breaking news
Jayashankar District News
-
వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి
● రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాభూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం వెంటనే 12వ వేజ్బోర్డు కమిటీని ఏర్పాటుచేసి వేతన సవరణ ప్రక్రియను వేగంగా అమలుచేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 10న సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శనివారం ఏరియాలోని కొమురయ్య భవన్లో జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింగరావు, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య, హెచ్ఎంఎస్ నాయకులు నరేష్నేత మాట్లాడారు. గతంలో 11వ వేజ్బోర్డు కాలపరిమితి ముగియకముందే కమిటీని ఏర్పాటుచేసి వేతన సవరణ అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం 12వ వేజ్బోర్డు సమయం దాటినా కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. కోలిండియా స్థాయిలో 12వ వేజ్బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించాల్సి ఉండగా, లేబర్ కోడ్ల అమలుపైనే దృష్టి సారించడం సరికాదన్నారు. సింగరేణిలో కార్మికులపై లేబర్ కోడ్లను అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వేజ్బోర్డు విషయంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10న జీఎం కార్యాలయాల ఎదుట జరగనున్న ధర్నాలో బీఎంఎస్ పాల్గొనకపోవడం బాధాకరమని, కార్మికుల ప్రయోజనాల కోసం వేజ్బోర్డు విషయంలో కలిసి రావాలని కోరారు. సెప్టెంబర్ 12న రాంచీలో జరిగే సదస్సులో 12వ వేజ్బోర్డు అంశంపై స్పష్టత రాకపోతే కోల్ఇండియా వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి వేజ్బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీఎం కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి కార్మికులు, ట్రేడ్యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మోటపలుకుల రమేశ్, రాంచందర్, ఐలయ్య, బీమనాదుని సత్యనారాయణ, రామచందర్, దుడ్డేల సాయిలు, రమేశ్, మల్లేశ్ పాల్గొన్నారు. -
రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి: కాంగ్రెస్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక చెరువులు నిండక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సింది పోయి, దేవాదుల మోటార్లు మొత్తం నడపడం లేదన్నారు. రామప్ప నుంచి గ్రావిటీ ద్వారా గణపురం చెరువుకు నీటిని తీసుకురావడానికి బీఆర్ఎస్ హయాంలో రూ.18కోట్లు వెచ్చించగా, ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సాగునీటిని తెచ్చే మార్గాలు ఉన్నప్పటికీ పంటలను ఎండబెట్టడం బాధాకరమన్నారు. వెంటనే గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించలేక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం సిగ్గుచేటన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో గణపురం, భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
పార్కును అభివృద్ధి చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ● జయశంకర్ పార్కు పరిశీలన ● పనులకు రూ.50లక్షలు కేటాయింపుభూపాలపల్లి రూరల్: జయశంకర్ పార్క్ను ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా సురక్షితంగా ఉండేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం సంగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జయశంకర్ పార్క్ను పరిశీలించారు. పార్కులో ఉన్న జిమ్ పరికరాలను పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి సింగరేణి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పార్కు నిర్వహిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో పార్క్లో వాకింగ్ చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వాకింగ్ ట్రాక్, మౌలిక వసతులు, మరమ్మతులు, లైటింగ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్క్ అభివృద్ధి పనులను చేపట్టే ముందు ఇంజినీరింగ్ నిపుణుల సలహాలతో పాటు వాకర్స్, స్థానిక ప్రజలు, కార్మికులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుని, వారికి అవసరమైన సౌకర్యాలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. పార్క్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వివిధ రకాల జ్యూస్లు, పానీయాలు అందుబాటులో ఉండేలా క్యాంటీన్ను కూడా అవసరమైన మేరకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. పార్క్ పరిసరాల్లో మెరుగైన లైటింగ్ సదుపాయాలు ఏర్పాటుచేసి వాకింగ్చేసే ప్రజలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కౌన్సిలర్లు, నాయకులు పుల్ల మహేష్, దాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కొత్త జీఓతో తీవ్ర నష్టం..భూపాలపల్లి: మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల తగ్గింపునకు రంగం సిద్ధమైంది. గతేడాది తీసుకొచ్చిన జీఓను ఇప్పుడు అమలుచేసి వేతనాల్లో కోత విధించేందుకు సర్కారు ప్రయత్నిస్తుంది. కొత్త జీఓ అమలు సరికాదంటూ భూపాలపల్లి మున్సిపాలిటీలోని కార్మికులు తమ వేతనాలు తీసుకునేందుకు తిరస్కరించారు. ఆ వేతనం మాకొద్దు.. జీఓ ఆర్టీ 69 గతేడాది విడుదల కాగా ఈ నెల నుంచి ఆ జీఓ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాత జీఓల ప్రకారమే తమకు వేతనాలు ఇవ్వాలని, కొత్త జీఓ అమల్లోకి వస్తే వేతనాలు తగ్గి తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఔట్సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీలో 150మంది కార్మికులు పనిచేస్తుండగా, వారంతా గత నెల వేతనాన్ని తీసుకోకుండా నిరసన వెలిబుచ్చుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, కుటుంబాలను సాకేందుకు ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్న ఫళంగా కొత్త జీఓ తీసుకొచ్చి వేలాది రూపాయల కోత విధిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని వాపోతున్నారు. జీఓ 69ని రద్దుచేసి పాత పద్ధతి ప్రకారమే వేతనాలు అందించాలని ఔట్సోర్సింగ్ కార్మికులు ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి కోరారు. మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించింది. జీఓ ఎంఎస్ నంబర్ 14 (2016) ప్రకారం పని ఆధారంగా రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ఇచ్చింది. అనంతరం ప్రభుత్వం జీఓ ఎంఎస్ 60, జీఓ ఎంఎస్ 40 లను విడుదల చేసి వేతనాలు పెంపు చేస్తూ వచ్చింది. గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన ప్రభుత్వం కొత్త జీఓ ఆర్టీ నంబర్ 69ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రస్తుతం కార్మికులకు ఉన్న వేతనాలు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు తగ్గనున్నాయి. దీంతో ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల తగ్గింపు గతేడాది జీఓ అమలుకు సర్కారు యత్నం నెలకు రూ.4వేల వరకు తగ్గుతున్న వేతనం నిరసనగా జూలై నెల వేతనం తిరస్కరణ -
పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
● పర్యావరణాన్ని బాధ్యతగా పరిరక్షించాలి ● డీజీపీ సీవీ ఆనంద్ ● మామునూరు బెటాలియన్లో స్వాగతంమామునూరు: స్పెషల్ పోలీసులు రాష్ట్ర అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, ఎస్డీఆర్ఎఫ్ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్తో కలిసి డీజీపీ సందర్శించారు. బెటాలియన్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్న ఆయనకు కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి డీజీపీ గౌరవందనం స్వీకరించి, విధులు, సంక్షేమం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ముఖాముఖి బెటాలియన్ ఆడిటోరియంలో జరిగిన అధికారులు, సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, బెటాలియన్లో మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసింగ్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వృత్తి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞాన, సమన్వయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకు ముందు బెటాలియన్లో మొక్కలు నాటారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ పరికరాలను పరిశీలించి, నైపుణ్యాన్ని డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు బాలయ్య, వీరన్న, రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, విజయ్, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు నల్లబెల్లికి కేసీఆర్ రాక
నర్సంపేట: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే. ‘సర్’కు రెండు రోజులే గడువు భూపాలపల్లి: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం రేపటి(సోమవారం) తో ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్లందరికీ ఇది చివరి అవకాశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూరించిన ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడానికి ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. గడువులోగా ఫారం సమర్పించని పక్షంలో, ఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాబడదని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ట్రెజరీశాఖ డైరెక్టర్ పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఉత్సవమూర్తులను శ్రీఽఆదిముక్తీశ్వరాయంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో రాష్ట్ర ట్రెజరీశాఖ డైరెక్టర్ పార్వతీదేవి శనివారం దర్శించుకున్నారు. అక్కడ ఆశీర్వచన వేదిక వద్ద ఆమెను అర్చకులు సన్మానించి, తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆమెవెంట జిల్లా ట్రెజరీశాఖ అధికారులు జ్యోతిరావు, జీవన్రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. రోడ్డుపై ‘చేపల వేట’తో నిరసన భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో చేపల వలలు, గాలాలు వేసి చేపలు పడుతూ తమ నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షపు నీరు భారీగా నిలిచి గుంతలు చెరువులను తలపిస్తున్నాయని యూత్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. కోరిన కోర్కెలు తీర్చుతూ, సంతానభాగ్యం కల్పించే స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. పూలు పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
వాస్తవం లేదు..
కాళేశ్వరం: ఇటీవల సోషల్ మీడియా వేదికగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆలయ అర్చకులు భావోద్వేగానికి గురయ్యారని, ఆలయ కూల్చివేతను వ్యతిరేకిస్తున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, అర్చకులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఆలయ పునర్నిర్మాణం విషయంలో బాధ, ఆవేదన, భావోద్వేగానికి గురికాలేదని వెల్లడించారు. వేల సంవత్సరాల చారిత్రక, ఆధ్యాత్మిక వైభవం కలిగిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయం మరింత వైభవంగా, శాస్త్రోక్తంగా, కృష్ణశిలతో శాశ్వత రాతి కట్టడంగా పునర్నిర్మాణం కావడం తమ అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గోరింటాకు సంబురం మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ఆదర్శనగర్ కాలనీలో శుక్రవారం మహిళలు అమ్మవారికీ పూజల అనంతరం చేతులకు గోరింటాకును పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ నగర్ కాలనీ మహిళా అధ్యక్షురాలు ముస్కులా శ్రీలత రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో మహిళలు, యువతులు గోరింటాకు పెట్టుకోవడం ఆనందానికి, శుభానికి, కుటుంబ ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. నేటి ఆధునిక జీవనశైలిలోనూ మన పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలను మరువకుండా భావితరాలకు అందించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు రసాయనాలతో తయారైన నకిలీ మెహందీ ఉత్పత్తుల కంటే సహజ గోరింటాకుకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. -
వసతి గృహ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
● కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి అర్బన్: వైద్య కళాశాల బాలికల వసతి గృహ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బాలికల వైద్య కళాశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, భవనం అంతర్గత (ఇంటీరియర్) పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున పనుల్లో వేగం పెంచి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి బాలికల వసతి భవనాన్ని పూర్తిస్థాయిలో అప్పగించాలని స్పష్టం చేశారు. బాలుర వసతి భవన నిర్మాణ పనుల్లో జాప్యం వహించవద్దని, దానిని సెప్టెంబర్ నెలాఖరు నాటికి సిద్ధంచేసి అందించాలని ఆదేశించారు. హాస్టల్ భవనంలో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎంతమేర విద్యుత్ అవసరమవుతుందో అంచనా వేసి, సమగ్ర నివేదికలు అందించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, ఆర్అండ్బీ ఈఈ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓరుగల్లుకు పోలీస్ బాస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉమ్మడి వరంగల్లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారంనుంచి సోమవారం వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి వరంగల్లోని జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్న ఆయన జిల్లాల వారీగా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరుతెన్నులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించి తగు సూచనలు చేయనున్నారని తెలిసింది. మొదట ఈ పర్యటన జూలై 30, 31 తేదీల్లో ఉన్నట్లు ప్రకటించినప్పటికీ వర్షాల కారణంగా వాయిదా పడింది. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీవీ ఆనంద్ మొదటి సారి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శనివారం నుంచి పర్యటిస్తున్నారు. మూడు రోజులు.. మూడు దశల్లో సమీక్షలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న డీజీపీ సీవీ ఆనంద్ నేరుగా మామునూరు బెటాలియన్కు చేరుకుంటారని తెలిసింది. అక్కడ వివిధ స్థాయిల అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హనుమకొండ సిటీకి చేరుకుని నక్కలగుట్టలోని హరిత కాకతీయలో రాత్రి బస చేయనున్నట్లు సమాచారం. 9న ఉదయం వరంగల్ కమిషనరేట్ కార్యాలయం సందర్శన అనంతరం సీపీ, అడిషనల్ డీసీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం వరంగల్ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు వెళ్తారని సమాచారం. సమీక్షలో భాగంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమావేశం కానుండగా, ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోలీసింగ్ పనితీరుపై వివరాలు అందించనున్నారని తెలిసింది. నేటినుంచి మూడు రోజులపాటు వరుస సమీక్షలు ఎస్పీలు, పోలీస్ అధికారులతో నేరుగా భేటీ నేర నియంత్రణ, సాంకేతికతలపై ఫోకస్ డీజీపీగా జిల్లాకు తొలిసారి వస్తున్న సీవీ ఆనంద్ -
వరినాట్లు వేసి నిరసన
భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సింగరేణి జీఎం కార్యాలయం వైపు వెళ్లే రహదారి విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ వ్యాపారులు శుక్రవారం ప్రధాన రహదారిపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వ్యాపారులు మాట్లాడుతూ.. రహదారిని విస్తరించకపోవడం, డ్రెయినేజీ నిర్మాణం చేయకపోవడం మూలంగా రోడ్డుపై నీరు నిలిచి కుంటలను తలపిస్తోందన్నారు. వర్షాకాలంలో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలు, చిన్నారులు నడిచి వెళ్లే క్రమంలో వాహనాలు వెళ్తే బురద నీరు మొత్తం వారిపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి మీదుగా పోలీస్స్టేషన్, జిల్లా పోలీసు, జీఎం కార్యాలయం, సింగరేణి స్టేడియం, జీఎం కార్యాలయానికి ప్రతీరోజు వందలాది వాహనాలు వెళ్తాయని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యాపారులు, స్థానికులు ఎగ్గేటి కుమార్, తేలి శ్రీనివాస్, రఘు, పరశురాం, వేణు, సమ్మయ్య, తేలి సంజీవ్, శ్రీనివాస్, శశిధర్, ఖాదర్ పాల్గొన్నారు. -
పంద్రాగస్టునుంచి కొత్త పింఛన్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: పంద్రాగస్టు నుంచి అర్హులకు కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని కనిపర్తి, రేపాక, లింగాల, కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడేపాక గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, పీఆర్ డీఈ రవికుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్లు సాదు సుమలత, గుల్ల అరుణ, సురేష్, సువర్ణ, నాయకులు పున్నం రవి, తిరుపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు. -
వరంగల్కు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏర్పాట్ల పరిశీలన.. పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. వేదిక, సభా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన.. ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ పరకాలలో ‘యంగ్ ఇండియా’కు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ -
శానిటేషన్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సేఫ్టీ కిట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు సంయుక్తంగా సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందజేశారు. సానిటేషన్ కార్మికులు విధి నిర్వహణలో సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి కిట్లో హెల్మెట్, రెయిన్కోట్, సేఫ్టీ షూస్, అప్రాన్, గ్లౌజులు ఉన్నాయి. పరిశుభ్రత నిర్వహణలో సానిటేషన్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని, వారి భద్రతకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం భూపాలపల్లి: రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున రైతులను నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవగాహన కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వనమహోత్సవం, రేషన్ కార్డుల పంపిణీ, చేయూత పింఛన్లు, విద్యార్థులకు యూనిఫాంలు, కుట్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడీఓసీ నుంచి సీసీఎఫ్ ప్రభాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 114 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల్లో 10 కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు, 21 అసోసియేట్ ప్రొఫెసర్లు, 39 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 44 సీనియర్ రెసిడెంట్ల పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 17వ తేదీన భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఖాళీల వివరాలు, అర్హతలు తదితర పూర్తి సమాచారం కళాశాల వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మద్యం మత్తులో ఆత్మహత్య చిట్యాల: మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని లక్ష్మీపూర్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం లక్ష్మీపూర్ తండాకు చెందిన బానోత్ భద్రునాయక్ (56) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో ఆయన భార్య జ్యోతి కిటికీలో నుంచి చూడగా.. ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే వచ్చి తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతిడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదాలపై అవగాహన ఉండాలి ఏటూరునాగారం: ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ విపత్తు దళం ఇన్స్పెక్టర్ బీటెన్ సింగ్, కానిస్టేబుల్ చిన్ని రాము అన్నారు. శుక్రవారం మండలంలోని రామన్నగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విపత్తులపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా బీటెన్ సింగ్ మాట్లాడుతూ గుండెనొప్పి వచ్చినప్పుడు సీపీఆర్ చేయాలని కృత్రిమ బొమ్మద్వారా వివరించారు. నీరు, అగ్ని, వరదలు, వాగులు ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
పల్లెల అభివృద్ధికి నిధులు
15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు విడుదల ● 248 పంచాయతీలకు రూ.11.30కోట్లు ● తాగునీరు, పారిశుద్ధ్య పనులకే ప్రాధాన్యం భూపాలపల్లి: కొంతకాలంగా నిధుల కొరతతో రోజువారీ నిర్వహణ సవాళ్లను ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు ఊరట లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనుల నిర్వహణకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించింది. సమస్యలు తక్షణ పరిష్కారం.. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా కేంద్రం రూ.11.30 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ గ్రాంట్లు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ కానున్నాయి. కేంద్రం నిధులు అందించడంతో పల్లెల్లో నిలిచిపోయిన ప్రాథమిక, అత్యవసర సేవలకు మళ్లీ జీవం పోసినట్లయింది. కొన్ని నెలలుగా చిన్నచిన్న పంచాయతీల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, తాగునీటి మోటార్ల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, చెత్త సేకరణ వాహనాల ఇంధనం తదితర వ్యయాలకు ఆర్థిక ఇబ్బంది నెలకొంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో ఆయా సమస్యలు పరిష్కారం కానున్నాయి. ప్రతీ రూపాయికి ‘డిజిటల్’ లెక్క.. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికాబద్ధమైన, పారదర్శకమైన వ్యయానికి మాత్రమే కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. పంచాయతీల్లో చేపట్టే ప్రతి పని, దానికి సంబంధించిన నిధుల వినియోగ వివరాలను తప్పనిసరిగా డిజిటల్ విధానంలో (ఆన్లైన్ పోర్టల్లో) నమోదు చేయాల్సి ఉంటుంది. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ వ్యయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రజల అత్యవసరాలు, కనీస సౌకర్యాల కల్పనకే ఈ గ్రాంట్లను వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. మండలాల వారీగా విడుదలైన నిధులు మండలం జీపీలు నిధులు భూపాలపల్లి 26 రూ.1,10,41,478 రేగొండ 23 రూ.1,16,60,128 చిట్యాల 26 రూ.1,13,24,367 గణపురం 17 రూ.1,08,15,827 మొగుళ్లపల్లి 26 రూ.1,05,78,302 టేకుమట్ల 25 రూ.83,35,436 కొత్తపల్లి గోరి 16 రూ.56,31,237 కాటారం 24 రూ.1,29,26,867 మహాముత్తారం 24 రూ.1,00,24,684 మహదేవపూర్ 18 రూ.98,31,841 మల్హర్ 15 రూ.79,66,502 పలిమెల 8 రూ.28,25,202 -
నేరాల నియంత్రణకు ప్రాధాన్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రజల భద్రత దృష్ట్యా నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో నాణ్యమైన, శాసీ్త్రయ దర్యాప్తు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేసును సకాలంలో నమోదు చేసి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పారదర్శకత, సమాచార సమన్వ యం, ప్రజలకు అందించే సేవల నాణ్య తను మరింత మెరుగుపరచాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
● ఈ నెల 16న జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాక ● పంచాయతీరాజ్ హమ్ రోడ్ల పనులకు ఇక్కడి నుంచే శ్రీకారం ● రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క ములుగు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 16న జిల్లాలో పర్యటించనున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీ రాజ్ హమ్ రోడ్ల పనుల కార్యక్రమానికి సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాలతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకొని, అనంతరం ములుగు చేరుకొని పైలాన్ ప్రారంభించడమే కాకుండా ఇంచర్ల గ్రామ శివారులో రూ.7 కోట్లతో నిర్మించిన ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని వర్చువల్, నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అభివృద్ధి పనుల వివరాలను అన్ని శాఖల అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు. -
పట్టణ సమస్యలపై దృష్టి సారించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్హాల్లో చైర్మన్ బుర్ర కొమురయ్య అధ్యక్షత శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదించిన వివిధ అంశాలకు సంబంధించిన ఎజెండాలను పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపట్టాలని అధికారులకు సమావేశం ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అఽధికారులు, పాలకసభ్యులు, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధికారులు హాజరుకాకుండా, మండలస్థాయి అఽధికారులు హాజరుకావడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ ద్వారా అధికారులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఉదయ్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో సమస్యల వెల్లువ ● 4వ వార్డులో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి నూతన మీటర్లు ఏర్పాటుచేయడం లేదని 4వ వార్డు కౌన్సిలర్ కన్నం యుగేందర్ అన్నారు. ● అదనపు భారం పడుతున్నా నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీష్ అన్నారు. ● గాంధీకాలేజ్ రోడ్డులో సీసీ రోడ్డు చివరలో విద్యుత్ స్తంభాలను తొలగించాలని 19వ వార్డు కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ కోరారు. ● తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంజూర్నగర్, పుల్లూరిరామయ్యపల్లికి వెళ్లే పైపులైన్ నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తాగునీటి లైన్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ గండ్ర హరీశ్రెడ్డి అన్నారు. ● విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అదనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, 2డీకో, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, పుల్లూరిరామయ్యపల్లిలో పాత వాటర్ ట్యాంక్, పాఠశాల భవనం తొలగించి అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని 9వ వార్డు కౌన్సిలర్ అప్పం కిషన్ కోరారు. ● రోడ్డుకు అడ్డంగా ఉన్న సపోర్ట్ విద్యుత్ స్తంభాలు తొలగించాలని 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్ కోరారు. ● జిల్లా కేంద్రంలో 24 గంటలు బెల్ట్ షాపులలో అమ్మకాలు, విచ్చలవిడిగా గుడుంబా తయారీతో మహిళలు, చిన్నారులు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని 5, 11, 12, 13, 18 వార్డు కౌన్సిలర్లు పూర్ణచందర్, రాజు, బొంతల సతీష్, బడితెల వెంకటస్వామి, సహదేవ్ తెలిపారు. ● కాకతీయకాలనీ నుంచి గడ్డిగానిపల్లి వరకు విద్యుత్ దీపాలు వెలగడం లేదని 1వ వార్డు కౌన్సిలన్ బౌతు శోభ అన్నారు. ● కార్మిక కాలనీలో మురికి కాలువలు దుర్వాసన వస్తున్నాయని, సక్రమంగా కాలువలు శుభ్రం చేయడం లేదని, చెత్త సేకరణ చేయడం లేదని 8, 16, 5, 28వ వార్డుల కౌన్సిలర్లు రాధ మంజుల, రేణుక నరేందర్ తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రశాంతంగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లిన కౌన్సిలర్లు -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
● డీఎస్పీ సూర్యనారాయణకాళేశ్వరం: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. గురువారం అరైవ్–అలైవ్లో భాగంగా మహదేవపూర్ మండలకేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురికి జరిమాన విధించి, తొమ్మి ది వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలని, వాహనాలకు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సాంభమూర్తి, రమేశ్, ఏఎస్సై సుందరలాల్ ఉన్నారు. -
పుంజుకున్న పత్తి, పెసర
భూపాలపల్లి రూరల్: ఈ వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా పడిపోగా.. పత్తి పంట మాత్రం కొంత ఊరటనిచ్చే స్థాయిలో ముందుకు సాగుతోంది. వర్షాభావ పరిస్థితులతో సాగు అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జూన్లో కురిసిన చినుకులతో రైతులు ఉత్సాహంగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. జూలై నెలాఖరు వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైంది, దీంతో వరి నాట్లు సాగుతున్నాయి. నీరులేని రైతులు పొలాలను బీళ్లుగా వదిలిపెట్టారు. వరి సాగు డీలా.. పత్తికే మొగ్గు.. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం..ఈ సీజన్లో అన్ని పంటలు కలిపి 2,16,734 ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. ఇందులో వరి 1,12,547 ఎకరాల్లో.. పత్తి 1,01,230 ఎకరాల్లో సాగవుతుందని భావించారు. కానీ ఎల్నినో ప్రభావం, ఎండలతో పరిస్థితి మారింది. ఇటీవల కురిసిన అడపాదడపా చిరు జల్లులతో ప్రస్తుతం ఇప్పటివరకు 48,866 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడిని తట్టుకునే పత్తి పంటను రైతులు ఎక్కువగా ఆశ్రయించారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 1,09,132 ఎకరాలకు చేరుకుని అంచనాలను మించింది. కంది, పెసర, మినుము పంటలతో కలిపి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,65,589 ఎకరాల్లో సాగు నమోదైంది. పచ్చగా పత్తి చేలు.. వరి సాగు నిరాశ పరిచినప్పటికీ, సాగు చేసిన పత్తి చేలు మాత్రం ఇటీవల కురిసిన జల్లులకు ఏపుగా పెరుగుతున్నాయి. భూపాలపల్లి, కాటారం, చిట్యాల, టేకుమట్ల, రేగొండ తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి చేలలో గుంటకలు తోలడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. మరో నెల రోజుల్లో రెండు మూడు మంచి వర్షాలు కురిస్తే పత్తి దిగుబడి చేతికి వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. వరి నార్లు పోసుకున్న రైతులు ఈ నెల 15 వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉందని.. నీటి లభ్యత లేని పక్షంలో వ్యవసాయ శాఖ సూచించిన విధంగా కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. పెరిగిన పెసర సాగు.. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులు పెసరపంటకు ప్రాధాన్యం ఇచ్చారు. ఐదు సంవత్సరాలలో జిల్లాలో 250 ఎకరాలకు పైగా సాగు కాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 3,369 ఎకరాల్లో సాగైనట్లు, పెసర సాగు మరింత పెరిగేఅవకాశం ఉన్నట్లుఅధికారులు చెబుతున్నారు. తలకిందులైన వానాకాలం అంచనాలు పత్తికి అనుకూలంగా వాతావరణం 1,09,132 ఎకరాల్లో పత్తి సాగు 3,369 ఎకరాల్లో పెసర -
‘సార్’ సేవలు చిరస్మరణీయం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని విగ్రహానికి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు నిజమైన నివాళి అని తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనలో జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్వాతంత్య్ర’ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేడుకల్లో ప్రతీ కార్యక్రమం ‘మినిట్ టు మినిట్’ ప్రణాళిక ప్రకారం అంతరాయం లేకుండా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరిక్రిష్ణ, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వరరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగిరం చేయాలి.. దుబ్బపల్లి ఆర్అండ్ఆర్ కాలనీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ, రక్షణ చర్యలు, ప్రజలకు వైద్యసేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 12 నుంచి అక్టోబర్ 18 వరకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంఅండ్హెచ్వో డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అఽధికారులపై ఆగ్రహం భూపాలపల్లి అర్బన్: కేజీబీవీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ రాహుల్శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై డీఈ రామకృష్ణతో ఫోన్ ద్వారా మాట్లాడి, వారం రోజుల్లోగా పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు విషయాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, ఎంపీడీఓ తరుణ్ప్రసాద్, పాఠశాల ఎస్ఓ ఈశ్వరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. దుబ్బపల్లి అభివృద్ధి పనులు వేగిరం కలెక్టర్ రాహుల్ శర్మ -
పాత యూనిఫాంలతోనే వస్తున్నాం..
నిరుడు అందంచిన యూనిఫాంలు చినిగిపోయాయి. పాత యూనిఫాంలు వేసుకునే స్కూల్కు వస్తున్నాం. కొత్తవి వెంటనే అందించాలి. నిరుడు కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పుడు అట్లనే లేట్ చేస్తున్నారు. బి.ఆరాధ్య, పీఎస్ ఆజాంనగర్, 5వ తరగతిపాఠశాలలో ఇంకా యూనిఫాంలు ఇవ్వలేదు. ఇంట్లో కొత్తవి కుట్టించే పరిస్థితి లేదు. దీంతో పాతవాటినే వేసుకొని పాఠశాలకు వస్తున్నాం. పాఠశాలలలు ప్రారంభమై రెండు నెలలు గడిచాయి. ఎప్పుడు ఇస్తారో తెలియదు. జెండా వందనం కూడా దగ్గరకు వచ్చింది. –శివకుమార్, పీఎంశ్రీ పాఠశాల, గొల్లబుద్దారం, 8వ తరగతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా విద్యార్థులకు కావాల్సిన క్లాత్ రాలేదు. దీంతో యూనిఫాంల పంపిణీ ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం జిల్లాల వారీగా పంపిణీ చేస్తుంది. మన జిల్లాకు ఎప్పుడు వస్తాయో తెలియదు. క్లాత్ వచ్చిన వెంటనే ఇందిర మహిళా శక్తి సంఘాలతో కుట్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మహిళా సంఘాలలో సమావేశం నిర్వహించాం. – రమేష్, సీఎంఓ, జిల్లా విద్యాశాఖ -
రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు చెక్!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలకు చెక్ పడనుంది. ఉమ్మడి వరంగల్లో నాలుగు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణాలకు కేంద్ర రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. వీటి కోసం ఏకంగా రూ.197 కోట్లను కేటాయించింది. ఇప్పటికే ఒకచోట టెండర్ ఖరారుకాగా.. మరోచోట డిజైన్లు, అంచనాల రూపకల్పన జరుగుతోంది. ఇంకోచోట రైల్వే వాటా పనులు పూర్తికాగా.. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఒక ఆర్యూబీ పనులు మాత్రం నిలిచిపోయాయి. పెండింగ్ పనులపైన దృష్టి సారించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంనుంచి మరో మూడు.. కేంద్ర రైల్వేశాఖ చేపట్టిన నాలుగు పనులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరో మూడు ఆర్వోబీల నిర్మాణం జరుగుతోంది. కాజీపేట–వరంగల్ మార్గంలోని ఎల్సీ నంబర్ 60, ఎల్గుర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 66, 67 వద్ద వీటిని నిర్మిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రైల్వే క్రాసింగ్ల సమస్యకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాకపోకల అంతరాయానికి చెక్.. రాష్ట్రంలో మరో 118 ఆర్వోబీ, ఆర్యూబీ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అంచనా వ్యయం సుమారు రూ.4,883 కోట్లుగా స్పష్టం చేసిన రైల్వేశాఖ.. ఇందులోనే మూడు ఆర్వోబీలు, ఏడు ఆర్యూబీలు, ఎనిమిది లెవల్ క్రాసింగ్లు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నట్లు వివరించింది. క్రాసింగ్ల వద్ద రైళ్ల రాకపోకల సమయంలో వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో.. వీటి స్థానంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణంలో భూసేకరణ, వివిధ శాఖల అనుమతులు, వాతావరణ పరిస్థితుల వల్ల జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. పనులను వేగవంతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తూ, ఆమోదంలో జాప్యం లేకుండా ప్రామాణిక డ్రాయింగ్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. నాలుగు లెవల్ క్రాసింగ్ల వద్ద చేపట్టనున్న పనుల అంచనా వ్యయం రూ.197 కోట్లు కాగా, ఆ మేరకు నిధులు కేటాయించారు. ఈ నాలుగు పనుల్లో ఒక్కదానికి టెండర్ సైతం ఖరారు చేశారు. మిగతా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నా యి. పనులు, నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్–చింతలపల్లి మార్గంలోని ఎల్సీ నంబర్ 64 వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.77 కోట్లు అంచనా వేశారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 69/ఎం వద్ద రూ.100 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ప్రస్తుతం జనరల్ అరేంజ్మెంట్ డ్రాయింగ్ (జీఏడీ), అంచనాల తయారీ పనులు జరుగుతున్నాయి. ఎల్గూర్–నెక్కొండ మార్గంలోని ఎల్సీ నంబర్ 70 వద్ద రూ.12 కోట్లతో చేపట్టిన ఆర్యూబీ పనుల్లో రైల్వేవాటా పూర్తయింది. అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. నెక్కొండ–ఇంటికన్నె మార్గంలోని ఎల్సీ నంబర్ 74 వద్ద రూ.8 కోట్లతో చేపట్టాల్సిన ఆర్యూబీ పనులు కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగుచోట్ల ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం వరంగల్లో రైల్వే వంతెనలకు రూ.197 కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం -
పీఆర్సీని అమలు చేయాలి
చిట్యాల: ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నక్క తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వివిధ పాఠశాలల్లో యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు దాటినా ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. పెండింగ్లో ఉన్న ఏడు డీఏలను తక్షణమే పరిష్కరించాలని.. లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాముకుంట్ల తిరుపతి, జిల్లా బాధ్యులు బండారి సదయ్య, మండల అధ్యక్షుడు యోగానంద చారి, ప్రధాన కార్యదర్శి ప్రతాప్కుమార్ పాల్గొన్నారు. రాజీమార్గంతో పరిష్కారం భూపాలపల్లి రూరల్: కేసుల్లో చిక్కి ఇబ్బందిపడే పేదవారికి జిల్లా న్యాయ సేవాధికారాసంస్థ అండగా ఉంటుందని, రాజీమార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం మేలని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం, చికెన్పల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివాదాలు లేని సోదరాభావంతో జీవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, మహిత, వెంకటేష్, రాజ్కుమార్ పాల్గొన్నారు. పాండవుల గుట్ట సందర్శన రేగొండ: రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో వేసిన పెయింటింగ్లను పరిశీలించారు. అనంతరం గుట్టలపై ట్రెక్కింగ్ చేశారు. చారిత్రక సంపదను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట హనుమకొండ జిల్లా అటవీశాఖ అధికారి ముకుంద్ రెడ్డి, ఫారెస్ట్ డివిజనల్ అధికారి అప్పలకొండ, ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రమౌళి, ఫారెస్ట్ బీట్ అధికారి వెంకట్, తదితరులు ఉన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
భూపాలపల్లి: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లాకేంద్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను ఎస్పీ సందర్శించారు. సెంటర్లోని అత్యాధునిక సాంకేతిక వసతులు, శిక్షణ ప్రయోగశాలలు, విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఎస్పీ మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రతీ యువకుడి విజయానికి కీలకమని సూచించారు. ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించి, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్ జుమ్లానాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ డి నరేష్కుమార్ పాల్గొన్నారు. మహనీయుడు జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘సార్’ చిత్ర పటానికి ఎస్పీ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పారదర్శకంగా భూ హక్కుల చట్టం
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్భూపాలపల్లి: జిల్లాలో భూ హక్కుల చట్టం–2025 అమలు నేపథ్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో భూ భారతి పోర్టల్ వినియోగంపై రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ.. ప్రజాసేవలకు అంతరాయం లేకుండా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ ద్వారా సిబ్బంది సామర్థ్యం పెరిగి, భూ సంబంధిత సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఈ సెక్షన్ పర్యవేక్షకుడు హరిహర ప్రసాద్ పాల్గొన్నారు. 10 నుంచి నిరసన కార్యక్రమాలు భూపాలపల్లి అర్బన్: బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీఐ సభ్యుడు మంద నరసింహారావు పిలుపునిచ్చారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జోక్యం చేసుకుని 12వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి
రేగొండ: ఎల్నినో ప్రభావం కారణంగా నీటి సంరక్షణకు చర్యలు చేపట్టి, భూగర్భ జలాల పెంపులో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం మండలంలోని గూడెపల్లి గ్రామంలో రైతు లింగంపల్లి సంతోష్ రావు నిర్మించిన ఫాం పాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జల సంరక్షణ అత్యంత కీలకమని, వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. వర్షాభావ సమయంలో ఫాంపాండ్స్లో నిల్వ ఉన్న నీటితో పంటల సాగుతో పాటు, చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఫాం పాండ్స్ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. అంతర పంటలను సాగు చేయాలి తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం సాధించే దిశగా రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటు అంతర పంటలను సాగు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ రైతులకు సూచించారు. మండలంలోని రామన్నగూడెం తండా శివారులో రైతు శ్రీరాముల రఘుపతి చేపట్టిన అంతర పంటల సాగును పరిశీలించారు. అనంతరం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాగణంలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. యుద్ధప్రతిపాదికన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా ఉద్యానవన అధికారి తిరుపతి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డీఆర్డీఓ ఏపీడీ సంతోష్రెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ రజాక్, ఎంపీఓ సురేష్ పాల్గొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి భూపాలపల్లి అర్బన్: ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సిబ్బంది సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటరత్నం బుధవారం కలెక్టర్ను తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యసేవలు, సిబ్బంది సమయపాలన, పారిశుద్ధ్య కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రిలో పరిశుభ్రత పకడ్బందీగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవగాహనతోనే హెచ్ఐవీ నియంత్రణ భూపాలపల్లి: ప్రజల్లో నిరంతర అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ ఉంటుందని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష హ్యాండ్బుక్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాటాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ అధికారి డాక్టర్ సందీప్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, దిశ సభ్యులు జ్యోతి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
గణపురం: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కతూ పెరిగిపోతున్నాయని.. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. గణపురం మండలంలోని చెల్పూరు కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సురక్షా కా తిరంగా కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే గోల్డెన్ అవర్(మొదటి గంట) అత్యంత కీలకమని వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్చేయడం లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణమే పిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకోవద్దని బ్యాంకుల ద్వారానే రుణాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేటీపీపీ ఇన్చార్జ్ సీఈ కోటేశ్వర్ రావు, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, గణపురం సీఐ కరుణాకర్రావు, కేటీపీపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
● మంత్రి తుమ్మల నాగేశ్వరరావువెంకటాపురం(కె): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు చిడెం మోహనరావు ఇంటి వద్ద ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి డిస్టిలేషన్ను రద్దు చేయాలని సీపీఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపు అసోసియేషన్ ఆధ్వర్యంలోయూరియాను గతంలో ఇచ్చినట్లు ఎఫ్ఓఎల్ ద్వారా డీలర్లకు అందజేయాలని వినతిప్రతం అందజేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి మండలానికి వచ్చే రహదారి గుంతలమయంగా మారడంతో మంత్రి తుమ్మల కారు పాత్రాపురం గ్రామ శివారుల్లో పంచ్చర్ కావటంతో మంత్రి తుమ్మల వేరే కారులో మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, మన్నెం సునీల్, సయ్యద్ హుస్సేన్, చిడెం శివ, ధనపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● నియోజకవర్గంలో ఓటర్లు 2,77,882 ● డిజిటలైజేషన్ పూర్తయినవి 2,41,866 ● అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కంటే 6.27 శాతం పెరుగుదల ● సమాచారం ఇవ్వని, మృతులు, డబుల్ ఓట్లు 36,016 ● పై జాబితాలో జిల్లాకేంద్రంలో 17,975 మంది ఓటర్లు -
పింఛన్ల కోసం ఎదురుచూపు
కాళేశ్వరం: కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న వారందరూ దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దీంతో భారీగా అప్లికేషన్లు రానున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో ఎక్కువగా పింఛన్ల మంజూరు కోసం ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన ఎంతోమంది వితంతువులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు అర్హులందరూ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. స్పష్టత ఏది.. ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని సూచనప్రాయంగా ప్రభుత్వం ప్రకటించింది. మొదట వితంతు, దివ్యాంగులుకు మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పింఛన్ పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్న పింఛను పెంచకపోగా కొత్త పింఛన్ల మంజూరుపై జాప్యం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు కొత్త పింఛన్ల మంజూరు లేకపోయినా సదరం క్యాంపులు నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా పింఛన్ల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారు. పెండింగ్ దరఖాస్తులు జిల్లావ్యాప్తంగా 3,862 వృద్ధాప్య, 3,101 వితంతు, 1,110 దివ్యాంగులు, 361 కల్లుగీత కార్మికులు, 163 నేత కార్మికులు, 37 ఫైలేరియా, 58 డయాలసిస్, 1,194 మంది ఒంటరి మహిళలు, 47మంది బీడీ కార్మికులు పింఛన్ పొందుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 176 వరకు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. పెన్షన్లపై ప్రభుత్వం ప్రకటన చేసినా.. జీఓ మాత్రం ఇవ్వలేదు. పింఛన్ల గురించి ఉన్నతాధికారులు ఆరా తీయలేదు. ఎంపీడీఓల వద్ద దరఖాస్తులు ఆధారంగా రిపోర్టు ఉంది. – బాలకృష్ణ, డీఆర్డీఏ ప్రభుత్వ ప్రకటనతో భారీగా రానున్న అప్లికేషన్లు జిల్లాలో 176 పెండింగ్ దరఖాస్తులు -
ఐటీఐలో ప్రవేశాలు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వాక్ ఇన్ ప్రవేశాలు కల్పించనున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, కన్వీనర్ జుమ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అపరాధ రుసుం లేకుండా వాక్ ఇన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సూపరింటెండెంట్గా డాక్టర్ వెంకటరత్నం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ చెనుమల్ల వెంకటరత్నం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్థానంలో ఈఎన్టీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నంను నియమిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం ఇయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో కొడారి హిమజ అండర్–16 (జావెలిన్ త్రో), ఎల్లిపాయల శృతి అండర్ 18 (షాట్ ఫుట్), భూతం సాయి వర్షిని అండర్–14 కిడ్స్ (జావెలిన్), గాలి వర్షిత అండర్–12 (రన్నింగ్) విభాగాల్లో ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అజ్మీర రాంచరణ్ (అండర్– 18) షార్ట్ ఫుట్, వేముల అభిరాం అండర్–18 రన్నింగ్, కుదురుపాక అండర్–18 రన్నింగ్ విభాగంలో ఎన్నికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. జిల్లా కమిటీ ఎన్నిక ములుగు రూరల్: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడ్డం క్రాంతి కుమార్(కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా తాజుద్దీన్(ఎస్సై), కృష్ణప్రసాద్(ఎస్సై), కార్యదర్శిగా సురేశ్(సీఐ), జాయింట్ సెక్రటరీగా నరేశ్(హెడ్ కానిస్టేబుల్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయ్(హెడ్ కానిస్టేబుల్), ట్రెజరర్గా సర్వేశ్వర్రావు(కానిస్టేబుల్), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అనిల్కుమార్, రాజీవ్, స్వప్న యాదవ్, శోభన్, తిరుపతి, శంకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజాయతీగా , పారదర్శకంగా పని చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంక్షేమం, పరస్పర సహకారంతో అసోసియేషన్ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే మండలసభ వెంకటాపురం(ఎం): మండల పరిధిలో నిర్వహించే సభ ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దిక్సూచిలా, నిజమైన ప్రజా వేదికగా మారాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీలు సమగ్రాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న మౌలిక వసతుల కొరతతో పాటు ప్రజల నుంచి వస్తున్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను ఈ నెల 15వ తేదీ లోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల సభను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు మండల స్థాయి అధికారులు నేరుగా హాజరుకావాలని, తమకు బదులుగా కింది స్థాయి సిబ్బందిని లేదా ప్రతినిధులను పంపితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చే సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ మొగుళ్లపల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మధుసూదన్ సూచించారు. బుధవారం మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పిడిసిల్ల, మొట్లపల్లి ఉపఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికలు, వైద్య రికార్డులు పరిశీలించిన ఆయన చిన్నారులకు అందిస్తున్న టీకాల (వ్యాక్సినేషన్) కార్యక్రమం పురోగతిని సమీక్షించి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు నాణ్యంగా అందించేలా ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలో ఫార్మసీ, నర్సింగ్ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో జ్వరాలపై నిరంతర నిఘా ఉంచి, అనుమానిత కేసులను వెంటనే గుర్తించి అవసరమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగరాణి, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ క్యాంపులు పెంచాలి
మల్హర్: ఎన్సీడీ, టీబీ స్క్రీనింగ్, మెడికల్ క్యాంపులు పెంచాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ మధుసూదన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అన్ని ఎన్హెచ్ఎం, స్టేట్ ప్రోగ్రాం సబ్ సెంటర్ల వారీగా రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనితీరు తక్కువగా ఉన్న సబ్ సెంటర్ల పనితీరును పెంచాలని, అన్ని సబ్ సెంటర్లలో టీబీ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ పరిధిలో అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీపీఓలు శ్రీదేవి, దేవేందర్, సందీప్, నాగరాణి, డీడీఎం మధుబాబు, డీపీఓ చిరంజీవి, మండల వైద్యాధికారి వినయ్భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి మధుసూదన్ -
హామీలు నిలబెట్టుకోవాలి..
సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. సమగ్ర శిక్షను పూర్తిస్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీచేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించాలి. సమ్మె కాలపు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు జమ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. – తౌటం నరేష్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి
భూపాలపల్లి అర్బన్: అవయవదానం ఉద్యమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాలలో అవయవ, శరీర, నేత్రదానంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 3న వివిధ పోటీలు నిర్వహించగా, మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు అవయవదానం చేసే పరిస్థితిలో ఉండాలన్నారు. నేత్ర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజా భరత్ కుమార్ నేత్రదానం ప్రాముఖ్యతను వివరించి, అపోహలను తొలగించారు. తెలంగాణ కంటి, చర్మ, నేత్ర, దేహదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ లింగం అవయవదానం, దేహదానం అవసరం, సామాజిక ప్రయోజనాలను వివరించి విద్యార్థుల్లో చైతన్యం కలిగించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్, డాక్టర్ అజయ్ ప్రకాశ్, మల్లారెడ్డి, చంద్రమౌళి, రాజు, భూమయ్య పాల్గొన్నారు. -
పనులు వేగవంతం చేయాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుగణపురం: మండలంలోని గాంధీనగర్ గ్రామశివా రు గుట్టలపై నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట ర్, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్ర మాణాలతో వేగవంతంగా భవన నిర్మాణ పనుల ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న ఈ విద్యా సంస్థ భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందిస్తుందని ఆకాంక్షించారు. నాణ్యతతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అసమగ్ర కొలువులు
భూపాలపల్లి అర్బన్: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు ఆశ, నిరాశలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదని, శ్రమకు తగ్గ వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం టైం స్కేల్ ఇస్తామని ప్రకటించి క్షీరాభిషేకాలు చేయించుకుని మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 13 విభాగాల్లో 368 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. కేజీబీవీల్లో 251 మంది, సీఆర్పీలు 65, ఎంఆర్సీ సిబ్బంది 46, డీఈఓ కార్యాలయ సిబ్బంది 6 మంది పని చేస్తున్నారు. కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించే యూడేస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక పాత్ర, బియ్యం పంపిణీ, పాఠశాల బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం వంటి పనులు ఈ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాష్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యూకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఎస్ఎస్ఏ పరిధిలోకి వస్తారు. తమ డిమాండ్ల సాధన కోసం 2024 డిసెంబరు 6నుంచి 2025 జనవరి 7వరకు సమ్మె కొనసాగించారు. సమ్మె విరమణ సమయంలో పేస్కేల్ అమలుపై మూడు నెలల్లో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఉత్తర్వులు జారీచేస్తామని, సమ్మె కాలపు వేతనం అందజేస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధనకోసం 15ఏళ్లుగా వివిధ సందర్భాల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తమ సమస్యలను పట్టించువడం లేదని వాపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబాల పోషణకు ఆవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా తమను విద్యాశాఖలో విలీనంచేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ.20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కు టుంబాలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు అందించాలి. సమ్మె చేసినా పరిష్కారం కాని సమస్యలు చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణకు అవస్థలు ప్రభుత్వంపై నమ్మకంతో ఆశగా ఎదురుచూపు -
స్కూల్కు వెళ్లాలంటే సాహసమే..!
చినుకుపడితే చాలు కలెక్టర్ కార్యాలయ సమీపంలోని మంజూర్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్కూల్కు వెళ్లే దారి మొత్తం బురదమయంగా మారుతుండడంతో చిన్నారి విద్యార్థులు ప్రతి రోజూ సాహాసం చేయాల్సి వస్తోంది. చదువుకోవాలనే ఆరాటం ఒకవైపు.. ప్రమాదకరమైన దారి మరోవైపు.. ఇలా విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. అడుగడుగునా నీరు నిలిచిపోవడంతో చిన్నారులు చెప్పులు చేతిలో పట్టుకుని, బురదలో నడుచుకుంటూ పాఠశాలకు చేరాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాల ఆవరణలోనూ మోకాళ్ల లోతు వరకు నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు ఇటుకలపై అడుగులు వేస్తూ తరగతి గదులకు చేరుతున్నారు. – భూపాలపల్లి అర్బన్ -
మహిళా ఉద్యోగులకు ‘శక్తి’ రక్షణ కవచం
సాక్షిప్రతినిధి, వరంగల్: కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది. స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి) శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తూ జీఓఆర్టీ నంబర్ 277ను మంగళవారం జారీ చేసింది. దీంతో ఈ శాఖ పరిధిలో పనిచేసే మహిళా ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే లైంగిక వేధింపులపై అధికారికంగా ఫిర్యాదు చేసి, విచారణ కోరే అవకాశం కలిగింది. నలుగురితో ఐసీసీ.. ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ టు ఎంజీ మాధవి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సెక్షన్ ఆఫీసర్ యు.గాయత్రీదేవి, ఏఎస్ఓ ఎస్.రజితారెడ్డి, ఏఎస్ఓ ఎ.జయశ్రీ సభ్యులుగా నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడినుంచైనా మహిళా ఉద్యోగులనుంచి వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను కమిటీ స్వీకరించి, విచారణ జరిపి సమగ్ర నివేదికను రూపొందించనుంది. అనంతరం ఆ నివేదికను ప్రభుత్వ కార్యదర్శికి సమర్పిస్తుంది. విచారణ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అవసరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్లోనూ ప్రాధాన్యం.. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నిషేధం, ఫిర్యాదుల పరిష్కారానికి ఉద్దేశించిన 2013 నాటి ‘పోష్’ చట్టం ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 2023 మే 12న సివిల్ అప్పీల్ నంబర్ 2482/2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగా రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అన్ని సచివాలయశాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు శక్తి శాఖ తాజాగా ఐసీసీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పరిధిలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి ఆయా కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండనుంది. ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారణ చేపట్టేందుకు ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. నలుగురు సభ్యులతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు లైంగిక వేధింపులుంటే విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్లోనూ పటిష్టంగా అమలు -
రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం
మల్హర్(కాటారం)/మహాముత్తారం: రాజీమార్గంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాటారం సెంటర్, గ్రామ పంచాయతీ, ఇబ్రహీంపల్లి, చింతకానీ, గొర్లకుంట, మాదారం, మహాముత్తారం మండల కేంద్రంతోపాటు కొర్లకుంట, మాదారం గ్రామాల్లో అవగాహన సదస్సులు, మొబైల్ వ్యాన్లో విస్త్రత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం పొందదగిన వారు, కోర్టు కేసుల్లో చిక్కి ఇబ్బందులు పడేవారు, న్యాయాన్ని పొందలేని నిస్సహాయులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.అక్షయ, ప్యానెల్ లాయర్ పారానంది సురేందర్, సూపరింటెండెంట్ రఘురామ్, కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జి.నవీన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ -
ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్
భూపాలపల్లి: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ రిక్రూట్మెంట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో సుమారు 7,112 ఖాళీల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ రిక్రూట్మెంట్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అర్హత కలిగిన ఫిజికల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ, ఉచిత వసతి, తరగతి బోధన, శారీరక శిక్షణ కల్పన పూర్తిగా ఉచితంగా ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వరకు తమ సమీప పోలీస్స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోలీసు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో శ్రమించి తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్ కావాలనుకునే వారికి గోల్డెన్ చాన్స్ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
చిగురించిన ఆశలు..
భూపాలపల్లి రూరల్: అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆరుతడి పంటలన్నీ జీవం పోసుకున్నాయి. ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో అన్నదాతలు కష్టాలు గట్టెక్కినట్లే. కురిసిన వర్షాలు పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు మేలు చేకూర్చాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జూన్లో సాధారణ వర్షపాతం 152.9 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 120.8 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 322.9 మి.మీకు 367.8 మి.మీ నమోదైంది. గతనెలలో 14శాతం అధికంగా, ఈ నెలలో 41.7మి.మీలకు 63.6 నమోదుకాగా.. ఇప్పటివరకు 53 శాతం అధికంగా వర్షం కురిసింది. రెండు మండలాల్లో తక్కువ జిల్లాలో ఈ నెలలో నాలుగు రోజుల్లో కాటారం, గణపురం మండలాల్లో మాత్రమే కాస్త తక్కువ వర్షపాతం నమోదైంది. మహాముత్తారం, మల్హర్, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. మహదేవపూర్, పలిమెల, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 మండలాల్లో 4 మండలాల్లో సాధారణ వర్షపాతం.. 2 మండలాల్లో కాస్త తక్కువ, 6మండలాల్లో ఎక్కువ వర్షపాతం కురిసింది. పూత, కాత దశలో పెసర, కంది.. జూన్ మధ్య మధ్యలో వర్షాలు కురవడం, జూలైలో సైతం అప్పుడప్పుడు కురిసిన చినుకులతో పెసర, కంది పంటలకు మంచి మేలు చేకూరింది. ప్రస్తుతం ఈ రెండు పంటలు పూత, కాత దశలో ఉన్నాయి. మృగశిర కార్తెకు రెండు రోజుల ముందు కురిసిన వర్షాలకు కొందరు రైతులు పెసర, మినుము విత్తుకోగా ఆ పంటలు ప్రస్తుతం కాతదశకు వచ్చాయి. తర్వాత వేసిన కమతాల్లోని పంట పూత, అక్కడక్కడా కాత దశలో ఉన్నాయి. పెసర, కంది స్వల్పకాలికాలు కావడంతో 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇప్పటికే 45నుంచి 50రోజుల కాలం అవుతుంది. మరో 25 రోజుల్లోపు పెసర, కంది పంటలు నూర్పిళ్లు చేసుకోనున్నారు. ఈ సారి వాతావరణం ఇలాగే అనుకూలిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ముసురుతో ఆరుతడి పంటలకు మేలు రెండు మండలాల్లో తక్కువ, 6మండలాల్లో అధిక వర్షపాతం నమోదు ఏపుగా పెరిగిన పత్తి చేలు -
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
● ఆర్డీఓ రవీందర్ మహాముత్తారం: సాదాబైనామా, భూభారతికి సంబంధించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అన్నారు. మంగళవారం ప్రొబషనరీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డితో కలిసి మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ భూభారతికి సంబంధించిన దరఖాస్తులతో పాటు చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అర్జీలు, అన్ని రకాల సర్టిఫికెట్ దరఖాస్తులకు త్వరితగతిన పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ భాస్కర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ మల్హర్(కాటారం): కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్ఓ మధుసూదన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, హాజరు రిజిస్టర్లు, ల్యాబ్, ఫార్మసీ, ఐపీ వార్డు, ఎక్స్–రే గదిని తనిఖీ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వర్షాకాల సన్నద్ధత నేపథ్యంలో కాలానుగుణ వ్యా ధుల నివారణకు అవసరమైన టెస్ట్ కిట్లు, మందులను తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, చిన్నారులు, సాధారణ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి మౌనిక, డాక్టర్ హారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూ పరింటెండెంట్గా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు నాగరా జు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆయనకు శాలువాతో సత్కరించారు. సద్వినియోగం చేసుకోవాలి భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎస్బీఐ అందించే బీమా సౌకర్యంతో పాటు వివిధ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఉద్యోగులకు రూ.3.31కోట్ల వరకు ఉచిత బీమా రక్షణతో పాటు ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. పర్సనల్ లోన్స్, హోమ్లోన్స్, కార్లోన్స్ తదితర రుణాలు అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయన్నారు. ఎస్టీఓ కార్యాలయానికి దారి కరువుఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగా రం, మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల ఉద్యోగులు, ప్రభుత్వ ఖజానా నిధులను మంజూరు చేసే ఉప కోశాధికారాలయానికి దారి కరువైంది. కోట్లాది రూపాయల బిల్లులను మంజూరు చేసే ట్రెజరరీకి దారిలేకున్నా కష్టాలు పడుతూ కార్యాలయానికి వెళ్తున్నారు. పలు పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులు సైతం దుస్తులు తడవకుండా బురద అంటకుండా జాగ్రత్తగా కార్యాలయానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్టీఓ అధికారి ఉన్నప్పటికీ కార్యాలయం అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. వెంటనే కార్యాలయానికి సీసీ రోడ్డు నిర్మించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●సాక్షి ప్రతినిధి, వరంగల్: పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతకు భారీ అవకాశాలు వచ్చాయి. తాజా నియామకాల్లో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి సంబంధించి కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ పోస్టులు కలిపి 1,117 ఖాళీల భర్తీగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో వివిధ కేడర్లకు చెందినవి అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 656 పోస్టులు ఉండగా.. ములుగు 189 పోస్టులతో రెండో స్థానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లికి 126, మహబూబాబాద్కు 106 పోస్టులు దక్కాయి. వీటితోపాటు ఎస్ఐ, ఆర్ఎస్ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో 101 అవకాశాలు ఉన్నాయి. మనదే అత్యధిక వాటా.. పోలీస్ కొలువుల్లో ఉమ్మడి జిల్లాకు అత్యధిక అవకాశాలున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ 721, ఏఆర్ 260 కలిపి మొత్తం 981 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 92 ఫైర్ ఫైటర్ పోస్టులు, జైళ్ల శాఖలో 42 పురుష వార్డర్, 2 మహిళా వార్డర్ పోస్టులున్నాయి. ఈ మూడు విభాగాల్లో 1,117 పోస్టులు ఉండడం నిరుద్యోగ యువతకు ఊరటనిస్తోంది. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 656 పోస్టులున్నాయి. ఇందులో 500 సివిల్ కానిస్టేబుల్, 129 ఏఆర్ కానిస్టేబుల్, 15 ఫైర్ ఫైటర్, 11 పురుష వార్డర్, ఒక మహిళా వార్డర్ పోస్టు ఉ న్నాయి. ములుగులో 189 పోస్టులు ఉండగా.. భూ పాలపల్లిలో 126, మహబూబాబాద్లో 106 పోస్టులు ఉన్నాయి. ఫైర్ ఫైటర్ పోస్టుల్లోనూ ములుగు 25 పోస్టులతో ముందంజలో ఉంది. జనగామలో 16, వరంగల్ కమిషనరేట్, భూపాలపల్లిలో 15 చొప్పున, మహబూబాబాద్లో 14, హనుమకొండలో 7 పోస్టులు ఉన్నాయి.వరంగల్ కమిషనరేట్ పరిధిలో 656 ములుగుకు ప్రాధాన్యం కింద 189 పోస్టులు.. మూడు జోన్లలో మరో 101 మందికి అవకాశాలు -
ఉత్పత్తి లక్ష్యాల సాధనపై దృష్టిపెట్టాలి
● ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్రెడ్డిభూపాలపల్లి అర్బన్: భద్రతతో పాటు ఉత్పత్తి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులకు ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. సోమవారం ఏరియాలోని కేటీకే–1వ గనిని సందర్శించి 12 టన్నుల సామర్థ్యం గల క్రేన్ను జీఎం ప్రారంభించారు. ఈ క్రేన్ ద్వారా భారీ యంత్రాలు, పరికరాల నిర్వహణ, మరమ్మతు పనులు మరింత వేగంగా, సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 56వ వార్షిక భద్రతా వారోత్సవాల్లో ‘పిట్ సేఫ్టీ’ విభాగంలో ప్రథమ, ‘సాండ్ స్టోవింగ్ మైన్స్’ విభాగంలో తృతీయ బహుమతి సాధించిన కేటీకే–1 ఉద్యోగులను అభినందించారు. గనిలో ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు, యంత్రాల నిర్వహణను సమీక్షించిన జీఎం, భద్రతకు రాజీ పడకుండా ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. కార్మిక సంక్షేమం, పరిశుభ్రత, క్రమశిక్షణ, నాణ్యతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు సాంబశివరావు, రవీందర్, రవికుమార్, రాజారావు, తిరుపతి, సారంగపాణి, సదయ్య, సమ్మయ్య, రఘుపతి పాల్గొన్నారు. -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి పెద్దఎత్తున వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. డి గ్రీలో ప్రవేశాలకు చివరి అవకాశం భూపాలపల్లి అర్బన్: డిగ్రీ దోస్త్ స్పెషల్ ఫేజ్ ప్రవేశాలకు ఈ నెల 11వ తేదీ వరకు చివరి అవకాశం కల్పించినట్లు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉందన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే వీలు ఉందని పేర్కొన్నారు. రెగ్యులర్ విధానంలో డిగ్రీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవేశాలు పొందాలని ఆయన కోరారు. లబ్ధికోసమే తప్పుడు ప్రచారం భూపాలపల్లి రూరల్: రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వంద పడకల ఆస్పత్రిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివారం ఆస్పత్రికి సెలవు అని తెలిసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఆస్పత్రిని సందర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆస్పత్రిలోని సమస్యలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిష్కరిస్తున్నారన్నారు. మూడు నాలుగు నెలల్లో ఆస్పత్రిలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇస్రోకు ఎంపిక భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామానికి చెందిన కొరవేన అశోక్ కుమారుడు శ్రీనాథ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బెంగళూరు(ఇస్రో)కు ఎంపికయ్యాడు. ఇస్రోలో నియామకాలలో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులతో పాటు గ్రామానికి సంబంధించిన పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీనాథ్ను అభినందిస్తున్నారు. పరామర్శ రేగొండ: కొత్తపల్లిగోరి మండలం చిన్నకొడేపాక గ్రామానికి చెందిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒంటేరు రవీందర్ ఇటీవల మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు పరిశోధన పట్ల ఆసక్తిని పెంచడం వంటి అంశాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ శ్యాంబాబు, నాయకులు బాబు, శ్రీనివాస్, రాజేందర్, భిక్షపతి, చంటి, అశోక్, పైడి పాల్గొన్నారు. రేపు మెగా జాబ్మేళా భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నెల 5న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లికి చెందిన హరే కృష్ణ మూవ్మెంట్ చారిటీస్ ఫౌండేషన్ సంస్థలో 72 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
పట్టుదలతో కృషి చేస్తే విజయం
ఉద్యోగాల నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబెక్ట్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. చదివిన ప్రతీ అంశాన్ని బిట్ బ్యాంక్ల ద్వారా ప్రాక్టీస్ చేయాలి. మీ విజయం మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం. – మల్లోజు సత్యనారాయణ చారి, కోచింగ్ నిపుణుడు, హనుమకొండ● -
విశ్వాసం పెంపొందించడమే లక్ష్యం
కాళేశ్వరం: పోలీసుశాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని, పోలీసులు అన్ని వేళల ప్రజలకు అందుబాటులో ఉండి కేసుల పరిష్కారానికి కృషిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. సోమవారం ఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదుచేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేస్తూ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, కేసు రికార్డుల నవీకరణ విధానాన్ని పరిశీలించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిర్వహించాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించి, వారిపై నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీస్స్టేషన్లో ఉత్తమ పనితీరు కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ రమేశ్, ఉమెన్ కానిస్టేబుల్ రాణిలకు ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేశారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు తమాషారెడ్డి, భగవత్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే ప్రజాదివస్ లక్ష్యం భూపాలపల్లి: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
కబ్జాదారులపై చర్య తీసుకోవాలి..
చిట్యాల మండలం భావుసింగ్పల్లి గ్రామ సమీపంలో వ్యవసాయ భూముల్లో గతంలో ఏర్పాటు చేసిన ఎస్సారెస్పీ కాలవను పలువురు పూడ్చి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే దారులను కబ్జా చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందించి కాలువను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ భూములకు వెళ్లేదారికి ప్రారంభించాలని కోరారు. – భావుసింగ్పల్లి రైతులుభూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడం.. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో సామాన్య ప్రజలు ప్రజావాణివైపే ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తుతున్నారు. తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో వివిధ మండలాల నుంచి ప్రజలు విన్నపాలతో కలెక్టరేట్కు వస్తున్నారు. సోమవారం కలెక్టర్ 81 దరఖాస్తులు స్వీకరించారు. -
పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించాలి
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్భూపాలపల్లి అర్బన్: ప్రతీ శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించడం అత్యంత ముఖ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 7వ తేదీ వరకు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ హాజరై మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తదితర శాఖల సమన్వయంతో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యం, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ సురేందర్, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ కవిత, డీడబ్ల్యూఓ మల్లేశ్వరి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగరాణి, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, బాలింతలు పాల్గొన్నారు. -
టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ
భూపాలపల్లి: జిల్లాలో టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రతీ అనుమానితుడికి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొబైల్ ఎక్స్రే వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు ప్రగతి నివేదికలు అందించాలి.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ఈ నెల 7వ తేదీ నాటికి అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల ద్వారా సాధించిన పురోగతి, అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన పూర్తి నివేదికలను డీపీఆర్ఓ శీలం శ్రీనివాస్కు సకాలంలో అందించాలని ఆదేశించారు. 99.55 శాతం డిజిటలైజేషన్ పూర్తి.. సర్లో భాగంగా జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ 99.55శాతం జరిగిందని కలెక్టర్ రాహుల్శర్మ వెల్లడించారు. హైదరాబాద్ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం జిల్లాలో సవరణ ప్రక్రియ వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరిక్రిష్ణ పాల్గొన్నారు. ప్రతీ అనుమానితుడికి పరీక్షలు తప్పనిసరి కలెక్టర్ రాహుల్ శర్మ -
పెద్దాస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ● ఆస్పత్రి పరిశీలన భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారిందని సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆదివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించి మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో తాగునీటి సమస్య, అపరిశుభ్రమైన వాతావరణం, రోగులకు కనీస సౌకర్యాల లేవని, వైద్య సేవలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకి రెండుసార్లు విజిట్ చేశామని, ఆస్పత్రికి కలెక్టర్, జిల్లా వైద్య అధికారులతో మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ నిత్యం సమీక్షలు నిర్వహించి ఆస్పత్రి అంటే ప్రజలకు భరోసా, నాణ్యమైన వైద్యం అందించేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం చిన్న సమస్య వచ్చినా ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది జిల్లా జనరల్ ఆస్పత్రా లేక రిఫరల్ సెంటరా...? అని ప్రశ్నించారు. ఐదు రోజులుగా తాగునీటి సరఫరా లేపోవడంతో తాగునీటి కోసం బయట నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారన్నారు. ఎమ్మారై స్కాన్ ప్రారంభించి నెల రోజుల పైనే అవుతున్నా సంబంధిత సిబ్బంది లేరని తెలిపారు. సంబంధిత మంత్రి రాజనర్సింహా ఆస్పత్రిని తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. -
రోడ్డుకు మరమ్మతు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని ఇటీవల సాక్షి దినపత్రికలో ‘నిధులున్నా.. అనుమతుల్లేవ్’ అనే శీర్షికన ప్రచురితమైంది. దీంతో స్పందించిన సర్పంచ్ గారె విజయలక్ష్మీశంకర్ ఆదివారం జేసీబీ సాయంతో బండలు, కంకరతో మట్టితో తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కుంగిన బావి.. రేగొండ: పంటకు సాగు నీటి కోసం తవ్వించిన బావి భూమిలోకి కుంగింది. ఈ ఘటన కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్పూర్లో చోటు ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన కొండా చందర్ 8 సంవత్సరాల క్రితం రూ.15 లక్షల వ్యయంతో బావిని తవ్వించి చుట్టూ ఓడలను నిర్మించాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం బావి వద్దకు వెళ్లగా బావి ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. దీంతో తనకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందజేయాలని రైతు కోరాడు. శాంతించిన గోదావరి ఏటూరునాగారం: మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద మూడు రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. ఈ మేరకు ఆదివారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 14.81 మీటర్లుగా నమోదు అయ్యింది. గోదావరి వరద ఉధృతి తగ్గి దిగువకు వెళ్తుండడంతో మండలంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద ఉధృతి తగ్గినప్పటికీ కరకట్ట వద్ద పరిస్థితి అదుపులోకి రాలేదు. మట్టి క్రమక్రమంగా ఒర్లిపోతుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక బస్తాలను వేసి మట్టి ఒర్లిపోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. భద్రకాళిని దర్శించుకున్న వరంగల్ సీపీ శ్వేత హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐఆర్ఎస్ అధికారి అపూర్వ సందర్శించా రు. ఈ సందర్భంగా అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, మహాదాశ్వీచనం అందజేశారు. క్యాంపస్ సెలక్షన్స్కు కాన్క్లేవ్ దోహదం కాజీపేట అర్బన్: క్యాంపస్ సెలక్షన్స్లో నిట్ విద్యార్థులకు ఇండస్ట్రీ కాన్క్లేవ్–26 దోహదపడుతుందని నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్ తెలిపారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఆదివారం నిట్ సీసీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్) సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ కాన్క్లేవ్ కెరీర్ లాంచ్ సమ్మిట్–26 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ వివరాలతో కూడిన బ్రౌచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. నిట్ విద్యార్థులు పరిశ్రమల్లో రాణించేందుకు తొలిసారిగా ఇండస్ట్రీ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సదస్సు వేదికగా నిలుస్తుందని తెలిపారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆన్లైన్లో సదస్సును వీక్షించారు. ప్లేస్మెంట్లో విద్యార్థులు ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. పరిశ్రమల ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
వసతులు అంతంతే!
ఏటూరునాగారం: జిల్లాలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా బాత్రూమ్స్, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూత్రూంలకు డోర్లు ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటే నల్లాల నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థుల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఐటీడీఏకు కూతవేటు దూరంలోని ఆశ్రమ వసతి గృహాలు, హాస్టళ్లలో వసతులు కూడా అంతంతమాత్రమే ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్శాఖ అధికారులు సైతం పనులకు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్న పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం మానిటరింగ్ చేసే అధికారి లేక పనులు అన్ని కూడా పెండింగ్లోనే ఉన్నాయి. గతంలో ఉన్న డీఈ వీరభద్రం ఈఈగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ పొందగా హైదరాబాద్లో పనిచేసే ఫణికుమారిని వరంగల్ ట్రైబల్ వెల్ఫేర్ సర్కిల్ ఆఫీస్కు ఎస్ఈగా ప్రమోషన్ ఇచ్చారు. దీనికితోడుగా ఏటూరునాగారం ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఆయన పట్ట ణానికే పరి మితం అవుతూ గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు పనులు గాలికి వదిలేశారు. దీంతో క్షేత్రస్థాయిలో జరగాల్సిన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. నిధులు మంజూరైనా.. మొదలు కాని పనులు వర్షాకాలంలో గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడొద్దని గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పలు పనుల కోసం ప్రతిపాదనలు చేసి పంపించింది. 2025 సెప్టెంబర్ 12న జీఓ నంబర్ 251 ప్రకారం పరిపాలన అనుమతి వచ్చింది. దాదాపుగా 10 నెలలు అవుతున్నా కూడా ఈ పనులు ప్రారంభించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఏటూరునాగారం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో బాత్రూంల నిర్మాణానికి రూ.28 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. అపరిశుభ్రంగా మరుగుదొడ్లు.. నీటి సమస్య పలుచోట్ల బాత్రూంలకు డోర్లు లేని పరిస్థితి పట్టించుకోని ఐటీడీఏ ఇంజనీరింగ్శాఖ అధికారులువసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కరువు -
ఓబీసీ మహా సభను విజయవంతం చేయండి
● బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్హన్మకొండ: బెంగళూరులో ఈనెల 7న జరగనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్ల సాధనే లక్ష్యంగా బెంగుళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ వేదికగా అఖిల భారత జాతీయ ఓబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీసీ విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బచ్చు ఆనందం, దొడ్డపల్లి రఘుపతి, తమ్మేల శోభారాణి, మాధం పద్మజాదేవి, సుశీల, తేళ్ల సుగుణ, తేళ్ల కిశోర్, అంబాల రవి పటేల్, అరేగంటి నాగరాజు, వేముల మహేందర్గౌడ్, తంగళ్లపెల్లి రమేశ్, దాడి రమేశ్ యాదవ్, కోలా ప్రతాప్ గౌడ్, అమరావతి సారంగపాణి, శనిగరపు సుమన్, చాగంటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
ములుగు రూరల్: ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు పోరాటాలు చేయాలని తెలిపారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి మహిళా ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు అల్లెం అప్పయ్య, ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్, అర్రెం నారాయణ, బాబురావు, ఈక కుమారస్వామి, రామకృష్ణ, రాజేష్కుమార్, సందీప్, జగ్గారావు, అశోక్, కుమారస్వామి, రాజబాబు, రాంచందర్, నారాయణ, మనోజ్ పాల్గొన్నారు. -
పుష్కరఘాట్ మరమ్మతుకు రూ.90లక్షలు
● ధ్వంసమైన పుష్కరఘాట్ రోడ్డుకు నిధులు కరువుఏటూరునాగారం: వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం మండల పరిధిలోని పుష్కరఘాట్ మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90లక్షలు తాజాగా మంజూరు చేసింది. ఇరిగేషన్శాఖ ద్వారా ఇప్పుడు ఉన్నఘాట్కు అదనంగా మరో 50 మీటర్ల పొడువునా ఘాట్ నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేవలం మరమ్మతులు చేస్తే చాలు అన్నట్లుగా రూ.90 లక్షలు కేటాయించింది. ఇప్పటికే పలుమార్లు వచ్చిన గోదావరి ఉగ్రరూపానికి ఘాట్ కిందస్థాయి మేట్లు కూలిపోయి కొట్టుకుపోయాయి. 2015లో నిర్మించిన ఘాట్ పగుళ్లుబారి ఉంది. ఇక్కడ నూతనంగా ఘాట్ నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేవలం మరమ్మతులతో సరిపెట్టేలా ప్రభుత్వం తక్కువ నిధులు మంజూరు చేయడంతో భక్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉంది. అయినా భక్తులకు కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏజెన్సీ ప్రజలు మండిపడుతున్నారు. శిథిలమైన పుష్కరఘాట్ రోడ్డు జిల్లాలో ఒకటి రామన్నగూడెం, రెండోది మంగపేట పుష్కరఘాట్లు ఉన్నాయి. ఇందులోని ఏటూరునాగారం రామన్నగూడెం పుష్కరఘాట్కు వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డుపై నుంచి ఒక వాహనం వెళ్తే మరో వాహనం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోడ్డు నూతనంగా నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీనివల్ల పుష్కరాలకు వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డును తొలగించి నూతనంగా సీసీ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
గడువులోగా పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తాం
● దేవస్థాన చైర్మన్ అవధాని మోహన్ శర్మ ● ఈఓ మహేష్తో కలిసి పనుల పరిశీలన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని దేవస్థాన చైర్మన్ అవధాని మోహన్ శర్మ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో గత ఐదు రోజులుగా కొనసాగుతోన్న కూల్చివేతలను దేవస్థానం ఈఓ మహేష్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శివరామ్ అండ్ కంపెనీ నిర్వాహకులతో సమావేశమై పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి అనుగుణంగా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అధిముక్తీశ్వర స్వామి వారి ఆలయం, బాలాలయాన్ని సందర్శించి అక్కడ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రాబోయే శ్రావణమాసంలో వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశమున్నందున దర్శనం, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రావణమాసంలో నిర్వహించే అభిషేక పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలు, శని పూజలు, ఇతర ప్రత్యేక పూజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకునే విధంగా దేవస్థానం తరుపు అన్ని చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట ఆలయ ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు. -
రుద్రేశ్వరస్వామికి అన్నపూజ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ చవితి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం నుంచి నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల మహాగణపతికి హరిద్రాకుంకుమ విలేపనాభిషేకం, గరికపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. హైదరాబాద్కు చెందిన శివభక్తుడు వెంకటసాయి ఆనంద విశ్వనాథ్ సౌజన్యంతో 51 కిలోల పెరుగన్నంతో అన్నసూక్త మంత్ర పఠనంతో రుద్రేశ్వర మహాశివలింగాన్ని రుద్రగణపతిగా అలంకరించి అన్నపూజ చేశారు. అనంతరం మహాహారతి, మహానివేదన, నీరాజనమంత్రపుష్పం జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పూజా కార్యక్రమాల్లో తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ కుటుంబ సభ్యులతో దేవాలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ముర్రుపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: తల్లి అందించే ముర్రుపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్ లాంటిదని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ‘ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు’ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లి తన బిడ్డకు ఇచ్చే మొట్టమొదటి కానుక పుట్టిన వెంటనే ముర్రు పాలు ఇవ్వడమేనని అన్నారు. ఈ సంవత్సరం ‘సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు– ఫలితాలను ఇచ్చే చర్యలను మరింత బలోపేతం చేయడం’అనే థీమ్తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతాయని తెలిపారు. వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పించి తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అంగన్వాడీ, ఆరోగ్య శాఖలసిబ్బంది పరస్పర సమన్వయంతో ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించి, తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలని సూచించారు. అప్పుడే జన్మించిన శిశువుకు ముర్రుపాలు పట్టించడం వల్ల భవిష్యత్లో కూడా అనారోగ్య సమస్యలు రాకుండా నివారించే అవకాశం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఎహెచ్ఓ మధుసూదన్, జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచనలు కలిస్తేనే స్నేహ‘బంధం’
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026‘సాక్షి’ సర్వే.. యువత మనోగతంమీ బెస్ట్ ఫ్రెండ్ను వారంలో ఎన్నిసార్లు నేరుగా కలుస్తారు? స్కూల్/కాలేజీ రోజుల్లోని ప్రాణస్నేహితులతో ఇప్పటికీ అదే సాన్నిహిత్యం ఉందా? ప్రస్తుత రోజుల్లో స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకరికొకరి ఆలోచనలు కలిస్తేనే స్నేహబంధం పటిష్టంగా ఉంటుందని యువతీ యువకులు అభిప్రాయపడ్డారు. బెస్ట్ ఫ్రెండ్ను నెలకు ఒకసారైనా కలుస్తామని, ఫోన్లో మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో యువతీ యువకులను సర్వే చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏర్పడిన స్నేహం ఎన్నిరోజులైనా చెక్కు చెదరని అధికమంది అభిప్రాయపడ్డారు. – సాక్షి నెట్వర్క్ A) రోజువారీ B) నెలకు ఒకసారి C) అసలు కలవంA) ఫోన్ కాల్స్ B) వాట్సాప్ చాటింగ్ C) వీడియో కాల్స్A) అవును, అలాగే ఉంది B) పరిచయం ఉంది కానీ, మాట్లాడడం తగ్గింది C) అసలు టచ్లో లేరుA) ఆలోచనలు కలవడం B) ఒకే ఆఫీస్ లేదా వృత్తి C) ఆర్థిక లేదా సామాజిక హోదాసర్వే శాంపిల్స్ : 300 (ఆరు జిల్లా కేంద్రాలనుంచి 50 మంది చొప్పున) సర్వే చేసిన ప్రాంతాలు : హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి స్నేహితులతో మాట్లాడడానికి మీ ప్రాధాన్యం ఏంటి? -
బారికేడ్లతో రహదారి బంధనం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా కూల్చివేతలు కొనసాగుతోన్నాయి. ఈక్రమంలో శనివారం బస్డాండ్ వెనుక వీధి నుంచి వచ్చే రహదారిలో బ్యాంకు వద్ద, రాజరాజేశ్వర వసతి గృహం ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనాలు వచ్చేందుకు మాత్రమే దారి ఉంచారు. కానీ గ్రామంలో పశువులు, మేకలు, గొర్రెలు ఇదే దారి గుండా అడవికి వెళ్తుంటాయి. రైతులు కూడా ఇదే దారిలో తమ పంట చేనులకు, వ్యవసాయ పనులకు వెళ్తారు. వీరికి వంద గదుల గేటు నుంచి నుంచి దారి ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. మరో దారి సాధారణ ఘాటు నుంచి కుడి వైపు ఆలయానికి వచ్చేదారికి గేటు ఏర్పాటు చేసి తాళం వేశారు. పనులు జరుగుతున్నందున ప్రమాదాలు జరుగకుండా రహదారిని మూసివేసినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి మహాముత్తారం: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని డీటీడబ్ల్యూఓ నాగసాగర్ అన్నారు. శనివారం మండలంలోని మహాముత్తారం ఎస్టీ బాలుర వసతి గృహంతోపాటు పెగడపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనంతోపాటు నాణ్యమైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని టాయిలెట్లను పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొల్లబుద్దారం గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, హాస్టల్ నిర్వహణ, తరగతుల బోధన విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహనతోనే నేరాల నియంత్రణ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్ భూపాలపల్లి అర్బన్: చట్టాలపై అవగాహన పెరిగితే నేరాలను నియంత్రించవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో 102 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్పై అవగాహన కల్పిస్తూ, పోక్సో నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఉపాధ్యాయులు కీలక బాధ్యత వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, న్యాయవాదులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సాయం చేసి.. ధైర్యం నూరిపోసి
కులమతాలకు అతీతం.. బాధకు దివ్యౌషధం. కళ్లు వర్షించలేని ఆనందభాష్పం.. కవులు వర్ణించలేని పదబంధం. నిత్య సుగంధాల పరిమళం.. అంతులేని సంపదల సాగరం.. చెలిమి, మైత్రి, ఫ్రెండ్, దోస్త్.. పేరేదైనా పిలిస్తే పలికేదే నేస్తం. నేనున్నాననే ధైర్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు, అంతకు మించి ఉంటారు. వారే ఆనందాలకు వారధులవుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలాంటి వారెందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారిలో కొందరి గురించి ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. నల్లబెల్లి: నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2005–06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఏ చిన్న ఆపదొచ్చి నా మేమున్నామంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. స్నేహితుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వివాహాలు చేసినా, ఏదైనా శుభకార్యాలు చేసినా, కుటుంబంలో ఏదైనా ఘటన జరిగినా అండగా నిలుస్తున్నారు. శుభ, అశుభ కార్యాల్లో ఆర్థిక చేయూతనందిస్తున్నారు. వీరి సేవల్లో అప్పటి గురువులు సైతం భాగస్వాములవుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది స్నేహితులకు రూ.4,50,000 సాయం అందించారు. -
మణుగూరు ఓసీని సింగరేణికి కేటాయించాలి
● ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి భూపాలపల్లి అర్బన్: మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకు కేటాయించాలని ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు నర్సింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ భవిష్యత్ దృష్ట్యా మణుగూరు డిప్సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి భద్రత, భావితరాలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జీఎంకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జోగు బుచ్చయ్య, రాజే ందర్, శేషారత్నం షేక్హుస్సెన్, చక్రపాణి, సద య్య, సంపత్, నర్సింగరావు, శంకర్ పాల్గొన్నారు. -
స్నేహం పేరిట మోసం
● కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు నమోదు ● సైబర్ మోసం రూ.6.85 కోట్లు.. రికవరీ రూ.1.60 కోట్లు ● వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు ● ‘సాక్షి’తో సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ వరంగల్ క్రైం: ఫ్రెండ్ అంటూ పరిచయమవుతారు. తియ్యగా మాట్లాడి స్నేహం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడతారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ ‘సాక్షి’తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేసుల సంఖ్య పెరుగుతోంది.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2,400 సైబర్ క్రైం కేసులు నమోదయ్యయి. వివిధ రకాల కేసుల్లో బాధితులు రూ.6.85 కోట్లు నష్టపోయారు. గోల్డెన్ అవర్లో టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్చేసి సమాచారం అందించగా.. ఇప్పటి వరకు బ్యాంకుల్లో హోల్డ్ చేసిన డబ్బులు రూ.1.68 కోట్లు రికవరీ చేశాం. మోసాలు పలు రకాలు.. కస్టమర్ కేర్, ఆన్లైన్ షాపింగ్, పార్ట్టైం జాబ్, స్టాక్ మార్కెట్, గేమింగ్ మోసం, డేటింగ్, స్టాకింగ్, ఏపీకే ఫైల్స్ ఓపెన్, క్రెడిట్కార్డు లిమిట్ పెంపు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్, కేవైసీ అప్డేట్, డిజిటల్ అరెస్టు, లోన్యాప్, మ్యాట్రిమనీ ఇలాంటి రకరకాల పేర్లతో తియ్యగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నారు. స్నేహం పేరుతో మోసాలు.. మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయం పెంచుకొని ఆ తర్వాత పెళ్లి పేరుతో నేరగాడు ఓ యువతికి దగ్గరయ్యాడు. ఒక రోజు యువతికి ఫోన్ చేసి నా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. నీ పేరుతో మూడు అకౌంట్లు ఓపెన్ చేసి వాటి వివరాలు పంపాలని కోరగా.. నమ్మిన సదరు యువతి మూడు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంక్ పాస్ బుక్లు, ఏటీఎం కార్డులు అందజేసింది. ఆ తర్వాత అతడు ఆ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించాడు. అనంతరం సైబర్ మోసాల కింద యువతిపై కేసులు నమోదయ్యయి. అప్రమత్తంగా ఉండకపోతే గోవిందా... ప్రస్తుతం సైబర్ మోసాలపై అవగాహన లేకపోతే నష్టపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. ఫోన్నంబర్లు, ఓటీపీలు, ఏటీఎం, డెబిట్ కార్డుల వివరాలు, ఆధార్కార్డులు, అకౌంట్ నంబర్లు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఏదైనా కారణం చేత మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. -
రహదారి భద్రత అందరి బాధ్యత
భూపాలపల్లి: రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాల నివారణ కోసం నియమాలు పాటించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం పోలీసు, రవాణాశాఖల ఆధ్వర్యంలో శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించాలని, సీటుబెల్ట్ వినియోగించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 50 వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీటీఓ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగత నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 2026 విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, బాల కార్మికులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి మొత్తం 48 మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. ఆరుగురు బాలికలు, 42 మంది బాలురు ఉన్నారని తెలిపారు. ఈ ఆపరేషన్లో జిల్లా పోలీసుశాఖతోపాటు కార్మిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, బాలల సంక్షేమ కమిటీ అధికారులు పాల్గొన్నట్లు ఎస్పీ సంకీర్త్ వెల్లడించారు. -
ఓటు వివరాలు తెలుసుకోవడం సులభం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: 1950 నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా ఓటు నమోదు వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రతీ ఓటరు తమ ఎన్నికల గుర్తింపు కార్డు నంబర్ను టైప్ చేసి 1950 నంబర్కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా తమ ఓటు వివరాలను మొబైల్ ఫోన్కు సందేశం రూపంలో పొందవచ్చన్నారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని, అవసరమైతే సవరణలు, నమోదు ప్రక్రియలను సమయానికి పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఓటు హక్కు విలువను గుర్తించి తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు భూపాలపల్లి రూరల్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, వాగుల వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి వై.విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెరువులు, కుంటలు మత్తడి వరదకు ఎదురుగా జాలీలు, వలలు ఇతరత్రా నిర్మించరాదన్నారు. ఎవరైనా చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్ల వద్దకు వెళ్లి వరదల్లో చిక్కుకుంటే వారిని మత్స్యకారులు రక్షించాలన్నారు. మత్స్యకారులు తమ బాధ్యతగా రెస్క్యూటీంలో భాగం కావాలని సూచించారు. సరస్వతి అమ్మవారి ఆలయం తొలగింపు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం తొలగింపు ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం శ్రీసరస్వతి అమ్మవారి ఆలయాన్ని తొలగించారు. దక్షిణం ప్రకారాన్ని తీసివేశారు. రాత్రి అభిషేక మండపం తొలగించనున్నారు. ఈ తొలగించిన ఇటుక, మట్టి ఇతర సామగ్రిని వీఐపీ ఘాటులోని గుడిమాన్యం స్థలంలోకి చేర్చుతున్నారు. ప్రధాన దేవాలయంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరుల లింగాలకు తొలగింపు ప్రక్రియలో ప్రమాదం లేకుండా ముందస్తుగానే ఇనుప కంచెలాగా బాక్స్ తయారుచేసి అమర్చారు. -
జయశంకర్ భూపాలపల్లి
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఉద్యమ పెద్దన్నకు ఊరూవాడా కన్నీటి వీడ్కోలునర్సంపేటలోని అమరవీరుల స్తూపం జంక్షన్ వద్ద పెద్ది సుదర్శన్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని7నర్సంపేట/దుగ్గొండి/నల్లబెల్లి : తెలంగాణ ఉద్యమకారుడి ఊపిరి ఆగిందని తెలిసి వేలాది గుండెలు తల్లడిల్లాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్థివదేహం తమ గ్రామం మీదుగా వస్తుందని తెలిసి వివిధ గ్రామాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఆయన అభిమానులు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో తరలివచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ కుటుంబ పెద్దను కోల్పోయామని ఆర్థనా దాలు చేశారు. ఉద్యమకారులు తమ సహచరుడిని కోల్పోయామని విలపించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు సాగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రునివాళులు అర్పించారు.. ‘మల్లెప్పుడొస్తవ్ పెద్దన్నా’ అంటూ మహిళలు రోదించిన తీరు కంట తడి పెట్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రంలో ఉద్యమనేతగా గుర్తింపు పొందిన గులాబీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి(54)కి శుక్రవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హనుమకొండలోని తన స్వగృహంలో గత ఆదివారం ఉదయం గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనకు వెంటనే రోహిణి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంబులెన్స్లో భారీ కాన్వాయ్తో హనుమకొండకు తీసుకురాగా, అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ మీదుగా గిర్నిబావికి చేరుకుంది. అక్కడ ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్ నుంచి ప్రత్యేక రఽథంపై ఉంచి అంతిమయాత్ర ప్రారంభించారు. గిర్నిబావి ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర జనసంద్రమైంది. కార్యకర్తలు దారి పొడవునా పుష్పాంజలి ఘటిస్తూ జోహార్ పెద్దన్నా అంటూ నినదించారు. లక్నెపల్లి, మహేశ్వరం మీదుగా అంతిమయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సంపేటకు చేరుకుంది. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి స్డేడియం వరకు దాదాపు మూడు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. నర్సంపేటలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి బంద్ పాటించారు. తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం.. పెద్ది అంత్యక్రియలకు బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా తరలివచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, డాక్టర్ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్నాయక్, రెడ్యానాయక్, ఒడితల సతీశ్, బాల్క సుమన్, మాజీ మేయర్ గుండు సుధారాణి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తదితరులు నివాళులర్పించారు. నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు.. సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో గంటపాటు జోరు వాన కురిసింది. పెద్ది భౌతికకాయంపై కేటీఆర్, హరీశ్రావు, మాజీ మంత్రులు కలిసి బీఆర్ఎస్ జెండా కప్పారు. కేటీఆర్, హరీశ్రావు చేతులు పట్టుకుని స్వప్న బోరున విలపించారు. నేతలు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని విలపించడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రాత్రి 9 గంటల తర్వాత నల్లబెల్లిలోని నివాసంనుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మండల కేంద్రంలోని వీధులగుండా సాగింది. ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, దయాకర్రావు, పాడికౌశిక్రెడ్డి పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా వేలాది మంది అభిమానుల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.అంతిమయాత్ర సాగిందిలా...– వరంగల్ డెస్క్సుదర్శన్రెడ్డి పాడె మోస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి ప్రభుత్వ లాంఛనాలతో..అభిమానులు అశ్రునయనాల నడుమ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవిందర్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన చితికి కుమారుడు నిదర్శన్ రెడ్డి నిప్పంటించారు. పోలీసుల గౌరవ వందన సమయంలోనూ ‘పెద్ది జిందాబాద్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సుదర్శన్రెడ్డి పార్థివదేహం హనుమకొండ, గిర్నిబావి, నర్సంపేట మీదుగా నల్లబెల్లికి తరలింపు ఊరూరా రోడ్ల వెంట వేచి ఉన్న ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేట, నల్లబెల్లిలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు కేటీఆర్, హరీశ్రావుతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల నివాళి మంత్రి సీతక్క, మంద కృష్ణ, గోరటి వెంకన్న, పలువురు ఎమ్మెల్యేల పుష్పాంజలి అంతిమయాత్రలో పెద్ది స్వప్న ఆగ్రహం పెద్ది అంతిమయాత్ర నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోగా.. పెద్దికి వ్యతిరేకంగా గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టెంట్ వేసిన బోర్ వెల్ షాపు యజమానుల వైపు చూస్తూ మీరు చేసిన మనోవేదన వల్లే తన భర్త చనిపోయాడని దూషిస్తూ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పెద్దికి వ్యతిరేకంగా బోర్ వెల్ షాపు యజమానులు టెంట్ వేసి నిరసన దీక్షకు కూర్చున్న ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.‘పెద్ది’ లేక.. పొద్దు పొడవక! -
15 వరకు గడువు పొడిగింపు
సవరించిన షెడ్యూల్ ఇలా... ● ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల అప్లోడ్: ఆగస్టు 15 ● వెరిఫై అయిన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 16 ● ఫేజ్–1 వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు ● వెబ్ ఆప్షన్ల సవరణ: ఆగస్టు 19 ● తాత్కాలిక సీట్ల కేటాయింపు: ఆగస్టు 22 ● కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ: ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకుసాక్షి, వరంగల్: ఎల్ఎల్ఎం (మాస్టర్ ఆఫ్ లా) ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్కు ఈనెల 15 వరకు గడువు పొడిగిస్తూ టీజీసెట్ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఎల్ఎం అడ్మిషన్లలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘ఎల్ఎల్ఎం అడ్మిషన్పై ఆందోళన’ కథనానికి టీజీ సెట్ (ఇతర కోర్సులు) అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి స్పందించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండడంతో వందలాది మంది విద్యార్థులు అడ్మిషన్లకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా ప్రొవిజనల్ మెమోలు, లాంగ్ మెమోలు ఇంకా అందని కారణంగా అభ్యర్థులు నమోదు చేసుకోలేకపోతున్నారని విద్యార్థుల వెతలను సాక్షి దినపత్రిక ప్రస్తావించింది. దీనిపై స్పందించిన కన్వీనర్.. విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ సవరించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ‘మా ఇబ్బందులను టీజీ సెట్ ఉన్నతాధికారుల దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లడంతో ఎల్ఎల్ఎం రిజిస్ట్రేషన్ గడువు పొడిగించారు’ అని లా విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. కేయూ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు సాధ్యమైనంత త్వరగా మూడేళ్ల కోర్సు, ఐదేళ్ల కోర్సు ఫైనల్ ఇయర్ థియరీ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని వారు కోరారు. ఇంకా లా పరీక్షలు జరుగుతున్న వేళ అందని ప్రొవిజినల్, లాంగ్ మెమోలు జూలై 31తో రిజిస్ట్రేషన్ల గడువుపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ఎల్ఎల్ఎం అడ్మిషన్ల ఆందోళనపై స్పందించిన టీజీసెట్ కన్వీనర్ -
మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
● మహదేవపూర్ సామాజిక ఆస్పత్రిని పునర్నిర్మిస్తాం ● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకాళేశ్వరం: మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆస్పత్రిలో ఐడీబీఐ సహకారంతో హైదరాబాద్ ఎంఎన్జీ ఆస్పత్రి, కరీంనగర్ ఒమెగా ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందితో ఉచిత క్యాన్సర్, కంటి నిర్దారణ పరీక్షలు వైద్య శిబిరాన్ని, హెల్త్ ఏటీఎంను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తన మేనత్త వనమాల ఇటీవల మృతిచెందగా ఆమె జ్ఞాపకార్ధం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4వ తేదీన ఎంఎన్జే ఆస్పత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డీఓ రవీందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల తదితరులు పాల్గొన్నారు. -
మేడిగడ్డకు పోటెత్తిన వరద
కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతితో మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.300 మీటర్ల మేర నీటి మట్టం శుక్రవారం నమోదు కాగా, మొదటి ప్రమాద హెచ్చరికను అధికారుల జారీ చేశారు. గోదావరి తీరం వద్ద ఉన్న చిరు వ్యాపారులను అప్రమత్తం చేశారు. దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. అక్కడ ఇన్ఫ్లో 10,62,240 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, మొత్తం 85గేట్లు ఎత్తి ఔట్ఫ్లో రూపంలో దిగువకు అదేస్థాయిలో నీటిని ఇంజనీర్లు వదిలిపెట్టారు. కాగా, ఎగువన అన్నారం బ్యారేజీ వద్ద 87వేల క్యూసెక్కుల గోదావరి వరద ఇన్ప్లో కాగా, మొత్తం 66గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రం కాళేశ్వరం వద్ద 11.920 మీటర్ల నీటి మట్టం నమోదైందని సీడబ్ల్యూసీ, ఇరిగేషన్శాఖ అధికారులు వెల్లడించారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భూపాలపల్లి: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన షీ టీం ఎస్సై ఎండీ.ఫజల్ ఉల్లా ఖాన్, గణపురం ఏఎస్సై సమ్మిరెడ్డి, ఏఆర్ ఎస్సై ఎస్.ఉపేందర్ను జిల్లా పో లీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ ఘనంగా సన్మానించారు. చెక్కు అందజేత.. ఇటీవల మృతిచెందిన మహిళా కానిస్టేబుల్ సంగీత కుటుంబానికి రూ.15 లక్షల చెక్కును శుక్రవారం ఎస్పీ సంకీర్త్ అందజేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.15 లక్షలను ఆ బ్యాంకు అధికారులతో కలిసి సంగీత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ సంగీత అకాల మరణం పోలీసు శాఖకు తీరని లోటన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ నరేష్కుమార్ పాల్గొన్నారు. -
ఆయుర్వేద వైద్యశాలలో హౌస్ సర్జన్ల నిరసన
కాశిబుగ్గ: స్టైఫండ్ పెంచాలని కోరుతూ తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో హౌస్సర్జన్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన చేపట్టారు. ఆయుష్ హౌస్సర్జన్లు అల్లోపతిక్ హౌస్సర్జన్లతో సమానంగా రోగులు సేవలు అందిస్తూ, అత్యవసర విధులు, వార్డులు, ఓపీలను సమర్థంగా నిర్వహిస్తున్నప్పటికీ స్టైఫండ్ విషయంలో వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్టైఫండ్తోపాటు బకాయిలను విడుదల చేసి, ప్రతినెలా సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అప్రమత్తంగా ఉండాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు వాతావరణశాఖ హెచ్చరికలతో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లోలెవల్ వంతెనల వద్దకు వెళ్లొద్దు. పోలీసుశాఖ ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అత్యవసరమైతే 100కు కాల్ చేయండి. చేపల వేటకు వెళ్లొద్దు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. శిథిలావస్థ భవనాల్లో ఉండొద్దు. సెల్ఫీలు, రీల్స్ కోసం వరదల్లోకి వెళ్లవద్దు. పోలీసు, రెవెన్యూశాఖ సూచనలు పాటించాలి. – సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వర్షాలతో నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో వరదలు వస్తున్నందున అన్నిశాఖలు సమస్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు. – రాహుల్శర్మ, కలెక్టర్ -
రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి
రేగొండ: భూముల రీ సర్వేతో అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్, సుల్తాన్పూర్ గ్రామాలలో నిర్వహించిన భూముల రీ సర్వే గ్రామసభల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రతి రైతు ఈ సర్వేకు పూర్తి సహకారం అందించాలన్నారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్బుక్లు అందజేయడం ద్వారా రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలు పొందవచ్చన్నారు. మండలంలో సర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, సర్పంచ్లు భిక్షపతి, సక్కుబాయి, కిరణ్, రమేశ్, నాయకులు ఓంప్రకాశ్, వీరేందర్, మటికే సంతోష్, సురేందర్రెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.అవగాహనా రాహిత్యానికి నిదర్శనంభూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఎంఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తిగా అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్లను వేలం వేసి పెద్ద పారిశ్రామిక సంస్థలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టిన ఈ విధానాలపై బీఎంఎస్ ఎందుకు మౌనం పాటిస్తుందో సమాధానం చెప్పాలన్నారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం బీఎంఎస్ నాయకులకు తగదన్నారు. ఘనంగా సీత్లా పండుగ రేగొండ: సీత్లా పండుగను మండలంలోని రామన్నగూడెం తండాలో గిరిజనులు గురువారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామ సమీపంలో ఉన్న అమ్మ వారికి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, నాయకులు సంపత్, మోహన్, రాజేందర్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. గుంతలమయంగా రోడ్డు మల్హర్: మండలంలోని తాడిచర్ల–కొయ్యూరు నాగులమ్మ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉంది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గుంతలు వర్షపు నీరుతో నిండిపోయాయి. నిత్యం ఈ మార్గంలో వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి వెంటనే మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్డుపై చెట్టును తొలగించిన పోలీసులు కాళేశ్వరం: మహదేవపూర్–కాళేశ్వరం జాతీయ రహదారి 353(సీ)పైన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతంలో వర్షానికి భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా నేలకూలింది. విషయం తెలుసుకున్న మహదేవపూర్ ఎస్సై సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు చేపట్టారు. -
వానొచ్చె.. వరదొచ్చె
● ఎడతెరిపి లేని జడివాన ● చెరువులకు జలకళ ● ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరదమత్తడిపోస్తున్న మల్హర్ మండలంలోని వల్లెకుంట చెరువుకాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తోంది. ఎల్నినో ప్రభావంతో గడిచిన ఐదు రోజుల వరకు అసలు వర్షాలు లేక ఆకాశం వైపు దీనంగా చూసిన రైతులకు ఈ కుండపోత వర్షాలు ఊరటనిచ్చాయి. వానల కోసం చిన్నపిల్లలతో కప్పతల్లి ఆటలు ఆడిస్తూ, ఆలయాల్లో వరుణ యాగాలు చేస్తూ దేవుళ్లను వేడుకున్న రైతులు ఆనందంలో మునిగారు. వర్షాలు లేక ఎండిపోయి బోసిపోయిన చెరువులు, కుంటలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, మేడిగడ్డ బరాజ్ల్లోకి గోదా వరి, ప్రాణహిత నదుల గుండా వరద తరలిరావడంతో జలకళను సంతరించుకుంది. సరైన సమయానికి కురిసిన వానలతో పంటలకు ప్రాణ వాయువులా మారాయి. పొలాలకు కావాల్సినంత నీరు చేరడంతో ఎండిపోయే దశలో ఉన్న పత్తి మొక్కలు,వరి నారుమడుల పైర్లకు ఊపిరిపోసింది. దీంతో రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. పలుచోట్ల నిలిచిన రాకపోకలు.. మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వద్ద రహదారిపైన నీరు తరలిరావడంతో రాకపోకలు నిలిచాయి. ఊరచెరువు, పడిదం చెరువు, కొచ్చెరువుల్లోకి వరద నీరు చేరింది. భూపాలపల్లి మండలం ఆజాంనగర్–మీనాజిపేట మధ్యలోని సాంబయ్యమాటు వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహాముత్తారం మండలంలో మధ్యాహ్నం వరకు రాకపోకలు క్లియర్ అయ్యాయి. పోలారం, మహాముత్తారం చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్కాస్టులో మూడు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బొగ్గువాగు ప్రాజెక్టు, వల్లంకుంట వాగుల్లోకి వరద నీరు తరలివస్తుంది. మహాముత్తారం, మహదేవపూర్, కాటారం, మల్హర్, పలిమెల, భూపాలపల్లి, టేకుమట్ల మండలాల్లో భారీవర్షం కురిసింది. మానేరుకు భారీగా వరదనీరు మల్హర్: మండలంతో పాటు భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలతో మానేరుకు భారీగా వరదనీరు చేరుకుంది. మండలంలోని చెరువులు, ఎడ్లపల్లి బొగ్గులవాగు, తాడిచర్ల–ఖమ్మంపల్లి మానేరు జలకళ సంతరించుకున్నాయి. ఎడ్లపల్లి బొగ్గులవాగుకు 320 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 155.7 మీటర్ల వద్ద 149.55 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉంది. ఎడతెరిపి లేని వర్షం మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి, కేశవాపూర్ మధ్య పెద్దవాగు పొంగిపొర్లడంతో మధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనుకునూర్లో ఈదురుగాలులకు పురాతన జువ్విచెట్టు నేలకొరిగింది. పాతరేగులగూడెం గ్రామంలో ఒంటరి మహిళ కాపుల లక్ష్మి పెంకుటిల్లు కూలిపోయింది. మెట్టపంటలకు ప్రయోజనం... భూపాలపల్లి రూరల్: వర్షాలు మెట్ట పంటలకు ప్రయోజనకరంగా మారాయి. జూన్లో కురిసిన వానలకు జిల్లాలో 1,32707 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఇందులో అత్యధికం మెట్ట పంటలే ఉన్నాయి. పత్తి ఇప్పటివరకు 1,04,940 ఎకరాల్లో సాగుచేయగా, పెసర, కంది, మినుములు, మొక్కజొన్న కూడా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ముసురు ఈ పంటలకు ఉపయోగపడుతున్నాయి. -
అపరిచితుల చేతికి చిక్కి మోసపోవద్దు
● గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులతో అనవసరంగా మాట్లాడడం, స్నేహం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఉద్యోగాలు, చదువులు లేదా ఇతర అవకాశాల పేరుతో మోసగాళ్లు అమాయకులను వలలో వేసుకునే అవకాశం ఉందన్నారు. అలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మానవ అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, డీఎల్ఎస్ఏ సభ్యుడు మంగళపల్లి రాజ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎలా నమోదు చేసుకోవాలంటే..
భూపాలపల్లి అర్బన్: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, బోగస్ రేషన్కార్డులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కేవైసీ నమోదు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రేషన్కార్డు ఉన్న లబ్ధిదారులందరూ ఈనెల 31 నేటి వరకు (శుక్రవారం) తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాలశాఖ అధికారులు స్పష్టంచేశారు. గడువులోగా పూర్తిచేసుకోని వారికి ఆగస్టు నుంచి రేషన్ సరఫరా నిలిచిపోతుందని, కార్డు నుంచి పేర్లు కూడా తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. బోగస్ రేషన్కార్డుల ఏరివేతతో పాటు అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రేషన్కార్డుతో ఆధార్ సంఖ్యను అనుసంధానించడం ద్వారా మరణించిన వారి పేర్లను తొలగించడమే కాకుండా, అనర్హులను ఏరివేయడానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదపడనుంది. జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభంలో వేగంగా సాగినప్పటికీ, ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ తగ్గడంతో కొంత నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఇప్పటికీ వేలాది మంది లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ చేసుకోకుండా ఉండిపోయారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుతో సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. డీలర్ ఈ–పాస్ యంత్రంలో రేషన్కార్డు, ఆధార్ సంఖ్యలను నమోదు చేసిన తర్వాత లబ్ధిదారుల బయోమెట్రిక్ (వేలిముద్ర) లేదా ఐరిష్ స్కాన్ ఇవ్వాలి. వివరాలు సరిగ్గా సరిపోలితే యంత్రంలో ఆకుపచ్చ రంగు లైట్ వెలిగి కేవైసీ నమోదు పూర్తవుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే ఎరుపు రంగు లైట్ వెలిగి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు వేలిముద్రలు సరిగ్గా పడవు కాబట్టి వారి ఆధార్ కార్డు ప్రతులను జత చేస్తే సరిపోతుంది. ఉపాధి, ఇతర కారణాలతో ఇతర ప్రాంతాలలో ఉన్నవారు కూడా తమకు సమీపంలో ఉన్న ఏ రేషన్ దుకాణంలోనైనా ఈ–కేవైసీ పూర్తి చేసుకునే సదుపాయం కలదు. నేటితో ముగియనున్న గడువు నకిలీ కార్డుల ఏరివేతే లక్ష్యం కేవైసీ చేయించకుంటే బియ్యం బంద్ జిల్లాలో 81శాతమే నమోదు -
నషా ముక్త్ భారత్ పోటీల్లో ప్రతిభ
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ జిల్లా స్థాయి వివిధ పోటీలలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో బహుమతులు కై వసం చేసుకున్నారు. ఫోక్ డాన్స్ విభాగంలో బన్విత గ్రూప్ ప్రథమ స్థానం, పోయేట్రీ రైటింగ్ విభాగంలో సహస్ర ప్రథమ బహుమతి, స్కిట్ విభాగంలో జాన్ లింకన్ గ్రూప్ ద్వితీయ స్థానం, షార్ట్ ఫిల్మ్ విభాగంలో మణికంఠ గ్రూప్ ద్వితీయ బహుమతి, స్లోగన్ రైటింగ్ విభాగంలో వైష్ణవి తృతీయ స్థానం, డ్రాయింగ్ విభాగంలో పిర్దౌష్ తృతీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీప్రసన్న గెలుపొందిన విద్యార్థులను అభినందించి, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేశ్, కోమల, సర్వోత్తమ్రెడ్డి, ఈశ్వరమ్మ, శ్రీవాణి, రాజయ్య, రామకృష్ణ, సురేష్, చంద్రమౌళి, గురుతేజ, నస్మా సుల్తానా, పుష్పలత, రాంధన్ పాల్గొన్నారు. -
ఎక్స్ప్రెస్ సర్వీస్ల పునరుద్ధరణ
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్–రక్సోల్–హైదరాబాద్ మధ్య సర్వీసులను పునరుద్ధిరించి నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. గతంలో రైళ్ల సర్వీసులను సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో చక్రధపూర్ డివిజన్లో మెగా రైల్వే బ్లాక్ కారణంగా రద్దు చేశారు. తిరిగి ఈ సర్వీసులను దసరా, దీపావళి, చాత్ పూజా పండుగలు ఉన్న దృష్య్టా ప్రయాణికుల సౌకర్యార్థం తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. రైళ్ల వివరాలు ఇలా.. అక్టోబర్ 8, 15, నవంబర్ 5, 12 తేదీల్లో హైదరాబాద్–రక్సోల్ (17005) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 11, 18, నవంబర్ 8, 15 తేదీల్లో రక్సోల్–హైదరాబాద్ (17006) వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకొని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీసులకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. -
ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు
కాళేశ్వరం: ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులు నిస్పక్షపాతంగా సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం ఆయన వార్షిక తనిఖీల్లో భాగంగా మహదేవపూర్ పోలీస్స్టేషన్ను సందర్శించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్స్టేషన్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల స్థితిగతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల పురోగతి, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, కేసు రికార్డుల నవీకరణ విధానాన్ని పరిశీలించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించి, వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతీ పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించాలని అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు. ఆన్లైన్ నమోదుపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
వేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా ఎన్నికల సంబంధిత సర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అఽధికారి రాహుల్శర్మ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎన్నికల కార్యాలయం నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ, డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీచేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అఽధికారి రాహుల్శర్మ తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 87 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, మున్సిపాలిటీ పరిధిలో 62 శాతం పూర్తైనట్లు వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రేగొండ మండలంలోని 249వ పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించి, అక్కడ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సూపర్వైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అఽధికారి రాహుల్శర్మ -
పులుల సంరక్షణ అందరి బాధ్యత
రేగొండ: పర్యావరణ సమతుల్యతకు అడవులు చాలా కీలకమని, అడవుల ఆరోగ్యానికి పులులు సూచికలుగా నిలుస్తాయని జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చెల్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పాండవుల గుట్టల వద్ద ఫారెస్ట్ ట్రెక్కింగ్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులను పరిరక్షించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని తెలిపారు. వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. వన్యప్రాణులను వేటాడినా, ఉచ్చుపెట్టినా కఠినశిక్షలు విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజనల్ అధికారులు అప్పలకొండ, సందీప్రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు రామ్మూర్తి, లత, ఇక్బాల్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు గౌతమి, గీత, గ్రీన్ క్లబ్ నిర్వాహకులు పురుషోత్తం, సారయ్య, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు, సాజిద్ అలీ, రహీం, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ -
గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
మహాముత్తారం: మాదారం గిరిజన ఆశ్రమ పాఠశాలను బుధవారం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు పనిచేయడం లేదని, వర్షానికి గదుల్లో నీళ్లు కారుతున్నాయని, పురుపులు లేవని విద్యార్థులు సమస్యలు చెప్పారు. ఈ సందర్భంగా నాగసాగర్ మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలోని గదుల్లో ప్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేసి కరంటు సమస్య లేకుండా తీర్చామన్నారు. మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులకు మెనూప్రకారం భోజనం అందించాలని సూచించారు. -
7న అష్టతీర్థాలకు టెండర్
కాళేశ్వరం: కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు జరుగు గోదావరి పుష్కరాల కోసం అష్టతీర్థాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.60కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 23 నుంచి ఆన్లైన్ టెండర్ బిడ్లు వేస్తున్నారు. ఆగస్టు 7న టెండర్ ఓపెన్ చేయనున్నారని తెలిసింది. దీంతో పక్షితీర్థం నుంచి హనుమత్ తీర్థం వరకు 3.5కిలోమీటర్ల దూరం అంతర్రాష్ట్ర వంతెన వరకు ఘాట్లు, వివిధ విగ్రహాల ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఇరిగేషన్శాఖ, ఆర్కిటెక్చర్ల బృందం పరిశీలనలు చేసిన విషయం తెలిసిందే. నిర్మాణాలతో కాళేశ్వరాలయానికి కొత్త శోభ రానుంది. గురువుల పాత్ర గొప్పది ములుగు రూరల్: సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర గొప్పదని, గురువులు సమాజానికి మార్గదర్శకులని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ములుగు పట్టణంలోని రాయల్ ప్లాజాలో ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక సేవకుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచారి, ఎర్రంకాని యోగి రాంబాబు, చల్లగురువుల మల్లయ్య, బానోత్ రాజేశ్వరి, అన్నపురెడ్డి మౌనిక, గడ్డె శిరీషను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ (ధార్మిక సెల్) జిల్లా కన్వీనర్ రేగూరి రాజిరెడ్డి, కర్ర శ్రీనివాస్, గుంటుక విజయ, కొత్తపల్లి రాజకుమారి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవహర్లాల్ పాల్గొన్నారు. స్కాన్ చెయ్.. అవినీతిని కడిగెయ్కాశిబుగ్గ: ‘ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే కింద ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఏసీబీకి ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి’ అంటూ ఎంజీఎంలో పలు చోట్ల క్యూ ఆర్ కోడ్ల పోస్టర్లు అతికించారు. ఈమేరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ వినూత్న ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో దాదాపు 30 చోట్ల స్టిక్కర్లు అంటించి అవినీతి జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేస్తే ఏసీబీ అఽధికారులు రహస్యంగా వచ్చి డబ్బులు అడిగినవారిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని వారు వివరించారు. శాకంబరుడిగా రుద్రేశ్వరస్వామి హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురుపౌర్ణమిని పురస్కరించుకుని రుద్రేశ్వరస్వామిని శాకంబరుడిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, శ్రవణ్ ప్రభాత సేవ, గణపతి ఆరాధన, రుద్రేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పలుగ్రామాల నుంచి రైతులు అందించిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో స్వామివారిని శాకంబరుడిగా అలంకరించి మహాహారతి జరిపి భక్తులకు దర్శనానికి అనుమతించారు. పూజల్లో దేవాదాయశాఖ మాజీ కమిషనర్ అనిల్కుమార్, పద్మజ దంపతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు శ్రీనివాస్, జ్యోతి, అంజనేయులు, భువనగిరి మాధవరావు, వంశీ తదితరులు కూరగాయలు అందజేసిన వారిలో ఉన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
‘సింగరేణికి తీవ్ర నష్టం’
భూపాలపల్లి అర్బన్: మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టును సింగరేణి సంస్థకు కాకుండా జెన్కో ద్వారా టెండర్ల ప్రక్రియ చేపట్టడం సింగరేణి సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్యం పలుమార్లు కోరుతున్నప్పటికీ జెన్కోను పోటీలో నిలబెట్టి టెండర్ల ప్రక్రియ చేపట్టడం ద్వారా తాడిచర్ల–1 తరహాలో కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టు సింగరేణికి దక్కితే మణుగూరు ప్రాంతంలో మరో 35 సంవత్సరాల పాటు ఉపాధి అవకాశాలు, బొగ్గు ఉత్పత్తి, ప్రాంతీయ అభివృద్ధికి భరోసా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలు, జెండాలు పక్కనపెట్టి సింగరేణి భవిష్యత్ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కార్మికులంతా ఏకమై తమ గళాన్ని వినిపించి మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టును సింగరేణికే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. భద్రతే విజయానికి మూలం భూపాలపల్లి అర్బన్: గనుల్లో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయని, ఇదే క్రమశిక్షణతో భవిష్యత్లో మరిన్ని భద్రతా పురస్కారాలు సాధించాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని కేటీకే–5వ గనిలో సందర్శించిన జీఎం అనంతరం ఉద్యోగులు, అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్వహించిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం–2025లో గ్రూప్–2 గనుల విభాగంలో కేటీకే–5వ గని శ్రీఓవరాల్ ఫస్ట్ ప్రైజ్ఙ్ సాధించిన సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. ఈ విజయం ప్రతీ ఉద్యోగి అప్రమత్తత, భద్రతా నిబంధనల పట్ల నిబద్ధత, సమష్టి కృషికి నిదర్శనమన్నారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ జట్టు స్ఫూర్తితో పనిచేస్తే భవిష్యత్లోనూ మరిన్ని అవార్డులు సాధించడంతో పాటు భూపాలపల్లి ఏరియా, సింగరేణి సంస్థకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ మాచర్ల రమేష్, సేఫ్టీ ఆఫీసర్ పి.అభిషేక్, పిట్ ఇంజనీర్ శ్రీకాంత్, వెంటిలేషన్ ఆఫీసర్ రమేష్, వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్, కార్మిక సంఘాల నాయకులు వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. బిల్లులు చెల్లించడం లేదని జీపీకి తాళం మొగుళ్లపల్లి: గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నా.. తమ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని వేములపల్లి మాజీ సర్పంచ్ దంపతులు బెల్లంకొండ మాధవి–శ్యాంసుందర్రెడ్డి దంపతులు మంగళవారం జీపీ కార్యాలయానికి తాళం వేశారు. బెల్లంకొండ మాధవి సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో రూ.14లక్షల రూపాయల వివిధ అభివృద్ధి పనులు చేశారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. పోలీసులు చేరుకుని తాళం తీపించారు. చేప పిల్లలు మృతి భూపాలపల్లి రూరల్: చెరువులో బ్లీచింగ్ పౌడర్ కలపడంతో కమలాపూర్ గ్రామంలోని పెద్ద చెరువులో చేపపిల్లలు మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చెరువులో వలుగారకం చేపలు (మాంసహారి) ఎక్కువగా ఉన్నాయి. సీడ్ వేస్తే వాటిని ఈ చేపలు తినేఅవకాశం ఉందని మత్స్యకారులు కొంతమంది నీటిలో బ్లీసింగ్ పౌడర్ కలిపినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. చేప పిల్లలకు విషప్రయోగం ఏమీ జరగలేదన్నారు. శాసీ్త్రయ కళల సందడి గోవిందరావుపేట: శాసీ్త్రయ కళలు చిరకాలం నిలవాలంటే వాటికి పునాది ప్రభుత్వ పాఠశాలల్లోనే వేయాలని ప్రముఖ కూచిపూడి, భరతనాట్యం కళాకారిణి కాట్రగడ్డ హిమాన్షి అన్నారు. మండల పరిధిలోని చల్వాయిలో గల తెలంగాణ మోడల్ స్కూల్లో మంగళవారం ప్రిన్సిపాల్ గండు కుమార్ ఆధ్వర్యంలో స్పిక్ మేకే వారు నిర్వహించిన కార్యక్రమంలో పలు నృత్యాలను ప్రదర్శించారు. -
రూ.10వేల ప్రోత్సాహకం
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థికి రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రకటించారు. మంగళవారం భూపాలపల్లి మండలం గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో సమావేశమై ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అనిత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీకి ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి శ్రీపాల్రెడ్డి మాట్లాడారు. బాల్యదశలో అలవర్చుకునే క్రమశిక్షణ, సత్ప్రవర్తన, గురువులు, తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవభావం వంటి విలువలే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బలమైన పునాదులని పేర్కొన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. జెడ్పీహెచ్ఎస్ గొర్లవీడు పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీఆర్సీ సాధన, సీపీఎస్ రద్దు లక్ష్యంగా త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపడుతామని తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని హక్కుల సాధన జరిగే వరకు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షక్ష, కార్యదర్శులు రేగూరి సుభాకర్రెడ్డి, కిరణ్కుమార్, హనుమకొండ, వరంగల్ జిల్లా బాధ్యులు మందల తిరుపతిరెడ్డి, పలిత శ్రీహరి, ఈదునూరి రవీందర్రెడ్డి, నక్కిరెడ్డి మహేందర్, గఫార్, మండల బాధ్యులు రఘునాథ్రెడ్డి, కుసుమ వెంకటేశ్వర్లు, సర్పంచ్ లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
నయా పోలీస్!
రేపు, ఎల్లుండి ఉమ్మడి వరంగల్ పోలీస్ అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ సమావేశాలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ పోలీసింగ్లో కొత్త విధానాలకు శ్రీకారం చుట్టే దిశగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల పర్యటనలను ఉమ్మడి వరంగల్నుంచే ప్రారంభిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్, సాంకేతికత ఆధారిత నేర నియంత్రణ, ప్రజా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో నేరుగా చర్చించేందుకు రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పోలీసింగ్ పరిస్థితి, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. వరంగల్నుంచే శ్రీకారం... డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనంద్ ఆకస్మిక తనిఖీలు, కార్యక్రమాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించారు. జిల్లాల వారీగా సమీక్షలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలను వేదికగా ఎంచుకోవడం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలతో ఇదే తరహా సమావేశాలు నిర్వహించే కార్యక్రమానికి ఇదే నాంది కానుందని తెలుస్తోంది. మూడు విడతల్లో సమావేశాలు.. ఈ నెల 30న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి(వరంగల్, హనుమకొండ, జనగామ)లోని అధికారులతో డీజీపీ సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. 31న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. గోప్యంగా ఏర్పాట్లు.. డీజీపీ పర్యటన షెడ్యూల్ను పోలీస్శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతోంది. సమావేశాల్లో పాల్గొనే అధికారులకు మాత్రమే అంతర్గతంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భద్రత, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సైతం పరిమిత స్థాయిలోనే చేపడుతున్నారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే పోలీసింగ్, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, జవాబుదారీతనం పెంపు, సిబ్బంది సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలపై డీజీపీ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. రికార్డులతో సిద్ధమవుతున్న అధికారులు.. డీజీపీ సమీక్ష నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు జిల్లాల వారీగా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో గత ఏడాదినుంచి నమోదైన కేసులు, వాటి పరిష్కారం, పెండింగ్ దర్యాప్తులు, కోర్టు విచారణలు, శిక్షలశాతం, బైండోవర్ కేసులు, రౌడీషీటర్ల హిస్టరీ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని డీజీపీ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రజలకు చేరువయ్యే పోలీసింగ్పై దిశానిర్దేశానికి ప్రణాళిక వరంగల్ నుంచే డీజీపీ శ్రీకారం.. -
నిధులున్నా.. అనుమతుల్లేవ్!
● పలుగుల, కుంట్లం ప్రజల ఇబ్బందులు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల రోడ్డుకు మూడు నెలల కిందట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రూ.22కోట్లతో శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతి లేదని రోడ్డు పనులు జరగడం లేదు. పదేళ్లుగా రోడ్డు వసతి లేక పలుగుల, కుంట్లం గ్రామాల ప్రజలు వర్షాకాలం మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఏర్పడిన గుంతలను స్థానికులు కూడ్చివేయగా.. మంగళవారం ఓ ఆటో ఆ బురదలో దిగబడింది. దీంతో ఆటోకు సెల్ఫ్ లేకపోవడంతో ఓ ఎడ్ల బండిసాయంతో బయటకు లాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని పలుగుల గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
3 నెలల రేషన్ బియ్యం
భూపాలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆదేశాలతో వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని లబ్ధిదారులందరికీ ఉచిత బియ్యం పంపిణీ జరుగనుంది. కార్డుదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రవాణా, పంపిణీ విషయంలో సివిల్ సప్లయీస్ అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో వర్షాకాలంలో రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని వచ్చే నెలలోనే సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి దిగుమతి, స్టాక్, పంపిణీ చేయడం రేషన్డీలర్లు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో డీలర్ల సంఘం ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా ముందస్తు ప్రణాళికలతో బియ్యం సేకరణ, పంపిణీని పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ కార్డులు 9,537, ఆహార భద్రత 1,29,960, అన్నపూర్ణ 33, మొత్తంగా 1,39,530 కార్డులు ఉండగా ఆయా కార్డుల్లో 3,95,964 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అంత్యోదయ కార్డు కలిగి ఉన్న కుటుంబం మొత్తానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్న వృద్ధులకు 10 కిలోలు, ఆహార భద్రత కార్డు ఉన్న వారిలో ఒక్కో కుటుంబ సభ్యుడికి ఆరు కేజీల బియ్యం చొప్పున మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాల్సి వస్తుండటంతో పౌరసరఫరాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్ సప్లయీస్ గోడౌన్ల నుంచి బియ్యం తరలింపు ప్రక్రియ మొదలైంది. ఈ నెల 31వ తేదీలోగా బియ్యం నిల్వలను డీలర్ల దుకాణాలకు చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. పంపిణీ విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో వీడిన సందిగ్ధత వచ్చే నెల 1వ తేదీ నుంచి షురూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న సివిల్ సప్లయీస్ అధికారులు జిల్లాలో 3,95,964 మంది లబ్ధిదారులు మండలం అంత్యోదయ ఆహార భద్రత భూపాలపల్లి 3,090 66,110 చిట్యాల 1,686 34,154 గణపురం 1,651 35,089 కాటారం 3,784 32,786 పలిమెల 524 7,574 మహాముత్తారం 3,105 23,548 మహదేవపూర్ 1,994 30,414 మల్హర్ 3,299 24,137 మొగుళ్లపల్లి 1,858 32,772 టేకుమట్ల 1,152 25,341 రేగొండ 1,346 40,347 కొత్తపల్లిగోరి 755 19,415అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులు కాటారం మండలంలో 31మంది, రేగొండలో ఇద్దరు ఉన్నారు -
సీపీఎస్ రద్దుకోసం ‘జన జాగరణ యాత్ర’
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ (కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓ పీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ మంగళవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు దిల్షాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగమూర్తి, బు చ్చన్న తదితరులు యాత్ర బృందానికి ఘన స్వా గతం పలికారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ పాల్గొని ప్రసంగించారు. సీపీఎస్ విధానంతో 22 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నా రు. ఇప్పటికే రాష్ట్రంలో 5వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పటికీ కనీస హా మీ పెన్షన్ కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మల్లికా ర్జున్, గడ్డం వెంకటేష్, చంద్రకాంత్, మహాదేవ్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్, ఆర్యూపీపీ నాయకుడు గడ్డం లక్ష్మయ్య పాల్గొన్నారు. -
రామప్ప దేవాలయం సందర్శన
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ కాకి మాధవరావు (1962 బ్యాచ్) మంగళవారం సందర్శించారు. 1971 నుంచి 1974 వరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్గా సేవలందించారు. మాధవరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సునీత, తెలంగాణ తొలి చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్రలు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో వారిని ఈఓ భాస్కర్ శాలువాలతో సత్కరించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.వారి వెంట ప్రొఫెసర్ పాండురంగారావు, అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ సూర్య కిరణ్, స్థానిక తహసిల్దార్ గిరిబాబు ఉన్నారు. -
రూ.31కోట్ల నిధులు మంజూరు
గణపురం: గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31కోట్ల నిధులు మంజూరుచేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో 100 రోజుల రైతు నేస్తం ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫ్రెన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆయకట్టు కాల్వల టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తిచేసి 12 నెలల్లో పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలు తట్టుకొని అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి ఉండడంతో తక్కువ నీటితో పండే పంటలు పండించాలన్నారు. ఉద్యాన, అంతర పంటలు వేసి అధిక లాభాలు పొందాలన్నారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, ఏడీఏ రమేశ్, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీఓ భాస్కర్, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్త డాక్టర్ విశ్వతేజ పాల్గొన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
చిన్నచిన్న తప్పిదాలతోనే భారీ ప్రమాదాలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: చిన్నచిన్న తప్పిదాలతో భారీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లా పోలీసు, రవాణాశాఖ సంయుక్తంగా అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా మైనర్లు వాహనాలు నడపడం, వాహనదారులు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటుబెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ తదితర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా అన్నారు. ప్రతీ ఒక్కరు రహదారి భద్రతా నియమాలను పాటించి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ సంకీర్త్ కోరారు. -
కూరగాయల సాగుతో అధిక లాభాలు
గణపురం: రైతులు కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో రైతులు పండిస్తున్న కూరగాయల సాగు క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు బూర యాదగిరి, మార్త రమేశ్ తదితరులతో కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు మార్కెటింగ్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో అధిక లాభాలను పొందే పంటలను ఎన్నుకోవాలన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా అంతర పంటలు వేయడంతో చీడపీడల ఉధృతి తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో రైతులు ఆధునిక సాగు పద్ధతులు చేపట్టాలని సూచించారు. అధికారులు రైతులకు అవసరమైన కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేపట్టేలా సలహాలు ఇస్తూ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలను అందించాలన్నారు. ఇతర రైతులకు లాభాలు, సాగు విధానం వివరించేందుకు సోమవారం ఐడీఓసీ కార్యాలయం వద్ద స్టాల్ ఏర్పాటు చేపించాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు అభినందనీయం భూపాలపల్లి రూరల్: వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ గుర్రంపేట గ్రామంలో పర్యటించి, క్షేత్రస్థాయిలో పంట మార్పిడి విధానంలో చేపట్టిన కంది సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలోని రైతులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయడం ఆదర్శనీయమన్నారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన అధికారి తిరుపతి, తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, ఇతర అధికారులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
బెటాలియన్ అభివృద్ధికి సహకరిస్తాం
గోవిందరావుపేట: మండల పరిధిలోని 5వ బెటాలియన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది ఆధునిక రెస్క్యూ పరికరాలతో నిర్వహించిన ప్రదర్శనను మంత్రి తిలకించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే పరికరాల పనితీరు, వాటి ఉపయోగాలపై అధికారులు వివరించగా మంత్రి ఆసక్తిగా వీక్షించి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అభినందించారు. తదుపరి బెటాలియన్ సిబ్బందితో మంత్రి ఆత్మీయంగా సమావేశమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, బెటాలియన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బెటాలియన్ను మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కల్యాణి, అదనపు కమాండెంట్ సీతారాం పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
రామప్ప సాగునీటిపై సందిగ్ధం..
వెంకటాపురం(ఎం): రామప్ప సరస్సు నుంచి ఆయకట్టు పొలాలకు అందించే సాగునీటిపై సందిగ్ధం నెలకొంది. రామప్ప సరస్సు కింద అధికారికంగా 5,180 ఎకరాలు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల వరిపంట సాగువుతుంది. వానాకాలం సాగు కోసం గత నెల 29న పాలంపేట రైతు వేదికలో ఇరిగేషన్ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించి సరస్సు కింద పూ ర్తి ఆయకట్టు సాగయ్యేలా తైబందీ ఖరారు చేశారు. పంట పొలాలకు సరస్సు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో రైతులు నార్లు పోసుకొని సుమారు 800 ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఎల్నినో ప్రభావంతో రామప్ప సరస్సు కింద ఆయకట్టు పొలాలకు సాగునీటి సరఫరాను నిలిపివేయాలని ఉన్నతాధికారుల ఆదేశానుసారంతో ఇరిగేషన్ అధికారులు ఈనెల 20న నీటిని నిలిపివేశారు. నారు పోసుకునేందుకు నీరిచ్చి నాట్లు వేసుకునేందుకు నీరు ఎందుకు ఇవ్వరంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దమొత్తంలో ఆయకట్టు రై తులు ఆందోళనకు దిగారు. కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఆయకట్టు రైతులకు బీఆర్ఎస్ నా యకులు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ ఈ నెల 24న ఇరిగేషన్ అధికారులతో సరస్సు నీటిని ఆయకట్టు పొలాలకు విడుదల చేయించారు. సరస్సు నీటిని నిలిపివేసిన అధికారులు ఆందోళనలో ఆయకట్టు రైతులు -
ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం
మల్హర్(కాటారం): ఎల్నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని టీఆర్వీకే శాస్త్రవేత్త, కోఆర్టినేటర్ డాక్టర్ మదన్మోహన్రెడ్డి అన్నారు. ఈ నెల 27 తేదీ నుంచి ఈనెల 29 తేదీ వరకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాటారం రైతు వేదికలో ‘పప్పుధాన్యాలు, కూరగాయల విత్తన మేళా’ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కొరత ఏర్పడి పంటల ఎదుగుదల మందగించి, దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. రైతులు నీటి లభ్యతకు తగినట్లుగా పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగి, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. మూడు రోజుల మేళాలో రైతులకు పప్పుధాన్యాలు, కూరగాయల విత్తనాలను సులభంగా పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాటారం ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. టీఆర్వీకే శాస్త్రవేత్త మదన్మోహన్రెడ్డి -
ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ● ప్రజాదివస్లో 12 ఫిర్యాదులు స్వీకరణ భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 12 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో మాట్లాడారు. అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధంగా ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ పనిచేస్తోందిన ప్రజలకు చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివాస్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సత్వర, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగ రాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచే గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం రేగొండ: భూవివాదంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన అన్న కొమురయ్య అనే వ్యక్తి గతంలో అదే గ్రామానికి చెందిన మల్లారెడ్డికి భూమి విక్రయించాడు. కాగా కొన్ని సంవత్సరాల తర్వాత మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన సూర రవీందర్కు మల్లారెడ్డి అదే భూమిని విక్రయించాడు. దీంతో రవీందర్ భూమిని సాగు చేసుకునే క్రమంలో కొమురయ్య వెళ్లి నా భూమి అంటూ వారం క్రితం హద్దు రాళ్లను తీసేశాడు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భూసమస్యలను కోర్టులో చూసుకోవాలని పోలీసులు తెలిపారు. కాగా సోమవారం మరోసారి కొమురయ్య హద్దు రాళ్లను తొలగిస్తుండగా రవీందర్ 100కు డయల్ చేశాడు. దీంతో పోలీసులు వెళ్లి లీగల్గా పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా సాయంత్రం కొమురయ్య పోలీస్ స్టేషన్ ఎదుట తనకు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాణ స్వీకారం కాళేశ్వరం: దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఈఓ మహేష్, చైర్మన్ మోహన్శర్మల ఆధ్వర్యంలో ఓదెల కుమారస్వామి సోమవారం ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఇప్పటికే ధర్మకర్త మండలి కొలువుదీరిన విషయం తెలిసిందే. అనివార్యకారణాలతో కుమారస్వామి ప్రమాణస్వీకారం ఆలస్యమైందని తెలిసింది. వారి వెంట ధర్మకర్తలు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగరాజుభూపాలపల్లి అర్బన్: జిల్లా నూతన లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం)గా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సోమవారం కలెక్టర్ రాహుల్శర్మను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారాలకు రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. జీఎం కార్యాలయం ఎదుట ధర్నా భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని సింగరేణి టీటు క్వార్టర్స్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమయ పాలన లేకుండా తాగునీటి సరఫరా చేస్తున్నారని, వారానికి రెండు రోజులు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు మహిళలు ఆరోపించారు. అర్థరాత్రి సమయంలో సైతం నీటిని ఇస్తున్నట్లు మండిపడ్డారు. రాత్రి షిప్టులో భర్తలు విధులు వెళ్లగా మహిళలుగా భయందోళనతోనే నీటిని పట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ రోజు ఉదయం సమయంలో నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీఎంను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోఏటూరునాగారం: గిరిజన దర్బార్లో అర్జీదారులు సమర్పించిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ను నిర్వహించారు. పలు సమస్యలపై 27 మంది నుంచి పీఓ వినతులను స్వీకరించారు. ఈ వినతులను ఆయా సెక్టార్ అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఏటూరునాగారం ఆర్ఐటీ కళాశాలలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని ఆకులవారిఘణపురానికి చెందిన నాగేంద్ర పీఓను కోరారు. జయశంకర్ భూపాలపల్లి మండలం గణపురంకు చెందిన గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు ఏదైనా ఉపాధి కల్పించాలని వేడుకున్నారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన పలువురు గిరిజన మహిళలు మంగపేట మండలంలోని స్కూల్ యూనిఫాంలు కుట్టేందుకు పని ఇప్పించాలని అధికారులను కోరారు. ఇలా వివిధ సమస్యలపై పీఓకు బాధితులు సమస్యలు వివరించి పరిష్కరించాలని వేడుకున్నారు. -
ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ రాహుల్శర్మ వ్యవసాయ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులు, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ నీటి అవసరమయ్యే పంటల విత్తనా లు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందించాలన్నారు. ప్రతీ రోజు పంటల సాగు పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇరిగేషన్ వనరుల్లోని నీటి ని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని, పంటలకు విడుదల చేయొద్దని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, కాల్వల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్నగర్కు విద్యుత్ వెలుగులు మహాముత్తారం మండలం బోర్లగూడెం శివారు హనుమాన్నగర్ గిరిజన గ్రామానికి 12 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కలెక్టర్ రాహుల్ శర్మ చొరవతో అటవీ హక్కుల చట్టం ప్రకారం అవసరమైన అనుమతులు లభించడంతో విద్యుత్ లైన్ల ఏర్పాటు పూర్తయింది. మరో రెండు రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కూడా పూర్తికానుంది. విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి జ్ఞాపిక అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులు, అలాగే చట్టపరమైన ప్రక్రియలో సహకరించిన నల్సార్ న్యాయ పట్టభద్రుడు కొర్ర ఆనంద్ నాయక్ సేవలను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి తిరుపతి, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్త డాక్టర్ మదన్మోహన్రెడ్డి, ఏడీఏలు రమేష్, శ్రీపాల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో మొత్తం 71 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిని తగిన చర్యల కోసం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి అర్జీని బాధ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. -
విద్యార్థుల పోరాటంతోనే కేంద్రం దిగొచ్చింది
భూపాలపల్లి రూరల్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల పోరాటంతోనే కేంద్రం దిగొచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ విజయానికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్తో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో జరిగిన పోరాటంలో విద్యార్థులు, యు వతకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అండగా నిలిచి కీలక పాత్ర పోషించారన్నారు. నీట్లో అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న అంశాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ -
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
ఆన్లైన్లో నమోదు వినియోగదారులు టీజీఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్ ద్వారా బల్క్/మల్టీపుల్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఆలస్యం తగ్గి అపార్ట్మెంట్, గృహ నిర్మాణ, వాణిజ్య రంగాలకు మరింత వేగవంతమైన సేవలు అందుతాయి. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ ఇటీవల ప్రకటించారు. వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలు ఆన్లైన్ విధానంలో నమోదు ప్రక్రియ -
రైతు వేదికల్లో విత్తన మేళా
భూపాలపల్లి: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని తెలి పారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ఈ విత్తన మేళా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ లాభం పొందే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచించారు. రైతులు సంప్రదాయ వరి సాగుకు బదులుగా ఇతర పంటలను సాగు చేస్తే వర్షాభావ పరిస్థితుల్లోనూ నష్టపోకుండా లాభపడవచ్చని పేర్కొన్నారు. మేళాలో నాణ్యమైన విత్తనాలు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మేళా నిర్వహించే రైతు వేదికలు ఇవే.. భూపాలపల్లి మండలంలో పెద్దాపూర్, ఘన్పూర్లో ఘన్పూర్, రేగొండలో రేగొండ, కొత్తపల్లిగోరిలో సుల్తాన్పూర్, చిట్యాలలో చిట్యాల, మొగుళ్లపల్లిలో మొగుళ్లపల్లి, టేకుమట్లలో టేకుమట్ల, మల్హర్లో తాడిచర్ల, కాటారంలో కాటారం, మహదేవపూర్లో బొమ్మపూర్, మహాముత్తారంలో బోర్లగూడెం, పలిమెల గ్రామ పంచాయతీ కార్యాలయంలో విత్తమేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనుకునే రైతులు తమ సమీప రైతు వేదికలను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సరైన విత్తనాలను పొందాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
నిండని చెరువులు.. ఎండుతున్న పంటలు
నాటుకు సిద్ధంగా ఉన్న నారునీళ్లులేక వెలవెలబోతున్న హుజుర్నగర్ ఊరకుంటఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఏర్పడింది. దీంతో మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు బోర్లకింద వరినాట్లు వేశారు. మరికొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి దేవాదుల నీరు రావడంతో నార్లు పోసి నాటు పనులు చేస్తున్నారు. కానీ, మున్ముందు వానలు కురవకపోతే సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 20రోజుల క్రితం కురిసిన వానలకు పోసిన నార్లు ఎండిపోవడంతోపాటు ఎర్రబారుతున్నాయని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వానలు పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు – మహాముత్తారం -
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటలు సాగు చేసే రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి పస్య పద్మ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రావినారాయణరెడ్డి భవన్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు గొంటు చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలకు పద్మ హాజరై మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో డ్రిప్ సాగును విస్తరించడంతోపాటు బోర్లు, బావుల వద్ద సోలార్ విద్యుత్ వ్యవస్థలను సబ్సిడీపై ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించి, వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూసార పరీక్షలు నిర్వహించి పంటల ఎంపికపై రైతులకు సలహాలు ఇవ్వాలని కోరారు. తాగు, సాగు నీటి సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిడాల సమ్మిరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పైళ్ల శాంతికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పరమండ్ల రాజయ్య, పెంట రవి, వెంకటేష్, నిమ్మల రాజయ్య, ఎండీ నబిలు పాల్గొన్నారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి పద్మ -
రెస్టారెంట్ల ఇష్టారాజ్యం
భూపాలపల్లి అర్బన్: మందుబాబులు మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరా చేసుకొని జిల్లాలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యవేక్షించే వారు, పట్టించుకొనే వారు కరువవడంతో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. మరో వైపు బార్ల నిర్వహణలో సమయపాలనను పాటించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తెల్లారే దాకా నిర్వహిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని తెలుస్తోంది. దీంతో మందు బాబుల మధ్య ఘర్షణలతో ఆయా ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంటుంది. ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ జిల్లా కేంద్రం కావడంతో భూపాలపల్లికి గతం కంటే రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపారం జోరందుకోవడంతో నిత్యం మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం సేవిస్తున్న సమయంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకోవడం పరిపాటి. అయితే, వారికి బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు కలుషిత, నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైకి హంగూ ఆర్భాటం కనిపిస్తున్నా.. వండేది మాత్రం పూర్తిగా కల్తీనే అని తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు నిల్వ చేసిన ఆహారాన్ని అమ్ముతున్నారని సమాచారం. ఇటీవల ఓ రెస్టారెంట్లో మందుబాబులు, నిర్వాహకుల మధ్య ఆహారం విషయంలో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ధరల విషయంలో చూపించే శ్రద్ధ నాణ్యతలో చూపడం లేదని పలువురు మందుబాబులు మండిపడుతున్నారు. నిబంధనలు బేఖాతర్ బార్ అండ్ రెస్టారెంట్లలో వండే ఆహారంలో సరుకులకు ఏరోజుకారోజు వినియోగించాల్సి ఉంది. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. భోజనం తయారు చేసే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. వినియోగదారులు మిగిల్చిన ఆహారాన్ని వెంటనే పడేయాలి. ఆహార పదార్థాలు, మాంసం మిగిలితే వాటిని ఫ్రీడ్జిలో పెట్టి నిల్వ చేయొద్దు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటలకు తెరిచి ఉంచాలి. సమయం దాటాక మందు విక్రయాలు జరపొద్దనే నిబంధనలు ఉన్నాయి. అయినా అవేమీ అమలు కావడం లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ శూన్యం జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా విక్రయాలు జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎకై ్సజ్ అధికారులు బార్ల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. నిర్వాహకులకు కొందరు అధికారులే వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మత్తులో అధికారులు.. జిల్లా కేంద్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు చాలా అరుదు. బార్లలో లూజు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా లూజు మద్యంలో కల్తీ చేసిన మద్యం విక్రయాలు, ధర ఎక్కువ ఉన్న మద్యానికి బదులుగా తక్కువ ధర కలిగిన మద్యాన్ని ఇస్తున్నారని పలువురు మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రతీ నెల నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్ని వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్లు జోరుగా నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయాలు కనీస ప్రమాణాలు పాటించని నిర్వాహకులు పట్టించుకోని సంబంధిత అధికారులు -
పేదబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
హన్మకొండ కల్చరల్: రాష్ట్రంలోని పేదబ్రాహ్మణుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.వందకోట్ల బడ్జెట్ రానుందని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బ్రాహ్మణ సేవాసమితి, శ్రీవైష్ణవ సేవా సమితి, విప్ర బ్రాహ్మణ సేవాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బ్రాహ్మణభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 లక్షల మంది పేదబ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ సంఘాలు నిబద్ధతతో పనిచేయాలని, అన్ని కులాలతో మమేకమై నడవాలని సూచించారు. పేద వేదపండితులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ట్రస్ట్లో తీర్మానం చేశామని, వివేకానంద స్కీం, విదేశీ విద్యా పథకం, వ్యాపారాలు చేసుకోవడానికి గ్రాంట్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యప్రసాద్ను సన్మానించారు. సమావేశంలో బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీఎస్ శ్రీనివాసాచారి, వేదపండితులు విజయకుమారాచార్యులు, విప్ర బ్రాహ్మణసేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్కుమార్, వైష్ణవ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ తిరువరంగం ప్రభాకరాచారి, చకిలం సుధాకర్రావు, శ్రీధరాచార్యులు పాల్గొన్నారు. -
నాలుగున్నర గంటలు ఉత్కంఠ
హన్మకొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి నాలుగున్నర గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిలకడగా ఆరోగ్యం హనుమకొండ హంటర్రోడ్డులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన వెంటనే పెద్ది సుదర్శన్రెడ్డిని భార్య స్వప్న, అందుబాటులో ఉన్న కార్యకర్తలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు చేరుకున్న వెంటనే డాక్టర్ మమత చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరవెల్లి భరత్ కుమార్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్రెడ్డి భార్యతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఇతర నాయకులకు సమాచారం అందించారు. హనుమకొండలోనే ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, అరూరి రమేశ్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్రావు, ఈవీ శ్రీనివాస్రావు, ముద్దసాని సహోదర్రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అదే విధంగా కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, శంబీపూర్ రాజు, హైదరాబాద్ నుంచి పలువురు సీనియర్ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. భార్య పెద్ది స్వప్నతో మాట్లాడి సుదర్శన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వారు చెప్పారు. కాగా, సుదర్శన్రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరగడంతో వైద్యులు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. డాక్టర్కు అభినందనల వెల్లువ కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఇప్పడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలను కార్డియాలజిస్ట్ మమత కాపాడారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కాపాడిన ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. గంటపాటు శ్రమించి పట్టువదలకుండా అంకితభావంతో సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్రెడ్డి ప్రాణాలు కాపాడిన మమతకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఎక్స్లో అభినందనలు తెలిపారు. పెద్ది సుదర్శన్రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే గంట పాటు సీపీఆర్ చేశా. ఎనిమిది సార్లు చేసినా గుండె లయ అందుకోలేదు. తొమ్మిదో సారికి లయ అందుకొని శ్వాస తీసుకుకున్నాడు. ఇది మిరాకిల్. తర్వాత అంజియోగ్రామ్తో పాటు ఇతర పరీక్షలు నిర్వహించాం. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగడానికి ఇంజక్షన్ ఇచ్చాం. గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళంలో గడ్డకట్టింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించాం. – మమత, కార్డియాలజిస్ట్ తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పరామర్శ -
సండే సందడి
వాజేడు: చాలా రోజుల తర్వాత బొగత జలపాతం వద్ద పర్యాటకు సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారుగా 2,500 మంది తరలివచ్చారు. బొగత జలపాతం అందాలను వీక్షించిన పర్యాటకులు సమీప కొలనులో కేరింతల కొడుతూ స్నానాలు చేశారు. చిలుకల పార్కులో పిల్లలతో కలిసి ఆనందంగా గడిపారు. కొందరు పర్యాటకులు చెట్ల కింద వంటలు చేసుకొని భోజనాలు చేశారు. పర్యాటకుల రద్దీ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు వివరించారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని టూరిజం ఇన్ఫ్లుయెన్సర్లు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారి వెంట తహసీల్దార్ గిరిబాబు, ఈఓ భాస్కర్, ఆర్ఐ రమేశ్, సీసీ నాగరాజు పాల్గొన్నారు. అలాగే నెదర్లాండ్ దేశస్తుడు మనోలో ఆలయాన్ని సందర్శించి రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని కొనియాడారు. హేమాచలుడికి ప్రత్యేక పూజలు మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి నాగరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ సివిల్ జడ్జి పూజిత వేర్వేరుగా ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా వారికి స్వాగతం పలికారు. అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్శర్మ జడ్జిల కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి పూజ లు నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు జరిపించి వేద మంత్రోచ్ఛరణతో స్వామివారిని శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం ఇచ్చారు. ప్రశాంతంగా ఉచిత కోచింగ్ అర్హత పరీక్ష కేయూ క్యాంపస్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థుల కోసం ఉచిత సివిల్ సర్వీసెస్లో శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల, హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జగన్మోహన్, ఆస్టడీ సర్కిల్ ప్రతినిధి కిరణ్ పర్యవేక్షించారు. కేఎంసీ పూర్వవిద్యార్థుల యాప్ ఆవిష్కరణ కాశిబుగ్గ: కాకతీయ వైద్య కళాశాల అలుమ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓకఇ అఠఝజీుఽజీ ఇౌుఽుఽ్ఛఛ్టి అధికారిక మొబెల్ యాప్ను హైదరాబాద్లోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఆవిష్కరించారు. కేఎంసీ అలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్, సన్షైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ కస్తూరి శ్రీధర్ తరుపున ఈ యాప్ను రూపొందించారు. క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, సర్జికల్ అంకాలజిస్టు సుబ్రహ్మణ్యేశ్వర్రావు, రెమిడీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ బీవీఆర్ శ్రీధర్రావు, డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఈ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ వారం రోజుల్లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లో అందుబాటులోని ఉంటుందని వారు వివరించారు. -
చైర్మన్పై ఫిర్యాదులు..
మున్సిపల్ చైర్మన్ కొమురయ్యపై ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లు బహిరంగంగానే ఆరోపణలకు దిగారు. శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్కు ఫిర్యాదు పత్రాలను అందించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సమన్వయం లేకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని, కౌన్సిలర్ల అభిప్రాయాలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని డీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. తమను బూతులు తిడుతూ కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్శర్మను కాంగ్రెస్ కౌన్సిలర్లు కోరారు. -
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026
ఒగ్గు కళాకారులు విన్యాసాలు బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, నాయకులు బీరన్నకు బోనాలుతొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో గొల్ల కురుమ కులస్తులు బీరన్న బోనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హన్మాన్ దేవాలయం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీరన్న ఆలయం వరకు డోలు చప్పుల్లు, బోనాలతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భూపాలపల్లి నియోజవకర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని డోలు వాయించి బోనం ఎత్తుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. – భూపాలపల్లి అర్బన్ / భూపాలపల్లి రూరల్ -
‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: జిల్లాలో డబుల్ ఓటు లేకుండా సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతీ యువత ఓటరుగా నమోదు కావాలని, అందుకు రాజకీయ పార్టీలు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలన్నారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ 84.12 శాతం పూర్తి అయిందని, అయితే పురపాలక పరిధిలో 70 శాతం జరిగిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎన్నికల విభాగం డిటీ అబ్బాస్, నవీన్, ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు నూతన సీపీఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన కిష్టయ్య కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ‘సోలార్’ పనులు వేగవంతం చేయాలి కాటారాన్ని మోడల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్దే పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ విలేజ్గా ఎంపికై న కాటారం మండలకేంద్రంలో సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్కో, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని క్లస్టర్–3 కింద కాటారం గ్రామంలో మొత్తం 700 గృహాలకు 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతీ ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టును విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్, డీపీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
మల్హర్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దతూండ్ల సబ్స్టేషన్ నుంచి తాడిచర్ల పరిధిలో 5 కిలోమీటర్ల పొడవైన 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33కేవీ లైన్ ఏర్పాటుతో రైతులు, వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందుతుందన్నారు. తాడిచర్ల, పెద్దతూండ్ల, ఏఎమ్మార్ సబ్ స్టేషన్ల పరిధిలో సాంకేతిక సమస్యలు ఎదురైనా, ఈ నూతన ఇంటర్ లింక్ లైన్ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చన్నారు. అత్యవసర సమయాల్లో విద్యుత్ కోతలు, అంతరాయం లేకుండా నిరంతరం అందించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఈ నాగరాజు, సేఫ్టీ ఆఫీసర్ జగదీష్, కన్సట్రక్షన్ ఏడీ సందీప్, ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ అశోక్, ఏఎల్ఎం రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్ తాడిచర్లకు 33కేవీ లైన్ ప్రారంభం -
త్రివేణి సంగమంలో ‘తొలి’ పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరికి తొలిఏకాదశి పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శనివారం ఉదయం నుంచి వీఐపీ ఘాటు, సాధారణ ఘాట్ల వ ద్ద భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరి మా తకు సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజించారు. అరటి దొప్పల్లో దీపాలు, పూలు వదిలారు. శివసత్తుల పూనకాలతో తీరం హోరెత్తింది. కొత్త నీరు రావడంతో ఇసుకతో పాటు బాటిళ్లు, క్యాన్లలో నీరు ఇళ్లకు తీసుకువెళ్లారు. సరస్వతీఘాటు వద్ద ఉన్న స రస్వతీమాతను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో దర్శనాలు చేశారు. ప్రస్తుతం ప్రధా న కాళేశ్వరం దేవాలయం జీర్ణోద్ధరణ నేపద్యంలో మూసివేసి ఉండడంతో రాజగోపురం ఎదుట ఉన్న శివలింగానికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులుచెల్లించారు. సుమారు 30వేలకుపైగా భక్తులు ద ర్శనాలు, గోదావరి స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. పూజలు, ప్రసాదం ద్వారా రూ. 2.24 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. కాగా జిల్లావ్యాప్తంగా తొలిఏకాదశి పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. స్నానాలకు పోటెత్తిన భక్తులు జిల్లాలో ఘనంగా తొలి ఏకాదశి పండుగ -
వైద్యరంగానికి భారీ ఊతం
ఉమ్మడి జిల్లాకు పోస్టులు● డీఎంఈ పరిధిలో పోస్టులకొనసాగింపు.. కొత్తగా కేటాయింపులు.. ● బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలకు భరోసా సాక్షిప్రతినిధి, వరంగల్ : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హానరేరియం, ఎంటీఎస్ ఉద్యోగాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు కొనసాగనున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వైద్యకళాశాలలు, భోధనాసుపత్రులకు వివిధ కేడర్లలో పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్కు పెద్దపీట వేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భారీగా పోస్టుల కేటాయింపు... ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేటగిరీల్లో సుమారు 564 పోస్టులను మంజూరు చేశారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, సాంకేతిక సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చారు. ● హనుమకొండకు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, వరంగల్ జిల్లా కింద 40 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ● ఎంజీఎం/కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 ప్రొఫెసర్లు, ఏసీ మెకానిక్, ఆడియాలజిస్ట్ తదితర పోస్టులు ఇచ్చారు. ● మహబూబాబాద్కు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● ములుగు జిల్లాకు 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28 అసోసియేట్ ప్రొఫెసర్లు, 7 ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఇచ్చారు. ● జనగామకు15 మంది అసిస్టెంట్, 26 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు. ● జయశంకర్ భూపాలపల్లికి 53 అసిస్టెంట్, 22 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక పోస్టులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వేతనాలకూ భారీ వ్యయం.. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.1.25 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, సీనియర్ రెసిడెంట్లకు రూ.1,06,461, ట్యూటర్లకు రూ.55 వేల వరకు పారితోషికం చెల్లించనున్నారు. ఇతర అవుట్సోర్సింగ్, సాంకేతిక సిబ్బందికి సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు అందజేయనున్నారు. ఈ ఉద్యోగుల వేతనాల కోసం బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలు, రిమ్స్ ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన బడ్జెట్ హెడ్ల నుంచి ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. కాగా ఉమ్మడి వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆసుపత్రి, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల బోధన, వైద్య సేవలు కొనసాగేందుకు ఈ ఉత్తర్వులు మరింత కీలకంగా మారనున్నాయి. -
చట్టాలపై అవగాహన ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్భూపాలపల్లి అర్బన్: విద్యార్థులకు చట్టాలు, శిక్షలపై అవగాహన ఉంటే ర్యాగింగ్, పోక్సో వంటి నేరాలకు దూరంగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్ కుమార్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసంపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, ప్రిన్సిపాల్ బాలునాయక్, న్యాయవాది రవికుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, హెచ్ఎంఆర్డీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగ విద్యార్థుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి, ఆహార నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపురం మండలకేంద్రంలోని ప్రముఖ కాకతీయ కళాకేత్రం కోటగుళ్లు, పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం, రెడ్డి గుడి, గణప సముద్రం చెరువు కట్టపై ఉన్న దక్షణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, బుద్దారం పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంతో పాటు చెల్పూరు గ్రామంలోని సాంబశివ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.గోదావరి పుష్కరాల భద్రతపై సమీక్ష భూపాలపల్లి అర్బన్: గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ వీసీలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. పుష్కర ఘాట్ల వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర స్పందన బృందాల ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో పుష్కరాల సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ వీసీలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేష్, అధికారులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలపై విచారణ మహాముత్తారం: మండలంలోని కోనంపేట మిషన్ భగీరథ ప్రాజెక్టులో అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగుల వివరాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి శనివారం కోనంపేటలోని పంప్హౌస్ వద్ద విచారణ చేపట్టారు. ఉద్యోగుల పూర్తి వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించినట్లు తెలిపారు. పరిశీలనలో ఎలాంటి అవకతవకలు, తప్పిదాలు లేవని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిషన్భగీరథ ఏఈ, డీఈ, ఈఈలు తదితరులున్నారు. కాళేశ్వరం దేవస్థానం టెండరు వాయిదా కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం టెండర్ వ్యవహారం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. శనివారం జరగాల్సిన టెండర్ బాంకుకు సంబంధించిన కారణాలతో మళ్లీ ఈనెల 27న (సోమవారం)కు వాయిదాపడినట్లు ఆర్అండ్బీ ఎస్ఈ రమేష్బాబు తెలిపారు. ‘ఎవరొచ్చి పోతున్నారు’ కథనంపై చర్చ కాళేశ్వరం: మహదేవపూర్ మండలవ్యాప్తంగా ‘ఎవరొచ్చి పోతున్నారు’ అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనంపై జోరుగా చర్చ జరిగింది. లాడ్జీల్లో నిర్వహణ నిర్లక్ష్యం, ఇతర ప్రాంతాల దొంగలు, గంజాయి, గుట్కా స్మగర్లు, ప్రేమికులు వచ్చిపోతున్నారని వచ్చిన కథనం మీద ఆయా లాడ్జీల నిర్వహకులు తమ వాట్సాప్ గ్రూపుల్లో, ఫోన్ల ద్వారా చర్చించుకున్నారు. దీనికి తోడు స్థానిక ఎస్సై లాడ్జీ నిర్వహకులకు వచ్చే నెల ఆగస్టు 3వ తేదీ వరకు అన్ని లాడ్జీల్లో సీసీ కెమెరాలు, రిజిస్టర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే ఆయా లాడ్జీలను సీజ్ చేస్తామని ఎస్సై హెచ్చరించినట్లు తెలిసింది. ఈ కథనంపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. -
కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి
కాళేశ్వరం: మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 5.750 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాటును తాకుతూ నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన మేడిగడ్డ బరాజ్కు వరద నీరు చేరడంతో అక్కడ 22,290 క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద ప్రవాహం రావడంతో మొత్తం 85 గేట్లు ఎత్తడంతో దిగువకు అదే స్థాయిలో అవుట్ఫ్లో తరలిపోతున్నట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయాలి రేగొండ: ఎల్నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలను సాగుచేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్రెడ్డి సూచించారు. శుక్రవారం రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలలో సాగుచేస్తున్న పంటలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, భూపాలపల్లి టీఆర్వీకే వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తిలో రసం పీల్చే పురుగుల బెడద నుంచి రక్షించుకోవడానికి జిగురు అట్టలను అమర్చాలని తెలిపారు. వరిలో ఆరుతడి పద్ధతిని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మజ, డాక్టర్ క్రాంతి, భూపాలపల్లి ఏడీఏ రమేశ్, మండల వ్యవసాయాధికారులు సారయ్య, వాసుదేవారెడ్డి, ఏఈఓలు ప్రశాంత్, భరత్, దివ్య, రైతులు పాల్గొన్నారు. కార్యదర్శుల జిల్లా ఫోరం ఎన్నిక భూపాలపల్లి రూరల్: తెలంగాణ నాన్–గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీన్జీఓఎస్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు యూనియన్ ఎన్నికల అధికారి ఎ.దశరథ రామారావు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా అడగాని సాంబశివుడు, గౌరవ అధ్యక్షుడిగా లింగయ్య, జనరల్ సెక్రటరీగా అంబటి దేవేందర్, కోశాధికారిగా బొజ్జం వీరయ్య, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవికుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, వెంకటరమణ, కల్లెపు సదానందం, నూతన కార్యవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మొబైల్ డీటీఆర్ ట్రాలీ ప్రారంభం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడంలో భాగంగా నూతనంగా మొబైల్ డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్) ట్రాలీని భూపాలపల్లి డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ జిల్లా ఎస్ఈ రమేశ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అకస్మాత్తుగా కాలిపోయినప్పుడు లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు, ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసే వరకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ మొబైల్ డీటీఆర్ ట్రాలీద్వారా తక్షణమే విద్యు త్ సరఫరాను పునరుద్ధరించవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయం సమయాన్ని గణనీయంగా తగ్గించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈట్రాలీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డివిజన్ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. ఈఈగా బాధ్యతల స్వీకరణ కాళేశ్వరం: మహదేవపూర్ డివిజన్–1 ఇరిగేషన్శాఖ ఈఈగా అజ్మీరా సురేష్ శుక్రవారం మహదేవపూర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మేడిగడ్డ బరాజ్, లక్ష్మీపంపుహౌస్లతో పాటు మహదేవపూర్, పలిమెల మండలాల మైనర్ ఇరిగేషన్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
పలు ఘటనలు..
● కాళేశ్వరంలో రెండేళ్ల కిందట ఓ కిరాణం దుకాణంలో రూ.20వేల నగదు కౌంటర్ నుంచి దొంగిలించారు. సీసీ కెమెరాల్లో చిక్కినా ఇప్పటికీ నిందితులు దొరకలేదు. ● అదే ఏడాది ఓ సెల్ఫోన్ దుకాణంలో రెండుసార్లు చోరీ జరిగింది. సీసీ కెమెరాలకు చిక్కినా ఇప్పటికీ ఆచూకీ లేదు. ● గతేడాది రెండు ఎద్దుల జత పోయినా ఇప్పటికీ దొరకలేదు. ● ఇప్పలబోరులో ఆటోను ఎత్తుకెళ్లినా ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ● నాలుగు నెలల కిందట ఎస్టీకాలనీ రోడ్డుపై ఉన్న ఆటోను ఎత్తుకెళ్లినా ఇంకా దర్యాప్తులోనే ఉంది. ● ఓ లాడ్జీలో ఏప్రిల్ నెలలో ఓ గుర్తు తెలియని ప్రేమజంటను తీసుకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు రావడంతో వారు అక్కడి నుంచి గోడ దూకి పరారయ్యారు. ● మరో లాడ్జీలో మహారాష్ట్ర నుంచి వచ్చిన గుర్తు తెలియని జంట తమ తల్లిదండ్రులకు తెలియడంతో పారిపోయింది. ● నాలుగు రోజుల కిందట గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్పై బామ్మర్ది పోలీసులతో కలిసి సెల్ ట్రేసింగ్తో సెర్చ్ చేసి పట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
ఐదేళ్ల వారసత్వం.. పనుల్లో అలసత్వం..!
రామప్పకు యునెస్కో గుర్తింపు (వారసత్వ హోదా) వచ్చినా మారని రూపురేఖలుములుగు: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చి నేటి (శనివారం)కి ఐదేళ్లు పూర్తయినా ఏ మార్పూ కనిపించ డం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని పాలంపేట పరిధిలో 1213లో కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి వారసత్వ సంపదగా యునెస్కో హోదా కల్పిస్తున్నట్లు 2021, జూలై 25న వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు సంబురపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ఆలయాన్ని సందర్శించి ఆలయ రూపురేఖలు మార్చేస్తామని, ప్రభుత్వాలనుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వినియోగంలోకి రాని ఉప ఆలయాలు రామప్ప ఆలయం ముందు ఉన్న గొల్లాల గుడికి మరమ్మతులు చేపట్టినప్పటికీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరో శివాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా కూలిపోతోందని దానికి సపోర్టుగా ఇనుపపైపులను అమర్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇటీవల ఆ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా కేంద్రం గుర్తించింది. మరికొన్ని ఉప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రారంభమెప్పుడో.. దేవాలయానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ ప్రాజెక్టు కింద రూ.61.99 కోట్ల నిధులను కేటాయించింది. మొదటి విడతగా రూ.42.14 కోట్ల నిధులు మంజూరు చేసి సుమారు 10 ఎకరాల్లో ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ను నిర్మించారు. కానీ, కాంట్రాక్టర్కు బిల్లు రాలేదనే నెపంతో సెంటర్ను ప్రారంభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. 2022 డిసెంబర్లోగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్ కమిటీ షరతు విధించినప్పటికీ ఇప్పటివరకు పునాదులకే పరిమితమైంది. రామప్ప సరస్సులోని ఐలాండ్లో 5 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సాస్కి పథకం కింద మంజూరైన రూ.13 కోట్లతో ఐలాండ్లో భారీ శివుడి విగ్రహం, రెస్టారెంట్, కెఫిటేరియా, చిల్డ్రన్స్పార్కు, బటర్ ఫ్లై గార్డెన్ నిర్మిస్తుండగా పనులు వేగవంతంగా కొనసాగడం లేదనే విమర్శలున్నాయి. గత ఏడాది నవంబర్లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు పనుల పురోగతిలో ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు. పునాదుల్లోనే కామేశ్వరాలయం.. ముందుకు సాగని ఐలాండ్ పనులు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులు పూర్తయితే మరింత సుందరంగా ఆలయ పరిసరాలు -
నేరాల నియంత్రణకు చర్యలు
రేగొండ: నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు అన్నారు. శుక్రవారం కొత్తపల్లిగోరి పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు -
సర్వే త్వరగా పూర్తి చేయాలి
భూపాలపల్లి: బల్క్ ల్యాండ్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో బల్క్ ల్యాండ్, రీ సర్వే, సర్ ప్రక్రియపై భూపాలపల్లి డివిజన్ రెవెన్యూ డివిజన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న బల్క్ ల్యాండ్ సమస్యలను గ్రామాల వారిగా సర్వే నిర్వహించి నివేదికలు అందజేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో సాదాబైనామా కింద మొత్తం 39,300 దరఖాస్తులు అందగా, ప్రస్తుతం 26,698 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. యూనిఫామ్ అందించాలి.. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫామ్ అందించాలని, ఆగస్టు 30 వరకు రెండు జతల యూనిఫామ్లు ఇవ్వాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ఎల్నినో నేపథ్యంలో పంటల పంటల వైవిధ్యీకరణ, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీపై వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కలెక్టర్లకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ.. విద్యా, సంక్షేమ, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చిట్యాల: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. గురువారం చిట్యాల పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని పలు రికా ర్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తుల పురోగతి, సీసీ కెమెరాల పని తీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో చక్కగా మాట్లాడి వారు ఇచ్చే ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీస్సేవలు అందించేందుకు ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, ఎస్సై పోచంపల్లి సతీష్, సిబ్బంది ఉన్నారు. -
గంజాయి నిర్మూలనకు తనిఖీలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు నార్కొటిక్ డాగ్ సహాయంతో గురువారం పట్టణంలోని రాంనగర్, కాకతీయ కాలనీ, జంగేడు, ఖాసింపల్లి ప్రాంతాల్లో గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, గంజాయి వినియోగదారుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా నిందితులు, వినియోగదారులు, వారి కుటుంబ సభ్యులకు గంజాయి విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. సంబంధిత నేరాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, భవిష్యత్లో ఎవరైనా సేవించడం, సంబంధిత నేరాల్లో పాల్గొన్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. -
మామునూరు ఎయిర్పోర్టు పనుల్లో కదలిక
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులకు కీలక అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్లతో టెండర్ పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు గురువారం మామునూరు విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఏఏఐ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒకేసారి 820మంది ప్రయాణికులకు సేవలందించే ఆధునిక టెర్మినల్ భవనం, రన్వే పునర్నిర్మాణం, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ (జీఎస్ఈ) ఏరియా, మూడు ఆప్రాన్, లింక్ ట్యాక్సీవేలు, ఐసోలేషన్ బే, పెరీమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితర పనుల రూపకల్పన, నాణ్యత ప్రమాణాలు, అమలు విధానాన్ని వివరించినట్లు తెలిసింది. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఉంటుందని, ఆగస్టు 18న బిడ్ ఓపెన్, సెప్టెంబర్ 7న ఫైనాన్సియల్ బిడ్ తెరుస్తారని వివరించారు. ఇప్పటికే ఖరారైన పెరీమీటర్ వాల్ టెండర్ రూ.21 కోట్లతో పెరీమీటర్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మాణానికి టెండర్ ఖరారైంది. పనులు ప్రారంభం కానున్నాయి. భూమి రక్షణ, భద్రతా ప్రమాణాల పరిరక్షణలో పనులు కీలకంగా మారనున్నాయి. రూ.270 కోట్ల అంచనా వ్యయంతో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్మాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ మౌలిక సదుపాయాలు, యుటిలిటీ నెట్వర్క్లు, ఇతర అనుబంధ పనులకు మరో టెండర్ త్వరలోనే పిలవనున్నారు. (23 డబ్ల్యూజీఎల్ 54: రూ.203.49 కోట్ల పనులపై ఏఏ అధికారుల ప్రజెంటేషన్ తొలుత మామునూరు ఎయిర్పోర్టు స్థల సందర్శన హనుమకొండలో ప్రీబిడ్ మీటింగ్ -
బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 72వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏరియాలోని కేటీకే–1, 5, 6, 8, ఓసీ–2 గనుల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మిక ఐక్యతతో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశ హితం–పరిశ్రమ హితం–కార్మిక హితం్ఙ అనే సిద్ధాంతంతో కార్మికుల సంక్షేమం కోసం బీఎంఎస్ నిరంతరం పనిచేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్, నర్సింగరావు, శ్రీరాములు, మల్లేష్, శ్రీనివాస్, ప్రేమ్సింగ్, శంకర్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయానికి సరికొత్త సొబగులు
జిల్లా గ్రంథాలయం గోడలపై ఏర్పాటు చేసిన చిత్రాలు భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ భవనానికి ఆకర్షణీయమైన రంగులు, అద్భుతమైన గోడ చిత్రాలతో సరికొత్త రూపును కలెక్టర్ రాహుల్శర్మ కల్పించారు. గ్రంథాలయం వెలుపలి గోడలపై విద్యార్థులు పుస్తకాలు చదువుతున్న దృశ్యాలు, పుస్తకాల వరుసలు, ప్రకృతి అందాలు, జ్ఞానానికి ప్రతీకలైన చిత్రాలను అందంగా చిత్రీకరించారు. ‘అదృష్టాన్ని కాదు... కష్టాన్ని నమ్ము’, ‘గ్రంథాలయం విలాసవంతమైనది కాదు... జీవితానికి అవసరమైనది’, ‘గ్రంథాలయం మనసులను తెరుస్తుంది... హృదయాలకు స్ఫూర్తినిస్తుంది.. భవిష్యత్ను నిర్మిస్తుంది’, ‘పుస్తకాన్ని తెరవండి... మీ ఆలోచనలకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయండి’ అనే భావాన్ని ప్రతిబింబించే సందేశాలను అర్థమయ్యేలా చిత్రాల ద్వారా ఆవిష్కరించారు. ఈ చిత్రలేఖనాలతో గ్రంథాలయం మరింత ఆహ్లాదకరంగా, ఆహ్వానించే విద్యా వాతావరణంగా మారింది. విద్యార్థులు, యువతలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు గ్రంథాలయాల ప్రాధాన్యాన్ని గుర్తుచేసేలా ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాలతో తీర్చిదిద్దిన ఈ భవనం ప్రస్తుతం భూపాలపల్లి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
గుర్తించి.. వదిలేశారు!
● ఎన్ క్వాస్లో జిల్లాలో 23 సెంటర్ల ఎంపిక ● మూడేళ్లు గడుస్తున్నా అందని ప్రోత్సాహకాలుభూపాలపల్లి అర్బన్: ఎన్ క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్)కు జిల్లాలో 2023లో 23 సెంటర్ల ఎంపికైనా ఇప్పటివరకు ప్రోత్సాహకాలు మాత్రం రూపాయి కూడా విడుదల కాలేదు. 23 ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు, వైద్యసేవలు బాగున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మూడేళ్లవుతున్నా నిధులు మంజూరు చేయకపోవడంతో ఉపయోగం లేకుండా పోతోంది. వరుసగా మూడేళ్లు ప్రోత్సాహకాలు అందజేయాల్సి ఉండగా ఆ సమయం కూడా దాటిపోయింది. కేంద్ర బృందం పరిశీలించి.. జిల్లాలో 13 పీహెచ్సీలు, 2 సీహెచ్సీలు, 75 హెల్త్వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యత ప్రమాణాలతో వైద్యసేవలు అందించడం, అవసరమైన మందులు నిల్వలు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం వంటి ఎనిమిది విభాగాలను పరిశీలించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్ క్వాస్)కు ఎంపిక చేస్తారు. కేంద్ర బృందం వచ్చి ఈ అంశాలను పరిశీలన జరిపి, ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికై న వాటికి మూడేళ్లపాటు ఏటా నిధులు విడుదల చేస్తారు. కానీ జిల్లాలో 2023 సంవత్సరంలో జిల్లాలో 23 ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఎంపికై న నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. మళ్లీ కొత్త ఆస్పత్రుల ఎంపికకు కసరత్తు చేయడం గమనార్హం. ప్రోత్సాహకాలు ఎంత ఇస్తారంటే.. ● ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏడాదికి రూ.3లక్షల చొప్పున మూడేళ్లలో రూ.9లక్షలు కేటాయిస్తారు. ● పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏటా రూ.2లక్షలు, మూడేళ్లకు రూ.6లక్షలు ఇస్తారు. ● పల్లె దవాఖానాలు, సబ్సెంటర్లకు ఏటా రూ.1.50 లక్షల చొప్పున రూ.4.50లక్షలు మంజూరు చేస్తారు. నిధులు మంజూరైతే అభివృద్ది జిల్లా వ్యాప్తంగా ఎంపికై న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లకు నిధులు మంజూరైతే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులతో మూడేళ్ల పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉంటుంది. ఎన్హెచ్ఎం నిధుల కొరత కారణంగా ప్రోత్సాహకాలు నిలిచిపోయినట్లు తెలిసింది. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
భూపాలపల్లి అర్బన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జొసఫ్, జిల్లా గర్ల్స కన్వీనర్ జడల రాజేశ్వరి, నాయకులు పోతుల పవన్, ఉల్లేరావు బన్నీ, రాజుల శివ పాల్గొన్నారు. గుట్కా ప్యాకెట్ల స్వాధీనం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో కిరాణం షాపుల్లో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. సీసీఎస్ పోలీసులు భూపాలపల్లి పట్టణంలో దాడులు నిర్వహించి రూ.1,96,430 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. చాముండా జనరల్ స్టోర్స్, దుర్గా జనరల్ స్టోర్స్, పవన కృష్ణ కిరాణం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అంబర్, ఆర్ఆర్, అనార్, జేకే, మీరాజ్ తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాముండా జనరల్ స్టోర్ నిర్వాహకుడు ఛత్రారం సతీష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.. కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో గతంలో పలు దుకాణాలకు టెండర్లు దక్కించుకున్న టెండర్దారుల సమస్యలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్ అవధాని మోహన్శర్మ అన్నారు. ఇటీవల మంత్రి శ్రీధర్బాబును టెండర్దారులు కలిసి తమ సమస్యను వివరించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఈఓ మహేష్తో దేవస్థానం కార్యాలయంలో టెండర్దారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జూన్ 17నుంచి ఆలయం మూసివేయడంతో టెండర్దారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక నష్టాలను చైర్మన్, ఈఓలకు విన్నపించారు. టెండర్దారులు మాట్లాడుతూ, ఆలయం మూసివేయడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బాలాలయం వద్ద సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెండర్ మొత్తాన్ని తగ్గించాలని చైర్మన్ను కోరారు. టెండర్దారులు వివరించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని ఆలయ చైర్మన్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఆలయ కాళేశ్వరం సర్పంచ్ మోహన్రెడ్డి, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య పాల్గొన్నారు. మహదేవపూర్ డివిజన్–1 ఈఈగా సురేష్ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఇరిగేషన్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)గా అజ్మీరా సురేష్ నియమితులయ్యారు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న తిరుపతిరావు ఇటీవల కరీంనగర్కు బదిలీ అయ్యారు. మళ్లీ ఆయనకు లింక్–1లోని మహదేవపూర్ డివిజన్–1కు బాధ్యతలు అప్పగించగా.. మేడిగడ్డ బరాజ్లో డీఈగా పనిచేస్తున్న సురేష్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈఎన్సీ అడ్మిన్ టి.శ్రీనివాస్ మూడు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం మహదేవపూర్ కార్యాలయంలో సురేష్ ఈఈగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయనకు మేడిగడ్డ బరాజ్, లక్ష్మీపంపుహౌస్లతో పాటు మహదేవపూర్, పలిమెల మండలాల్లోని మైనర్ ఇరిగేషన్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
చెత్త డబ్బాలపై అవగాహన
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేయనున్న చెత్త డబ్బాలపై అవగాహన కల్పించింది. చెత్తవేసే విధానంపై ఐటీడీఏ కార్యాలయ అధికారులు గురువారం బోర్డు ఏర్పాటు చేశారు. ఏ రంగు డబ్బాలో ఏ చెత్త వేయాలని అందులో క్షుణ్ణంగా వివరించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఇక నుంచి నాలుగు చెత్త డబ్బాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. జీపీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న వ్యర్థాలను వేర్వేరుగా చేసి చెత్తను డబ్బాల్లో వేయాలని క్లియర్గా పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రజలకు వివరించనున్నారు. -
ఆధునిక సాంకేతికతతోనే అభివృద్ధి వేగవంతం
భూపాలపల్లి: ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించినప్పుడే అభివృద్ధి వేగవంతమవుతుందని కలెక్టర్ రాహుల్శర్మ స్పష్టం చేశారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం టీ పైబర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీ ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏఐ ఆధారిత సాధనాల వినియోగం ఫైళ్ల నిర్వహణ, నివేదికల తయారీ డేటా విశ్లేషణ, సమయాన్ని ఆదా చేసే విధానాలు ప్రజా సేవల్లో సాంకేతికత పాత్ర వంటి అంశాలపై నిపుణులు వివరించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను ప్రభుత్వ పనుల్లో సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రతి అధికారి, ఉద్యోగికి శిక్షణ అవసరమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఐఏఎస్ అధికారులకు కూడా ఏఐపై శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘తెలంగాణ రైజింగ్–2047’ సాధనలో జిల్లాల అభివద్ధి కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక మంది అధికారులు చాట్ జీపీటీ, క్లౌడ్ వంటి ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నారని, అయితే వాటిపై పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ఏఐ పనులను సులభతరం చేసే సాధనమే కానీ, తుది నిర్ణయం అధికారులదే అని స్పష్టం చేశారు. ఏఐ ఇచ్చే సమాచారం, సూచనలను తప్పనిసరిగా ధవీకరించిన తర్వాతే వినియోగించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పరిపాలనలో ఉపయోగిస్తున్న కొన్ని ఏఐ సాధనాలను అధికారులకు ప్రాక్టికల్గా ప్రదర్శించి, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఐ నిపుణులు ధీరజ్, రాహుల్, ఈడీఎం శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు
భూపాలపల్లి రూరల్: జూలై మాసం ముగుస్తున్నా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండడం, ఎల్నినో ప్రభావం ఉండొచ్చని వ్యవసాయశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రైతులు ఈ వానాకాలం సాగు విధానాన్ని మార్చుకుంటున్నారు. గతంలో ప్రధానంగా వరిపైనే ఆధారపడిన రైతులు ఈసారి ఆరుతడి పంటలు, ముఖ్యంగా కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఇప్పటికే వర్షాధారంగా సాగుచేసే పత్తి విస్తీర్ణం అనేక మండలాల్లో పెరిగింది. నీటి లభ్యతపై స్పష్టత వచ్చే వరకు వరి నాట్లను వాయిదా వేస్తూ ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులు చేసిన సేద్యాన్ని పరిశీలిస్తే వరి సాగు అంచనాలు గణనీయంగా తగ్గగా, పత్తి సాగు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతోంది. వరి సాగుకు వెనుకడుగు.. ఎల్నినో ప్రభావంతో రైతులు వరిసాగుకు వెనుకడుగు వేస్తున్నారు. భూపాలపల్లి మండలంలో ప్రతిఏటా 10వేల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఈసారి అది నాలుగు వేల ఎకరాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా మండలాల్లో పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రతి మండలంలో పెసర, కంది పంటలు రైతులు సాగు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ బత్తాయి, నిమ్మ, మామిడి, ఆయిల్పామ్ తోటల విస్తీర్ణం జిల్లాలో స్థిరంగా కొనసాగుతోంది. పత్తికే ప్రాధాన్యం.. పత్తి పంటకు ఒడిదొడుకులు లేకుండా స్థిరంగా ధర పలుకుతుండటంతో రైతులు జిల్లాలో పత్తి పంటకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది 91,500 ఎకరాల్లో పత్తిసాగు చేయగా.. ఈ ఏడాది 1,04,940 ఎకరాల్లో సాగు చేశారు. జూన్ నెలలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతులు రెండోసారి విత్తనాలు విత్తారు. క్రమంగా అడపాదడపా చిరుజల్లులుగా వర్షాలు కురువడంతో ఇప్పడు పత్తి మొక్కలు నిగనిగలాడుతున్నాయి. వర్షభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి సాగు కన్నా ఆరుతడి పంటలు, కంది, పెసర, మినుములు, నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను సాగుచేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయక్షేత్రాల్లో రైతులకు పంటల మార్పడిపై అవగాహన కల్పిస్తున్నాం. అధికారుల సూచనలు రైతులు పాటించాలి. – బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరి 2,075పత్తి 1,04,940మొక్కజొన్న 57పెసర 69 జనుము 250జీలుగ 6,148 ఎల్నినో ప్రభావంతో సాగు విధానాన్ని మార్చుకుంటున్న రైతులు పత్తికే ప్రాధాన్యం.. తగ్గనున్న వరిసాగు పెరగనున్న ఇతర పంటలు -
నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం
హన్మకొండ: ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.56కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్.నాగరాజుతో కలిసి ఆయన బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వినియోగం, భద్రతా చర్యలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను జోడించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు రావడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనతో ‘ప్రజాబాట – పొలంబాట’ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులు వినియోగదారుల ముంగిటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న విద్యుత్ జీవితాల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. అదేవిధంగా లైన్మన్లకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫాం, ఆధునిక పరికరాలను అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వినతి మేరకు 132/33 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నామని, స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోలార్తోపాటు, విండ్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. సాంకేతికత వినియోగం వల్ల ఉద్యోగులకు రిస్క్ తగ్గడంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని, వినియోగదారులు, రైతులకు తక్షణ సేవలు అందుతున్నాయని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ పరిధిలోని భూములు కేటాయించడానికి తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు. దీనివల్ల ఆక్రమణలు అరికట్టడంతోపాటు దేవాలయాలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సమీకృత కలెక్టరేట్ భవనాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. కార్యక్రమం చివరలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, సీపీ శ్వేత, జిల్లా అటవీ శాఖాధికారి నిఖిత, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. ప్రజాబాట, పొలంబాట ద్వారా నేరుగా వినియోగదారుల ముంగిటికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీ ఎన్పీడీసీఎల్ చేపట్టిన రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు -
గోరింటాకు వేడుకలు
ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోరింటాకు వేడుకలు సందడిగా నిర్వహించారు. ఏరియాలోని పైలెట్కాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్లో నిర్వహించిన వేడుకలకు ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వర్రెడ్డి హాజరై ప్రారంభించారు. సభ్యులు గోరింటాకు చేతులకు పెట్టుకుని మహిళలందరికీ గోరింటాకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోరింటాకు చర్మవ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందన్నారు. ఒంట్లో వేడిని తగ్గిస్తుందన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు అలంకరణ తెలుగువారి సంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయికృష్ణ, సేవా కార్యదర్శి రుబినా, సభ్యులు పాల్గొన్నారు. – భూపాలపల్లి అర్బన్ -
200 పడకలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు
● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు బలోపేతం ● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుభూపాలపల్లి అర్బన్: 100 పడకలుగా ఉన్న జిల్లా ప్రధాన ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా విస్తరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని ఆస్పత్రి పనితీరు, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో వైద్యుల ఖాళీలు, పరికరాల మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బ్లడ్ బ్యాంక్లో ఫ్రిజ్ దెబ్బతిన్నా మరమ్మతులు ఎందుకు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్లడ్ బ్యాంక్ 24 గంటలు నిరంతరాయంగా పనిచేయాలని ఆదేశించారు. పేదలకు నాణ్యమైన, అందుబాటు వైద్యసేవలు అందించాలంటే ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రి అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. ఆస్పత్రి అంబులెన్సులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అగ్నిమాపక పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎంఆర్ఐ సేవలకు అవసరమైన టెక్నీషియన్ నియామకానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఆస్పత్రిలో యూడీఐడీ గది ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు త్వరగా పంపాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్పలిమెల: శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పలిమెల పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురో గతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరి శుభ్రతను పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ కేసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరి ష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజ లకు నాణ్యమైన పోలీస్సేవలు అందించేలా పనిచేయా లని సిబ్బందిని ఆదేశించారు.ఈకార్యక్రమంలో పలి మెల ఎస్సై సాయిశశాంక్, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే లైసెన్స్లు రద్దు
భూపాలపల్లి: ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా దుకాణాల లైసెన్స్లు రద్దుచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో పాటు ఇఫ్కో, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్ హోల్సేల్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా తగినంత ఎరువుల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు నిర్ణీత ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయించే డీలర్లు, అక్రమంగా నిల్వచేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల విక్రయాలను మరింత విస్తరించి రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. మండలాల వారీగా ఎరువుల వినియోగంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు వివరించారు. రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమంగా యూరి యాను ఇతర ప్రాంతాలకు తరలించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టంచేశారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార అధికారి వాలియానాయక్, భూపాలపల్లి, మహదేవపూర్ ఏడీఏలు రమేష్, శ్రీపాల్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
భూపాలపల్లి అర్బన్: శాసీ్త్రయ పద్ధతిలో భూగర్భ గనులను మూసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ ఆదేశించారు. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్లో సైంటిఫిక్ మైన్ క్లోజర్, గనుల పునరుద్ధరణ, సుస్థిర భూ వినియోగం అంశం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో వారు మాట్లాడారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తొలిసారిగా 42 బొగ్గు గనులను శాసీ్త్రయ పద్ధతిలో మూసివేసి పర్యావరణహిత ప్రాంతాలుగా అభివృద్ధి చేసిన అనుభవాలను ప్రతిబింభించే నివేదికను కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. గనుల మూసివేత అనంతరం చేపట్టాల్సిన పర్యావరణ పునరుద్ధరణ, స్థానిక ప్రజల జీవనోపాధి, ఉపాధి అవకాశాల సృష్టి, భూవినియోగం, మైన్ క్లోజర్ నిబంధనల అమలు వంటి అంశాలపై జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ వర్చువల్లో పర్యావరణ అధికారి పోషమల్లు, సీనియర్ ఎస్టేట్ అధికారి జి.రాజు, అధికారులు పాల్గొన్నారు. జీపీ భవనానికి తాళం చిట్యాల: మూడేళ్ల క్రితం రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇటీవల నిధులు వచ్చినా సర్పంచ్ ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ దంపతులు బానోత్ జవహర్–లత బుధవారం కార్యాలయానికి తాళంవేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ ఘటన చిట్యాల మండలం లక్ష్మీపూర్తండాలో చోటు చేసుకుంది. బానోత్ జవహర్–లత మాట్లాడుతూ లక్ష్మీపూర్తండా గ్రామ పంచాయతీ భవనం మూడేళ్ల క్రితం నిర్మించగా బిల్లు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు, గ్రీవెన్ సెల్లో కూడా ఫిర్యాదు చేయగా.. నెల రోజుల కిత్రం బిల్లులు మంజూరు చేసినట్లు తెలిపారు. బిల్లులు ఇవ్వకుండా వాటిని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తుత సర్పంచ్ నిలిపి వేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్ని అడుగుదామంటే స్థానికంగా ఉండడం లేదన్నారు. ఈ విషయంపై సర్పంచ్ను వివరణ కోరగా నిర్మాణం అసంపూర్తిగా ఉండడం మూలంగా బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. అడవులను పరిశీలించిన అధికారులు భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని చెల్పూరు, భూపాలపల్లి, మహదేవపూర్ అటవీ రేంజ్ల పరిధిలోని అడవులను బుధవారం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు గణేష్ కుమార్, రంగస్వామి, కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ పరిశీలించారు. నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 180 హెక్టార్ల అటవీశాఖ భూములు కోల్పోవడంతో అక్కడి అటవీ భూములకు బదులుగా జిల్లాలో 180 హెక్టారుల్లో అడవుల్లో అభివృద్ధి పనులతో పాటు మొక్కలు పెంచడానికి ప్రతిపాదిత ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. జిల్లాలో అడవుల అభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లాకేంద్రంలోని అటవీ కాంప్లెక్స్లో అధికారులు మొక్కలు నాటారు. అంతరిస్తున్న అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, అడవులుంటేనే భవిష్యత్ తరాల వారికి మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా సీసీఎఫ్ ప్రభాకర్ తెలిపారు. ఈకార్యక్రమంలో డీఎఫ్ఓ క్రిష్టాగౌడ్, భూపాలపల్లి, మహదేవపూర్ అటవీ డివిజన్ల ఎఫ్డీఓలు, పలు రేంజ్ల ఎస్ఆర్ఓలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మాణ పనుల పరిశీలన మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట రూ.60 కోట్ల అంచనాతో చేపట్టిన 2.5 కిలో మీటర్ల కరకట్ట నిర్మాణం పనులను ఇరిగేషన్ జిల్లా చీఫ్ ఇంజనీర్ ధర్మ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కరకట్ట నిర్మాణం డ్రాయింగ్ మ్యాప్ను ఆయన పరిశీలించి ఇప్పటి వరకు ఎంతమేరకు పనులు జరిగాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
వాటా ఎటుపాయె!
భూపాలపల్లి అర్బన్: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించలేదు. లాభాల వాటా పెంచాలని ఒకవైపు కార్మికసంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తుండగా యాజమాన్యం మాత్రం లాభాలనే ప్రకటించడం లేదు. లాభాల వాటా ప్రకటనలో ఆలస్యంపై కార్మికులు మండిపడుతున్నారు. 5,400 మంది విధులుభూపాలపల్లి సింగరేణి ఏరియాలో రెండు ఓపెన్ కాస్టులు, నాలుగు భూగర్భ గనుల్లో 5,400 అధికారులు, కార్మికులు పనిచేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. సింగరేణికి ప్రధాన బలం ఉద్యోగులేనని, విధుల్లో వారు చూపిస్తున్న కృషి, పట్టుదలతో సంస్థకు లాభాలు వస్తున్నాయని ప్రతిసారి యాజమాన్యం చెబుతోంది. అందుకే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా లాభాల్లో వాటా చెల్లిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు కార్మికులకు 2025–26 ఆర్ధిక సంవత్సరాలను లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదు. కార్మికులకు వాటా.. కోలిండియాలో సంస్థ లాభాలు సాఽధిస్తే అందులో కార్మికులకు వాటా చెల్లిస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంస్థ బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన క్రమంలో సంస్థను లాభాల బాట పట్టించేందుకు అప్పటి గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 1999–2000 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం లాభాల వాటాతో ప్రారంభమై.. గతేడాది 32 శాతానికి చేరుకుంది. సంస్థ చరిత్రలోనే 2018–19 అత్యఽధికంగా రూ.1,766 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో కార్మికుల వాటా 28 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి సగటున రూ.లక్ష వరకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాది ఆలస్యమే..ప్రతీ ఏడాది మాదిరిగానే అడిట్ లెక్కలు పూర్తి కాలేదనే సాకుతో సింగరేణి యాజమాన్యం లాభాల వాటా ప్రకటనలో సమాధానాలు చెబుతోంది. సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించేందుకు ప్రతి సంవత్సరం నాలుగైదు నెలల సమయం తీసుకుంటుంది. అధునాతన విధానాలను అమలు చేస్తూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు చేస్తున్న క్రమంలో ప్రతీ ఏడాది ఇదే విధంగా ఆలస్యం చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. లాభాలు ప్రకటించి యాజమన్యం కార్మికులకు ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటివరకు ప్రకటించలేదు. గతేడాది కాంట్రాక్ట్ కార్మికులకు సైతం..2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో నుంచి సింగరేణి యాజమాన్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున అందించింది. రెగ్యులర్ కార్మికులకు 34శాతం వాటాను చెల్లించారు. ఈ ఏడాది వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 40శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లాభాలుకార్మికులకు (లాభాల శాతం)లాభాలు రూ.కోట్లలో లాభాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న కార్మికులు లాభాల వాటా పెంచాలని డిమాండ్ 2019–202017–182023–242021–222018–192020–212022–232024–25 -
ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
– 8లోu● ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక చర్యలు ● ఉమ్మడి జిల్లా సమీక్షలో కలెక్టర్లు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి.. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ తక్కువ సాగునీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ పది రోజులకు ఒకసారి రైతులతో సమావేశాలు నిర్వహించాలని, వీబీ జీరాంజీ పథకం పనుల్లో వేగం పెంచాలన్నారు. జిల్లాల్లో వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ దేవాదుల నీటి పంపింగ్ను సమర్థంగా నిర్వహించాలన్నారు.● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: రహదారి ప్రమాదాల నివారణకు పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి వివిధ శాఖల రాష్ట్ర అధికారులతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, రహదారులు భవనాల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశాలు నిర్వహించి భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 78 శాతం డిజిటలైజేషన్ పూర్తి.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేశామని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను 78 శాతం పూర్తి చేశామని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ వెల్లడించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈ ఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత జలపాతం మంగళవారం ప్రకృతి సోయగాలను పంచింది. గుట్టలపై కురిసిన భారీ వర్షంతో జలపాతానికి వరద పోటెత్తింది. పాలనురగలా తెల్లని జలధారలు కనువిందు చేస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో స్నానాల కొలను మునిగిపోయింది. – వాజేడు -
ఓపెన్కాస్ట్ మైన్ సందర్శన
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ మైన్ను మంగళవారం టీజీ జెన్కో కోల్–లాజిస్టిక్స్ డైరెక్టర్ బి.నాగియ సందర్శించారు. ఈ సందర్భంగా గని ప్రాంగణంలో సీనియర్ అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా మైన్ ప్రస్తుత పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి వివరాలు, నివేదికలను డైరెక్టర్ నాగియకు వివరించారు. గని ప్రాంగణంలోని వ్యూ పాయింట్ నుంచి ప్రత్యక్షంగా మైనింగ్ పనులను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడానికి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెన్కో జనరల్ మేనేజర్ మోహన్రావు, ఏఎమ్మార్ అధికారులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్స్పై అవగాహన భూపాలపల్లి అర్బన్: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.రమేష్కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు డ్రగ్స్తో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎం.సదానందం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి.రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో అష్టతీర్థాలకు శ్రీకారం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పూర్వపు అష్టతీర్థాలకు రూ.60కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆర్కిటెక్చర్ బృందం కాళేశ్వరంలో పర్యటించి అష్టతీర్థాలపై సర్వే చేపట్టింది. అష్ట తీర్థాలను అభివృద్ధి చేసి ఘాట్ల నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. వీఐపీ ఘాట్లోని సంగమ తీర్థం ఇప్పటికే అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7 వరకు జరుగు గోదావరి నది పుష్కరాల వరకు నిర్మాణాలు చేపట్టడానికి సన్నద్ధమయ్యారని తెలిసింది. ప్రస్తుతమున్న సరస్వతీఘాటు ఎగువన ఉన్న పక్షి తీర్థం నుంచి హనుమత్ తీర్థం అంతర్రాష్ట్ర వంతెన వరకు 3.5 కిలోమీటర్ల మేర ఘాట్ల తీర్థాఽలను కలుపుతూ బండ్ నిర్మాణాలు చేపట్టడానికి డీపీఆర్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆయా బండ్ల వద్ద ఆయా తీర్థాలకు సంబంధించిన ప్రత్యేకమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తారని దేవాదాయశాఖ, ఆర్కిటెక్చర్ల బృందం పేర్కొంది. ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాఽశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు మెరిట్ స్కాలర్షిప్ పొందేందుకు నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ పరీక్షకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 24 వరకు తుది గడువుగా ఉందన్నారు.నవంబర్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాదని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్లో మిషన్ భగీరథ పైప్లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. తక్షణం సరిచేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, సాగునీటికి దేవాదుల ప్రాజెక్టే ప్రధాన ఆధారమని అన్నారు. మూడు దశల్లోని 10 మోటార్లను కనీసం 100 రోజులపాటు నిరంతరాయంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లోపాలు తలెత్తితే 48 గంటల్లోపు మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. ● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ హసన్పర్తి మండలంతోపాటు విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. వర్ధన్నపేటలో అమృత్ పథకం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు, భీమ్ఘనపూర్, చలివాగు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయని, ముఖ్యంగా మెడికల్ కాలేజీకి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీరు అందించాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో పాల్గొన్న ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, మురళీనాయక్ -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డిని కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ.. ట్రబ్ రిపేర్కు అవసరమైన సామగ్రి (వీల్స్, బోల్ట్స్, పెడస్టల్స్, క్లాంప్స్) సకాలంలో అందుబాటులో ఉంచాలన్నారు. కోల్ కట్టర్స్కు అవసరమైన బిట్స్, డ్రిల్లింగ్ రాడ్స్ కొరతను వెంటనే తీర్చాలని కోరారు. కేటీకే–5వ గనిలో మ్యాన్ రైడింగ్ ఎక్స్టెన్షన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని గనుల రహదారులపై స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రీజినల్ క్యాప్సూల్స్ సరఫరాను సక్రమంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు నాణ్యమైన కంపెనీ షూస్, హెల్మెట్లు, యూనిఫాంలు అందజేయాలని చెప్పారు. ఎస్డీఎల్ యంత్రాలను కొత్తవిగా కొనుగోలు చేసి అవసరమైన విడిభాగాలను సమకూర్చాలని కోరారు. జనరల్ మేనేజర్ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరలోనే చేపడతామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దాసరి జనార్దన్, గోడిసెల శ్రీహరి, రాజు, మనోజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్/గణపురం/ మల్హర్: సింగరేణి ప్రభావిత గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం భూపాలపల్లి ఏరియా కేటీకే ఓసీ–3 ప్రాజెక్టును సందర్శించి మెగా ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గనిలో వర్షపు నీరు నిల్వ కాకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. స్లోప్ల స్థిరత్వంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడవద్దని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి మహావక్షాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గనుల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సింగరేణి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తదుపరి ప్రతిపాదిత తాడిచర్ల ఓసీ–2 ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి స్థల పరిస్థితులు, ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. అనంతరం శాత్రాజ్పల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, పునరావాస అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, స్థానిక ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, ఏజీఎంలు రవికుమార్, జ్యోతి, పీఓలు శ్యాంసుందర్, రామస్వామి, డీజీఎం రాజేశ్వర్, ఏరియా ఇంజనీర్ పి.వి. సాంబశివరావు, ఏరియా సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ తిరుపతి, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు, వివిధ విభాగాల అధికారులు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఎంఓఏఐ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
చెస్ క్రీడతో మేధోసంపత్తి పెంపు
భూపాలపల్లి అర్బన్: చెస్ క్రీడతో మేధోసంపత్తి పెంపొందించుకోవచ్చని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి పటేల్ తెలిపారు. అంతర్జాతీయ చెస్ డే సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు చెస్ ఆడి అంతర్జాతీయ చెస్ డేను జరుపుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించా రు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి పటేల్, గౌరవాధ్యక్షుడు పంతకాని సమ్మయ్య మాట్లాడారు. చెస్ క్రీడ మానసిక వికాసానికి, ఏకాగ్రత పెంపొందించడానికి, మేధోసంపత్తిని అభివృద్ధి చేయడానికి, నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. అలాగే స్నేహభావం, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలు పెంపొందించే క్రీడగా చెస్కు స్థానం ఉందన్నారు. విద్యార్థులు, యువ త చెస్ క్రీడను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో భారీ స్థాయిలో మెగా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొనేలా టోర్నమెంట్ను నిర్వహించి, జిల్లాలో చెస్ క్రీడాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలి పారు. అసోసియేషన్ కమిటీ సభ్యులు అసిఫ్, రాంనారాయణ, సుమన్, దేవేందర్, శ్రీరాములు, కిరణ్, సంతోష్, శంకరయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ -
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ రాహుల్శర్మభూపాలపల్లి అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో మొత్తం 78 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రతీ దరఖాస్తును అధికారులు నిశితంగా పరిశీలించి, సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులను పరిష్కరించినప్పుడే ప్రజలకు అధికారులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. అనంతరం సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార పురోగతి, జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సీఎం ప్రజావాణికి సంబంధించిన 57 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ, వాటిని తక్షణమే పరిష్కరించి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


