గుర్రంపేట జాతరలో కలెక్టర్ పూజలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట గ్రామంలో నిర్వహిస్తున్న మినీ మేడారం జాతరను శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంిపీడీఓ తరుణ్ ప్రసాద్, అధికారులు, ఆలయ సిబ్బంది, పూజారులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.


