచి తీవ్రమైన నేరాల వరకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మైనర్లు, స్కూల్, కాలేజీ విద్యార్థులే గంజాయి ముఠాల టార్గెట్గా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో గంజాయి సరఫరా, వినియోగం, యువత ప్రమేయంపై మరోసారి చర్చ మొదలైంది. స్కూల్ వెనుక నుంచి, హాస్టళ్ల వరకు.. వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో 134 గంజాయి కేసులు నమోదవగా, 369మందిని అరెస్ట్ చేశారు. 2,571 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వరంగల్ నగర శివార్లకే పరిమితమైన గంజాయి వినియోగం క్రమంగా కొన్ని విద్యాసంస్థల పరిసరాలకూ చేరిందన్న ఆందోళన ఉంది. స్కూల్ వెనుక ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, చెరువు కట్టలు, రైల్వే పరిసరాలు, కాలేజీ హాస్టళ్లు, అద్దె గదులు.. ఇలా నిర్మానుష్య ప్రాంతాలను కొందరు మత్తు సేవించేందుకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా వరంగల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసిన గంజాయి కేసు మరింత ఆందోళన కలిగించింది. బీటెక్, ఇంటర్ విద్యార్థులతో కూడిన ముఠా 36 కిలోలకు పైగా గంజాయితో పట్టుబడింది. ఎనిమిది మంది విద్యార్థులు డబ్బులు పోగేసి గంజాయి కొనుగోలు చేసినట్లు ‘ఈగల్’దర్యాప్తులో వెల్లడైంది. ఈ విద్యార్థులు ఇదే తరహా కేసులో నాలుగోసారి పట్టుబడడం ఆందోళనకరం. వినియోగంతో మొదలు.. విక్రయంతో ముగింపు గంజాయి ముఠాలు ముందుగా కొందరు విద్యార్థులను వినియోగదారులుగా మార్చి.. ఆ తర్వాత వా రినే చిన్నస్థాయి క్యారియర్లు, విక్రేతలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆందోళన ఉంది. మొదట స్నేహితుడి ద్వారా పరిచయం.. ఆపై ఉచితంగా లే దా తక్కువ ధరకు సరఫరా.. అలవాటు పడిన తర్వాత డబ్బుల కోసం ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వల విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన కేసులు చెబుతున్నాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వట్లే!నిధులు పక్కదారి పట్టిస్తే చర్యలు -
కనెక్షన్ల వివరాలు.. హెచ్పీ గ్యాస్ 49,302 భారత్ గ్యాస్ 39,905 ఇండేన్ గ్యాస్ 43,123
● ఇబ్బందుల్లో గ్యాస్ వినియోగదారులు ● జిల్లాలో 1,32,330 కనెక్షన్లు కాళేశ్వరం: పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచిపోవడంతో కొత్తగా పైళ్లెన వారు, వేరు కాపురాలు పెట్టిన కుటుంబాలు, బదిలీలపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కదారికి.. కొత్త కనెక్షన్ కోసం ఆయా గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నప్పటికీ దరఖాస్తులు స్వీకరించేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్లను సక్రమంగా సరఫరా చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు కంపెనీల నుంచి ఆదేశాలు ఉన్నట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కొత్త కనెక్షన్లతో పాటు ఇప్పటికే ఒక సిలిండర్ ఉన్న వినియోగదారులు డబుల్ సిలిండర్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఒక్క సిలిండర్కు బుకింగ్ సమయం 45 రోజులు ఉండడంతో రెండో సిలిండర్ తప్పనిసరైంది. రెండో సిలిండర్ కోసం మరోవైపు మార్కెట్లో గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, సిలిండర్లు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వినియోగదారులు సబ్సిడీ సిలిండర్లను అక్రమంగా రూ.2వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడుతుంది.ఎప్పుడిస్తారో ? కొత్త కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సమ స్య ఎప్పుడు పరిష్కారమవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. యుద్ధం ముగిసినప్పటికీ మ రికొన్ని రోజులు వేచి చూడాలని అధికారులు చెబు తున్నారు. కనెక్షన్లు లేని వారు గ్యాస్ వాడకం తక్కువగా ఉన్నవారి వద్ద ఓటీపీ తీసుకొని ఎంతో కొంత ముట్టజెప్పి సిలిండర్లు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతున్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
చిట్యాల: మండలంలోని వివిధ గ్రామాలలో రైతుల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.అశోక్కుమార్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు అర్జీలు పెట్టుకున్న సాదా బైనామా, భూ భారతి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ వసంతరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. రహదారి విస్తరణకు మంత్రి హామీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం బస్టాండ్ సమీపంలోని శ్రీపాదచౌక్ నుంచి హైస్కూల్ వరకు ప్రధాన రహదారి విస్తరణ కోసం హైదరాబాద్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తులు కలిశా రు. రహదారికి ఇరువైపులా ఉన్న ఇళ్లవాసులు ఏకతాటిపైకి వచ్చి 24 ఫీట్ల విస్తరణకు అంగీకరించినట్లు మంత్రికి వివరించారు. నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేయడంతో ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారివెంట ధర్మకర్త సత్యనారాయణ, కె.శ్రీనివాస్రెడ్డి, ఎస్.శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, మధు, అరుణ్, కిరణ్, బాబా, మహేశ్, చంద్రశేఖర్రెడ్డి, మోహన్, సతీష్, సురేష్, రంజీత్, సాయికృష్ణ ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. భూపాలపల్లి రూరల్: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందని జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టు కరుణాకర్ మాట్లాడారు. పేదలకు ఉపయోగపడే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఈ ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, స్థానిక కౌన్సిలర్లు, యువజన నాయకులు పాల్గొన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీసీ మహిళలు కుట్టు మిషన్ల కోసం సెప్టెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తెలిపారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులు వచ్చిన వారు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. రుణాలు సద్వినియోగం చేసుకోవాలి భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని వీధి వ్యాపారులు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, కమిషనర్ ఉదయ్కుమార్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వీధి వ్యాపారుల కమిటీ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ సమావేశానికి హాజరై వీధి వ్యాపారులకు అందుతున్న రుణాలు, రికవరీ, సీఐజీ గ్రూపుల ఏర్పాటు, పట్టణంలో ట్రాఫి క్కు అంతరాయం లేకుండా వెండింగ్ జోన్ల డీ–మార్కేషన్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో సభ్యులు రాంబాబు, టీ ఎల్ఎఫ్ అధ్యక్షురాలు రాధ, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు స్వప్న, ఎన్జీఓ ప్రతినిధి శ్యామ్, మెప్మా డీఎంసీ రాజేశ్వరి, సీఓ నిర్మల పాల్గొన్నారు. -
వనరులను వినియోగించుకోవాలి
కాళేశ్వరం: ప్రభుత్వ పథకాలు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రాజెక్టు మానిటరింగ్ అధికారి కౌసల్యా దేవి సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి మహదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రెయినేజీ, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నీటి సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిశీలించారు. గ్రామ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తెలిపారు. అనంతరం ఎడపల్లి గ్రామపంచాయతీలో విబిజి రాంజీ పథకం కింద ఫాంపాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, అదనపు డీఆర్డీఓ సురేష్, డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి రాధిక, ఏపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎడపల్లి సర్పంచ్ మోతే నీలారాణి, ఉపసర్పంచ్ గోగుల కృష్ణ, పంచాయతీ కార్యదర్శి మహేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్ పాల్గొన్నారు. -
పోరాటయోధుడు పాపన్న
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: మహోన్నత పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కేటీకే–5 ఇంకై ్లన్ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి మున్సి పల్ చైర్మన్ బుర్ర కొమురయ్యతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికా రి ఇందిరా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. -
పరిహారం ఇప్పిస్తానని రూ.10లక్షల వసూలు
● కాంగ్రెస్ నాయకుడిపై రైతుల ఆరోపణకాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ బ్యాక్వాటర్లో ముంపునకు గురైన భూనిర్వాసిత రైతులకు పరిహారం ఇప్పిస్తానంటూ 13మంది రైతు ల నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడని కాంగ్రెస్ నాయకుడు లోకుల పోశంపై రైతులు ఆరోపించా రు. మంగళవారం కన్నెపల్లి పంచాయతీ వద్ద విలేకర్లతో బాధిత రైతులు మాట్లాడారు. 2020లో మేడిగడ్డ బరాజ్ బ్యాక్వాటర్ కారణంగా తమ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఎంజాయ్మెంట్ సర్వేలో భూములు ఉన్నట్లు చూపించి పరిహారం ఇప్పిస్తానని చెప్పి పోశం తమ నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇప్పించకపోగా, తమ వద్ద తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అడిగితే ఇప్పుడు ఇస్తా.. అప్పుడు ఇస్తా అంటూ కాలయాపన చేస్తున్నాడని తెలిపారు. సమస్యను మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లగా.. మంత్రి సూచన మేరకు మహదేవపూర్ సీఐ సమక్షంలో పంచాయితీ నిర్వహించినా తమకు న్యాయం జరగలేదని రైతులు తెలిపారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. విలేకర్లతో మాట్లాడిన వారిలో ముంపు నిర్వాసిత రైతులు ముల్కల తిరుమల్, కావేరి సమ్మయ్య, కావేరి రాజయ్య, కా వేరి సురేష్, భూర్తి పెద్ద పోశాలు, భూర్తి మల్లయ్య, భూర్తి చిన్న సమ్మయ్య, భూర్తి మొండయ్య, కావేరి అంకయ్య, కావేరి తిరుపతి, కావేరి మారక్క, నలి మెల సారక్క, భూర్తి చిన్న పోచన్న పాల్గొన్నారు. ఆరోపణలు అవాస్తవం.. ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ రైతుల నుంచి డబ్బులు వసూలు చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నాయకుడు లోకుల పోశం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీ య కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. 13 మంది రైతుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేశానన్న ఆరోపణల్లో వా స్తవం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో నీటి నిల్వపై ఎన్డీఎస్ఏ సూచనల మేరకే చర్యలు జరిగాయని, నీటి నిల్వ లేకపోవడంతో భూములు ముంపునకు గురికాక పరిహారం మంజూరు కాలేదన్నారు. -
ఉన్నత లక్ష్యాలతో ముందుకుసాగాలి
● కలెక్టర్ రాహుల్ శర్మమల్హర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని పట్టుదలతో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. మంగళవారం మండలంలోని మల్లారం కస్తూర్బా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థినుల వసతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. విద్య, వసతి, భోజనం, ఆరోగ్యం, భద్రత, క్రీడలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజ నం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, డీఈఓ రాజేందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ వైద్యసిబ్బంది ఆదేశించారు. తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, డీటీ ఇమామ్బాషా, వైద్యులు పాల్గొన్నారు. -
సమాచార హక్కు చట్టం మరింత పటిష్టం
భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం అమలును మరింత పటిష్టం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి అధికారులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సమాచార హక్కు చట్టం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమలుతీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సమాచారంలో మ రింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార హక్కు చట్టం కింద అందుతున్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని తెలిపా రు. రికార్డులను సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించేందుకు అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాటారం ఆర్డీఓ రవీందర్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, ఆర్టీఐ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. డీఆర్వో వసంత కుమారి -
స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది
కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400లకోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
నేరాల నియంత్రణకు చర్యలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్రేగొండ: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం మండలంలోని పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
చేప చెరువుకొచ్చేలా..
● రేపే టెండర్ల ప్రక్రియ ● నెలాఖరులోగా సీడ్ వదిలేలా కార్యాచరణభూపాలపల్లి రూరల్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఈ సారి వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో జలకళ సంతరించుకుంది. చేప పిల్లల సీడ్ వదిలేందుకు ఇదే అనువైన సమయమని ప్రభుత్వం భావించింది. చేప పిల్లల సరఫరాకు సంబంధించి ఈ నెల 20న (గురువారం) కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికా రులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా 2.22 కోట్ల చేప పిల్లలను 781 చెరువులు, మూడు రిజర్వాయర్లలో వదిలేలా మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రవ్వు, బొచ్చె, బంగారు తీగ 35–40 ఎంఎం చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. గణపురం, భీం ఘన్పూర్, బొగ్గులవాగు ప్రాజెక్టుల్లో 80–100 ఎంఎం రవ్వు, బొచ్చె, మృగాల(గ్యాస్కట్) చేప పిల్లలను వదిలేలా కార్యాచరణ రూపొందించారు. సీడ్ సరఫరా సామర్థ్యానికి అనుగుణంగా కాంట్రాక్టర్లను కలెక్టర్ నేతృత్వంలో ఎంపిక చేయనున్నారు. ఎంపికై న వారు నిబంధనలకు అనుగుణంగా సీడ్ను జలాశయాల్లో వదలాల్సి ఉంటుంది. సాధారణంగా చేప పిల్లల సీడ్ను జూలై, ఆగస్టులో వదిలితేనే అవి మార్చి వరకు సమృద్ధిగా ఎదిగి మత్స్యకారులు పట్టుకుని విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుంది. గతేడాది నుంచి సీడ్ పంపిణీలో తీవ్ర జాప్యం అవుతోంది. డిసెంబర్ వరకు కూడా సీడ్ వదలడంతో చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ సారి కొంత ఆలస్యంగానైనా చెరువులు నిండినందున ప్రభుత్వం ప్రక్రియను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.మత్స్యపారిశ్రామిక సంఘాలు 133మత్స్యకార సంఘాల్లోని సభ్యులు 10,425జిల్లాలో చెరువులు 781చేప పిల్లల పంపిణీ లక్ష్యం 2.22 కోట్లు 35–40 ఎంఎం సైజ్ 1.82 కోట్లు 90–100 ఎంఎం సైజ్ 39.74 లక్షలు ఈ ఏడాది ఎల్నినోతో వర్షాలు ఆలస్యంగా కురిశాయి. ఇటీవల అల్ప పీడనంతో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లో నీరు చేరింది. అధికారులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తిచేస్తే మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – జోరు రాము, మత్స్యకారుడు, కాసీంపల్లి చేప సీడ్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఈనెల 20న టెండర్ పూర్తికానుంది. వీలైనంత త్వరగా నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో సీడ్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – విజయ్కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
వర్షాలు సమృద్ధిగా కురవాలి
రేగొండ: వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని వరుణయాగం నిర్వహించగా ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షించారు. మండలంలోని లింగాల ఎంజేపీలో సుమారు రూ.3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఇన్వర్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఆలయ మాజీ చైర్మన్ సంపత్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం రవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఎన్ఎంఎంఎస్తో ఉపకారం
ములుగు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశ పెట్టింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ఉపకార వేతనం ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ఉండేందుకు ఈ స్కాలర్షిప్ను తీసుకు వచ్చింది. అర్హతలు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దీంతో పాటు 7వ తరగతిలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో దరఖాస్తు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి. ఆన్లైన్లో పరీక్ష రుసుం చెల్లింపు.. అర్హత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఓసీ, బీసీ వారు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50లు ఆన్లైన్లో చెల్లించాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు పూర్తిచేయాలి. ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుంది. నవంబర్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు.. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఉపకారవేతనం అందిస్తారు. ప్రతీ ఏడాది రూ.12 వేలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. విద్యార్థులు వినియోగించుకోవాలి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందుతుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా చూడాలని ఆదేశించాం. – సిద్ధార్థ్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి దరఖాస్తుకు ఈనెల 24వరకు గడువు 8వ తరగతి విద్యార్థులు అర్హులు అర్హత సాధిస్తే ఏటా రూ.12వేలు అందజేత8వ తరగతి విద్యార్థులుగతంలో అర్హత సాధించిన విద్యార్థులు 2022 18 2023 212024 18 2025 19ములుగు 192 వెంకటాపురం(కె) 171 మంగపేట 168 గోవిందరావుపేట 155 ఏటూరునాగారం 134 వెంకటాపురం(ఎం) 90 తాడ్వాయి 69 వాజేడు 63 మల్లంపల్లి 43 కన్నాయిగూడెం 29 మొత్తం 1,114 -
రేపు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులతో కలిసి ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం కలెక్టర్ తన కార్యాలయంలో కమిషన్ చైర్మన్, సభ్యుల పర్యటన ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 19న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కులు, వివిధ శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అట్రాసిటీ కేసుల విచారణ, పరిష్కారం, వివిధ ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ పాయింట్ల అమలు తీరును పరిశీలించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ ప్రక్రియతో పాటు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించి శాఖల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్వో వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలిమండల, జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 67 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించి పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, వినతుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులతో కలెక్టర్ సమీక్ష -
సమస్యలు పరిష్కరించేందుకు తక్షణ చర్యలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించి పరిశీలించారు. బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, ఇతర పోలీస్ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదును ఓర్పుగా విన్న ఆయన సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి ఫిర్యాదును విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఉద్యోగ జీవితంలో బదిలీ సహజం
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగ జీవితంలో బదిలీ సహజం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే.జీవన్కుమార్ తెలిపారు. నిజామాబాద్ కోర్టుకు బదిలీ అయిన జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి జి.అనితవాణికి సోమవారం జిల్లా కోర్టులో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్ మాట్లాడుతూ.. ఎక్కడ ఉన్నా ఆయురారోగ్యాలతో, విధులపట్ల నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, న్యాయవాదులు వెంకటస్వామి, అబ్దుల్కలాం, సూపరింటెండెంట్లు రఘురాం, సదానందం, సీనియర్ అసిస్టెంట్ సురేందర్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్ కుమార్ -
పునర్నిర్మాణం డ్రాయింగ్స్ ఆలస్యం?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణ, రాతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పాత ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్కు సంబంధించిన డ్రాయింగ్స్, డ్రాఫ్ట్లు ఇంకా పూర్తికాలేదని సమాచారం. హైదరాబాద్కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతున్నది. ఇప్పటికే ఆలయ ప్రాకారాలు, పలు ఉప ఆలయాల కూల్చివేతలు తుది దశకు చేరుకున్నప్పటికీ, డ్రాయింగ్స్ ఆలస్యం కావడంతో ఆలయ గర్భగుడి కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దేవాదాయశాఖ స్థపతి వచ్చి గర్భగుడి తొలగింపునకు సంబంధించిన వివరాలు చెప్పి అనుమతి ఇచ్చిన తరువాతనే తొలగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిసింది. ఈ పరిణామంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధికి రూ.198 కోట్లు మంజూరు చేసి శంస్థాపన చేసిన విషయం తెలిసిందే. జూన్ 16న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గ్రామస్తులతో సమావేశమై మాస్టర్ ప్లాన్పై వివరించారు. మరునాడు శృంగేరిపీఠం శిశ్యులతో కళాప్రకర్షణ చేసి జూన్ 17న ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయంలోకి మార్చి ఉత్సవమూర్తులతో పూజలు ప్రారంభించారు. జూన్ 19న ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, ప్రాకారాల్లో విగ్రహాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఆ విగ్రహాలను పకడ్బందీగా ఎస్సార్ఆర్లో భద్రపరిచారు. అనంతరం జూలై 27న హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి టెండర్ ఖరారైంది. జూలై 30నుంచి పాత ఆలయ ప్రాకారాలు, ఉప ఆలయాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. డ్రాయింగ్, డిజైన్ల జాప్యంపై విమర్శలు.. వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు గోదావరి నది పుష్కరాలు 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ప్రభుత్వం ముందు నుంచి పనులపై ఫోకస్ చేస్తున్నారు. అప్పటిలోగా ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. డ్రాయింగ్స్, ఇతర డిజైన్లలో మరింత జాప్యం జరుగుతుండడంతో నిర్మాణ పనులకు సమయం తగ్గిపోతుందని, పది నెలల సమయం ఉండడంతో పుష్కరాల నాటికి పనులు పూర్తి పైన విమర్శలు వస్తున్నాయి. వివిధ శాఖలకు రూ.88.80 కోట్లతో నిధులు మంజూరు చేయగా, అందులో ఇరిగేషన్శాఖకు రూ.60కోట్లతో అష్టతీర్ధాలకు నిధులు మంజూరు కాగా, టెండరు కావాల్సి ఉంది. ఈవిషయమై ఆర్అండ్బీ డీఈఈ దేవేందర్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. రూ.198కోట్లతో కాళేశ్వరం రాతి నిర్మాణానికి గతంలో శంకుస్థాపన గర్భగుడి తొలగింపునకు స్థపతి అనుమతి పుష్కరాలకు పది నెలల సమయం మాత్రమే.. -
న్యాయ అవగాహన సదస్సులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు, ఖాసీంపల్లి గ్రామాల్లో సోమవారం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు, కోర్టు కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ప్రామిసరీ నోట్ వివాదాలు, కుటుంబ వివాదాలు, సివిల్ కేసులు తదితర సమస్యల్లో ఉన్నవారు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. పరస్పర సోదరభావంతో వివాదాలకు దూరంగా జీవించాలని పిలుపునిచ్చారు. న్యాయ సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 15100ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, వెంకటేష్, రాజ్కుమార్, గౌతమి పాల్గొన్నారు. -
దూరవిద్య డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రమణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కళాశాలలో యూనివర్సిటీకి సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, గృహిణులు తమ విద్యను కొనసాగిస్తూ డిగ్రీ పూర్తి చేసుకునేందుకు దూరవిద్య మంచి అవకాశమన్నారు. రెగ్యులర్ ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్మీడియట్, ఒకేషనల్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సులు, రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారు డిగ్రీ ప్రవేశాలకు అర్హులని తెలిపారు. డిగ్రీ ప్రవేశాలకు సెప్టెంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. వివరాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్టడీ సెంటర్ను సంప్రదించాలని లేదా 63014 96140 నంబర్లో వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రుక్సానా మొహమ్మద్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న అందజేయనున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరారు. ఎంపిక కోసం ఒక్కో విభాగం నుంచి రెండు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా ఈ నెల 24వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. హామీలు నెరవేర్చాలి భూపాలపల్లి రూరల్: ఎన్నికలకు ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం అంబేడ్కర్ సెంటర్కు గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సీఐటీయూ వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్, నాయకులు రాజేందర్, గట్టు శంకర్, వెంక ట్, సాంబయ్య, రమేష్, సుదర్శన్ పాల్గొన్నారు రామప్పలో శ్రావణ శోభ వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప దేవాలయంలో సోమవారం శ్రావణ సందడి నెలకొంది. శ్రావణమాసంలో తొలి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ సోమవారం సందర్భంగా రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రేషన్ షాపుల్లో కాంటాల తనిఖీ మంగపేట : మండలంలోని వివిధ గ్రామాల్లోని రేషన్ షాపుల్లో కాంటాలను లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శ్రీలత సోమవారం తనిఖీ చేశారు. గిరిజన సహకార సంస్థ, ప్రైవేటు రేషన్ డీలర్లు, మహిళా పొదుపు సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రేషన్ షాపుల్లో ప్రతి నెలా బియ్యం పంపిణీలో కొందరు నిర్వాహకులు ఎలక్ట్రానిక్ కాంటాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతో టెక్నాలజీని ఉపయోగించి తూకంలో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కమలాపురం, బోరునర్సాపురంలోని నాలుగు రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లను పరిశీలించారు. -
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
భూపాలపల్లి అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు పీసీపీఎన్డీటీ చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్ట ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించారు. స్కానింగ్ పరికరాలను నిర్వహిస్తున్న వైద్యుల పూర్తి వివరాలను ప్రతి కేంద్రంలో నమోదు చేయాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు బాధ్యతగా వ్యవహరించాలని డాక్టర్ మధుసూదన్ కోరారు. ఈ సమావేశంలో పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్, పీడియాట్రిషన్ డాక్టర్ సుధాకర్, గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య, ఎన్జీఓ ప్రతినిధి శ్యాంప్రసాద్, డెమో శ్రీదేవి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ -
పథకాలను యథావిధిగా అమలు చేయాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పదేళ్లపాటు అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతులకు ఎకరాకు రూ.15వేల సాయం, రైతు బీమా వంటి ఎన్నికల హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
మోడల్ స్కూళ్లలో సీబీఎస్ఈ
భూపాలపల్లి అర్బన్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన మోడల్ స్కూళ్లను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మోడల్స్కూళ్లలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానం అమలుచేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రణాళిక రూపొందించింది. విద్యాశాఖ నిర్ణయంతో జిల్లాలోని 6 మోడల్ స్కూళ్లలో చదువుతున్న సుమారు 2వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. 2013లో ఏర్పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించాలనే ఉద్దేశంతో 2013లో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలు ప్రతీ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తమ ప్రత్యేక తను చాటుకుంటున్నాయి. జిల్లాలో 6 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల, మల్హర్ మండలం ఎడ్లపల్లి, మహాముత్తారం మండల దొబ్బలపాడు, కాటారం మండలం గంగారంలో మోడల్ స్కూళ్లు ఉన్నాయి. పాఠశాలల్లో వసతులపై దృష్టి మోడల్ స్కూల్స్లో సీబీఎస్ఈ తరహా విద్యా విధానం అమలు కావాలంటే సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం, సబ్జెక్టు నిపుణులు, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం చేయాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ అంటే సిలబస్ మార్చడం మాత్రమే కాకుండా బోధన విధానంలోనూ మార్పులు తీసుకురావాలి. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ, బోధన సామగ్రి, విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా మూల్యాంకనం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం జిల్లాలో 6 మోడల్ స్కూళ్లుబోధనలో మార్పులుసీబీఎస్ఈ విధానంలో పాఠ్యాంశాలను బట్టి పట్టించడం ఉండదు. విద్యార్థుల్లో విషయ అవగాహన, తార్కిక ఆలోచన, విశ్లేషణాత్మక దృక్పథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రాధాన్యత ఉంటుంది. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను రోజువారి జీవితంతో అనుసంధానం చేసుకునేలా బోధనా పద్ధతులు ఉంటాయి. దాంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు, ఉన్నత విద్యలో ఎదురయ్యే పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సీబీఎస్ఈ విద్యా విధానం అమలైతే భవి ష్యత్లో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సులభమయ్యే అవకాశం ఉంటుంది. -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు
భూపాలపల్లి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాంజలి పథకం కింద కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆరుగురు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కెనరా బ్యాంకు భూపాలపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ ప్రమీల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఐదు, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున స్కాలర్షిప్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న సామాజిక చైతన్య నాటకోత్సవాలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కృష్ణకాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సామాజిక చైతన్య నాటకోత్సవాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం మూడో రోజున ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటికను హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ఎస్ఓటు జీఎం డి.శ్యాంసుందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌతమ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాటికను ప్రారంభించారు. నాటికలో గౌతమ బుద్ధుని జీవితం, బోధనలు, మానవతా విలువలు, అహింస, శాంతి, కరుణ, సమానత్వం, సత్యం, ఆత్మపరిశీలన వంటి అంశాలను కళాకారులు ఆవిష్కరించారు. రాజభోగాలను త్యజించి మానవాళి బాధలకు పరిష్కారం కోసం సత్యాన్వేషణలో పయనించిన బుద్ధుని జీవిత ప్రయాణాన్ని నాటిక రూపంలో ఆకట్టుకునేలా ప్రదర్శించారు. కోపం, ద్వేషం, హింసలకు దూరంగా ఉండి ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో నడవాలనే బుద్ధుడి సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో శాంతి, సహనం, మానవత్వం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నాటిక చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అధికార ప్రతినిధి విశ్రాంత్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, భూపాలపల్లి సీఎంఓఐఏ అధ్యక్షుడు ఎండీ.నజీర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ లైజన్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సేవా సభ్యులు పాల్గొన్నారు. -
అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయం!
సీఎం రేవంత్రెడ్డి ములుగు, పరకాల పర్యటన.. ఆద్యంతం ఆసక్తికరంసాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదివారం ములుగు, పరకాల పర్యటన అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ సందేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మేడారంలో వనదేవతలను దర్శించుకుని పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. అక్కడినుంచి ములుగులో హ్యామ్రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం.. చివరగా పరకాలలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, పట్టణ మౌలిక వసతులు, మహిళా సాధికారతకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన సీఎం.. సొంతపార్టీలోని అసంతృప్తులకూ చురకలు అంటించారు. చర్చనీయాంశంగా రాజకీయ సందేశం.. పరకాల సభలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమంతోపాటు రాజకీయ సందేశాలతోనూ సాగింది. ప్రజలనుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. ‘కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ చేస్తే నేను సోషల్ జస్టిస్ చేస్తున్నా.. ఆనాడు కుటుంబసభ్యులకు పదవులు కట్టబెడితే, మేం సామాజిక కోణంలో అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇలాంటి నేతలు మహిళలు, ప్రజలకు ఎలా న్యా యం చేస్తారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. పాలకుర్తిలాంటి చోట పాలన పరాకాష్టకు చేరి కొండలాంటి వ్యక్తులమని చెప్పుకున్న వారు ఎన్నికల్లో బండలా పగిలిపోయారని, ఇప్పటికై నా ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి బలమని గ్రహించాలని పేర్కొన్నారు. సీఎం పర్యటనతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఓరుగల్లుపై వరాల జల్లు వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణకు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. రెండేళ్లలో విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరంగల్ నగరంలో సుమారు రూ.5,700 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 32 నెలల పాలనలో రోజూ మూడు గంటలైనా రెస్ట్ తీసుకోలేదు. ప్రజలు అండగా ఉంటే చాలు ఏదైనా సాధిస్తా’ అని రేవంత్ స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు కావ్య, వేం నరేందర్ రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాంచంద్రునాయక్, మురళీనాయక్, ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, కలెక్టర్లు హేమంత్ సహదేవరావు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, సీపీ శ్వేత, ఎస్పీ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందడి.. ఓరుగల్లుపై వరాల జల్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలు.. నిరుద్యోగులకు మార్గదర్శనం రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సొంతపార్టీ అసంతృప్తులకు చురకలు సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం.. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో సీఎం రేవంత్రెడ్డి తాజా పిలుపు ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ప్రాధాన్యం దక్కగా.. మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రకాశ్రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో గతంలో రేవూరి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విబేధాలు బహిర్గతమైన సందర్భాలున్నాయి. ఫ్లెక్సీల వివాదం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, మంత్రి సురేఖ గైర్హాజరుకు అధికారిక కారణం వెల్లడికాకపోవడంతో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా.. ‘పరకాలలో రేవూరికే సీఎం అండ’ అన్న సంకేతాన్ని రేవంత్రెడ్డి పర్యటన ఇచ్చిందనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి
భూపాలపల్లి అర్బన్: నేటి (సోమవారం) నుంచి ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజలు తమ దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమంలో ఇవ్వాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కార్యక్రమాన్ని మండలస్థాయిలో నిర్వహిస్తున్నందున, ప్రజలు తమ సమస్యలు, వినతులు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. మండల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు, శ్రావణ మాసం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ స్వామివారికి నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజనంతో సందడి నెలకొంది. హేమాచలుడిని దర్శించుకున్న కమిషనర్ మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా హేమాచలక్షేత్రానికి వచ్చి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ఆలయంలోని స్వయంభు స్వామివారికి కమిషనర్ గోత్రనామాలతో అర్చనలు జరిపించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ సమావేశం ఈ నెల 17న (సోమవారం) హైదరాబాద్లోని సెక్రటేరియెట్లో నిర్వహించనున్నారు. కేయూలో 24వ కాన్వొకేషన్ను ఈఏడాది నవంబర్లో నిర్వహించాలని వర్సిటీ అదికారులు తాజాగా నిర్ణయించారు. గోల్డ్మెడల్స్కు, తదితర నిర్వహణ ఖర్చుల నిమిత్తం నిధుల వినియోగానికి ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ కోసం ఎజెండాలో పెట్టారు. అదేవిధంగా వివిధ పనులకు ఎంతెంత వెచ్చించనున్నారో ఇందులో చర్చించనున్నారు. ఆమోదం పొందాక ఈనెల 18న కేయూలో జరిగే పాలకమండలి సమావేశంలోను ఆమోదం లభించాల్సి ఉంటుంది. -
గిరిజన టైలరింగ్ హబ్
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులకు స్కూల్ యూనిఫాం స్వయంగా కుట్టి ఇచ్చేందుకు నిరుద్యోగ మహిళలతో నూతనంగా టైలరింగ్ హబ్ను ఏర్పాటు చేసింది. ఐటీడీఏ సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డులో ప్రత్యేక వసతులతో ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. సుమారు రూ.16 లక్షల బడ్జెట్తో 24 కుట్టు మిషన్లు, కాజాలు, బటన్స్ కుట్టే మిషన్లను తీసుకొచ్చారు. షెడ్డు ఏర్పాటుకు రూ. 6.50 లక్షలు కేటాయించగా మిషనరీ, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు రూ.9.50 లక్షలు కేటాయించారు. వీటితో పాటు ప్రత్యేక కార్పేట్, ఫ్యాన్లు, లైటింగ్ సిస్టమ్తో పాటు విద్యుత్ మోటార్లను సైతం అమర్చుతున్నారు. హబ్ ప్రారంభానికి ఏర్పాట్లు గతంలో ఐటీడీఏ పరిధిలో సుమారు 4 వేల మంది విద్యార్థులకు వివిధ గ్రామాల్లోని మహిళా సంఘాల్లో గల టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు నూతన దుస్తులు కుట్టే కాంట్రాక్ట్ ఇచ్చేవారు. ప్రస్తుతం అలా కాకుండా ఐటీడీఏ ద్వారానే ప్రత్యేక టైలరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో నైపుణ్యం గల మహిళలను కేటాయించి ఈ మిషనరీలతో చౌకగా కుట్టి ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. దీనివల్ల సమయం, ఖర్చు కూడా తక్కువ కానుండడంతో పాటు గిరిజన మహిళలకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ హబ్ను జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన పీఓ చిత్రామిశ్రా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు. దాంతో ఈ పనులు శరవేగంగా ముందుకుసాగుతున్నాయి. దాదాపుగా మిషనరీ ఫిట్టింగ్ పూర్తికాగా చిన్నచిన్న పనులు కొనసాగుతున్నాయి. ఈ హబ్ను అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడపనున్నారు. ప్రైవేట్ మార్కెటింగ్పై నజర్ ఈ హబ్లో శిక్షణతో పాటు ప్రభుత్వ ఆమోదిత కాంట్రాక్టుతో డ్రెస్లను తయారు చేయించనున్నారు. ఈ హబ్ ద్వారా ప్రైవేట్ మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును సైతం కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ రంగంలో రకరకాల డ్రెస్లు కుట్టి విక్రయిస్తే మహిళలు మరింత ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. దీంతో నిత్యం డ్రెస్లు కుట్టడంతో పాటు మార్కెటింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. తక్కువ ధరలకే నాణ్యమైన డ్రెస్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. బటన్స్, కాజాల స్టిచ్చింగ్ రూ. 16 లక్షల నిధులు కేటాయించిన ఐటీడీఏ -
రోడ్ల పైలాన్ ఆవిష్కరణ.. కలెక్టరేట్ ప్రారంభోత్సవం
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల (గ్రామీణ రహదారుల) అభివృద్ధి పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి కలెక్టరేట్కు చేరుకొని రూ.868 కోట్లతో జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనుల మరో పైలాన్ను ప్రారంభించారు. పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నూతన కలెక్టరేట్ను సీఎం రేవంత్రెడ్డి.. మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. కార్యాలయం అంతా కలియదిరిగి పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును కుర్చీలో ఆసీనులు చేసి శాలువా కప్పారు. నూతన కలెక్టరేట్ పక్కన ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు భవనాలు నిర్మించడంతోపాటు మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రూప్ ఫొటో దిగారు. -
ఇంధన స్వావలంబన దిశగా అడుగులు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: ఇంధన స్వాలంబన దిశగా సోలార్, బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతల వైపు అడుగులు వేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. హనుమకొండలో నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వరుణ్ రెడ్డి ప్రసంగించారు. సమష్టి కృషితో 33 కేవీ 11 కేవీ లైన్లలో విద్యుత్ అంతరాయాలను 36 శాతం వరకు తగ్గించగలిగామన్నారు. కవర్డ్ కండక్టర్లు, ఓల్టేజ్ బూస్టర్లు, నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరిగిందన్నారు. సామాజిక బాధ్యతగా 10,345 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్, జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. నిజామాబాద్ జక్రాన్పల్లిలో మొట్టమొదటి సోలార్ ప్లాంట్ నెలకొల్పామని చెప్పారు. ఎల్సీ యాప్ ద్వారానే ఎల్సీలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు శ్రీవన్ మినిట్ రూల్ తీసుకువచ్చామని చెప్పారు. భద్రతా మౌలిక సదుపాయాలకు రూ.57.97 కోట్ల ఖర్చు చేసినట్లు వివరించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1912 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐ వాయిస్ ఏజెంట్ను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంస్థ నష్టాలు రూ.1,370 కోట్ల నుంచి రూ.670 కోట్లకు తగ్గాయని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు తిరుమల్రావు, జయవంత్ రావు చౌహన్, అశోక్, మాధవరావు, సురేందర్, అన్నపూర్ణ, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణు బాబు, జాయింట్ సెక్రటరీలు రమేష్, శ్రీకృష్ణ పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకంకాశిబుగ్గ: దేశాభివృద్ధిలో వైద్యరంగం, వైద్యులు, విద్యార్థుల పాత్ర కీలకమని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. వరంగల్ కాళోజీ హెల్త్ వర్సిటీలో శనివారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వందన పాల్గొన్నారు. -
కేయూ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్లాల్, రమ, సుదర్శన్, అనితారెడ్డి, సుకుమారి, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులను అందజేశారు. తొలుత వీసీ ప్రతాప్రెడ్డి.. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
పగబట్టిన విధి!
హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్:/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది. మృత్యుపాశమైన ఇసుకలారీ.. కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్లో మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు.. అనారోగ్యంతో భర్త సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతిచెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరి స్టేటస్లో కొడుకు జ్ఞాపకాలు..పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్గా ఉంచుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకం కొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..? అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఒకే కుటుంబంలో రెండేళ్లలో ముగ్గురు మృతి తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం కన్నీరు మున్నీరైన బంధువులు -
హెల్త్ ఏటీఎం సేవలు
కాళేశ్వరం: మహదేవపూర్ సీహెచ్సీలో జూలై 31న ప్రారంభమైన హెల్త్ ఏటీఎం సేవలు కాటారం డివిజన్ ప్రజలకు ఉపయోగకరంగా మారాయి. హెల్త్ ఏటీఎం ద్వారా 64 వ్యాధులకు 15 రకాల పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టులు అందజేస్తున్నారు. రోగులు కాటారం, భూపాలపల్లి, పరకాల, మంచిర్యాల, హనుమకొండ లాంటి పట్టణాలకు వెళ్లకుండా ప్రజలకు సమ యం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయి. చేసే పరీక్షలు ఇవే.. ఎత్తు, బరువు (శరీర కొవ్వు విశ్లేషణ), రక్తపోటు, రక్తంలోని ఆక్సిజన్ శాతం, శరీర ఉష్ణోగ్రత, ఈసీజీ, హీమోగ్లోబిన్, రక్తంలో చక్కెర, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ పరీక్ష), హెచ్బీఏ1సీ (గత 2–3 నెలల సగటు చక్కెర స్థాయి), స్పైరోమీటర్ (ఊపిరితిత్తుల పనితీరు) పరీక్ష, ఆటో స్కోప్ (చెవి పరీక్ష), డెర్మా స్కోప్ (చర్మ పరీక్ష), డెంటల్ కెమెరా (దంతాల పరీక్ష) ఈ విధమైన 15 పరీక్షలు హెల్త్ ఏటీఎంలో కొద్ది నిమిషాల్లోనే అనేక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఏటీఎం మిషన్ వద్ద వ్యక్తి కూర్చొని, నిలబడి ఉండటం, రక్త పరీక్షల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. 15 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో పరీక్షల రిపోర్టులు అందజేస్తున్నారు. ఏ రోజు ఎన్ని పరీక్షలు చేశారంటే.. జూలై 31 9 ఆగస్టు 1 2 ఆగస్టు 4 10 ఆగస్టు 5 4 ఆగస్టు 6 7 ఆగస్టు 10 1 ఆగస్టు 12న 9హెల్త్ ఏటీఎంతో త్వరగా పరీక్షలు తెలుసుకోవచ్చు. 15 రకాల పరీక్షలకు అనుసంధానంగా ఉన్న 64 రకాల పరీక్షలు తెలుసుకోవచ్చు. మారుమూల ప్రాంతంలో ఇలాంటి హెల్త్మిషన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టెక్నిషియన్ అందుబాటులో ఉన్నారు. పూర్తిగా ఉచితంగా సేవలు అందుబాటులో ఉన్నాయి. – విద్యావతి, సూపరింటెండెంట్, మహదేవపూర్ సీహెచ్సీ -
కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ
శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి బాలాలయం, అనుబంధ దేవాలయమైన శ్రీఆదిముక్తీశ్వరాలయంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం భక్తుల సందడి నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ముందుగా త్రివేణిసంగమ గోదావరిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి సైకత లింగాలకు మొక్కారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాలసర్ప, శనిపూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు చేశారు. లక్షవత్తులు వెలిగించారు. దీంతో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. – కాళేశ్వరం -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
భూపాలపల్లి రూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నవంబర్ నుంచి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ డూప్లికేట్ చేయడానికి వీలు లేని విధంగా 9 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, స్కాలర్షిప్ తదితర ప్రభుత్వ సేవలు, పథకాలలో గుర్తింపు కార్డుగా ఉపయోగపడే విధంగా రూపొందించినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, భద్రత, సౌలభ్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, పోలీస్ బోర్డ్ సభ్యుడు రామనరసింహా రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ -
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
భూపాలపల్లి అర్బన్: అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని.. తెలంగాణ రైజింగ్–2047 విజన్తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. 223 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నాం. జిల్లాలోని 223 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 53,763 దరఖాస్తులు స్వీకరించాం. 70 గ్రామాల్లో భూముల రీ–సర్వేకు చర్యలు చేపట్టగా, 7 మండలాల్లోని 15 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. జిల్లాకు 4,586 ఇందిరమ్మ ఇళ్లు జిల్లాకు 4,586 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా 797 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 3,789 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటివరకు రూ.87.04 కోట్లు మంజూరు చేశాం. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం 50 శాతం రాయితీతో 135 మంది రైతులకు రూ.77.56 లక్షల విలువైన పరికరాలు అందించాం. 29,683 మంది రైతులకు రూ.299.34 కోట్ల రుణమాఫీ చేశాం. 271 మంది మరణించిన రైతుల కుటుంబాలకు రైతుబీమా కింద రూ.13.55 కోట్లు అందించాం. రైతు భరోసా కింద 1,27,151 మంది రైతులకు రూ.144.93 కోట్ల పెట్టుబడి సాయం అందించాం. పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యం జిల్లాలో 1,39,530 రేషన్ కార్డుల్లో 3,95,964 మంది సభ్యులు ఉన్నారు. వారికి ప్రతి నెలా 2,564 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు 17,301 నూతన రేషన్ కార్డులు మంజూరు చేశాం. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలతో చేపట్టిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ఉత్తమసేవలు అందించిన అధికారులు, సిబ్బంది, సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ, డీఆర్డీఏ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారం భూ భారతితో సమస్యల పరిష్కారం ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు -
ఆకట్టుకున్న నాటిక
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సీఈఆర్ క్లబ్లో శుక్రవారం హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నాటికను ప్రారంభించారు. అంబేడ్కర్ బాల్యం, విద్యాభ్యాసం, ఎదుర్కొన్న సామాజిక వివక్ష, విద్య ద్వారా సాధించిన ఉన్నత స్థానం, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలకపాత్రను కళాకారులు భావోద్వేగభరితంగా ప్రదర్శించారు. నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమానత్వం, రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక బాధ్యతలపై ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ జీవితం, ఆశయాలు, సమాజానికి ఆయన చేసిన సేవలను కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారని అభినందించారు. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజల్లో కళా, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తిని పెంపొందించేందుకు సింగరేణి సంస్థ ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఐఈడీ జ్యోతి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్రెడ్డి, సీఎంఓఏఐ అధ్యక్షుడు నజీర్, ఎస్సీ, ఎస్టీ లైజన్ అధికారులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సేవ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేయూ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభ కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షా తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో సైబర్ మోసాల నిరోధానికి కేయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సావస్కర్ వీడియో (రీల్) ద్వితీయ బహుమతి దక్కించుకుంది. అనంతరం సర్టిఫికెట్, ప్రశంసపత్రాలు అందించారు. డీజీపీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ చేతుల మీదుగా సావస్కర్ ప్రశంసపత్రం అందుకున్నారు. వర్సిటీ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సాయికుందన్, సంజయ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ సంతోష్ తెలిపారు. గోదావరి ఒడ్డున టేకు దుంగలు లభ్యం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం అటవీశాఖ అధికారి ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. బెస్తగూడెం గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలు ఉన్నాయిని విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. సిబ్బందితో కలిసి గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఐదు టేకు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.45 వేల వరకు ఉంటుందని తెలిపారు. -
స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 1,39,116 పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేపట్టాలని సూచించారు. జిల్లాస్థాయిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్ని మండలాల్లో పంపిణీ ప్రక్రియ చేపట్టి, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా కార్డుల పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి జలాలను తీసుకురావాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుగణపురం: జిల్లాలో 8 మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించడంతో పాటు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు రామప్ప సరస్సు నుంచి గణపసముద్రం చెరువుకు గోదావరి జలాలను వెంటనే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. శుక్రవారం గణపురం ఎంపీడీఓమ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మోకా సర్వే నిర్వహించి అర్హుడైన ప్రతీ రైతుకు పట్టా పాస్ పుస్తకం అందించాలన్నారు. సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఏఈ వెంకటరమణను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
రాజీమార్గమే ఉత్తమం
మొగుళ్లపల్లి: కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కంప అక్షయ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని బస్టాండ్, రైతు వేదికలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును మొబైల్వ్యాన్ను ఉపయోగించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కంప అక్షయ మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందేవారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు, ప్రామిసరీ నోట్ వివాదాలు, కుటుంబ వివాదాలు, సివిల్ కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడేవారు జిల్లా న్యాయ సేవధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. కేసుల్లో రాజీ మార్గాన్ని పాటించి పరిష్కారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాలు లేని సోదరాభావంతో జీవించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రఘురామ్, మొగుళ్లపల్లి ఎంపీడీఓ సురేందర్, సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కె.వెంకటేష్, ఎం.రాజ్కుమార్, పారాలీగల్ వాలంటీర్లు మంగళపల్లి శ్రీనివాస్, బండారి రామస్వామి, తిరుపతి, రమేశ్ పాల్గొన్నారు. -
పనులు చేపట్టాలని ఆందోళన
మల్హర్(కాటారం): కాటారం–మంథని ప్రధాన రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శంకరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగాలవాడ, గొల్లపల్లి గ్రామస్తులు రహదారిపై వాహనాలు నిలిపి నిరసన, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విస్తరణ పనులు చేపట్టకుండా జాప్యం చేయడంతో వాహనాలతో రహదారిపై భారీగా దుమ్ము, ధూళి వెలువడి పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి తక్షణమే నీళ్లు చల్లడంతో పాటు రోడ్డు పనులను పూర్తిచేయాలని కోరారు. ధర్నా కారణంగా కాటారం–మంథని వైపు వాహనాలు భారీగా నిలిచిపోయి రవాణా స్తంభించింది. కాటారం ఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
ములుగుపల్లిలో అగ్నిప్రమాదం
మహాముత్తారం : మండలంలోని ములుగుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మండపు లక్షిమల్లు ఇంటితోపాటు ఆయన కుమారులు ప్రభాకర్, మోహన్కు చెందిన ఇళ్లు సైతం కాలి బూడిదయ్యాయి. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు, పిల్లలు పాఠశాలకు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరు. ఈ ప్రమాదం షార్ట్సర్క్యూట్తోనా లేక గ్యాస్సిలిండర్ పేలి జరిగిందా అనే కోణంలో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఉండగా ఒక్క సిలిండర్ మాత్రం పేలి భారీ శబ్దం వచ్చినట్లు గ్రామస్తులు బాధితులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకునే సరికి ఇళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. మూడు కుటుంబాలకు సంబంధించిన ఇంట్లోని వస్తువులతో పాటు రూ.3లక్షల 80వేల నగదు, వెండి, బంగారు ఆభరణాలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులకు తెలిపారు. నగదుతోపాటు రూ.18లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు అధికారులకు వివరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఏఎస్సై దాట్ల కుమారస్వామి అగ్ని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద వారికి 75 కేజీల బియ్యం అందజేసి వారు ప్రస్తుతం నివాసం ఉండడానికి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో నాతో పాటు ఇద్దరు కుమారుల ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో మూడు కుటుంబాలు సర్వం కోల్పోయాం. కట్టుబట్టలతో ఉన్నాం. ప్రభుత్వం వెంటనే సాయం అందించి ఆదుకోవాలి. – మండపు లక్షిమల్లు, ములుగుపల్లి మూడిళ్లు, నగదు, సామగ్రి అగ్గిపాలు రూ.20 లక్షల ఆస్తి నష్టం -
96 మిల్లులు.. 73,809 టన్నులు!
రైస్మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపై సీరియస్గా ఉండాలి. భవిష్యత్లో వారికి సీఎంఆర్ ఇవ్వొద్దు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, సీఎంఆర్ అప్పగించకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలి. బకాయిలపై పక్కా లెక్కలు తేల్చాలి. బకాయిదారులనుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిగా రికవరీ చేయని వారిపై చర్యలు ఉంటాయి. – సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లాలో కలకలంరేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో కోట్లాది రూపాయల విలువైన సర్కారు ధాన్యం కొందరు రైసుమిల్లర్ల జేబుల్లోకి వెళ్లింది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం కేటాయించగా, వాటిని పక్కదారి పట్టించి ఆ డబ్బుతో కొందరు జల్సాలు చేస్తున్నారు. మరికొందరు బినామీ పేర్ల మీద బంగళాలు, కార్లు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సీఎంఆర్ ఎగవేసి తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రులు, పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కఠిన నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం డిఫాల్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారుల్లో గుబులు మొదలైంది. ఆరు జిల్లాల్లో రూ.166 కోట్లు.. మహబూబాబాద్లో అత్యధికం.. ఆరు జిల్లాలకు చెందిన కొందరు రైసుమిల్లర్లు గత వానాకాలం సీజన్ నాటికే రూ.348 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం. 2022–23 రబీ సీజన్కు సంబంధించి ఆరు జిల్లాల్లో గురువారం నాటికి 96 రైస్మిల్లుల నుంచి 73,809 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువకు సమానమైన రూ.166.30 కోట్ల రికవరీ ఇంకా పెండింగ్లో ఉంది. బకాయిల్లో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత వరంగల్ జిల్లా ఉంది. డిఫాల్టర్లకూ సీఎంఆర్..?.. ఇలాగైతే బాకీ తీరేదెప్పుడు? 2022–23 రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు ఇంతవరకు పూర్తిగా రికవరీ కాకపోవడం గమనార్హం. ఆ జాబితాలో ఉన్న కొందరికీ ఆ తర్వాత సీజన్లలో కూడా సీఎంఆర్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే కోట్లాది రూపాయలు ఎగవేసిన మిల్లర్లను డిఫాల్టర్లుగా చూపకుండా ఎలా ఇస్తారు? అన్న చర్చ కొందరు రైసుమిల్లర్లలోనే సాగుతోంది. ఉన్నతాధికారులు అడిగినప్పుడు బకాయిల వివరాలే చూపుతున్న స్థానిక అధికారులు.. డిఫాల్టర్ల జాబితా, సీఎంఆర్ కేటాయింపులు గోప్యంగా ఉంచుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికై నా బకాయి ఉన్న 96 మిల్లుల నుంచి ధాన్యం లేదా దాని విలువను పూర్తిస్థాయిలో రికవరీ చేయాల్సి ఉంది.ధాన్యం (మెట్రిక్ టన్నులు)మొత్తం మిల్లులుచెల్లించిన మిల్లులుసీఎంఆర్ ఇచ్చిన ధాన్యం (మె.టన్నులు)బకాయి ధాన్యం (మె.టన్నులు)ఇప్పటికీ సరఫరా అయినది (మె.టన్నులు)ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయి లెక్క ఇదీ.. సీఎంఆర్ బకాయిల కొండ... ఆరు జిల్లాల్లో రూ.348 కోట్లకుపైనే.. 2022–23 రబీ సీజన్ బకాయిలే భారీగా.. మహబూబాబాద్లో అత్యధికం ఆ తర్వాత వరంగల్, హనుమకొండ జిల్లాలు... బకాయి మిల్లర్లపై అధికారుల ఉదాసీనత.. సర్కారు సీరియస్.. డిఫాల్టర్లలో కలకలం...1,11,634బకాయి 73,80937,825216120(55.56%)జిల్లా సీఎంఆర్గా మొత్తం బకాయి బకాయి బకాయి ఇచ్చిన ధాన్యం మిల్లులు ధాన్యం మిల్లులు విలువ (మె.టన్నులు) (మె.టన్నులు) (రూ.కోట్లలో..) హనుమకొండ 13,015 34 8,683 12 19.42 వరంగల్ 32,425 67 21,512 27 48.54 జనగామ 4,429 45 3,258 27 7.49 జేఎస్ భూపాలపల్లి 15,900 20 4,204 5 9.59 మహబూబాబాద్ 40,758 25 33,309 12 74.90 ములుగు 5,107 25 2,843 13 6.36 -
న్యాయం చేయాలని రైతు కుటుంబం దీక్ష
చిట్యాల: ‘ఎమ్మెల్యే రావాలి–మాకు న్యాయం చేయాలి’ అని ఓ రైతు కుటుంబం గురువారం మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేసి దీక్ష చేపట్టింది. బాధిత రైతు కథనం ప్రచారం.. చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన అబ్బెంగుల రాజయ్య గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గర 14 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేసి పట్టా చేసుకున్నాడు. భూమి తమది అని భూమి అమ్మిన వ్యక్తి బంధువులు ఇటీవల భూమిలో పత్తి మొక్కలు పీకేశారు. ఎమ్మెల్యే పేరు చెబుతూ వేధించడమే కాకుండా చంపుతానని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. బెదిరింపులకు గురిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. బాధిత రైతు రాజయ్యకు సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేశ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య మద్దతు తెలిపారు. -
వెదురు సాగుతో అదనపు ఆదాయం
● కలెక్టర్ రాహుల్శర్మకాళేశ్వరం: రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు వెదురు సాగు చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెంచుతున్న వెదురు మొక్కల నర్సరీని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం, నిర్వహణ, పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు సాగు తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాలికంగా లాభాలను అందించే ఆదాయ వనరుగా నిలుస్తుందని తెలిపారు. రైతులు వెదురు సాగును ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో వెదురు మొక్కల పెంపకం కొనసాగుతోందని, సుమారు 70వేల వెదురు మొక్కలు రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 1,200 మంది రైతులను వెదురు సాగు కోసం గుర్తించినట్లు, 15 గుంటల భూమికి ఒక్కో రైతుకు 60 వెదురు మొక్కలను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. వెదురు సాగు చేపట్టిన రైతులకు వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు నర్సరీ నిర్వహణలో మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ, కాటారం ఆర్డీఓ రవీందర్, ఇండస్ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ తాండ్ర సురేష్, గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ నిర్మాణం పూర్తి చేయాలి పలిమెల: మండల కేంద్రంలో చేపట్టినన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పలిమెల మండలంలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. పర్యటనలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, డీఆర్డీఓ బాలకృష్ణ, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదనన్ పాల్గొన్నారు. -
పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు
భూపాలపల్లి: జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడాప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసనసభ ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ వివరించారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జెండా ఎగుర వేయనున్న విప్ శ్రీనివాస్రెడ్డి -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
మహాముత్తారం: ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. గురువారం మహాముత్తారం పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. కేసులను నాణ్యతతో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. జీపీ కార్యాలయం తనిఖీ చిట్యాల: మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారిని (డీపీఓ) శ్రీలత గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, శానిటేషన్ పనులపై పలు సూచనలు చేశారు. పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెవెంట ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్గౌడ్, వార్డు సభ్యులు తౌటం నవీన్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. 16న గర్భగుడి తొలగింపు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ప్రధాన ఆలయ గర్భగుడి ఈనెల 16న కూల్చివేస్తారని తెలిసింది. ఆర్అండ్బీ ఎస్ఈ, డీఈఈలు, ఇంజనీర్ల సమక్షంలో గర్భగుడి తొలగింపు చేపట్టనున్నారు. ఇప్పటికే పలు ఆలయాలు, ప్రాకారాలు తొలగించిన విషయం తెలిసిందే. నేటినుంచి సామాజిక చైతన్య నాటకోత్సవాలు భూపాలపల్లి అర్బన్: సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలు, మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. నేటి(శుక్రవారం) నుంచి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు స్థానిక కృష్ణకాలనీలోని సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్లో నాటక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం, ఆశయాలపై ‘శరణం శరణం గచ్ఛామి’, 15న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేల సామాజిక పోరాటంపై ‘సత్యశోధన’, 16న అంబేడ్కర్ ఆలోచనా ప్రస్థానం, బౌద్ధ తత్వం వైపు ఆయన ప్రయాణంపై ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటకాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, సేవా సమితుల సభ్యులు పెద్దసంఖ్యలో హాజరై నాటకోత్సవాలను విజయవంతం చేయాలని జీఎం కోరారు. అవయవదానంపై అవగాహన కల్పించాలి భూపాలపల్లి అర్బన్: అవయవ దానం గొప్పదని, మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ప్రజలను ప్రోత్సహించాలని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కంప అక్షయ మాట్లాడుతూ.. అవయవ దానంలో దక్షిణ భారతదేశం ముందంజలో ఉందన్నారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించి దానం చేయాలనే స్ఫూర్తిని కల్పించాలని సూచించారు. అవయవ దానం ద్వారా మరొకరికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రఘురాం, మెడికల్ ఆఫీసర్ రోహిణి, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, వెంకటేష్, రాజ్కుమార్, రాజు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
మూడు ముక్కలాట
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంతో పాటు సమీప మండలాల్లో రాత్రి పగలు తేడా లేకుండా పేకాట జోరుగా సాగుతోంది. ఒక్కో రౌండ్కు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు పెట్టి ఆడుతున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సైతం పేకాటలో మునిగితేలుతున్నారు. అడవుల్లో, మారుమూల గ్రామాల్లో గుడారాలు ఏర్పాటుచేసుకుని పేకాట ఆడుతున్నారనే విషయం బహిరంగంగా మాట్లాడుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. పేకాటలో ఆర్థికంగా నష్టపోతున్న వారి కుటుంబాలు తీవ్ర దీనస్థితిలోకి వెళ్తున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు గణపురం, చిట్యాల, కాటారం, మహాముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో పేకాటరాయుళ్లు తన ఆటను కొనసాగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ఊరి బయట పంట పొలాల్లో, భూపాలపల్లి చుట్టుపక్కల శివారు అడవుల్లోని చెట్ల పొదల్లో, ఖాళీ ఇళ్లల్లో జూదాన్ని సాగిస్తున్నారు. పేకాట మహమ్మారి గంజాయి, గుడుంబా కంటే ప్రమాదకరంగా మారింది. ఆట మాయలో పడ్డ అనేకమంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి కూలీలుగా మారి దీనస్థితిలోకి వెళ్తున్నారు. గతంలో పలుమార్లు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు జరిపితే ప్రముఖులు సైతం పట్టుబడగా మందలించి వదిలేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తనిఖీలు లేవు.. పట్టించుకోరు.. జిల్లాలోని అనేక గ్రామాలలో పేకాట ప్రభావం అధికంగా ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీలు చేయడం లేదు. పలువురు సింగరేణి కార్మికులు పేకాటకు బానిసయ్యారు. యువకులు, విద్యార్థులు సైతం ఆకర్షితులై వారి విలువైన జీవితాలను పాడుచేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు నిర్వహిస్తున్న దాడులకు భయపడి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అధికారుల రాకను ముందే పసిగట్టే విధానాన్ని కొనసాగిన్నారు. సాయంత్రం అయిందంటే పేకాటరాయుళ్లు ద్విచక్రవాహనాలపై ఇతర ప్రాంతాలకు వెళ్లుతుంటారని, కొన్ని రోజులు ఇతర ప్రాంతాల వారు మండలాలకు వస్తారని ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పేకాటను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రాలు దాటుతున్న ఆటగాళ్లు.. తెలంగాణలో పేకాట క్లబ్లు లేకపోవడంతో పేకాటలో ప్రతిభ కలిగిన వారు రాష్ట్రాలు దాటి క్లబ్లకు వెళ్లి ఆడుతున్నారు. క్లబ్లలో ప్రత్యేకమైన ఆఫర్లు ఉండటంతో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని టీంలుగా మారి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి మరీ ఆడుతున్నారు. రెండు మూడు రోజుల పాటు వెళ్లి పేకాడి కొందరు రెండు, మూడు లక్షల రూపాయలను కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు అప్పల పాలై ఆస్తులు అమ్మ డం లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నారు. 16 కేసులు నమోదు ఈ ఏడాది జనవరి మాసం నుంచి సీసీఎస్ పోలీసులు పలు పేకాట స్ధావరాలపై దాడులు నిర్వహించారు. ఇప్పటివరకు 16 స్థావరాలపై దాడులు చేపట్టి 119 మంది పేకాట రాయుళ్లను ఆరెస్ట్ చేశారు. సుమారు రూ.2.50లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జోరుగా పేకాట రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగింపు జిల్లాకేంద్రంతో పాటు మండలాల్లో కూడా.. -
నాణ్యమైన విద్య, వసతులు కల్పించాలి
● డీటీడీఓ నాగసాగర్ మల్హర్(కాటారం)/కాళేశ్వరం : ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, వసతులు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి నాగసాగర్ సూచించారు. గురువారం కాటారం మండలంలోని మేడిపల్లి, మహదేవపూర్, కాళేశ్వరం ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. బాలికల పాఠశాలల్లో విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భోజనం, వసతులపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని ఆరాతీశారు. మహదేవపూర్ ఆశ్రమ పాఠశాలలో డీటీడీఓ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, కామన్ మెనూపై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం నాగసాగర్ మాట్లాడుతూ.. మూడు పాఠశాలల్లో కామన్ మెనూ సక్రమంగా అమలవుతోందని, ఉపాధ్యాయులు రూపొందించిన లెసన్ ప్లాన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల మధ్య మంచి సమన్వయం ఉందని, పాఠశాలల్లో సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లను ఆదేశించారు. -
వనరుల సంరక్షణకు
జలసిరిభూపాలపల్లి రూరల్: భూగర్భ జల వనరుల సంరక్షణతో పాటు ప్రస్తుత ఎల్నినో రక్కసిని తరిమేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకం నిధులతో గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, ఊటకుంటలు, ఓపెన్ బావుల నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులను తరిమికొట్టి భూగర్భ జలాలు పెంచాలని నిర్ణయించింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, ఆ మేరకు రైతులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటిని సంరక్షించేలా.. జలసిరి కార్యక్రమంలో చేపట్టే పనులన్నీ వర్షపు నీటిని ఒడిసి పట్టడమే ముఖ్య లక్ష్యం. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. పంట పొలాల్లో వర్షపు నీటిని సంరక్షిస్తూ సాగుకు వినియోగించుకునేలా నీటి కుంటలు (ఫాంపాండ్స్), నీరు అడుగంటిన బోర్ బావులు, చేతిపంపుల వద్ద రీచార్జ్ గుంతల నిర్మాణాలతో పాటు నీటి కరువు ఏర్పడకుండా ఉండేలా చిన్నపాటి చెరువు (ఊటకుంట)లను నిర్మించనున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధితో పాటు నీటి సంరక్షణకు తోడ్ప డేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్, అజీవిక మిషన్ (వీబీజీ రాంజీ) పథకం కింద ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. వేగంగా అనుమతులు.. ప్రస్తుత వర్షాబావ పరిస్థితుల్లో వీటి అవసరం చాలా ఉండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లా యంత్రాంగం తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు పనుల గుర్తింపుతో పాటు అనుమతులను కూడా వేగంగా ఇస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 46,000 ఇంకుడు గుంతలను నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 3,753 గుంతలను గుర్తించారు. ఫాంపాండ్స్ 1,056 పనులకు 384 పనులను గుర్తించారు. అలాగే 240 ఊటకుంటలకు 64, కమ్యూనిటీ ఇంకుడుగుంతలు 72, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు 73, ఓపెన్ బావులు 9 నిర్మించాలని గుర్తించారు. ఆయా పనులకు వెంటనే అనుమతులు కూడా ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం వీబీజీ రాంజీ పథకం కింద పనులు ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రత్యేక కార్యాచరణజలసిరి కార్యక్రమంతో వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం అందించే నిధులతో నిర్మించుకోవాలి. ఇంకుడుగుంతలు, ఊటకుంటలు, బోర్వెల్ రీచార్జ్, ఫాంపాండ్స్ నిర్మాణాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. –బాలకృష్ణ, డీఆర్డీఓ -
ఐక్యత భావమే..దేశానికి రక్షణ
● ఘనంగా హర్ ఘర్ తిరంగా..భూపాలపల్లి రూరల్: ఐక్యత భావమే.. దేశానికి రక్షణ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఘనంగా హర్ ఘర్ తిరంగా.. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. దేశం ఐక్యంగా ఉంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఎవరు కూడా ఓడించలేరన్నారు. ప్రతిఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి, కౌన్సిలర్ యుగేందర్, పార్టీ నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థుల చెంతకు సమాచారం..
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తన అఫీషియల్ పోర్టల్ అ యిన వెబ్సైట్, ఇన్స్ర్ట్రాగాంలో కళాశాల ప్రాధాన్య త కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతిరోజూ విద్యార్థులు ఆ వెబ్సైట్, ఇన్స్ట్రాగాంను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఆ చిన్న సమాచారం తెలి యాలన్న ఉద్దేశంతో క్యాంపస్లో రెండు డిజిటల్ ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్ఈడీ బోర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటా యి. అదేవిధంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్, పేపర్ ప్రజంటేషన్,పే టెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్గా డిజిటల్ ఎల్ఈడీ సమాచారం నిలుస్తోంది. విద్యార్థుల చెంతకు... నిట్ వరంగల్లో సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, హాస్టల్స్, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్హౌస్ వద్దనుంచి వెళ్లాల్సి ఉంటుండడంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని నోట్ చేసుకుంటున్నారు. నిట్లో కొత్తగా డిజిటల్ ఎల్ఈడీల ఏర్పాటు.. ఆసక్తిగా తిలకిస్తూ సమాచారం తెలుసుకుంటున్న విద్యార్ధులు -
పంద్రాగస్టుకు స్మార్ట్ రేషన్కార్డు
భూపాలపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని రేషన్కార్డుదారులు అందరికీ నూతన పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ప్రారంభించిన వెంటనే అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారులకు కొత్త కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ కార్డులు 9,537, ఆహార భద్రత 1,29,960, అన్నపూర్ణ కార్డులు 33 ఉన్నాయి. మొత్తం 1,39,530 రేషన్కార్డులు, 3,95,964 మంది లబ్ధిదారులు ఉన్నారు. కార్డు కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి కొత్త కార్డులు త్వరలోనే అందనున్నాయి. ఇందుకోసం జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రోజున ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొందరికి కార్డులు అందజేసి అనంతరం మండలాల వారీగా రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లామినేషన్ రూపంలో.. లామినేటెడ్ (పీవీసీ) రూపంలో అందించనున్న స్మార్ట్ రేషన్ కార్డు వాటర్ ప్రూఫ్, క్రెడిట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు పరిమాణంలో ఉంటుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూ ఆర్ కోడ్తో పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు. కార్డుపై ప్రభుత్వ లోగో, పౌరసరఫరాల శాఖ పేరు ఉంటుంది. ముందు భాగంలో కార్డుదారుడి ఫొటో, వెనుక భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. రేషన్ దుకాణం నంబర్, డీలర్ వివరాలు, సివిల్ సప్లై శాఖ టోల్ ఫ్రీ నంబర్, ఫిర్యాదుల కోసం వెబ్సైట్ వివరాలు ఉంటాయి. అత్యాధునికతతో తయారు చేసిన ఈ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లబ్ధిదారులకు అందజేయనున్నారు. మండలం రేషన్కార్డులు భూపాలపల్లి 23,853చిట్యాల 12,660గణపురం 12,844కాటారం 12,910పలిమెల 2,722 మహాముత్తారం 9,251 మహదేవపూర్ 11,416 మల్హర్ 9,934 మొగుళ్లపల్లి 12,618 టేకుమట్ల 9,601 రేగొండ 14,639 కొత్తపల్లిగోరి 7,082 మొత్తం 1,39,530 పంపిణీకి సిద్ధం చేస్తున్న అధికారులు జిల్లాలో 1,39,530 కార్డులు -
పవిత్ర మాసం..శ్రావణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శ్రావణమాసం సందర్భంగా శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయం అనుబంధ దేవాలయమైన శ్రీఆదిముక్తీశ్వర స్వామి ఆలయం, బాలాలయంలో ఉత్సవ మూర్తులను దర్శించుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈనెల 13 (గురువారం) నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణ నేపద్యంలో పాత ఆలయాలను కూల్చివేస్తున్నారు. దీంతో జూన్ 17 నుంచి అడవిలో వెలసిన ఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రధాన ఆలయంలోని ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి పూజిస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ఈ ఏడాది శ్రావణమాసంలో ఆదిముక్తీశ్వరాలయంలో పూజలకు సిద్ధం చేశారు. ముఖ్యంగా క్యూలైన్లు, లడ్డుపులిహోర కౌంటర్లు ఏర్పాటు చేశారు. బాలాలయంలో ఉత్సవ మూర్తుల దర్శనాలు, ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఆలయంలో స్థల ప్రభావంతో లక్షపత్రి పూజలను రద్దు చేశారు. రెండవ వారంలో వరలక్ష్మీవ్రతాలు నిర్వహిస్తారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం కొంత మేర ఏర్పాట్లు చేశారు. తగ్గనున్న భక్తుల రాక పునర్నిర్మాణం జరుగుతున్న నేపద్యంలో పాత ఆలయాలన్ని కూల్చి వేస్తున్నారు. ఈక్రమంలో ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తున్న నేపద్యంలో భక్తులు ప్రధాన ఆలయానికి వచ్చినట్లు ఇక్కడికి వచ్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీర్ణోద్ధరణ నేపథ్యంలో ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నందున ఆదిముక్తీశ్వరాయలంలో ఏర్పాటు చేశాం. బాలాలయంలో దర్శనాలు, ఆది ముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలకు సర్వం సిద్ధం చేశాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. – మహేష్, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం కాళేశ్వరంలోని బాలాలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక దేవస్థానం జీర్ణోద్ధరణ నేపథ్యంలో తగ్గనున్న భక్తులు -
శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి
రేగొండ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి, వారికి సైన్స్పై ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్ అధికారి స్వామి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇన్స్పైర్ అవార్డు ఆన్లైన్, ఖాన్ అకాడమీ బుక్ ఆఫ్ డిజిటల్ లర్నింగ్ తదితర అంశాలపై ఒక రోజు ఓరిఝెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పరిశోధన విధానాన్ని పెంపొందించాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎన్నుకుని విద్యార్థులచే ప్రాజెక్ట్ తయారు చేయించి జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవేందర్, ఆర్పీలు ప్రవీణ్, సుమన్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెలిపాడ్ పనులు, బారికేడ్లు, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పైలాన్ నిర్మాణంతో పాటు ఇతర పనులను గడువులోగా పూర్తి చేసి, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గట్టమ్మ దేవాలయ పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ, వాహనాల పార్కింగ్ స్థలాలతో పాటు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. హెలిపాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, ఆలయ పరిసరాల్లో చేస్తున్న పనులను కలెక్టర్ సహదేవరావు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి వెళ్లి పరిశీలించారు. సీఎం గిరిజన సంప్రదాయాల ప్రకారం వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నందున ఆశీర్వచనాలు, శేషవస్త్రాల సమర్పణ, మొక్కులు చెల్లింపు తదితర కార్యక్రమాల్లో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్తో పరిసరాలను సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఎస్పీ రవీందర్, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో తనిఖీ చేశారు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులకు స్పార్క్ ట్రైనింగ్పై అందుతున్న శిక్షణ వివరాలను ఇన్స్ట్రక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, రీడింగ్ హాల్ను పరిశీలించి విద్యార్థుల వినియోగంపై ఆరా తీశారు. స్కూల్ లెడ్ క్లబ్లు నిరంతరం నిర్వహించాల ని, డిజిటల్ బ్లాక్ బోర్డులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి అన్ని సబ్జెక్టుల్లో పట్టుసాధించి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కల్తీ శ్రీనివాస్, అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
● ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలపై నివేదిక అందించాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ఎల్నీనో ప్రభావంతో భవిష్యత్లో నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నందున రైతులు తప్పనిసరిగా తక్కువ నీటితో పండి, అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో భవిష్యత్లో నీటి లభ్యత, పంటల మార్పిడి అంశాలపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల మార్పిడి, వైవిధ్యీకరణ చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 72వేల ఎకరాల్లో వరి వేశారని వెల్లడించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగు విస్తీర్ణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని వివరాలు, పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ డేటాలో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మితో పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల జిల్లా అధికారులు, ఏడీఏ, ఎంఏఓలు పాల్గొన్నారు. నీటి నిల్వలపై నివేదిక అందించాలి.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నీటి నిల్వలపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇరిగేషన్, మిషన్ భగీరథ వ్యవసాయ శాఖలతో నీటి లభ్యత, పంటల సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో నీటి నిల్వలు, మంచినీటికి నీటి నిల్వలు, ఆయకట్టు పరిధిలోని సాగునీటి అవసరాలపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత నీటి నిల్వలు, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ఆయకట్టు పరిధి, రైతుల అవసరాలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించి, నీటి లభ్యత, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు సాగునీటి వినియోగంపై తగిన మార్గదర్శకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధి కారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కా ర్యాలయం నుంచి చేయూత సామాజిక భద్రత పింఛన్లు కొరకు దరఖాస్తులు స్వీకరణ, జలసిరి, ప్రతీ సోమవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహణ, వనమహోత్సవం తదిత ర అంశాలపై ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చేయూత పింఛన్ల కొత్త మంజూరుకు సంబంధించి సెర్ఫ్ సర్క్యూలర్ ప్రకారం అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కా ర్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
రైతులను ఆదుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రేగొండ: చలివాగు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చెన్నాపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలివాగు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంత భూముల సాగుకు సహకరించాలన్నారు. రైతులు నార్లుపోసి 45 రోజులు గడుస్తున్నా నీళ్లు లేకపోవడంతో నాట్లు ప్రారంభించలేదన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద తొమ్మిది పంప్లను ఆన్చేసి, చలివాగు ప్రాజెక్ట్ను నింపి నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా విమర్శించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కరువని ఎద్దేవా చేశారు. 24 గంటల్లోగా నీటిని విడుదల చేయకపోతే మళ్లీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్ట్, పంప్ హౌస్ను నాయకులతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, పాల్గొన్నారు. -
వదలరు.. కదలరు!
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ‘ఔట్సోర్సింగ్’ హ వాకాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవసరం ఉన్న చోట విధులు నిర్వర్తించాల్సిన ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిఽధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయాల్సి ఉంది. వైద్యసిబ్బంది సైతం ఎక్కడ వైద్యసేవలు అవసరం ఉంటే అక్కడికి వెళ్లక తప్పదు. అయితే, సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తీరే వేరుగా ఉంది. చివరకు వారు అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంజీఎంకు అనుబంధంగా హాస్పిటల్.. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా పీఎంఎస్ఎస్వై పఽథకం కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వరంగల్ కాకతీయ వైద్యకళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో అందిస్తున్న వైద్యసేవలతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రత్యేకంగా సూపర్ సేవలు అందిస్తోంది. ఇందులో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ రెండు హాస్పిటల్స్లో అధికారుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది తీరు వేరే అన్నట్లు తాము ఇక్కడే పనిచేస్తామంటూ కొందరు సిబ్బంది పట్టుబడుతున్నట్లు సమాచారం. వైద్యసిబ్బంది తీరు ఇలా.. సూపర్ స్పెషాలిటీలో ఎక్కువ మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. చివరకు ఎక్కువ మంది వైద్యులు కూడా కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. 120 మంది స్టాఫ్నర్సులు ఉండగా.. ఇటీవల 20 మంది వరకు ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేసి వెళ్లారు. ఐదారుగురు మూడు నెలల నుంచి రాకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొందరూ మెడికల్ లీవ్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 90 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది 98 వరకు ఉండగా, వీరిలో ఆరుగురు రాజీనామా చేసి వెళ్లారు. కొందరు రెండు నెలల నుంచి లాంగ్ లీవ్లో ఉంటూ ఏమి చేస్తున్నారో తెలియదు. ఇక 115 మంది వరకు పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది విధులకు సరిగా హాజరు కావడం లేదని సమాచారం. ఆస్పత్రిలో ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు ఎంజీఎంలో అవసరం ఉన్నా వెళ్లనంటున్న మిగులు సిబ్బంది అధికారుల ఆదేశాలను పట్టించుకోని తీరు పేషెంట్లు తక్కువ.. వైద్యసిబ్బంది ఎక్కువప్రతిరోజు ఓపీ ఉన్నప్పుడు 400 నుంచి 500 వరకు పేషెంట్లు వస్తుంటారు. ఇక ఇన్పేషెంట్ల పరంగా 20 నుంచి 25 వరకు మాత్రమే ఉంటారని సమాచారం. దీనిని బట్టి చూస్తే పేషెంట్లు తక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎంజీఎంకు వెళ్లాలంటూ అఽధికారులు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసినా కొందరు సిబ్బంది మేము వెళ్లమంటూ చెబుతూ సూపర్లోనే పనులు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో స్టాఫ్నర్సులు, పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే పనిచేస్తామని పట్టుబట్టడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అధికారులే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని గాడిలో పెట్టాల్సిన సూపర్వైజర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియాలి. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా పనిచేయాలని చెబితే వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రజాప్రతినిధి నుంచి టక్కున ఫోన్కాల్ వస్తుంది. దీంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా బహిరంగమే అయినా ‘ఎవరికీ వారే యమునా తీరే’ అన్నట్లు ఉందనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎంజీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. -
అభ్యసన స్థాయి మెరుగుదలకు కృషి
● డీఈఓ రాజేందర్కాళేశ్వరం: విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగుదలకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ ముద్దమల్ల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మహదేవపూర్ మండలం కాళేశ్వరం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్, పీటీఏ సమావేశాల నిర్వహణ, గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ రాజేందర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 95 నుంచి 136కు పెరగడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఇది పాఠశాలపై తల్లిదండ్రులు, స్థానిక ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడం ఒక మంచి పరిణామమని, అదే సమయంలో వారికి నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయులపై మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అనేక రకాల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు నేర్చుకున్న ప్రతీ అంశాన్ని తరగతి గదిలో సమర్థవంతంగా అమలుచేసి, దాని ప్రయోజనాలను విద్యార్థులకు అందేలా కృషిచేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొనికల రాజేందర్ పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల ప్రగతి తదితర అంశాలను జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు. -
పింఛన్ల దరఖాస్తుకు 31 గడువు
భూపాలపల్లి: పింఛన్ల మంజూరుకు ఆగస్టు 31లోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల అంశంపై డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం రవితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పింఛన్ల పథకంలో భాగంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లు గీత, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, సికిల్సెల్, హిమోఫీలియా వంటి రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామసభలు, ప్రజావాణి కార్యక్రమాల్లో ఇప్పటికే అవసరమైన ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అర్హులైన వారు అవసరమైన ధృవీకరణ పత్రాలతో తమ దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించి తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
నిష్పాక్షిక సేవలు అందించాలి
● ఎస్పీ సరిశెట్టి సంకీర్త్ మల్హర్: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతీ పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, నిష్పాక్షికంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సిబ్బందికి సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కొయ్యూరు పోలీస్స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసుల వాహనాల పరిష్కార పురోగతిపై ఆరా తీశారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదుచేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ె పెపండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించి, దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దర్యాప్తు వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పోలీస్స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ తనిఖీలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, కొయ్యూరు ఎస్సై మహేందర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్వీపర్, కుక్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న స్వీపర్, స్కావెంజర్, హెడ్ కుక్, అసిస్టెంట్కుక్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 17న సాయంత్రం 3గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. టేకుమట్ల మండలంలో స్వీపర్ అండ్ స్కావెంజర్, పలిమెలలో హెడ్కుక్, గణపురం, మల్హర్, మొగుళ్లపల్లి మండలాల్లో అసిస్టెంట్ కు క్, మొత్తం 5 పోస్టులు ఉన్నాయని తెలిపారు. జిల్లావాసులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రోడ్ల అభివృద్ధికి నిధుల మంజూరు మల్హర్: కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్ మండలం తాడిచర్ల, కాటారం, మాహాముత్తారం, మహదేవపూర్ మండలంలోని రోడ్ల అభివృద్ధికి హ్యామ్ పథకం కింద రూ.141.63 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొయ్యూరు నాగులమ్మ క్రాస్ నుంచి తాడిచర్ల(12.92 కిలోమీటర్లు) వరకు రూ.15.02 కోట్లు, తాడిచర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి (2.50 కిలోమీటర్లు)వరకు రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి. కాటారం మండలం ప్రతాపగిరి నుంచి బొప్పరాం(8 కిలోమీటర్లు) వరకు రూ.7.02 కోట్లు, మహాముత్తారం మండలం పెగడపల్లి నుంచి మేడారం(19.20 కిలోమీటర్లు) వరకు రూ.22.23కోట్లు, మహదేవపూర్ నుంచి ముకునూర్ వరకు 30 కిలోమీటర్లకు వరకు డబుల్ రోడ్డు, 20 కిలోమీటర్లు సింగిల్ లేయర్ (మొత్తం 52 కిలో మీటర్లు)కు రూ 95.17 కోట్లు నిధులు మంజూరయ్యాయి. రూ.5కోట్లు మంజూరు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం చండ్రుపల్లి–నాగేపల్లి గ్రామాల నడుమ వాగుపై ప్రతీ వర్షకాలంలో లో లెవల్ వంతెనతో వరదనీరు చేరి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చండ్రుపల్లి వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హ్యామ్ నిధులు నుంచి రూ.5కోట్లు ఆర్అండ్బీ శాఖకు మంజూరు చేశారు. త్వరలో టెండర్ పూర్తయి నిర్మాణం జరుగుతుందని సోమవారం కాటారం పర్యటనలో మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో ఒక ఏఎన్ఎం పోస్టును భర్తీ చేయుటకు ఈనెల 17 తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. లాడ్జిల తనిఖీ కాళేశ్వరం: కాళేశ్వరంలోని లాడ్జిలను సీఐ ఎన్.వెంకటేశ్వర్లుతో పాటు కాళేశ్వరం, మహదేవపూర్, పలిమెల ఎస్సైలు జి. తమాషారెడ్డి, సాంబమూర్తి, శశాంక్, భగవత్ తమ బృందాలతో మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం కాళేశ్వరం పోలీస్స్టేషన్లో లాడ్జి యజమానులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో లాడ్జిల నిర్వహణకు అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలని, వివరాలు పక్కగా మెంటెయిన్ చేయాలని తెలిపారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ‘ఎవరొచ్చి..పోతున్నారు’ అనే శీర్షికన వచ్చిన కథనంతో పోలీసులు స్పందించి తనిఖీలు చేశారని తెలిసింది. ఈ క్రమంలో తనిఖీలు, ఇతర ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో సివిల్ పోలీసులు, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. హిందీ పోస్టుకు హిందీ సబ్జెక్టుతోపాటు బీఏ లేదా బీఓఎల్ హిందీ ప్రవీణ/విధ్వాన్ లేదా ఎంఏ హిందీతోపాటు బీఈడీ లేదా ప్రచారక్ లేదా శిక్షణా కళా ప్రవీణ డిప్లొమా లేదా హిందీపండిట్ కలిగి ఉండాలన్నారు. -
కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమం
చిట్యాల: మండలంలోని గ్రామాలలో వివిధ కేసులలో ఉన్న వారికి న్యాయం జరిగేందుకు రాజీమార్గమే ఉత్తమమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలకేంద్రంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ సేవలకోసం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వద్ద గ్రామస్తులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలు తలెత్తినప్పుడు రాజీ లేదా మధ్యవర్తిత్వం ఉత్తమమైనదని అన్నారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.అక్షయ, సూపరింటెండెంట్ రాఘురామ్ మాట్లాడుతూ మీడియేషన్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ ఆరెపల్లి తిరుపతి, వార్డు సభ్యులు తౌటం నవీన్, చందు, తదితరులు పాల్గొన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ -
భూపాలపల్లి నియోజకవర్గం వివరాలు..
అనామలీస్ ఓటర్లుభూపాలపల్లి: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ కార్యక్రమం తొలి ఘట్టం సోమవారం రాత్రితో ముగిసింది. వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారు, పేర్లలో తప్పులు దొర్లిన, డేటా లభించని వారు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో వారందరికి నోటీసులు ఇచ్చేందుకు ఎన్నికల విభాగం అధికారులు సిద్ధమవుతున్నారు. ఎవరూ ఊహించని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గంలో పలు కారణాలతో సుమారు 75వేల మందికి నోటీసులు అందనున్నట్లు తెలుస్తోంది. 35,918 ఓట్లు తొలగించుడేనా? నియోజకవర్గంలోని 12 మండలాల్లో మ్యాపింగ్ చేయని, మృతిచెందిన, పర్మనెంట్గా ఇతర ప్రాంతాలకు వెళ్లిన, రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగిన, సమాచారం ఇవ్వనివారు 35,918 మంది ఓటర్లు ఉన్నారు. వీరిందరికీ త్వరలోనే నోటీసులు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఇవ్వనందున, ఓట్లు తొలగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. పేర్లలో తప్పులు దొర్లిన ఓటర్లు భారీగా.. నియోజకవర్గంలో పేర్లలో తప్పులు దొర్లిన ఓటర్లు(అనామలీస్) సైతం భారీగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంది. దీంతో ఆ సమయంలో ఇంటి పేరు ముందు ఉండి, పేరు తరువాత ఉన్న ఓటరు.. ప్రస్తుతం ఓటరు పేరు ముందు ఉండి, ఇంటి పేరు తరువాత ఉన్న వారు, సింగరేణి సంస్థలో మారుపేర్లు ఉన్న వారు ఉన్నారు. రెవెన్యూ అధికారులు వీరందరినీ అనామలీస్ జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో భూపాలపల్లి నియోజకవర్గంలో 20,872(7.51 శాతం) మంది ఉన్నారు. వీరిందరికి సైతం రెవెన్యూ అధికారులు నోటీసులు అందించనున్నారు. సరైన పత్రాలు సమర్పించని వారి ఓట్లు సైతం తొలగిపోనున్నాయి. డేటా దొరకని వారెందరో.. 2002 జాబితాలో పేర్లు లేకపోవడంతో తల్లితండ్రుల ఓటరు గుర్తింపు కార్డు నంబరు ఆధారంగా వేలాది మంది ‘సర్’ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. తల్లి పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు రాసిన వారందరివి ఓకే అవుతుండగా తండ్రి వివరాలు నమోదు చేసిన వారివి పెండింగ్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. దీంతో వారందరికి సైతం నోటీసులు జారీ చేసేందుకు అధికాారులు సన్నద్ధం అవుతున్నారు. 75వేలలో ఉండేవి ఎన్నో.. ఊడేవి ఎన్నో.. మృతి చెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన, సమాచారం ఇవ్వని, డేటా లభించని, పేర్పు తప్పులు దొర్లినవారు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 75వేల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వీరందరికీ ఎన్నికల విభాగం అధికారులు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యధికం కనిపర్తిలో.. అత్యల్పం అర్బన్లో.. జిల్లాలోని 12 మండలాల్లో అత్యధికంగా రేగొండ మండలం కనిపర్తి గ్రామంలోని 249వ పోలింగ్ బూత్లో 1,262 ఓట్లకు గాను 1,251 మంది ఓట్లు(99.13 శాతం) డిజిటలైజేషన్ అయ్యాయి. తరువాత స్థానంలో అదే మండలంలోని రేపాకపల్లి 233వ బూత్లో 98.76 శాతం జరిగింది. ఇదిలా ఉండగా అత్యల్పంగా భూపాలపల్లి అర్బన్లోని 21 పోలింగ్ బూత్లో కేవలం 45.99 శాతం మాత్రమే ఓట్లు డిజిటలైజేషన్ అయ్యాయి.నియోజకవర్గంలో అనామలీస్ ఓటర్లు 20,872 మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, సమాచారం ఇవ్వని వారు 35,918 డేటా దొరకని వారు వేలల్లో.. నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న అధికారులు మొత్తం ఓటర్లు 2,77882ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 2,77882డిజిటలైజేషన్ చేసినవి 2,41,964డిజిటలైజేషన్ పూర్తయిన శాతం 87.07గుర్తించిన మృతుల ఓట్లు 22,703డబుల్ ఓట్లు 3,173సమాచారం ఇవ్వనివారు 3,785డిజిటలైజేషన్ చేయని మొత్తం ఓట్లు 35,918పేర్లలో తప్పులు దొర్లినవారు 20,872 -
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
● పామూనూరు, తడపల బేస్ క్యాంపులపరిశీలన ● ఆపరేషన్ కగార్తో 700మంది లొంగుబాటువెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్గఢ్ 196 సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ను పరిశీలించి సీఆర్పీఎఫ్ అధికారులు, ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్ధాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవి ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తాం డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టు సీనియర్ నాయకురాలు సమత లొంగుబాటు -
వాగ్దానాలు అమలు చేస్తున్నాం
మహాముత్తారం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు. మండలంలోని ములుగుపల్లి, దుంపిల్లపల్లె, మహాముత్తారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరి షత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు హక్కుపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘాలకు భవనాల నిర్మాణం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచితంగా సొంత ఖర్చులతో కుట్టు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 300 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కాటారంలో నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కొత్తపల్లి నుంచి మహాముత్తారం రోడ్డు నిర్మాణానికి పెగడపల్లి నిమ్మగూడెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈఈ విద్యాసాగర్, డీఈ సాయిలు, సీడీపీఓ రాధిక, ఉపాధిహామీ సభ్యులు రమేష్, ఏఎంసీ చైర్మన్ తిరుమల, ఇన్చార్జ్ ఎంపీడీఓ ప్రకాశ్రెడ్డి, తహసీల్దార్ దండు శ్రీనివాస్, మహాముత్తారం సర్పంచ్ బాపు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సడువలి పాల్గొన్నారు. సీఎం సోదరుల పేరుపై పరిశ్రమల భూకేటాయింపు జరగలేదుముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులకు పరిశ్రమల కోసం రాష్ట్రంలో ఎక్కడా భూములు కేటాయింపు జరగలేదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ అర్వింద్, మరికొన్ని బీఆర్ఎస్ చానల్ళ్ల సీఎం సోదరులకు తక్కువ రేటుకు భూముల కేటాయించినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారి బోర్డు మీటింగుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎండీ, ఈడీలు సీఎం సోదరుల పేరిట ఎక్కడా ఒక్క ఇంచు భూమిని కేటాయించలేదని స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై పార్లమెంట్లో చట్టం చేసిన ఎన్డీఎస్ఏ.. తగిన సూచనలు సలహాలతో ముందుకు పోతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయం మల్హర్(కాటారం): పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాాటారం ఎంపీడీఓ కార్యాలయంలో 5 మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను మంత్రి శ్రీధర్బాబు సోమవారం అందజేశారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబుమంత్రి పర్యటనలో అపశృతి మహాముత్తారం: మంత్రి శ్రీధర్బాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ములుగుపల్లి పర్యటన ముగించుకుని మండల కేంద్రానికి చేరుకున్న క్రమంలో శ్రీధర్బాబు కాన్వాయ్లోని ఓ కారు డోర్ తీసేసమయంలో వెనుక నుంచి వచ్చిన బైక్ డోర్కు తాకింది. దీంతో బైక్పై ఉన్న బోర్లగూడెం గ్రామానికి చెందిన నవరాంనాయక్కు తలకు తీవ్రగాయాలు కాగా మండల కేంద్రానికి చెందిన సకినాల రాజుకు కాళ్లకు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లిలోని వందపడకల ఆస్పత్రికి తరలించారు. మంత్రి శ్రీధర్బాబు క్షతగాత్రులను పీహెచ్సీలో పరామర్శించారు. -
పెద్ది జ్ఞాపకాలతో కన్నీటిపర్యంతం
నల్లబెల్లి: ఓవైపు విషాదం..మరోవైపు ఉద్యమ జ్ఞాపకం.. ఇంకోవైపు అభిమానుల ఆప్యాయత..ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ భావోద్వేగ వేదికగా మారింది. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు గులాబీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దితో ఉన్న అనుబంధాన్ని, ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తుచేసుకుంటూ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.. సంస్మరణ సభలో తమ ఉద్యమ సహచరుడు పెద్దితో తనకున్న అనుబంధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగంలో తెలియజేస్తూ.. ‘ఎంత కాలం బతికామన్నది కాదు..ఎట్లా బతికామన్నదే ముఖ్యం..సమాజంకోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..’ అని కొనియాడారు. పెద్ది అంతిమయాత్ర, దశదినకర్మ, సంస్మరణ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి ప్రజలు నిలబడి కడసారి చూపుకోసం ఎదురుచూసిన తీరు ఆయనకున్న ప్రజా దరణను తెలియజేస్తుందన్నారు. నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీకి సుదర్శన్రెడ్డి పేరు పెడుతామని కేటీఆర్ చేసిన కీలక ప్రకటనతో పెద్ది అభిమానుల్లో భావోద్వేగాన్ని నింపింది. పెద్ది లేని నర్సంపేట.. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డిలేని మీటింగ్లో పాల్గొంటామని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుంటున్నారు. సభలో పెద్ది కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సంస్మరణ సభలో మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్నాయక్ నాయకులు గండ్ర జ్యోతి, సతీష్రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో నేతలు, అభిమానుల కన్నీరు భారీగా తరలివచ్చిన గులాబీ నాయకులు, శ్రేణులు ఉద్యమ సహచరుడిని తలుచుకుని కేటీఆర్, హరీశ్రావు భావోద్వేగం -
12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి
భూపాలపల్లి రూరల్: 12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహా ధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలు గు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. బొగ్గు బ్లాకులను వేలం వేయడం వల్ల సింగరేణి సంస్థతో పాటు లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలన్నారు. కోయగూడెం ఓసీ–3 బొగ్గు గనిని కూడా సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ బొగ్గు బ్లాకులను వేలం వేస్తోందని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులు ఉద్యమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. -
‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు
● నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు ● చిత్రపటానికి నివాళి.. ● పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ● రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన మాజీ సీఎంసాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని ఫొటోలను చూస్తూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. అనంతరం కుమారుడు నిదర్శన్రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు నల్లబెల్లి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు. ప్రముఖుల పరామర్శ.. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమార్, వినయ్భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. నల్లబెల్లి–నర్సంపేట రహదారులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. ‘పెద్ది సుదర్శన్రెడ్డి అమర్ రహే’, ‘జోహార్ పెద్ది’ నినాదాలు మార్మోగాయి. పలుచోట్ల కాన్వాయ్ ఆపిన కేసీఆర్ కిందికి దిగి కార్యకర్తలను పలకరించారు. పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జీవన్రెడ్డి, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, మాజీ ఎంపీలు వినోద్కుమార్, మాలోత్ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, అనిల్జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. సంతాప సభ ఏర్పాట్లపై ఆరా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా డీసీపీ రవీందర్రెడ్డి, నర్సంపేట రూరల్ సీఐ సాయి రమణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లబెల్లి ఎస్సై సాయిప్రసన్న కుమార్తో పాటు ఏడుగురు ఎస్సైలు, 200 మంది బందోబస్తు విధులు నిర్వర్తించారు. -
కాజీపేట రైల్వేస్టేషన్లో ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేస్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్ 101 ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కిట్లో గాయాలకు డ్రెస్సింగ్లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్ బాక్స్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. -
న్యాయం చేయాలి
పూర్వకాలం నుంచి పెద్దతాడిచర్ల డేంజర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఏళ్లుగా డేంజర్ జోన్లో నివాసముంటున్న కొందరు నిర్వాసితుల పేర్లు విత్అవుట్ లిస్ట్లో వచ్చాయి. వారిని గుర్తించి విత్లిస్ట్లో వచ్చేలా చూడాలి. త్వరితగతిన డిక్లరేషన్ ప్రకటించి, నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – ఆర్ని సత్యనారాయణ, పెద్దతాడిచర్ల, డేంజర్ జోన్ నిర్వాసితుడు ● -
కొమురం భీం ఆశయాలే స్ఫూర్తి
● ఎమ్మెల్యే సత్యనారాయణ రావుభూపాలపల్లి రూరల్: ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కొమురం భీం ఆశయాలే స్ఫూర్తి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జల్–జంగల్–జమీన్ పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆదివాసీలు డోలు వాయిద్యాలు సాంప్రదాయ నృత్యాలతో జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. -
కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలి
కేయూ క్యాంపస్: మౌలిక వసతుల కల్పనకు కేయూకు రూ.500 కోట్లు కేటాయించాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ (కుర్తా) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ గెస్ట్హౌస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉన్నరోజుల్లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటుతో బడుగు, బలహీనవర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోనికి వచ్చిందని గుర్తుచేశారు. తొలి ఉపకులపతి వెంకట్రామయ్య అంకితభావం, కఠోరశ్రమ, ముందుచూపుతో కాకతీయ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారన్నారు. తర్వాత వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన జాఫర్నిజాం, వాసుదేవ్ తదితరులు అదేస్ఫూర్తిని కొనసాగించారని వివరించారు. దివంగత వీసీ ఎన్.లింగమూర్తి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని, అధ్యాపకుల నియామకాలు కూడా చేపట్టినట్లు వివరించారు. గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఉదయం10 గంటలకు కుర్తా ఆధ్వర్యంలో పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో విశ్రాంత ఆచార్యుల సమావేశం (మీట్) నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీలో 204 మంది విశ్రాంత అధ్యాపకులు ఉన్నారని, 70 ఏళ్లపైబడిన విశ్రాంత అధ్యాపకులను కేయూ గోల్డెన్జూబ్లీ ఉత్సవాల మీట్లో సన్మానించనున్నట్లు వివరించారు. ఉత్సవాలకు కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలిపారు. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, కోశాధికారి జి.వీరన్న, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ికుర్తా కార్యవర్గసభ్యులు ప్రొఫెసర్లు సీహెచ్ సమ్మయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకు విస్తరించిన సైబర్ నేరాలు
భూపాలపల్లి: సైబర్ నేరాలు పెద్ద పట్టణాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరించాయని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత గౌరవ వందనం స్వీకరించి, డీపీఓలో కొత్తగా ఏర్పాటుచేసిన జిమ్ను ప్రారంభించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో డీజీపీ సరదాగా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు. పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. డీజీపీ కార్యాలయంలోనే బెటాలియన్ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన డీజీపీ.. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలను లోతుగా విశ్లేషించి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు ఉద్యోగులు తమ రిటైర్మెంట్ అనంతరం వచ్చిన సొమ్మును కూడా సైబర్ మోసగాళ్ల చేతిలో కోల్పోతున్నారని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆన్లైన్ గ్యాంగులు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీజీపీ తెలిపారు. ఈ అంశంపై రెండు జిల్లాల ఎస్పీలతో లోతుగా చర్చించి, సమర్థవంతమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రోడ్లపై అక్రమ పార్కింగ్, ఇతర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్, రోడ్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారం నాణ్యతపై ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయన్నారు. కల్తీ ఆహార పదార్థాలపై నిఘా పెంచడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు, దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, డీఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఈగల్ ఎస్పీ గిరిధర్, సీఎస్బీ ఎస్పీ సాయిశ్రీ, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు సిరిశెట్టి సంకీర్త్, సుధీర్ రామ్నాధ్ కేకన్, ఏఎస్పీ బట్టా, భూపాలపల్లి ఏఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే పెట్రోలింగ్ బలోపేతం కల్తీ ఆహార విక్రయాలపై కఠిన చర్యలు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా డీజీపీ సీవీ ఆనంద్ -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
● శ్రావణమాసంలో లక్షపత్రి పూజలు రద్దు ● ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, పాలకవర్గంకాళేశ్వరం: ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నెలరోజుల పాటు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నట్లు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేశ్ తెలిపారు. ఆదివారం కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో చైర్మన్, ఈఓ, ధర్మకర్తలు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. పూజలు, భక్తుల రద్దీ, ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. లక్ష పత్రి పూజ రద్దు.. శ్రావణమాసంలో నిర్వహించే లక్ష బిల్వార్చన (లక్ష పత్రి పూజ)ను ఈ సారి రద్దు చేసినట్లు తెలిపారు. ఆదిముక్తేశ్వర స్వామి ఆలయ ప్రదేశం చిన్నగా ఉండటంతో భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున లక్షపత్రి పూజలను ఈ సంవత్సరం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు దేవస్థానం సూచనలు పాటించాలని కోరారు. సరస్వతీ ఘాట్ వద్ద పూజలు నిర్వహించవద్దని నిర్ణయించామని, ప్రతీ రోజు ఉదయం 5.30గంటలకు మహాన్యాసక రుదాభ్రిషేక పూజలు నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. మాస శివరాత్రికి మహాలింగార్చన.. శ్రావణమాసంలో వచ్చే మాస శివరాత్రి సెప్టెంబర్ 9న మహాలింగార్చన పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కూల్చివేత పనుల పరిశీలన.. సమావేశం అనంతరం చైర్మ న్, ఈఓ, ధర్మకర్తలు ఆలయంలో జరుగుతున్న కూల్చి వేత పనులను పరిశీలించారు. పునర్నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పనులు సురక్షితంగా, నాణ్యతా ప్రమాణాలు పా టించాలని సూచించారు. సమావేశంలో ఎక్స్అఫీషియో సభ్యుడు, ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, ఽసీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ధర్మకర్తలు గందెసిరి సత్యనారాయణ, శ్యామ్సుందర్, పద్మ, ప్రశాంత్రెడ్డి, మంచినీళ్ల దుర్గయ్య, సీతయ్య, అశోక్, నర్సయ్య, సత్తయ్య పాల్గొన్నారు. రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలుశ్రావణమాసం రెండో శుక్రవారం ఆగస్టు 21న ప్రతీ ఏటా నిర్వహించే వరలక్ష్మి వ్రతాలను ఈసారి కూడా నిర్వహించనున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్ శర్మ, రాజీవ్ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్ చేసి సరస్సు అందాలను తిలకించారు. నమ్మకంతో పోరాడుతున్నాం కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్ వీఆర్ఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్ చింతల్ బ్రిడ్జి వద్ద వీఆర్ఎస్ అసోసియేషన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్, సంజీవ్ పాల్గొన్నారు. వర్షాలకు కూలిన ప్రహరీ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రహరీ ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. బాలికలకు రక్షణగా ఉండే ప్రహరీ కూలిపోయినా సంబంధిత ఆశ్రమ పాఠశాల వార్డెన్, ప్రధానోపాధ్యాయులు ఈ విషయంపై ఏమాత్రమూ స్పందించడం లేదు. ప్రహరీ లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు రాత్రి సమయాల్లో లోనికివెళ్లే ప్రమాదం ఉంది. ప్రహరీ కూలిపోయిన విషయాన్ని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ డీడీ, ఇంజనీరింగ్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. బాలికల రక్షణకు వెంటనే నూతనంగా ప్రహరీని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై డీడీ జనార్దన్ ను వివరణ కోరగా అక్కడ ఉన్న పరిస్థితి వెంటనే పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. -
డేంజర్ జోన్ సర్వే ఇలా..
తాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్ల సేకరణకు 2022 సంవత్సరం డిసెంబర్ 14న 359.23 ఎకరాలకు 2600 పైచిలుకు ఇళ్లకు పీఎన్ను ప్రతికల్లో ప్రచురించారు. ఇప్పటికి పలుమార్లు సర్వేలు నిర్వహించినా డీడీ (డ్రాఫ్ట్ డిక్లరేషన్) ప్రకటించలేదు. దీంతో డేంజర్ జోన్ సమస్య మొదటికి వచ్చింది. డేంజర్ జోన్ సేకరణకు ప్రభుత్వం రూ.261 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారులు విత్ లిస్ట్ 1,203 (జీపీ రికార్డులో ఇంటి నంబర్లు), విత్అవుట్ లి్స్ట్ 1,062 (ఇంటి నంబర్లు లేనివి) ఆధారంగా ఐదు టీంలు 20 రోజులుగా ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఈ సర్వేలో ఇంటి పన్ను, కరెంట్, ఆధార్కార్డు, కరెంట్ బిల్లు, ఓటర్ కార్డు తదితర వివరాలు సేకరిస్తున్నారు. మరో నాలుగు, అయిదు రోజుల్లో సర్వే పూర్తికానుంది. సర్వే ముగిసిన అనంతరం జీపీలో అధికారులు గ్రామసభ నిర్వహించి జాబితాను చదివి వినిపించి, డీడీ (డ్రాఫ్ట్ నోటిఫికేషన్) ప్రచురించనున్నట్లు తెలుస్తుంది. డీడీ ప్రకటించకపోతే డిసెంబర్లో పీఎన్ పూర్తిగా రద్దుకానున్నుట్లు సమాచారం. -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కొత్త జీఓతో తీవ్ర నష్టం..భూపాలపల్లి: మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల తగ్గింపునకు రంగం సిద్ధమైంది. గతేడాది తీసుకొచ్చిన జీఓను ఇప్పుడు అమలుచేసి వేతనాల్లో కోత విధించేందుకు సర్కారు ప్రయత్నిస్తుంది. కొత్త జీఓ అమలు సరికాదంటూ భూపాలపల్లి మున్సిపాలిటీలోని కార్మికులు తమ వేతనాలు తీసుకునేందుకు తిరస్కరించారు. ఆ వేతనం మాకొద్దు.. జీఓ ఆర్టీ 69 గతేడాది విడుదల కాగా ఈ నెల నుంచి ఆ జీఓ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాత జీఓల ప్రకారమే తమకు వేతనాలు ఇవ్వాలని, కొత్త జీఓ అమల్లోకి వస్తే వేతనాలు తగ్గి తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఔట్సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీలో 150మంది కార్మికులు పనిచేస్తుండగా, వారంతా గత నెల వేతనాన్ని తీసుకోకుండా నిరసన వెలిబుచ్చుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, కుటుంబాలను సాకేందుకు ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్న ఫళంగా కొత్త జీఓ తీసుకొచ్చి వేలాది రూపాయల కోత విధిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని వాపోతున్నారు. జీఓ 69ని రద్దుచేసి పాత పద్ధతి ప్రకారమే వేతనాలు అందించాలని ఔట్సోర్సింగ్ కార్మికులు ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి కోరారు. మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించింది. జీఓ ఎంఎస్ నంబర్ 14 (2016) ప్రకారం పని ఆధారంగా రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ఇచ్చింది. అనంతరం ప్రభుత్వం జీఓ ఎంఎస్ 60, జీఓ ఎంఎస్ 40 లను విడుదల చేసి వేతనాలు పెంపు చేస్తూ వచ్చింది. గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన ప్రభుత్వం కొత్త జీఓ ఆర్టీ నంబర్ 69ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రస్తుతం కార్మికులకు ఉన్న వేతనాలు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు తగ్గనున్నాయి. దీంతో ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల తగ్గింపు గతేడాది జీఓ అమలుకు సర్కారు యత్నం నెలకు రూ.4వేల వరకు తగ్గుతున్న వేతనం నిరసనగా జూలై నెల వేతనం తిరస్కరణ -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. ‘సర్’కు రెండు రోజులే గడువు భూపాలపల్లి: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం రేపటి(సోమవారం) తో ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్లందరికీ ఇది చివరి అవకాశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూరించిన ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడానికి ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. గడువులోగా ఫారం సమర్పించని పక్షంలో, ఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాబడదని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ట్రెజరీశాఖ డైరెక్టర్ పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఉత్సవమూర్తులను శ్రీఽఆదిముక్తీశ్వరాయంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో రాష్ట్ర ట్రెజరీశాఖ డైరెక్టర్ పార్వతీదేవి శనివారం దర్శించుకున్నారు. అక్కడ ఆశీర్వచన వేదిక వద్ద ఆమెను అర్చకులు సన్మానించి, తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆమెవెంట జిల్లా ట్రెజరీశాఖ అధికారులు జ్యోతిరావు, జీవన్రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. రోడ్డుపై ‘చేపల వేట’తో నిరసన భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో చేపల వలలు, గాలాలు వేసి చేపలు పడుతూ తమ నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షపు నీరు భారీగా నిలిచి గుంతలు చెరువులను తలపిస్తున్నాయని యూత్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. కోరిన కోర్కెలు తీర్చుతూ, సంతానభాగ్యం కల్పించే స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. పూలు పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి: కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక చెరువులు నిండక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి, దేవాదుల మోటార్లు మొత్తం నడపడం లేదన్నారు. రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి బీఆర్ఎస్ హయాంలో రూ.18కోట్లు వెచ్చించగా, ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సాగునీటిని తెచ్చే మార్గాలు ఉన్నప్పటికీ పంటలను ఎండబెట్టడం బాధాకరమన్నారు. వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించలేక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సిగ్గుచేటన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో గణపురం, భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
పార్కును అభివృద్ధి చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ● జయశంకర్ పార్కు పరిశీలన ● పనులకు రూ.50లక్షలు కేటాయింపుభూపాలపల్లి రూరల్: జయశంకర్ పార్క్ను ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా సురక్షితంగా ఉండేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం సంగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జయశంకర్ పార్క్ను పరిశీలించారు. పార్కులో ఉన్న జిమ్ పరికరాలను పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి సింగరేణి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పార్కు నిర్వహిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో పార్క్లో వాకింగ్ చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వాకింగ్ ట్రాక్, మౌలిక వసతులు, మరమ్మతులు, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్క్ అభివృద్ధి పనులను చేపట్టే ముందు ఇంజినీరింగ్ నిపుణుల సలహాలతో పాటు వాకర్స్, స్థానిక ప్రజలు, కార్మికులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుని, వారికి అవసరమైన సౌకర్యాలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. పార్క్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వివిధ రకాల జ్యూస్లు, పానీయాలు అందుబాటులో ఉండేలా క్యాంటీన్ను కూడా అవసరమైన మేరకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. పార్క్ పరిసరాల్లో మెరుగైన లైటింగ్ సదుపాయాలు ఏర్పాటుచేసి వాకింగ్చేసే ప్రజలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కౌన్సిలర్లు, నాయకులు పుల్ల మహేష్, దాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి
● రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాభూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం వెంటనే 12వ వేజ్బోర్డు కమిటీని ఏర్పాటుచేసి వేతన సవరణ ప్రక్రియను వేగంగా అమలుచేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 10న సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శనివారం ఏరియాలోని కొమురయ్య భవన్లో జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింగరావు, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య, హెచ్ఎంఎస్ నాయకులు నరేష్నేత మాట్లాడారు. గతంలో 11వ వేజ్బోర్డు కాలపరిమితి ముగియకముందే కమిటీని ఏర్పాటుచేసి వేతన సవరణ అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం 12వ వేజ్బోర్డు సమయం దాటినా కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. కోలిండియా స్థాయిలో 12వ వేజ్బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించాల్సి ఉండగా, లేబర్ కోడ్ల అమలుపైనే దృష్టి సారించడం సరికాదన్నారు. సింగరేణిలో కార్మికులపై లేబర్ కోడ్లను అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వేజ్బోర్డు విషయంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10న జీఎం కార్యాలయాల ఎదుట జరగనున్న ధర్నాలో బీఎంఎస్ పాల్గొనకపోవడం బాధాకరమని, కార్మికుల ప్రయోజనాల కోసం వేజ్బోర్డు విషయంలో కలిసి రావాలని కోరారు. సెప్టెంబర్ 12న రాంచీలో జరిగే సదస్సులో 12వ వేజ్బోర్డు అంశంపై స్పష్టత రాకపోతే కోల్ఇండియా వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి వేజ్బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీఎం కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి కార్మికులు, ట్రేడ్యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మోటపలుకుల రమేశ్, రాంచందర్, ఐలయ్య, బీమనాదుని సత్యనారాయణ, రామచందర్, దుడ్డేల సాయిలు, రమేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.


