Jayashankar
-
ధాన్యం లారీలకు జీపీఎస్
వాహనాల కదలికలపై నిత్యం పర్యవేక్షణ● మిల్లుల్లో అన్లోడింగ్ జాప్యానికి చెక్ ● నూతన పద్ధతిలోనే కేటాయింపులు ● రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే అవకాశంభూపాలపల్లి రూరల్: మిల్లులకు సమానంగా ధాన్యం కేటాయింపులు, పంపిన ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు అధికా రులు జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలులో ట్రక్ షీట్ జనరేట్తోపాటు ఆన్లైన్లోనే మిల్లులకు కేటాయింపులను ప్రారంభించారు. తరుగు పేరుతో దోపిడీని అరికట్టనున్నారు. డబ్బుల చెల్లింపులు వేగిరం చేయనున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ నూతన పద్ధతులను అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 95,590 ఎకరాల్లో వరి సాగు కాగా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.3 కోట్ల చెల్లింపులు చేశారు. అక్రమాలను అరికట్టేందుకే.. ధాన్యం రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తరుగు ఎక్కువగా తీయాలని మిల్లర్లు రోజుల తరబడి వాహనాల నుంచి ధాన్యం అన్లోడ్ చేయకుండా ఉంచేవారు. ధాన్యం తరుగును తీసేందుకు అంగీకరిస్తేనే దించుకునేవారు. జీపీఎస్ ఏర్పాటు చేయడంతో ఎంత సమయం వేచి ఉంది, ఎందుకు వేయిటింగ్ చేయించారనే వివరాలు తీసుకోనున్నారు. కావాలని ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటారు. అక్రమాలను చెక్ పెట్టేందుకు లారీలు, డీసీఎం వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడం తప్పనిసరి చేశారు. జీపీఎస్ సరిగా పనిచేస్తున్న వాహనాలకు మాత్రమే లోడింగ్ చేయనున్నారు. వాహనాల కదలికలను నిత్యం పర్యవేక్షించనున్నారు. ఇలా ఆన్లైన్లో ట్రక్ షీట్లు జనరేట్ చేయడం, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుతో రైతులకు మేలు జరగనుంది. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమకానున్నాయి.. ‘పలుకుబడి’కి ఇక చెల్లు ఇదివరకు సివిల్ సప్లయీస్ అధికారులు, స్థానిక అధికారులకు నచ్చిన మిల్లులకు, పలుకుబడి ఉన్న నేతల మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించేవారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిల్లుల యజమానుల నుంచి ఫిర్యాదులు, అధిక తరుగు, మిల్లుల వద్ద లారీలు పడిగాపులకు, అక్రమాలకు చెక్ పడనుంది. నాణ్యతలేదనే పేరుతో కోతలు, ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లోడ్ చేసిన వెంటనే ఆన్లైన్ ట్రక్ జనరేట్ చేసి, సంబంధిత మిల్లును ఆటోమేటిక్గా కేటాయించే విధానాన్ని అమలు చేస్తుంది. మాన్యువల్గా మిల్లుల కేటాయింపు విధానాన్ని నిలిపేసింది. కొత్త విధానంతో లారీ లోడ్ చేసే సమయానికి మిల్లు వివరాలు తెలియవు. ట్రక్ షీట్ ఆన్లైన్లో జనరేట్ రేట్ చేసిన తర్వాతనే ఆటోమేటిక్గా ఏ మిల్లుకు తరలించాలో సూచిస్తుంది. ట్రక్ షీట్లో పేర్కొన్న మిల్లుకే ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. పారదర్శకత కోసమే..మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల్లో పారదర్శకత, త్వరగా రైతులకు డబ్బులు చెల్లింపులు జరగనున్నాయి. తరుగు పేరుతో ఇక మిల్లర్ల ఇబ్బందులు ఉండవు. వాహనాలకు సైతం జీపీఎస్ ఏర్పాటు చేశాం. దీంతో మిల్లర్లు అన్లోడింగ్ జాప్యం తగ్గనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. అకాల వర్షానికి తడిచిన 612 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా మిల్లులకు తరలించాం. – రాములు, డీఎం సివిల్ సప్లయీస్ అధికారి -
కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్ భూపాలపల్లి అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనసుందర్, వెంకీయాదవ్, దేవన్, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్, హఫీజ్, రాధా, ప్రేమ్కుమార్, నాగరాజు, కిషోర్, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ జయంతి
సాక్షి నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయాల్లో అర్చకులు స్వామివారికి చందనం, తైలాభిషేకం, పంచాంమృతాలతో అభిషేకాలు, తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. వడపప్పు, బెల్లం పాయసం నైవేద్యాలుగా సమర్పించారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన కట్ట మీద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం హనుమాన్ భక్తులు ద్విచక్ర వాహన ర్యాలీ, శోభాయాత్ర నిర్వహించారు. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి చిట్యాల: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని నైన్పాక గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల సామూహిక ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నందున పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశ్రీ, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సౌమ్య, సర్పంచ్ నక్క భాస్కర్, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు లేకుండా సర్వే పూర్తిచేయాలి
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్వైజర్ సర్కిల్లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్ ఎదురుగా శ్రీసీఎన్శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్ఎల్బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్ ఇన్చార్జ్ వినయ్, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్ అధికారి ఎం.ప్రకాశ్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్నాయక్, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం మల్హర్: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్స రం ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలి తాలు సాధించింది. ఈ మేరకు ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా తాడిచర్ల జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ విజయదేవి రూ.1లక్ష చెక్కు ను అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రిన్సిపాల్ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పొ అన్నారు. పీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఓ తొలిసారిగా మంగళవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 1, చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల 2ను తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఆస్తి కోసం వృద్ధురాలి హత్య..గణపురం : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి, డబ్బు కోసం నానమ్మను మనువడు, అతడి భార్య హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణపురం సీఐ కరుణాకర్ రావు కథనం ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల ఐలమ్మ (60)ను ఆస్తి, రూ.40 వేల కోసం ఆమె మనువడు జాకేందర్, అతడి భార్య అమకృతి ఈనెల 09న ప్రణాళిక ప్రకారం కర్రతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్రావు తెలిపారు. -
ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహ లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. -
పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎస్పీ సంకీర్త్ సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జి ల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. స్టేషన్ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష ని ర్వహించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే వి ధంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించా రు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సంపత్రావు, సీఐ నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సజావుగా మక్కల కొనుగోళ్లు
మొగుళ్లపల్లి/రేగొండ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం మొగుళ్లపల్లి, రేగొండ మండలకేంద్రాల్లోని మక్కల కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కమిటీ గోదాములోని నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 49,528 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 26,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు కేంద్రాలకు చేరుకోగా, అందులో 16,850 మెట్రిక్ టన్నులు పూర్తయ్యిందన్నారు. ఇంకా సుమారు 9,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. గోదాముల కొరత కారణంగా నిల్వ సమస్యలు ఉన్నాయని, హమాలీలకు చెల్లించే కూలి రేట్లు తక్కువగా ఉండటంతో కార్మికుల లభ్యతతో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, అబ్దుల్ రజాక్, వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలి ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని మొట్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించి నమోదు ప్రక్రియ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ రాహుల్శర్మమక్కలు నిల్వ చేసే గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్
భూపాలపల్లి అర్బన్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని, హమాలీలు, గన్నీ సంచులు, రవాణా వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన చేసి రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, పౌర సరఫరాలు సంస్థ, సహకార, వ్యవసాయ, ఆర్డీఓ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మక్కలు జిల్లాకు రాకుండా చెక్పోస్టు వద్ద పర్యవేక్షించాలన్నారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. హమాలీల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం, మక్కలు కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, డీఆర్డీఓ బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. వీసీలో సీఎం రేవంత్ రెడ్డి -
సింగరేణి క్వార్టర్స్లో చోరీ
● బంగారం, వెండి ఆభరణాలు అపహరణ గణపురం: మండలంలోని 1000 క్వార్టర్స్లో ఒకే రాత్రి 8 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలం 1000 క్వార్టర్స్లో సింగరేణి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పక్కా ప్రణాళికతో శనివారం రాత్రి 8 క్వార్టర్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం తోటి ఉద్యోగులు గమనించి బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్టీంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ నంబర్ 34 రూం నంబర్ 128లో నివాసముంటున్న మల్లగాని సరస్వతికి చెందిన 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, గాజుల వెంకటేశ్వర్లు 5 గ్రాముల బంగారు కమ్మలు, 4 గ్రాముల వెండి, రూ.6వేల నగదు, పాతరవేని రాజేష్కు చెందిన 2 గ్రాముల బంగారం, 4 తులాల వెండి, వేములపల్లి బాబురావు క్వార్టర్లో 10 తులాల వెండితో పాటు రూ. 1000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సింగరేణి సెక్యూరిటీ ఉండి, నిత్యం జనాభాతో ఉండే 1000 క్వార్టర్లలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. -
నకిలీ విత్తనాల విక్రయంపై ఉక్కుపాదం
అవార్డుల ప్రదానంవిద్యావారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థిని అవునూరి సాయిశ్రీ, వరంగల్ కృష్ణా కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మహ్మద్ ముదాస్సిర్, హనుమకొండ పింగిళి కళాశాల విద్యార్థిని శ్రీహితకు అవార్డు చెక్కులు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులే టి , వివేక్, పొన్నం, అజాహ రుద్దీన్ , శ్రీధర్బాబుపక్క ఫొటోలోని మహిళ పేరు తోన్గర్ కమల. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం. డయాలసిస్తో ఇబ్బందులు పడుతుంది. వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మూడుసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. డయాలసిస్తో ఏ పనీ చేయలేని స్థితిలో ఉంది. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, పింఛన్ ఇప్పించాలని వేడుకుంటుంది. ● నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ -
మైనింగ్కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్న, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉన్నా యి. భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 40–60 కొత్త లీజులకు అవకాశం? పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పట్టాదారులకు తీపి కబురు మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ -
ఆసరా కోసం..
జయశంకర్ భూపాలపల్లిమంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20267పింఛన్ల మంజూరుకు ఎదురుచూపుభూపాలపల్లి రూరల్: ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ కూడా ప్రభుత్వం నాలుగేళ్లుగా బంద్ చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వారంతా అందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. 2022 ఆగస్టు నుంచి ఆగిన ‘ఆసరా’ రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఆగస్టు నుంచి కొత్తగా అసరా పింఛన్ల మంజూరును అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో చాలామంది దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరించింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో నాలుగేళ్ల నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప మంజూరు కావడం లేదు. కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ప్రజావాణిలోనూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారికి ఎదురుచూపు తప్పడం లేదు. ఎన్నికల హామీ నెరవేరుతుందా..! ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ల పెంపును అమలు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ప్రభుత్వం తప్పకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2022 నుంచి నిలిచిన పెన్షన్ మంజూరు పోర్టల్ను పూర్తిగా మూసేసిన ప్రభుత్వం దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయలేని పరిస్థితి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అర్హులు జూన్లో ఇస్తామని ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు -
విద్యా వారోత్సవాలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయడమేకాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని కేజీబీవీలో సమ్మర్క్యాంపు ప్రాంరభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, నూతన నిర్మాణాలేకాక అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యాన చేపట్టే పనులను ప్రారంభించారు. నేడు (మంగళవారం) పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెండు సమ్మర్ క్యాంపులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం చెల్పూర్. టేకుమట్ల జెడ్పీహెచ్ఎస్లను ఎంపిక చేశారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేయనున్నారు. మధ్యాహ్న భోజనం, స్టేషనరీ కింద రూ.వంద, రవాణా అలవెన్స్గా ప్రతీ విద్యార్థికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ఈ క్యాంపు నిర్వహణతో సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బుధవారం (13వ తేదీ).. మండలస్థాయిలో సర్పంచ్లకు వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు సహకరించాలని వివరిస్తారు. గురువారం (14వ తేదీ).. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యాన బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు చేపడుతారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో అల్పాహారం అందించే అంశాన్ని వివరిస్తారు. డ్రాపవుట్ విద్యార్థులను తిరిగి చేర్పించడంతో పాటు సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. శుక్రవారం (15వ తేదీ).. విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదో రోజున లైబ్రరీ డేగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో ఉన్న గ్రంథాలయ సదుపాయంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక దాతల నుంచి పుస్తకాలు స్వీకరిస్తారు. శనివారం (16వ తేదీ): విద్యార్థులకు జిల్లాస్థాయి ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు. మండలాల్లో విజేతలను ఆహ్వానించి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాక విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమం గణపురం మోడల్స్కూల్లో జరగనుంది. ఆదివారం (17వ తేదీ).. వారోత్సవాల్లో ముగింపును చివరి రోజు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పదో తరగతిలో జిల్లాస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందిస్తారు. అందరూ పాలుపంచుకోవాలి.. జిల్లాలో ఈ నెల 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్ఎంలతో పాటు విద్యాశాఖ బాధ్యులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశాం. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలి. – రాజేందర్, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఈ నెల 17వరకు నిర్వహణ రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్ ఖరారు -
ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: ప్రజలు అందించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 20 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. పోలీసుల సంక్షేమానికి మరో ముందడుగు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెలూన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులకు కార్యాలయ పరిసరాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతుందని ఎస్పీ తెలిపారు. పోలీసుల సంక్షేమం, వారి అవసరాలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భవిష్యత్లో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్ పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి అర్బన్: పాలిసెట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయ అధికారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రమణారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 905 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు హెచ్బీ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించబోమని తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్సైట్ ద్వారా జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిస్ట్ డిజైనర్–ఎఫ్ఈఎం, సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయం, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు. డీఆర్వోను కలిసిన ట్రెస్మా ప్రతినిధులు భూపాలపల్లి రూరల్: జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారిని సోమవారం ట్రెస్సా జిల్లా ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్, ట్రెజరర్ పకిడే రాజయ్య ఉన్నారు. మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజి యం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా మురళీమోహన్ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ నల్లపురి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ లైజనింగ్ ఆఫీసర్గా నియమితులైన మురళీమోహన్ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. -
పదిలమా.. ప్రశ్నార్థకమా?
అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం యూజీ అడ్మిషన్ల సమయంలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం నెలకొంటుంది. సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కళాశాలలోని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోవడం గగనమవుతోంది. తాజాగా 2026–2027 విద్యాసంవత్సరానికి యూజీ అడ్మిషన్ల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) బృందం సభ్యులు రెండు రోజులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అంజనా సక్సేనా, లక్ష్మీప్రసాద్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద వైద్యకళాశాలలో తనిఖీలు చేశారు. కళాశాలలోని 50 సీట్లతోపాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాలు తెలుసుకున్నారు. టీచింగ్, టీచింగ్ డైరీ మెయింటెనెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ ల్యాండ్, ల్యాబ్, లైబ్రరీ, పలు మొక్కల గార్డెన్, పరికరాలు పరిశీలించారు. సమయానికి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు వస్తున్నారా అని బయోమెట్రిక్ అటెండెన్స్, ఐరిస్ ద్వారా తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, అంబులెన్స్, నర్సింగ్ స్టాఫ్ వివరాలపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థులకు సంబంధించిన రెండు హాస్టళ్లను తనిఖీ చేశారు. కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా సందర్శించారు. ఇందులో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఓపీ, ఐపీ వివరాలను నమోదు చేసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డైట్, మందులు, వివిధ రకాల చికిత్స గురించి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి స్థాయికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకుని వివరాలను ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని స్పెషల్ అబ్జర్వర్కు అందజేశారు. హెడ్ ఆఫీస్ లింక్ ద్వారా ఆన్లైన్న్లో క్షుణ్ణంగా చూపించి రికార్డు చేయించారు. ఎన్సీఐఎస్ఎం నిబంధనలకు అనుకూలంగా.. ఎన్సీఐఎస్ఎం నిబంధనల ప్రకారం కళాశాలలో కొన్ని అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోధనపరంగా హయ్యర్, లోయర్లో 12 మంది టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లు తెలుస్తోంది. నాలుగు విభాగాల్లో అసలే ప్రొఫెసర్లు లేకపోవడంతో 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హై ఫ్యాకల్టీ పరంగా మరో మూడు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాన్టీచింగ్ పరంగా 71 మందికి 28 మంది, 87 మంది సిబ్బందికి 47 మంది, 23 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కళాశాలకు ప్రత్యేకంగా పరీక్ష హాల్, డిజిటల్ టైబ్రరీ, అంబులెన్స్ సదుపాయం లేదు. పదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టు భర్తీ కావడం లేదు. దీంతో బీఏఎంస్ సీట్లు పదిలంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది పరిస్థితి రాకూడదు.. గతేడాది కూడా ఈ పరిస్థితులు ఉండటంతో 14 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాల, వైద్యశాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతామని ఎన్సీఐఎస్ఎం అధికారులకు హామీ ఇవ్వడం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంతో యథావిధిగా సీట్లకు అనుమతించారు. ఇలాంటి లోపాలు ఈ విద్యా సంవత్సరంలో కూడా పునరావృతం కావడంతో మళ్లీ ఆయుర్వేద సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉనికిని కాపాడాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది 14 సీట్లు రద్దు.. తిరిగి సాధించుకున్న అధికారులు ఈ విద్యాసంవత్సరంలో కూడా కొన్ని గల్లంతయ్యే అవకాశం సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే కారణం తాజాగా ఎన్సీఐఎస్ఎం బృందం తనిఖీలు -
సరస్వతీఘాట్లో భారీ సెట్టింగ్
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు భారీ సెట్టింగులు వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఘాటుపై సరస్వతీమాత విగ్రహం, ప్లాట్ఫారంపై నాలుగు దిక్కులా తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల కింద నుంచి ఇసుకలో నీటి వరకు వెదురు పందిర్లు సుమారుగా 900 మీటర్ల పొడవునా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా అందులో నీటి తుంపర్లు నిత్యం పడేలా చల్లదనంతో కూడా నీడనిచ్చే విధంగా తయారు చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లి వచ్చే వరకు చల్లదనం అస్వాదించనున్నారు. హారతి వేదిక వద్ద ప్రముఖుల గ్యాలరీ, భక్తులకు గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. 40 టెండ్సిటీ టెండ్లు, మాడ్రన్ లుక్తో వేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఖాదీవస్త్రాలు, చేనేత వస్త్రాలు విక్రయించడానికి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగిసినప్పటికీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడం, బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో జరిగిన వివాహాలకు తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో సందడి నెలకొంది. ఆంజనేయస్వామి మాలధారుల మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తుల దీక్ష ముగియడంతో స్వామివారికి ఇరుముడి ఇచ్చి దీక్ష విరమించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో సైతం భక్తులు ఆలయానికి స్వామివారిని దర్శించుకునేందుకు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
● పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. ● కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు ● వర్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీసాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి వరంగల్లోకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద షెవర్ కింద స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, రామదేవి సేవలందించారు. -
అన్నదాతల్లో ఆందోళన
భూపాలపల్లి: ఆకాశంలో మబ్బులు ఉరుములు అన్నదాతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురిస్తే పంటంతా నీటి పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న, వరిపంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. జిల్లాలోని 12 మండలాల్లో 29వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా, 39,500 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. వరి 95,590 ఎకరాల్లో సాగు చేయగా, సుమారు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించి ఇప్పటి వరకు 165 కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాకు వర్ష సూచనలు రైతులు పండించిన ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తరలించగా, మొక్కజొన్న సగానికి పైగా కేంద్రాలకు వచ్చింది. సుమారు 15వేల ఎకరాల మొక్కజొన్న పంట ఇంకా కల్లాల్లోనే ఉంది. కంకి ఇరవడం, యంత్రాలతో కంకి పట్టించడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే జిల్లాకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున భూపాలపల్లి, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో మోస్తారు వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిశాయి. కొత్తపల్లిగోరి మండలంలో చిరు జల్లులు కురవగా పంట నష్టం ఏమీ జరగలేదు. దీంతో అక్కడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో మబ్బులు ఉరుముతూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చాక, అకాల వర్షం పడితే పంట తీవ్రంగా దెబ్బతింటుందని, కొనేవారే కరువవుతారని ఆవేదన చెందుతున్నారు. రైతులు ప్రతీరోజు రాత్రి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యంపై పరదాలు కప్పి, తెల్లవారుజామున తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం మూలంగానే ఈ పరిస్థితి ఎదురవుతుందని రైతులు వాపోతున్నారు. మబ్బులను చూస్తే భయమేస్తోంది.. నాకున్న 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన. వచ్చిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. వారం రోజులైతాంది. ఇంకా కాంటా పెట్టలేదు. మబ్బులను చూస్తే భయమైతాంది. వర్షం కురిస్తే మాత్రం ధాన్యం మొత్తం దెబ్బతింటది. ప్రతీరోజు రాత్రి ధాన్యం మీద పరదాలు కప్పి పొద్దన తీసేస్తాన. వర్షం బాగా వస్తే పరదాలు కూడా పని చేయవు. జొన్నలు మొత్తం తడిసి ముద్దయితవి. – నీరటి నారాయణ, రైతు, చిట్యాల ఉరుముతున్న మబ్బులు, చిరు జల్లులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న, ధాన్యం మోస్త్తరు వానలు ఉన్నాయంటున్న వాతావరణ శాఖ కురిస్తే మొక్కజొన్న, ధాన్యం నీటిపాలే..వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు.. ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగడం, మరోవైపు ప్రతీరోజు వర్ష సూచనలు కనిపిస్తుండటంతో పంట నీటి పాలు కాకూడదనే ఉద్దేశంతో కొందరు రైతులు పరకాల, వరంగల్ పట్టణాలకు ధాన్యాన్ని తరలించి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భా వించిన వ్యాపారులు మొక్కజొన్నను క్వింటాలుకు రూ.1,900కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరతో పోలిస్తే రైతులు ఒక క్వింటాకు రూ. 500 చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. -
డాక్టర్ శ్రీలతకు ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు
కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. -
విభజన హామీలు నెరవేర్చాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా జిల్లాలో అరెస్టు చేసిన సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి రంగాల్లో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించి వెలుగులోకి వచ్చిన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడాల్సిన పరిస్థితిలో ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు సమానమేనని, రాజకీయ హోదాలు లేదా ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయకూడదన్నారు. జ్యోతిర్లింగ దర్శనం కోసం.. కాళేశ్వరం: దేశంలోని జ్యోతిర్లింగ దర్శనం కోసం ఇద్దరు యువకులు సంవత్సర కాలంగా స్కేటింగ్తో ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణం 20 వేల కిలోమీటర్లు కాగా ఇప్పటికి 7వేల కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్కు చెందిన మనీష్, శంబూసింగ్ తెలిపారు. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం గొప్పగా ఉందని పేర్కొన్నారు. వేసవికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నామని తెలిపారు. వారి యాత్ర ఆదివారం కాళేశ్వరం చేరింది. కాళేశ్వరం క్షేత్రం గురించి తెలుసుకొని యాత్ర చేస్తున్నట్లు వివరించారు. స్వామిని దర్శించుకొని వెళుతామన్నారు. రోడ్డుపై స్కేటింగ్తో వస్తుంటే జనం ఆసక్తిగా తిలకించారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం చిట్యాల, టేకుమట్ల , మొగుళ్లపల్లి మండలాలకు సుమారు 35 కిలోమీటర్లు ఉందని.. దీంతో అగ్రిమాపక శకటం వచ్చే సరికి భారీ నష్టం జరుగుతుందని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. సమాచారం కోసం సంప్రదించాలి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వరకు జరుగు సరస్వతీ నది అంత్య పుష్కరాలకు సంబంధించిన సమాచారం కోసం కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని ఈఓ మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి సౌకర్యం కోసం 94910 18012, ఆర్జిత సేవలకు 94910 17012, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 94910 15252 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు జరిగే హోమంలో పాల్గొనే భక్తులు రూ.2వేలు ఒక రోజుకు దంపతులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దేవస్థానం నుంచి పూజాసామగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన తెలిపారు. నేటినుంచి ఎడ్యుకేషన్ వీక్ కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు విద్య వారోత్సవాలను మే 11 నుంచి 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్ వీక్లో మహదేవపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రినిపాల్ జున్ను విజయ్కుమార్ ఆదివారం తెలిపారు. కళాశాల హాజరు శాతం పెంచడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం, సృజనాత్మక స్కిల్స్ పెంచడం, కళాశాల కోసం ఫండ్స్ సమకూర్చడం, అభివృద్ధి, వివిధ రకాల సదుపాయం కోసం నిర్వహణ జరుగుతుంది. (నేడు) సోమవారం కళాశాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. -
గడువులోగా పూర్తయ్యేనా!
● 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు ● పనుల్లో నాణ్యత లోపిస్తుందని విమర్శలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. కాళేశ్వరంలో పురాతన విగ్రహాలు అమర్చడానికి రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం పనులు వేగిరంగా జరుగుతున్నాయి. ఈనెల 18 వరకు పూర్తి చేయాలని అఽధికారులు ఆదేశించారు. దీంతో వేగిరంగా పనులు చేస్తూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.30లక్షల వ్యయంతో నాగదేవాలయం నిర్మాణం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ఈ రెండు పనులపై రిటైర్డు డీఈ, ఏఈఈలు పర్యవేక్షణకు ఉన్నప్పటికీ గడువులోగా పూర్తయ్యేలా లేదు. క్యూరింగ్ కూడా సరిగ్గా జరుగడం లేదు. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులు కూడా నెమ్మదిగా ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరీక్షలు జరుపాలని భక్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో చూడకపోవడంతో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. పొలం గట్లు పొట్టు పొట్టు! పార్కింగ్ స్థలాల కోసం అధికారులు రైతుల పంట భూములను చదును చేయడం వివాదాస్పదమైంది. పడిదం చెరువు కింది ఆయకట్ట రైతుల సమాచారం ప్రకారం.. ముందస్తు సమాచారం లేకుండా డోజర్లతో గట్లు దున్ని భూములను చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలం గట్టు ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. భూములు దెబ్బతిన్న రైతులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. నష్టపరిహారంగా ఎకరానికి రూ.20 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
అనాథలకు అమ్మ
జఫర్గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
ఉచిత బాల్ బాడ్మింటన్ శిక్షణ
చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో ఉచిత (సమ్మర్ క్యాంప్) బాల్ బ్యాడ్మింటన్ శిక్షణను ఏర్పాటు చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఉడుత మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని అన్నారు. ఈ శిక్షణలో రన్నింగ్, వ్యాయాయంతో పాటు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెరువులో చేపల మృత్యువాతచిట్యాల: చైన్పాక గ్రామ శివారులోని పెద్దమ్మకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో 1.50 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు బండి నర్సయ్య కథనం ప్రకారం.. చెరువులో చేపలు మృతి చెంది పైకి తేలడంతో గ్రామస్తులు ముదిరాజ్ సంఘం నాయకులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు వెళ్లి పరిశీలించారు. కాగా, అదే ప్రాంతంలో పురుగుల మందు వాసన రావడంతో గమనించిన ముదిరాజ్ నాయకులు శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. చెరువులో విషం కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరారు. సభను విజయవంతం చేయండి ములుగు రూరల్: నేడు (ఆదివారం) సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వాసుదేవరెడ్డి, రాకేష్, ప్రమోద్రెడ్డి, రవీందర్, ప్రవీణ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ములుగు రూరల్: ఈ నెల 13న పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం శనివారం తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు, జాకారం బాలుర సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో కలిపి రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని తెలిపారు. విద్యార్థులు ఇటీవల డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో రావాలని.. వారి వెంట హెచ్బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్నర్లు తీసుకురావాలని తెలిపారు. వాహనం ఢీకొని గేదెలు మృతివెంకటాపురం(కె): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఐదు గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాత్రాపరం గామ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్లోగూడెం గ్రామానికి చెందిన రాంబాబు తన గేదెలను శుక్రవారం ఉదయం పాలెం వాగు సమీపంలోకి మేతకు తీసుకెళ్లాడు. రాత్రి గేదెలు ఇంటికి రాలేదు. శనివారం ఉదయం గేదెల కోసం వెతుకుతుండగా పాత్రాపురం పాలెం వాగు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది కనిపించాయి. పాత్రాపురం సర్పంచ్ బొగ్గుల పుష్పవతి సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. -
ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు సహకరించాలి
చిట్యాల: రైతుల పండించిన ధాన్యాన్ని మిల్లు యజమానులు గోదాములలో నిల్వ చేసుకునేందుకు సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. శనివారం మండలకేంద్రంలోని బాలమురగన్ కాటన్ మిల్లు వద్ద ట్రాక్టర్లలో మొక్కజొన్న ధ్యాన్యంతో వేచి ఉన్న రైతులను గమనించి వారి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిల్లును సందర్శించి యజమానితో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులో నిల్వలు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మండల నాయకులు, రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఇంటర్ ప్రవేశాలపై సందిగ్ధత
భూపాలపల్లి అర్బన్: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన మరుసటి రోజునే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు జోరుగా ప్రచారం పెంచి ప్రవేశాలు చేస్తుండగా.. ప్రభుత్వ కళాశాలలు మూసి ఉండటంతో పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉన్నా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ కాలేదు. జిల్లాలో 34 కళాశాలలు.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఐదు, కస్తూర్బా బాలికల విద్యాలయాలు 10, ఆదర్శ పాఠశాలలు ఆరు, ఇతర కళాశాలలు 13 ఇంటర్ విద్యను అందిస్తున్నాయి. ఇటీవల పదోతరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 3,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సగానికి పైగా విద్యార్థులు జెడ్పీఎస్ఎస్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాల్లో చదివిన వారే కావడం గమనార్హం. విద్యార్థులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తక్కువ ఫీజుకే ప్రవేశం కల్పిస్తామని ఆ తర్వాత అదనపు రుసుములను వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేయడం పేద విద్యార్థులకు నష్టం చేకూర్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల కాగా.. పలు కళాశాలల అధ్యాపకులు ఉత్సాహంగా మరుసటి రోజున ప్రచారబాట పట్టాయి. అదే రోజు సాయంత్రం ఆ షెడ్యూల్ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీచేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ప్రైవేట్ సంస్థలు ప్రచార జోరు పెంచడం ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను అయోమయానికి గురిచేస్తోంది. పాఠశాలలో విలీనం..? రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను విలీనం చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, సామర్ాధ్యలను గుర్తించి టెన్ ప్లస్ టూ విధానం అమలు చేసేలా విద్యా కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చర్చ జరుగుతోంది. పాత వర్సెస్ కొత్త విధానం ఈసారి ఆన్లైన్ విధానంలో ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ఉంటాయా? లేదా పాత పద్ధతిలోనేనా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంటర్ విద్యను పాఠశాల వ్యవస్థలో విలీనం చేయడాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం వ్యతిరేకిస్తోంది, దీనివల్ల ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జూనియర్ కళాశాలలు 34ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 5మోడల్ జూనియర్ కళాశాలలు 6ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 4ట్రైబుల్ వెల్ఫేర్ కళాశాలలు 2కేజీబీవీ కళాశాలలు 10సోషల్ వెల్ఫేర్ 2మైనారిటీ 1బీసీ వెల్ఫేర్ 4 పాఠశాల విద్యలో బోర్డు విలీనం 12వ తరగతి వరకు పాఠశాల విద్య ప్రభుత్వ కళాశాలల్లో అయోమయం -
నేటితో స్వీయ జనగణన ముగింపు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: స్వీయ జనగణన నేటితో ముగుస్తుందని, ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 2027 జనగణనలో భాగంగా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు నేటివరకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే సులభంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి సులభతరమని, నచ్చిన భాషను ఎంచుకొని వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్కు భూపాలపల్లి ఐడీఓసీ నుంచి కలెక్టర్తో పాటు డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికై ంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తోంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
12 రోజులు ఆధ్మాత్మిక శోభ
కాళేశ్వరం: ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో మారుమోగనుంది. గతేడాది జరిగిన సరస్వతీనది ఆది పుష్కరాల మాదిరిగానే 12రోజుల పాటు అంత్య పుష్కరాలకు రోజుకొక్కరు చొప్పున పలువురు పీఠాధిపతులు రానున్నారు. పలువురు ప్రవచన కర్తలు తమ సందేశాన్ని భక్తులకు వినిపించనున్నారు. ప్రతీ రోజు తిఽథుల ప్రకారం హోమాలు నిర్వహిస్తారని ఆలయవర్గాలు తెలిపాయి. ప్రతీ రోజు కాశీపండితులతో గోదావరి హారతి, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రతీ రోజు ప్రముఖులు పాల్గొంటారు. పీఠాధిపతులు వీరే.. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతీ రోజు పీఠాధిపతులు పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్, నాసిక్ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, శంకరాచార్య మహాసంస్థానం శ్రీ అద్వైతానంద భారతి, శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు రానున్నారు. ఆదిలాబాద్ పీఠం శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ,హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం పీఠాధిపతి బర్దీపూర్ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ రానున్నారు. విజయనగరం, కర్ణాటకకు చెందిన చింతామణి మఠం శివానంద భారతి చింతామణి స్వామి, చింతామణి మఠం, విశాఖపట్టణం శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, మెదక్ కోల్చారం మాధవానంద సరస్వతి రానున్నారు. ప్రవచన కర్తలు: 21 నుంచి 24 వరకు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాసీ్త్రతో పుష్కర వైభవ ప్రవచనం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. 23న మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు గారితో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. జూన్ 1న బ్రహ్మశ్రీ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చెబుతారు. ఆయా రోజుల్లో సాయత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహిస్తారు. 12 రోజులు హోమాలు ప్రపంచ శాంతి కోసం మహారుద్ర జప అభిషేక సహిత కామ్యార్థ హోమాలను ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఆలయ ఆవరణలో నిర్వహిస్తారు. 21న మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాఢాక్షరి హోమం (సంతానప్రాప్తి, శతృబాధ నివారణార్ధం), 23న హయగ్రీవ హోమం (సకల విద్యా ప్రాచ్యర్గం), 24న నవగ్రహ హోమం (నవగ్రహ ప్రసాద సిద్యర్థం), 25న మహామృత్యుంజయ హోమం (అనమృత్యుదోష నివారణార్థం),26న దుర్గ సూక్త హోమం (సకల ఐశ్వర్య ప్రాస్యర్ధం),27న మహా సుదర్శన హోమం (సకల దృష్టి దోష నివారణార్థం),28న మేద దక్షిణామూర్తి హోమం (మేద ధారణ సిద్యర్ధం), 29న స్వయంవర పార్వతి హోమం (శీఘ్ర వివాహ ప్రాష్యర్ధం), 30న విశాఖ దన్వంతరి హోమం (ఆయుఆరోగ్య ప్రాష్యర్ధం), 31న మహారుద్ర హోమం (అష్ట ఆశ్వర్య ప్రాష్యర్థం),జూన్1న లఘు చండీ, మహా పూర్ణాహుతి (సకల పాపక్షయార్థం) నిర్వహించనున్నారు. నదీ హారతి, తెప్పోత్సవం.. ప్రతీ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో నది హారతి కార్యక్రమం, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసిద్ధ నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆధ్యాత్మిక శోభతో కాళేశ్వరం వెలుగులు విరజిమ్మనుంది. 21నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు రోజుకో పీఠాధిపతి రాక రోజూ నదీహారతి, తెప్పోత్సవం నిర్వహణ -
స్వీయ జనగణనలో పాల్గొనాలి
భూపాలపల్లి: స్వీయ జనగణన కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నందున, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ జనగణన వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్ ఫోన్ సహాయంతో సులభంగా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. గత నెల 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 10తో ముగుస్తుందన్నారు. అనంతరం ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తారని వివరించారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల సమాన పంపిణీకి జనగణన కీలకమన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. కుటుంబ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, అవి కేవలం జనాభా లెక్కల కోసమే వినియోగించబడతాయని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రత్యేక ఎన్యుమరేషన్ ఐడీ ఇవ్వబడుతుందని, దీని ద్వారా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ స్వీయ జనగణనలో పాల్గొని జిల్లా, దేశ అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి రేగొండ: మక్కలు, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మండలంలోని లింగాల రైస్మిల్, రూపిరెడ్డిపల్లిలోని సహకార సంఘం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. రైస్మిల్, సహకార సంఘం భవనంలో ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎం రాములు, సహకార జిల్లా అధికారి వాలియ నాయక్, తహసీల్దార్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి చిట్యాల: మండలంలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. మండలంలోని దూత్పల్లిలో వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని మొక్కజొన్న, వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం వచ్చిన ధాన్యన్ని వెంటవెంటనే లారీలపైన ఆధారపడకుండా ట్రాక్టర్ల ద్వారా కూడా మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ గిడ్డంగి ని కలెక్టర్ రాహుల్శర్మ పరిశీలించి నిల్వల వివరా లు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఎస్ఓ కిరణకుమార్, డీసీఓ వాల్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మార్క్ఫెడ్ అధికారి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
వన్యప్రాణుల దాహం తీరేదెలా?
● అటవీలో నిరుపయోగంగా సాసర్ పిట్స్ ● వేసవిలో మూగజీవాలకు తాగునీటి కష్టాలుకన్నాయిగూడెం: మండే ఎండలకు వన్యప్రాణులు దాహంతో అల్లాడుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటికుంటలు (సాసర్పిట్స్) నిరుపయోగంగా మారాయి. కేవలం పేరుకు మాత్రమే సాసర్ పిట్స్ ఏర్పాటు చేశారని, వాటిలో నీటిని నింపడంలో అధికారులు చొరప చూపడం లేదని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. దాహం తీర్చుకునేందుకు దూరంలో ఉన్న నీటి కుంటలు, చెరువులు, రైతు పొలాల వద్దకు వెళ్తున్నాయి. దీంతో అదను చూసి వేటగాళ్లు వన్యప్రాణులను అంతం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఐలాపూర్, సర్వాయి అటవీ ప్రాంతంలో.. కన్నాయిగూడెం మండలం దాదాపు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఐలాపూర్, సర్వాయి, భూపతిపురం, చిట్యాల, తుపాకులగూడెం తదితర అటవీ గ్రామాల పరిధిలో సిమెంట్తో సాసర్పిట్స్ ఏర్పాటు చేశారు. వాటికి నీటి వసతి కోసం బోరు వేసి సోలార్ విద్యుత్తో మోటారు నడిచేలా ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. పనిచేయని సోలార్ పంపులు.. వన్యప్రాణుల దాహం తీర్చడానికి ఏర్పాటు చేసిన సాసర్పిట్స్ నీరులేక నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో సోలార్ విద్యుత్ పంపులు పనిచేయకపోవడంతో సాసర్పిట్స్ బీటలువారి ఎండిన ఆకులతో నీరు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సాసర్పిట్స్లో నీరు ఏర్పాటు చేయించాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. -
తాగునీటి వ్యధ
భూపాలపల్లి: వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీరు, ఇతర అవసరాలకు భూపాలపల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నల్లానీరు రోజు విడిచి రోజు వస్తుండటంతో బోర్లు లేని వారు గుక్కెడు నీళ్ల కోసం నల్లానీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. విలీన గ్రామాలనైతే పట్టించుకునే వారే కరువయ్యారు. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా సగానికి పైగా వార్డుల్లోని ప్రజలు తాగునీటి తిప్పలు పడుతున్నారు. అన్ని కాలనీలకు మిషన్ భగీరథ పైప్లైన్ ఉన్నప్పటికీ రోజు విడిచి రోజు నల్లానీరు వస్తుంది. ప్రధానంగా రాజీవ్నగర్, క్రిష్ణాకాలనీ, బాంబులగడ్డ, సీఆర్నగర్, మంజూర్నగర్తో పాటు విలీన గ్రామాలైన బెడ్డెలపల్లి, గడ్డిగానిపల్లి గ్రామాల వైపు రెండు రోజులకొకసారి మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక చేతి పంపులు, పవర్ బోర్లను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని కాలనీల్లో సొంతంగా పవర్ బోర్లు లేని వారైతే నల్లానీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉన్న నీటిని సర్దుకుంటూ నల్లానీటి కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాక మిషన్ భగీరథ నీటిని రాత్రి వేళలు, తెల్లవారుజామున వదులుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ నెల చివరలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్లు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ట్యాంకర్ను జిల్లా ప్రధాన ఆస్పత్రికి, మరో ట్యాంకర్ను జాతీయ రహదారి మధ్యలో నాటిన మొక్కలకు నీరందించేందుకు వినియోగిస్తున్నారు. గతంలో వేసవిలో మూడు, నాలుగు వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి ఎద్దడి ఉన్న కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. మిషన్ భగీరథ పథకం వచ్చిందనే కారణంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం లేదు. దీంతో పైప్లైన్ లీకేజీలు, విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం మహాముత్తారం మండలం కోనంపేట వద్ద చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భూపాలపల్లి పట్టణానికి రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బెడ్డెలపల్లిలో వ్యవసాయ బోరు నీటిని బాటిళ్లలో పడుతున్న లక్ష్మయ్య, బాంబులగడ్డలో నల్లానీరు రాకపోవడంతో బోరుకు పైప్లైన్ బిగిస్తున్న మహిళ వార్డులు 30 గృహాల సంఖ్య 17,220జనాభా (సుమారుగా) 80 వేలు వాటర్ ట్యాంకర్లు 2 చేతిపంపులు 25 పనిచేస్తున్నవి 24పవర్బోర్లు 109పనిచేస్తున్నవి 108 మిషన్ భగీరథ పైప్లైన్ 113 కిలోమీటర్లు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు 13,400రోజుకు అవసరమైన తాగునీరు 11 మిలియన్ లీటర్లు సరఫరా చేస్తున్నది 10.5 మిలియన్ లీటర్లు గొంతు తడుపుకునేందుకు తప్పని ఇబ్బందులు బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు పట్టించుకోని అధికారులు, పాలకవర్గం -
అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి
ములుగు రూరల్: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, డీఎఫ్ఓ వికాష మీనాతో కలిసి జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ప్రజా దర్భార్ ద్వారా ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని, అందులో వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, డ్రెయినేజీలు వంటి అత్యవసర పనులకే నిధుల ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు ప్రా రంభమయ్యే నాటికి వాటిలో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు ఉన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీఒక్కరూ పాటుపడాలన్నారు. ఆడపిల్లలను చదివించాలని, ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల వివాహాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేదింపులు, దత్తత విధానం, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. ఒలింపిక్ స్థాయికి ఎదగాలి క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన రెజ్లింగ్ కోచింగ్ సెంటర్ను కలెక్టర్ హేమంత్ సహదేవరావుప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
అకాలవర్షంతో అపారనష్టం
ఏటూరునాగారం: రైతులకు ప్రకృతి అపార నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం, ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఆరబోసిన ధాన్యం కింద నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో వాటిని బకెట్ల ద్వారా ఎత్తి పారబోస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చెల్పాక తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో రైతు ఒక్కో కష్టంగా మారింది. సరైన గోదాంలు, టార్పాలిన్లు లేక ఇబ్బంది పడ్డారు. నిర్వాహకులు కాంటాలు నిర్వహించి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం ఇబ్బందులు పడుతున్న రైతులు -
ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్తత
● వివాదంగా మారిన వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రం మంజూరునగర్ శ్రీ భూనీల వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్ర మాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్త వాతా వరణంలో జరిగింది. ఆలయ ఈవో మహేష్ ఆధ్వర్యంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉద యం నుంచే ఆలయ పరిసరాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ నాయకుల రాకపోకలు పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు.. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గండ్ర ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకముందే ఎండోమెంట్ కమిటీ నియామకం, ప్రమాణ స్వీకారం నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నా, అరెస్ట్ ఆలయం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు అంబేడ్కర్ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గండ్ర జ్యోతి అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
దళారులను ఆశ్రయించొద్దు
మల్హర్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచర్ల ఆధ్వర్యంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, సర్పంచ్లు చంద్రగిరి సంపత్, భుక్య రవీందర్, కొండ రాజమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మండల నాయకులు బడితల రాజయ్య, వేముల చంద్రమౌళి, చంద్రగిరి అశోక్, సమ్మయ్య, సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు, సిబ్బంది పాల్గొన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ సేవానాయక్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి, రమేశ్ మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, నాయకులు అన్నారెడ్డి, పెద్దన్న, అశోక్, మోహన్, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లిగోరి గ్రామానికి చెందిన చాపతి రమ ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇంట్లో నిల్వ చేసింది. సివిల్ సప్లై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు పెండింగ్ స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వడదెబ్బతో రైతు మృతి మొగుళ్లపల్లి: వడదెబ్బకు గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని బద్దంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బద్దంపల్లి గ్రామానికి చెందిన సామల రాజిరెడ్డి(65) తన పంట చేను వద్దకు వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటి చేరుకున్నాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ చేరుకునేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ ఉంది. రోజంతా ఎండలో పని చేయడంతో వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నైపుణ్యాధారిత శిక్షణ కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రామప్ప భూముల వేలంలో పెరిగిన ఆదాయం
వెంకటాపురం(ఎం): శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం (రామప్ప దేవాలయం) ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దేవస్థానం తరి భూములను రెండు పంటల కౌలు హక్కుల కోసం శుక్రవారం ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగిన వేలంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రామానుజపూర్ శివారు లక్ష్మీదేవిపేట పరిధిలోని 9–09 ఎకరాల భూమిని రూ.1.40లక్షలు, పాలంపేట గార్లగడ్డ పరిధిలోని 3–11 ఎకరాల భూమి రూ.1,10,000లకు, వెంకటాపూర్ శివారులోని 2–02 ఎకరాల భూమి రూ.32,500లకు కౌలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. గోవిందరావుపేట, రామానుజపూర్, బుద్దారం గ్రామాలకు చెందిన కొన్ని భూములు వేలంపాటకు రైతులు హాజరుకాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు ఈఓ భాస్కర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే రూ.44,500 అదనపు ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి బిల్లా శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా భూపాలపల్లి మండలం కొంపల్లి రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు వ్యవసాయ వినియోగం కోసం సౌర విద్యుత్పై దృశ్య–శ్రవణ ప్రదర్శన, వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు, సౌర ఆధారిత సాగునీటి పద్ధతుల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సతీష్, కొంపల్లి సర్పంచ్ సడల శ్రీకాంత్, కొంపల్లి తండా సర్పంచ్ నిర్మల, గూడాడ్పల్లి సర్పంచ్ దారురి శారద, భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుడు రమేష్, విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ అపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్పాం సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
నిఘా నీడలో..
అంత్య పుష్కరాలకు భద్రత కట్టుదిట్టంకాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరంలో సరస్వతినది అంత్య పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. గతేడాది మే 15నుంచి 26వరకు 12 రోజుల పాటు సరస్వతీనది ఆది పుష్కరాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 21 నుంచి సరస్వతి నదికి అంత్య పుష్కరాలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిరక్షణకు నిఘాను తీవ్రతరం చేయడానికి పుష్కరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుశాఖ సన్నద్ధమైంది. పుష్కరాల సందర్భంగా ప్రతీరోజు వీవీఐపీ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పీఠాధిపతులు రానున్నారు. వారికి భద్రత ఏర్పాట్లు చేపట్టనున్నారు. కాళేశ్వరం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున పోలీసులు 12 రోజుల పాటు అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, చోరీలు జరుగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ ఏమైనా ఘటనలు జరిగితే క్షణాల్లో కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేకపోయినప్పటికీ అనుమానితులను పసిగట్టడానికి వినియోగించనున్నారు. ప్రముఖుల రాకకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నా యి. అంత్య పుష్కరాల మొదటి రోజున సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు కంచి పీఠాధిపతి రానున్నట్లు సమాచారం. దీంతో భారీఎత్తున పోలీసులు కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేస్తున్నారు. 12 రోజుల పాటు పది మందికిపైగా పీఠాధితులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు స్నానాలు చేస్తారని అధికారుల ద్వార తెలిసింది. వీరితో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా స్నానాలు చేసేందుకు రానున్నారని వినికిడి. కాళేశ్వరంతో పాటు చుట్టుపక్కల శివారుల్లో సుమారు 250కుపైగా సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 12, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. దీంతో పాటు మొత్తం 25 లొకేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్రధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ధ మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్టు పరిసరాలు, మహారాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ‘కాళేశ్వరం’ 250పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్రూమ్ లక్షలాదిగా తరలిరానున్న భక్తజనంకాళేశ్వరం పోలీసుస్టేషన్లోనే కమాండ్ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల కోసం అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు వీక్షించడానికి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ఠాణాలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నేరనియంత్రణ చేయడానికి పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. 12 రోజులపాటు వీక్షిస్తూ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. నేర నియంత్రణలో భాగంగా 200లకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అంతర్రాష్ట్ర వంతెన నుంచి సరస్వతిఘాటు (వీఐపీ), ప్రధాన ఆలయం, ఆలయ పరిసరాలు, రహదారుల వెంట లొకేషన్లలో 250 సీసీ కెమెరాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించాం. కమాండ్ కంట్రోల్రూమ్ కాళేశ్వరంలో ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తాం. సుమారుగా 2వేలకు పైగా పోలీసులు బందోబస్తులో ఉంటారు. వాహనాలకు పార్కింగ్ స్థలాలు 250 ఎకరాల్లో సిద్ధం చేస్తున్నాం. -
గణన పకడ్బందీగా చేపట్టాలి
ములుగు:/ములుగు రూరల్: ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని స్థాయిల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తేదీలోపు వారికి మెటీరియల్ కిట్లు, గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 11వ తేదీ నుంచి ఇళ్ల గణనకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి సైతం శిక్షణ పూర్తి అయిందని వివరించారు. స్వీయ గణనకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి -
నేడు హనుమకొండలో మెగా జాబ్మేళా
భూపాలపల్లి అర్బన్: టాస్క్, డీఈఎఫ్టీ సంయుక్తంగా హనుమకొండలో నేడు(శుక్రవారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమలతో పాటు హైదరాబాద్కు చెందిన పలు ఐటీ కంపెనీలు, సేవారంగ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఎంపికై న వెంటనే నియామక పత్రాలు అందజేయనున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియ గురువారం పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ తెలిపారు. సంబంధిత బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించారు. అర్బన్ పరిధిలో మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా, మెప్మా విభాగపు అధికారి రాజేశ్వరి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల సందర్శన చిట్యాల: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న మొక్క జొన్న, వరి ధాన్యాన్ని డీసీఓ వాల్యూనాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందవద్దని ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫైడ్ అధికారి శ్రీదేవి, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, చిట్యాల సీఈఓ మొగిలి, సెంటర్ ఇన్చార్జ్, రైతులు పాల్గొన్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాలి మల్హర్(కాటారం): వన్యప్రాణుల రక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కాటారం రేంజ్ అధికారి స్వాతి అన్నారు. గురువారం మండలంలోని బొప్పారం, ప్రతాపగిరి గ్రామాల్లో రేంజర్ స్వాతి, సిబ్బందితో కలిసి వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడినా, హాని కలిగించినా, హతమార్చేందుకు ఉచ్చులు బిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవువుల్లో అగ్ని ప్రమాదాలు జరకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓలు హెచ్.సురేందర్, జె.శ్రీనివాస్, ఎఫ్ఎస్ఓలు పి.చంద్రశేఖర్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి కాళేశ్వరం: లాడ్జిల్లోకి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా, అనుమానం వచ్చిన వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లాడ్జ్ నిర్వాహకులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం కాళేశ్వరం పోలీస్స్టేషన్ పరిధిలోని లాడ్జ్ యజమానులతో డీఎస్పీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిర్వాహకులు కస్టమర్ల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఏ పని నిమిత్తం వచ్చారో కూడా తెలుసుకోవాలని సూచించారు. లాడ్జ్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని.. రిజిస్టర్, సీసీ కెమెరా పుటేజీలను అవసరమైనప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. నియమాలు పాటించని యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో మేలు
ములుగు రూరల్: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంలో ప్రభుత్వం సాగు భూముల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లను నియమించారు. ములుగు జిల్లాలోని పది మండలాల్లో వలంటీర్లను ఎంపిక చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం భూసార పరీక్షల నిమిత్తం పంట పొలాల్లో మట్టి నమూనాలను సేకరించనున్నారు. మట్టి పరీక్షలతో పోషకాల అంచనా భూసార పరీక్షల ఆధారంగా భూముల్లో పోషకాల మోతుదు తెలుస్తుంది. పోషకాలు తక్కువ ఉన్న నేలలను గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులు వాటిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు వీలుగా ఉంటుంది. భూమిలో భాస్వరం, నత్రజని, పొటాషియం, ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం శాతాన్ని గుర్తిస్తారు. భూమిలోని పోషకాల ఆధారంగా సాగు చేసేందుకు అనువుగా ఉన్న పంటలను సూచిస్తారు. ఎరువుల వాడకంలో మోతాదు సిఫార్సు చేస్తారు. దీంతో ఎరువుల వినియోగం, అధిక ఖర్చులను తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక పద్ధతులను అనుసరించి పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. 10 మండలాలు.. 287 రెవెన్యూ గ్రామాలు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 287 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లు 861 మందిని ఎంపిక చేశారు. కానీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్కు మాత్రమే శిక్షణ అందించారు. మిగితా వారికి అందించనున్నారు. శిక్షణ ఇచ్చిన ఒక్కో వలంటీర్కు వ్యవసాయ క్షేత్రాల ఎంపిక, మట్టి నమూనా సేకరణ విధానం, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వలంటీర్లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులతో కలిసి ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామానికి 10 శాంపిళ్లను సేకరించారు. ఇప్పటి వరకు వలంటీర్లు మొత్తం 2,862 మట్టి శాంపిళ్లను సేకరించి 2,854 శాంపిళ్లను వరంగల్లోని ల్యాబ్లకు పంపించారు. జిల్లాలో రైతులు వరి 1,07,700 ఎకరాల్లో సాగు చేయగా పత్తి 28,600 ఎకరాలు, మొక్కజొన్న 11 వేల 32 ఎకరాలు, మిర్చి 25 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా వలంటీర్లు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శిక్షణ క్షేత్రస్థాయిలో మట్టి నమూనాల సేకరణభూసార పరీక్షలతో రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని భూమికి, పంటకు అవసరమయ్యే ఎరువులను మాత్రమే వాడొచ్చు. భూమి స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసుకోవాలి. మే నెల చివరి వరకు మట్టి నమూనాలను సేకరిస్తాం. పరీక్షల అనంతరం రైతులకు వారి భూమి తత్వాన్ని వివరించి సాగు చేసుకోవాల్సిన పంటలను, వినియోగించే ఎరువులను వివరిస్తాం, దీంతో నత్రజని ఎరువుల విని యోగం తగ్గించడానికి వీలుగా ఉంటుంది. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడుతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. గురువారం ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్కు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడారు. జిల్లా పరిధిలోని మారుమూల గ్రామాల నుంచి పేద ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వస్తున్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు రోజులుగా బాత్రూమ్లకు నీటి సరఫరా లేకపోవడం, తాగునీటి కొరత తీవ్రంగా ఉండడం, డాక్టర్లు సమయానికి రాకపోవడం వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులలో సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, మడే సంతోష్, రంజిత్ పాల్గొన్నారు. -
నిర్మాణ పనులు గడువులోగా పూర్తిచేయాలి
● కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు రూరల్: కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను హేమంత్ సహదేవరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా, సమావేశపు గది, స్టేట్ బోర్డు, చాంబర్ లిస్టు టాయిలెట్స్, గార్డెనింగ్ సుందరీకరణ పరిశీలించారు. అనంతరం అధికారులకు, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సింగ్, ఏఈ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని మ్యాశ్చర్ లేకుండా కొనుగోలు చేయాలి. మూడెకరాలకు సంబంధించిన ధాన్యం రాత్రి కురిసిన వానకు తడిసింది. ఇది ఆరాలంటే చాలా సమయం పడుతుంది. అధికారులు మాశ్చర్ లేకుంగా ధాన్యాన్ని కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. – లలిత రైతు, కమలాపూర్ 60 టన్నుల వరకు తడిసిందని అంచనా అకాల వర్షానికి సుమారుగా 60 టన్నుల ధాన్యం తడిసినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశాం. రైతులు అధైర్య పడకుండా తడిసిన ధాన్యాన్ని ఆరబెడిలే కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లు కూడా వేగవంతం చేస్తున్నాం. అన్ని చర్యలు చేపడుతున్నాం. – రాములు, జిల్లా మార్కెటింగ్ అధికారి -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
● కల్టెర్ రాహుల్శర్మ కాళేశ్వరం/భూపాలపల్లి రూరల్: తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం మహదేవపూర్, సూరారం గ్రామాలలో.. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాల్లో పర్యటించి కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కాటారంలోని అన్నపూర్ణ పారా బాయిల్ రైస్ మిల్ తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అశోక్కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఎంపీడీఓ రవీందర్, పీఎసీఎస్ మాజీ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. -
వర్షార్పణం
జిల్లాలో కొనుగోలు వివరాలు.. కొనుగోలు కేంద్రాలు 185 ఇప్పటివరకు ప్రారంభించినవి 125 కొనుగోలు లక్ష్యం 1.60లక్షల టన్నులు ఇప్పటి వరకు కొన్నది 5,967 టన్నులు వర్షంతో కల్లాల్లో తడిసిన ధాన్యం కుప్పలు కాపాడుకునేందుకు రైతుల ఇబ్బందులు ధాన్యాన్ని ఆరబెడుతున్న అన్నదాతలు ఎండనుంచి ప్రజలకు ఉపశమనం -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: తహసీల్దార్లు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా.. లారీలు సమయానికి అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో లారీలు అందుబాటులో ఉండటం లేదని.. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహకార, డీఆర్డీఓలు పరిశీలించాల్సి ఉన్నా పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలుపై ప్రతి రోజు నివేదికలు ఇవ్వాలని డీఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, రవాణా అధికారి సంధాని, సహకార అధికారి వాలియానాయక్, డీఆర్డీఓ బాలకృష్ణ, వ్యవసాయ అధికారి బాబూరావు, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు, ట్రాస్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు. భూ భారతిలో అందిన ప్రతీ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ బాలకృష్ణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, హౌసింగ్ ఏఈ శ్రీకాంత్, ఎంపీడీఓలు, హాసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
హేమాచలక్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
● ఆనందోత్సాహాల నడుమ వసంతోత్సవం ● గజవాహనంపై లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల ఊరేగింపుమంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో గతనెల 27న అంకురార్పణతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) బుధవారం వసంతోత్సవంతో ముగిశాయి. ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి చీఫ్ ఫెస్టివల్ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థాన ఆలయ ఉపప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం పది రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని స్వయంభు స్వామివారికి, యాగశాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నవదంపతులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించారు. గజవాహనంపై ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారు(వనదేవత) ప్రాంగణం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ్నికులు, ఆలయ పూజారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహణ
భూపాలపల్లి అర్బన్: జిల్లా పోలీసుల వార్షిక మొబిలైజేషన్ శిక్షణలో భాగంగా వరంగల్ జిల్లా అమ్మవారిపేట ఫైరింగ్ రేంజ్లో బుధవారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరై.. అధికారుల ఫైరింగ్ను పరిశీలించి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు ఆయుధాలపై పూర్తి ప్రావీణ్యం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేడు సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల పనుల పురోగతిపైన గురువారం ఉదయం ఈఓ కార్యాలయంలో 10.30 గంటలకు అన్నీ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ బుధవారం తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. కోఆప్షన్ మెంబర్లకు అభినందన భూపాలపల్లి రూరల్: మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అభినందించి సన్మానించారు. కో ఆప్షన్ మెంబర్లుగా సజ్జనపు స్వామి, చల్లా రేణుక, ఎండీ అబ్దుల్ హఫీజ్, ఎండీ మిన్హాజ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు. 13నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలు తీవ్రమైన భారంగా మారాయని, వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, బూడిద తిరుపతి, ఎండియాకు పాషా, గోలి లావణ్య, పల్లెల రజిత, పొనగంటి లావణ్య, గడ్డం స్వరూప, గంప రాజు పాల్గొన్నారు. రావి ఆకుపై హీరో విజయ్ చిత్రం ఏటూరునాగారం: తమిళనాడు హీరో విజయ్ సీఎంగా ఎన్నిక కాబోతున్న శుభ సందర్భంగా రావి ఆకుపై విజయ్ బొమ్మను మండల కేంద్రానికి చెందిన డ్రాయింగ్ మాస్టర్ రమేశ్ గీశారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల డ్రాయింగ్ టీచర్ రమేశ్ వినూత్నంగా ఆలోచించారు. రావి ఆకుపై కాబోయే తమిళనాడు సీఎం విజయ్ చిత్రాన్ని అద్భుతంగా గీసి ప్రదర్శించారు. ఆయన ప్రతిభను స్థానికులు అభినందించారు. -
తడిసిన ధాన్యం
కాళేఽశ్వరం: మహదేవపూర్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. దీంతో మహదేవపూర్, సూరారం, ఎలికేశ్వరం, బొమ్మాపూర్లోని వరిధాన్యం కొసుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించిన కష్టం వరద నీ టి పాలైందని విలపిస్తున్నారు. మహదేవపూర్ డిగ్రీ కాలేజీ గ్రౌండులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వర్షపు నీరు చేరింది. దీంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానాతంటాలు పడ్డారు. సుమారుగా 1000 బస్తాలు తడిశాయి. వరద నీటితో అప్పుల పాలు యాసంగిలో అకాల వర్షం కురిసి అప్పుడు పంట నష్టపోయా. ఇప్పుడు మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.లక్ష వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టిన. మంగళవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అప్పులు ఎలా తీర్చాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. – గోస్కుల బొందయ్య, మహదేవపూర్, కౌలు రైతు -
ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి
చిట్యాల: రైతులు ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జూకల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రైతు సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులను అవలంబించి ఉద్యావన పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబురావు, డీసీఓ వాల్యూ నాయక్, భూపాలపల్లి ఏడీఏ రమేష్, ఏడు మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, హెచ్ఈఓలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీ ఓ జయశ్రీ, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.కాటారం ఆర్డీఓగా రవీందర్ మల్హర్ (కాటారం): కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీఓ) రవీందర్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ హైదరాబాద్కు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో కాటారం ఆర్డీఓగా రవీందర్ వచ్చారు. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలుములుగు: ఆయిల్పామ్ పంటసాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ములుగు అదనపు కలెక్టర్ సంపత్రావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంటలసాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో అంతర్గత పంటలను కూడా పండించవచ్చని తెలిపారు. దీంతో రైతులకు రెండు పంటల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒకసారి ఆయిల్పామ్ సాగుబడి చేస్తే 30 సంవత్సరాల వరకు నిరంతర పంట దిగుబడితో ఆదాయం వస్తుందని స్పష్టంచేశారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,069 మంది రైతులు 3,562.40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. ఒక ఎకరాకు ప్రభుత్వం రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజు, డీసీఓ రామ్మోహన్, కేఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండి సుధారెడ్డి పాల్గొన్నారు. వైభవంగా హేమాచలుడి నాగవెల్లి మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవతామూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మంగళవారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి నిత్యపూజ, సేవాకాలం, బాలభోగం నిత్యహోమం, చతుస్థానార్చన, ఉత్సవ మూర్తులకు నవకలశ అభిషేక పూజలు, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. -
ఆలకించండి!
జయశంకర్ భూపాలపల్లిబుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026పిల్లలకు పాఠశాలలు ముగిశాయి. వేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా సాక్షి నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.మంత్రివర్యా మీరైనాభూపాలపల్లి అర్బన్: ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతులు ప్రారంభించేందుకు 2025 –26వ విద్యాసంవత్సరానికి గతేడాది జూలైలో ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకానికి ఆదేశాలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు అమలు కాలేదు. అందుకు సంబంధించిన టీచర్లు, ఆయాలను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలోనైనా నియామకాలు చేపట్టి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తారని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దృష్టి సారించాలని కోరుతున్నారు. గతేడాది జిల్లాలో 55 పాఠశాలల ఎంపిక జిల్లాలోని 12 మండలాల పరిధిలో 55 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి ఆ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. చిన్నారులకు చదువు చెప్పేందుకు ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్తో పాటు పిల్లల కనీస అవసరాలు తీర్చేందుకు ఆయాను నియమించాలని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 55 మంది టీచర్లు, 55 మంది ఆయాలను నియమించాలని ఉన్నతాధికారులు భావించారు. జిల్లాలో 55 పాఠశాలల్లో 2025 – 26వ విద్యా సంవత్సరానికి టీచర్లు, ఆయాలను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు గతేడాది ఆగస్టు 22వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి నోటిఫికేషన్ జారీచేశారు. 28వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరించారు. ఈసారి విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో గత విద్యా సంవత్సరంలో అమలుకాకపోవడంతో ఈవిద్యా సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో నేరుగా అంగన్వాడీల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను తల్లిదండ్రులు పంపిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రీ ప్రైమరీ ప్రారంభిస్తారని విద్యార్థుల ప్రవేశాలు చేపట్టి ప్రీప్రైమరీ ప్రారంభించకపోవడంతో నూతన అడ్మిషన్ల పెంపుపై ఈసారి ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా వేసవి సెలవులకు ముందే నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రతీ పాఠశాలలో కనీసం 10 నుంచి 20 మంది వరకు చిన్నారులు చేరే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. రాజకీయ జోక్యం ప్రీప్రైమరీ టీచర్లు, ఆయాల ఎంపికకు విద్యార్హత, స్థానికత, వయస్సు సంబంధిత అర్హతలుగా నిర్ధారించారు. కాగా, ఆయా పాఠశాలల్లో తాము సిఫార్సు చేసిన వ్యక్తులను మాత్రమే నియమించాలని అధికార పార్టీకి చెందిన నాయకులు.. విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. తమ వారికి, పార్టీకి చెందిన వారికే అవకాశాలు కల్పించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దాంతో ఎంపిక ప్రక్రియపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలకు గతేడాది నోటిఫికేషన్ విడుదల జిల్లాలో నేటికీ చేపట్టని ఎంపిక ప్రక్రియ కలెక్టర్ వద్ద పెండింగ్లో ఫైల్? మరో నెలరోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంఎవరిదీ నిర్లక్ష్యం? రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా ఇతర జిల్లాల్లో గతేడాది నుంచే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే పలు జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు.. టీచర్లు, ఆయాల నియామకాల ప్రక్రియను చేట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఇప్పటివరకు పూర్తి చేయలేదు. విద్యాశాఖ అధికారులు తయారు చేసిన టీచర్లు, ఆయాల ఎంపిక జాబితా పారదర్శకంగా లేకపోవడంతో దాన్ని సవరించాలని ఆదేశించినట్లు తెలిసింది. రెండో జాబితాను తయారు చేసి కలెక్టర్ వద్దకు మళ్లీ పంపించినట్లు సమాచారం. జిల్లాలో నియామకాల జాబితా తయారీలో నిర్లక్ష్యంతో ప్రక్రియ ఆలస్యమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. -
15లోపు పుష్కరాల పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ఈనెల 15వ తేదీలోపు సరస్వతి అంత్య పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి సరస్వతి అంత్య పుష్కరాల పనుల పురోగతిపై రెవెన్యూ, పోలీస్, అటవీ, రవాణా, వైద్య, ఇరిగేషన్, అగ్నిమాపక, విద్యుత్, మత్స్య, ఆర్టీసీ, మిషన్ భగీరథ, దేవాదాయ, పీఆర్, కేఎంకే, తదితర శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భక్తులకు చలువ పందిళ్లు, బట్టలు మార్చుకునే గదులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి సరస్వతి ఘాట్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్అండ్బీ అధికారులు సంయుక్తంగా రహదారులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. వ్యర్థాల తరలింపునకు ట్రాక్టర్లు, బ్లీచింగ్ అందుబాటులో ఉంచాలని డీపీఓకు సూచించారు. బస్టాండ్ వద్ద విద్యుత్ సరఫరా, ప్రయాణికుల కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. హారతి, తెప్పోత్సవం కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. రెస్క్యూ టీములు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, రవాణా శాఖ అధికారి సంథాని, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, అగ్నిమాపక అధికారి సతీష్ కుమార్, డీపీఓ శ్రీలత, ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్అండ్బీ ఈఈ రమేష్, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి విజయ్ కుమార్, కాళేశ్వరం దేవస్థానం ఈఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.ఎండల తీవ్రత దృష్ట్యా ఆరోగ్యం జాగ్రత్త రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఆరోగ్యపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. వేసవి కాలంలో వడదెబ్బ సోకే ప్రమాదముందని, ఈ క్రమంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత వ్యాధులున్న వారు, కూలీలు జాగ్రత్తలు పాటించాలన్నారు. -
హెవీ డ్రైవింగ్ ధ్రువపత్రాల అందజేత
భూపాలపల్లి అర్బన్: హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తిచేసిన మహిళా ఉద్యోగులకు జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి మంగళవారం ధ్రువపత్రాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టైడ్స్ సంస్థలో నిర్వహించిన 30రోజుల శిక్షణలో కంపెనీ వ్యాప్తంగా ఎంపికై న 13 మంది పాల్గొనగా, భూపాలపల్లి ఏరియా నుంచి రేణుక, రమ్యశ్రీ, భార్గవి, అనూష హాజరై విజయవంతంగా శిక్షణను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మహిళలు సాంకేతిక రంగాల్లో రాణించడానికి ఇలాంటి శిక్షణలు దోహదపడతాయని తెలిపారు. శిక్షణ పొందిన వారికి భవిష్యత్లో డంపర్, మోటార్ ఆపరేటర్ వంటి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘ ప్రతినిధులు కవీంద్ర, రవీందర్, శ్యామ్సుందర్, మధుకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు.. ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ బంక్కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు.నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిధులు గులాబీమయమైన వరంగల్ నగరం కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని, సీఎం రేవంత్కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపులో విషం నింపేసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
రైతులు సేంద్రియ సాగుకు మొగ్గుచూపాలి
మల్హర్(కాటారం): రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయం సాగులో ముందుకెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో తిరుమల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులంతా అధునాతన సాగు మెలకువలు పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందేలా వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. అనంతరం మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్నాయక్, కాటారం సర్పంచ్ సడవలి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి స్నపనంకొలనులో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్న యాగ్నికులుమంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం (స్నపనం) మహానివేదన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. -
బస్స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలి
మల్హర్(కాటారం): కాటారంలో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానిప్రసాద్ను డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కోరారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు సోమవారం వరంగల్లో ఆర్ఎం, భూపాలపల్లి డీఎం సంబంధిత అధికారులకు కాటారం ప్రయాణ ప్రాంగణ స్థలం నిర్మాణంపై నాయకులు వినతి పత్రం అందించారు. కోర్టులో కేసు నడుస్తునందున రాష్ట్ర లీగల్ సెల్ను అప్రమత్తం చేసి క్లియరెన్స్ తెప్పిస్తే మంత్రి శ్రీధర్బాబు బస్స్టేషన్ నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు వివరించారు. బస్స్టేషన్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు ఆర్టీసీ నాయకులు లీగల్ సెల్ ద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్స్, టెండర్ ప్రాసెస్ వెంటనే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరి కుమార్, పున్నం రమేష్ పాల్గొన్నారు. -
ప్రజావాణికి 11 దరఖాస్తులు
మల్హర్(కాటారం): కాటారం సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ స్థాయిలోని కాటారం, మల్హర్, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల మండలాల నుంచి వివిధ సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చినట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతీ వినతిని ప్రాధాన్యంగా తీసుకోని నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు హరికృష్ణ సూచించారు. ఈ కార్యాక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు భూపాలపల్లి అర్బన్: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న నాన్–మైనారిటీ అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్ ఎదుట లాటరీ తీయనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాఠశాల ఆవరణలో, జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్, పాఠశాల ప్రిన్సిపాల్ సమక్షంలో దరఖాస్తులను పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు వెరిఫికేషన్ మొగుళ్లపల్లి: ఎస్సీ కార్పొరేషన్ 2025–26 రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈనెల 6న బుధవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సురేందర్గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారులు తమ ఆధార్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అన్ని ప్రతులతో హాజరుకావాలని కోరారు. అర్హత గల వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గంజాయి రవాణాదారుల అరెస్ట్ టేకుమట్ల: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బోర్నపల్లికి చెందిన మీనుగు వంశీక్రిష్ణతో పాటు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి సంతోష్, ఓడేడ్ గ్రామానికి చెందిన బీముని గణేష్ మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని ఆయా మండలాల యువకులకు విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం టేకుమట్ల మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో టేకుమట్ల రైతు వేదిక వద్ద వాహనాల తనిఖీలో వారి వద్ద 1.2కిలోల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గైకవాడ అమూల్య తెలిపారు. కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ సన్మానించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్ ఉన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్కుమార్గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
రేపటి నుంచి అథ్లెటిక్ పోటీలు
భూపాలపల్లి రూరల్: ఈనెల 6వతేదీ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు బుధవారం ఉదయం ఆరు గంటలకు జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సబ్ జూనియర్, జూనియర్స్, సీ్త్రలు, పురుషుల విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 10వ తేదీన హనుమకొండలో జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. -
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి: జిల్లాలో వరిధాన్యం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం పీక్ దశలో కొనసాగుతున్నందున అంతరాయాలు లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాలు శాఖ, సంస్థ, వ్యవసాయ, సహకార, డీఆర్డీఓ, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాల పట్ల థర్డ్ పార్టీ పరిశీలనకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 185 కేంద్రాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఐదు పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించామని, ఇప్పటివరకు 108 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. ఈ సీజన్లో మొత్తం 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, డీఏఓ బాబూరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. అకాల వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సివిల్ సప్లయీస్ అధికారులు పాల్గొన్నారు. 10 వరకు స్వీయ నమోదు డిజిటల్ విధానంలో ప్రతీ ఒక్కరు జనగణన స్వీయ నమోదు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జనగణన స్వీయ నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి జనగణన స్వీయ నమోదు ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 55 దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లా శాఖల అధికారులను ఆదేశించారు. డిజిటల్ విధానంలో స్వీయ నమోదు చేసుకోవాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
మక్కలు కొనేదెప్పుడు?
భూపాలపల్లి: అన్నదాతలకు ప్రతీ ఏటా ప్రతీ సీజన్లో ధాన్యం విక్రయించే విషయంలో బాధలు తప్పడం లేదు. వానాకాలం సీజన్లో సమయానికి వర్షాలు కురవకపోవడం, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను అధిగమించేందుకు యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే కొనే వారు కరువయ్యారు. మక్కల కొనుగోలుకు నిరీక్షణ.. జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు 29వేలకు పైగా ఎకరాల్లో ఈ యాసంగిలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. జిల్లా మొత్తంగా సుమారు 39,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొని.. ఇప్పటివరకు ఏడింటిని మాత్రమే ప్రారంభించారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో సైతం జొన్నల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం గన్నీ సంచులను అందించకపోవడమే కాకుండా రవాణా చేసే లారీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు చెందిన మక్కలను సైతం నిర్వాహకులు కొనలేని పరిస్థితి నెలకొంది. గన్నీ సంచులు మీరే కొనుగోలు చేసుకోవాలని, తర్వాత బిల్లులు చెల్లిస్తామని నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన.. మూడు రోజుల పాటు జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఇప్పుడు నీటి పాలైతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు వీస్తూ, ఉరుముల శబ్ధం రావడంతో రైతులు ఆందోళన చెందారు. చేసేది లేక కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలపై పరదాలు కప్పి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షం కురిస్తే మాత్రం మక్కలు దెబ్బతింటాయని, అప్పుడు కొనేందుకు ప్రభుత్వం సైతం కొర్రీలు విధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.గన్నీ సంచులు లేవు.. లారీలు రావు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ అకాలవర్షంతో ఆందోళనలో మొక్కజొన్న రైతులు -
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే
కాళేశ్వరం: సరస్వతీనది ఆది పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. అంత్య పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు వన్వే రూట్ ప్లానింగ్ చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్తో కలిసి కాళేశ్వరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వీఐపీఘాటు, సాధారణ ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, 250కి పైగా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. పోలీసుస్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించనున్నామని తెలిపారు. 12 రోజుల పాటు 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పలు షిప్టుల్లో ఉంటారన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కురిస్తే వాహనాలు దిగబడకుండా ఎరుపు నేలలను కూడా గుర్తించినట్లు తెలిపారు. గంగారం ఎక్స్రోడ్డు నుంచి కాళేశ్వరం మంథని గుండా కాళేశ్వరం వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్డు మీదుగా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్రోడ్డు నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం వస్తాయి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం మీదుగా యధావిధిగా కాటారం గుండా వరంగల్, కరీంనగర్ వైపునకు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలకు వన్వే లేదు. ఎప్పటిలాగే వచ్చి వెళ్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల గుండా వచ్చే వాహనాలు వంతెన వద్ద పార్కింగ్ స్థలాలకు చేరుకుంటాయి. అక్కడే పార్కింగ్ చేసిన తరువాత ఆటోలు, షెటిల్ బస్సులలో వెళ్లి స్నానాలు చేసి దర్శనం చేస్తారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దు వన్వే ద్వారా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అంత్య పుష్కరాలకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కాళేశ్వరం: ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 12 రోజుల పాటు తాగునీరు, మౌలిక వసతులు ఏర్నాటు చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ఉదయం నుంచి 10గంటలకు వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. ఈఓ మాట్లాడుతూ..ఆలయంలో భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేస్తామన్నారు. ప్రతీ రోజు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు వీవీఐపీలు, పీఠాధిపతులు రానున్నారని తెలిపారు. హారతి కార్యక్రమానికి కాశీపండితులు వస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట ధర్మకర్తలు సీతారాం, సీతయ్య, సత్యనారాయణ, సత్తయ్య, పద్మ, నర్సయ్య, అశోక్, దుర్గయ్య, శ్రీధర్రావు, శ్యామ్దేవుడా పాల్గొన్నారు. -
మక్కలు కొనుగోలు చేయడంలో విఫలం
రేగొండ: మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్మరించారన్నారు. గన్నీ సంచులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రైతు సదస్సు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంకం రాజేందర్, హమీద్, కానుగంటి శ్రీనివాస్, కడారి జనార్ధన్, పాపిరెడ్డి, రజినికాంత్, నగేష్, గౌస్పాషా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
గాలివాన బీభత్సం.. నేలవాలిన వరిపంట
మంగపేట : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చిరు జల్లులు పడగా కొత్తూరుమొట్లగూడెంలో గాలిదుమారం భారీగా వచ్చింది. దీంతో పలుచోట్ల కోత దశకు వచ్చిన వరిపైరు నేలవాలింది. మేల్ఫిమేల్ వరిపైరు సైతం నేలవాలడంతో వడ్లు రాలిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గాలివాన దాటికి గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఇళ్లలోని బట్టలు, గృహోపకర వస్తువులు తడిసిపోయాయి. ఉన్నతాధికారులు పంటనష్టంపై పరిశీలించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
నేడు సమావేశం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం(ట్రస్టుబోర్డు) నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు చైర్మన్ అవధాని మోహన్శర్మ అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల్లో చేయాల్సిన పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించుటపై చర్చించనున్నారు. పలు తీర్మానాలు చేయనున్నారని తెలిసింది. భద్రత ఏర్పాట్లపై.. కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసులతో సోమవారం(నేడు) సమావేశం నిర్వహించున్నారు. గతంలో ఇక్కడ పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది. 8, 9న జాతర మహోత్సవాలు పలిమెల: మండలంలోని నీలంపల్లిలో కొలువైన శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాలు ఈనెల 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ సేవా సమితి బాధ్యులు ఆదివారం తెలిపారు. 8న రాత్రి జాగారాలు, జానపద నృత్యాలు, సోన్నాయి మేలాల ఆటపాటలు ఉంటాయన్నారు. 9న ఉదయం సుప్రభాత సేవ, భక్తుల నదీ స్నానాలు, స్వామివారికి విశేష శాంతి కల్యాణం, పూజలు, మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ, సాయంత్రం రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సౌకర్యం, వసతి, రవాణా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చిట్యాల: మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడు మోరే ధర్మరాజు, సర్పంచ్ కాసు రమకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణం మూలంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అతి తొందరలోనే ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అందుగుల కుమార్, సట్ల స్వామి, కార్యదర్శి గుర్రం నరేందర్, కోశాధికారి జక్కే వెంకటేశం పాల్గొన్నారు. సంఘాల వైఫల్యంతోనే కష్టాలు భూపాలపల్లి అర్బన్: ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి కష్టాలు మొదలైనట్లు సింగరేణి కోల్మైన్ కార్మిక సంఘ్(బీఎంఎస్) కార్యదర్శి మాధవనాయక్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వాల విధానాలు, గుర్తింపు సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మండా రమాకాంత్, అప్పాని శ్రీనివాస్, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, శ్రీరాములు, ఓ లక్ష్మణ్, భాస్కర్, పని రమేష్, కటకం శ్రీనివాస్, మల్లేష్, రాజునాయక్, దేవర సమ్మయ్య, పునీత్ రావు, ప్రవీణ్, అడప రాజు, తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రవీందర్రెడ్డి, కిసాన్ సెల్ అధక్షుడు గోల్లపలి రాజేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
అడ్మిషన్ల వేట!
ప్రవేశాల కోసం ‘కార్పొరేట్’ విద్యాసంస్థల ప్రయత్నాలుమీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పించడానికి ఇప్పుడే సీట్ బుక్ చేసుకోండి. మరికొద్ది రోజులైతే ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.. అంటూ గత కొద్ది రోజులుగా వచ్చే విద్యాసంవత్సరం ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. పదో తరగతి ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులను కలిసి ప్రవేశాల ఎర వేస్తున్నాయి.భూపాలపల్లి అర్బన్: విద్యా వ్యాపారంలో పోటీ పెరగడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తమ సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో సింగరేణి పరిధి కార్మిక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను పలు రకాలుగా ఆకర్షిస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో సౌకర్యాలను వివరిస్తూ ఇప్పుడే చేరిపోవాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లోని పలు కాలేజీలను సందర్శించి వచ్చారు. ఇంకా చాలామంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటర్తో పాటు ఐఐటీ, నీట్, సివిల్స్ ఇతర ఉన్నత విద్య ప్రవేశాల శిక్షణతో సహా ఇంటర్మీడియేట్ విద్యను అందిస్తామని హామీలు ఇస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో అనేకమంది ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారని చెబుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లో ప్రచారం చేస్తున్నారు. ప్రవేశాలకు కమీషన్లు ఆయా సంస్థలు విద్యార్థుల అడ్మిషన్లను బట్టి కమీషన్లు ఇస్తున్నాయి. పీఆర్వోలను నియమించుకుని విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెబుతూ వాయిదాలు, ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యాసంస్థల్లో చదివితే భవిష్యత్లో అవకాశాలు మెరుగు పడతాయనే ఆశతో ఫీజులు చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారు. ఎక్కువగా హాస్టల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పదో తరగతికి మార్కులు అధికంగా వచ్చిన విద్యార్థులను వేరే కేటగిరీలో చేర్చుతూ తల్లిదండ్రులను మెప్పిస్తున్నారు. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మూడు వేలకు పైగా ఉండగా, ఇంకా అనేక మంది ఇతర జిల్లాల్లోనూ చదివారు. ఎక్కువగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్తోపాటు ఇతర నగరాల్లో ఉన్న సంస్థలు అడ్మిషన్లు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి కాలేజీల పరిస్థితి భిన్నంగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేక ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు స్కూల్ విద్యార్థులను సైతం చేరికకు ప్రైవేట్ విద్యాసంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రీ కిడ్స్ నుంచి మొదలు పది వరకు, ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ అంటూ అనేక స్కూళ్ల యాజమాన్యాలు ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి స్కూళ్లు మూతపడే పరిస్థితి వస్తోంది. సెలవులకు ముందు ప్రభుత్వ టీచర్లు అడ్మిషన్ల కోసం ప్రచారం చేసినప్పటికీ ప్రస్తుతం చేయడం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయి. జిల్లా విద్యార్థులే లక్ష్యంగా ప్రచారం సీట్ల కోసం ముందస్తుగానే ఫీజు చెల్లింపులు -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దేవతామూర్తుల వేదాశీర్వచనం తీసుకుంటున్న బ్రహ్మోత్సవాల యాగ్నికులు వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న యాగ్నికులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సదస్యం(వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని యాగ్నికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) కార్యక్రమాల్లో భాగంగా ఏడోరోజు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఉదయం ఆలయంలో స్వయంభు స్వామివారి నిత్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన, ఆలయ ప్రాంగణంలోని వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం), మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు హయగ్రీవ స్తోత్ర పారాయణం, హవనం, చతుస్థానార్చన, బలిహరణ, స్వామివారి కల్యాణ మండపంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, అమ్మవార్లకు సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, ఏడునూతుల ఈశ్వర్చంద్, అనిపెద్ది రాజీవ్శర్మ, యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరద్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహా చార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ న్యాతని సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఏడోరోజు హేమాచలక్షేత్రంలో సదస్యం వనదేవత (దైత)అమ్మవారికి స్నపనం -
తూకంలో పారదర్శకత పాటించాలి
టేకుమట్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో పారదర్శకత పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవారెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందన్నారు. తూకంలో లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పలు పనులకు శంకుస్థాపన బోర్నపల్లి గ్రామంలో గుట్టు మల్లన్న దేవాలయ నిర్మాణ పనులు, రామకృష్ణాపూర్ (వి)లో బీటీ రోడ్డు పనులు, వెలిశాల (కిష్టయ్యపల్లి) నుంచి రామకృష్టాపూర్(వి) వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెలిశాల నుంచి రాఘవాపూర్ గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు, పెద్దంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నీట్ ప్రశాంతం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు సిటీ నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 134 మంది విద్యార్థులకు 132మంది విద్యార్థులు హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 మంది విద్యార్థులకు గాను 232 మంది హాజరు కాగా ఎనిమిది మంది గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తనిఖీ చేసిన అనంతరం పరీక్ష హాల్లోని అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన నీట్ పరీక్షకు సకాలంలో హాజరుకాని వి ద్యార్థినిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన లావుడియా వీణ పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. మధ్యాహ్నం 1.30గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 1.40గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పోలీసులు పరీక్ష కేంద్రానికి అనుమతించకపోవడంతో బోరున విలపిస్తూ ఇంటికి తిరిగి వెళ్లింది. పరీక్షకు అనుమతించాలని ఇప్పటివరకు చదివిన చదువు వృథా అవుతుందని అధికారులను వేడుకున్నా పరీక్షకు అనుమతించలేదు. -
నేడు ప్రజావాణి
మల్హర్(కాటారం): నేడు(సోమవారం) కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నేడు సబ్కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యకు సంబంధించిన అంశంపై లిఖిత పూర్వక దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. యువత ఉద్యమించాలి భూపాలపల్లి అర్బన్: ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య భవనంలో ఆయన పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 1959 మే 3న స్థాపించబడిన ఏఐవైఎఫ్ నాటి నుంచి నేటి వరకు యువత హక్కుల కోసం పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తో ఆడుకుంటున్న పాలకులకు యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ‘అందరికీ పని–అందరికీ విద్య’ లక్ష్యం సాధించే వరకు ఏఐవైఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సులభంగా లభిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక నిరాశలో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని అన్నారు. మత్తు అలవాట్లకు దూరంగా ఉండి యువత తమ భవిష్యత్ను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్, సహాయ కార్యదర్శి కృష్ణ, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొన్నారు. -
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది. స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’... ఐదేళ్లుగా అపరిష్కృతం... ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1లోనే ఎల్ఆర్ఎస్ లాక్... 2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.మొత్తం దరఖాస్తులు (2020): 1,58,265ఫీజు చెల్లించినవి: 1,43,121జీడబ్ల్యూఎంసీ పరిధిలో: 96,000పెండింగ్ దరఖాస్తులు: 40 శాతం పైగా క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3 పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1 కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు జూలై 31 వరకు గడువు... పాత దరఖాస్తుదారులకే చాన్స్ ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు.. గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం ఇప్పటికీ పెండింగ్లో 40శాతం దరఖాస్తులు ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం, ఎఫ్టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించి , పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ఆధ్వర్యంలో కేయూ యువజన క్రీడోత్సవాలు ఇటీవల నిర్వహించగా.. శనివారం వర్సిటీలోని పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో విజేతలకు రిజిస్ట్రార్ రామచంద్రం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి ఇతర అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.భాస్కర్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎటిబిటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయాన్ని పండుగ చేశాం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: వ్యవసాయాన్ని పండుగ చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. జిల్లాలో 30వేల ఎకరాలకు భూమి హక్కులు లేక రైతుల ఇబ్బందులు పడుతున్నారని, సర్వే నిర్వహించి అర్హులైన ప్రతీ ఒక్కరికి భూ హక్కు పట్టాలిస్తామని తెలిపారు. సాదాబైనామా భూములకు కూడా పట్టాలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుందని తెలిపారు. నేతన్న భద్రత బీమా కింద ఇద్దరికి రూ.10 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. దత్తత సహాయ కేంద్రం హెల్ప్డెస్క్ ప్రారంభించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
పూర్తయ్యేదెప్పుడో?
● జిల్లా కేంద్రంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య ● ఇష్టారాజ్యంగా పార్కింగ్ స్థలాలు, వాకింగ్ పాత్లు కబ్జా ● ఇబ్బందుల్లో పాదాచారులు, వాహనదారులు భూపాలపల్లి: రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జంక్షన్ల అభివృద్ధి ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాపారులు రహదారులను సైతం కబ్జా చేస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డంతా మాదే.. పట్టణంలోని జాతీయ రహదారిలో ఉన్న వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి జయశంకర్ చౌరస్తా వరకు ఉన్న షాపులకు చెందిన పలువురు యజమానులు తమ సామగ్రిని పార్కింగ్ స్థలాలు, ఫుట్పాత్లపై ఉంచి ప్రదర్శిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు సైతం పార్కింగ్ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. మహిళలు, చిన్నారులు నడిచేందుకు స్థలం లేక జాతీయ రహదారిపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు పొడవునా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న పనులు భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సుభాష్కాలనీ రామాలయం వరకు బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.3.50 కోట్లు మున్సిపాలిటీ, రూ.4 కోట్లు ఆర్అండ్బీ నిధులు కేటాయించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొంతమేరకు మాత్రమే రోడ్డు నిర్మాణం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. దీంతో పట్టణంలోని రెడ్డికాలనీ, ఎల్బీ నగర్, సుభాష్కాలనీ, గాంధీనగర్, రాంనగర్ కాలనీతో పాటు విలీన గ్రామాలైన కాశీంపల్లి, గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, జంగేడు, వేశాలపల్లి తదితర గ్రామాల వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీ కళాశాల ఆవరణ సమీపంలో ప్రతీ గురువారం వారసంత జరుగుతుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పలు షాపుల యాజమానుల అభ్యంతరాల మూలంగానే పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కబ్జాలపై చర్యలు తీసుకుంటాం.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట షాపుల ఎదుట సైడ్ కాలువలు, ఫుట్పాత్లు, పార్కింగ్ స్థలాలపై వ్యాపారులు ఏర్పాటు చేసిన సామగ్రిని తొలగిస్తాం. వ్యాపారులకు నోటీసులు జారీ చేసి పాదాచారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. – ఉదయ్కుమార్, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ నత్తనడకన రహదారుల విస్తరణ పనులుఠాణా వైపు రోడ్డు విస్తరణ ఎప్పుడో.. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి క్రిష్ణాకాలనీ వైపు వెళ్లే రహదారి చాలా ఇరుకుగా ఉంది. ఆ రహదారిలో సింగరేణి జీఎం కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, పోలీస్స్టేషన్, అంబేడ్కర్ క్రీడా మైదానం, కేటీకే 6వ గనితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డు మీదుగా ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు అనేకమార్లు ఏళ్ల తరబడి ప్రకటిస్తున్నారు. అయినా పనుల ప్రణాళిక కూడా రూపొందలేదు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడమే కాక, అటువైపుగా హోటళ్లు, చికెన్ సెంటర్ల యాజమానులు డ్రెయినేజీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
దళారులకు విక్రయించి మోసపోవద్దు
మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్నాయక్, మహేష్కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. 12న తెలంగాణ జనసమితి ప్లీనరీ భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు, నామాల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధం చిట్యాల: చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని చిన్న వెంకన్న, గోపగాని రవీందర్, ఆరెల్లి కృష్ణమూర్తి, గోపగాని ఆనందం, మేరుగు ప్రభాకర్కు చెందిన మొక్కజొన్న పంటలు శనివారం ప్రమాదవశాత్తు కాలిపోయాయి. సుమారు 14 ఎకరాల్లో వేసిన పంట అగ్నికి ఆహుతి అయినట్లు బాధిత రైతులు విలపించారు. 120 పైపులు పూర్తిగా కాలిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఈప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. యువకుడి ఆత్మహత్య కాళేశ్వరం: తమ్మెట గుళికలు తిని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహదేవపూర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహదేవపూర్ గ్రామం నేతకానివాడకు చెందిన చిలుమల శ్రీనివాస్ (35)కు భార్యతో మనస్పర్ధలు ఉన్నాయి. సంవత్సరం క్రితం భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తుమ్మెట గుళికలు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు రామచంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎరువుల భారం..
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026● ఈ ఏడాది నాలుగుసార్లు పెంపు ● రైతన్నలపై అదనపు భారంకల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సన్మానం భూపాలపల్లి అర్బన్: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేశ్బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్ర, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రేయి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్హయ్యలాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు పాల్గొన్నారు. బుద్ధుడి బోధనలు ఆదర్శం మల్హర్(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్ అంబేడ్కర్ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతీఒక్కరు బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు. యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్. కొండన్న. తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేసినట్లు జేఏసీ జిల్లా చైర్మన్ బురుగు రవి తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు కీలక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు విజయలక్ష్మి, సుభాకర్రెడ్డి, కిరణ్కుమార్, సేవానాయక్, తిరుపతి, రామయ్య, శ్రీనివాసులు, దశరథం, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్లో బస్తాకు రూ.50.. ఈ యాసంగి సీజన్లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి రూ.300 పెంచడంతో రానున్న సీజన్లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సుమారుగా 96 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రైతులపై భారం.. గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 2లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్లకు కలిపి లక్షా 40వేల టన్నుల ఎరువులు ఉపయోగించనున్నారు. దీని ప్రకారం రైతులపై కోట్లలో భారం పడనుంది. పెరిగిన ధరలతో రైతులకు కష్టం.. పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు రెండు లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగుచేసే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని ఫర్టిలైజర్ షాపుల యాజమానులు చెబుతున్నారు. ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులపైనే భారం.. ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించేందుకు కృషిచేయాలి. ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి. – రాపాల రాజయ్య , రైతు, కొత్తపల్లి (ఎస్ఎం), భూపాలపల్లి మద్దతు ధర పెంచాలి..ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కానీ రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యానికి కూడా మద్దతు ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఎలవేని నర్సయ్య , రైతు, టేకుమట్లఘనంగా మేడే మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏరియాలోని యూనియన్ కార్యాలయాలు, బొగ్గు గనులు, ప్రధాన కూడళ్ల వద్ద సంఘాల నాయకులు జెండాలు ఎగరవేశారు. – భూపాలపల్లి అర్బన్ఎరువు పాత కొత్త పెంపు (50కిలోలు బస్తా) ధర ధర19–19–19 2.075 2,300 225 20–20–13 1,500 1,800 300 14–35–14 2,175 2,250 75 12–32–15 2.025 2,250 225 పొటాష్ 1.850 1.975 125 16–16–16 1,675 2,050 375 24–24–0 2,000 2,300 300 10–23–26 1,950 2,025 75 15–15–15–09 1,650 1,950 300 14–35–14 2,150 2,350 200 16–20–13 1,400 1,750 350 రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తరువాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016మంది అభ్యర్థులు -
హేమాచలుడి తిరుకల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాదన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. పట్టువస్త్రాలు అందించిన మంత్రి సీతక్క హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి మంత్రి ధనసరి సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ వీరస్వామి, ఉత్సవకమిటీ చైర్మన్ యరంగారి సురేష్, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దంపతులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ములుగు ఆర్డీఓ వెంకటేష్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్, టీఎస్ ఈజీసీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు అనిపెదిద రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, సీతారాములు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. 2027లో జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నాటికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. 2027లో జాతరతో పాటు, గోదావరి పుష్కరాల నిర్వహణ ఉండటంతో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆయా నిధులతో రోడ్లు, పుష్కరఘాట్ల అభివృద్ధితో పాటు నూతనంగా గ్రానైట్తో శాశ్వత నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా మన్నారు. జాతరకు ఆర్టీసీ బస్సులు అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలాల నుంచి గుట్టపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఎస్సై టీవీఆర్ సూరీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. శ్రీచక్రానికి అవమానం హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సాక్షిగా హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం యంత్ర శిలకు అవమానం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన చక్రాన్ని ఆలయ అధికారులు ప్రాంగణంలోని ఆర్చీ పక్కన పడేశారు. దాని పవిత్రతను తెలియని కొందరు అక్కడే పాదరక్షలు వదిలారు. ఇది చూసిన ఆంజనేయస్వామి భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని రావాలి. ● పన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు తీసుకురావొద్దు, ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల ● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ● మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు.జిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476నిబంధనలు అమలు.. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నీట్ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్ సందర్భంగా 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్ అన్నారు. -
ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ● స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మార్క్ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు, సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా.. ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో గోదాం, హమాలీ, రవాణా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి.. స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరుగనున్న స్వీయ జనగణన కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సీపీఓ జవహర్, ఆర్డీఓ హరిక్రిష్ణ, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ఏర్పాట్లు చేయాలి.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ సమావేశం నిర్వహించారు. ఫార్మర్స్ వీక్ కార్యక్రమం విజయవంతం చేయాలి.. ఫార్మర్స్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వంచారు. ఈ కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి
మల్హర్(కాటారం): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఈజీస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, రేగులాగూడెం సర్పంచ్ ఆమని సురేష్ అన్నారు. గురువారం మండలంలోని రేగులగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, సబ్సిడీ యంత్రాల పంపిణీతో రైతును రాజు చేయాలనే ప్రధాన సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంగోతి సుగుణ, డీసీసీ జనరల్ సెక్రెటరీ కుంభ స్వప్నరెడ్డి, అధికార ప్రతినిధి పంత కాని సమ్మయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమల సందీప్ పాల్గొన్నారు. -
విద్యుత్ వినియోగం.. ప్రమాద రహితం!
● నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు హన్మకొండ: విద్యుత్ వినియోగంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రత వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. 18 సర్కిళ్లకు నియమించిన నోడల్ అధికారులు వినియోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి విద్యుత్ భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాన కారణాలివే.. ● నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన, నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం. ● తెగిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి. ● తడి చేతులతో స్విచ్లు, పరికరాలు ఆపరేట్ చేయవద్దు. గృహాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ ఉండాలి. ● మీటర్లు, సర్వీస్ వైర్లు, స్విచ్ బోర్డులు మధ్యమధ్యలో తనిఖీ చేయించుకోవాలి. ● చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వాల్పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకర లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పాత వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఎలాంటి ప్రమాద సూచనలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. 24/7 పనిచేసే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి. – కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ మోటార్ స్టార్టర్ల వద్ద ఇన్సులేషన్ సరిగ్గా ఉండాలి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయొద్దు. విద్యుత్ లైన్లకు సమీపంలో నీటి పైపులు, లోహ పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. -
గ్రాడ్యుయేషన్.. కొత్త భవిష్యత్కు నాంది
కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్కు ఆరంభమని కాళోజీ యూనివర్సీటీ వైఎస్ ఛాన్స్లర్ డాక్టర్ రమే్శ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ వంటి పేరొందిన కళాశాల నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లి దండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్ల కోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్రెడ్డి కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు -
మళ్లీ పుష్కర శోభ
21నుంచి సరస్వతీనది అంత్యపుష్కరాలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో మళ్లీ వెలుగులు విరజిమ్మనున్నాయి. సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సుమారుగా 30లక్షల మంది భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కంచి పీఠాధిపతి, గవర్నర్ ప్రతాప్శుక్లా, సీఎం రేవంత్రెడ్డి ప్రారంభపూజల్లో పాల్గొననున్నారని సమాచారం. దీంతో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. సమన్వయంతో పనిచేస్తున్న శాఖలు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల విడుదల చేయగా.. అధికార యంత్రాంగం తాత్కాలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో బిజీగా ఉంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం, వీఐపీఘాటు వద్ద ప్లాట్ఫామ్ పనులు, రూ.2కోట్ల వ్యయంతో నల్లగొండ పోచమ్మ గుడి నుంచి వీఐపీఘాటు వరకు రోడ్డు పనులు, ఆదిముక్తీశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు, వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 12 రోజులు హారతి కార్యక్రమాలు.. గతేడాది జరిగిన సరస్వతి ఆదిపుష్కరాల్లో నిర్వహించిన కాశీపండితులతో మళ్లీ అంత్య పుష్కరాలకు గోదావరివద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఎనిమిది మంది బృందంతో హారతి శోభతో వెలిగిపోనుంది. వారి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఆలయంలో హోమాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. 12 రోజుల పాటు రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతులు.. ఆది పుష్కరాల మాదిరిగానే అంత్యపుష్కరాలకు పలువురు పీఠాధిపతులు రానున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. వారి రాకకోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 12 రోజుల పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పుణ్యస్నానాలు చేయనున్నారు. ఆలయంలో దర్శనాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరంలో గొప్పగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.198 కోట్ల వ్యయంతో రాతి కట్టడాలు నిర్మాణం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా పుష్కరాలకు మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో మరోమారు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక కానుంది. రూ.21.38కోట్ల నిధులు మంజూరు.. పనులు చేపట్టిన ప్రభుత్వం 12 రోజులు హారతి, హోమాలు, పీఠాధిపతుల రాక ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం లక్షలాదిగా తరలి రానున్న భక్తులురాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అంత్యపుష్కరాల వాల్పోస్టర్, టీజర్ వీడియోను ఆవిష్కరించారు. దీంతో విస్తృతంగా పబ్లిసిటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. 100 ఎకరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అంతర్రాష్ట్ర వంతెన, వీఐపీ ఘాటు సమీపం, ఎస్సీకాలనీ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీమాత విగ్రహం వద్ద డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టనున్నారు. -
పోచమ్మ తల్లికి బోనాలు
భూపాలపల్లి: పట్టణంలోని సుభాష్కాలనీ పోచమ్మ దేవాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్ఠాపన చేసి ఏడాదయిన సందర్భంగా బుధవారం సాయంత్రం అమ్మవారికి అభిషేకం, గురువారం ఉదయం హోమం, పోత లింగన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. సాయంత్రం సుభాష్కాలనీ, రాంనగర్ కాలనీ, మిలీనియం క్వార్టర్స్కు చెందిన మహిళలు పెద్దఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆయా కార్యక్రమాల్లో 29, 17వ వార్డుల కౌన్సిలర్లు గండ్ర హరీశ్రెడ్డి, బీర్తి కమల, మాజీ జెడ్పీటీసీ లట్ట రాజబాబు, ఆలయ కమిటీ సభ్యులు రాజమౌళి, చిట్టిబాబు, ప్రసాద్, రాజేందర్ పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
భూపాలపల్లి: ఏఆర్ ఎస్ఐ అల్లం వేణుగోపాల్, జిల్లా పోలీసు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ బందెల కిష్టయ్యలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్, కిష్టయ్యలను అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ పూలమాల, శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ శాఖలో 36 సంవత్సరాల పాటు నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలు అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. వారి సేవలు శాఖకు ఆదర్శప్రాయమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ రత్నం, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్కుమార్, డీపీఓ ఏఓ ఫర్హాన, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
శోభాయమానం.. పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులు, బంతులు, చామంతులు, కనకాంబరాలు తదితరపూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు. -
ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
● సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ఆదేశించారు. బుధవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు. డైరెక్టర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్స్–2026లో జరిగిన కీలక మార్పులు, ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో నమోదైన ప్రమాదాలు, వాటి కారణాలు, నివారణ చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని గనుల అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ గత సమావేశ నిర్ణయాల అమలు స్థితిని సమీక్షించిన అధికారులు, కొత్తగా తీసుకొచ్చిన సేఫ్టీ సవరణలు గనుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. భద్రతా ప్రమాణాల అమలు విధానం, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. గతంలో జరిగిన ప్రమాదాలపై విశ్లేషణ చేస్తూ, మానవ తప్పిదాలు, యంత్రాంగ లోపాలు, భద్రతా నిబంధనల నిర్లక్ష్యం తదితర ప్రధాన కారణాలను గుర్తించారు. భవిష్యత్లో ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, కార్మికులకు నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతీ ఉద్యోగి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సంస్థలో సేఫ్టీ సంస్కృతి బలపడాలని, జీరో ప్రమాద లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఓసీ త్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ భిక్షమయ్య, గనుల మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన
మొగుళ్లపల్లి : మండలంలోని వివిధ గ్రామాల బాలికలకు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి.మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచేలా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎస్సై సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ నవత, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డి నేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిల ర్ మాధవి, అనూష, మమత, కళావ తి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇ బ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నా రు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు
భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, పిక కిరణ్, కాసర్ల ప్రసాద్రెడ్డి, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, ఐత్య బాబు, రాళ్లబండి బాబు, జయశంకర్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
● ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం ● నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు చాన్స్ ● ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్ వారిని శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
98.36 శాతం ఉత్తీర్ణత
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఫలితాల్లో వెనుకబడి ఉన్న జిల్లా ముందువరుసలో ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ మాసం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షల షెడ్యూల్ సీబీఎస్ఈ తరహాలో తయారు చేసి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించారు. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఏర్పడింది. ఫలితంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలించింది. సంవత్సరాల వారీగా ఫలితాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 122 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 3,541 మంది విద్యార్థులకు గాను 3,483 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 1,750 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1,708 ఉత్తీర్ణత సాధించారు. అలాగే 1,791 బాలికలకు 1,775 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 58 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫలించిన ప్రత్యేక తరగతులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్ష ఫలితాలు 100 శాతం సాధించే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఇందులో భాగంగా 2025 నవంబర్ నుంచి పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు నిర్ణయించిన వాటి కంటే అదనంగా టెస్టులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అభ్యాసదీపిక పేరుతో ముఖ్యమైన ప్రశ్న, జవాబులతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోని ప్రతీరోజు ఉదయం 4 గంటల నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి నిద్రలేపించడం, చదివించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెరుగుతూ.. తగ్గుతూ.. జిల్లాల పునర్విభజన తర్వాత 2016–17 సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో 14 స్థానం, 2017–18లో 5వ స్థానం, 2018–19లో 7వ స్థానాల్లో నిలిచింది. 2019–20, 2019–21వ సంవత్సరానికి కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. 2021–22లో 8, 2022–23లో 5వ స్థానం, 2023–24లో 16వ స్థానం, 2024–25 22వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11వ స్థానానికి పెరిగింది. ఈ ఏడాది 58 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా వీరిలో ఎక్కువగా తెలుగు, గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల నుంచి టెన్త్ ఫలితాల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో రావడం సంతోషకరం. వందశాతం ఫలితాల లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ గణపురం: మండలంలోని గాంధీనగర్ మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఎస్.వేదిత 579 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఎం. లక్ష్మిప్రసన్న 576, కే. అర్చన 573, బి.వైష్ణవి 570, సాయిప్రియ 569, ఏ.రోజా 568 మార్కులు సాధించారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయఽశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, గోవిందహరి, కృష్ణవేణి, రామకృష్ణారావు, ఈఓ మహేష్, దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, అర్చకులు పణీంద్రశర్మ, శరత్చంద్ర, ధర్మకర్తలు శ్యామ్, పద్మ, అశోక్, సత్త య్య, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు పుష్కరాల వాల్పోస్టర్ ఆవిష్కరణ -
వైద్య కళాశాలలో అవగాహన
భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మెడికల్ కళాశాలలో షీ టీం– భరోసా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, లింగ సమానత్వం, బాలల రక్షణ, మహిళలపై వివక్ష, హింసాత్మక చర్యలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 1930, 1098 నంబర్లను సంప్రదించాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు భూపాలపల్లి షీ టీంను 87126 58162 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని షీ టీం ఎస్ఐ మహ్మద్ ఫజల్ ఖాన్, భరోసా ఎస్ఐ స్వప్న కుమారి సూచించారు. మే డేను విజయవంతం చేయాలి భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన మే డేను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ వరంగల్, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు రాజేందర్, రాయిశెట్టి సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడుల రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినం మేడే వీరుల త్యాగ ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింగం, నవీన్, సమ్మయ్య పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్మన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ దేవుల పల్లి విజయ్కుమార్, వంగపండ్ల రవి పాల్గొన్నారు. -
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జాగ్రత్తలు
భూపాలపల్లి అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి అఽధికారులు జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రసునాంబ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి మండలంలోని బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కీలక సూచనలు జారీ చేశారు. 2025–2002 ఓటరు జాబితాలో షిఫ్టింగ్, డబుల్, డెత్ కేసులను గుర్తించి సంబంధిత జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఓటర్ల విషయంలో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఫారం–7 దరఖాస్తులు సమర్పింపజేయాలని సూచించారు. బీఎల్ఓ యాప్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాలను సమగ్రంగా మ్యాపింగ్ చేసి, నమోదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి, ఓటరు జాబితా శుద్ధిని ఖచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, డీటీ అంజలిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల సంఘం పరిశీలకులు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో పలువురు రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తాలు పేరుతో కటింగ్ చేస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. మిల్లర్ల కటింగ్లతో ఒక్కో లారీకి రూ.30వేల నుంచి రూ.40వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు మించి కటింగ్ చేయడం అన్యాయమన్నారు. కటింగ్లను వెంటనే నిలిపివేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రామస్వామి, నరసింహ నాయక్, సాంబశివుడు, సుధాకర్ రెడ్డి, చందూలాల్, సదానందం, సాంబయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. తాలు పేరుతో కటింగ్లకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లు నిరసిస్తూ ఎన్హెచ్పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో -
తాగి నడుపుడు.. పోలీసులకు దొరుకుడు
భూపాలపల్లి: ఆ సెంటర్లో పోలీసోళ్లు ఉంటరు.. బండి ఈ సందులో నుంచి పోనియ్యి... అరె అక్కడ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు.. బైక్ ఇక్కడే ఆపు. కొద్దిసేపు ఆగి, పోలీసులు వెళ్లాక వెళ్దాం.. మద్యం సేవించి వాహనం నడిపే వారు ప్రతీ రోజు తీసుకునే జాగ్రత్తలు ఇవి. మందు తాగి వాహనం నడపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా, పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ప్రతీ రోజు ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనం నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రంకెన్ డ్రైవ్ వలన జరిగే ప్రమాదాలు, అనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నాం. వాహనదారులు తమ బాధ్యతను గుర్తించి మద్యం సేవించి వాహనం నడపొద్దని మా సూచన. – సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ గడిచిన మూడు నెలల కాలంలో (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 90 రోజుల వ్యవధిలోనే పోలీసులు 344 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సగటున రోజుకు సుమారు నలుగురు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఇప్పటివరకు 142 మంది వాహనదారులు కోర్టు ముందు హాజరుకాగా, వారికి న్యాయస్థానం రూ. 1,50,360 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు, ఒకరికి జైలు శిక్ష కూడా విధించింది. మిగిలిన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ●డ్రంకెన్ డ్రైవ్ వలన జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడికి మాత్రమే కాక రోడ్డుపై వెళ్లే అమాయకులు కూడా బలి అవుతున్నారు. ఇంటి యజమాని మత్తులో చేసే చిన్న పొరపాటుతో భార్యాపిల్లలు అనాథలవుతున్న ఉదంతాలు జిల్లాలో అనేకంగా ఉన్నాయి. పోలీసులు ఎంతో ఓపికతో నెలలో నాలుగైదుసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మూడు నెలల్లో 344 కేసులు ఒకరికి జైలు శిక్ష, 142మందికి జరిమానాలు మందుబాబుల్లో కానరాని మార్పు -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల క్షేత్రంలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం గరుడాదివాసం కార్యక్రమాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండోరోజూ కార్యక్రమంలో భాగంగా ఆల య ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని పంచముఖాంజనేయ స్వామి వారి కి స్నపనం (అభిషేకం) పూజలు నిర్వహించారు. యాగశాలలో పూజలు యాగశాలలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సేవాకాలం, బాలబోగం నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా వైనతేయ లేఖనం (గరుడ) గరుడ చిత్రపటం వేసి ఆవాహనం పూజలు నిర్వహించారు. నేత్రోన్మీలన, గరుడాదివాసం, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభు స్వామివారికి వేదమంత్రోశ్చరణతో ప్రత్యేక అర్చనలు జరిపించి వెండి కవచం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్ శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయమైన ఘటనలు తలెత్తకుండా నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామికి స్నపనం స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆభరణాల అలంకరణ -
– సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. కిన్నెర గుంశావలి (ఫైల్)విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ను సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాన్ని జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులు వేసవి సెలవులను సమర్థంగా వినియోగించుకుని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. క్యాంప్లో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ క్రీడల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మే 22వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుందని, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని వివరించారు. క్రమబద్ధమైన శిక్షణతో పాటు క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు హుస్సేన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు.జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి -
పుస్తకాలొచ్చాయ్..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన డిపోకు చేరుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలు అందజేయనున్నారు. ఈ మేరకు 1.48లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి జూన్ మాసంలో బడిబాట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా పంపిణీ.. జిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా మండలాల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలిస్తారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు పంపించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. 1,48,880 పుస్తకాలు అవసరం ఉండగా 90,320 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన పుస్తకాల డిపోకు చేరుకోగా మండలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పార్ట్–2లో 42వేల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అక్టోబర్ మాసం వరకు మిగితా పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నోట్ పుస్తకాలు సైతం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచితంగా నోట్ పుస్తకాలు అందిస్తుంది. ప్రతీ సబ్జెక్ట్కు ఒక్క నోట్స్ చొప్పున అన్ని సబ్జెక్ట్లకు అందించనున్నారు. ఈ నోట్ పుస్తకాలు కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య అధారంగా పాఠశాలకు పంపిస్తారు. 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించనున్నారు.జిల్లాకు ఇప్పటికే 60శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మిగితా పుస్తకాలు కూడా ఈ వారం రోజుల్లో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను భద్రపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపిస్తాం. – బానోత్ సమ్మయ్య, పుస్తకాల డిపో మేనేజర్●జూన్ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ప్రతీ విద్యార్థికి పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయిలో సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందజేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ప్రాథమిక పాఠశాలలు 319 విద్యార్థుల సంఖ్య 24వేలు జిల్లాకు చేరిన 60 శాతం పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో 24వేల మంది విద్యార్థులు -
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొడవటంచ ఆలయ సందర్శన రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ సెషన్ జడ్ఙి రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది. కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పండ్లు సమర్పించారు. వీరితో పాటు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం పాల్గొన్నారు. -
రామప్పలో అధికారుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) అధికారులు సోమవారం సందర్శించారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈడీ ఎస్కే.గుప్తా, జేఈ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎంలు ఉమేష్కుమార్, పర్వింద్ర తివారి, వాసీమ్, ఏజీఎం గోపాలకృష్ణ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారికి స్వామివారి శేషావస్త్రాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకల సంపద బాగుందని వారు కొనియాడారు. అలాగే రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన ఎడ్నోల్స్ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
నీట్ ప్రశాంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నీట్ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ.. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో 374 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, డిగ్రీ కళాశాలలో 240 మంది, జూనియర్ కళాశాలలో 134 మంది హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీటీఓ సంధాని, డీఈఓ రాజేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నోడల్ అధికారి రమణారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. యాంటి డ్రగ్స్పై అవగాహనకు కార్యాచరణ.. జిల్లాలో బాలల సంరక్షణ, మహిళా శ్రేయస్సు, యువతలో యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన పెంపు లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో చిల్డ్రన్స్ వీక్ కార్యక్రమం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మళ్లీశ్వరి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 73 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్లపర్వం తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లేఅవుట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడిన మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
పెట్రోల్, డీజిల్.. నో స్టాక్
రేగొండ/చిట్యాల/మొగుళ్లపల్లి: రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్, డీజీల్ కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు టిన్నులతో బంకుల వద్ద క్యూలైన్లు కట్టారు. దీంతో సాయంత్రం వరకు ఆయా బంకుల ముందు తాళ్లు కట్టి, నోస్టాక్ బోర్డు పెట్టి బారికేడ్లు పెట్టారు. చిట్యాల మండలంలోని చిట్యాల, చల్లగరిగ, జూకల్, కొత్తపేట గ్రామాలలోని పెట్రోల్ బంక్లలో డీజిల్, పెట్రోల్ లేక వాహనాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాదారులు బంకుల వద్దకు రాగానే నో స్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులు కంగుతిన్నారు. మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం జనాలు బారులుదీరారు. డీజిల్ కోసం పెద్దఎత్తున క్యాన్లు పట్టుకొని బంకుల వద్ద భారీ క్యూ లైన్లో నిలబడ్డారు.● ఇబ్బందుల్లో వాహనదారులు ● జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత భూపాలపల్లి: జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 43 పెట్రోల్ బంకులు ఉన్నాయి. బంకుల్లో సోమవారం ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొరత విషయం తెలుసుకున్న వాహనదారులు సాయంత్రం పలు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరారు. దీంతో ఆయా బంకుల్లో సైతం పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ అయ్యాయి. యుద్ధం కారణంగా కొరత ఏర్పడిందని తెలుస్తోంది. పెట్రోల్ బంకుల యజమానులు ముందస్తుగా ఇండెంట్ పంపినప్పటికీ చమురు కంపెనీల నుంచి ఇంధనం రావడానికి రెండు, మూడు రోజులు పడుతుందని ఓ పెట్రోల్ బంక్ యజమాని తెలిపారు. సాధారణంగా నాలుగు రోజుల పాటు విక్రయించే స్టాక్ ఒక్కరోజే అయిపోయిందని సదరు పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు జిల్లాలోని ఒక్క బంకులో కూడా పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రక్షణ పరికరాలు అందజేయాలి
భూపాలపల్లి అర్బన్ : నూతనంగా సింగరేణి ఉద్యోగంలో చేరిన కార్మికులకు రక్షణ పరికరాలు (బూట్లు, టోపీలు) తక్షణమే అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలు లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాజమాన్యం స్పందించి తక్షణమే రక్షణ కిట్లను అందజేయాలన్నారు. క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజేపల్లి సుధాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటు మల్హర్(కాటారం): రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపూర్ క్రాస్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పోలీసులు సూచిస్తున్నారు. బకాయిలు విడుదల చేయాలి భూపాలపల్లి అర్బన్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నేడు (సోమవారం) కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం, 28న విద్యార్థులతో కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా ఫిర్యాదు చేయడం, 29న జిల్లాలోని డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు మాడ హరీశ్రెడ్డి, యుగేంద్రాచారి, ఆకుదారి మనోహర్, వంశీ, 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్, బీఆర్ఎస్వీ నాయకులు భూక్య హరీశ్, కత్తి వినయ్, కళ్లపల్లి ప్రేమ్దేవ్ పాల్గొన్నారు. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగారపు భిక్షపతి, విష్ణుమూర్తి, గురుమూర్తి, కాజుబోజు సూర్యప్రకాశ్, వేణు, రమేష్, దేవేందర్, రామ్మూర్తి, సమ్మయ్య, అంజి పాల్గొన్నారు. -
ఎవరి వాటా వారికి రావాల్సిందే..
భూపాలపల్లి రూరల్: ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదన్నారు. భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాదం కుమారస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, వివిధ సంఘాల సనాయకులు అజ్మీర సమ్మయ్య, రాదండి దేవేందర్, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్, భీమనాదని సత్యనారాయణ, సాయిబాబా, మేకల సుమన్, కొత్తూరు రవీందర్, చిట్యాల శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. కుల గణన చేస్తే సరిపోదు.. సంపదను పంచాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ -
రైస్మిల్లులకే..
భూపాలపల్లి: దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు వేసవిలో ఇబ్బంది ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు దళారులు, రేషన్ డీలర్లు బియ్యాన్ని కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని పలు రైస్మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే అప్పగించేందుకు పలువురు మిల్లర్లు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ, ఎఫ్ఎస్సీ, అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలు సుమారుగా 1,38,234 ఉండగా, 3,91,353 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్కు 6 కేజీల చొప్పున ప్రతీ నెల 25,36,167 కేజీల బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈసారి వచ్చిన సన్నబియ్యం అంతగా నాణ్యత లేవు. నూకశాతం కూడా ఎక్కువగా ఉంది. దీంతో లబ్ధిదారులు వాటిని వండుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న జిల్లాలోని పలువురు డీలర్లు... లబ్ధిదారులతో వేలిముద్ర వేయించుకొని కేజీ బియ్యానికి రూ.12నుంచి రూ.15 చొప్పున లెక్కకట్టి ఫోన్ పే చేస్తున్నారు. ఇండెట్లో తేడా రాకుండా ఉండేందుకు అదే రోజు రాత్రి ఆ బియ్యం మొత్తాన్ని రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. 10 క్వింటాల నుంచి 20 క్వింటాల బియ్యం జమ అయ్యాక అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని రైస్మిల్లులకు తరలిస్తున్నారు. దళారుల దందాలో మార్పు లేదు. జిల్లాలోని ప్రతీ మండలంలో ఒకరిద్దరు దళారులు రేషన్ బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ. 20 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. ఆ బియ్యం పెద్ద మొత్తం అయ్యే వరకు గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. దళారులు సేకరించిన బియ్యాన్ని జిల్లాలోని కొందరు రైస్మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏస్ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్(సంచులు మార్చి) చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్లకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖతో పాటు పోలీసుశాఖలోని కొందరు అధికారులు ఈ అక్రమ దందాకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీడీఎస్ బియ్యం రవాణాపై పెద్దగా దాడులు జరగడం లేదని తెలుస్తోంది. పేదల బియ్యం పక్కదారి జోరుగా సాగుతున్న అక్రమ దందా బస్తాలు మార్చి సీఎంఆర్కు సిద్ధం చేస్తున్న మిల్లర్లు -
సమస్యల స్వాగతం
ఐటీడీఏ పీఓకు.. తెరుచుకోని టైలరింగ్ శిక్షణ కుట్టుమిషన్ల కేంద్రం ● ఈఎస్ఎస్లో గ్రౌండింగ్ అంతంతే.. ● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సరళీకృతం ● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులు ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా లెనిన్ వాత్సల్ టొ ప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బా ధ్యతల చేపట్టిన పీఓకు మాత్రం ఐటీడీఏలో నెలకొ న్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) పథకంలో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని పథకం కింద ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఆర్థిక శాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్కు నిధులు వస్తేగానీ బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలను తెరపైకి తేవడంతో ఈఎస్ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఇటీవల పీఎం కుసమ్ యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి వాటిని కేవలం కాగితాలకు పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పా టు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు. శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. హార్టికల్చర్ నర్సరీలో గతంలో రూ.23 లక్షలు వెచ్చించి పామాయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయగా ఒక్క మొక్క కూడా బతకలేదు. దీంతో రూ. 23 లక్షల నిధులు బురదలో పోసినట్లు అయ్యింది. మళ్లీ ఆ భూమిలో పండ్ల తోటల కోసం ప్లాన్ చేశారు కాని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇలా అనేక సమస్యలతో ఐటీడీఏ కొట్టుమిట్టాడుతోంది. ఇవేకాకుండా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గిరివాణిలో అనేక మంది గిరిజనులు వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన టొప్పో తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కాని ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అంతేకాకుండా కొంత మందికి ఇటుకల తయారీకి మిషనరీలు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమలను నడపడం లేదు. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి తుప్పుపట్టిపోతుంది. ఇదేకాకుండా న్యూట్రిబాస్కట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు దానిని మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు. -
వాసవి మాత జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: వాసవి మాత జయంతి వేడుకలను ఐడీఓసీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని వాసవి మాతకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు మా ట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా జరుపుకునే వాసవీ మా త జన్మదినం ఎంతో పవిత్రమైనదన్నారు. పార్వతీ దేవి అవతారమైన వాసవి మాత అహింసా మార్గాన్ని అనుసరించి సమాజానికి శాంతి, సామరస్యాని కి ప్రతీకగా నిలిచిన గొప్ప దైవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్ఐ అడ్మిన్ రత్నం వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్
భూపాలపల్లి: ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి జనగణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ తన నివాసంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంలో స్వయంగా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడంతో ప్రజల సమయం ఆదా అవుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన ప్రతీ ఒక్కరు ఐడీ నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్ పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరు పాల్గొనాలి.. జనాభా లెక్కల స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియపై ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వీయ గణన ప్రక్రియ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమం జనాభా గణన 2027 కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు ప్రతీ ఒక్కరూ పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ జవహర్, డీపీఆర్ఓ శీలం శ్రీనివాస్, ఆర్డీఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
కాంగ్రెస్కు మహిళలు గుణపాఠం చెప్పాలి
ములుగు రూరల్: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సంబురాలు జరుపుకోవడం దారుణమన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా డిలీమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించి బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, సుమలత, జాడి వెంకట్, నరేశ్ పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. మే 1న స్వామివారి తిరుకల్యాణం హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుల అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలిసి భక్తులకు కోరిన వరాలిచ్చే లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తులకు గర్భాలయంలో ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్నారు. అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చింతామణి జలపాతం.. నాభిచందన ప్రసాదం ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం ఆలయానికి వచ్చే భక్తులు ఔషధ గుణాల ప్రసాదంగా బావిస్తుంటారు. హేమాచల కొండపై నుంచి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో ఒకే విధంగా చింతామణి జలపాతం భూమి లోపలి నుంచి పారుతూ ఉండటం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి జలపాతం వద్ధ స్నానమాచరిస్తారు. జలపాతం నుంచి వచ్చే నీరు అతి శీతలంగా ఔషధ గుణాలు కలిగి మినరల్ వాటర్ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా పాడై పోకుండా ఉండటంతో నీటిని రోజు సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు. అలాగే ఆలయంలో ప్రతీ శని, ఆదివారం స్వామివారి నాభి నుంచి స్రవించే ద్రవాన్ని మంచి గందంతో కలిపి(నాభి చందనం) సంతానం లేని వారు సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనం -
ఉచిత వేసవి క్రీడా శిబిరం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా పరిధిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 సమ్మర్ క్యాంపులో భాగంగా 18 ఏళ్ల లోపు బాలబాలికలకు ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ శిబిరం ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు స్థానిక కృష్ణ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుందని తెలిపారు. శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడల్లో నిపుణులైన శిక్షకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ క్రీడలో 20 నుంచి 25 మంది వరకు ఎంపిక చేసి మొత్తం 25 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు తమ పిల్లల పేర్లను ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. మరణంలోనూ మానవత్వం మొగుళ్లపల్లి: మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన పసరగొండ శ్రీధర్ హైదరాబాద్లో నివాసముంటూ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన కుటుంబసభ్యులు శనివారం నేత్రదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ భార్య స్వప్న, కుమారుడు బాలరాజు పటేల్, తల్లి సరలక్ష్మి తీసుకున్న నిర్ణయంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది నేత్రాలను సేకరించారు. మరణానంతరం కూడా మరొకరికి చూపునివ్వడం గొప్ప విషయమని గ్రామస్తులు ఈ కుటుంబాన్ని అభినందించారు. 28న బహిరంగ వేలం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన మడ్తపల్లి గ్రామంలోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం ఈనెల 28న మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గ సమావేశం కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) మొదటి సమావేశాన్ని ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. రామప్పలో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ (డీడీజీఈ ఢిల్లీ) అభిషేక్ అగర్వాల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట హైదరాబాద్ దూరదర్శన్ డైరెక్టర్ వెంకటరమణ, టూరిజం అధికారులు ఉన్నారు. దూరవిద్య డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డిఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
మలేరియా నివారణకు జాగ్రత్తలు
చిట్యాల: మలేరియా నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సీహెచ్.మధుసూదన్, మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్ అన్నారు. శనివారం మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల చుట్టూ మురికి నిల్వలు ఉండకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని కోరారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించడం ద్వారా దోమల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఒడితల వైద్యాధికారి మౌనిక, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సుధాకర్, జిల్లా అకడమిక్ రమేశ్, సబ్ యూనిట్ అధికారులు హలీం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ -
క్రీడా శిబిరాలకు వేళాయె
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన క్రీడాకారులు, పీఈటీల పర్యవేక్షణలో శిక్షణ అందించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోనే 40 రోజుల పాటు ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 24న వేసవి శిబిరాలను ప్రారంభించారు. వేసవిలో ఇళ్లలో ఖాళీగా ఉండే పిల్లలకు ఇది చక్కటి అవకాశం. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హులు. వేసవి సెలవులు వృథా కాకుండా వారికి ఇష్టమైన ఆటల్లో ప్రత్యేక శిక్షణ కల్పించనున్నారు. ఆధునిక యుగంలో పిల్లలు స్మార్ట్ పోన్లు, టీవీలకు అతుక్కుపోయి, చిన్న వయసులోనే అనా రోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. సెలవులను గ్రామీణ, పట్టణ ప్రాంత పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్లుగా ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ఆవరణ, అందుబాటులో మైదానాలు, క్రీడా ప్రాంగణాల్లో ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60వేల నిధులు కేటాయించింది. ఒక్కో కోచ్కు రూ.5 వేల చొప్పున, మొత్తం జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించుకోవడానికి రూ.50 వేలు కోచ్లకు గౌరవ వేతనం కోసం కేటాయించారు. ప్రమాదంలో గాయాలైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ కిట్కు ఇతరత్రా నిర్వహణకు రూ.10 వేలు ఖర్చు చేయనున్నారు. ఆటలకు దూరమైన పాఠశాలలకు చెందిన పిల్లలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో సమయాన్ని వృథా కాకుండా ఇష్టమైన ఆటను నేర్చుకుని పట్టు సాధించే అవకాశం ఉంటుంది. సమయ పాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాటు, ఆటలు ఆడుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలుంటాయి. ఈ క్రీడల్లో పతకాలు సాధిస్తే క్రీడా కోటా కింద ఉన్నత విద్య నభ్యసించవచ్చు. ఉపాధి అవకాశాలకు కూడా ఆ పతకాలు ఎంతో ఉపయోగపడుతాయి. కాటారం ఖోఖో చల్లగరిగ కబడ్డీ గణపురం బాల్బ్యాడ్మంటన్ మహదేవపూర్ వాలీబాల్ అంబట్పల్లి వాలీబాల్ టేకుమట్ల షటిల్ బ్యాడ్మంటన్ అందుకుతండా కబడ్డీ వేములపల్లి బాల్బ్యాడ్మంటన్ నైన్పాక బాల్బ్యాడ్మంటన్ గంగారం కబడ్డీ కాటారం అథ్లెటిక్స్ అంబేడ్కర్ స్టేడియం క్యారమ్స్, అథ్లెటిక్స్, భూపాలపల్లి బాస్కెట్బాల్ జంగేడు వాలీబాల్ మంజూర్నగర్ తైక్వాండో మున్సిపల్ గ్రౌండ్ కబడ్డీ, అథ్లెటిక్స్ భూపాలపల్లి 10 చోట్ల శిక్షణ శిబిరాలు క్రీడాకారులకు అవకాశంవేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు నిర్వహిస్తారు. ఇప్పటికే కోచ్ల నియామకం పూర్తిచేసి శిబిరాలను ప్రారంభించాం. శిక్షణ శిబిరాల్లో తాగునీరు, తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలి. సీహెచ్ రఘు, జిల్లా యువజన క్రీడల ఇన్చార్జ్ అధికారి -
వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరపాలి
భూపాలపల్లి: ప్రతీ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరుపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. విచారణలో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, మిస్సింగ్ కేసుల వివరాలను సమగ్రంగా సమీక్షించారు. లైంగిక దాడి, పోక్సో కేసులను నిర్ణీత గడువుల్లో పూర్తిచేసి నిందితులను కోర్టు ముందు నిలపాలని జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ నిత్యం వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఘనంగా గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మాడవీధుల పురోగతిని పరిశీలించారు. -
మల్లూరుగుట్టపై మంటలు
● హేమాచలక్షేత్రంలో రెండు రోజులుగా కార్చిచ్చు ● కాలిబూడిదవుతున్న అటవీ సంపద ● అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణులు మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి కొలువైన మల్లూరుగుట్ట్ట అటవీ ప్రాంతం కాలిపోతోంది. రెండు రోజుల నుంచి గుట్టపై భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో గుట్టకు అతి సమీపంలోని కొత్తమల్లూరు, మల్లూరు గ్రామాల ప్రజలు మంటల వేడికి గురవుతున్నారు. మల్లూరు నుంచి చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట వరకు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న గుట్టల్లో వారం రోజుల నుంచి కార్చిచ్చుతో అడవులు దగ్ధమవుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు అతి సమీపంలోని అదే గుట్టకు మరో వైపున గల హేమాచల లక్ష్మీనర్సింస్వామి ఆలయ ప్రాంతం నుంచి శనిగకుంట, పూరేడుపల్లి, వాగొడ్డుగూడెం వరకు గుట్టను మంటలు చుట్టు ముట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధికి మించి ఉన్న గుట్టపై గల లక్షలాది రూపాయల విలువైన సండ్ర, జిట్రేగు, నల్లమద్దితో పాటు తదితర విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. వన్యప్రాణుల ప్రాణాలు గాల్లోకి.. హేమాచలక్షేత్రం సమీప అటవీ ప్రాంతంలో చింతామణి జలపాతం, దేవునికుంట, దబ్బతోగు, చుంచుపల్లి సమీపంలోని మామిడితోగు, రమణక్కపేట, ఎర్రమ్మతోగు తదితర తోగులతో పాటు పలు ప్రాంతాల్లో నీటి ఊటలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా నీటి వసతి ఉండటంతో ఆయా అటవీ ప్రాంతాల్లో సంచరించే అడవి పందులు, కొండ గొర్రెలు, నక్కలు, తదితర జాతుల వన్యప్రాణులు అడవిలోని మంటల్లో చిక్కుకుని ఆహుతవుతున్నాయి. ఈ మంటల వేడికి తాళలేక ప్రాణాలు దక్కించుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లోకి పలు రకాల జంతువులు వచ్చి వేటగాళ్లకు చిక్కి బలవుతున్నాయి. హోర్డింగులు తప్ప చర్యలేవి? వేసవికాలంలో అడవులు దగ్ధం కాకుండా ఉండేందుకు ఫైర్లైన్స్, కార్చిచ్చు కారణంగా ఏర్పడే మంటలను ఆర్పేందుకు ఎయిర్ మెషిన్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు. బేస్క్యాంప్ సిబ్బంది ఏర్పాటుతో పాటు అడవుల్లో నివసించే వన్య ప్రాణులను కాపాడేందుకు వివిధ రకాల చర్యల పేరుతో అటవీశాఖ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అడవికి నిప్పు మానవాళికి ముప్పు, అడవులను కాపాడుకుందాం అంటూ ఏజెన్సీలోని అభయారణ్యంలో అటవీశాఖ హోర్డింగులు ఏర్పాటు చేయడం తప్పా ఆచరణ మచ్చుకు కూడా కానరావడం లేదని వనప్రేమికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని జిల్లా సరిహద్దులోగల అటవిశాఖ చెక్పోస్టు నిర్వహణ అధికారులు, సిబ్బందితో పాటు దోమెడ, రాజుపేట, మల్లూరు సెక్షన్ల ఎఫ్ఎస్ఓ, బీట్ అధికారులు నిత్యం మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయానికి విధులపై వచ్చి వెళ్తుంటారు. వీరికి రాజుపేట మొదలుకుని మల్లూరు వరకు రోడ్డును ఆనుకుని ఉన్న గుట్ట అటవీప్రాంతం దగ్ధమవుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయుర్వేద వృక్షసంపద కనుమరుగయ్యే ప్రమాదం ప్రపంచ ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే సహజ సిద్ధ అడవులు దగ్ధం అవుతున్నాయి. అయినా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. అధికారుల తీరు చూస్తుంటే భవిష్యత్లో అడవులు అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుందని వనప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దసుముడి కవితా సంకలనం ఆవిష్కరణ
హన్మకొండ: ఓరుగల్లు పోరాట వారసత్వాన్ని కవిత్వం రూపంలో వనపాక దిలీప్ రాస్తున్నారని ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దిలీప్ రాసిన దసుముడి కవిత సంకలనాన్ని మానవ హక్కుల వేది ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యురాలు, సీనియర్ జర్నలిస్ట్ వేమన వసంత లక్ష్మి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ బాలగోపాల్ వారసత్వాన్ని, ఆలోచనలు నింపుకున్న దిలీప్ ఈ తరం యువతకు ఆదర్శం అన్నారు. వేమన వసంత లక్ష్మి మాట్లాడుతూ దిలీప్ ఆలోచనలు భావస్పోరకం అన్నారు. ప్రధాన వక్త యాకూబ్ మాట్లాడుతూ.. సంకలనంలోని వివిధ కవితల్లో అతి ముఖ్యమైన పద బంధాలను వివరించారు. కవి తగుళ్ల గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, ప్రముఖ నవలా రచయిత పి.చందు, డాక్టర్ చంద్రబాను, యువకులు పాల్గొన్నారు. -
‘ప్యాక్స్’ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’ త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరక్టర్ సభ్యులు స్థానాలువరంగల్ అర్బన్ 12 156 30,317 (హనుమకొండ) వరంగల్ రూరల్(వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలుమొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260 -
శాసీ్త్రయ పద్ధతిలో ఇసుకను తొలగించాలి
భూపాలపల్లి: చెక్డ్యామ్లలో పేరుకుపోయిన ఇసుకను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్హర్ మండలంలోని వివిధ చెక్డ్యామ్లలోని ఇసుకను డీ–సిల్టింగ్ ద్వారా తొలగించే అంశాలపై చర్చించారు. వల్లంకుంట గ్రామం వద్ద అడవిసోమన్పల్లి చెక్డ్యామ్, మల్లారం గ్రామంలోని చిన్న ఓదెల చెక్డ్యామ్, తాడిచెర్ల గ్రామంలోని గోపాల్పూర్, ఖమ్మంపల్లి చెక్డ్యామ్లలో ఇసుక తొలగింపుపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, మైనింగ్ ఏడీ జయరాజ్, టీజీఎండీసీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. అర్హులకు అక్రిడిటేషన్ కార్డులు.. అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026–2028 సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యే అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మీడియా ప్రతినిధుల నుంచి 330 దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీపీఆర్వో శీలం శ్రీనివాస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు క్యాతం సతీష్, మంతెన సమ్మయ్య, ఎర్రం సతీష్, మోబిన్ అహ్మద్, సారేశ్వరరావు, మధు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి.. వైద్య కళాశాల, వైద్య విద్యార్థుల వసతి భవనం (హాస్టల్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో లేవని, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నప్పటికీ పనులు ఆలస్యమవడం సరికాదన్నారు. జనగణనకు చర్యలు.. జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ అయిన గృహ లెక్కింపు, గృహ వసతి గణన వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించబడతుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ముందుగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయాన్ని వెబ్ పోర్టల్ ద్వారా ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కలెక్టర్ రాహుల్శర్మ -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వొద్దు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: రైతులు ఇబ్బందులు పడకుండా ధా న్యం కొనుగోలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, సహకార, డీఆర్డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, రవా ణా, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు, వివిధ శా ఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రవాణాకు లారీలు అందుబాటులో ఉంచాలని, తూ కం అవగానే ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సివిల్ సప్లయీస్ అధికారులు రాములు, కిరణ్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ వేగిరం చేయాలి.. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనగణన స్వీయ నమోదు, వరి కోతలపై హార్వెస్టర్లకు అవగాహన కార్యక్రమం, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి ఐదు రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఇందుకు తక్షణం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 69.66 శాతం ఓటర్లు మ్యాపింగ్ జరిగిందని, రెండు నెలలుగా పురోగతి రాలేదన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, వివి ధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
భూపాలపల్లి రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి విద్యార్థులకు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి యంత్రము పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. టేకుమట్ల మండలం నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని దామరంచపల్లి శివారులో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమాని మోరె నరేష్, డ్రైవర్ కొమ్ము కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పలకీ సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉద యం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. శ్రీవిద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు. -
బస్సు పయ్య కదల్లె..
డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఆర్టీసీ కార్మికులు భూపాలపల్లి: హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడో రోజు శుక్రవారం సంపూర్ణంగా సక్సెస్ అయింది. భూపాలపల్లి డిపో నుంచి సంస్థ బస్సులు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అద్దె బస్సుల డ్రైవర్లు సైతం సమ్మెకు మద్దతు పలికి తమ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో భూపాలపల్లి డిపోలో సమ్మె సక్సెస్ అయింది. సమ్మెలో భాగంగా జేఏసీ నాయకులు, కార్మికులు పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం డిపో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించగా, మధ్యాహ్నం డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మౌన ప్రదర్శన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గురువారం ప్రైవేట్ బస్సులు నడిపించడంతో శుక్రవారం కూడా ప్రయాణికులు అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండ్లో బస్సులు కోసం వేచి చూసి చివరకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ధరలు పెంచి ప్రయాణికుల తరలింపు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శుక్రవారం సంస్థ, అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆటోలు, టాక్సీల యజమానులు తమ ధరలను పెంచి ప్రయాణికులను తరలించారు. గతంలో భూపాలపల్లి–కాటారం, భూపాలపల్లి–పరకాలకు బస్సు టికెట్ ధర రూ.70 ఉండగా, శుక్రవారం ఆటోలు, టాక్సీ వాహనాల యజమానులు ఒక్కొక్కరికి రూ.100 తీసుకున్నారు. బస్సులు లేకపోవడంతో చేసేది లేక అదనపు భారాన్ని భరించి ప్రయాణాలు కొనసాగించారు. శంకర్గౌడ్కు నివాళులు.. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్కు భూపాలపల్లి డిపో కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. రాత్రి 8 గంటలకు డిపో ఎదుట శంకర్గౌడ్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శంకర్గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు పలు సంఘాల మద్దతు.. కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి డిపో వద్దకు వచ్చి ఆర్టీసీ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఎస్పీకే సాగర్, వివిధ సంఘాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, సందీప్, కొమురన్న, రాజయ్య, శ్రీనివాస్, రాధాకృష్ణ, ఎన్ఆర్ నాయక్, సమ్మయ్య, ఎల్లాగౌడ్, బేగం, సునిత, అరుణ, రవీందర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. డిపోకే పరిమితమైన సంస్థ బస్సులు మద్దతు తెలిపిన అద్దె బస్సుల డ్రైవర్లు కొనసాగిన కార్మికుల నిరసన కార్యక్రమాలు -
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు మొగుళ్లపల్లి: వేసవి క్రీడ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములపల్లి గ్రామంలో బాల్బ్యాడ్మింటన్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 24నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో సందడి
భూపాలపల్లి రూరల్: స్థానిక పరిషత్ ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాలతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. త్వరలో రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను, పార్టీల నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే నెలలో ఎన్నికలు? స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. యంత్రాంగం ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లాలోని 109 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగానే రంగంలోకి.. ఎన్నికల తేదీ ఖరారు కానప్పటికీ ఆశావహులు ముందుగానే రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే ప్రజల్లో తమ పోటీ గురించి చర్చ ప్రారంభించి ఎన్నికల తేదీ వచ్చే నాటికి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే ఎంత ఖర్చయినా వెనకాడబోమని చెబుతున్నారు. అధికారంపై ధీమాతో కాంగ్రెస్.. జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని అన్ని సీట్లలో తామే జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు విజయం దక్కుతుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందన్న ఆశలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. వాస్తవానికి గతేడాది నవంబర్లో ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీచేసి ఓడిపోయిన వారితో పాటు, సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ సీట్లు ఇస్తామని ఆశపెట్టి పోటీలనుంచి తప్పించిన నాయకులు, కొత్తగా యువ నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్లో కూడా టికెట్ కోసం పోటీ పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున ఎన్నికల ఖర్చు కోసం ఫండ్ భారీగానే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీలో టికెట్ కోసం పోటీ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా గ్రామాల్లో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు టికెట్ ఆశిస్తున్నారు. గ్రామాల్లో జోరందుకున్న రాజకీయ చర్చలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభం -
డిపోలకే పరిమితం
భూపాలపల్లి: తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు సక్సెస్ అయింది. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకే ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు భూపాలపల్లి డిపో కార్యాలయానికి చేరుకొని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. అప్పటి నుంచి డిపో ఎదుట, బస్టాండ్ సమీపంలోనే ఉంటూ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పోలీసు వ్యాన్లో అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లను డిపోలోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నించారు. కార్మికులు గమనించి పోలీసు వ్యాన్ను అడ్డుకొని వాహనం ఎదురుగా బైఠాయించి అడ్డుకున్నారు. కార్మికుల పరిస్థితిని జేఏసీ నాయకుడు బుర్రి తిరుపతి ఔట్సోర్సింగ్ సిబ్బందికి వివరించి విధులకు వెళ్లవద్దని ప్రాధేయపడ్డాడు. దీంతో వారు సైతం వెనుదిరిగారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలుసుకున్న భూపాలపల్లి డిపో డ్రైవర్ వీఎంఎం చారి భావోద్వేగానికి లోనై, కార్మికుల హక్కుల సాధన కోసం తాను సైతం బలిదానం అవుతానంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, కార్మికులు వెంటనే అతడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నందున సంస్థ బస్సులు ఒక్కటి కూడా డిపో నుంచి బయటకు రాలేదు. డిపోకు చెందిన 22 అద్దె బస్సులు మాత్రం వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించాయి. కొంతమంది అద్దె బస్సుల యజమానులైతే బుధవారం రాత్రే తమ బస్సులను ఇంటికి తీసెకెళ్లి, పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, మంజూర్నగర్ తదితర సెంటర్ల నుంచి బస్సులను నడిపించారు. సమ్మెలో భాగంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, రాజయ్య, కొమురన్న, బండి శ్రీనివాస్, సందీప్, రాధాకృష్ణ, ఎన్ఆర్ నాయక్, సమ్మయ్య, బేగం, సునిత, అరుణ, సుమలత పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందితో నడిపించేందుకు యత్నం అడ్డుకున్న కార్మికులు -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు
భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. స్థానిక తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్లను గుర్తించి అధికారిక చర్చలు జరపాలని సూచించారు. లేబర్ కోడ్లను ఆధారంగా చేసుకుని ఆర్టీసీ సమ్మెను అణచివేయాలని ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్ రెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, రవి, సా జిత్, నరసింహారెడ్డి, సలీం, మధుకర్ పాల్గొన్నారు. -
పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: భక్తుల సౌకర్యార్థం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పీఆర్, విద్యుత్, ఆర్అండ్బీ, ప్రణాళిక, రవాణా, పర్యాటక, అగ్నిమాపక శాఖల అధికారులు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ప్రత్యేకంగా కాళేశ్వరం సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ నిర్మాణం, షట్టరింగ్, స్టాంప్డ్ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయని, వీటిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. పేవర్ బ్లాక్స్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పుష్కరాల సందర్భంగా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించాలని, భక్తుల కోసం స్నానాల షవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం చార్ధామ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాల్లో తక్కువ ఆక్సిజన్, తీవ్ర చలి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. యాత్రకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. యాత్ర సమయంలో వెచ్చని దుస్తులు, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 104 హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలి మల్హర్(కాటారం): విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో నాలుగో రోజు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికలను అందజేశారు. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సంక్షేమ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుకు పేదరికం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు కాదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లితండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, ఎంపీడీఓ బాబు, సర్పంచ్ పవిత్ర, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ


