breaking news
Jayashankar
-
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
వెంకటాపురం(ఎం): విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి లక్ష్యంతో చదివాలని ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికా సం, పరీక్షల పట్ల భయాన్ని తొలగించుకోవడంపై ఎలా అనే ఆంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి, ఇంటిలిజెన్స్ ఎస్పీ రమేశ్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చదువుకోవాల నే తపన, ఆశయం, సంకల్పం బలంగా ఉంటే మి మ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదని వెల్లడించారు. కొత్త విషయాలు, తెలియని అంశాలు నేర్చుకోవడానికి ఎప్పుడు వెనుకాడరాదని వివరించారు. సక్సెస్ అనే ది ప్రయత్నం చేయడంలోనే ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశ్నలు వే స్తూ జవాబులు రాబడుతూ వారికి బహుమతులను అందించి ఉత్సాహపరిచారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాధిక, ఎస్సై రాజు, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, కిరణ్, అంబేడ్కర్, కి శోర్బాబు, వేణు, సంధ్యారాణి, జోత్స్న పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్ -
విద్యార్థులకు ప్రణాళికతో బోధించాలి
వాజేడు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించి మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని కాచారం పాఠశాలతో పాటు పెద్దగొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. పాఠాలు చదివించి.. రాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చదువులో వెనుక బడిన వారిని గుర్తించి అందరితో సమానంగా చదివేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. చదువుపై శ్రద్ధ చూపేలా బోధించాలన్నారు. పెద్ద గొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య తగ్గడంపై ప్రశ్నించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్కు చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. -
కొత్త సీపీకి సవాళ్ల స్వాగతం!
వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్జోషి, ఏవీ రంగనాథ్, అంబర్కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్కింగ్ సమస్య.. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏఆర్లో ఎక్కడి వారు అక్కడే.. పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్సై, ఆర్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. సీసీఎస్లో కదలరు.. వదలరు దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలున్నాయి. కరువైన లా అండ్ ఆర్డర్.. వరంగల్ సబ్ డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. నేతల అండ.. నిబంధనలు తూచ్ వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దృష్టి సారిస్తే... మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏఆర్లో పాతుకుపోయిన అధికారులు సీసీఎస్లో ముదుర్లుతో సమస్యలుకమిషనరేట్ను వీడని అవినీతి అధికారులు.. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన అధికారులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె.జీవన్కుమార్ను జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన బాధ్యతల స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో న్యాయసేవల మెరుగుదల, ప్రజలకు సత్వర న్యాయం అందించే అంశాలపై పరస్పరం చర్చించారు. పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలి మహాముత్తారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులకు సూచించారు. బుదవారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఆర్ఐ భాస్కర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. 92 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో జూన్ మాసంలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా 92శాతం సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన మాసంలో 2.35లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం చేయాల్సి ఉండగా 2.15లక్షల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. రోజు వారిగా సుమారు 7,181 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేసినట్లు చెప్పారు. రెండు ఓపెన్ కాస్టు గనుల్లో 121శాతం మట్టి వెలికితీత పనులు చేపట్టినట్లు వివరించారు. జూలై మాసంలో 3.67లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ విధించినట్లు తెలిపారు. కార్మికులు సమష్ఠి కృషి చేసి ఉత్పత్తి సామర్ాధ్యన్ని పెంచాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎప్ఎస్ (ప్రిలిమ్స్ కం మెయిన్స్) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈనెల 12వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 19న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. 10నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ సౌకర్యం ఉంటుందన్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి.. భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో చేసిన దరఖాస్తులను కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం అందించాలన్నారు. చెట్టుకు ఢీకొన్న ఆటో మహాముత్తారం: మండలంలోని యామన్పల్లి సమీపంలో ఆటో అదుపు తప్పి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పంకెన గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం ఆటోలో ఆజంనగర్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యామన్పల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మ, అశ్విన్, శారద, శైలజకు తీవ్రగాయాలయ్యాయి. -
పేదలకు అత్యాధునిక వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: పేద ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఎంఆర్ఐ యంత్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జిల్లాలో పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాన్నారు. గతేడాది ఆస్పత్రిలో వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆస్పత్రిని 100 పడకల నుంచి 300 పడకలకు అప్గ్రేడ్ చేయడంతో పాటు రూ.14 కోట్ల వ్యయంతో నాలుగో అంతస్తు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే గుండె సంబంధిత చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంజీఎం తర్వాత ప్రభుత్వ రంగంలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేసిన ఆస్పత్రిగా భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిలవడం గర్వకారణమన్నారు. ఎంఆర్ఐ యంత్రం కోసం నిధులు సమకూర్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, హెచ్డీఎఫ్సీ క్లస్టర్ హెడ్ రాజేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పోలీస్స్టేషన్ తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పోలీసు సేవలను మరింత మెరుగుపర్చే దిశగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. -
పేదలకు పట్టాలివ్వాలని ధర్నా
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని సర్వే నెంబర్ 280లో నివసిస్తున్న భగత్సింగ్ కాలనీవాసులకు పట్టాలివ్వడంతో పాటు ఇంటినంబర్లు మంజూరు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు ఎన్నిసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. కలెక్టర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భగత్సింగ్ కాలనీవాసులు పాల్గొన్నారు. -
ఓటర్ల చేర్పులు, మార్పులు పరిశీలించాలి
ములుగు: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైందని, ఓటర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు గమనించాలని సూచించారు. గణన ఫారాలు, దరఖాస్తుల నింపే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు కూడా సరైన సమాచారం అందిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రతీ అర్హుడికి ఓటు హక్కు ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, పార్టీ నాయకులు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థను జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. జిల్లాను బాల కార్మికుల రహిత జిల్లాగా మార్చుకునేందుకు పాటుపడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎస్పీ కిశోర్, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, జిల్లా కార్మికశాఖ అధికారి వినోద తదితరులు పాల్గొన్నారు. ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
సాగుతో లాభాల వైపు..
భూపాలపల్లి: ఏళ్ల తరబడి కష్టనష్టాలను అనుభవించి పత్తి, మిర్చి, వరి సాగు చేసిన రైతులు ఆధునిక వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయిల్పామ్ గెలల ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో సాగుకు రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 2,500 ఎకరాల్లో సాగు అంచనా.. జిల్లాలోని 12 మండలాల్లో 2021 సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు 352 ఎకరాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతీ ఏటా పెరుగుకుంటూ రాగా 2024–2026 మధ్య కాలంలో కాస్త తగ్గింది. జిల్లాలో 2021లో సాగు ప్రారంభించిన రైతులకు మార్చి నెల నుంచి మంచి దిగుబడి వస్తుంది. దీంతో రైతులంతా ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 150 ఎకరాల్లో రైతులు మొక్కలు నాటగా.. మునుపెన్నడూ లేని విధంగా 2,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరిగే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందల మంది రైతులు మొక్కల కోసం డీడీలు తీసి ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వీరంతా ఈ నెల చివరి వారంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ధర పలుకుతున్న గెలలు.. మన దేశానికి ముఖ్యంగా మలేషియా నుంచి క్రూడ్ పామాయిల్ ఎక్కువగా దిగుమతి అవుతుంది. కోవిడ్ సమయం 2021లో మలేషియా ఎగుమతిని నిలిపివేసింది. దీంతో అప్పుడు ఆయిల్పామ్ గెల టన్ను ధర రూ. 24వేలకు చేరుకుంది. అనంతరం పరిస్థితులు చక్కబడటంతో 2022లో రూ.13వేలు, 2023లో రూ.13,500, 2024లో రూ.14వేలు, 2025లో రూ.20వేల ధర పలికింది. ఇప్పుడు ఏకంగా గెలల టన్ను ధర రూ.24వేలకు చేరుకుంది. ప్రస్తుత ధరలను గమనించిన రైతులు, భవిష్యత్లో కూడా ఆయిల్పామ్కు డిమాండ్ ఉంటుందని భావించి మూడు ఎకరాలకు పైన ఉన్న రైతులంతా ఈ పంట సాగుకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఈ ఏడాది ఊహించని రీతిలో జిల్లాలో ఆయిల్పామ్ సాగు జరగబోతుందని తెలుస్తోంది. రైతులుఎకరాలు1,877.54478.4610.61352.551,163.90229189609112403202520212023202620242022 ప్రస్తుతం టన్ను గెల ధర రూ.24వేలు ఎకరాకు రూ.లక్షన్నరకు పైగా రాబడి 30 ఏళ్లపాటు రానున్న దిగుబడి -
ఎంఆర్ఐ సేవలు షురూ
● హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం ● పేదలకు స్థానికంగానే ఖరీదైన వైద్య పరీక్షలు భూపాలపల్లి అర్బన్: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సేవలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో పేద ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎంఆర్ఐ పరీక్షల కోసం ప్రజలు వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సకాలంలో వ్యాధి నిర్ధారణ జరిగి మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు కృషిచేసిన కలెక్టర్ రాహుల్శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ భాగస్వామ్యంతో అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లాకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎంపీ వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సూపరిండెంటెండ్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎస్ను కలిసిన కలెక్టర్ భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలెక్టర్ రాహుల్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం సీఎస్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనాంశాలను సీఎస్కు వివరించారు. -
మేడారం పనుల్లో వేగం పెంచాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, వన మహోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మేడారం హరిత హోటల్లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, వన మహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంతాల్లో వన మహోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మేడారం పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
బడి.. సమస్యల ఒడి
మొత్తం ఖాళీలు 286అసంపూర్తిగా అభివృద్ధి పనులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులుప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరతఉపాధ్యాయుల ఖాళీల వివరాలు ఎస్జీటీ 191 స్కూల్ అసిస్టెంట్ 75 పీజీహెచ్ఎంలు 6 ఎల్పీలు 3 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 10 పీఈటీ 1పేద విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ పాఠశాలలు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, సరిపడా తరగతి గదులు లేకపోవడం, గదుల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడం, అద్దె భవనాల్లో పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు నేడు ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చే హామీలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సాక్షి బృందం విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – భూపాలపల్లి అర్బన్జిల్లాలో పాఠశాలలు 394ప్రాథమిక 281ప్రాథమికోన్నత 43ఉన్నత 70విద్యార్థులు 18వేలు -
చెట్టుకొమ్మ మీదపడి మేకల కాపరి మృతి
మహాముత్తారం: అడవిలోని చెట్టుకొమ్మ విరిగి పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కనుకునూర్ గ్రామానికి చెందిన పొడెం సమ్మక్క(39) ప్రతిరోజు మేకలు కాసేందుకు అడవికి వెళ్తోంది. మంగళవారం కూడా వెళ్లింది. ఈ క్రమంలో అడవిలో ఓచెట్టుకొమ్మ విరిగి మీద పడడంతో సమ్మక్క అక్కడికక్కడే మృతిచెందింది. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చాయి. సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప అడవిలోకి వెళ్లి గాలించగా చనిపోయి కనిపించింది. సోదరుడు బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్సై గొర్ల రమేశ్ తెలిపారు. జీపీ కార్యదర్శుల డిప్యుటేషన్లు రద్దు ఏటూరునాగారం: జిల్లాలోని 71 మంది పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్లను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఇటీవల రద్దు చేశారు. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శులు తిరిగి వారి ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధుల్లో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 71 మందిని వేర్వేరు ప్రాంతాలకు డిప్యూటేషన్పై పంపించారు. -
హోటల్ నిర్వహణకు అడ్డు
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం, పూజలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేవస్థానం ఆవరణలో హోటల్ నిర్వహణకు టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు మంగళవారం హోటల్ ఏర్పాటు చేయగా ఆలయ సమీపంలో వద్దని దేవస్థానం సిబ్బంది తిరిగి పంపారు. పలు దుకాణాలు, హోటల్ నిర్వహణకు సరైన సదుపాయాలు చేయలేదు. హోటల్కు సంబంధించిన మెటీరియల్ పూర్తిగా చెడిపోయాయని నిర్వాహకురాలు కావ్య వాపోయారు. దేవాదాయశాఖ ఉన్నతాదికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సింగరేణి అధికారులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదవీ విరమణ పొందిన భూపాలపల్లి ఏరియా ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఓసీపీ–3 ప్రాజెక్టు ఆఫీసర్ వాసం బిక్షమయ్యను ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన అధికారులు సంస్థ అభివృద్ధిలో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. ఉత్పత్తి లక్ష్యాల సాధన, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలులో కవీంద్ర, భిక్షమయ్య సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, జ్యోతి, రాజేశ్వర్, రవీందర్, ములుకుంట్ల తిరుపతి, కృష్ణప్రసాద్, శ్యామ్సుందర్, వివిధ శాఖల అధికారులు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఎంఓఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు. నిజాయితీ, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ సేవల నుంచి ఉద్యోగ విరమణ పొందిన సబ్ యూనిట్ ఆఫీసర్ మొహమ్మద్ అబ్దుల్ అలీమ్ విధి నిర్వహణలో నిజాయితీ, అంకిత భావానికి నిలువెత్తు నిదరన్శమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. అబ్దుల్ అలీమ్ను ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. అలీమ్ తన ఉద్యోగ జీవితమంతా నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమరయ్య, అలీమ్ కుటుంబ సభ్యులు, వైద్యాధికా రులు, మినిస్టీరియల్, పారామెడికల్ సిబ్బంది పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు. 12వ వేతన ఒప్పందం వెంటనే పూర్తి చేయాలి భూపాలపల్లి అర్బన్: 12వ వేతన ఒప్పందం వెంటనే పూర్తిచేయాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులతో పాటు సింగరేణి కార్మికుల 12వ వేతన ఒప్పందం గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో జరిగిన కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జేబీసీసీఐ 12వ వేతన కమిటీ ఏర్పాటు చేసి వేతన ఒప్పంద చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.56వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా గనుల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు నర్సింగరావు, లక్ష్మణ్, మల్లేష్, సాగర్, మల్లేష్, పునీత్రావు, స్వామి, శంకర్, నారాయణ, రఘుపతిరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. -
పోలియో చుక్కలకు దూరం కావొద్దు
● డీఐఓ డాక్టర్ నాగరాణి మల్హర్(కాటారం): ఐదేళ్లలోపు చిన్నారులందరూ పొలియో చుక్కలకు దూరం కావద్దని డీఐఓ నాగరాణి అన్నారు. మండలంలో కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న పల్స్పోలియో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటారం గ్రామంలో సర్వే బృందాల పనితీరును సమీక్షింంచారు. ఐదేళ్లలోపు చిన్నారులందరినీ గుర్తించి పోలియో చుక్కలు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం కాటారంలోని లలిత క్లినిక్, భద్రకాళి ల్యాబ్ను ఆమె తనిఖీ చేసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మౌనిక, హెచ్వీ పద్మావతి, ఆశ కార్యకర్తలు రమాదేవి, రుక్సానా, రాజేశ్వరి పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భూపాలపల్లి: భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణం అందించేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, ఆర్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.. ఉద్యోగ విరమణ పొందినవారు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని మంగళవారం పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరయ్యారు. ఉద్యోగ విరమణ పొందిన కొత్తపల్లిగోరి ఎస్సై–2 ఎండీ షాఖాన్, పీసీఆర్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై పులియాల రాజిరెడ్డి, మొగుళ్లపల్లి ఏఎస్సై వెంకటరత్నంలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, ఉద్యోగ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి మల్హర్(కాటారం): పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కాటారం పోలీస్స్టేషన్, సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ సంకీర్త్ సందర్శించి, సమగ్ర తనిఖీ నిర్వహించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
లోటు వర్షపాతమే..
భూపాలపల్లి రూరల్: వారం రోజులుగా భారీవర్షం కురుస్తుందా అన్నట్లుగానే పొద్దంతా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడుతుంది. ఊరిస్తున్న మబ్బులు చివరకు చిరుజల్లులు కురిశాక వరుణ దేవుడు మొఖం చాటేస్తున్నాడు. జిల్లాలో ప్రతీరోజు ఇదే పరిస్థితి నెలకొంటుంది. వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రెండుసార్లు మోస్తారుగా వానలు కురిశాయే తప్పా భారీ వర్షాలు కురువలేదు. ఎల్నీఓ ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై నీలినీడలు అలుముకున్నాయి, సాగు ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే.. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో జిల్లావ్యాప్తంగా సగటున రెండు రోజులు మాత్రమే వర్షం కురియగా, అధికలోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో టేకుమట్ల మండలంలో సాధారణ వర్షపాతం 149.9 నమోదు కాగా, ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. మిగితా మండలాల్లో పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఆలస్యం కానున్న మిర్చి, వరి సాగు.. సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురియకపోవడంతో మిర్చి, వరి పంటల సాగు ఆలస్యం కానుంది. వర్షాలు కురుస్తాయన్న ఆశతో కొందరు రైతులు బోరుబావుల వద్ద వడ్లను అలికారు. ప్రస్తుతం వరిపైరు నారు దశలో ఉంది. మరిన్ని వర్షాలు కురిస్తే పూర్తి స్థాయిలో నార్లు పోసుకోనున్నారు. లేదంటే వెదజల్లే పద్ధతి ద్వారా పంట సాగు చేసే అవకాశం ఉంది.మండలం నమోదు సాధారణం లోటు భూపాలపల్లి 180.9 155.9 +16 చిట్యాల 64.8 147.6 56 రేగొండ 101.2 145.4 30 గణపురం 183.6 143.7 +28 కొత్తపల్లిగోరి 83.7 145.4 42 టేకుమట్ల 149.2 149.8 0 మొగుళ్లపల్లి 84.6 146.9 42 మహదేవపూర్ 121.8 175.4 +31 పలిమెల 94.6 183.9 49 మహాముత్తారం 156.3 162.3 4 కాటారం 146.2 141.2 +4 మల్హర్ 80.6 138.7 42 మోస్తరు వానలు కురిసింది రెండు రోజులే.. చెరువుల్లోకి చేరని నీరు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన తరువాత స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన జీవన్కుమార్ భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జె.జీవన్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ నుంచి బాధ్యతలను స్వీకరించిన జీవన్కుమార్కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్యలాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి రాములు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, అడిషనల్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్కు డేంజర్ జోన్ నిర్వాసితుల వినతి మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్కు 500మీటర్ల దూరంలో ఉన్న పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ ఇండ్ల సేకరణ నిమిత్తం సర్వే చేయించాలని సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మకు డేంజర్ జోన్ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డేంజర్ జోన్ ఇండ్ల సేకరణలో భాగంగా కాటారం ఆర్డీఓ ద్వారా భూములు, ఇండ్లకు సర్వే చేయించాలని కలెక్టర్ను కోరారు. ఇప్పటికే సేకరణ నిమిత్తం హైదరాబాద్ జోన్కో ద్వారా నిధులు కలెక్టర్ ఖాతాలో జమయినట్లు వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, నిర్వాసితులు రాజేశ్వర్రావు, రమేశ్, సురేష్రావు, సత్యనారాయణ, గట్టయ్య, అజ్మత్ అలీ, చంద్రయ్య పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు భూపాలపల్లి రూరల్: రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహణకు అధికారికంగా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఆరు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. చికినేపల్లి, రేగొండ, చల్లగరిగె, మొగుళ్లపల్లి, గిద్దెముత్తారం, టేకుమట్ల సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 5న నామినేషన్ల పరిశీలన, 6న ఉపసంహరణలు, 10న ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉంటుందని వాల్యానాయక్ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి సోమవారం 11మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు పరామర్శ చిట్యాల: చల్లగరిగ గ్రామానికి చెందిన నోముల సదమ్మ, గులాం జిలాని, జూకల్ గ్రామంలోని తాంపు భద్రయ్య, సౌడ కిషన్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాలను మధుసూదనాచారి పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల రమేష్ ముదిరాజ్, రత్న రవి, కన్నెబోయిన అశోక్, జంబుల చంద్రమౌళి ఉన్నారు. -
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రజల సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో 19మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసు అధికారులు మర్యాదగా వ్యవహరించాలని, చట్టబద్ధంగా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. -
రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జూలై 13 వరకు కొనసాగే ఈ దీక్షల్లో సింగరేణి అధికారులకు వేతన సవరణ అమలు చేయాలని, పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కోలిండియా అధికారులతో సమానంగా అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో దీక్షలు చేపడుతున్నట్లు సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్ తెలిపారు. వీరి దీక్షలకు జీఎం కార్యాలయ హెచ్ఓడీలు, ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి మద్దతు తెలపగా, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో సీఎంఓఏఐ నాయకులు సమ్మిరెడ్డి, విక్రమ్, అలీమ్, ప్రమోద్, సుశాంత్, శ్రీనివాస్, మౌనిక, షైనీ పాల్గొన్నారు. రేపు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా జూలై 1న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట నిర్వహించే ధర్నాకు కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పసునూటి రాజేందర్, మోటపలుకుల రమేష్, నరేష్నేత, దుడ్డేల సాయిలు, జూపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడారు. అనేక సమస్యలపై ప్రభుత్వానికి యాజమాన్యానికి అనేకసార్లు కార్మిక సంఘాలు విన్నవించినా సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్కుమార్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నేను బతికే ఉన్నా..
● కాగితాల్లో చంపేశారు..పింఛన్ ఆపేశారు! మల్హర్: అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థలోని లోపాలకు ఓ నిరుపేద వృద్ధురాలు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కండ్లముందే తిరుగుతున్న ఓ వృద్ధురాలిని రికార్డుల్లో చంపేసిన అధికారులు.. ఆమెకు వస్తున్న ఏకై క ఆధారమైన పెన్షన్ను తొలగించారు. రికార్డుల నిర్వహణలో దొర్లిన ఒక పెద్ద తప్పిదం ఓ వృద్ధురాలి జీవనాధారాన్ని దెబ్బతీసింది. నేను బతికే ఉన్నా.. అంటూ ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతోంది. వృద్ధురాలి కథనం ప్రకారం.. మల్హర్ మండలం కొండంపేట గ్రామ పంచాయతీ పరిధి గట్టుపల్లె గ్రామానికి చెందిన గోరేటి పార్వతికి 68 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఐదు నెలలుగా పింఛను నిలిచిపోయింది. చనిపోయినట్లు చూపించి పెన్షన్ ఆపేశారు. దీంతో మార్చి 20వ తేదీన కార్యదర్శికి పెన్షన్ వస్తలేదని దరఖాస్తు పెట్టుకుంది. దీంతో రోజు గడవడం కష్టంగా ఉంది అని పార్వతి కన్నీటి పర్యంతమైంది. సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. పెన్షన్ను పునరుద్ధరించాలని వృద్ధురాలు వేడుకుంటుంది. -
భద్రత పట్టించుకోరా?
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు బేఖాతరు చేస్తూ వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా శ్రద్ధ చూపడం లేదు. గాలి, వెలుతురు లేని ఎౖతైన, ఇరుకుగదుల్లో వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి క్లాసులు నిర్వహిస్తుండడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకోవడం లేదు. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు అవసరమైన భద్రతా ప్రమాణాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 75 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లావ్యాప్తంగా 75కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 20వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో అధికశాతం ఇరుకు గదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు కరువు.. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలు ఉన్నాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది బాలికలు బాత్ రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు తాగేందుకు సరిపడా నీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు ఉన్నాయి.ఇరుకుగదుల్లో ప్రైవేట్ పాఠశాలల తరగతుల నిర్వహణ కార్పొరేట్ ఫీజులు.. వసతులు జీరో కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులునిబంధనలు గాలికి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే అనుమతించాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా మామూళ్లకు అలవాటు పడి, రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
అభివృద్ధిలో గణాంకాల పాత్ర కీలకం
● సీపీఓ జవహర్లాల్ భూపాలపల్లి: దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో గణాంకాల పాత్ర అత్యంత కీలకమని సీపీఓ జవహర్లాల్ అన్నారు. ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త పీసీ మహలనోబిస్ జ్ఞాపకార్థం సోమవారం సీపీఓ కార్యాలయంలో జాతీయ గణాంక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఓ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో పీసీ మహాలనోబిస్ చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సీపీఓ శామ్యుల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా గణాంక అధికారులు కిష్టయ్య, వెంకటేశ్వర్లు, ఉప గణాంక అధికారులు మహేష్, బాబులాల్, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: వన మహోత్సవంలో శాఖల వారిగా కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వన మహోత్సవంపై డీఎఫ్ఓ నవీన్రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, వివరాలను అటవీశాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరిక్రిష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలి.. ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65మంది నుంచి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ను కలిసిన డీటీఓ శ్రీనివాస్.. జిల్లా రవాణాశాఖ అధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీనివాస్ ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇక్కడ డీటీఓ విధులు నిర్వహిస్తున్న వెంకన్న ఈ నెల 22న జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బి.శ్రీనివాస్ను భూపాలపల్లి డీటీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ 56 శాతం పూర్తి.. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ జిల్లాలో 56 శాతం పూర్తయినట్లు కలెక్టర్ రాహుల్శర్మ వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. -
రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని కొత్త పట్టాదారులైన రైతులు రైతుభరోసా పథకం లబ్ధి పొందడానికి జూలై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ విడతలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. అర్హులైన రైతులు భర్తీ చేసిన రైతుభరోసా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ జిరాక్స్, కొత్త పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్లను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. జూలై 30 నుంచి అర్హులైన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన కొత్త రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోటగుళ్లలో జడ్జి ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షత్రం కోటగుళ్లలో పరకాల జూనియర్ సివి ల్ జడ్జి శ్రీవల్లి శైలజ ఆదివారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జూపల్లి నాగరాజు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఏకతాటిపైకి రావాలి భూపాలపల్లి రూరల్: భవిష్యత్ తరాల అభివృద్ధి, సనాతన ధర్మం కోసం హిందువులందరూ ఏకతాటిపైకి రావాలని ఎండోమెంట్ (థార్మిక) సెల్ విభాగం స్టేట్ జాయింట్ కన్వీనర్, జిల్లా ఇన్చార్జ్ మాడుగుల రవీందర్ శర్మ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జిల్లా సెల్ కన్వీనర్ కర్ర జయపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాయ్ చర్చ కార్యక్రమానికి మాడుగుల రవీందర్ శర్మ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ విభాగం జిల్లా కో కన్వీనర్లు నరేందర్ రెడ్డి, సునీల్ చంద్ర, జాయింట్ కన్వీనర్లు పండగటి పురుషోత్తం, బండారి రమేష్, శ్రీనివాస్ చార్యులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సబ్ సెంటర్ల పరిశీలన ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏటూరునాగారం, గంగారం, తదితర సబ్ సెంటర్లను ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ పరిశీలించారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది సూచనలు చేశారు. వైద్య సిబ్బంది వర్షాకాలం ముగిసే వరకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఇంటింట తిరుగుతూ జ్వర పీడితులను గుర్తించాలన్నారు. ఏజెన్సీలో భారీ వర్షం ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలో 9 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అత్యధికంగా 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగును ప్రజలు బోటులో దాటారు. ఇటీవల వర్షాలకు కొండాయి– దొడ్ల మధ్యలో ఉన్న జంపన్నవాగు ఉధృతికి తాత్కాలిక రోడ్డు తెగిపోగా ప్రజల అవసరాల నిమిత్తం మళ్లీ తాత్కాలికంగా రోడ్డు వేశారు. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రాకపోకలను మొదలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు జీసీసీ వెనుకాల ఉన్న కొత్తగుడిసెల్లోని ఇళ్లకు నీరు వచ్చి చేరింది. -
డిటోనేటర్ల వినియోగాన్ని నిలిపేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం కారణంగా పలు నియర్–మిస్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. తాత్కాలికంగా డిటోనేటర్లను నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ డిటోనేటర్లతో మైనింగ్ సిబ్బంది, ముఖ్యంగా షార్ట్ ఫైరర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అండర్ గ్రౌండ్లో తడి ప్రదేశాల్లో బ్లాస్టింగ్ ఆపరేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్లలో డిజిటల్ సందేశాలు కొన్నిసార్లు తప్పుగా ప్రదర్శించబడుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జి శ్రీనివాస్, బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోశం పాల్గొన్నారు. -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశానిర్ధేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీష్, గుజ్జ సత్యనారాయణ రావు, మధు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం -
పీఆర్సీ ఊసేలేదు!
● మూడేళ్లుగా వేతన సవరణ పెండింగ్ ● దశల వారీగా అందోళన, నిరసన కార్యక్రమాలు● పట్టించుకోని యాజమాన్యం, పాలకులు ● నేటి నుంచి జీఎం కార్యాలయం ఎదుట దీక్షలు2,200 మంది అధికారులు రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా 2,200 మంది అధికారులు పనిచేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో సుమారు 250 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ చెల్లించాల్సి ఉంది. ఈ–వన్ గ్రేడ్ నుంచి ఈ–8 గ్రేడ్ వరకు పీఆర్పీ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో అఽధికారికి సీనియారిటీ ప్రకారం ఏడాదికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు పీఆర్సీ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల బకాయిలు సుమారు రూ.277కోట్లు రావాల్సి ఉందని.. మరోఏడాది లెక్క తేలాల్సి ఉందంటున్నారు. తమను యాజమాన్యం పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో సింగరేణి అధికారులు ఉన్నారు. తమకు పీఆర్పీ చెల్లించకుండా యాజమాన్యం చిన్న చూపు చూస్తోందని అధికారులు వాపోతున్నారు. దశల వారీగా ఆందోళనలు సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు అధికారులు పిలుపునిచ్చారు. తొలిదశలో కార్మికవాడల నుంచి జీఎం కార్యాలయాల వరకు ఆందోళన నిర్వహించారు. జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. రెండోదశలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు. నేటినుంచి రిలే నిరాహార దీక్షలకు స్పందించకపోతే ప్లేడేలు, బాయికాట్ చేయడం, వర్క్ టూ రూల్ పాటించనున్నట్లు సింగరేణి అధికారుల సంఘం ప్రకటించింది.సింగరేణిలో ఉత్పత్తిని పరుగులు పెట్టించే అధికారుల సంక్షేమాన్ని యాజమాన్యం, పాలకులు పక్కనబెట్టారు. ఏకంగా మూడేళ్లుగా అధికారుల వేతన సవరణ (పీఆర్సీ) ఊసే ఎత్తకపోవడంతో సింగరేణి అధికారులు ఇక ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. చర్చల దశ దాటి నేటినుంచి క్షేత్రస్థాయిలో ఆందోళనలకు దిగుతున్నారు. నేటినుంచి సింగరేణి అధికారుల పోరుబాట ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడే ప్రమాదం ఉంది. – భూపాలపల్లి అర్బన్ఆర్థిక సంవత్సరం బకాయిలు 2022–23 రూ.117కోట్లు 2023–24 రూ.127కోట్లు 2024–25 రూ.150 కోట్లు మూడేళ్ల పీఆర్పీ చెల్లించాలి పదోన్నతి పాలసీ రూపొందించి అమలు చేయాలి పారదర్శకంగా పదోన్నతి, బదిలీలు ఉండాలి సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండొద్దు సంస్థకు రూ.50వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి అధికారుల క్వార్టర్లకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి అధికారుల ఐఐఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలి.సింగరేణి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. సకాలంలో పీఆర్పీ బకాయిలు చెల్లించకపోవడంతో అసంతృప్తి పెరిగింది. అనేక విధాలుగా ఆందోళనలు నిర్వహించాం. యాజమాన్యం స్పందించకపోవడం బాధగా ఉంది. అధికారులకు రావాల్సిన పీఆర్పీతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించాలి. డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదు. న్యాయమైన డిమాండ్లను సింగరేణి యాజమాన్యం పరిష్కరించాలి. – నజీర్, సీఎంఓఏఐ ఏరియా అఽధ్యక్షుడు -
పత్తికే ప్రాధాన్యం
భూపాలపల్లి రూరల్: రబీలో వర్షాభావానికి తోడు పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో కుదేలైన రైతులు.. వానాకాలం సాగుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సారి వర్షాలు గతేడాది మాదిరిగా కాకుండా తక్కువగా కురుస్తాయని, స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇటీవల రెండు సార్లు కురిసిన అడపాదడప వర్షాలతో రైతులు సాగుబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా దుక్కులు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు విత్తనాలు సైతం విత్తారు. ఈ మేరకు అధికార యంత్రాంగం స్పందించి నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంతో పాటు సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచాలనే డిమాండ్ రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. పత్తికి ప్రాధాన్యం.. జిల్లాలో గతేడాది 91,510 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. ఈ సారి ఇప్పటివరకు 1,06,560 ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 45వేలు ఎకరాలు సాగు చేశారని, 1,100 ఎకరాలు వరి నార్లు పోసుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తికి మాత్రం ధరలో పెద్దగా ప్రాధాన్యత లేకున్నా పెద్దమొత్తంలో లాభాలు రాకపోయినా పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు బాగుండటంతో ఇతర పంటలు సాగుచేసే రైతులు కూడా పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. పెరగనున్న మిర్చి సాగు.. రెండేళ్లుగా మిర్చి పంటలకు ఎక్కువగా చీడపీడలు ఆశిస్తున్నాయి. మార్కెట్లో మాత్రం క్వింటాల్కు మిర్చికి నాణ్యతను బట్టి రూ.20వేల నుంచి రూ45వేలకు పైగా అధిక ధర పలికింది. రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో గతేడాది కేవలం 7,700 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేయగా ప్రస్తుతం 20వేల ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మిర్చి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది మిర్చికి అధిక ధర వస్తుందనే నమ్మకంతోనే రైతులు మిర్చి పంట వైపు మొగ్గు చూపుతున్నారు.వరి 1,09,854 పత్తి 1,06,560 మిర్చి 20,000 మినుములు 90పెసర 110కంది 120మొత్తం 2,36,734 2,36,734 ఎకరాలకు పైగా సాగు 45వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
గణపురం: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా తల్లితండ్రులు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గణపురం మండలం చెల్పూరు పీహెచ్సీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లితండ్రులు నిర్లక్ష్యం చేయకుండా పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఆరోగ్యకేంద్రాలతో పాటు సబ్సెంటర్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాలలో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారని.. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 34,728 మందికి పోలియో చుక్కలు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 34,728 మంది చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యాశాఖ అఽఽధికారి డాక్టర్ మధుసూదన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేయడానికి 296 బూత్లు, 14 మొబైల్ బృందాలు, 14 ట్రాన్సిట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి 1,184 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు. పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారుల కోసం నేడు (సోమవారం), 30 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. పకడ్బందీగా పల్స్పోలియో మహాముత్తారం: పల్స్పోలియో కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఆదివారం మండలంలో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా మహాముత్తారం, కోనంపేట, యామన్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండలంలో 1,666 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. డీఎంహెచ్ఓ వెంట మండల వైద్యాధికారి సందీప్ ఉన్నారు. పల్స్పోలియో కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి మధుసూదన్ చెల్పూరు ఆరోగ్యకేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్శర్మ -
ముక్కలైన కలల రెక్కలు
పైలట్ కావాలన్న కల.. శిక్షణలోనే కూలిపోయిన విమానంహసన్పర్తి: తల్లిదండ్రులకు అండగా నిలవాలని.. పైలట్గా ఉన్నత స్థానానికి చేరుకోవాలని.. కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని సుమంత్ కన్న కలలు ఒక్క ప్రమాదంతో ముగిశాయి. ఆకాశాన్ని జయించాలని బయలుదేరిన యువకుడిని.. అదే ఆకాశం శాశ్వతంగా తనలో కలుపుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ తల్లి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. పైలట్గా తిరిగి వచ్చి తల్లిదండ్రులకు గర్వకారణం కావా ల్సిన ఆ కుమారుడు.. శవపేటికలో వస్తాడనే విషయాన్ని ఆ కుటుంబం ఊహించలేదు. హసన్పర్తికి చెందిన ఆడెపు సుమంత్ (21) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో శిక్షణ విమానం భారత కాలమానం ప్రకారం శనివారం కుప్పకూలడంతో మృతిచెందాడు. ఈ వార్తతో కుటుంబంలో, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్య తరగతి కుటుంబం నుంచి.. హసన్పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడెపు వరలక్ష్మి–చంద్రమోళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్పర్తిలో స్థిరపడింది. చంద్రమౌళి హసన్పర్తిలో పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడెపు సుమంత్. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత 6నుంచి పదో తరగతి వరకు ఎల్లాపురంలోని ఎస్పీఆర్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ ఆల్ఫోర్స్లో పూర్తి చేశాడు. పైలట్ కావాలన్నదే సుమంత్ లక్ష్యం. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందాడు. దక్షిణాఫ్రికాలో శిక్షణ కోసం గతేడాది వెళ్లాడు. మరో రెండు నెలలైతే.. మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఒక్క ఫోన్కాల్తో కుప్పకూలిన కుటుంబం శనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని శోకసద్రంలో ముంచింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.. అతను లేడు’అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామమంతా శోకసంద్రం సుమంత్ మరణవార్త తెలియగానే హసన్పర్తి గ్రామానికి చెందిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి రోదనలు ఆగడం లేదు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ‘చాలా మంచివాడు.. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరం’అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు ఆగమంటాళ్లు సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతోందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో హసన్పర్తికి చెందిన ట్రెయినీ పైలట్ సుమంత్ మృతి రెండు నెలల్లో పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తానని తెలిపిన యువకుడు అంతలోనే తీవ్ర విషాదం.. తల్లిదండ్రులకు తీరని శోకం -
అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి
ములుగు: తల్లిదండ్రులు చిన్న పిల్లలను మొదటగా అంగన్ వాడీ పాఠశాలలకు పంపాలని డీడబ్ల్యూఓ ప్రేమలత తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ప్రీ స్కూల్ కార్యక్రమాలను అన్ని విధాలుగా నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల అభివృద్ధికి తోడ్పడేలా శారీరక, భాషా, మేధాభివృద్ధి పూర్వ గణితాభివృద్ధికి సంబంధించిన ఆట, పాటలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ములుగు ప్రాజెక్ట్ సీడీపీఓ శిరీష, ఎస్టీ కాలనీ కార్పొరేటర్ స్వాతి, ప్రథమ్ ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ నాగేశ్వర్రావు, సూపర్వైజర్ కళావతి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. డీడబ్లూఓ ప్రేమలత -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఆరోగ్యశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రణాళిక ప్రకారం పోలియో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో 22,572 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారని 312 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 రూట్లు, బస్టాండ్ వద్ద బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి సుధీర్, వ్యాధి నిరోదక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రంజిత్, మాస్ మీడియా అధికారి సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, సాంబయ్య, స్వరూప, సురేష్బాబు, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి ములుగు రూరల్: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీన్కుమార్ అన్నారు. శనివారం మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారుతుందన్నారు. వర్షాలకు రంగు మారి ఎఫ్సీఐ బియ్యం దిగుమతులు చేసుకోవడం లేదని చెప్పారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ పూర్తయ్యేలా.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
శనిత్రయోదశి భక్తుల రద్దీ
కాళేశ్వరం: శనిత్రయోదశి సందర్భంగా కాళేశ్వరం దేవస్థానంలోని బాలాలయంలో ఆదిముక్తీశ్వరస్వామి వద్ద శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం ఆదిముక్తీశ్వరాలయం వద్ద శని పూజలు, కాలసర్ప పూజలు, అభిషేక పూజలు, కుంకుమార్చనలు వేర్వేరుగా నిర్వహించారు. వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.2.94లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేశ్ తెలిపారు.సామూహికంగా శనిపూజలు నిర్వహిస్తున్న భక్తులు -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
రేగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నకిలీ ఓటర్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శనివారం మండలకేంద్రంలో సర్లో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలని కోరారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేయాలని తెలిపారు. ఓటరుగా అర్హత ఉన్న వారు తమ పేరు నమోదు చేయించుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపునకు సహకరించాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మొబైల్ టీబీ ఎక్స్రే స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. రావులపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాధుల బారిన పడకుండా చి న్నారులకు తప్పకుండా టీకా ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర రావు, సర్పంచ్ మౌనిక, ఆశవర్కర్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
డీపీఓ పరిపాలన విభాగం తనిఖీ
భూపాలపల్లి అర్బన్: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని పరిపాలన విభాగాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పరిపాలనా రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణ, అధికారిక పత్రాలు, పెండింగ్ అంశాలు, కార్యాలయ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నాణ్యత, కార్యాలయ పనితీరు, ప్రభుత్వ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని, కార్యాలయ నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
‘విత్తు’కోని ఆశలు
● జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ● మొలకెత్తని పత్తి గింజలు ● మళ్లీ విత్తుతున్న రైతులు ● జలాశయాల్లో అడుగంటుతున్న నీరు ● వరి, మిర్చి పంటల సాగుపై ఆందోళన ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వ వివరాలు (మిలియన్ ఘనపు అడుగుల్లో).. జలాశయం సామర్థ్యం ప్రస్తుతం గణపసముద్రం 380 151 బొగ్గులవాగు 406.56 80.10 భీంఘన్పూర్ 380 15120వేల ఎకరాల్లో మొలకెత్తని పత్తి విత్తనాలు.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో జిల్లాలో సుమారు 2,36,734 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తిపంట 1,06,560 ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేయగా, తొలకరి వర్షాలకు సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పత్తిగింజలు నాటారు. వర్షాలు ముఖం చాటేయడం, అప్పుడప్పుడు చిరుజల్లులు మాత్రమే కురియడంతో సుమారు 20వేల ఎకరాల్లో పత్తిగింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు చేసేది లేక గడిచిన రెండు రోజులుగా మళ్లీ (పోగుంటలు) మొలకెత్తని చోట పత్తి విత్తనాలు వేస్తున్నారు. పత్తి మొలిచిన చోట మొక్కలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. బోర్ల ద్వారా నీటిని అందిస్తుండగా మరికొందరు ముందస్తుగా స్ప్రింకర్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ఏడు మండలాల్లో తక్కువ వర్షపాతం.. జిల్లాలోని 12 మండలాల్లో ఏడు మండలాల్లో జూన్ నెలలో తక్కువ వర్షాపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 120.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 109.9 మాత్రమే నమోదైంది. మహదేవపూర్, పలిమెల, మల్హర్, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదు కాగా.. అతి తక్కువగా మొగుళ్లపల్లి మండలంలో ఈ నెల మొత్తంలో 57.1 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా ఆరు రోజులు మాత్రమే వర్షం కురిసినట్లుగా అధికారులు వెల్లడించారు. వరి, మిర్చి సాగుపై ఆందోళన.. ఎల్నినో ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ హెచ్చరించడంతో జిల్లాలో వరి, మిర్చి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లు, బావులు ఉన్నవారు సాగుకు సిద్ధం అవుతుండగా వర్షం మీదే ఆధారపడే వారు ఇతర పంటలను సాగు చేయాలని భావిస్తున్నారు. బోర్లు ఉన్నప్పటికీ వర్షాలు కురవకపోతే భూగర్భజలాలు అడుగంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం రైతులు ఆందోళన చెందవద్దు. ఎల్పినో ప్రభావం జిల్లాలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక వరి వంగడాలు, పప్పు దినుసులు, అపరాలను సాగు చేయాలి. ఈ పంటలు వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటాయి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారిమహదేవపూర్లో రెండోసారి పత్తిగింజలు వేస్తున్న రైతులు అన్నదాతలకు ఈ ఏడాది తిప్పలు తప్పేలా లేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రైతులు పత్తి గింజలు నాటి పది రోజులు కావస్తున్నా.. అవి మొలకెత్తకపోవడంతో మళ్లీ గింజలు వేయాల్సి వస్తుంది. మొలకెత్తిన మొక్కలను సైతం కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పత్తి సాగే ఇలా ఉంటే మిర్చి, వరి పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – భూపాలపల్లి -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(కె): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాచం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ఆభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైయ్యద్ ముస్సేన్, మన్నెం సునీల్, జల్లిగంపల కళాధర్, చిట్టెం వాసు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ -
30వరకు గడువు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్సైట్ ద్వారా ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిస్ట్ డిజైనర్–ఎఫ్ఈఎం, సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయాన్ని, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు. అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉపాధ్యాయులు నేషనల్అవార్డుటీచర్స్.ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా జూలై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయి గుర్తింపు పొందాలన్నారు. నాపాకలో పూజలు చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో శ్రీ సర్వతోభద్ర ఆది ఏకశిలా శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకుడు పెండెల ప్రభాకరాచార్యులు ఆయనకు ప్రత్యేక పూజలు జరిపించి దేవాలయ విశిష్టతను వివరించారు. ఇలాంటి దేవాలయం ఇంతవరకు ఎక్కడా చూడలేదని, ఆలయం అభివృద్ధి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జయశ్రీ, ఏపీఓ హలీంపాషా, ఈసీ సుధాకర్ ఉన్నారు. సమన్వయంతో కార్మికులకు న్యాయం భూపాలపల్లి అర్బన్: బాండెడ్ లేబర్ వ్యవస్థ నిర్మూలన, కార్మికుల అక్రమ రవాణా నివారణ, కార్మిక సంక్షేమ పథకాల సమర్థ అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది (గవర్నమెంట్ ప్లీడర్) బొట్ల సుధాకర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సంయుక్తంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖల అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ వినోద్, పలిమెల తహసీల్దార్ రాజేశ్వర్రావు, సీఐ కరుణాకర్రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, నాయబ్ తహసీల్దార్లు అంజలిరెడ్డి, అబ్దుల్, శ్రీలత, భాస్కర్, ఎస్ఐలు పాల్గొన్నారు. యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా అనిల్ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా భూపాలపల్లి పట్టణానికి చెందిన శిరుప అనిల్కుమార్ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో అనిల్ కుమార్ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు అనిల్ను సత్కరించారు. -
అడుగంటిన జలాశయాలు
● వానాకాలం సాగుపై రైతుల్లో ఆందోళన ● జిల్లాలో వర్షాభావ పరిస్థితులే కారణం జిల్లాలో ఈ నెలలో రెండు, మూడు రోజుల పాటే సాధారణ వర్షాపాతం నమోదైంది. వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటి వ్యవస్థ గొలుసుకట్టుగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. గణపసముద్రం నిండి మోరంచవాగు పారితేనే మూడు మండలాల రైతులకు నీరు అందుతుంది.. అయితే అక్కడ 40 శాతం నీరే ఉంది. అటు దేవాదుల ఎత్తిపోతల పథకానికి కీలకమైన భీంఘన్పూర్, బొగ్గులవాగు ప్రాజెక్టు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఫలితంగా జిల్లాలో వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఎడారిగా మారుతాయేమోనని అన్నదాతలు భయపడుతున్నారు. గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు సామర్థ్యం 380 మిలియన్ ఘనపు అడుగులు(ఎంసీఎఫ్టీ). ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి పరిమాణం 151 మిలియన్ ఘనపు అడుగులు మాత్రమే. ఇప్పటి వరకు 40 శాతం నీరు మాత్రమే చెరువులో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా 60 శాతం 229 ఎంసీఎఫ్టీ వస్తే చెరువు మత్తడిపోయనుంది. ఈ చెరువుపై ఆధారపడి మూడు మండలాల ప్రజలు వ్యవసాయం చేస్తుంటారు. గణపురం మండలంలో ప్రతీ ఏటా 4వేలకు పైగా ఎకరాల సాగు జరుగుతుండగా, చెరువు నిండాక మత్తడి పడి నీరంతా మోరంచవాగులో కలుస్తుంది. ఈ మోరంచవాగుపై ఆధారపడి భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన వేలాది మంది రైతులు తమ పంట పొలాలను సాగు చేసుకుంటారు. గణపసముద్రంలో నీటి మట్టం అంతంత మాత్రంగానే ఉండటంతో మూడు మండలాల ప్రజలు తమ పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలోని వరదనీరును వృథా కాకుండా ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే సదుద్ధేశంతో బొగ్గులవాగు మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టును 1976లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్హర్, కాటారం మండలాల్లోని సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 406.56 ఎంసీఎఫ్టీ కాగా, ప్రస్తుతం 80.10 ఎంసీఎఫ్టీ మాత్రమే నీరు నిల్వ ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ఈ ఏడాది వానాకాలం సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్తో పాటు ఇతర జిల్లాల రైతులకు సాగునీరు అందించాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్ అయిన భీంఘన్పూర్ భూపాలపల్లి మండలంలో ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా భూపాలపల్లి మండలంలోని రైతులకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్ పూర్తిగా నిండాక దేవాదుల మోటార్ల ద్వారా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లో నీటిమట్టం ప్రమాదకరంగా ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 380 ఎంసీఎఫ్టీ కాగా 151 ఎంసీఎఫ్టీ మాత్రమే నీటి నిల్వ ఉంది. వానాకాలం సీజన్ ముంచుకొస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రధాన చెరువులు, రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల కాలం నాటి గణపసముద్రం కేవలం 40శాతం నీటికే పరిమితం కాగా.. బొగ్గులవాగు, భీంఘన్పూర్ రిజర్వాయర్లలో సగం కూడా నీరు లేకపోవడంతో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. – భూపాలపల్లి -
ఆదివాసీల ఓట్లు తొలగించొద్దు
ఏటూరునాగారం: ఓటరు జాబితా సమగ్ర సవరణలో ఆదివాసీలు ఓట్లు తొలగించవద్దని, గోదావరిలో డిసిల్టేషన్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎండీ దావూద్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్ మాట్లాడుతూ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా కార్యకర్తలు చూడాలన్నారు. కాంట్రాక్టర్ల లాభాల కోసమే గోదావరిలో ఇసుక తోడుతున్నారని తెలిపారు. వెంకటాపురం(కె) మండలం యాకన్నగూడెం నుంచి సుడిబాక వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించడంతో పాటు పాత పద్ధతుల్లోనే ఇసుక క్వారీలను కొనసాగించాలన్నారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. ఇసుక ద్వారా వచ్చే లాభాలను ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని గోదావరి నదిలో సుమారు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 4వేల ఎకరాల్లో సుమారు 3 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. దీంతో ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. తాగు, సాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, చిట్టి బాబు, రఘుపతి, వాసు, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, చిరంజీవి, దేవయ్య, చారి, దామోదర్, గపూర్, కిష్టయ్య, అశోక్, రవితేజ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్ -
పోలియో ఆదివారం
భూపాలపల్లి అర్బన్: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం 0–5 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులకు రేపు (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 12 మండలాల పరిధిలో 34,728మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఇందుకుగాను బూత్లకు గాను 4 రూట్లలో 14 మంది సూపర్వైజర్లను ఏర్పాటు చేసి ప్రతీ బూత్కు నలుగురి ఇబ్బంది చొప్పున సిబ్బందిని నియమించారు. 14 మొబైల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 1,951 వాయిల్స్ను సిద్ధంగా ఉంచారు. ఈ నెల 29, 30వ తేదీలలో ప్రతీ గ్రామంలో వైద్యసిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటా సర్వే నిర్వహించి చుక్కులు వేసుకోని వారికి అక్కడే వేయనున్నారు. రెండేళ్ల తర్వాత పల్స్పోలియో పల్స్పోలియో కార్యక్రమాన్ని 2024 మార్చి నెలలో నిర్వహించారు. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించేందు కు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఎప్పటికప్పుడు వైద్యాధికారులు, సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ చిన్నారికి గుర్తించి తప్పకుండా రెండు చుక్కుల మందును వేయాలని కలెక్టర్ వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆ దేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలతో ఆయా శాఖల సమన్వయంతో వందశాతం లక్ష్యం చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. పోలియో రహిత సమాజం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తూ 0–5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్పోలియో కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిస్తాం. తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా వేయించాలి. ప్రతీ ఏడాదిలో రెండు సార్లు వేయించాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంటుంది. బస్టాండ్లు, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండే స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఇటుక బట్టీలు, ఇతర పని స్థలాలను కూడా గుర్తించాం. – చల్ల మధుసూదన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అఽధికారి రేపటి నుంచి మూడు రోజులు పల్స్పోలియో 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు రెండు చుక్కులు జిల్లా వ్యాప్తంగా 296 బూత్ల ఏర్పాట్లు 1,951 పోలియో వాయిల్స్ నిల్వలు -
వరంగల్ ఓసిటీలో ప్లాట్ల వేలం
● వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపిన ఏజే మిల్లు కార్మికుడు ● 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్రిక్తత కాశిబుగ్గ: వరంగల్ ఓ సిటీలోని ప్లాట్ల వేలం ఉద్రిక్తతకు దారితీసింది. ఆజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకులు ర్యాలీగా రావడం, ఓ కార్మికుడు ఏకంగా వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వరంగల్ ఓ సిటీలోని 98 ప్లాట్లకు అధికారులు శుక్రవారం ఉదయం వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే, దీనికి ముందే పలు కార్మిక సంఘాల నాయకులు పురాతన వాటర్ ట్యాంకు ప్రాంతం నుంచి ర్యాలీగా వేలం నిర్వహించే క్లబ్ వరకు తరలివచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆజంజాహిమిల్లు కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని, ప్లాట్ల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గద్దల సంజీవ అనే కార్మికుడు వాటర్ ట్యాంకు ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తర్వాత యశోద అనే కార్మికురాలితో పాటు మరో నలుగురు ట్యాంకు ఎక్కడానికి ప్రయత్నించారు. అలాగే, పోలీసులు పైకి రాకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకు మెట్ల మధ్యలో టైరు కాల్చి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే ట్యాంకుపై నుంచి దూకుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి నిరసనకారులను కిందికి దింపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ట్యాంకు వరకు ర్యాలీకి యత్నించారు. తాము కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవిస్తామని పోలీసులకు తెలిపారు. దీంతో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐలు కర్రె స్వామి, షూకూర్ ఆధ్వర్యంలో 17 మందిని పోలీసు వాహనం ఎక్కించి మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం యథాఽవిధిగా వేలం కొనసాగించారు. 39 ప్లాట్ల విక్రయం.. గజానికి గరిష్ట ధర రూ.75 వేలునయీంనగర్: వరంగల్లోని ఓసిటీ టౌన్షిప్లో ‘కుడా’ అధికారులు శుక్రవారం ప్లాట్లకు వేలం నిర్వహించారు. మొత్తం 45 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచగా 39 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్లకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస (అప్సెట్) ధర గజానికి రూ.48 వేలు ఉండగా.. అన్ని ప్లాట్లు అధిక ధరకే అమ్ముడుపోయాయి. గజానికి గరిష్టంగా రూ.75 వేల ధర పలికింది. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు వేలం నిర్వహించారు. యుని సిటీ ప్లాట్ల వేలం వాయిదా ఉనికిచర్లలో కుడా ఆధ్వర్యంలో ఈ నెల 28 (ఆదివారం) నిర్వహించాల్సిన యుని సిటీ రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం జూలై 5కు వాయిదా వేసినట్లు ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలుదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. -
భర్తీ ఎప్పుడు?
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జ్ ఆర్ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్.. ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో గైనిక్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న డాక్టర్ గీతాలక్ష్మికి ఆర్ఎంఓగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్ కోటాలో ఓబీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఆర్ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాల్లో ఆర్ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు వివరించినట్లు సమాచారం. -
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్
మల్హర్(కాటారం) : కూతురి మృతికి అల్లుడే కారణమని భావించి అతడిని వదిలించుకోవాలనే కక్షతో సుపారీ ఇచ్చి హత్యాయత్నానికి పాల్పడిన అత్తతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం కాటారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన బాధితుడు చిగురు గణేశ్ భార్య చనిపోవడంతో అతని అత్త చింత రాజేశ్వరి కూతురి మరణానికి అల్లుడే కారణమని కక్ష పెంచుకుంది. ఇద్దరు మనువళ్ల పెంపకం భారం తనపై పడడం, అల్లుడు బాధ్యత తీసుకోకపోవడంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తనకు పరిచయమున్న ధరావత్ రవీందర్నాయక్తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్గా రూ.లక్షతో పాటు గణేశ్ ఫొటో అందించింది. దీంతో రవీందర్.. తాడగొండ దామోదర్, కొలపాక నాగరాజు, తోలు ప్రశాంత్ను ఈ సుపారీలో చేర్చుకున్నాడు. ఈ క్రమంలో నిందితులు ఈనెల జూన్ 22న గణేశ్ గ్రామానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. ఈనెల 23న కారు మరమ్మతుకు గురైనట్లు నటించి గణేశ్ సాయం కోరారు. గణేశ్ సాయం చేయడానికి రాగానే నాగరాజు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వస్తారనే భయంతో అతడిని పొలాల్లోకి తోసేసి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో శుక్రవారం మిగతా డబ్బు కోసం నిందితులంతా కాటారంలోని రాజేశ్వరి ఇంటి వద్ద చర్చిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాటారానికి చెందిన రాజేశ్వరి, కరీంనగర్కు చెందిన రవీందర్నాయక్, దామోదర్, నాగరాజు, ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులు
● 170 మంది కేటాయింపు ● 60 మంది జాయినింగ్ కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈనేపథ్యంలో ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని నర్సింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. -
డ్రగ్స్ రహిత తెలంగాణ అందరి ధ్యేయం
భూపాలపల్లి రూరల్: డ్రగ్స్ రహిత తెలంగాణ అందరి ధ్యేయమని.. డ్రగ్స్ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్సెంటర్ వరకు నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా భూపాలపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సంకీర్త్తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. యువ త డ్రగ్స్కు దూరంగా ఉండి తమ భవిష్యత్ను సురక్షితంగా నిర్మించుకోవాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువకులు తమ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
● డీఎస్పీ సూర్యనారాయణ మల్హర్: డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపవద్దని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ గనిలో పనిచేసే డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. డ్రైవర్లు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గనుల్లో ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని డ్రైవర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై మహేందర్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పీరీల ఊరేగింపు కాళేశ్వరం: మహదేవపూర్, కాళేశ్వరంతో పాటు పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీరీలను డప్పుచప్పుళ్లతో వీధుల వెంట ఊరేగించారు. కులమత బేధాలు లేకుండా పీరీలకు మొక్కులు చెల్లించారు. కుడుకలు, పూల దండలు వేశారు. అనంతరం పీరీలను గోదావరిలో నిమజ్జనం చేశారు. గోదావరి వద్ద రొట్టెలు భక్తులకు పంపిణీ చేశారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బోర్హోల్స్ పూర్తికాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బరాజ్లో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ సైంటిస్టుల బృందం చేపట్టిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బోర్హోల్స్ శుక్రవారం పూర్తయ్యింది. మొత్తం 37 బోల్హోల్స్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు బరాజ్ ఇన్చార్జ్ ఈఈ సురేష్ తెలిపారు. బరాజ్ పునరుద్ధరణ కోసం త్వరలో నివేదికలు అందజేస్తారని తెలిసింది.బైక్ అదుపు తప్పి యువకుడి మృతికాళేశ్వరం: బైక్ అదుపు తప్పి ఓ యువకుడి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం సబ్స్టేషన్ మలుపు చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాళేశ్వరం గ్రామానికి చెందిన చకినారపు విష్ణు(22), చెన్నూరు మండలం నాగారం గ్రామానికి చెందిన రామిల్ల వినయ్ బైక్పై కాళేశ్వరం వస్తున్నారు. ఈక్రమంలో సబ్స్టేషన్ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డు పక్క పొదల్లో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అపస్మారక స్థితిలోకి పోయారు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా వారు 108 వాహనానికి తెలిపి క్షతగాత్రులను భూపాలపల్లికి ఆస్పత్రికి తరలించగా విష్ణు మృతి చెందాడు. వినయ్ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా, వినయ్ స్వగ్రామం చెన్నూరు మండలం నాగారం గ్రామం కాగా, మండలంలోని అన్నారంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు. అవయవదానం గొప్ప నిర్ణయం ములుగు రూరల్: అవయవ దానం గొప్ప నిర్ణయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవన్కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ అవయమ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతలను ఆయన అభినందించారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా కుమారస్వామి–శైలజ దంపతులు అవయవ, శరీరదానం చేయడానికి ముందుకొచ్చి సదాశయ ఫౌండేషన్కు సంబంధించిన పత్రాలను అందజేశారు. -
కంటి చూపుతో ఇబ్బంది ఉందని..
చిట్యాల: కంటి చూపుతో ఇబ్బంది ఉందనే మనస్తాపంతో ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిట్యాల మండం ఒడితల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలకుంట్ల సమ్మయ్య(76) కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందులో కంటి చూపు కూడా ఒకటి. దీంతో భార్య రాజమ్మ సాయంతో దినచర్యలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య, పిల్లల కు భారం కావొద్దనే ఉద్దేశంతో శుక్రవారం తెల్లవా రుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లేచి చూడగా సమ్మయ్య బయట బాత్రూమ్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో లబోది బోమంటూ గ్రామస్తులకు తెలుపగా వారు మృతదేహాన్ని కిందికి దింపారు. మృతుడి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ పేర్కొన్నారు. కొర్కిశాలలో యువకుడు.. మొగుళ్లపల్లి: కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొర్కిశాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండారపు మహేందర్ (30) దంపతులకు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపం చెందిన మహేందర్ గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసున్నాడు. కుటుంబీకులు శుక్రవారం తెల్లవారుజామున చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ పేర్కొన్నారు. ● వృద్ధుడి ఆత్మహత్య.. ● ఒడితల గ్రామంలో ఘటన -
నడవడానికా? వ్యాపారానికా?
● నడిచేదారి లేక రోడ్లపైకి వస్తున్న జనం ● పట్టించుకోని అధికారులు ● హైకోర్టు ఆదేశాలు బేఖాతరుఇరువైపులా ఆక్రమణలే.. భూపాలపల్లి పట్టణంతో పాటు మంజూర్నగర్లో సుమారు మూడు కిలోమీటర్ల పొడవుతో రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువలపైన ఫుట్పాత్లు నిర్మించారు. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రెయినేజీ స్థానంలో పెద్దకాలువ నిర్మించి దానిపై పైకప్పు వేసి ఫుట్పాత్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా వేసిన స్లాబ్లపై పాదచారులు నడవడానికి వీలుగా టైల్స్ వేశారు. నిర్మించిన పుట్పాత్లను రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల యాజమానులు ఆక్రమమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పట్టణం మొత్తంగా ఇదే పరిస్థితి ఉంది. సర్వీసింగ్ కేంద్రాలు, ఫర్నిచర్ దుకాణాలు, పండ్లు, పాన్షాపులు, బట్టల దుకాణాలు, తోపుడు బండ్లు తదితర దుకాణాల యాజమానులు వ్యాపారాలను స్లాబుపై వరకు విస్తరించారు. కేటీకే 5వ గని ప్రధాన ద్వారం నుంచి సంతోషిమాత ఆలయం వరకు ప్రధాన రహదారి వెంట ఫుట్పాత్లు కబ్జాకు గురైనా ఈ విషయంలో అధికారులు స్పందించడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఫుట్పాత్లు కేవలం పాదచారుల కోసమే.. వాటిని ఆక్రమించడం చట్టవిరుద్ధమని హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసినా భూపాలపల్లి పట్టణంలో మాత్రం పరిస్థితి ఏ మాత్రమూ మారలేదు. పట్టణంలో ఫుట్పాత్లు దాదాపు అన్నిచోట్లా అక్రమ నిర్మాణాలకు, వ్యాపార స్టాళ్లకూ నెలవుగా మారాయి. దుకాణాల ముందరి భాగాలు, వాహనాల పార్కింగ్, కూరగాయల, పండ్ల బండ్లు, చివరకు శాశ్వత కట్టడాలు కూడా ఫుట్పాత్లను మింగేస్తున్నాయి. దీంతో పాదాచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై నడవాల్సి వస్తోంది. అధికారుల కళ్లముందే ఈ ఆక్రమణలు జరుగుతున్నా వారు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యలను అధికారులు ఏ మాత్రమూ సీరియస్గా తీసుకోలేదని పట్టణంలోని పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. భూపాలపల్లి పట్టణంలో పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.– భూపాలపల్లి అర్బన్ -
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మల్హర్(కాటారం): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల పిలుపునిచ్చారు. గురువారం కాటారం మండలం గంగారంలో జరిగిన టీఎస్ఎస్ కళాకారిణి జాడి సుమలత వివాహ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతీ పౌరుడికి ఎంతో విలువైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనాలని, తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతీ ఓటు ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల -
బాలికల ఉన్నత విద్యకు ప్రోత్సాహం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పదవ తరగతి పూర్తిచేసిన బాలికల ఉన్నత విద్యా ప్రవేశాలను ప్రోత్సహించేందుకు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గురువారం ప్రత్యేక ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాలు, విద్యా అవకాశాలను వివరించి బాలికలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా చిట్యాల మండలానికి చెందిన గీతాంజలి అనే విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్ ఆమె ఆసక్తిని తెలుసుకుని మహదేవపూర్ కేజీబీవీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సులో ప్రవేశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి మహదేవ్పూర్ కేజీబీవీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సును నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. టేకుమట్ల, కాటారం, గణపురం కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు అందుబాటులో ఉండగా, చిట్యాల, భూపాలపల్లి, రేగొండ, మొగుళ్లపల్లి, మల్హర్, మహాముత్తారం, పలిమెల కేజీబీవీల్లో సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి కోర్సుకు ఒక్కో తరగతిలో 40 సీట్లు ఉన్నాయన్నారు. విద్యార్థినులు తమ ఆసక్తులు, అభిరుచులు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం -
కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ రేగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నకిలీ ఓటర్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక, చెన్నాపూర్ గ్రామాలలో ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజ్యలక్ష్మి, బీఎల్ఓ సూపర్వైజర్ రాజయ్య, వెంకటేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు. 100శాతం ఉత్తీర్ణత భూపాలపల్లి అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 58 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 41 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేణుగోపాల్ భూపాలపల్లి అర్బన్: దీ కాకతీయ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా పులి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా కౌటం సురేందర్, ప్రధాన కార్యదర్శిగా బొంతల రాజు, సహాయ కార్యదర్శిగా మేకల శ్రావణ్, కోశోధికారిగా చిత్తారి రాకేశ్ ఎన్నికయ్యారు. 29నుంచి రిలే నిరాహార దీక్షలు భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సీఎంఓఏఐ భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు నజీర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారులు నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ నజీర్ మాట్లాడుతూ.. కోలిండియా లిమిటెడ్లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ నాయకులు శ్యాంసుందర్, జోతి, అరుణ్, ట్రెజరర్ సాయికృష్ణ, మన్నాన్, చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. మూసివేత ప్రయత్నాలను విరమించుకోవాలి భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.లింగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన డీటీఎఫ్ జిల్లా నాల్గవ వార్షిక కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్రెడ్డి, సునీత, బి.తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులుగా వీరేశం, బొజ్జనాయక్, ఎస్.వీరన్న, సీహెచ్ ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్లుగా పలువురు ఎన్నికయ్యారు. -
ఏడు రకాల తిప్పలు!
1.10 లక్షల ఎకరాల సాగు అంచనా గతేడాది జిల్లాలో 1.05లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ వానాకాలం సీజన్లో 1.10లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గతేడాది ప్రభుత్వం 33 రకాల సన్నాలకు బోనస్ అందించింది. ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించింది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం సన్నాల సాగు రకాల సంఖ్య కుదించడం సరైంది కాదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడు రకాల సన్నాలలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకునేందుకు రైతులు ఆలోచనలు చేస్తున్నారు. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉంటుండడంతో వారికి నచ్చిన సీడ్ ఎంచుకున్నారు. ఈ ఏడాది అన్నదాతలకు ఆ అవకాశం లేదు. ఆ ఏడు రకాలకు డిమాండ్.. మార్కెట్లో ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పిన ఏడు రకాల విత్తనానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వానాకాలం సీజన్లో అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 2.75 మెట్రిక్ టన్నుల విత్తనాల అంచనా. జిల్లాలో అన్ని మండలాల్లోని డీలర్ల వద్ద విత్తనాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ.. ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నట్లు సమాచారం. సాంబా మసూరి ఇప్పటికే దేశీయ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్న బియ్యం, వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా... ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు.జిల్లాలో వానాకాలం వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ తరుణంలో సన్న వడ్ల బోనస్ను కేవలం ఏడు రకాలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగాన్ని కలవరపెడుతోంది. మార్కెట్లో దొరికే విత్తనాల్లో ప్రభుత్వం చెప్పిన ఏడు రకాలు ఏవి? తమ నేలలకు అవి సెట్ అవుతాయా? లేదా? అనే సమాచారం లేక సాగు ఆరంభంలోనే అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో లాగా 33 రకాల సన్నాలకూ బోనస్ ఇస్తే బాగుండేదని, సాగు పనులు ప్రారంభమైన ఈ సమయంలో ఏ రకం విత్తనాలు వేయాలో తెలియక వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఎలాంటి పంటలు వేయాలనేది ఆచితూచి అడుగులు వేస్తున్నారు. – కాళేశ్వరం సన్న వడ్ల బోనస్ను పరిమితం చేస్తూ నిర్ణయం వరి వంగడాల రకాలు ప్రకటించిన అధికారులు ఆందోళనలో అన్నదాతలుప్రభుత్వం సూచించిన పంట కాలం వరి రకాలు (రోజులు) బీపీటీ 52004 140 నుంచి 150 (సోనామసూరి) ఆర్ఎన్ఆర్ 15048 120 నుంచి 125 (తెలంగాణ సోన) కేఎస్ఎం 1638 120 నుంచి 125 జైశ్రీరాం 130 నుంచి 135 హెచ్ఎంటీ (సోన) 135 నుంచి 145 డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145 కేఎన్ఎం 7715 125 నుంచి 130 (కొత్తతరం సన్నరకం) -
పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ
భూపాలపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్మార్క్స్ కాలనీ, 4వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి బూత్స్థాయి అధికారులు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు చెత్త సేకరణ వాహనాల ద్వారా చాటింపు నిర్వహిస్తూ ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, జీపీఓ కిరణ్, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
– భూపాలపల్లి
సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పే పాలకుల, అధికారుల మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనలేదు. గీజర్లు, వాటర్ ప్యూరిఫయర్లు పనిచేయడం లేదు. టాయిలెట్లు, మరుగుదొడ్లకు కనీసం డోర్లు కూడా లేవు. హాస్టల్లోనే ఉండి విద్యార్థులను చూసుకోవాల్సిన వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదు. మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు భోజనంలో నాణ్యత కూడా లేని పరిస్థితి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లను సాక్షి బృందం బుధవారం విజిట్ చేసింది. చిట్యాల: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో గతేడాది 50 మంది విద్యార్థులు ఉండగా ఈ విద్యా సంవత్సరం నిన్నటి(బుధవారం) వరకు కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే వచ్చారు. కాగా వీరికి సైతం మెనూ ప్రకారం అల్పాహారం అందడం లేదు. బుధవారం కిచిడీ అందించాల్సి ఉండగా అన్నం, పచ్చిపులుసు చేశారు. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఈ హాస్టల్ విద్యార్థులు పడుకునే గదులకు తలుపులు పూర్తిగా విరిగిపోయి ఉన్నాయి. దీంతో ఈ వర్షాకాలంలో వర్షపు నీరు గదుల్లోకి వచ్చి విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కోనున్నారు. గణపురం: మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ను సుమారు 30 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రస్తుత భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట తదితర ప్రాంతాల నుంచి సుమారు 300 మంది ఈ హాస్టల్లో ఉండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే వారు. ఇప్పుడు ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందా అన్నట్లుగా ఉంది. గోడలు, స్లాబ్ పగుళ్లు తేలాయి. ఈ హాస్టల్లో ప్రస్తుతం 8మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వాటర్ ప్యూరిఫయర్, గీజర్లు పని చేయడం లేదు. టాయిలెట్స్, మరుగుదొడ్లకు డోర్లు లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గీజర్ పని చేయకపోవడంతో విద్యార్థులు బోరు నీటితోనే ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. -
‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాలలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు 34,728వేల మంది ఉన్నారని.. పోలియో చుక్కలు అందించేందుకు విస్త్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో భాగంగా తల్లిదండ్రులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వంద శాతం పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించాలని కోరారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, చేయడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 14 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసినట్లయితే 94405 86982, 6303239891 నంబర్లకు సమాచారం అందించాల ని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి నవజాత శిశు సంరక్షణ, శిశు మరణాల నివారణపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అధ్యక్షత వహించగా జీజీహెచ్తో పాటు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడారు. ఈ సమావేశంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ నాగ శశికాంత్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సంధ్య, డాక్టర్ సురేందర్, పీడియాట్రిక్ విభాగం వైద్యులు, పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ -
కొనసా..గుతున్న పనులు
మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో గతేడాది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 18మంది ఉండేవారు. హాస్టల్ భవనంలో ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. దీంతో రూ.15లక్షలతో ఫ్లోరింగ్, ప్రహరీ నిర్మాణ పనులను చేపట్టారు. ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఒక్క విద్యార్థి కూడా ఇంకా హాస్టల్కు రాలేదు. ఈ హాస్టల్తో పాటు ఎస్సీ హాస్టల్ వార్డెన్ సైతం స్థానికంగా ఉండటం లేదు. దీంతో తల్లితండ్రులు తమ పిల్లలను హాస్టల్లో చేర్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. -
దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యం ఆధారంగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మార్చి 6నుంచి జూన్ 12వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామసభల్లో మొత్తం 6,391 దరఖాస్తులు అందగా, వాటిలో 716 పరిష్కరించబడ్డాయని, మిగిలిన 5,674 దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సౌకర్యాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. సమస్యల పరిష్కారానికి టైమ్బౌండ్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. రహదారి భద్రత, సీపీఆర్, గుడ్ సమారిటన్, గోల్డెన్ అవర్, మహిళలు, చిన్నారుల రక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వాహనాల వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్స్ ఏర్పాటు అవసరమని పేర్కొనగా, సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రత్యేక అధికారి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ -
సర్.. మీ ఓటు భద్రం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానుంది. నకిలీ ఓట్లు, ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించడమే ధ్యేయంగా అధికార యంత్రాంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా ఓటు హక్కు కల్పించనున్నారు. నేటినుంచి ఇంటింటికీ బూత్ స్థాయి అధికారులు రానున్నారు. 2002 తర్వాత మళ్లీ ఇప్పుడు.. జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం, మంథని నియోజకవర్గంలోని కాటారం డివిజన్ పరిధిలోని మండలాల పరిధిలో గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. నేటి (గురువారం) నుంచి జూలై 24 వరకూ బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు. ఫాం–2లో ఏమి నింపాలి.. ‘సర్’ కార్యక్రమంలో ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫాం–2 నింపి, బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరుంటే.. ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫాంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతరత్రా కుటుంబీకుల పేర్లు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య/భర్త పేరు, వారి ఎపిక్ నంబర్(అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించి బీఎల్ఓకు అందజేస్తే ఇందుకు రసీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్లదే కీలకపాత్ర.. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్న సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఓ) దగ్గరుండి ఓటర్లకు తమ సహాయ, సహకారం అందించాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యర్థి పార్టీదే పైచేయి అవుతుంది. ఎన్నికల సమయంలో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు లేవని ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకూ బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 3 నుంచి 28వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. అక్టోబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం. వచ్చే నెల 24వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. కొత్తగా ఓటరుగా చేరాలంటే ఫాం–6, చిరునామా మార్పునకు ఫాం–8, అనర్హుల పేర్లు తొలగింపునకు ఫాం–7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 18వ తేదీ వరకూ వాటిని పరిశీలించి, అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరు చేరుస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తాం. – రాహుల్శర్మ, కలెక్టర్ జాగ్రత్తగా లేకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం 24 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ 2002 ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల పరిశీలనపురుషులు 1,87,688మహిళలు 1,95,564ఇతరులు 18బీఎల్ఓలు 317సూపర్వైజర్లు 34 -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పింగిలి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అన్నారు. ఉ ద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరా రు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సా నుకూలంగా స్పందించాలని, లేకపోతే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్కుమార్, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
భూపాలపల్లి అర్బన్: ఓటరు జాబితా రూపకల్పనలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుధవారం ఇల్లందు క్లబ్హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధమని తెలిపారు. స్వేచ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహణకు ఓటరు జాబితా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్–2026)లో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా ఖచ్చితత్వంపై ఎన్నికలు నిర్వహణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అర్హులైన ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును నమోదుచేసుకోవాలని సూచించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న ప్రజలు తమ పేర్లును తనిఖీ చేసుకోవాలని, అవసరమైతే సవరణలు, మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరణించిన వ్యక్తుల వివరాలు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు (సర్) కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా.. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఏఎస్పీ నరేష్కుమార్, డీఆర్వో వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్రా రఘు, ఎన్నికల విభాగం డీటీ అబ్బాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, అన్ని శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి బాధ్యత
భూపాలపల్లి: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై బుధవారం జిల్లా కేంద్రంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు 2కే రన్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జెండా ఊపి 2కే రన్ను ప్రారంభించారు. ‘డ్రగ్స్కు నో చెప్పండి–ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం’ అనే సందేశాన్ని యువతకు అందించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజలు మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి దుష్పభ్రావాలు, కుటుంబాలు, సమాజంపై పడే ప్రభావంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. యువత తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి
మహాముత్తారం: సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పలు సూచనలు చేశారు. ఎలక్షన్ వర్క్ పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఆర్ఐ భాస్కర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గొత్తికోయగూడేల్లో బడిబాట మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి ఆశ్రమపాఠశాల ఉపాధ్యాయులు సింగారం, దండేపల్లి, మద్దిమడుగు, మోదేడు గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థుల ను ఆశ్రమ పాఠశాలలో చేర్పించాలని గిరిజన తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజ్మీరా శ్రీని వాస్, కత్తెర్ల మల్లయ్య, లాకవత్ శంకర్, వెంకట్రాం,కిషన్, చందు తదితరులు ఉన్నారు. దేవస్థానం టెండర్ ప్రక్రియ వాయిదా? కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ, తొలగింపునకు ప్రభుత్వం రూ.198కోట్లు కేటాయించగా ఏప్రిల్ 20న సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న టెండర్ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడ్డట్లు సమాచారం. ఇప్పటికే ప్రకారాలు, మూలవిరాట్లను తొలగిస్తున్నారు. మరో వారం పాటు టెండర్ ప్రక్రియ కోసం వేచిచూడాల్సిందేనని తెలిసింది. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో బుధవారం ఫిట్ కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి రక్షణకోసం కార్మికులంతా ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో నిర్వహించే చర్చల్లో 31 డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, నాయకులు మాతంగి రాంచందర్, ఆసిఫ్ పాషా, చంద్రమౌళి, రవికుమార్, తిరుపతి, మల్లికార్జున్, సత్తి, కుమార్ పాల్గొన్నారు. సంపులో పడి వృద్ధురాలి మృతి గణపురం: సంపులో పడి వృద్ధురాలి మృతిచెందిన ఘటన గణపురం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన గొడిశాల సరోజన(70) తెల్లవారుజామున కాలకృత్యాల కోసం ఇంటి బయటకు వచ్చింది. ఇంటి బయటకు వచ్చిన ఆమె ఇంట్లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూశారు. సంపులో పడి ఉండడం గమనించి బయటకు తీశారు. అప్పటికే సరోజన మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు సరోజన కుమారుడు గొడిశాల రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
28న పల్స్ పోలియో
మొగుళ్లపల్లి: ఈనెల 28న నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పీహెచ్సీలో మండల వైద్యాధికారి డాక్టర్ నవత ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ చిరంజీవి, సీహెచ్ఓ రాజేంద్రప్రసాద్, సూపర్వైజర్ సునీత, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హోదా లభించేనా?
కాశిబుగ్గ: వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి మహర్దశ రానుందా? ఎంతోకాలం నుంచి వైద్యులు ఎదురు చూస్తున్న ‘అడిషనల్ డీఎంఈ’ హోదా లభించే అవకాశం ఉందా అంటే.. ఆస్పత్రి వర్గాల నుంచి అవుననే సమధానాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఇన్చార్జ్ సూపరింటెండెంట్లతో నడుస్తున్న ఎంజీఎం ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 రోజుల నుంచి సూపరింటెండెంట్ లేకుండా ఖాళీగా ఉంటున్న ఈ పోస్టును రెగ్యులర్గా ఉండేలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మూడు, నాలుగు నెలల్లో వరంగల్లో 24 అంతస్తుల సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ సూపరింటెండెంట్ను నియమిస్తేనే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఇన్చార్జ్ల పాలనే.. వరంగల్లో ఎంజీఎం ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ అడిషనల్ డీఎంఈ పోస్టు లేకపోవడంతో ఇన్చార్జ్ సూపరింటెండెంట్లను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ పోస్టు ఇన్చార్జ్ కావడంతో దూర ప్రాంతాల నుంచి సీనియర్ వైద్యులు రావడానికి సానుకూలత వ్యక్తం చేయట్లేదు. ఎంజీఎంలో పనిచేస్తున్న సీనియర్ వైద్యులచే ఇన్చార్జ్ల పాలన చేయిస్తున్నారు. సదరు వైద్యులు ఉద్యోగ విరమణ పొందేవరకు కూడా ఇక్కడే విధులు నిర్వహించారు. వీరిలో డాక్టర్ అశోక్ ఎగ్బోటే, డాక్టర్ రఘురాం, డాక్టర్ సత్యదేవ్, డాక్టర్ ఏఎన్ఆర్ లక్ష్మి, డాక్టర్ సురేందర్, డాక్టర్ కరుణాకర్రెడ్డి, డాక్టర్ దొడ్డా రమేశ్ ఉన్నారు. ఇన్చార్జ్ల పాలనకు తెరపడేనా? ఇన్నాళ్లు ఇన్చార్జ్ సూపరింటెండెంట్లతో నడుస్తున్న ఎంజీఎం సర్కారు దవాఖానకు మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ సూపరింటెండెంట్ ఎంతైనా అవసరం అనే కోణంలో ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఇన్చార్జ్ సూపరింటెండెంట్ నియామకంలో జాప్యం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నూతనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రభుత్వ ఆస్పత్రులకు రెగ్యులర్ సూపరింటెండెంట్లను నియమించిన ప్రభుత్వం ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దాస్పత్రి అయిన ఎంజీఎంకు లేకపోవడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఎంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల వరంగల్లో జరిగిన దిశ సమావేశంలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రి అధ్వానంగా మారుతోందని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అడిషనల్ డీఎంఈ పోస్టు వస్తే.. వరంగల్ ఎంజీఎంకు అడిషనల్ డీఎంతో పోస్టు వస్తే రెగ్యులర్ సూపరింటెండెంట్ వస్తారు. ఇన్చార్జ్ల పాలనకు తెరపడుతుంది. ఈపోస్టులో జాయిన్ కావడానికి సీనియర్ వైద్యులు ఆసక్తి చూపుతారు. పదోన్నతుల అవకాశం ఉంటుంది. ఆస్పత్రికి పవర్తో పాటు ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ఆస్పత్రి కూడా అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుంది. రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. కాగా, ఉస్మానియాలో రెండు సూపరింటెండెంట్ పోస్టులు, ఒక ప్రిన్సిపాల్ పోస్టు, వరంగల్లో ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టుకు అడిషనల్ డీఎంఈ క్యాడర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంజీఎంకు ‘అడిషనల్ డీఎంఈ’ హోదా కోసం ఎదురుచూపులు రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టుతో తీరనున్న వెతలు -
హరిత మహోత్సవానికి సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: జిల్లాలో 12వ విడత హరిత మహోత్సవంలో డీఆర్డీఏ ద్వారా 15,74,593 లక్షల మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం అంతా సిద్ధంచేసింది. అందుకు అనుగుణంగా గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచారు. అదనంగా అటవీశాఖ, సింగరేణి. ఏఎంఆర్ తాడిచర్ల మైనింగ్ వారు అదనంగా నర్సరీల్లో మొక్కలు పెంచడానికి సిద్ధం చేశారు. జిల్లాలో వానలు కురుస్తున్న తరుణంలో అన్ని గ్రామపంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి నాటే విధంగా చర్యలు చేపట్టనున్నారు. లక్ష్యం.. గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 15,74,593 మొక్కలు నాటనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 1.40లక్షల వరకు, సింగరేణి ఏఎంఆర్ తాడిచెర్ల మైనింగ్ వారు అదనంగా ప్లాంటేషన్ చేయనున్నారు పలు రకాల మొక్కలు.. హరితహారంలో ప్రజలు ఎక్కువగా కోరుకునే మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. పండ్లు నీడనిచ్చే మొక్కలనే ఎక్కువగా నర్సరీల్లో పెంపు చేశారు. బాదం, వేప, కానుగ, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, అటవీ శాఖ ఆధ్వర్యంలో నేరేడు, మర్రి, మద్ది, నానేప, వెదురు, సండ్ర తదితర మొక్కలను నర్సరీల్లో పెంచారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలను గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో పెంచుతుండగా పూల మొక్కలు ఎక్కువగా సింగరేణి నర్సరీలో పెంచారు.మండలం గ్రామాలు లక్ష్యం భూపాలపల్లి 26 1,67,358 కాటారం 24 1,61,328 మొగుళ్లపల్లి 26 1,60,368 చిట్యాల 26 1,55,598 రేగొండ 23 1,50,850 టేకుమట్ల 25 1,38,207 గణపురం 17 1,36,167 మహాముత్తారం 24 1,35,132 మహదేవపూర్ 18 1,27,254 మల్హర్ 15 1,06,287 కొత్తపల్లిగోరి 16 94,542 పలిమెల 08 41,502 15.74 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు మొక్కల పెంపకానికి కసరత్తు షురూ వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కార్యక్రమాన్ని జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వానలు పూర్తిస్థాయిలో కురిస్తే వారం, పది రోజుల్లో మొక్కలు నాటించే కార్యక్రమం ప్రారంభిస్తాం.హరితమహోత్సవంలో గ్రామాల ప్రజలు, యువకులు భాగస్వాములై విజయవంతం చేయాలి. – బాలకృష్ణ, డీఆర్డీఓ -
నేడు 2కే రన్
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ప్రత్యేక సవరణ కార్యక్రమం 2026లో భాగంగా ఓటరు అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాల కింద 2కే రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు(బుధవారం) ఉదయం 7.30 గంటలకు ఇల్లందు క్లబ్ హౌస్, మంజూర్ నగర్ నుంచి ఐడీఓసీ కార్యాలయం వరకు 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లలో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడం, ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రన్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల జిల్లా అధికారులకు బాధ్యతలు కేటాయించామన్నారు. జిల్లాలోని యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. పాఠశాలల బంద్ విజయవంతం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యా హక్కు చట్టం అమలు, ప్రైవేట్–కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణ వంటి డిమాండ్ల సాధన కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్కుమార్ తెలిపారు. ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేని పాఠశాలను సీజ్ చేయాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న బిట్స్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకుని సీజ్ చేయాలని, పాఠశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాత గుడ్ మార్నింగ్ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న బిట్స్ పాఠశాలకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు లేవని ఆరో పించారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తోందని విమర్శించారు. అనుమతులు లేకుండా విద్యాసంస్థలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, డబ్బేట శరత్, రాజుల శివ, ఉల్లెరవు రావు బన్నీ, పవన్, రాజేష్, నవీన్ పాల్గొన్నారు. గోడకూలి మహిళకు గాయాలు టేకుమట్ల: గోడకూలి మహిళకు గాయాలైన ఘటన మండలంలోని కుందనపల్లిలో చోటుచేసుకుంది. కుందనపల్లిలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మాడుగుల రమ్యకు చెందిన ఇంటి గోడ కూలి ఆమైపె పడింది. ఈ ప్రమాదంలో రమ్య రెండు కాళ్లతో పాటు పాదానికి తీవ్ర గాయమైంది. ఆమె కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
సర్టిఫికెట్కో లెక్క!
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి ఉత్తీర్ణులై పై చదువుల కోసం కాలేజీలో చేరాలనుకుంటున్న విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతూ సర్టిఫికెట్ల జారీకి అడ్డగోలు వసూళ్లకు తెరతీశాయి. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం టీసీ ఉచితంగా లేదా నామమాత్రపు రుసుంతో ఇవ్వాల్సి ఉండగా.. వేల రూపాయలు వసూలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో క్లియరెన్స్ పేరిట టీసీలు ఇవ్వకుండా ఇక్కట్లకు గురి చేస్తున్నారు. టీసీ, బోనఫైడ్కు వచ్చే విద్యార్థులను బకాయిలు చెల్లించాలని మెలిక పెట్టడం, రూ. వేల వసూలు చేయడం పరిపాటిగా మారింది. టీసీ జారీ చేయడంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వారంలోపు టీసీ ఇవ్వాలి. విద్యార్థి, తల్లిదండ్రులు ఇచ్చిన దరఖాస్తును స్కూల్ రిజిస్టర్లో నమోదు చేయాలి. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం, చదివిన తరగతి, స్కూల్ పేరు, వెళ్లే తే దీ, కారణం మొదలైనవి స్పష్టంగా పేర్కొనాలి. టీసీ పోయినట్లయితే డూప్లికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు నామమాత్రంగా ఫీజు వసూలు చేసే వెసులుబాటు ఉంది. ఏదో కారణం చూపి టీసీ జారీలో జాప్యం చేయొద్దు. టీసీతోపాటు స్టడీ సర్టిఫికెట్, మెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు వసూలు చేస్తే రశీదు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగానే ఇవ్వాల్సి ఉండగా.. కొన్నిచోట్ల నామమాత్రంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. చాలాచోట్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన నిర్వహణ ఫీజుల వివరాలను ప్రకటించింది. డిస్ట్రిక్ కో–ఆర్డినేటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పాఠశాలల్లో అమలు చేసే మార్గదర్శకాలను వెల్లడించింది. రికార్డు షీట్ బుక్స్, టీసీ బుక్స్ నిర్వహణ ఖర్చులకు పాఠశాలలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు రూ.400, ప్రైవేట్స్కూళ్లు రూ.1000 చెల్లిస్తే టీసీ బుక్స్ డీసీఈబీ పంపిణీ చేస్తోంది. ఒక్కో పుస్తకంలో 100 పేజీలుంటాయి. ఈ లెక్కన ఒక్కో పేజీకి రూ.10 మాత్రమే టీసీకి చెల్లిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా, ప్రైవేట్ పాఠశాలలు నామమాత్రపు ప్రాసిసెంగ్ ఫీజు రూ.10నుంచి రూ.50 వసూలు చేస్తే అభ్యంతరాలు ఉండవు. కానీ వందల రూపాయలు వసూలు చేయడంపై తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.ఇటీవల ప్రేమ్కుమార్ పదో తరగతి పూర్తి చేశాడు. పై చదువుల నిమిత్తం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) కోసం తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్లాడు. యాజమాన్యం టీసీ ఇవ్వడానికి రూ.2000, బోనఫైడ్ సర్టిఫికెట్కు రూ.1100 డిమాండ్ చేసింది. ఉచితంగా ఇవ్వాల్సిన పత్రాలకు రుసుం వసూలు చేస్తుండడంతో విద్యార్థి తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి. విద్యాశాఖ నిబంధనలు బేఖాతరు టీసీకి రూ.2000, బోనఫైడ్ రూ.1000 వసూలు ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులుపాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రభుత్వ 412 23వేలు ప్రైవేట్ 75 21వేలు -
రాజకీయ హోరుగల్లు..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా గ్రేటర్ వరంగల్కు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరింత బలపడేందుకు ఆ మూడు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్: అధికార బలాన్ని కేడర్ బలంగా మార్చే ప్రయత్నం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్లో తన పట్టు మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను కేడర్కు అప్పగిస్తున్నారు. ఇటీవల జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, కేడర్ సదస్సులు నిర్వహించిన జోష్ నింపారు. భవిష్యత్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులతో భారీ బహిరంగ సభలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్: కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించే యత్నం ఒకప్పుడు గ్రేటర్, ఉమ్మడి వరంగల్లో బలమైన ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ప్రస్తుతం తిరిగి కేడర్ను సమీకరించే పనిలో నిమగ్నమైంది. గ్రామ, వార్డు, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి టి.హరీష్రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి పనుల ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా లాభపడాలని పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదు, కేడర్ సమావేశాలు, సోషల్ మీడియా బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కేడర్ను ఉత్తేజపరిచారు. బీజేపీ: ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే లక్ష్యం... ఉమ్మడి వరంగల్లో తన ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈసారి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, శిక్షణ తరగతులు, యువతపై ప్రత్యేక దృష్టితో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు సహా జాతీయ నాయకుల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 29న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు ఇటీవల ప్రకటించారు. మోదీ ప్రభుత్వ అభివద్ధి, కేంద్ర నిధులు, జాతీయత అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుస కార్యక్రమాలతో ఎన్నికల వేడి... సభ్యత్వ నమోదు, బూత్, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు, కేడర్ శిక్షణ శిబిరాలు, సోషల్ మీడియా విభాగాల బలోపేతం, యువత, మహిళా విభాగాల విస్తరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వరుస కార్యక్రమాలు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాజకీయ పరిణామాలు ఉత్తర తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి పార్టీ గ్రేటర్ ఎన్నికలను కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తోంది. కేడర్తో సమావేశాలు.. సభ్యత్వ నమోదు.. శిక్షణ తరగతులు బలపడేందుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు ‘గ్రేటర్’లో గెలుపే లక్ష్యంగా కసరత్తు హైదరాబాద్ తర్వాత కీలకంగా మారిన వరంగల్ -
బాలాలయంలోనే కాలసర్ప, శని పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటుచేసిన బాలాలయంలో మంగళవారం కాలసర్ప, శనిపూజలను భక్తులు ని ర్వహించారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన బాలాలయంలో కాలసర్ప నివారణ, శని పూజలను సామూహికంగా నిర్వహించారు. అనంతరం అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో సందడి నెలకొంది. ఇటీవల కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణ, తొలగింపు ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో పూజలను దేవస్థానం సమీపంలోని అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తున్నారు. దుకాణాలు డేరాల్లోనే.. కాళేశ్వరం దేవస్థానంలో వివిధ దుకాణాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ప్రస్తుతం దేవస్థానం పనులు జరుగుతున్న కారణంగా ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేశారు. వారికి దేవాదాయఽశాఖ సరైన ఏర్పాట్లు చేపట్టలేదు. వర్షంలో కవర్లు కప్పుకొని డేరాల్లో తమ దుకాణాలు నిర్వహిస్తున్నారు. దుకాణాల నిర్వహణకు ప్లాట్ఫాం నిర్మించగా అటవీశాఖ అధికారులు అడ్డుకొని పనులు నిలిపివేఽశారు. రిజర్వ్ఫారెస్టులో ఉందని నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరించారు. దీంతో నిర్వాహకులను దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇటీవల తమ సమస్యను మంత్రి శ్రీధర్బాబుకు చెప్పుకుందామని వెళ్లారు. మంత్రి వద్దకు వెళ్లి వచ్చారని అధికారి వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పలు పత్రికల్లో వార్తలు వస్తే శ్రీమీరే రాయిస్తున్నారనిశ్రీ వారిని అధికారి నిలదీస్తున్నట్లు సమాచారం. పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. -
మృత్యువుకు హైవే..
భూపాలపల్లి: జిల్లా పరిధిలో హైవేపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను వణికేలా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట పచ్చని సంపారాల్లో ఈ ప్రమాదాలు చీకట్లు నింపుతున్నాయి. బొగ్గు, ఇసుక లారీలు అధిక లోడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారానికి రెండు, మూడు ఆక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు, రవాణాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా విధి నిర్వహణలో ఉన్న రవాణాశాఖ జిల్లా అధికారే హైవేపై లారీ ఢీకొని దుర్మరణం పాలవ్వడం ఇక్కడి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటన జిల్లా ప్రజలను కలచివేసింది. ఎన్హెచ్పై నిత్యం ప్రమాదాలే.. జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామ సరిహద్దు నుంచి కాటారం మండలం నస్తూర్పల్లి వరకు ఎన్హెచ్ 353సీ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి అక్కడక్కడ మాత్రమే మరమ్మతుకు నోచుకుంది. అయినప్పటికీ ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలపై పలువురు పోలీసు అధికారులు పరిశీలన చేయగా, అందులో నూటికి 90 శాతం ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే చోటుచేసుకున్నట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం ఇలాగే నిత్యం ప్రమాదాలు జరగడంతో అప్పటి ఎస్పీ ఆర్.భాస్కరన్ జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించారు. ఎన్హెచ్పై స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదనే నిబంధనలు ఉండటంతో కొద్ది రోజులకే వాటిని తొలగించారు. దీంతో బైక్, కార్లు, లారీలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. ఇందుకు తోడు రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనం నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బొగ్గు, ఇసుక లారీలతోనే ఎక్కువగా.. జిల్లాలో బొగ్గు, ఇసుక రవాణా చేసే లారీలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లిలో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సుమారు 800 టిప్పర్లు, లారీలు వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుంటాయి. అంతేకాక కాళేశ్వరం గోదావరి నది నుంచి ప్రతీరోజు వందలాది ఇసుక లారీలు జిల్లా మీదుగా హనుమకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఆయా లారీల మూలంగానే ఎక్కువగా, భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక లోడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేసినా.. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా ఎన్హెచ్ అధికారులు గుర్తించారు. ఇందులో అక్కడక్కడ బ్లాక్ స్పాట్ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెద్దగా కనిపించేలా ఏమీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే వాహనదారులు జంకాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదాలుమరణాలుతీవ్ర గాయాలైనవారు3721919622310316812413090807495202420252026 జిల్లాలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు లారీల వేగానికి బ్రేకులు వేసేదెన్నడో? డ్రంకెన్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణం డీటీఓ మృతితో ఉలిక్కిపడ్డ ప్రజలు బ్లాక్ స్పాట్స్ ఇవే.. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గణపురం మండలం గాంధీనగర్, మోరంచపల్లి భూపాలపల్లి పట్టణం అంబేడ్కర్ చౌరస్తా, కమలాపూర్ క్రాస్రోడ్ కాటారం మండలం మేడిపల్లి, నస్తూర్పల్లి మహదేవపూర్ మండలం కుదురుపల్లి డీటీఓ మృతితో జిల్లాలో విషాదం.. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో లారీ ఢీకొట్టగా జిల్లా రవాణాశాఖాధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో.. మల్హర్ (కాటారం): లారీడ్రైవర్ నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో వెనుక ఉన్న క్లీనర్ లారీ కింద పడి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాటారం ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్కు చెందిన సతీష్ కుమార్ (35) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. జూన్ 21 ఆదివారం రాత్రి మండలంలోని నస్తూర్పల్లి వద్ద డాంబర్ ప్లాంట్లో అన్లోడ్ చేసేందుకు వెళ్లారు. డ్రైవర్ లారీని రివర్స్ చేస్తూ వెనుక చూడమని చెప్పడంతో సతీష్ కుమార్ వెనుక నిలబడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా రివర్స్ చేయడంతో లారీ ఢీకొని సతీష్ కిందపడ్డాడు. దీంతో వెనుక టైర్లు రెండు కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో కాళ్లు పూర్తిగా నలిగి తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు 100కు సమాచారం ఇవ్వడంతో సతీష్ను భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య స్వప్న ఫిర్యాధు మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కంకణాల రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. విషాదఛాయలు కొత్తపల్లిగోరిలో ఇద్దరు మృతి(మే 30 వరకు) -
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి అర్బన్: వర్షాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. వర్షాలు, వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, వైద్య, విద్యుత్, పంచాయతీ రాజ్, మున్సిపల్, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు అవసరమైన ఔషధాలు, అత్యవసర వైద్యసేవలను సిద్ధంగా ఉంచాలని, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల నివారణ, దోమల వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చెరువుల పరిరక్షణ, బలహీన ప్రాంతాల పరిశీలన, రక్షణ చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వర్షాలు, వరదల సమయంలో పశువులను ఎత్తైన ప్రాంతాల్లో ఉంచాలని, రైతులు పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాన్ని సంప్రదిస్తూ ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంతకుమారి, కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నషాముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మద్యపానం, ఇతర వ్యసనాలతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. వ్యసనాల నిర్మూలన కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని వ్యసన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, జిల్లా సమాచార అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి ఇందిరా, సుకీర్తి పాల్గొన్నారు. -
ఓట్ల చోరీ కోసమే ‘సర్’
హనుమకొండ హంటర్రోడ్లోని డికన్వెన్షన్హాల్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. – హన్మకొండ చౌరస్తా● అప్రజాస్వామ్యంగా అధికారంలో రావాలని బీజేపీ చూస్తోంది ● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ● బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు ● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలోని పోలీసు అధికారులు పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. -
అత్యాధునిక సాంకేతికతతో బొగ్గు రవాణా పర్యవేక్షణ
● బొగ్గు కుంభకోణంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు ● సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ దశను అత్యంత పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నామని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) వెంకన్న జాదవ్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించిన ఆయన ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి ఓసీ–2 ఉపరితల గనిలోని లోడింగ్ బంకర్ను పరిశీలించి అక్కడి కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో సింగరేణి బొగ్గు చోరీకి గురవుతోందని, బొగ్గు అదృశ్యమవుతోందని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ టన్ను బొగ్గుకు సంబంధించిన సమాచారం సాప్ కోల్నెట్ వంటి ఆన్లైన్ వ్యవస్థల్లో నమోదు అవుతుందన్నారు. సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, 15 శాతం రోడ్డు, ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓసీ–2 ప్రాజెక్టు అధికారి శ్యామ్సుందర్, డీజీఎం (క్వాలిటీ) కృష్ణప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోషమల్లు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా..
మడికొండలోని ఓ కన్వెన్షన్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. – హన్మకొండ● కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం ● ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలి పలిమెల: జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలం కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు పెరిగితే దోమల బెడద తీవ్రంగా పెరిగి, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను దోమల కాటు నుంచి రక్షించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు ఐతే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు దారకొండ సూర్య శంకర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఓవర్లోడ్ లారీలను నియంత్రించాలి భూపాలపల్లి రూరల్: మహదేవపూర్ మండలం పల్గుల గ్రామంలో అనుమతిలేని ఇసుక లారీలు ఓవర్ లోడ్తో వెళ్తున్నాయని.. వాటిని నియంత్రించి చర్యలు తీసుకోవాలని పలుగుల వార్డు సభ్యులు రాగం వెంకటమ్మ, కొట్టె రాజయ్య, జిల్ల్లా సంతోష్, నిట్టురి రమేష్, నిట్టురి రమాదేవి సోమవారం డీపీఓ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇళ్ల మధ్యనుంచి వెళ్తున్నాయని దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో మోసాలు భూపాలపల్లి అర్బన్: ఇటీవల కొంతమంది మోసగాళ్లు తమను ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులుగా పరిచయం చేసుకుంటూ దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆహార తనిఖి అధికారి వరుణ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లేదా వారి సిబ్బంది ఎవరూ వ్యాపార సంస్థల యజమానులకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ చేయరని స్పష్టం చేశారు. ఎవరైనా తమను ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులమని చెప్పి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు లేదా ఇతర వివరాలు కోరితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రూ.50 వేల ఆర్థిక సాయం మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ రేణిగుంట్ల చందర్ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మండలంలోని ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది చందర్ కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. అనంతరం చందర్ కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగళి విజయపాల్రెడ్డి, ఉపాధ్యాయులు వెంకన్న, కుమారస్వామి, ప్రవీణ్, అనిల్, రాజు, శ్రీకళ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చంద్రమౌళి పాల్గొన్నారు. -
డ్రోన్ టెక్నాలజీతో కొత్త అవకాశాలు
● జీఎం రాజేశ్వర్ రెడ్డి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం నిర్వహించిన డ్రోన్ టెక్నీషియన్ కోర్సు శిక్షణ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు, గనులు, వ్యవసాయం, భద్రత, సర్వేలు, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరుగుతోందన్నారు. భవిష్యత్లో డ్రోన్ టెక్నీషియన్లకు మంచి డిమాండ్ ఉండబోతుందని, శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను విస్తరించడమే సింగరేణి సంస్థ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (క్వాలిటీ) కృష్ణ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్సుందర్, విటిసి మేనేజర్ నజీర్, అసిస్టెంట్ మేనేజర్ మహేశ్, ట్రైనర్ సందీప్ పాల్గొన్నారు. ప్రమాదానికి సింగరేణికి సంబంధం లేదు రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి (డీటీఓ) మృతి చెందిన ఘటన పట్ల సింగరేణి యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన వాహనానికి సింగరేణి కార్యకలాపాలు, బొగ్గు రవాణా వ్యవస్థతో సంబంధం లేదన్నారు. సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలు, పాటిస్తుందన్నారు. -
వాహనాలు తనిఖీ చేస్తుండగా...
భూపాలపల్లి/సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొగ్గులారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ) దుర్మరణం చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డీటీఓ మద్దోజు వెంకన్న(45) సోమవారం ఉదయం గణపురం మండలంలోని మోరంచపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాక్స్ చెల్లించని ఒక హార్వెస్టర్ను పట్టుకొని చెల్పూరు సమీపంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు.తాను సైతం కారులో కార్యాలయం వద్దకు చేరుకుని రహదారిపై నిలబడి మళ్లీ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టుకున్న హార్వెస్టర్ డివైడర్ వైపు నుంచి కార్యాలయం లోపలికి వెళ్తుండగా భూపాలపల్లి నుంచి ఉప్పల్ వెళ్తున్న బొగ్గు లారీ హార్వెస్టర్ ముందు భాగాన్ని ఢీకొట్టి ఎడమవైపున ఉన్న డీటీఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. దీంతో అతను లారీ టైర్ల కింద పడి నడుము భాగం నుజ్జునుజ్జయింది. రవాణాశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని డీటీఓ వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. కాగా, వెంకన్న ఈ నెల 5వ తేదీనే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సరిగ్గా 17 రోజులకే ఈ సంఘటన జరగడంతో జిల్లా రవాణాశాఖలో విషాదం అలుముకుంది.లారీడ్రైవర్ మహ్మద్ తస్లీమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వెంకన్న స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామం. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వరంగల్లో స్పష్టం చేశారు.కాగా, ఆయన పారి్థవదేహాన్ని హనుమకొండలో ఆశోక కాలనీలోని నివాసానికి తీసుకువచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదలు వెంకన్న పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వెంకన్న మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం యాదృచి్ఛకంగా జరిగిన రోడ్డు ప్రమాదమా? లేక కుట్రకోణం దాగి ఉందా? అన్నది విచారణలో తేలనుంది. రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్గా పనిచేస్తున్న ఎం.చంద్రశేఖర్ గౌడ్ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తేల్చటంతోపాటు, సాధారణ ప్రమాదమే అయి ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఫారసులు కూడా ఆయన ఇవ్వనున్నారు.వీలైనంత త్వరలో నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిభూపాలపల్లి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు లారీ ఢీకొని చనిపోవటం పట్ల సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా డీటీఓ వెంకన్న మృతిపై రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న సమయంలో లారీ ఢీకొని మృతి చెందాల్సిన పరిస్థితి రావటం దారుణమని, ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి సురేశ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. -
వాహన తనిఖీల్లో టిప్పర్ బీభత్సం.. ఆర్టీవో అధికారి మృతి
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఆర్టీవో కార్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తున్న ఆర్టీవో అధికారి పైకి బొగ్గు టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం, టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పురు శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం అధికారులు స్కూల్ బస్సులు, వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్ను ఆపే ప్రయత్నం చేయగా.. ఆర్టీవో అధికారి వెంకన్నపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం, టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఊహించని ప్రమాదం కారణంగా వెంకన్న చనిపోవడంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, కొద్దిరోజుల క్రితమే బదిలీల్లో భాగంగా వెంకన్న గణపురం వచ్చినట్టు సమాచారం. -
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ‘ప్రసాదాల విక్రయంలో నిర్లక్ష్యం’ మంగపేట : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదాలను విక్రయించడంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెసా మొబిలైజర్ తాటి విజయ్బాబు ఆదివారం ఒక్క ప్రకటనలో ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయంలో విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు లభించకపోవడంతో భక్తుల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయ సిబ్బందితో పాటు మల్టీపర్పస్ సిబ్బందితో కలిసి 15 మంది ఉన్నా నెలనెలా వేతనాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారనే తప్ప ప్రసాదాల తయారీ, విక్రయాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో పూజ సామగ్రితో పాటు హోటళ్లు, బొమ్మల షాపులకు వేలంపాట నిర్వహించిన అధికారులు గతంలో మాదిరిగా లడ్డు, పులిహోర విక్రయాలకు వేలం పాట పెడితే ఆలయానికి ఎంతో ఆదాయం వచ్చేదని వెల్లడించారు. అధికారులు ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాటానికి మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ మల్హర్(కాటారం): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. కాటారం పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైందని, ఉద్యమకారులకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కరుణాకర్ రావు, అంజయ్య, కుమార్ యాదవ్, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, శ్రీనివాస్, రాజయ్య, రవీందర్, మాధవి, రచన, సృజన, కృష్ణవేణి, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. వ్యవసాయ పనుల్లో రైతన్న నిమగ్నం మహాముత్తారం: రెండు రోజుల క్రితం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని బోర్లగూడెం, మీనాజీపేట, కనుకునూర్, సింగారం, గండికామారం గ్రామాల్లోని రైతులు బోరుబావుల కింద నారుమడులు తయారు చేసి వరినారు కోసం మొలక అలుకుతున్నారు. అదే విధంగా మరి కొన్ని గ్రామాల్లో రైతులు మొదటి దఫా వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టడానికి చెల్లల్లో దుక్కులు దున్ని సాగుబాటు చేసుకున్నారు. రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆయా గ్రామాల్లోని రైతులు తమతమ పత్తి చేన్లలో కూలీలతో పత్తి విత్తనాలు వేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోనే కాకుండా ఈ సీజన్లో ఇంతవరకు భారీ వర్షం కురవడకపోవడంతో అన్నదాతలు సాగు పనులు ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● సీఐ కరుణాకర్ రావు రేగొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కరుణాకర్ రావు సూచించారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సెకండ్ ఎస్సై హేమ, సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, ఉప సర్పంచ్ ఆకుతోట తిరుపతి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని ప్రాకార దేవతామూర్తుల విగ్రహాల ను తమిళ శిల్పులు తొలగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన 50కిపైగా విగ్రహా లను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 23న హైదరాబాద్లో టెండర్లు పూర్తి కానున్నట్లు సమాచారం. అనంతరం ఆలయాల కూల్చివేతలు ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే రాతితో కట్టడాల నమూనా చిత్రాలను కమిషనర్ హనుమంతరావు విడుదల చేసిన విషయం తెలిసిందే. -
అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని.. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో యోగా ఫర్ హెల్ది ఏజింగ్ అనే ఇతివృత్తంతో జిల్లా స్థాయి యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఏఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగా ఆసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవడుతుందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, ఆరోగ్య, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి తోడ్పడుతుందని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న, పెద్దల వరకు ప్రతీ ఒక్కరు సాధన చేయాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండటమే మహాభాగ్యమని మనిషికి బలమైన పునాది ఆరోగ్యమని అని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేష్ కుమార్ మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. వయోభేదం లేకుండా అన్ని వయస్సుల వారు యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం యోగా గురువు కుమార్ యోగా ఆసనాలు, ప్రాణాయామాలను చేయిస్తూ, ప్రతీ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రాఘవేంద్రరావు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: కార్యక్రమంలో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు, యోగా గురువు కుమార్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ జగదీష్ ఖన్నా, డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ సదానందం, డాక్టర్ అజయ్, ఆయుష్ వైద్యులు, యోగా గురువులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సాగుపై నీలినీడలు
● తీవ్ర ప్రభావం చూపనున్న ‘ఎల్నినో’ ● ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమంటున్న వ్యవసాయశాఖ ● వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలుభూపాలపల్లి: వానాకాలం సాగు సీజన్పై ‘ఎల్నినో’ ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని, పంటల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూపులు.. జిల్లాలోని 12 మండలాల్లో ఈ వానాకాలం సీజన్లో పత్తి, వరి, పెసరు తదితర పంటలు 2,16,734 ఎకరాలు, మొక్కజొన్న 280 ఎకరాలు, మిర్చి సుమారు 25వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. రైతులు సైతం ఈ మేరకే పంటల సాగు చేపట్టాలని భావించి ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని సుమారు 50వేల ఎకరాల్లో వారం రోజుల క్రితమే ఇప్పటికే రైతులు పత్తి గింజలు నాటారు. మబ్బులు ఉరుమడం, వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంలో మినహా ఎక్కడ వర్షాపాతం నమోదు కాలేదు. ఉష్ణోగ్రత కారణంగా పత్తి గింజలు మొలకెత్తకపోగా మాడిపోయాయి. వరి, మిర్చి సాగు చేసే రైతులైతే ప్రస్తుత పరిస్థితులను చేసి ఆందోళన చెందుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో తెలంగాణలో ఎల్నినో ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ఈ ప్రభావం ఈ నెలలోనే కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినోతో ఎలాంటి నష్టం.. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ వ్యవస్థలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. దీని ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురియక, సుదీర్ఘ పొడి వాతావరణం (వర్షాభావ పరిస్థితులు) ఏర్పడుతుంది. జూన్ నెలలో సాధారణ వర్షాలు కురిసినప్పటికీ.. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా భూగర్భ జలాలు రీఛార్జ్ కావు. తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఒకే రకమైన పంటలపై ఆధారపడితే దిగుబడులు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. సన్నరకాలే మేలు.. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరిసాగులో సన్నరకాలే మేలని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. వానాకాలం సాగుకు అనువైన, తెగుళ్లను తట్టుకునే సన్న వరి రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ సోనా, కునారం వరి 2, రాజేంద్రనగర్ వరి 4 లాంటి రకాలు వాలిపోకుండా, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉంటాయని, ఈ రకాలు వానాకాలంతో పాటు యాసంగికి కూడా అనుకూలమని వెల్లడించారు. స్వల్పకాలిక వంగడాలు వేయాలి ఫసిఫిక్ మహా సముద్రంలో వేడి గాలుల వల్ల ఏర్పడేదే ఎల్నినో. దీని వలన దేశంలోని కొన్ని రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులకు గురి కానున్నాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీని ఎఫెక్ట్ జిల్లాలో ఈ నెలలో కూడా ఏర్పడింది. ఈ వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు స్వల్పకాలిక వరి వంగడాలను సాగు చేయాలి. పప్పు దినుసుల పంటలు, అపరాలు వేసుకుంటే రైతులకు ఇబ్బందులు తలెత్తవు. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి మిర్చి 25,000పెసరు 110పత్తి 1,06,560మొక్కజొన్న 280ప్రత్యామ్నాయ పంటలే శ్రీరామరక్ష.. సంప్రదాయ పంటల కంటే తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను ఎంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి ఏకై క పరిష్కారమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని అంటున్నారు. అంతేకాక ఒకే పంటపై ఆధారపడకుండా విధిగా పంట మార్పిడి (క్రాప్ రొటేషన్) చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై 15 లోపు తగినంత వర్షపాతం నమోదు కాని పక్షంలో 125 రోజుల కంటే తక్కువ కాలపరిమితి గల స్వల్పకాలిక వరి రకాలను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు అనుగుణంగా ఖాతాల్లోకే డబ్బులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులు గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుదశ చెల్లింపు (రూపాయల్లో) పునాది పూర్తి 1,00,000 లెంటెల్ స్థాయి 1,50,000 స్లాబ్ పూర్తి 1,50,000 ఇల్లు పూర్తి 1,00,000 మొత్తం 5,00,000జిల్లా నియోజకవర్గాలు మంజూరు పూర్తి హనుమకొండ 2 8,000 2,400 వరంగల్ 3 9,000 1,760 జనగామ 2 5,600 1,860 మహబూబాబాద్ 2 10,148 2,750 ములుగు 1 5,100 1,165 జేఎస్ భూపాలపల్లి 1 4,152 565 11 42,000 10,500 -
రామప్ప అద్భుతం
లక్నవరంలో సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): రామప్ప దేవా లయం అద్భుత కట్టడమని సెంట్ర ల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ రాకేష్ గోయల్ కొనియాడారు. మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమా శంకర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించారు. గోవిందరావుపేట: లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సె ల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ స భ్యులు, యువత ఉత్సాహంగా గడిపా రు. సరస్సులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు -
ఓటరు జాబితాలో పేర్లను సరి చూసుకోవాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లాలోని అర్హులైన పౌరులందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం మన జిల్లాలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరుగుతుందని, బూతు స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ఓటర్ల వివరాలు పూరించిన తర్వాత ప్రతిని బూతు స్థాయి అధికారికి అందించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తదితర కార్యక్రమాల అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అబ్బాస్, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమగ్ర నివేదికలు తయారు చేయాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య శాఖలతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డు సభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కార స్థితి, పెండింగ్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. వచ్చే వారంలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణకు జిల్లాకు రానున్న నేపథ్యంలో, అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
నాన్నే నాకు స్ఫూర్తి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేవరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫా దర్స్డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే.. ప్రజలతో మమేకమై.. మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా యూనిఫామ్ సర్వీస్లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్ఎన్పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా. సమయం కేటాయించేవారు.. నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదంసాక్షితో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
శాంతియుత జీవితం గడపాలి
● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుత జీవితాన్ని గడపాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. కోర్టుల్లో సంవత్సరాల తరబడి కొనసాగే కేసులను రాజీమార్గం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకొని కేసుల నుంచి బయటపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏపీపీ ప్రదీప్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.అక్షయ, సీఐలు, ఎస్ఐలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. జడ్జి అఖిల పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి వివిధ యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ శివకుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, న్యాయవాదులు ప్రియాంక, రత్నం కిరణ్, మొయినుద్దీన్, అశోక్రెడ్డిలు పాల్గొన్నారు. -
మెడికల్ బోర్డు నిర్వహించాలి
● తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పించాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించి కేటీకే–5వ గనిలో ఆవరణలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నా.. ఈలోగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు ఏ రోజు నిర్వహిస్తామని ప్రకటించాలని లేకుంటే జూలై 20 నుంచే గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఒక సారి కూడా మెడికల్ బోర్డు నిర్వహించలేదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళుర్పించారు. బస్టాండ్ సమీపంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు సారయ్య, రియాజ్ అహ్మద్, చెన్నూరు మాబోడ జనార్దన్ పాల్గొన్నారు. -
స్కూల్లో కొనాల్సిందే!
భూపాలపల్లి అర్బన్: పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలను స్కూల్లోనే కొనుగోలు చేయాలని జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కండీషన్ పెడుతున్నాయి. లేదంటే యాజమాన్యం చెప్పిన దుకాణాల వద్దే కొనుగోలు చేయాలని నిబంధన పెడుతున్నారు. మార్కెట్లో తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక ధరలకు విక్రయించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఫీజులతో పాటు పుస్తకాల భారం.. జిల్లాలో 75 వరకు ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం స్కూళ్లు మాత్రమే నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పూర్తిగా వ్యాపార ధోరణి అవలంభిస్తున్నాయి. విద్యార్థుల ఫీజులు మొదలుకొని, పుస్తకాలు, యూనిఫాం, రవాణా, టర్మ్ ఫీజుల పేరిట అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ మాత్రం సౌకర్యాలు లేని పాఠశాలల్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజు కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా నోట్ బుక్స్, ఆయా పాఠశాలల వర్క్ బుక్స్ పేరిట రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవే పుస్తకాలు దుకాణాల్లో కొనుగోలు చేస్తే రూ.వెయ్యికి మించదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ బయట పుస్తకాలు కొనుగోలు చేస్తే వాటిని స్కూల్ యాజమాన్యాలు అనుమతించడం లేదు. చాలా స్కూళ్లల్లో పుస్తకాలు, యూనిఫాలంను వారే విక్రయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం పుస్తకాలు, యూనిఫాంలతో వేల రూపాయల వసూళ్లు తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారం భూపాలపల్లిలో ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదుల వెల్లువ జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాల ధరలు మండిపోతున్నాయి. నర్సరీకి రూ.3,049, ఎల్కేజీకి రూ.4,029, యూకేజీకి రూ.5,249, ఒకటవ తరగతికి రూ.6,164, రెండో తరగతికి రూ.6,574, మూడో తరగతికి రూ.6,029, నాలుగో తరగతికి రూ.6,631, ఐదో తరగతికి రూ.6,796లకు పాఠ్య పుస్తకాలు, డైరీ, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారు. ఎందుకు ఇంత ధరలు అని తల్ల్దిండ్రులు ప్రశ్నిస్తే ఇష్టమైతేనే కొనుక్కోండి లేదంటే ఒక్క రూపాయికు కూడా తగ్గేది లేదని బదులిస్తున్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలి
● యూరియాను నేరుగా రైతులకు అందించాలి ● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని, యాప్ ద్వారా కాకుండా రైతులకు నేరుగా యూరియా అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందించాలన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ద్వంద వైఖరిని మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ‘సర్’పై అవగాహన.. ‘సర్’(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోవు రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాత్మక అడుగులు, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. -
‘నీట్’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● రెండు కేంద్రాల్లో 388 మంది అభ్యర్థులు ● భద్రత, పర్యవేక్షణపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిభూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం) నిర్వహించనున్న నీట్ పరీక్షకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కంట్రోల్ రూం, పరీక్షహాళ్లు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ వ్యవస్థలు, బయోమెట్రిక్ పరికరాల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 388 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 168 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, జనరేటర్ బ్యాకప్ వంటి సదుపాయాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రతా పరంగా ప్రతీ కేంద్రం వద్ద తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్తో పాటు నలుగురు పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థినుల తనిఖీల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లలో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్, అంబులెన్స్, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నీట్ పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా యంత్రాంగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డెమో శ్రీదేవి ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కిరణ్, యోదా, మేధ, స్మార్ట్ కేర్, శ్రీ వెంకటేశ్వర, ప్రధాన్ ఆస్పత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అవసరమైన అనుమతులు, సర్టిఫికెట్లు, ధరల పట్టికలు తదితర అంశాలను పరిశీలించారు. అన్ని ఆస్పత్రుల్లోనూ దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయుష్ వైద్యులు, నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి అనడం హాస్యాస్పదం కాళేశ్వరం: కాళేశ్వరాలయం టెండర్లు పూర్తికాలేదని అప్పుడే అవినీతి అని పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ‘యాత్రను అడ్డుకోవడం సరికాదు’ భూపాలపల్లి అర్బన్: బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ఓపెన్ కాస్టు సందర్శనకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని అవినీతి ప్రభుత్వం నుంచి కాపాడాలని కోరారు. సింగరేణి కార్మికుల భద్రతను రక్షించేందుకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఎంపికకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. జిల్లాలోని నాలుగు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతికి 41 సీట్లు, 5వ తరగతికి 43 సీట్లు కలిపి మొత్తం 84 సీట్ల భర్తీ కోసం లక్కీ డ్రా చేపట్టారు. ఈ ప్రవేశాల కోసం 141 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అర్హత పొందిన 135 మంది విద్యార్థుల పేర్లతో డ్రా నిర్వహించారు. ఇందులో 84 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఈ సందర్భంగా అధికారులు పారదర్శకంగా లక్కీ డ్రా ప్రక్రియను నిర్వహించి, ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వర్ష బీభత్సం
● జిల్లాకేంద్రంలో 2 గంటల పాటు ఎడతెరపి లేని వాన ● ఈదురుగాలులతో కూలిన విద్యుత్ స్తంభాలుభూపాలపల్లి: వరుణ దేవుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయమంతా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలులతో సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, భారీ ఈదురుగాలులు రావడంతో పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ప్రాంతాల్లో రాత్రి వరకు మరమ్మతు పనులు చేపట్టారు. -
వాగు దాటేదెలా?
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 202 ● వానొస్తే ప్రజలకు తిప్పలే.. ● మహాముత్తారంలో పరిస్థితి మరీ అధ్వానంభూపాలపల్లి అర్బన్: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వెరసి జిల్లాలో వంతెనల నిర్మాణాలు సంవత్సరాలుగా సా..గుతూనే ఉన్నాయి. నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజల రవాణా కష్టాలు ఈ వానాకాలంలోనూ మళ్లీ మొదటికొచ్చేలా ఉన్నాయి. వానాకాలం సీజన్ కావడం శుక్రవారం జిల్లాకేంద్రంలో భారీ వర్షం కురవడంతో మళ్లీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాగులు దాటాల్సిందేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే జిల్లా ప్రజల్లో వణుకు మొదలవుతోంది. భారీ వర్షాలు కురిస్తే మహాముత్తారం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. నిలిచిపోయిన వంతెన నిర్మాణాలు పూర్తయితే భూపాలపల్లి, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మహాముత్తారం మండలాల్లో ప్రజలకు రవాణా కష్టాలు తప్పే అవకాశం ఉంది. లేదంటే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, గర్భిణులు, ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అసంపూర్తిగా వంతెనల నిర్మాణాలు ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం చిట్యాల: చిట్యాల–భూపాలపల్లి మండలాల మధ్య నైన్పాక శివారు మోరంచవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2022లో రూ.7కోట్ల నిధులతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనచ ఏశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. వర్షాలు కురిస్తే మోరంచ ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలుగనుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భూపాలపల్లి, మల్హర్, చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రజలకు సౌకర్యావంతంగా ఉంటుంది. -
కలెక్టర్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ యంత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. త్వరలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యంత్రం ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయని, ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంఆర్ఐ యంత్రం అందుబాటులోకి రావడంతో జిల్లాలోనే అధునాతన వైద్యసేవలు ప్రజలకు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
త్వరలోనే ఎంఆర్ఐ స్కాన్ సేవలు
భూపాలపల్లి: జయశంకర్, ములుగు జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య రక్షణకు మరో ముందడుగు పడింది. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నెల రోజుల్లోగా ఈ సేవలను రోగులకు అందించేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు సేవలు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందించిన సుమారు రూ.10 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని జిల్లా ఆస్పత్రిలో విజయవంతంగా బిగించారు. వేలాది రూపాయల ఖరీదైన ఈ స్కాన్ సేవలు ఇకపై స్థానిక పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందనున్నాయి. ఈ స్కాన్ యంత్రం సేవలు అందుబాటులోకి వస్తే కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులకే కాకుండా పొరుగునే ఉన్న ములుగు జిల్లా ప్రజలకు కూడా ఎంతో లబ్ధి చేకూరనుంది. అంతేకాక సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పరిధిలోని మారుమూల గ్రామాల రోగులు సైతం ఇకపై కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పొందనున్నారు. గతంలో రహదారి ప్రమాదాలు, ఏదైనా అనారోగ్యానికి గురైతే వరంగల్, హైదరబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎంఆర్ఐ స్కాన్ యంత్రం ఇక్కడ అందుబాటులోకి వస్తే దూరభారం తగ్గడమే కాక సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. టెక్నీషియన్లకు పూర్తి కావస్తున్న శిక్షణ.. మిషన్ నిర్వహణ కోసం కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డీఎంఎఫ్టీ నిధుల నుంచి ఇద్దరు నిపుణులైన టెక్నీషియన్లను నియమించారు. ప్రస్తుతం వీరికి సంబంధిత కంపెనీ ఇంజనీర్ల ద్వారా యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్.. రానున్న 20 రోజుల్లోనే అన్ని పనులను పూర్తి చేసి ఈ యంత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. వారం రోజులకో మారు ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షలు నిర్వహించడంతో పాటు మిషన్ బిగింపు పనులను వేగిరం చేశారు. వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభం..? భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక ఎంఆర్ఐ యంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్ విధానంలో (ఆన్లైన్ ద్వారా) ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులను కూడా ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే భూపాలపల్లి వైద్య రంగంలో ఇదొక చరిత్రగా నిలువనుంది. నెల రోజుల్లోనే ప్రారంభానికి సిద్ధం.. రూ.10కోట్లతో అత్యాధునిక యంత్రం ఏర్పాటు భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రజలకూ వరం -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
● డీఈఓ రాజేందర్ మహాముత్తారం: ప్రభుత్వ బడుల్లోనే అన్ని సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహాముత్తారం మండలకేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన అందిస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాంబశివరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ల క్రితం పనులు ప్రారంభం
టేకుమట్ల: టేకుమట్ల–పెద్దపల్లి జిల్లా ఓడేడ్ ముత్తారం గ్రామాల మధ్య 2016 సంవత్సరంలో అంతర్ర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి రూ.48 కోట్ల నిధులతో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. 2021 వరకు పనులు సాగాయి. ఫిల్లర్లు వేసి గడర్లు పెట్టి మధ్యలోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. ఓడేడ్, గర్మిళ్లపల్లి గ్రామస్తులు మానేరు వాగులో తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మించి రవాణా సాగిస్తున్నారు. వర్షాలు ప్రారంభమైతే తాత్కాలిక మట్టి రోడ్డు ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. టేకుమట్ల నుంచి ఓడేడ్ మీదుగా పెద్దపల్లి, గోదావరిఖనికి ప్రయాణించేవారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మీదుగా ప్రయాణిస్తున్నారు. దానివల్ల సుమారు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం అదనంగా చేయాల్సి వస్తుంది. వర్షాకాలం అయిపోయిక గ్రామస్తులు మళ్లీ రోడ్డు ఏర్పాటుచేసుకుని ప్రతి సంవత్సరం రవాణా సాగిస్తున్నారు. ఈ వానాకాలంలోనూ ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు. -
గిరిజనగూడేల్లో సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంకేతిక యగంలోనూ ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్ ఆధారిత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అటవీ, గిరిజన గూడేలకు సోలార్ విద్యుత్ అందనుంది. రూ.17.03 కోట్లతో అమలు.. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్లో గిరిజన, గొత్తికోయ గూడాలున్నాయి. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో రూ.17.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఆర్టీ నంబర్ 5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. సిద్ధమైన డీపీఆర్లు.. త్వరలో టెండర్లు, పనులు.. ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడాల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీగూడెంలో సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ నిల్వ కోసం బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కూడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్ సరఫరా అందించనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీరెడ్కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా విద్యుత్ అందుబాటులోకి రావడంతో గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్య, ఆరోగ్యం, సమాచార సదుపాయాల వినియోగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. గొత్తికోయగూడేలకు మహర్దశ 85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం... రూ.17.03 కోట్లు విడుదల.. ‘టీజీ రెడ్కో’ సౌజన్యంతో ఏర్పాట్లు సర్వే, డీపీఆర్లు సిద్ధం చేసిన అధికారులు... టెండర్ల దశలో ‘సోలార్’పనులు దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
చిట్యాల: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరా లకు చేరుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చల్లగరిగ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులు, మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా విద్యార్థులు పాఠశాలకు రావాలని చెప్పారు. విద్యతో పాటు క్రీడలలో రాణించి అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. విద్యార్థులలో పఠనాశక్తి పెంపొందించేందుకు లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, తహసీల్దార్ వ సంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, ఎంఈఓ కొడెపాక రఘుపతి, సర్పంచ్ జంపయ్య పాల్గొన్నారు.విద్యార్థులతో మాట్లాడుతున్న రాహుల్ శర్మ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్ కలెక్టర్ రాహుల్ శర్మ -
పర్యావరణ పరిరక్షణలో అటవీశాఖ కీలకం
భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం హైదరాబాద్లోని గుర్రంగూడలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీఎఫ్ భవనాన్ని ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, సీసీఎఫ్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ జిల్లాలో సీసీఎఫ్ నూతన భవనం ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ వన మహోత్సవ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సీసీఎఫ్ భవన నిర్మాణం జిల్లా అటవీ సంపద రక్షణకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
సన్నాలకే ప్రాధాన్యం
1,09,854 ఎకరాల్లో సాగు అంచనాభూపాపపల్లి రూరల్: కొన్ని రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. సన్న వడ్లను సాగు చేయాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకం వడ్ల సాగుకు అనుకూలం. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రెండేళ్లనుంచి సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు సన్న ధాన్యం సాగుకు మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉద్యానపంటలు కలిపి 2.24 లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగవుతాయని, అందులో వరి సన్నాలను పూర్తిస్థాయిలో 1,09,854 ఎకరాల్లో సాగుచేసే విధంగా అధికారులు అంచనా రూపొందించారు. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అంతకుముందు గతంలో సన్నాలు 30వేల ఎకరాలకు మించి సాగుచేసిన దాఖలాలు లేవు. సన్నాల సాగుకు, దొడ్డు రకం సాగుకు పంటకాలం స్వల్ప తేడా ఉండటంతో రైతులు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. దొడ్డు రకం కంటే దిగుబడి తక్కువ వచ్చినా బోనస్ ఇస్తుండటంతో కలిసిరానుంది. అవగాహన కార్యక్రమాలు.. ఈ ఏడాది ప్రతీ రైతు సన్నాలనే పండించాలని కోరుతూ.. ఇటీవల నిర్వహించిన 99 రోజుల ప్రగతి–ప్రణాళికలో భాగంగా రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సన్నాలపై అవగాహన కల్పించారు. అధికారులు సూచిస్తున్న సన్నాల రకాలు.. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు, శాస్త్రవేత్తలు రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో 8 రకాల సన్నాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు ఖరీప్ సాగుకు అంచనా మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు తెలుపుతున్నారు. పెద్ద వానలు కురిసిన తర్వాత నార్లు పోసుకోవాలని సూచిస్తున్నారు.విత్తనాలు పంటకాలం (రోజులు)బీపీటీ, 5204 సాంబమసూరి 140–150 ఆర్ఎన్ఆర్ 15048 120–125 కేఎన్ఎం 1638 120–125 జై శ్రీరాం 130–135 హెచ్ఎంటీసోనా 135–145 వరంగల్ 962 125–130 వరంగల్ 44 140–145 జగిత్యాల 1798 120–125 -
ప్రమాదమని తెలిసినా..
మహాముత్తారం మండలం మారుమూల ప్రాంతమైన కనుకునూర్ గ్రామానికి భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం మాత్రమే నడుపుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితిలో కొంతమంది మండలకేంద్రానికి రావాలంటే 15కిలోమీటర్లు కాలినడకన పెగడపల్లికి వస్తున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో మండలకేంద్రానికి చేరుకుంటున్నారు. గురువారం కాటారం మండలకేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిన గ్రామస్తులు తిరుగు ప్రయాణంలో బస్సు లేకపోవడంతో ఓ ప్రైవేట్ వాహనంలో పైన వెనుక బాగంలో నిల్చొని ప్రయాణం చేశారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. – మహాముత్తారం -
రూ.వంద కోట్లు దోచుకునేందుకు కుట్ర
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న ఎమ్మెల్యే ఆలయ పునర్నిర్మాణం పేరుతో వంద కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. గురువారం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక అధికారిని పంపించి తూతూమంత్రంగా మీటింగ్ పెట్టి సుమారుగా రూ.198 కోట్ల టెండర్ పిలిచారని, అంటే దాదాపు వంద కోట్ల మింగడానికే పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని సీఎం చెబుతున్నారని.. రూ. 198కోట్ల ఎలా తీసుకువస్తాడో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలన్నారు. ఆలయాన్ని కూలగొట్టే ముందు విధి విధానాలను చెప్పాలన్నారు. అంతకంటే ముందు భూపాలపల్లి కలెక్టర్ ఖాతాలో వంద కోట్లు జమ చేస్తేనే నమ్ముతామన్నారు. లేదంటే కూల్చివేతలను అడ్డుకుంటామని తెలిపారు. ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ ఆలయాలపై ఆధారపడి జీవించే బ్రాహ్మణ పురోహితులు అడ్డుకోవడానికి ముందుకు వస్తారని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్పార్టీ నాయకులు ఉన్నారు. -
బోసిపోయిన కాళేశ్వరం
నిత్యం శివనామస్మరణ, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయం ప్రస్తుతం బోసిపోయింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కావడంతో భక్తుల సందడి తగ్గింది. నిన్నటి వరకు వేలాది మందితో కళకళలాడిన ఆలయ పరిసరాలు గురువారం నిర్మానుష్యంగా మారి నిశ్శబ్దాన్ని తలపించాయి. అడవిలోని ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి భక్తులకు దేవాదాయశాఖ దర్శనాలకు వీలు కల్పించింది. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాలనుంచి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – కాళేశ్వరం భక్తులు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారిన కాళేశ్వరాలయం జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయం ప్రస్తుతం జీర్ణోద్ధరణ, తొలగింపు కార్యక్రమాలతో దేవస్థానంలో పూజలు నిలిపివేశారు. భక్తుల దర్శనాల కోసం బాలాలయం ఏర్పాటుచేశారు. ఆదిముక్తీశ్వరాలయం బాలాలయానికి మార్చబడిందని బోర్డు ఏర్పాటు చేశారు. ఇది గమనించని భక్తులు బాలాలయం ఎక్కడ అంటూ స్థానికులను అడుగుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు దారి తెలియక తికమక పడుతున్నారు. రూట్మ్యాప్ లాంటి ప్లెక్సీబోర్డు, విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. బాలాలయంలో పూజలు, ప్రసాదాల కోసం బోర్డులు ఏర్పాటు కాలేదు. దుకాణదారులకు నీడ కరువు.. ప్రతీ ఏడాది సుమారు రూ.కోటి ఆదాయం వచ్చే దుకాణదారులకు నిలువ నీడ కరువైంది. బాలాలయం వద్ద ప్లాట్పారం ఏర్పాటు చేశారు. అక్కడే సామగ్రి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షానికి తడిసే అవకాశం ఉందని ఈఓను కలిస్తే.. మీరే రేకులు వేయించకోవాలని హితవు పలికినట్లు తెలిసింది. దీంతో దుకాణాల నిర్వహణకు నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. వారి పరిస్ధితిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. శని, కాలసర్ప పూజలు ఎక్కడ.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి నిత్యం మంగళవారం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకొని పూజలు చేయడంతో ఆలయానికి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పూజల నిర్వహణ ఎక్కడ చేస్తారని దేవాదాయశాఖ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో భక్తులు కలవరపడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటిస్తుండడంతో భక్తులకు పాలుపోవడం లేదు. బుధవారం బాలాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేశారు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు ఆయా బస్టాండ్ పాంతాలు, రద్దీ ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద భక్తులకు, ప్రజలకు తెలిసేలా ఆలయాన్ని మార్చబడిందని, పూజల వివరాలు సూచిక బోర్డులు పెట్టాలని భక్తజనం కోరుతున్నారు. బాలాలయం వద్ద దర్శనాలు సూచిక బోర్డులు లేక ఇబ్బందులు అయోమయంలో సుదూర ప్రాంత భక్తులు దుకాణదారులకు ప్లాట్ ఫారమే దిక్కు -
జాడలేని చినుకు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్, కన్నాయుగూడెంలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలలో లోటు, వెంకటాపురం(కె)లో భారీలోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లా కురవాల్సింది కురిసింది లోటు (శాతం) హనుమకొండ 77.1 15.6 80.0 వరంగల్ 81.0 35.9 56.0 ములుగు 94.7 62.1 34.0 మహబూబాబాద్ 79.6 31.6 60.0 జయశంకర్ భూపాలపల్లి 84.3 40.7 52.0 జనగామ 70.7 32.8 54.0 -
కేజీబీవీ పాఠశాల తనిఖీ
మల్హర్(కాటారం): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని శానిటేషన్, టాయిలెట్లు, స్టోర్రూం, తాగునీరు, గదుల్లోని వెంటిలేషన్, కార్యాలయ రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న 80 సీట్లకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని ప్రిన్స్పాల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మార్క శ్రీధర్బాబు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నైరుతి ప్రాకారం నుంచి తొలగింపు ప్రక్రియ షురూ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నైరుతిలో ఉన్న విజయగణపతి ఆలయం నుంచి దక్షిణ గోపురం వరకు ఉన్న ప్రాకారం విగ్రహాలను తమిళ శిల్పి రవీంద్రన్ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ, గుమ్మడికాయలు కొట్టి తొలగింపును ప్రారంభించగా.. ప్రాకారంపై ఉన్న విగ్రహాలను తొలిగించారు. బుధవారం శృంగేరి పీఠం శిష్యులు విశేష పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులకు ప్రాణపత్రిష్ఠ చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలగింపును దేవాదాయశాఖ గురువారం నుంచి ప్రారంభించింది. పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది. వైన్షాపులో అగ్ని ప్రమాదం చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామంలో ఓ వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. రెండు షెటర్లలో మద్యం విక్రయాలు నిర్వహిస్తుండగా బుధవారం రాత్రి షాపులను మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం షెటర్ లోపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పొగలు, మంటలు వస్తున్నాయని ఇంటి యజమాని తెలుపడంతో హూటహూటిన నిర్వాహకులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపుచేశారు. దీంతో అప్పటికే రూమ్లో ఉన్న మద్యం సీసాలు పగిలిపోయాయి. సమయానికి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిదని గ్రామస్తులు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరువెంకటాపురం(కె): అక్రమ అరెస్టులతో ఆది వాసీల భూ ఉద్యమాన్ని ఆపలేరని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నర్సింహమూర్తి అన్నారు. ఏటూరునాగారంలోని భూ పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలకు అండగా వెళ్తున్న ఆది వాసీ నాయకులను పోలీసులు గురువారం హౌస్ అరెస్టు చేయటం సరికాదన్నారు. పలువురు ఇరువర్గాల మధ్య ఘర్షణ పేరుతో ప్రజలను తప్పదోవ పట్టించేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు గిరిజనుల గిరిజనేతరుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు. -
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మహాముత్తారం: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు డీలర్లు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు అన్నారు. బుధవారం బోర్లగూడెం రైతువేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఫర్టిలైజర్ షాప్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహదేవపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనూష, వ్యవసాయ విస్తరణ అధికారులు శివకృష్ణ, శశివర్దన్ పాల్గొన్నారు. ఎరువుల దుకాణం తనిఖీ.. మండలంలో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం బోర్లగూడెం గ్రామంలోని మూక్లోత్ మేగ్య సమ్మయ్య ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీపాల్ తనిఖీ చేశారు. లైసెన్స్, ఈ పాస్ బిల్బుక్స్, స్టాక్రిజిస్టర్, ఇన్వాయిస్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు యూరియూ క్రయవిక్రయాలు జరుపరాదని ఆదేశాలిచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి బాబురావు -
బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దు
భూపాలపల్లి అర్బన్: బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని సీసీఎస్ సీఐ రమేష్ సూచించారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్టీయూ) అధికారులు, ఇతర శాఖల సిబ్బంది సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, మెకానిక్ షాపులు, స్క్రాప్ దుకాణాలు, బేకరీలు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. బాల కార్మికులను నియమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికుల సమాచారం తెలిసిన వారు వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. -
రేపు సమావేశం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ఈ నెల 19న నిర్వహించనున్న ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏరియా సింగరేణి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాద నివారణ చర్యలు, కార్మికులకు అందిస్తున్న భద్రతా పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు, అత్యవసర స్పందన వ్యవస్థలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యసాధనకు అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, వివిధ గనులు, విభాగాల అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కై లాపూర్ పాఠశాల పునఃప్రారంభం చిట్యాల: మండలంలోని కై లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థు కొరతతో గతేడాది మూతబడింది. గ్రామస్తుల చొరవతో బుధవారం పునఃప్రారంభమైంది. గ్రామంలో పాఠశాల మూతపడడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గమనించిన గ్రామస్తులు తిరిగి పాఠశాల తెరుచుకునే విధంగా సర్పంచ్ కొడారి ఓదేలు, ఉపాధ్యాయుడు దశరథం, గ్రామస్తులు పలు చర్యలు చేపట్టారు. దీంతో పాఠశాలకు 20 మంది విద్యార్థులు హాజరైనట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్ పల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ డిమాండ్ చేశారు. బుధవారం డీఈఓ రాజేందర్కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, టీచర్ క్వాలిఫికేషన్ నోటీస్ బోర్డు లో పెట్టాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్, టై బెల్టు అమ్మకాలు చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్న పాఠశాలలను వెంటనే సీజ్చేయాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత టేకుమట్ల: సుబ్బక్కపల్లి చలివాగు నుంచి మంగళవారం రాత్రి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్లు రాసమల్ల మల్లయ్య, సుంకరి రాజు, ఆనందపు రాజేందర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఫీజుల మోత..
భూపాలపల్లి అర్బన్: వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాఠశాలల్లో నిబంధనలు పాటించకుండా, బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను చేరవేయటంతో పాటు కొన్ని యజమాన్యాలు ఆ బస్సుల ఫిట్నెస్ను, సంరక్షకుల నియామకాన్ని పట్టించుకోవటంలేదు. వారు చెప్పిన చోటే నోట్ పుస్తకాలు, యూనిఫాంలు బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. అర్హత లేనివారితో విద్యాబోధన చేయిస్తున్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం ప్రయోగశాల, గ్రంఽథాలయం, ఆటస్థలాలు లేని పాఠశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. 75 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లాలో 75 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రాథమిక, హైస్కూల్ స్థాయిల్లో నడుస్తున్నాయి. సుమారు 15వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థులకు ఫీజు సగటున రూ.25వేలు, పదోతరగతి విద్యార్థులకు రూ.50 వేలు తీసుకుంటున్నారు. వీటితో పాటు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులను కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో అవే పుస్తకాలు రూ.10 నుంచి 15శాతం తగ్గింపు ధరతో దొరుకుతున్నాయి. ఈ అమ్మకాల విషయంలో కూడా పాఠశాల యాజమాన్యాలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయి. పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు పెన్ను నుంచి పెన్సిల్ వరకు బ్యాడ్జి నుంచి స్కూల్ డ్రెస్సు, షూస్ కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలి. వీటన్నింటితోపాటు పాఠశాల గుర్తింపు కార్డుకు ప్రత్యేక రుసుంతో అమ్మకాలు సాగిస్తున్నారు. పుస్తకాలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.3వేల నుంచి 8వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల్లో వసతులకు సరిపడా తరగతి గదులు ఉండాలి భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉండాలి విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు బోధన చేయాలి. తరగతి గదుల్లో అవసరమైనంత వెలుతురు ఉండాలి. పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యం కల్పించాలి. పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీసు బోర్డుపై అతికించటం, ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయటం, ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ కోసం అనుమతి తీసుకోవటం, ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తీసుకోవటం, తదితర వసతులు ఉండాలి. ప్రైవేట్ పాఠశాలల్లో వసూళ్లు భయపెడుతున్న ఫీజులు, సామగ్రి ఖర్చు పుస్తకాలు, యూనిఫాం విక్రయాలకు సొంత కౌంటర్లు -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
రేగొండ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రూపకల్పన పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని ఆర్టీఓ హరికృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఓల సూపర్వైజర్లకు ఓటరు జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితాను ఇంటింటి సర్వే చేసి పకడ్బందీగా రూపొందించాలని తెలిపారు. జాబితా సవరణలో నిర్లక్ష్యం చేసిన బీఎల్ఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల తహసీల్దార్లు శ్వేత, హేమ, డిప్యూటీ తహసీల్దార్లు అబ్దుల్ రజాక్, శ్రీలత, ఆర్ఐలు పాల్గొన్నారు. ఆర్డీఓ హరికృష్ణ -
అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం
అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు.. సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు హనుమకొండమహబూబాబాద్ములుగువరంగల్భూపాలపల్లిజనగామభౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం భూపాలపల్లి: నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎరువులు, విత్తనాల విక్రయాలు, మ్యాపింగ్, రైతు రిజిస్ట్రీ తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 38 రైతు వేదికల ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు 15 రైతు వేదికల మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన 23 రైతు వేదికల మ్యాపింగ్ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విక్రయాలు ప్రారంభించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే షాపుల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. విక్రయ కేంద్రాల వద్ద పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, ప్రతి విక్రయ కేంద్రంలో మండల స్థాయి అధికారి మరియు పోలీసు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో ప్రస్తుత నమోదు కేవలం 66.77 శాతం మాత్రమే కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన శాతాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఏఓ బాబురావు, సహకార శాఖ అధికారి వాలియా నాయక్, ఏడీఏలు రమేష్, శ్రీపాల్, ఏఓలు పాల్గొన్నారు. టీం వర్క్తో జిల్లా ప్రగతి పథం.. ఒక టీమ్ వర్క్గా పనిచేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి జూన్ 16వ తేదీతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, డీపీఆర్ఓ శీలం శ్రీనివాస్, ఏఓ శ్రీనివాసులు, డీటీ షఫీ సర్కార్, జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్ రాహుల్ శర్మకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
సాగుకు సమాయత్తం
భూపాలపల్లి రూరల్: జిల్లా రైతులు వానాకాలం సాగు పనుల్లో బిజీబిజీగా మారిపోయారు. జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి సాగువైపు రైతులు ముందస్తుగానే అడుగులు వేస్తున్నారు. పత్తి సాగుచేసే రైతులు ఇప్పటికే పొలాల్లోని పాత పత్తి కట్టెలను పీకి, కాల్చివేసి భూమిని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వర్షాలు పడిన ప్రాంతాల్లోని నల్లరేగడి భూముల్లో పత్తి విత్తనాలు కూడా వేస్తున్నారు. 1,06,560 ఎకరాల్లో పత్తి సాగు అంచనా.. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1,06,560ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ విస్తీర్ణానికి గాను దాదాపు 2.80 లక్షల పత్తివిత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు లెక్కగట్టారు. రైతులకు కొరత లేకుండా జిల్లాలోని విత్తన దుకాణాల వ్యాపారులు ముందస్తుగానే హైబ్రీడ్ పత్తి విత్తనాల ను సిద్ధం చేసి ఉంచారు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులు కురవడంతో తడిని ఉపయోగించుకుని కల్టివేటర్లతో భూమిని మెత్తగా దు న్నుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్, గుర్రంపేట, టేకుమట్ల, చిట్యాల, రేగొండ మండలాల్లోని మెజారిటీ గ్రామా ల రైతులు వేసవి దుక్కులను దున్నుకుని విత్తనాలు వేసేందుకు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి తర్వాతే వరి వైపు చూపు రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మట్టి పదునయ్యే వర్షాలు పడగానే పత్తి విత్తనాలు విత్తేందుకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జూన్ చివరి నాటికి పత్తి విత్తుకునే పనులను పూర్తిగా ముగించుకోవాలని రైతులు భావిస్తున్నారు. ఆ తర్వాతే వరి సాగువైపు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి నారుమళ్ల కోసం భూములను సిద్ధం చేసుకోగా, కొన్నిచోట్ల వరినార్లు కూడా పోసి వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అనుకూలమైన వర్షాలు పడితే ఈ ఏడాది వానాకాలం సీజన్ జిల్లాలో లాభసాటిగా సాగుతుందని రైతాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రామాల్లో సాగుపనులు మహాముత్తారం: నాలుగు రోజుల క్రితం మహాముత్తారం మండలంలో ఓ మోస్తారు వర్షం పడింది. దీంతో మండలంలోని కనుకునూర్, బోర్లగూడెం, యామన్పల్లి, నల్లగుంటమీనాజీపేట, మహాముత్తారం తదితర గ్రామాల్లోని రైతులు సాగుపనుల్లో మునిగిపోయారు. బుధవారం వివిధ గ్రామాల్లో రైతులు చేలల్లో అచ్చుకొట్టడంతో పాటు పత్తి విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు దున్నుకునే పనిలో రైతులు నిమగ్నం వర్షాలు కురిస్తే విత్తుకునేందుకు సన్నద్ధం ఎరువులు, విత్తనాలు కొనుగోలు -
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్ సూచించారు. సోమవారం న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుళ్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. సివిల్ కేసుల్లో రాజీ కుదిరిన వారికి చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి అందజేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జాలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయమే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను కలిసిన ఎస్ఈ రమేశ్ భూపాలపల్లి రూరల్: పదోన్నతిపై జిల్లాకు వచ్చిన భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేశ్ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. నిజా మాబాద్ డివిజనల్ ఇంజనీర్, (టెక్నికల్)గా ఉన్న రమేశ్ పదోన్నతిపై ఎస్ఈగా భూపాలపల్లికి వచ్చారు. ఎస్ఈ వెంట భూపాలపల్లి డివిజ నల్ ఇంజనీర్ పాపిరెడ్డి ఉన్నారు. బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి వెంకన్న ఆదేశించారు. ఈ మేరకు పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఫిట్నెస్ చేయని బస్సులకు జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో నిబంధనలు పాటించాలని, వేగంగా వెళ్లకుండా నియంత్రణతో నడపాలని డ్రైవర్లకు సూచించారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లు మాత్రమే బస్సులను నడపాలని ఆదేశించారు. భద్రకాళి దేవాలయంలో ప్రతిష్ఠాపనోత్సవ పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కేయూ ఫిజిక్స్ విభాగం బీఓఎస్గా నరేందర్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం బోర్డు ఆఫ్స్డడీస్ చైర్మన్గా ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్కు వీసీ కె.ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు అందించారు. -
స్వల్పకాలికమే ముద్దు!
భూపాలపల్లి రూరల్: వాతావరణంలో మార్పుల కారణంగా స్వల్ప కాలిక పంటలను సాగు చేయాలని, తొందరపడి పంటలు సాగు చేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. రైతులు పప్పులు, మినుములు, పెసర తదితర పంటలతో పాటు వరిలో స్వల్పకాలిక పంటలను సాగుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలోని రైతులు డీఏఓకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రశ్న: వరిలో ఏ రకాల వంగడాలు వేస్తే బాగుంటుంది. – మార్క అజయ్, కొత్తపల్లి, (ఎస్ఎం) భూపాలపల్లి జవాబు: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సంవృద్ధిగా పడే అవకాశం లేదని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. రైతులు వీలైతే పప్పులు, చిరు ధాన్యాలు, 120 నుంచి 125 రోజుల్లో కోతకు వచ్చే 1618, జీఎల్, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా, కేఎన్ఎం జగిత్యాల లాంటి స్వల్ప కాలిక పంటలను సాగు చేయాలి. ప్ర: ప్రస్తుత పరిస్థితులకు ఏఏ పంటలు సాగు చేయాలి? – కుమారస్వామి, గణపురం జ: పంటల మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పటికీ ఒకే రకమైన పంటలు సాగు చేస్తే భూమిలో సారం పెరగదు. ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉంది. ఉలువలు, కందులు, పెసర, మినుములు, బొబ్బెర్లు లాంటి పంటలు సాగు చేస్తే దిగుబడితో పాటు భూమి సారవంతమవుతోంది. ప్ర: పత్తిలో ఎలాంటి విత్తనాలు వేస్తే బాగుంటుంది. ఎప్పుడు విత్తాలి? –బొబ్బిల్ల రాజు, తాడిచెర్ల జ: గత అనుభవాలను బట్టి మార్కెట్లో ఉన్న నాణ్యమైన పత్తి విత్తనాలను ఎంచుకోవాలి. సరైన వర్షాలు కురువలేదు.. కాబట్టి పత్తి విత్తనాలు ఇప్పుడే విత్తవద్దు. మట్టి 70 నుంచి 80 శాతం తడిచిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. లేదంటే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్ర: జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉంచాలి. – నూకల ప్రకాశ్రెడ్డి, మోరంచపల్లి భూపాలపల్లి, జ: గతంలో భూపాలపల్లి, గణపురం మండలాల నుంచి ఎరువులు తీసుకునే విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడు యాప్లో నమోదు చేసుకుంటే భూపాలపల్లి ఒక్కటే వస్తుంది. మోరంచపల్లి రైతులకు భూపాలపల్లి దూరం అవుతుందని ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారులతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఆగ్రో గ్రోమోర్లో కూడా అందుబాటులో ఉండేవిధంగా చూస్తాం. ప్ర: సన్నాలు అన్నింటికీ బోనస్ వర్తిస్తుందా? – తిప్పారపు సురేందర్, మొగుళ్లపల్లి జ: సన్నాలకు ప్రభుత్వం అందించే బోనస్ వర్తిస్తుంది. ఈఏడాది 120 నుంచి 125 రోజుల్లో చేతికి వచ్చే విత్తనాలను సాగు చేసుకోవాలి. నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. రైతులకు ఉపయోగంగా ఉంటుంది. లేదంటే పంటమార్పిడి చేసి చిరు ధాన్యాలను పండించండి. ప్ర: నకిలీ విత్తనాలను అరికట్టాలి. – బుర్ర వెంకటేశ్గౌడ్, చిట్యాల జ: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, వివిధ శాఖల ఆధ్వర్యలో టాస్క్పోర్స్ టీం ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటాం. అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్ర: గతేడాది ఎరువులకు ఇబ్చందులు పడ్డాం. – గుర్రం రాజయ్య, చిట్యాల జ: ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. గతేడాది అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల సాగు మేరకు ఎరువులు మీ మండల పరిధిలో అందుబాటులో ఉంటాయి. ఇబ్బందులు రాకుండా చూస్తాం. ప్ర: వర్షాలు తక్కువ అంటున్నారు. పత్తి, వరి ఏఏ రకాలు ఎంచుకోవాలి. – ర్యాగం రవి, చిట్యాల జ: సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. అందుకే ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు. పత్తి, బోదెల పద్ధతి సాంద్రత విధానంలో సాగు చేస్తే మంచిది. వరిలో స్వల్పకాలిక రకాలను వెదజల్లే పద్ధతిలో జూలై 15వ తేదీ వరకు సాగు చేసుకోవచ్చు. తొందరపడి పంటలు సాగు చేయొద్దు ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం లైసెన్స్డ్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి రైతులకు జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచనలు ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూన్య స్పందన -
తెరుచుకున్న మూత బడి
రేగొండ: ఒకప్పుడు వి ద్యార్థులతో కళకళలాడిన పాఠశాల విద్యార్థుల కొరతతో మూతపడింది. రెండేళ్ల తర్వాత పాలకవర్గం, గ్రామస్తుల చొరవతో మళ్లీ తెరుచుకుంది. కొత్తపల్లిగోరి మండలంలోని రామగుండాలపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 14 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా విద్యాఽశాఖాధికారి రాజేందర్, సర్పంచ్ ఏడెల్లి మోహన్రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. అనంతరం దాతలు అందజేసిన బ్యాగులు, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. -
తొలిరోజు అంతంతే!
● జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం ● 16వేలకు 1,845 మంది హాజరు ● చిట్యాలలో ఒకేఒక్క విద్యార్థిని.. భూపాలపల్లి అర్బన్: ఎండల తీవ్రత, సుధీర్ఘ వేసవి సెలవులు అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను ముస్తాబు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగ తం పలికారు. జిల్లాలో మొత్తం 16వేల మందికి మొదటిరోజు 1,845 మంది (12శాతం) విద్యార్థులు హాజరయ్యారు. పలు పాఠశాలలను డీఈఓ రాజేందర్, ఎంఈ ఓలు సందర్శించి పాఠ్య, నోట్ పుస్తకాలు అందించా రు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండుగ వాతావరణంలో పాఠశాలను పునఃప్రారంభించారు. అమావాస్య ఎఫెక్ట్..పండుగ వాతావరణంలో.. -
అమ్మ పేరుతో మొక్క నాటండి
● డీఈఓ రాజేందర్ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ (ఎన్జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఏక్ పెడ్ మా కే నామ్’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యతాభావం పెంపొందుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్రెడ్డి, సీఎంఓ రమేష్, ప్లానింగ్ ఆఫీసర్ రాజగోపాల్, ఏఎస్ఓ రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, ప్రశాంత్లు పాల్గొన్నారు. -
పల్స్పోలియోను విజయవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: జిల్లాలో పల్స్ పోలియో, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలను అన్ని శాఖల అధి కారుల సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవా రం సోమవారం పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నిర్మూలన, డయేరియా నివారణ, పొగాకు వినియోగం మానేయడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించడం తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టబోయే ప్రతిష్టాత్మక ఆరోగ్య కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 28న పల్స్పోలియో నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 34,728 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. అలాగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జూలై 13 సందర్భంగా 1–19 సంవత్సరాలు వయస్సు ఉన్న 70,773 మందిని గుర్తించి నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డీఓ హరికృష్ణ, డీపీఓ శ్రీలత, ఇంటర్ మీడియట్ అధికారి వెంకన్న, మున్సిపల్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 66 దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజలు అందించిన దరఖాస్తులు జాప్యం చేయకుండా స త్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిన ప్రతీ దరఖాస్తును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పరిష్కారంలో ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. -
బాలాలయం ముస్తాబు!
● శ్రీ ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాట్లు ముమ్మరం ● రేపు పునరుద్ధరణ, తొలగింపు ప్రక్రియ షురూకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేఽశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈనెల (రేపు) 17న బుధవారం ఉదయం 8.15 గంటలకు కళాప్రకర్షణ క్రతువుతో శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంచే విశేష పూజలతో ఆరంభం కానుంది. రూ.198కోట్ల వ్యయంతో ఆలయ పునరుద్ధరణ, ఆలయాల తొలిగింపు కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుత దేవస్థానానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద అభిషేక పూజలు నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న షెడ్డులో బాలాలయాలు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అందులోనే ఉత్సవ మూర్తులు శ్రీశుభానందముక్తీఽశ్వరులు, సరస్వతీ అమ్మవార్లను ఆసీనులు చేసి భక్తుల దర్శనాలు చేయడానికి వీలు కల్పించనున్నారు. దుకాణాలు నిర్వహించడానికి ప్లాట్ఫారం సిద్ధం చేశారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రెండు కంటెయినర్లలో కార్యాలయం, టికెట్ విక్రయాలు, ప్రసాద విక్రయాలు జరపనున్నారని తెలిసింది. ఇంకా కాలసర్ప, శని పూజలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిసింది. మంగళవారం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు స్థానికుల అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం. 17న జరుగనున్న పూజా క్రతువు విషయంలో దేవాదాయశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. భక్తులు, స్థానికులు ఆ శాఖ ప్రకటన కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. -
‘ప్రైవేట్’కు పంపొద్దని తీర్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో చిన్నబోయినపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారుల కుటుంబాలు ఉంటాయి. వారి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం, ఇతర ప్రైవేట్ పాఠశాలలకు పంపేవారు. అయితే ప్రభుత్వ బడి ఉన్న తర్వాత ప్రైవేట్ పాఠశాలల కు ఎందుకు పంపాలని గ్రామ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున, హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్థానిక గ్రామస్తులు దూపటి సతీశ్లు కలిసి గ్రామాన్ని ఏకం చేశారు. ఇక నుంచి గ్రామంలోని చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దని గ్రామసభలో ప్రజలంతా గతనెల 31న తీర్మానం చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ సైతం చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తీర్మానించారు. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, షాపెల్లి, హనుమాన్ నగర్ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి బడికి రావడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వంటి ఏర్పాట్లు కూడా చేశారు. డీఎన్టీ పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయాన్ని కానిస్టేబుల్ సతీశ్, మరికొంత మంది యువకులు కలిసి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ విషయం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు తెలిసి ఇటీవల సర్పంచ్ నాగార్జున, సతీశ్ను జిల్లా కేంద్రంలో సైతం సన్మానించారు. ఆ గ్రంథాలయం ఏర్పాటు విషయాన్ని కలెక్టర్కు వివరించగా ఆసక్తికనబర్చిన వెంటనే చిన్నబోయినపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో ఉన్న 2 వేల పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే జిల్లాలోని ఎంఈఓలు సైతం ఇలాంటి ఆదర్శ గ్రంథాలయాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలని అక్కడి నుంచే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా పాఠశాల హెచ్ఎం కవితతో పాటు మరో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు కేటాయించడం విశేషం. ఒకే రోజు 138 మందికి అడ్మిషన్లు చిన్నబోయినపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్కు వేరే గ్రామాలకు వెళ్లకుండా కలెక్టర్, ప్రభుత్వంతో మాట్లాడి అదే గ్రామంలోనే ప్రీప్రైమరీ స్కూల్ను గ్రామస్తులు మంజూరు చేయించుకున్నారు. ఈ క్రమంలో 138 మంది విద్యార్థులు మే 31న ఒకే రోజు పాఠశాలలో నూతనంగా అడ్మిషన్లను పొందారు. ఇలా వారం తరబడి అడ్మిషన్ల కోసం తిరిగిన ఉపాధ్యాయులకు సాధ్యం కానిది.. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి చేశారు. ఒకేరోజు 138 మంది డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలో ఆడ్మిషన్లు పొందడంతో రాష్ట్రంలో మొదటి సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఆ విద్యార్థులకు స్థానిక సర్పంచ్ నాగార్జున సొంత ఖర్చుతో బ్యాగులు, స్టడీ మెటీరియల్ను అందజేశారు. గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలకే పెద్దపీట రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన చిన్నబోయిపల్లి పాఠశాల జిల్లా వ్యాప్తంగా ఆదర్శ గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ సూచనలు ఒకే రోజు 138 అడ్మిషన్లు -
ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి?
ఏటూరునాగారం: ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్గా టీవీఆర్ దామోదరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈయన గతంలో స్థానిక ఐటీడీఏలో పనిచేస్తూ ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న దామోదరస్వామికి ఉద్యోగోన్నతి రావడంతో ఏటూరునాగారంలో ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో మరో రెండు రోజుల్లో ఏటూరునాగారం ఏపీఓగా ఆయన బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రవి ములుగు రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన తోకల రవిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2004 నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. -
వెదజల్లుతున్న దుర్వాసన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ప్రసాదశాల నుంచి వచ్చే డ్రెయినేజీ పైప్లైన్ జామ్ కావడంతో మురుగు నీరు బయటకు పొంగిపొర్లి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగిన సరస్వతినది అంత్య పుష్కరాల అనంతరం ఈ సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. పుష్కరాలు ముగిసి 14 రోజులుగా మురుగు నీరు బయటకు రోడ్డుమీద పారుతూ దుర్గంధం వెదజల్లుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానికులకు, సమీపంలోని ఇళ్లకు తీవ్ర దుర్వాసనతో ముక్కుపుటాలు అదిలిపోతున్నట్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు స్థానికులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
కనుకునూర్లో భారీ వర్షం
మహాముత్తారం: మండలంలోని రెడ్డిపల్లి కనుకునూర్లో ఆదివారం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రెడ్డిపల్లి కనుకునూర్ మధ్య కరెంటు వైర్లపై పెద్ద వృక్షం పడింది. రెండు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెడ్డిపల్లి గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది చెట్టును తొలిగించారు. కంకరవేశారు.. బీటీ మరిచారు మహాముత్తారం: మండలంలోని పర్లపల్లి నుంచి లింగాపూర్ వెళ్లే రోడ్డు సుమారు కిలో మీటరు వరకు ఎనిమిది సంవత్సరాల క్రితం అధికారులు కంకరపోసి వదిలేశారు. అప్పటినుంచి పర్లపల్లి గ్రామస్తులు రోడ్డుగుండా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర తేలి భారీగుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని లాడ్జిల్లో సీసీఎస్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతిథుల రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సీసీఎస్ సీఐ రమేష్ పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి అతిథి ఆధార్ వివరాలు, రాకపోకల సమయాలు, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అవగాహన కల్పించినా కాల్చేస్తున్నారు మహాముత్తారం: రైతులు పంటలు పండించిన అనంతరం వాటిని పొలంలో కలియ దున్నాలి కానీ కాల్చవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. కానీ మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు వరికొయ్యలను కాల్చుతూ సారవంతమైన భూమిలోని క్రిమి కీటకాలను చంపేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వరికొయ్యలను కాల్వడం వలన భూమిలోని క్రిమి కీటకాలు చనిపోవడమే కాకుండా భూమిపొర వేడికి సారవంతాన్ని కోల్పోయి పంటదిగుబడి తగ్గుతుందని ఎవరైనా రైతులు కొయ్యకాళ్లను కాలబెడితే నష్టాన్ని బట్టి 5వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ గ్రామాల్లోని రైతులు మాత్రం కొయ్యకాళ్లను తగలబెడుతున్నారు. ఎంజీఎంలో డిప్యుటేషన్పై నర్సింగ్ సిబ్బంది కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. -
బడికి రెడీ
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026● నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● ఇంకా సిద్ధం కాని వెల్కమ్ కిట్లు ● పూర్తికాని పాఠశాలల అభివృద్ధి పనులుజిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 281 4370భూపాలపల్లి అర్బన్: వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాల్సిన సమయంలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన పాఠశాల వెల్కమ్ కిట్లు ఇంకా జిల్లాకు చేరకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల కొరత వెంటాడుతోంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రీపైమరీ విద్య జిల్లాలో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ టీచర్లు, ఆయాల నియామకం చేపట్టలేదు. నూతనంగా మరో 41 పాఠశాల్లో ప్రీప్రైమరీ ప్రారంభించేందుకు టీచర్ల, ఆయాలను నియమించాల్సి ఉండగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీంతో చిన్నారుల బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూత పడుతున్న ప్రాథమిక పాఠశాలలు జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం వరకు జిల్లా వ్యాప్తంగా 317 ప్రాథమిక, 44 ప్రాథమికోన్నత, 69 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గడిచిన 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కొన్ని, విద్యార్థులు లేరని మరికొన్ని మొత్తంగా 36 ప్రాథమిక పాఠశాలను అధికారులు మూసి ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించారు. ఈ విద్యా సంవత్సరం మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారో లేదో అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యి నుంచి రెండు వేల వరకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని అభివృద్ధి పనులు జిల్లాలోని 265 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదు. 947 రకాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ముందే రూ.12.41 కోట్ల నిధులు కేటాయించింది. 683 పనులు పూర్తి చేశారు. 72 రకాల పనులు నేటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇంకా 192 పనులు కొనసాగుతున్నాయి. తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాల, విద్యుత్ కల్పన వంటి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలల్లో నిర్మాణ సామగ్రి ఇంకా ప్రాంగణంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 32కోట్లతో చేపట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమం కింద 149 పాఠశాలల్లో ప్రారంభించిన పనులు కూడా అనేక చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి. తరగతి గదుల అభివృద్ధి, ప్రహరీ, విద్యుత్ సదుపాయాల పనులకు నిధుల కొరతతో పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో వసతులు అందడం లేదు. ప్రణాళిక లేకపోవడంతో.. పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలంటే పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి, వెల్కమ్ కిట్లను పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలోనూ సమస్యలు విద్యార్థులకు తోడుగా బడికి వస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలుఅభివృద్ధి పనులు మంజూరైన పాఠశాలలు 265 ఎంపిక చేసిన పనులు 947 మంజూరైన నిధులు రూ.12.41కోట్లు పూర్తి చేసిన పనులు 683 పనులు కొనసాగుతున్నవి 192 ఇంకా ప్రారంభంకాని పనులు 72ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో.. మా తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. నేను మెదక్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్కు వెళ్లి యూనివర్సిటీలో చదువుకున్నాను. మేం చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం ప్రోత్సహించే వాళ్లు. అప్పట్లో పాఠశాలల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్య ప్రాధాన్యతను వివరించేవాళ్లు. ఇబ్బందులు ఎదురైతే ఉపాధ్యాయులు ప్రోత్సహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. – అశోక్కుమార్, అదనపు కలెక్టర్ -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
రక్తదానం మరొకరికి ప్రాణదానం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి అర్బన్: రక్తదానంతో మరొకరికి ప్రాణదానం కలుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఐటీ మాస్టర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్తం ప్రాణాధారంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో ఎలాంటి హాని ఉండదని, నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినవారిగా నిలుస్తారని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ కార్యాలయం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వేముల శంకర్తో పాటు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్ సభ్యులు, యువకులు, రక్తదాతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 330 యూనిట్ల రక్తం సేకరణ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 330 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సేకరించిన రక్తాన్ని ఎంజీఎం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన కొలుగూరి సంజీవరావు 67వ సారి ఈ శిబిరంలో రక్తదానం చేశారు. -
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. చిన్నబోయినపల్లి పాఠశాల 1–8 వరకు ఉందని, దానిని 10 వరకు పెంచితే డ్రాపౌట్స్ లేకుండా నివారించవచ్చు. ఆశయం గ్రంథాలయం పేరుతో అక్కడ 2 వేల పుస్తకాలను యూపీఎస్సీ, గ్రూప్స్, డీఎస్సీ, ఎస్సై, పీసీలకు కావాల్సిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాం. దాంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. పాఠశాలను మ రింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. –దూపాటి సతీశ్, ఆశయ గ్రంథాలయ నిర్వాహకుడు, కానిస్టేబుల్, చిన్నబోయినపల్లి -
విద్యార్థులను బడిలో చేర్పించడమే లక్ష్యం
గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాం. ప్రతీ విద్యార్థి చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. ఇందుకు కలెక్టర్ ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ట్రావెలింగ్ అలవెన్సులు రానున్నాయి. సర్కారు బడిని మరింత బలోపేతం చేస్తాం. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని మంత్రి సీతక్క, కలెక్టర్ సహదేవరావుకు విన్నవించాం. వారు కూడా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామన్నారు. – నల్లబోయిన నాగార్జున, చిన్నబోయినపల్లి సర్పంచ్ -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
● గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి ● బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావుహన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు. నాయకులు పాల్గొన్నారు. -
రేపు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
భూపాలపల్లి రూరల్: వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబురావుతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువులు, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు. అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు తేదీ : 15న (సోమవారం) సమయం : ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్ 89777 45518 -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు యాకూబ్రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరికీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ములుగు మండలంలోని కోయగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బోయిని రాజయ్య ఇటీవల మరణించగా పీఆర్టీయూ సంక్షేమనిధి నుంచి మృతుని కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును శ్రీపాల్రెడ్డి అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచినందుకు డీఈఓ సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్సీతో కలిసి పీఆర్టీయూ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీరంగం, సంఘం నాయకులు దేవులపల్లి సత్యనారాయణ, కాసర్ల రమేశ్, కాటం మల్లారెడ్డి, సూర్యనారాయణ, చెరుకుల ధర్మయ్య, ప్రభావతి, పెండ్యాల సలేంద్రం, ప్రమీల, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
శనిత్రయోదశి.. భక్తులు కిక్కిరిసి
కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. దీంతో నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలు 435, కాలసర్పదోష పూజలు 175, స్వామివారి గర్భగుడిలో అభిషేకాలు 126, ఇతర పూజలు, ప్రసాదాలపై రూ. 4,59,200 ఆదాయం సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి. దీంతో గోదావరి తీరం, ఆలయంలో భక్తులు కిక్కిరిశారు. -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
తెరుచుకున్న మూత‘బడి’
● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం ● పది మంది విద్యార్థుల చేరిక ఎస్ఎస్తాడ్వాయి: ఒకప్పుడు విద్యార్థుల సందడితో కళకళలాడిన పాఠశాల.. విద్యార్థులు లేక మూతపడింది. పదేళ్ల తర్వాత తలుపులు తెరుచుకుంది. మండల పరిధిలోని కన్నెపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 10 మందిని ప్రభుత్వ పాఠశాలలో శనివారం చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, సర్పంచ్ కొమరం శైలజ, ఎంఈఓ గడ్డి శ్రీనివాసులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే సమాజ ప్రగతికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ను తమ సొంత ఖర్చులతో అందజేస్తామని కల్యాణి ప్రకటించారు. మంత్రి సీతక్క చొరవతో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సరితను కన్నెపల్లి పాఠశాలకు డిప్యూటేషన్పై నియమించినట్లు తెలిపారు. సర్పంచ్ శైలజ మాట్లాడుతూ పాఠశాలను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం విద్యాసాగర్, ఉప సర్పంచ్ రంజిత్, ఉపాధ్యాయురాలు సరిత పాల్గొన్నారు. పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థల పరిశీలన మంగపేట: మండల కేంద్రంలోని దొంగల ఒర్రె వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ నిర్మాణ ప్రదేశాన్ని ఆర్కిటెక్చర్ నవీన్ (డిజైనింగ్ ప్రైవేటు ఏజెన్సీ) బృందం శనివారం పరిశీలించింది. మండల కేంద్రంలోని పొదుమూరు వద్ద గోదావరి ఒడ్డున 2015లో నిర్మించిన పుష్కరఘాట్ గోదావరి వరదలకు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు మండలంలోని మంగపేట, చుంచుపల్లి రెండు ప్రాంతాల్లో పుష్కరఘాట్లను నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించింది. మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నిర్మాణంలో ఉన్న కరకట్ట వద్ద 62 మీటర్లతో పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. గతంలో నిర్మించిన పుష్కరఘాట్ 170 మీటర్లు ఉందని, ప్రస్తుత పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి కింద నుంచి ఒడ్డుపై వరకు 17 మీటర్ల ఎత్తు ఉండటంతో కనీసం 100 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని.. అందుకు మంజూరైన నిధులు సరిపోవని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. -
పోడు భూములకు పట్టాలివ్వాలి
● ఏఐకేఎంఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజువెంకటాపురం(ఎం): పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏఐకేఎంఎస్ డివిజన్ ప్రథమ మహాసభకు బొమ్మెడ సాంబయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో 40 సంవత్సరాలకు పైగా పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకోకుండా ఆపేసి సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని పెట్టిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పోడుభూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి, ములుగు డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. -
ఈదురుగాలులతో వర్షం
మొగుళ్లపల్లి: మండలంలోని రంగాపురం గ్రామంతో పాటు శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రంగాపురం గ్రామంలోని పలువురి ఇంటి పై కప్పులు లేచిపోయాయి. రంగాపురం–మొగుళ్లపల్లి ప్రధాన రోడ్డులో చెట్లు నేలకొరిగాయి. దాంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు మినహా అన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్లను రోడ్డుపై నుంచి తొలగించడంతో వాహనాలు వెళ్లిపోయాయి.


