breaking news
Jayashankar District News
-
భక్తుల కోలాహలం
మంగపేట/వెంకటాపురం(ఎం): మేడారంలోని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం హేమాచలక్షేత్రం, రామప్ప ఆలయానికి తరలివచ్చి లక్ష్మీనర్సింహస్వామి, రామలింగేశ్వస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోలాహలంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్కుమార్, శేఖర్శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. మేడారం భక్తులు తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శిస్తుండడంతో పాటు అదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప ఆలయ గార్డెన్లో భక్తులు సేదతీరి ఉల్లాసంగా గడిపారు. ఏసీబీ తెలంగాణ ఐజీ తరుణ్ జోషి కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.మేడారం నుంచి హేమాచల క్షేత్రం, రామప్పకు తరలివస్తున్న సందర్శకులు -
బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
భూపాలపల్లి అర్బన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీచేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర రమేష్, జనార్దన్, మాడ హరీశ్రెడ్డి, సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు. -
ఆశావహుల ఎదురుచూపు
కాళేశ్వరం: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాలయంలో ట్రస్టు బోర్డు నియామకం ఎప్పుడు జరుగుతుందనే అంశంపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే మహా శివరాత్రి జాతర నాటికి ట్రస్టు బోర్డు ఏర్పాటవుతుందా? లేదా అన్న సందేహాలు పలువురు నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. పరిశీలనలో ధరఖాస్తులు.. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కాళేశ్వరాలయం ట్రస్టు బోర్డు నియామకానికి సంబంధించి 14 మంది డైరెక్టర్లు, ఒక ఎక్స్అఫీషియో సభ్యుడి ఎంపిక కోసం గతేడాది నవంబర్ 18న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పలువురు ఆశావహులు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులపై ఎస్బీ పోలీసులు విచారణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ధరఖాస్తులు కమిషనర్ పరిశీలించి, ప్రభుత్వానికి అందజేసిట్లు తెలిసింది. పరిపాటిగా మారిన వాయిదా.. రెండున్నరేళ్లుగా ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి, ఆపై వాయిదా వేయం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతి నది పుష్కరాలను కూడా ట్రస్టు బోర్డు లేకుండానే ఉత్సవ కమిటీతోనే నిర్వహించారని ఆరోపణలు భక్తులు, ప్రజల్లో ఉన్నాయి. రూ.30కోట్లతో ప్రతిపాదనలు.. మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్యపుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల వరకు నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. శాశ్వత నిర్మాణాలు, ఆలయ అభివృద్ధి, నిర్వహణ పక్కాగా సాగాలంటే ట్రస్టు బోర్డు నియామకం తప్పనిసరి అన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. చైర్మన్ రేసులో మంథనికి చెందిన అవధాని మోహన్శర్మ, కాళేశ్వరానికి చెందిన కామిడి శ్రీనివాస్రెడ్డి, మెంగాని అఽశోక్ పైరవీలు జరుపుతున్నట్లు తెలిసింది. ఏదేమైనా ట్రస్టుబోర్డు నియామకం జరిపి, ఆలయ నిర్వహణపై గాడిలో పెట్టే వారిని చైర్మన్, డైరెక్టర్లుగా నియమించాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.ఈనెల 15న జరగనున్న మహా శివరాత్రి జాతర వరకై నా ట్రస్టు బోర్డు నియామకం చేస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశించే ఆశావహులు మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్లు వాయిదా వేయడం పరిపాటి మంత్రి శ్రీధర్బాబుపై ఆశలు పెట్టుకున్న నాయకులు -
పోలీస్ యాక్ట్ అమలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ సరిశెట్టి సంకీర్త్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నెల రోజుల పాటు సెక్షన్ 30, 30(ఏ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇతర వ్యక్తులు లేదా రాజకీయ పార్టీలను కించపరిచే వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాధ్యమాలలో అటువంటి పోస్టులు పెట్టినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేటీకే–5 ఇన్కై ్లన్లో భద్రతా పూజ భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే–5వ గనిలో ఆదివారం భద్రతా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన పూజ కార్యక్రమానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం, ఉత్పత్తి తగ్గుదల నేపథ్యంలో, గని భద్రతను మరింత పటిష్టం చేయడం, కార్మికుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో భద్రతా పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. గనిలో భద్రతే అత్యంత ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని స్థాయిల్లో కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని తెలిపారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా సమీక్షించి, అవసరమైన సాంకేతిక, పరిపాలనా చర్యలు ఇప్పటికే చేపడుతున్నామన్నారు. ఉత్పత్తి స్థాయిని పునరుద్ధరించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ భద్రతా పూజ కార్యక్రమంలో గని ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, గని మేనేజర్ మాచర్ల రమేష్, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి పోటీలు భూపాలపల్లి రూరల్: ఇండియన్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్నగర్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 300మంది కళాకారులు హాజరయ్యారు. కళాకా రులు వివిధ నృత్యాలతో అలరించారు. విజేతలకు నిర్వాహకులు షీల్డ్లతో పాటు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దుర్గం రమేష్, డ్యాన్స్ అకా డమీ సభ్యులు, డ్యాన్స్మాస్టర్లు పాల్గొన్నారు. జాతరలో నిరంతర విద్యుత్ సరఫరాహన్మకొండ: మేడారం మహా జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను విజయవంతంగా అందించినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సీఎండీ మేడారంలోనే బస చేసి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి మాట్లాడారు. జాతరలో నిరంతర విద్యుత్ సరఫరా వెనుక ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావం ఉందన్నారు. జాతర విజయవంతం చేయడానికి కృషిచేసిన అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘మేడారం మహాజాతర విజయవంతం’ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర విజయవంతంగా ముగిసిందని మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు అన్నారు. మేడారంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. జాతర నిర్వహణలో ప్రభుత్వం, పూజారులు, ఆదివాసీ యువకులు, సమన్వయంతో పనిచేసినట్లు వివరించారు. -
ప్రత్యేకం!
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఓరుగల్లుకు లేదుఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు ప్రత్యేక కేటాయింపులు లేవు. వరంగల్కు కీలకమైన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. మెడికల్, ఐటీ హబ్లు ఏర్పాటు చేసే నగరాల జాబితాలో చోటు దక్కలేదు. పర్యాటక అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఈ బడ్జెట్లో ఓరుగల్లు పర్యాటకాన్ని పట్టించుకోలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా ఊసేలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీతో పాటు కాళోజీ, కాకతీయ యూనివర్సిటీల ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులకు ఈ సారి మొండిచెయ్యే చూపారన్న చర్చ జరుగుతోంది. ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అంటుండగా.. ఈసారి కూడా అన్యాయం జరిగిందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల ఆశలు నెరవేరలే... వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారి ఆశలు నెరవేరలేదు. ఆ వర్గాలను ప్రభావితం చేసే అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5.28 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలవుతున్న స్లాబులను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్ డిడెక్షన్ను పెంచితే బాగుంటుందన్న వారి కోరిక తీరలేదు. డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్ను 5 నుంచి 2 తగ్గించి చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఆరు నెలల ఊరట ఇచ్చారు. గృహ రుణాల విషయంలో వడ్డీ రాయితీ, చిన్న కమతాలు కలిగిన రైతులకు భరోసా కల్పించే అంశాలు బడ్జెట్లో లేవు. రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్సిటీ పథకం పొ డిగింపుపై స్పష్టత లేదు. బడ్జెట్లో రాయితీలు లేకపోవడంతో అనేకవర్గాలు పెదవి విరుస్తున్నాయి. 6 జిల్లాలకు 6 బాలికల హాస్టళ్లు.. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు.. పర్యాటకం, మెడికల్ హబ్లో దక్కని చోటు ‘ట్రైబల్’ సహా యూనివర్సిటీలకు కేటాయించని నిధులు కేఎంటీపీకి ప్రయోజనం.. రైతులకు ఊరట జిల్లాకో బాలికల హాస్టల్.. ఉపాధి, ఉద్యోగావకాశాలుదేశంలోని అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు బాలికల హాస్టళ్లు రానున్నాయి. రైతులకు ఎరువులపై ఈసారి రాయితీ శాతాన్ని పెంచడం ఊరట కలిగించే అంశం కాగా, 9.17 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,834 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు మేలు జరగనుంది. ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్యం పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్ రోగులకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి. -
పొత్తు పొడిచింది
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పుర ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగనున్నాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 25వార్డులు, సీపీఐ 4, సీపీఎం 1 వార్డులో పోటీ చేయనున్నాయి. బీఆర్ఎస్ 30 వార్డుల్లో బరిలోకి దిగింది. బీజేపీ 25 స్థానాల్లో నామినేషన్లు వేయగా.. ఐదు స్థానాల్లో నామినేషన్ వేయలేదు. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని నిలువరించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని గండికొట్టాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్, సీపీఎంతో బీఆర్ఎస్ పార్టీ జతకట్టింది. నిన్న మొన్నటివరకు బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు ఉంటుందని ఊహాగానాలు వెలువడినప్పటికీ నామినేషన్ల ప్రక్రిమ ముగియడంతో ఈ అంశానికి తెరపడింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పుర ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఒంటరిగానే బీఆర్ఎస్, బీజేపీ మిగతా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు వేరే ఏ పార్టీతో కలిసే పరిస్థితి లేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారే పోటీచేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బీ ఫామ్లు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా తన నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభించి మున్సిపల్ ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది. బీజేపీ బలహీనపడిన వాతావరణం కనిపిస్తున్న తరుణంలో ఆ స్థానాన్ని భర్తీచేసేలా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా మున్సిపల్ ఎన్నికలను వాడుకోవాలనే ఆలోచనలో ఉంది. బీజేపీ పోటీచేయని వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు పలు గ్రామాల్లో సర్పంచ్ల గెలుపునకు కలిసి పనిచేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మెజారిటీ సీట్ల సంఖ్య ఏ మాత్రం తక్కువైనా గతంలో లాగే ఎన్నికల అనంతరం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తుకుదిరే అవకాశం ఉండకపోలేదని పుర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుదిరిన సీట్ల లెక్క కాంగ్రెస్తో జతకట్టిన సీపీఐ, సీపీఎంలకు సీట్ల కేటాయింపు లెక్క తేలింది. మున్సిపాలిటీలో 30 వార్డు వార్డులు ఉండగా 25వార్డులు కాంగ్రెస్, 4 సీపీఐ, 1 సీపీఎం పోటీచేయనుంది. 5, 7, 24, 28 వార్డులో సీపీఐ, 27వ వార్డులో సీపీఎం అభ్యర్థులు నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో నామినేషన్ వేయగా బీజేపీ తరఫున 25 వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్ వేశారు. 8, 18, 25, 26, 30 వార్డుల్లో పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎన్నికల షెడ్యూల్కు ముందు అన్ని పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రచారాన్ని ప్రారంభించారు. పొత్తుల విషయంలో కూడా అన్ని పార్టీల కన్నా ముందుగా వ్యూహాత్మకంగా లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్కు పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా ఆయా పార్టీలు భావిస్తున్నారు. పట్టణంలోని ఓటర్లలో సింగరేణి కార్మికులు అధికంగా ఉండటం, గతంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపొందడం కూటమికి సానుకూలాంశంగా మారింది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ కార్మికసంఘం బలంగా ఉండటం కూటమికి కలిసొచ్చే అంశంగా పార్టీలు భావిస్తున్నాయి. మున్సిపల్లో సీపీఐ, సీపీఎంతో జతకట్టిన కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి బీఆర్ఎస్, బీజేపీ -
మేడారం టు కాళేశ్వరం
● మేడారం భక్తులతో కిక్కిరిసిన కాళేశ్వరాలయం కాళేశ్వరం: ములుగు జిల్లా మేడారంలో మొక్కులు చెల్లించిన భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరాలయాన్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో పాటు తెలంగాణలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే భక్తులు కాళేశ్వరాలయంలో స్వామివారికి పూజలు చేశారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాల వద్ద భక్తులు శనిపూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. -
కలెక్టరేట్లో 24 గంటలు హెల్ప్డెస్క్
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కలెక్టరేట్లో 24/7 గంటల హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలను హెల్ప్ డెస్క్ మొబైల్ నంబర్ 90306 32608కు తెలియజేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ పాల్గొన్నారు. పారదర్శకంగా నిర్వహించాలి.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణీంద్రరెడ్డి సూచించారు. శనివారం ఆయన భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత గల నామినేషన్లను మాత్రమే చెల్లుబాటు చేయాలని, పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రతీ నామినేషన్ను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ -
అరణ్యానికి ఆదిశక్తులు
సమ్మక్క: రాత్రి 7.58 గంటలకుమేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తల్లులారా వెళ్లొస్తాం.. తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. బోసిపోయిన మేడారం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు. భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్కు ఎండోమెంట్ అధికారులు వెల్డింగ్ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. జనం నుంచి వనం చేరిన తల్లులు ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశంవరాల మూటలు భక్తులకిచ్చారు.. వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు. ఆసీనులై అందరి మొర ఆలకించారు.. ఎనలేని కాస్మిక్ ఎనర్జీని ప్రసరించారు. భక్తుల ప్రేమకు మురిసిపోయారు. వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు.. ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి. వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా. ‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది! -
ఈసారైనా విదిల్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆదివారం) ప్రవేశపెట్టే 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది? అన్న చర్చ ప్రధానాంశమైంది. ఈసారైనా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల విషయమై సీతమ్మ కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2025–26 కేంద్ర బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నేరుగా పద్దులేవీ ప్రకటించలేదు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ను రూపకల్ప న చేసినట్లు చెప్పినా.. నేరుగా ఆ వర్గాలకు చెందిన అందరికీ మేలు జరిగే పరిస్థితి కనిపించలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు పీఎం మిత్ర హోదా, నిధుల కేటాయింపు, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, భూగర్భ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా.. బడ్జెట్లో ఆ మే రకు నిధులివ్వలేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటున్నాయి. ఈసారి బడ్జెట్లోనైనా ప్రాధాన్యమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రాజెక్టులపై చిన్నచూపు.. ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ తదితర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. పలు ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడంపై ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ను ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి ఉన్నా.. గత బడ్డెట్లో నేరుగా పద్దుల్లో చేర్చకపోవడం వల్ల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.350 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు గత బడ్డెట్లో బుట్టదాఖలే అయ్యాయి. లెదర్ పార్కు, సైనిక్ స్కూల్తో పాటు వివిధ పథకాల కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోగా.. రూ.4,174 కోట్ల అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిధుల్లో కేంద్రం వాటా తేలలేదు. ఈసారి నిధులిచ్చి వాటాను క్లియర్ చేయాలని కోరుతున్నారు. నిధులు కేటాయించని కారణంగా సైనిక్ స్కూల్ను ఇతర జిల్లాలకు తరలించాలని చూస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. నిర్మలమ్మపైనే ఆశలు ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్ఫ్యాక్టరీ పూర్తికి నిధులు అవసరం ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులు పెండింగ్ రైల్వే లైన్లు, స్టేషన్లకు విడుదల కాని నిధులు గత బడ్జెట్లో ప్రతిపాదించినా దక్కని ప్రాధాన్యం ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశలు రైల్వేశాఖకు కేటాయింపులపై ఆశలు..ఈసాధారణ బడ్జెట్లోనైనా రైల్వేశాఖకు కేటాయింపులు జరిగితే పలు కొత్త, అసంపూర్తి రైల్వేలైన్లకు మోక్షం కలుగుతుంది. మణుగూరు–రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు. ఆ మేరకు భూసేకరణ, నిర్మాణం పూర్తి కోసం నిధులు ఇవ్వలేదు. హసన్పర్తి–కరీంనగర్, డోర్నకల్–మిర్యాలగూడ రైల్వేలైన్ల సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు పెరగాల్సి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు ఆ మేరకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రి మార్పుపైన ఆశలు ఉన్నాయి. స్టేషన్ఘన్ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్కు నిధులివ్వడంతో పాటు కాజీపేట జంక్షన్ నుంచి ముంబై. విజయవాడ, కాగజ్నగర్ వరకు మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. కాగా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్సిటీ గడువును పెంచి అదనంగా నిధులు కేటాయించాలని నగరవాసులు కోరుతున్నారు. -
అమ్మల దీవెన
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. కోటి మందికిపైగా మొక్కులు.. వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు. సమీప గ్రామాల్లో భక్తుల సందడి మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు. తిరుగు ప్రయాణం.. తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు. సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి.. పూనకాలతో పులకించి పోయాయి. తలనీలాలు తన్మయత్వం చెందాయి.. ఎనలేని భక్తిని చాటాయి. పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి.. పొడిసేటి పొద్దులై ప్రభవించాయి. కోళ్లు, యాటలు సై సై అన్నాయి.. మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి. సాక చుక్కలు నేలపై పారాయి.. ఆనవాయితీకి అద్దం పట్టాయి. ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి.. భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి. ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి.. వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి. గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి.. భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు -
ముగిసిన నామినేషన్ల పర్వం
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో తొలిపర్వం ముగిసింది. మూడురోజుల పాటు నామినేషన్ల స్వీక రణ ప్రక్రియ కొనసాగగా చివరిరోజు భారీ సంఖ్య లో అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేశారు. ఒక్కరోజే 230.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో స్వీకరించారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు 4 నామినేషన్లు, 29న 19 మంది 20 నామినేషన్లు దాఖలు చేశారు. 30న 176 మంది 230 నామినేషన్లు వేసినట్లు ము న్సిపల్ కమిషనర్ జోనా వెల్లడించారు. మొత్తంగా 198 మంది అభ్యర్థులు 254 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు. పార్టీల వారీగా.. బీఎస్పీ 2, బీజేపీ 30, సీపీఐ 7, సీపీఎం 2, కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 83, జనసేన 4, ఏఐఎఫ్బీ 3, ఇతర పార్టీలు 8, స్వతంత్రులు 26 మంది మొత్తంగా 254 నామినేషన్లను దాఖలు చేశారు. గల్ల పెట్టె గలగల... ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం వచ్చింది. నామినేషన్లు వేసే అ భ్యర్థులు ఆస్తి పన్నులు పూర్తిగా చెల్లించాలనే నిబంధన ఉండటంతో 198 మంది తమ ఆస్తి పన్నులను చెల్లించారు. 28వ తేదీన రూ.4,86,492, 29న రూ.8,53,589, శుక్రవారం రూ.6,42,893, మొత్తంగా రూ.19,82,974 ఆస్తి పన్ను వసూలు అయినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ వెల్లడించారు. భూపాలపల్లిలో 30 వార్డులు 198 మంది అభ్యర్థులు 254 నామినేషన్లు చివరి రోజు భారీగా 230 దాఖలు -
గుర్రంపేట జాతరలో కలెక్టర్ పూజలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట గ్రామంలో నిర్వహిస్తున్న మినీ మేడారం జాతరను శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంిపీడీఓ తరుణ్ ప్రసాద్, అధికారులు, ఆలయ సిబ్బంది, పూజారులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకుడు ఫణీందర్రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్ 9030632608కు కాల్ చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, భద్రత, తరలింపులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రాల పరిశీలన.. మున్సిపాలిటీ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకుడు ఫణీందర్రెడ్డిలు వేర్వేరుగా పరిశీలించి నోడల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్నింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన ఫణీందర్రెడ్డి శుక్రవారం నుంచి జెన్కో అతిథి గృహంలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే నేరుగా లేదా ఫోన్ నంబర్ 9949992992 ద్వారా తెలియజేయాలని ఫణీందర్రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ సీమెన్స్, ప్రథం సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లతో పాఠశాల విద్యలో(స్టెమ్) సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్పై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో స్టెమ్ విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, సీమెన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ శివకుమార్, ప్రథం రాష్ట్ర కో ఆర్డినేటర్ సుధాకర్ పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ, పరిశీలకుడు ఫణీందర్రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై నోడల్ అధికారులతో సమావేశం -
జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క
● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు ● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక ● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక ● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక ● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక ● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది. ● జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం ● అడుగుడుగునా భక్తుల నీరాజనాలు ● గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు ● నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. గుట్టపై రహస్య పూజలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ దివాకర టీఎస్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు. హరివిల్లు.. చిలకలగుట్ట దారి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు. మూడుసార్లు లైట్ల ఆర్పివేత.. గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు. నలుగురు వనదేవతలకు పూజలు.. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులు సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు. 6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు పోటెత్తిన భక్తజనం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్, వాటర్ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది. సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు.. చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు. గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు.సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠమేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు. -
తొలిరోజు మూడు నామినేషన్లు
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాజకీయ పార్టీల నేతలకు సవాల్గా మారింది. మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నెల రోజుల ముందు నుంచే ఆశావహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. వార్డుల్లో తమ సామాజిక వర్గం వారి ఓట్లే ఎక్కువగా ఉన్నాయని, తనకు టికెట్ ఇస్తే సరే, లేదంటే పార్టీని వీడి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని పలువురు ఆశావహులు తమ నేతలకు వెల్లడిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా.. రెబల్స్ ద్వారా పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పట్టణంలోని 7వ వార్డుకు బీజేపీ మద్ధతుదారు ఒకరు, 9వ వార్డుకు బీఆర్ఎస్ మద్ధతుదారైన ఒకే వ్యక్తి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 28వ వార్డు నుంచి సీపీఐ మద్ధతుదారు ఒకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. నేడు.. రేపు భారీగా నామినేషన్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కావడం, మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించడంతో కౌన్సిలర్గా పోటీ చేయనున్న అభ్యర్థులు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. అంతేకాక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదు. బుధవారం రాత్రి వరకు ప్రతీ పార్టీ ఒకటి, రెండు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. దీంతో నేడు(గురువారం), రేపు(శుక్రవారం) భారీ మొత్తంలోనే నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. రెండు పార్టీలతో కలిసి కాంగ్రెస్.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా సీపీఐకి 4, సీపీఎంకు ఒక వార్డు స్థానాన్ని ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మిగిలిన 25 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పోటీలో నిలబడనున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. నేడు, రేపు భారీగా దాఖలయ్యే అవకాశం కాంగ్రెస్తో సీపీఐ, సీపీఎం పొత్తు ఒంటరిగా బరిలోకి బీఆర్ఎస్, బీజేపీలు -
గోవిందరాజులు..
కొండాయి నుంచి 5:57 గంటలకు పడిగ రూపంలో బయలుదేరాడు. 6:40 గంటలకు కొండాయి ఊరిపొలిమేర దాటారు. 8:20 గంటలకు జంపన్నవాగు దాటారు. 9:20 గంటలకు మేడారం జంపన్నవాగుకు చేరుకున్నారు. 12:29 గంటలకు గద్దెలపై ప్రతిష్ఠించారు. రహస్య పూజలు లోపల.. డోలు వాయిద్య గంభీర ధ్వనులు బయట. పూజారుల మంత్రాల ఉచ్ఛరణ లోపల.. ఆదివాసీల ఆటపాటలు బయట. పసుపు కుంకుమలతో ఆడబిడ్డకు కొలుపు లోపల. నీళ్లారగించేందుకు నిరీక్షించే ఆడపడుచులు బయట. తరలివచ్చేందుకు సిద్ధమైన తల్లి లోపల.. పాద స్పర్శ కోసం వరంపట్టే బిడ్డలు బయట.. ఇలా.. కన్నెపల్లి నుంచి బుధవారం రాత్రి ఆదివాసీ సంప్రదాయంతో సారలమ్మ మేడారానికి బయలెల్లింది. ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు. చిలకలగుట్టపై పూజలు.. సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. -
సారలమ్మ వచ్చిందిలా..
మంగళవారం మధ్యాహ్నం 4:23కు పూనుగొండ్ల నుంచి బయల్దేరాడు. రాత్రి 1 గంటలకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురానికి చేరుకున్నాడు. బుధవారం ఉదయం 11:23 గంటలకు పస్రా చేరుకున్నాడు. సమ్మక్క గుడికి రాత్రి 7:23కు చేరుకున్నాడు. 12:29 గంటలకు గద్దైపె పగిడిద్దరాజును ప్రతిష్ఠించారు. కొండాయి నుంచి 5:57 గంటలకు పడిగ రూపంలో బయలుదేరాడు. 6:40 గంటలకు కొండాయి ఊరిపొలిమేర దాటారు. 8:20 గంటలకు జంపన్నవాగు దాటారు. 9:20 గంటలకు మేడారం జంపన్నవాగుకు చేరుకున్నారు. 12:29 గంటలకు గద్దెలపై ప్రతిష్ఠించారు. రహస్య పూజలు లోపల.. డోలు వాయిద్య గంభీర ధ్వనులు బయట. పూజారుల మంత్రాల ఉచ్ఛరణ లోపల.. ఆదివాసీల ఆటపాటలు బయట. పసుపు కుంకుమలతో ఆడబిడ్డకు కొలుపు లోపల. నీళ్లారగించేందుకు నిరీక్షించే ఆడపడుచులు బయట. తరలివచ్చేందుకు సిద్ధమైన తల్లి లోపల.. పాద స్పర్శ కోసం వరంపట్టే బిడ్డలు బయట.. ఇలా.. కన్నెపల్లి నుంచి బుధవారం రాత్రి ఆదివాసీ సంప్రదాయంతో సారలమ్మ మేడారానికి బయలెల్లింది. ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు. చిలకలగుట్టపై పూజలు.. సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. రాత్రి 7 గంటలకు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోకి పూజారులు వెళ్లారు. 7:19 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి పూజలు చేశారు. రహస్య పూజల అనంతరం.. 7:38 గంటలకు పూజారులు బయటకు వచ్చారు. 7:40 గంటలకు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. 7:42 గంటలకు సారలమ్మకు నిమ్మకాయలతో దిష్టి తీశారు. 8:51 గంటలకు జంపన్నవాగుకు చేరుకున్నారు. 12:28 గంటలకు గద్దైపె సారలమ్మను ప్రతిష్ఠించారు. -
మహా భక్తులకు కష్టాలు
కాళేశ్వరం: మేడారం జాతరకు తరలిపోతున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులకు మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ వంతెన మీదుగా ఇంజనీర్లు, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు వద్ద భక్తులు నిరీక్షిస్తున్నారు. మంగళవారం ఆయా రాష్ట్రాల నుంచి మేడారం వెళ్లేందుకు తరలిరాగా గేటు వద్ద అనుమతి లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం తమకు అనుమతి కల్పించాలని వేడుకుంటున్నారు. కాళేశ్వరం మీదుగా వెళ్లాలంటే రవాణా కష్టాలతో ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. భూపాలపల్లి అర్బన్: కాటారం–మేడారం ప్రధాన రహదారిలో సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేడారం సమీపంలోని కాల్వపల్లి–మహాముత్తారం మండలం సింగారం గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతు పనులు పూర్తి కాలేదు. రోడ్డుపై గుంతలు పూడ్చే క్రమంలో అధికారులు కంకర పోసి వదిలేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుంచి జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నా.. అధికారులు పనులెప్పుడు పూర్తిచేస్తారని మండిపడుతున్నారు. భూపాలపల్లి రూరల్: ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతానని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవికుమార్ ఆధ్వర్యంలో టీఎన్జీఓ డైరీని కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు విజయలక్ష్మి, అశోక్ కుమార్, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి దశరథ రామారావు, సంఘం నాయకులు షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, సురేందర్రెడ్డి, అన్వార్ భైగ్, వంశీ కృష్ణ, మురళీధర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీదేవి పాల్గొన్నారు. ● ఇద్దరి దుర్మరణం మల్హర్(మహాముత్తారం): మేడారం జాతర నేపథ్యంలో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్తున్న ట్రాక్టర్ మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 10 మందికి పైగా వ్యక్తులు ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో మహాముత్తారం మండలం నిమ్మగూడెం, పెగడపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మి(45), అక్షిత (20) మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలిసింది. -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. గద్దెలే దేవతామూర్తులుగా.. మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15ఫైర్ ఫైటర్లు: 268పార్కింగ్ స్థలాలు: 42మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000మొత్తం ట్రిప్పులు: 51,000ఆర్టీసీ సిబ్బంది: 10,441తాగునీటి నల్లాలు: 5,482జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119వైద్య సిబ్బంది: 5,192అంబులెన్సులు: 30 బైక్ అంబులెన్సులు: 40 ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు రోజుకు మెడికల్ క్యాంపులు: 30కమ్యూనికేషన్ – టెక్నాలజీశాశ్వత మొబైల్ టవర్లు: 27తాత్కాలిక మొబైల్ టవర్లు: 33వీహెచ్ఎఫ్ సెట్లు: 450ట్రాన్స్ఫార్మర్లు: 196విద్యుత్ స్తంభాలు: 911విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ విద్యుత్ సిబ్బంది: 350 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్): 28టాయిలెట్లు: 5,700బ్లాకులు: 285గజ ఈతగాళ్లు: 210సింగరేణి రెస్క్యూ: 12ఎస్డీఆర్ఎఫ్ బృందాలు: 100– ములుగుపారిశుద్ధ్య సిబ్బంది: 5,000ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100స్వీపింగ్ మెషిన్లు: 18 జేసీబీలు : 12స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు 2,000 మంది -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక మలుగు/ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు. కోరికలు నెరవేర్చేందుకు నిలువెత్తు బంగారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణం విస్తరణ.. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.హనుమాన్ జెండా నీడలో సారలమ్మ.. సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గుడారాలతో నిండిన మేడారం..గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు. పూనుగొండ్ల నుంచి మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు 70 కిలోమీటర్లు అడవిలో కాలినడకన పడిగతో బై లెల్లిన పూజారులు -
బీఆర్ఎస్ది కమీషన్ల రాజకీయం
భూపాలపల్లి అర్బన్: కమీషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. కమీషన్లు రావని డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో రూ.2కోట్లతో బంజార భవనం, రూ.10కోట్లతో సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణ పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పేదవాడికి ఇళ్లు, మహిళలకు భరోసా వంటి ఎన్నో చార్రితక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుంటే కొందరు రాజకీయంగా దివాళా తీసిన నేతలు అబద్దాలు, దుష్ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఒకసారి కాదు, రెండు సార్లు తగిన గుణపాఠం చెప్పారని మూడో సారి కూడా తిప్పి కొట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఇచ్చిన మాటలను చేతల్లో చూపే ప్రభుత్వమని అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. జిల్లా రద్దు చేస్తారని వస్తున్న అసత్య వార్తలు ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, శ్రీదేవి, వైస్ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు. హామీలను నెరవేరుస్తున్నాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ఆదివాసీ యువత రోప్పార్టీ సిద్ధం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఆదివాసీ యువతతో రోప్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 29న చిలకల గుట్ట నుంచి సమ్మక్కతల్లిని మేడారం గద్దైపెకి తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీతో పాటు మేడారానికి చెందిన ఆదివాసీ యువతతో రోప్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో పోలీసుల రోప్ పార్టీ కీలకమైనప్పటికీ ఆదివాసీ యువత రోప్ పార్టీ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. సమ్మక్కతల్లి చిలకలగుట్ట దిగిన నుంచి గద్దైపెకి ప్రతిష్టించే వరకు ఆదివాసీ యువత సంప్రదాయాలను పాటిస్తూ రోప్ పార్టీగా అమ్మవారిని గద్దైపెకి తీసుకొస్తుంది. యువతకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. సోమవారం చిలకలగుట్ట వద్ద ఆదివాసీ యూత్ రోప్ పార్టీ సమావేశమై అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చిలకల గుట్ట వద్ద ట్రాక్టర్ డోజర్తో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. -
మహాజాతరకు ముస్తాబు
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం జరగ్గా.. ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు జరుగుతుంది. ఈ మేరకు జాతరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముస్తాబైన నయా మేడారం... మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్ తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే దశ్యకావ్యాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. భద్రత వలయంలో మేడారం.. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. జంపన్న వాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తిచేశారు. మేడారం చుట్టూ 10 కి.మీ.ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జాతర సందర్భంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలనుంచి తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 460 సీసీ కెమెరాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండబోతుండగా, ట్రాఫిక్ నియంత్రణకు రెండు కిలోమీటర్లకు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. రూ.251 కోట్లతో పునరుద్ధరణ, జాతర నిర్వహణ పనులు జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు 28 నుంచి 31 వరకు మహా జాతర.. 3 కోట్లమంది వస్తారని అంచనా -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
భూపాలపల్లి: పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరు కాగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మెరుగైన వైద్యం.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. జిల్లాలో 39,605 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఇందుకోసం రూ. 88.13 కోట్లు వెచ్చించాం. జిల్లాలో 65 పల్లె దవాఖానాలు, మహదేవపూర్లో డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు అందించాం. మహిళా క్యాంపులు నిర్వహించి 5,690 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. రైతు సంక్షేమం.. వ్యవసాయం.. రైతు భరోసా కింద 1.24 లక్షల మంది రైతులకు రూ. 96 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ రైతులపై ఆర్థిక భారం తగ్గించాం. రైతు బీమా కింద 72,058 మందిని నమోదు చేశాం. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుంది. గృహజ్యోతి.. ఇందిరమ్మ ఇళ్లు.. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే 56,525 మంది వినియోగదారులకు ప్రభుత్వం రూ.37.42 కోట్లు చెల్లించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాకు 3,943 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.51.40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 68,311 మంది లబ్ధి పొందుతున్నారు. సన్నబియ్యం పంపిణీ, పట్టణ అభివృద్ధి.. జిల్లాలో నూతనంగా 15,149 రేషన్ కార్డులు మంజూరు చేశాం. పాఠశాలలు, అంగన్వాడీలకు పోర్టి ఫైడ్ సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.113 కోట్లతో పనులు చేపట్టామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. అలరించిన కార్యక్రమాలు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. పలు ప్రభు త్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాటా రం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ, ప్రసంగిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థుల నృత్యాలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగానికి పెద్దపీట పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం గణతంత్ర వేడుకల్లో రాహుల్ శర్మ మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది. జిల్లాలో ఇప్పటివరకు 1.85 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనివలన వారికి రూ. 97.43 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. మహిళా శక్తి పథకం కింద 2,378 సంఘాలకు రూ. 240 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. -
పోరాట స్ఫూర్తిని నింపాలి
భూపాలపల్లి: భవిష్యత్ తరాలకు స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నింపాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని, వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులో.. భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాపోటీల్లో విజేతలైన కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్.దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, పోక్సో స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, అదనపు గవర్నమెంట్ ప్లీడర్లు బల్ల మహేందర్, ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. గణపురం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో జాతీయ జెండా రూపంతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా రూపంలో అలంకరించగా భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. 31 వరకు ఇసుక రీచ్లు బంద్ కాళేశ్వరం: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని ఇసుక రీచులను కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాలతో నేటి నుంచి ఈనెల 31వరకు బంద్ చేసినట్లు టీజీఎండీసీ పీఓ రామకృష్ణ సోమవారం తెలిపారు. జాతర సమయంలో భక్తులు భారీగా తరలి రానున్నందున ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఇసుక రీచులు బంద్ చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి యథావిధిగా ఇసుక రీచ్లు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. -
టీకా ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో హెల్త్ కేర్ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. స్థానిక పీహెచ్సీలో జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ ఉమాదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి డోసు టీకా ఇవ్వగా, రెండో డోసు ఒక నెల తర్వాత, మూడో డోసు ఆరు నెలల తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు. హెపటైటిస్–బీ వ్యాక్సిన్ ద్వారా పచ్చకామెర్లు, లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ కేన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. -
మేడారం జాతర బస్సు ప్రారంభం
మల్హర్(కాటారం): కాటారంలో మేడారం జాతర స్పెషల్ బస్సును భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో డీఎం బస్సును ప్రారంభించి మాట్లాడారు. మేడారం జాతర కోసం ఏర్పాటుచేసిన బస్సును మేడారానికి వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్వైజర్లు రాంప్రసాద్, జీఆర్రెడ్డి, సర్పంచ్లు పంతకాని సడవలి, ఊర వెంకటేశ్వరరావు, కాటారం ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య, మానేం రాజబాపు, బుర్ర లక్ష్మణ్, మంత్రి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి
భూపాలపల్లి: భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సంకీర్త్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం అని, మహనీయులు ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా మనం స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవిస్తున్నామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో ఘనంగా ప్రగతి సాధించిందని, ఆర్థిక, సాంకేతిక వృద్ధి సాధించామని ఎస్పీ అన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 46 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
వైభవంగా రథసప్తమి పూజలు
అభిషేకం చేస్తున్న అర్చకుడు ఫణీంద్రశర్మ పూజలో పాల్గొన్న భక్తులుకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమిని పురస్కరించుకొని వైభవోపేతంగా పూజలు చేశారు. ఆదివారం ఉదయం దేవస్థానం ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకం, అరుణ పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేకంగా పూలతో అలంకరణలు చేశారు. అనంతరం, పూజలో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, స్వా మి మహా ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రత్యేక అలంకరణలో సూర్యనారాయణస్వామి -
దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
భూపాలపల్లి రూరల్: మున్సిపాలిటీ అభివృద్ధిపై కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మున్సిపాలిటీలోని సుభాష్కాలనీ, రాజీవ్నగర్ కాలనీలో పల్లె దవాఖానాలను డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాలంలో చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలో ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో మేడారం బస్సు పా యింట్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. డిపో నుంచి 80 బస్సు సర్వీసులు మేడారం జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎం ఇందూ, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, వార్డు ఇన్చార్జ్లు, పార్టీ కారకర్తలు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఆర్యూపీపీటీఎస్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా కడెం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా పెనుకుల యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. పండితుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని నూతన కమి టీ సభ్యులు తెలిపారు. వేముల రవికుమార్, పోతుల మురళీధర్, కత్రోజు వెంకటేశ్వర్లు, మడిపల్లి రమేష్, కొలిపాక శ్రీనివాస్, గుండు రమేష్, అశోక్, పూర్ణచందర్లు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ధ్వంసం చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో ధ్వంసం చేసిన శిలాఫలకాలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంజూరు చేసి శంకుస్థాపన చేసిన హెల్త్ వెల్నెస్ సెంటర్ పనులకు సంబంధించిన శిలాఫలకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తామననడం కక్ష్యపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. వారి వెంట స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చదువులు సాగేదెలా!
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు భూపాలపల్లి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్), పాఠశాలల తనిఖీ బృందాల్లో ఉపాధ్యాయులు కొన్ని రోజులుగా పాఠశాలలకు దూరంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు టెట్ పరీక్ష ఉండడంతో ఉపాధ్యాయులు తీరికలేకుండా ఉన్న తరుణంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ఉపాధ్యాయులకు శిక్షణ, ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 69 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2,739 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పదోతరగతి విద్యార్థులకు జనవరిలోగా సిలబస్ పూర్తిచేసి రివిజన్(పునఃశ్చరణ) తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం, వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. పరీక్షల్లో అవగాహన పెంచుకునేందుకు రోజువా రీగా స్లిప్ టెస్ట్తో పాటు వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన కల్పించాలి. కాని వరుసగా వస్తున్న ఎన్నికలు నాయకులకు, అభ్యర్థులకే కాకుండా విద్యార్థులకూ ఓ పరీక్షలా తయారయ్యా యి. ఇటు ఎన్నికల శిక్షణ, అటు టెట్ పరీక్షలకు సంసిద్ధం కావాల్సి ఉండడంతో ఉపాధ్యాయులు కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్నో తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికలు రావడం మరింత ఇబ్బందిగా తయారైంది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వార్షిక పరీక్షలకు ప్రణాళికలతో సన్నద్ధం చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడం ఫలితాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పరీక్షల వేళ తనిఖీ బృందాలా? పరీక్షల సమయం దగ్గర పడుతున్న వేళ జిల్లాలో పాఠశాలల తనిఖీకి ప్రభుత్వం ఉపాధ్యాయులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. పాఠశాలలకు వెళ్లకుండా పూర్తి డిప్యూటేషన్పై ఈ బృందాలు ప్రతీ రోజు పాఠశాలల తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయి బృందాలు రోజుకు రెండు, ప్రామికోన్నత, ఉన్నత పాఠశాలలు రోజుకు ఒక పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, తరగతి విద్యా బోధన, ఎఫ్ఎల్ఎన్, లీప్ కార్యక్రమాల అమలు తీరు, ఇతర వినూత్న కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. తనిఖీ బృందం వచ్చే వరకు పాఠశాలలో ఉపాధ్యాయులు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఉపాధ్యాయులు నిమగ్నమవుతున్నారు. దీంతో పాఠశాలల్లో విద్యాబోధన స్తంభించింది. ఆ తర్వాత టెట్ ప్రిపరేషన్ త్వరలో మున్సిపల్ ఎన్నికల శిక్షణ, విధులు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు ఆటంకాలు ‘పది’ ఫలితాలపై ప్రభావంవిద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. దీంతో విద్యాబోధనకు అవాంతరాలు ఎదురయ్యాయి. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, దసరా సెలవులు రావడంతో బోధన అంతంత మాత్రంగానే సాగింది. అంతలోనే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ ఉపాధ్యాయులకే విధులు కేటాయించారు. తర్వాత సంక్రాంతి సెలవులు రావడంతో ఇలా పలు కారణాలతో చదువులు సాగలేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు మార్చి 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో చదువులు సరిగా సాగక విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారో అన్న భయందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నికల ప్రభావంతో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. -
నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తంకారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి -
ఓటు హక్కు పవిత్రమైనది
భూపాలపల్లి అర్బన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, అర్హత కలిగిన ప్ర తీఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పిలు పునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఆదివారం నిర్వహించిన 16వ జాతీ య ఓటరు దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేసి, సీనియర్ సిటిజన్ ఓటర్లను సత్కరించారు. ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థుల సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలరన్నారు. యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన బీఎల్ఓ, సూపర్వైజర్లు చేంజ్, ఆపరేటర్లుకు ప్రశంసపత్రాలు అందించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
మేడారానికి పోటెత్తిన భక్తులు
ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకు భక్తుల తరలి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకం, భక్తిగీతాల ఆలాపాన, భక్తుల సందడితో జంపన్న వాగు కోలాహలంగా మారింది. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె సమర్పించి చల్లగా చూడాలని భక్తులు తల్లులను వేడుకున్నారు. అనంతరం అడవిలో చెట్లకింద వంటలు వండుకొని భోజనాలు చేశారు. మేడారంలో కలెక్టర్ దంపతులు భూపాలపల్లి రూరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ వీరస్వామి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎత్తు బంగారం సమర్పించారు. దర్శించుకున్న వారిలో కలెక్టర్ దంపతులతో పాటు కలెక్టర్ తల్లిదండ్రులు ఉన్నారు. ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శనివారం శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీడీఓ శైలజ మాట్లాడుతూ బాలిక కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టి పెరిగే వరకు వారికి సంక్షేమ శాఖ అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా బాలికలకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. జెండర్ స్పెషలిస్ట్ అనూష మాట్లాడుతూ పిల్లలలో ఏకాగ్రత, పోటీతత్వం, సమన్వయం తప్పకుండా ఉండాలన్నా రు. బాలికలు వివక్షకు గురైతే ప్రశ్నించాలన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన బాలికలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది మమత, సురేష్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. -
శక్తిని ప్రసాదించే జలకం..
సమ్మక్క తల్లి గుట్ట దిగే సమయం నుంచి గద్దెలకు చేరే వరకు జలకపు వడ్డె మల్లెల సత్యం పూజారులతో కలిసి ముందుకు సాగుతాడు. తొమ్మిది రకాల పానీయాలతో జలకాన్ని ప్రత్యేకంగా పూజారులు తయారు చేస్తారు. ఈ జలకాన్ని సమ్మక్క పూజారుల వడ్డె మల్లెల సత్యం చేతుల పట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న కృష్ణయ్యతో కలిసి ముందుకు సాగుతాడు. జలకం చల్లితేనే అమ్మవారు ముందుకు కదులుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే కృష్ణయ్య ఎక్కడా నీరస పడకుండా జలకాన్ని దప్పికగా అందిస్తారు. దీంతో ఆయన మరింత శక్తిని పుంజుకుని ముందుకు సాగుతాడు. డోలు దరువుతో తల్లుల యాత్ర షురూ.. సమ్మక్క–సారలమ్మను వారి స్థలాల నుంచి గద్దెలపైకి తీసుకురావాలంటే డోలు దరువు ఉండాల్సిందే. డోలు శబ్దాలు ధ్వనిస్తుంటే పూనకాలతో తల్లుల యాత్ర జోరుగా సాగుతుంది. అమ్మలు వచ్చే తరుణంలో ఒక్క క్షణం ఆగకుండా కళాకారులు డోలు వాయిస్తారు. అలసట లేకుండా కళాకారులు అమ్మవారి శక్తిని ప్రసాదించుకుని వాయిస్తారని పూజారులు చెబుతున్నారు. -
‘మేడారం’ ప్రయాణం దూరమే!
కాళేశ్వరం: మేడిగడ్డ బరాజ్ మీదుగా వాహనాలు రాకపోకలు నిలిపివేయడంతో తెలంగాణ కుంభమేళా మేడారానికి వచ్చే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులు ఇబ్బందులు పడనున్నారు. కనీసం 40 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భక్తులకు రవాణా కష్టాలు.. దూరభారం పెరగడం తప్పేలా లేదు. మేడారం జాతరం ఈనెల 28 నుంచి 31 వరకు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం లైట్ మోటార్ వాహనాలు, టూవీలర్స్కు అనుమతివ్వాలని భక్తులు కోరుతున్నారు. ఎన్డీఎస్ఏ సూచనలతో.. మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగిపోవడంతో రాకపోకలను ఎన్డీఎస్ఏ సూచనలతో ఇంజనీరింగ్ అధికారులు నిలపేశారు. అప్పటి నుంచి బరాజ్ భద్రత ప్రమాణాల నేపథ్యంలో రాకపోకలను కట్టడి చేశారు. కొన్ని రోజుల పాటు టూ, ఫోర్ వీలర్స్ అనుమతి ఇచ్చినప్పటికీ ఆ తరువాత ఇరిగేషన్, పోలీసుశాఖలు నిలిపివేశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని భక్తులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులపై నిర్మించిన వంతెనల గుండా ప్రతి జాతరకు మేడారం తరలి వస్తుంటారు. ప్రస్తుతం రాకపోకలకు అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ మీదుగా అనుమతి లేక ఇబ్బందులు అనుమతిస్తే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ భక్తులకు మేలు వారం పాటు అనుమతివ్వాలని వేడుకోలు -
మునీందర్ ఇంటి నుంచే పాన్పు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026లక్షలాది మంది భక్తులు.. తల్లులను కీర్తిస్తూ జయజయధ్వానాలు.. డోలు వాయిద్యాలు.. కొమ్ము బూరల నాదాలు.. సుగంధ ధూపాల పరిమళాలు.. వీటన్నింటి నడుమ శక్తి స్వరూపాలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే ఆ చేతులు మరెంతో శక్తివంతమైనవి.. ఎన్ని పదవులు అధిరోహించినా, ఎంత ధనమున్నా అంతటి అదృష్టం ఆ అడవి బిడ్డలకు మాత్రమే దక్కుతుంది. తల్లులను గద్దెకు చేర్చడంలో ఆదివాసీ పూజారుల పాత్ర కీలకం. నిష్టతో వనదేవతల సేవలో లీనమైన దాదాపు 25 మంది పూజారులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయిఅడవి తల్లులను వనంలోంచి జనంలోకి తీసుకువచ్చే పూజారులది ఎంతో అదృష్టం. సుమారు 25 మంది పూజారులు ఈ మహా ఘట్టంలో పాలుపంచుకుంటుండగా ప్రధానంగా సారలమ్మ పూజారులు ఆరుగురు, సమ్మక్క పూజారులు ఐదుగురు కీలక పాత్ర పోషిస్తారు. కన్నెపల్లి గుడిలోని సారలమ్మను పూజారి కాక సారయ్య ఈనెల 28న గద్దైపెకి తీసుకురానున్నారు. కాళ్లకు పారాణి ధరించి ఎర్రని వస్త్రాల ముసుగుతో అమ్మవారి రూపంలో వెదురుబుట్టలో అమ్మవారిని తీసుకుని కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు బయల్దేరుతారు. అమ్మవారిని తీసుకొచ్చే ఉదయాన ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్ని మాత్రమే సారయ్య ధరిస్తాడు. తండ్రి వారసత్వంగా ఈ బాధ్యతను సారయ్య గత 8 జాతరల ముందు నుంచి నిర్వర్తిస్తున్నాడు. కాకవంశ పూజారులు అమ్మవారి వెదురు బుట్ట సారయ్య చేతులోకి అందివ్వగానే ఆయనను అమ్మవారు ఆవహిస్తుంది. మిగతా పూజారులు ఆయనను పట్టుకొని గద్దెల వరకు తీసుకొస్తారు. గద్దైపె ప్రతిష్ఠించేంతవరకు ఆయన స్పృహలో ఉండరు. సారలమ్మను తీసుకొస్తున్న కాక సారయ్య(ఫైల్)సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క దేవతకు చేయాల్సిన పూజా క్రతువు, సామగ్రి అంతా ఈ ఇంటి నుంచి వెళ్తుంది. సమ్మక్కను తీసుకురావడానికి ముందుగా మునీందర్ ఇంటి వద్ద పసుపు, కుంకుమ, కంకణాలు, నైవేద్యం, ఊదు, అక్షింతలు, పసుపు బియ్యం, ఇతరత్రా పూజారులకు పూజా సామగ్రి (పాన్పు)ని తయారు చేసుకుని వెళ్తారు. మేడారం సమ్మక్క జాతరలో జరిగే ఏ పూజా కార్యక్రమం అయినా ఈ ఇంటి నుంచి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని మునీందర్ చెబుతున్నాడు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు (ఫైల్)చిలకలగుట్ట నుంచి ధూపం లేనిదే అమ్మవారు గుట్ట దిగదు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం వడ్డె దొబె నాగేశ్వర్రావు ధూపదీప నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. గుట్ట పైనుంచి గద్దెకు చేరే వరకు అమ్మవారికి వడ్డె.. ధూపం వేస్తూనే ముందుకు సాగుతాడు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ ఎంపీ కావ్య ● జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం భూపాలపల్లి/మొగుళ్ళపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మొగుళ్లపల్లి మండలం పాత ఇస్సిపేటలో రూ. 13.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదాం నిర్మాణానికి శనివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ఇందుర్తి ఓంకార్కు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంటర్ వద్ద మూడు కూడళ్ల అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. తదుపరి భారత్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు దక్కలేదని, తమ ప్రభుత్వం మొదటి దఫాలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. సన్నబియ్యం పథకానికి రూ.13వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ కింద రూ.3వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. భూపాలపల్లికి రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నానని తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, టూరిజం హబ్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడానని, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేయించానని, డీపీఆర్ దశలో ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రూ.200 కోట్లు మంజూరు చేయించానన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మున్సి‘పోల్’కు అంతా సిద్ధం
భూపాలపల్లి: ఎన్నికల నిర్వహణకు అధికారులు భూపాలపల్లి మున్సిపాలిటీలో సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేయడంతో పాటు సరిపడా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బందిని ఎంపిక చేయగా, త్వరలోనే వారికి శిక్షణ అందించనున్నారు. 86 పోలింగ్ కేంద్రాలు.. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 26,786, మహిళా ఓటర్లు 25,936, ఇతరులు నలుగురు.. మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉన్నారు. 30 వార్డులకు గాను 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం తక్కువ ఓటర్లు ఉన్న వార్డుల్లో రెండు, ఎక్కువ ఉన్న చోట మూడు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. 204 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉండగా మరో 90 బాక్సులను అదనంగా సిద్ధంగా ఉంచారు. 14 మంది నోడల్ ఆఫీసర్ల నియామకం.. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 14 మంది నోడల్ అధికారులను నియమించారు. జోనల్ ఆఫీసర్లుగా ఆరుగురు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా 12, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 12 మంది, పీఓలు 102, ఓపీఓలు 306 మంది, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, స్టాటిటిక్స్ సర్వేలెన్స్ టీంలు 4, ఎంసీసీ టీంలు రెండు, ఎక్స్పెండేచర్ అబ్జర్వర్గా ఒక టీంతో పాటు పోలీసు సిబ్బంది 150 మంది విధులు నిర్వర్తించనున్నారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనుండగా, 27 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించనున్నారు. సమస్యాత్మక కేంద్రాలు 19.. మున్సిపాలిటీలో 86 పోలింగ్ కేంద్రాలు ఉండగా సున్నితమైనవి 23 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో చిన్నచిన్న అల్లర్లు జరిగిన, పార్టీల నాయకుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని భావించే 19 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ ప్రక్రియను క్రిష్ణాకాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్నారు. వార్డులు 30, పోలింగ్ స్టేషన్లు 86, ఓటర్లు 52,726 మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కౌంటింగ్ కేంద్రం.. క్రిష్ణాకాలనీ కమ్యూనిటీ హాల్ ఏర్పాట్లు పూర్తిచేస్తున్న మున్సిపల్ అధికారులు -
కంప్యూటర్ విద్యపై దృష్టి సారించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు భూపాలపల్లి అర్బన్: మారుతున్న ఆధునిక సమాజంలో బాలికలకు కంప్యూటర్ విద్య అనివార్యమని.. దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగేడు కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సమస్య సెల్ఫోన్ అడిక్షన్ అని, అవసరానికి మించి ఫోన్ వాడకూడదని సూచించారు. ప్రతీ విద్యార్థినిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, స్వీయ క్రమశిక్షణతో దాన్ని వెలికితీసుకొని ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థినులు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. సంస్థ విద్యార్థినులకు పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్షయ, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ శైలజ, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి, ఎస్సై రవళి పాల్గొన్నారు. -
ఊరూరా మొక్కులు
కాళేశ్వరం: రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందుగా గ్రామాల్లో మొక్కుల సందడి నెలకొంది. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే ఆనవాయితీతో ఊరూరా ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. కుటుంబసమేతంగా భక్తులు కొత్త దుస్తులు ధరించి కిరాణా దుకాణాల వద్దకు చేరుకొని తూకాలతో బెల్లాన్ని కొని మొక్కులు చెల్లిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతుల మధ్య బెల్లం బుట్టలను తలపై మోసుకుని భక్తులు ఇంటికి చేరి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అనంతరం ప్రసాదంగా బంధువులు, పొరుగువారికి పంపిణీ చేస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగాలు, ఇళ్ల నిర్మాణం, వ్యాపార వృద్ధి వంటి కోర్కెలు తీరిన భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉన్నందున ఇంటి వద్ద భక్తులు ముందుగా మొక్కులు చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలు.. మేడారం జాతర నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బెల్లం విక్రయాలకు డిమాండ్ భారీగా పెరిగింది. కిలో బెల్లం ధర రూ.50–60 వరకు పలుకుతోంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పెద్దఎత్తున బెల్లం నిల్వలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కొందరు గుడుంబా తయారీదారులు కూడా బెల్లం విక్రయాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత అధికారులు అటు వైపు చూడాల్సిన అవసరం ఉంది. కొబ్బరికాయలకు డిమాండ్.. జాతర ముందస్తు మొక్కుల కారణంగా కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఒక్కో కొబ్బరికాయ ధర రూ.35–50 వరకు చేరింది. సంక్రాంతి కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేకలు, కోళ్లకు భారీ డిమాండ్ జాతర సందర్భంగా మేకలు, కోళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. స్థానిక మేకలు సరిపోక రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. మామూలు సమయంలో 10వేల లోపు దొరికే మేకలు ప్రస్తుతం ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఉండే ఒక మేక ధర రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోంది. కోళ్ల ధరలు కూడా అమాతం పెరిగాయి. బాయిలర్ కోడి కిలో రూ.220, జుట్టు కోడి రూ.220, నాటు కోడి కిలో రూ.600 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు మద్యం.. జాతర వేళ బంధువులు, సన్నిహితులను పిలుచుకుని విందులు ఏర్పాటు చేయడంతో మద్యం దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. బెల్టు దుకాణాలకు మరో దసరా, సంక్రాంతి, కొత్త సంవత్సరం సీజన్లు ఒకేసారి కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. జాతరకు వారం రోజుల ముందే గ్రామాల్లో కోలాహలం మొదలవడంతో మేడారం జాతర సందడితో గ్రామాల్లో జోష్ నింపుతోంది. పెరిగిన బెల్లం, కొబ్బరికాయలు, మేకలు, మద్యం ధరలు కిటకిటలాడుతున్న కిరాణా దుకాణాలు పట్టణాలు, గ్రామాల్లో సమ్మక్క భక్తుల రద్దీ -
రాకపోకలకు అంతరాయం కలగొద్దు
భూపాలపల్లి: మేడారం జాతర సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. తాడ్వాయి మండలం నార్లాపూర్ నుంచి భూపాలపల్లి, నార్లాపూర్ నుంచి మహాముత్తారం మండలం కాల్వపల్లి మీదుగా కాటారం వరకు ఎగ్జిట్ అయ్యే మార్గాన్ని ఎస్పీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో వన్ వే ఉంటుందని, జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రతీ వాహనం భూపాలపల్లి మీదుగా వెళ్తుందన్నారు. జాతర నుంచి తిరిగి వచ్చే వాహనాలు సాఫీగా, ఆటంకాలు లేకుండా ప్రయాణించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మేడారం నుంచి నార్లాపూర్ మీదుగా భూపాలపల్లికి వచ్చే మార్గంలో మలుపులు అధికంగా ఉన్నందున వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. జాతర సమయంలో పశువులను రోడ్లపైకి రాకుండా చూడాలని, వాటి వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. జాతర సందర్భంగా రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదాల నివారణకు భక్తులు, వాహనదారులు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఎస్పీ సంకీర్త్ కోరారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం రేగొండ: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్స్టేషన్కు వచ్చే వారితో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు, త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసు సిబ్బంది సేవలందించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ సంపత్రావు, రేగొండ ఎస్సై రాజేష్ ఉన్నారు. మేడారం జాతర సందర్భంగా ముందస్తు చర్యలు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
సరస్వతి మహాభాగే
కాళేశ్వరం: చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమిని పురస్కరించుకొని కాళేశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు రామకృష్ణ, బైకుంఠ పాండా, శరత్చంద్ర, పవన్శర్మ, శ్రావణ్కుమార్, రాధాకృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అంతకుముందు సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పట్టువస్త్రాలతో ముస్తాబు చేసి పూలతో అలంకరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలను దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయం తరఫున పలక, బలపాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. దీంతో ఆలయం ఆవరణలో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ప్రసాదం వితరణ చేఽశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వీఐపీఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతిమాత విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎస్.మహేష్, మాజీ దేవస్థానం ధర్మకర్త అశోక్, మాజీ సర్పంచ్ మాధవి, భక్తులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో వసంత పంచమి ప్రత్యేక పూజలు ఆలయంలో సామూహిక అక్షరస్వీకారాలు -
మేడారం.. గుడారం
మేడారంలో వెలిసిన గుడారాలుఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్ కవర్లు, గ్రీన్ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు. మేడారం ఇప్పడు మెగాసిటీ మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్ చార్జింగ్, రెడీ టు ఫుడ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు సందడి.. జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో గుడారాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. జోరుగా వ్యాపారాలు మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్డ్రింక్స్, వాటర్, రెస్టారెంట్ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రెండేళ్లకోసారి ఉపాధి మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటి ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను ఇంటి కుటుంబ సభ్యుల లాగానే చూసుకుంటాం. – సంకెపల్లి జైపాల్రెడ్డి, రెడ్డిగూడెం వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించిన వ్యాపారులుమేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు. -
రవాణాపరంగా ఇబ్బందులు రావొద్దు
భూపాలపల్లి: మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తులకు రవాణాపరంగా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కాటారం నుంచి మహా ముత్తారం వరకు, భూపాలపల్లి నుంచి గొల్లబుద్ధారం వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రోడ్డు వెడల్పు, సైన్బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమలాపూర్లో జరుగనున్న మినీ మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రవాణా నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నేడు మంత్రి తుమ్మల రాక
భూపాలపల్లి రూరల్: నేడు (శనివారం) జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 11:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సుందరీకరణ పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. నేడు డయల్ యువర్ డీఎం భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ సమస్యలపై నేడు (శనివారం) డయల్ యువర్ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు డీఎం ఇందూ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుస్తులు, విద్యార్థులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 99592 26707 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని భూపాలపల్లి జిల్లా జడ్జి సీహెచ్.రమేష్బాబు, ములుగు జిల్లా జడ్జి సూర్యచంద్రకళ, సీనియర్ సివిల్ జడ్జి కన్యాలాల్ దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ రాజగోపురం వద్ద వారిని ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద జడ్జిలకు అర్చకుడు వెల్ది శరత్చంద్ర శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట ఎస్సై తమాషారెడ్డి తదితరులు ఉన్నారు. మొగుళ్లపల్లి: జాబ్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉపాధిహామీ పని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడిక తీత పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పని వద్ద తప్పని సరిగా నీడ, తాగు నీరు, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. జాతర పనుల పరిశీలన మొగుళ్లపల్లి–ముల్కలపల్లి మధ్యలో సమ్మక్క సారళమ్మ జాతర ప్రాంగణంలో జరిగే అభివృద్ధి పనులు, ఏర్పాట్లను జాతర ప్రత్యేకాధికారి బాలకృష్ణ పరిశీలించారు. సర్పంచ్ విజయ, అధికారులతో మాట్లాడారు. -
బడికెళ్లేదెట్లా?
ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు● ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ● కిక్కిరిసి వస్తున్న బస్సులు ● కొందరు 3, 4 కిలోమీటర్ల నుంచి కాలినడకన..విద్యార్థుల పాఠశాల సమయానికి అనుకూలంగా బస్సులు పంపిస్తాం. విద్యార్థుల కోసం కొన్ని గ్రామాలకు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నాం. విద్యార్థులకు అవసరాలను గుర్తించి సిబ్బందిని పంపించి పరిశీలిస్తాం. పరకాల డిపో అధికారులకు కూడా సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరిస్తాం. – ఇందు, ఆర్టీసీ డీఎం, భూపాలపల్లి -
కాలినడకన పాఠశాలకు..
కొత్తపల్లి గోరి మండలంలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలకు సుల్తాన్పూర్, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట గ్రామాలకు చెందిన సూమారు 30మంది విద్యార్థులు ప్రతీ రోజు సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం నుంచి కాలినడకనే పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు ద్విచక్ర వాహనాలను లిఫ్ట్ అడిగి వెళ్తున్నారు. కాలినడకన పాఠశాలకు వస్తున్న విద్యార్థినులు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో బాధ్యతాయుతమైన దర్యాప్తు జరగడం వలనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. నేరస్తులకు శిక్షపడేలా అధికారులు సమర్థవంతంగా పనిచేశారని పేర్కొన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి జాప్యం లేకుండా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పుణ్యస్నానాలు.. మొక్కులు
మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గురువారం తరలివచ్చారు. తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతల వద్దకు చేరుకుని మొక్కులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. ఒడిబియ్యాన్ని సమర్పించి హుండీలలో కానుకలు వేశారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుని ఎదురుకోడి పిల్ల మొక్కులు చెల్లించారు. గద్దెల వద్ద గేట్లు వేసి ఉండడంతో ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ నుంచి వచ్చిన భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగడంతో డీఎస్పీ రవీందర్ గద్దెల వద్దకు చేరుకొని ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేసి సరదాగా గడిపారు. – ఎస్ఎస్తాడ్వాయి -
కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యం
భూపాలపల్లి రూరల్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో రూ.2 కోట్లతో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి కమ్యూనిటీ హాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, సర్పంచ్ల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్చి నెలాఖరు వరకు ప్రతీ ఒక్క మహిళకు చీర అందిస్తామన్నారు. 560 మంది మహిళలకు మేడారంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలో రూ.63 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ శిక్షణలో ఇచ్చిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమగ్ర పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీపీఓ శ్రీలత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
చిట్యాల నుంచి మేడారానికి 30 బస్సులు
చిట్యాల: ఈ నెల 27 నుంచి 31 వరకు చిట్యాల మండల కేంద్రం నుంచి మేడారం జాతరకు 30 బస్సులు కేటాయించినట్లు పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ గ్రౌండ్లో తాత్కాలిక షెల్టర్ నుంచి భక్తుల సౌకర్యార్ధం బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులలో వెళ్లడానికి టికెట్ ధర పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.150 అన్నారు. ప్రత్యేక బస్సులలో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అన్నారు. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల నుంచి జాతరకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం రాంప్రసాద్ కోరారు. భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సుభాష్ కాలనీ కాకతీయ స్టేడియంలో జరగనున్న గణతంత్ర వేడుకలను గురువారం సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల్లో ఉత్తమ ఉద్యోగుల సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏరియా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, రాజారావు, శ్యాంసుందర్, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరం: బడికి రాకుండా బయట ఉన్న 11 మంది విద్యార్థులను ఆపరేషన్ స్మైల్లో భాగంగా కొయ్యూర్ ఎస్సై–2 రజన్కుమార్, కాటారం ఏఎస్సై సుధీర్కుమార్ ఆధ్వర్యంలో మహదేవపూర్ మండలం కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం చేర్పించారు. విద్య ప్రాముఖ్యతను వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ద్వారా తెలిపారు. వారి వెంట ఐసీడిఎస్ సూపర్వైజర్ స్పందన, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: చేనేత కార్మికుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 56జీఓను విడుదల చేసినట్లు ఆ శాఖ జిల్లా అధికారి వెంకట్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి 31 వరకు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 140మంది కార్మికులకు చెందిన రూ.79లక్షలు మాఫీ కానున్నట్లు తెలిపారు. టేకుమట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న బోధనా విధానాలు ఆదర్శంగా ఉండాలని జిల్లా పర్యవేక్షణ అధికారి వేణుగోపాల్ అన్నారు. గురువారం మండలంలోని వెలిశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బోధనా విధానాలను పరిశీలించారు. పాఠశాలలో అభ్యసన ఫలితాలు, బేస్లైన్, మిడ్లైన్ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షణ బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రతీ ఉపాధ్యాయుడు నాణ్యమైన, సమర్థవంతమైన బోధనా పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపర్చాలని అన్నారు. పాఠశాల నిర్వహణలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు కొట్టె ప్రసాద్ను అభినందించారు. ఈ బృందంలో రమేశ్, రాధాకృష్ణ, రతన్సింగ్, సాంభమూర్తి, బాలశేరి రెడ్డి, రంగరాజు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
సరస్వతిమాత విగ్రహానికి ముస్తాబు
కాళేశ్వరం: గతేడాది మేలో సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని వీఐపీ ఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతి మాత విగ్రహానికి దేవస్థానం అర్చకులు ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వసంతపంచమి సందర్భంగా దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు వసంత పంచమి.. వసంత పంచమి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీసరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 10గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చిన్నారులకు అక్షర స్వీకారాలు చేస్తారు. భక్తులు పాల్గొనాలని దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్లో గురువారం పోస్టర్ను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్లాల్, ఆర్.మల్లికార్జున్రెడ్డి, చంద్రకళ, వీఎస్ నరేందర్, కుమారస్వామి, ఎంకే సుమంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ..
చిట్యాల మండలం భావుసింగ్పల్లి బేస్మెంట్ లెవల్లో నిలిచిన ఇల్లుభూపాలపల్లి అర్బన్: అర్హులైన నిరుపేదలకు సొంతింటిని నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో జిల్లాలో 3,943 ఇళ్లను మంజూరు చేసింది. కలెక్టర్ అన్ని ఇళ్లకు ఆమోదం తెలిపారు. దీంతో 3,178 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. మిగతా 765 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. ఆరు మాసాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు 27 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, సెంటిమెంట్ నమ్మకాలతో ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి పరిస్థితులే చాలా గ్రా మాల్లో ఎదురవుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో పనులు ప్రారంభించని లబ్ధిదారుల నుంచి ఒప్పంద పత్రాలను రాయించుకుంటూ రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సాంకేతిక ఇబ్బందులతో బిల్లుల కోసం లబ్ధిదారులు అధికా రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొన్ని సమస్యలను జిల్లాలోనే పరిష్కరిస్తున్నా.. చాలా సమస్యలు రాష్ట్ర స్థాయి అధికారుల పరిధిలో ఉండడంతో ఏమి చేయలేని పరిస్థితి ఉందని జిల్లా అధికారులు చేతులెత్తేసున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం నెరవేరడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరలు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఇసుక, ఇటుక, సిమెంట్ ధరలు భారీగా పెరిగి పోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటికి తోడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని చెప్పినా లబ్ధిదారులు పట్టించుకోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. లబ్ధిదారుల మూఢ విశ్వాసాలతో ఇందిరమ్మ పథకానికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కొంతమంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ని ధులకు ఎటువంటి ఇబ్బంది లేదు. నిర్మాణాలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేస్తున్నాం. – లాల్, గృహ నిర్మాణ శాఖ పీడీ మంజూరైన ఇళ్లు 3,943 పనులు ప్రారంభమైనవి 3,178 బేస్మెంట్ లెవల్లో ఉన్నవి 1,891 లెంటల్ లెవల్లో ఉన్నవి 792 స్లాబ్ లెవల్లో ఉన్నవి 762 నిర్మాణం పూర్తయిన ఇళ్లు 27 ఇంతవరకు ప్రారంభం కాని ఇళ్లు 765ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అధికారులు, లబ్ధిదారుల మధ్య సమన్వయం చేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల అనుమతితోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కమిటీ సభ్యులు పత్తాలేకుండా పోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువగా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులుగా ఉండడంతో అధికారులు అడిగేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటి వరకు 27 గృహాలే పూర్తి మహిళా సంఘాల సభ్యులకు అందని ఆర్థికసాయం గ్రామాల్లో పత్తాలేని కమిటీలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించని అధికార యంత్రాంగం -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
● కలెక్టర్ రాహుల్శర్మభూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర వేడుకలకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల స్టాళ్లు, విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
కాళేశ్వర దేవస్థాన క్యాలెండర్ ఆవిష్కరణ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం 2026 క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ చేతుల మీదుగా ఈఓ మహేష్లు అధికారికంగా బుధవారం ఆవిష్కరించారు. వారి వెంట దేవస్థానం అర్చక స్వాములు బైకుంఠపాండా, వెల్ది శరత్చంద్ర తదితరులు ఉన్నారు. చిట్యాల: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బోధన పద్ధతుల విధానాలపై బుధవారం సమగ్ర పర్యవేక్షణ బృందం నాంపల్లి వేణుగోపాల్, మండల విద్యాధికారి కొడేపాక రఘుపతిలు సందర్శించి పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాలు, తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థుల లెర్నింగ్ ఔట్స్కమ్స్తో పాటు బేస్ లైన్, మిడ్లైన్ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఉపాధ్యాయుడు బోధన పద్ధతులు అనుసరిస్తూ బోధించడం అభినందనీయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ బృందం సభ్యులు పైడిపాల రమేష్, రతన్సింగ్, సూదం సాంబమూర్తి, బాలశౌరి రెడ్డి, రంగరాజు, సతీష్, శ్రీరాం రఘుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్లస్టర్ పోటీలను బుధవారం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ హసీనభానోలు ప్రారంభించారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పురుషోత్తంరెడ్డి, తహసీల్ధార్ రామారావు, హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ అవినీతిపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని మాట్లాడారు. సింగరేణి ఓపెన్ కాస్ట్, అండర్గ్రౌండ్ మైన్స్లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: వాహనదారులు, ప్రజలు ట్రా ఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. స్థానిక మై నార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ద్విచక్ర వాహనాల ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్న చిన్న తప్పిదాలను సరిదిద్దుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రవి, ఏఎంవీఐలు శ్రీనివాస్, సుందర్లాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.జిల్లా రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని -
‘కొడవటంచ’ పనులు త్వరగా పూర్తి చేయాలి
రేగొండ: కొడవటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు. బుధవారం కొడవటంచ ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి పునఃప్రతిష్ఠ, బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి రానున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు బాలాలయంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భిక్షపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. గౌడ కులస్తుల ప్రభుత్వ ఉ ద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యా లెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
మండమెలిగె.. జాతర మొదలాయె..
చలిగంజి, పాలు, సారా, బెల్లంపానకం, పవిత్ర శుద్ధిజలాన్ని ధూపంతో నేలపై ఆరగింపు చేస్తున్న పూజారులు బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు సమ్మక్క, సారలమ్మ పూజాసామగ్రితో మేడారం గద్దెల వద్దకు చేరుకుంటున్న పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన మండమెలిగె పూజలతో మేడారం మహాజాతర పండుగ ఆరంభమైంది. బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మ పూజారులు అచారసంప్రదాయాలతో అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు జరిపారు. దిష్టి తగలకుండా ప్రధాన కూడళ్లలో సోరకాయ, కోడిపిల్ల, మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేసి సంబురాలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – ఎస్ఎస్తాడ్వాయి● మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో పూజలు ● అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలతో రాత్రంతా సంబురాలు -
ఘనంగా బొమ్మల కొలువు
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఇల్లంద క్లబ్హౌస్లో బుధవారం లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు ఏనుగు సునీతారాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన బొమ్మల కొలువు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ సతీమణి మాలతి, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి, డైరెక్టర్ (ఈఅండ్ఎం) తిరుమలరావు సతీమణి పద్మలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొమ్మల కొలువులో గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను ప్రతిభింబించేలా వివిధ రకాల బొమ్మలు, కళాకృతులు, దృశ్య రూపకల్పనలు అందంగా అమర్చారు. ముఖ్యంగా వ్యవసాయ జీవనం, గ్రామీణ మహిళల జీవన విధానం, సంప్రదాయ పండుగల దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి లేడీస్ క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై బొమ్మల కొలువును తిలకించారు. -
‘భూపాలపల్లి’ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం రూ.2 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో 5 ఇంకై ్లన్ ఆర్చ్ నుంచి భాస్కర్ గడ్డ వైపు బీటీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.1.50 కోట్లతో భాస్కర్ గడ్డ పోష మ్మ దేవాలయం నుంచి వేషాలపల్లి డబుల్ బెడ్రూం వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని 30 వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, సీసీ రోడ్లు, సైడ్ డ్రెయినేజీలు ఏర్పాటు చేసి పట్ట ణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, బుర్ర కొమరయ్య, మహేందర్, మేరా సురేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రూ.5.50కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
పులుల గణన ప్రారంభం
కాళేశ్వరం: మహదదేవపూర్ మండలం అటవీశాఖ రేంజ్ పరిధిలో ఐదు సెక్షన్లు, 20 బీట్లలో అఖిల భారత పులుల అంచనా (ఏఐటీఈఎస్) 2026 సర్వేను మంగళవారం ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు, ఫీల్డ్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు కలిసి మొదటి మూడు రోజుల పాటు ట్రైల్ పద్ధతిలో కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), మె ఘా హెర్బీవోర్స్ (పెద్ద శాఖాహార జంతువు)లపై అధ్యాయనం చేయనున్నారు. రెండు నుంచి మూ డు రోజుల పాటు ట్రాన్సెక్ట్ లైన్ విధానంలో వెజిటేషన్ కవర్, జీవవైవిధ్యం, శాఖాహార జంతువుల జనాభా, అడవులు ఆరోగ్యం వంటి అంశాలపై వివరాలు సేకరిస్తారు. అలాగే ట్రాక్ అండ్ సైన్ వంటి శాసీ్త్రయ పద్ధతుల ద్వారా సర్వేకొనసాగుతోంది. దీని ద్వారా పులుల సంఖ్యతో పాటు ఇతర వన్యప్రానుల ఉనికి, అడవి జీవవైవిధ్యం జీవావరణ పరి స్థితులపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. సర్వే ఫలితాలు భవిష్యత్లో పులుల సంరక్షణ, అడవులు అభివృద్ధి వన్యప్రాణి రక్షణ చర్యలకు కీలకమార్గదర్శకంగా ఉపయోగపడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అ టవీశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ
భూపాలపల్లి అర్బన్ : సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్లు హా జరై టార్చ్ను వెలిగించి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, కాటారం మాజీ ఎంపీపీ సమ్మయ్య, ఎంపీడీఓ సీఐ నరేష్, ఎస్సైలు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన ల్యాబ్ టెక్నీషియన్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 24 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. కొత్తగా ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగం సాధించిన వారు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్కు నియామక పత్రాలు అప్పగించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్కు పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ ల్యాబ్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుతాయని, సిబ్బంది కొరత తీరడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటరత్నం, ఆర్ఎంఓలు, అదనపు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి భూ సర్వేలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి జిల్లాలోని 13 గ్రామాల్లో రీ–సర్వేకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూ సర్వే చట్టం సెక్షన్ 5(1), 6(1) కింద గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసి, జిల్లాలో తొలి దశగా మొత్తం 13 గ్రామాల్లో రీ–సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఈ గ్రామాల్లో సర్వే ద్వారా పొలాల గట్టు హద్దులు, రోడ్లు, చెరువులు, కాల్వలు, గ్రామ కంటం భూములు తదితరాలను గుర్తించి, శాసీ్త్రయ పద్ధతిలో హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారిలు పాల్గొన్నారు. ఉచిత ఉద్యోగ శిక్షణ టీజీఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ మేరకు మంగళవారం శిక్షణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19వ తేదీ వరకు నిర్వహించే శిక్షణకు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారిణి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రతీఒక్కరి బాధ్యత భూపాలపల్లి: రోడ్డు భద్రత ప్రతీఒక్కరి బాధ్యతని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అరివ్ అలైవ్ క్యాంపెయిన్–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మినర్సింహా ఫంక్షన్ హాల్లో శ్రీమీడియా అవుట్ రీచ్ డేశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, అతివేగాన్ని అరికట్టేందుకు త్వరలోనే స్పీడ్గన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన మొదటి గంట)లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి గుడ్ సమరిటన్ కింద రూ.25,000 నగదు బహుమతి అందజేస్తామన్నారు. అనంతరం రోడ్ సేఫ్టీ పోస్టర్ను ఆవిష్కరించారు. అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ, భూపాలపల్లి సీఐ డి.నరేష్కుమార్, డీటీఓ సంధాని, ఆర్టీసీ డీఎం ఇంధూ, డ్రైవర్లు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మేడారంలో సింగరేణి సేవలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా నుంచి మేడారం సమ్మక్క–సారలరమ్మ జాతరలో విధులు నిర్వహించేందుకు సింగరేణి రెస్క్యూ, లైఫ్ సేవర్ స్విమ్మింగ్ టీం సభ్యులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. పదిరోజుల పాటు మేడారంలో సేవలు అందించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి రెస్క్యూ, స్విమ్మింగ్ టీం సభ్యులకు పచ్చ జెండా ఊపి ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు. గద్దెల వద్ద విధులు నిర్వహించే సమయంలో చక్కటి క్రమశిక్షణ, గౌరవం, పూర్తి సేఫ్టీతో పని చేయాలని సూచించారు. అధికారుల సూచనలను పాటిస్తూ విధులు నిర్వహించి సింగరేణి పేరును నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, శ్యాంసుందర్, పూర్ణచందర్, రెస్క్యూ, స్విమ్మింగ్ సభ్యులు పాల్గొన్నారు. -
ఇన్చార్జ్ కమిషనర్గా జోనా
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్గా ఇసంపెల్లి జోనా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న ఉదయ్కుమార్ 45 రోజుల వృత్తి శిక్షణకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా మెప్మా ప్రా జెక్ట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న జోనాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సి పాలిటీ ప్రత్యేక అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. భూపాలపల్లి అర్బన్: స్కౌట్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్గా ఇగురం శ్రవణ్ను నియమిస్తూ నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ అశోక్కుమార్ మంగళవారం శ్రవణ్కు అందించారు. ఈ నియామకానికి సహకరించిన పలువురి శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న అడిచర్ల శ్రీనివాస్ కోల్ ఇండియా స్థాయి కూచిపూడిలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నాగ్పూర్లోని డబ్ల్యూసీఎల్ కంపెనీలో జరిగిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో శ్రీనివాస్ పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి మంగళవారం జీఎం కార్యాలయంలో శ్రీనివాస్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అధికారులు శ్యాంప్రసాద్, శ్రీనివాస్లు పాల్గొన్నారు. రేగొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ డీఈ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లూస్ లైన్స్, వంగిన పోల్స్ను సరి చేశారు. విద్యుత్ షాక్కు గురికాకుండా రైతులకు పలు జాగ్రత్తలను సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ వంగ రాజు, సిబ్బంది సురేష్, నాగరాజు, రాహుల్, విజయ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
‘మండమెలిగె’కు సర్వం సిద్ధం
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026● భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ● పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులుఎస్ఎస్ తాడ్వాయి : మహాజాతరలో భాగంగా మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో నేడు (బుధవారం) జరగనున్న మండమెలిగె పండుగకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు వారాలముందు గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం పూజలు ప్రారంభం కాగా, సరిగ్గా వారం రోజులముందు నిర్వహించే ఈ మండమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం మేడారం, కన్నెపల్లి వనదేవతల ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆలయాలు, అమ్మవారి పూజా సామగ్రి (మువ్వలు, గంటలు, వస్త్రాలు, ఊత కొమ్ములు) శుద్ధి చేయనున్నారు. ముగ్గులతో ఆడపడుచులు సుందరంగా అలంకరిస్తారు. పూజారులు ఉదయాన్నే తలంటుస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరి స్తారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ధూపదీపాలు వెలిగించి ఆచారసంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు.మండమెలిగె పండుగ సందర్భంగా పూజారులు మేడారాన్ని బుధవారం అష్ట దిగ్బంధం చేయనున్నారు. ముందుగా నిష్టతో నులకతాడు తయారు చేసి దానికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో అమ్మవార్లను తీసుకువచ్చే ప్రధాన రహదారుల వద్ద బూర్కకర్ర(ముళ్లతో కూడుకున్న పచ్చికర్రలు)లకు మామిడి తోరణాలు కట్టి నిలుపుతారు. ఎలాంటి దుష్టశక్తుల చూపు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పూజారులు ఆనవాయితీగా నిర్వహించనున్నారు. -
వేట షురూ
మున్సిపాలిటీలో మొదలైన ఎన్నికల వేడిభూపాలపల్లి: కోడ్ కూయకముందే భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఓ వైపు తమ వ్యూహాలకు పదును పెడు తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వేల బాట పట్టాయి. వార్డుల్లో పార్టీ పరిస్థితి, ఎవరికి అవకాశం ఇస్తే గెలిచి వస్తారనే అంశాలపై అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నా యి. సర్వే రిపోర్ట్ ఆధారంగానే గెలుపు గుర్రాలను ఎంచుకునేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఓటర్ల నాడీ పట్టుకునేందుకు.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో ఓటర్ల నాడి పట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలను బట్టి, ఏ వార్డులో ఏ పార్టీకి పట్టుందనే విషయమై ఆరా తీస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా చేరిన ఓటర్లు, యువత ఎటువైపు మొగ్గు చూపుతున్నారనేది సర్వేలో ప్రధానాంశంగా మారింది. గతంలో కొన్ని వార్డులు ఒక పార్టీకి మాత్రమే కంచుకోటలుగా ఉండగా, మరికొన్ని వార్డుల్లో స్వల్ప తేడాతో గెలుపోటములు మారే అవకాశం ఉందని సర్వేలో తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికే గెలుపు మంత్రం.. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనేది ఇప్పుడు అధిష్టానాలకు పెద్ద సవాల్గా మారింది. కేవలం పార్టీ విధేయత మాత్రమే కాకుండా, వ్యక్తిగత ఇమేజ్, ఆర్థిక బలం, స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు గెలుపును శాసిస్తాయని పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ధీటుగా ఎదుర్కొనే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు. కాగా భూపాలపల్లి మున్సిపాలిటీలో పార్టీ కోసం పని చేసిన నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కొత్తగా వచ్చి ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకుల మధ్య టికెట్ల పోటీ నెలకొంది. పిలిస్తే వచ్చే వారై ఉండాలి.. వార్డుల్లో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకులపై సర్వే బృందాలు ప్రత్యేకంగా డేటా సేకరిస్తున్నాయి. వార్డులోని సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నట్లు సర్వేల్లో తెలుస్తోంది. కౌన్సిలర్గా బరిలో నిలిచే వారు తమవారై ఉండాలి.. సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కార మార్గం చూపే వారై ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాన పార్టీల సర్వే వార్డుల్లో తమ పార్టీ బలం ఎంత..? ప్రజాభిమానం చూరగొన్నది ఎవరు? రంగంలోకి ప్రత్యేక బృందాలుమున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉండగా, ఈ రెండు పార్టీలు వార్డుల్లోని ప్రజల ద్వారా గెలుపు గుర్రాలు ఎవరనే విషయం తెలుసుకోవడంతో పాటు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఊపుతో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతను అంచనా వేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తోంది. బీజేపీ బలమైన అభ్యర్థుల కోసం ఇంకా వేట సాగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అంతర్గత సర్వేలు, వార్డుల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగానే పార్టీలు కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. -
హక్కుల పరిరక్షణకు కృషి
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు చర్చించారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి సునీల్, అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు రాజేందర్, సంతోష్ కుమార్, ఇందిర, స్వాతి, మల్లేశ్వరి, సమ్మయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం తెల్లవారుజామున దర్శించుకుని తొలిమొక్కులు చెల్లించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పైలాన్ను ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉదయం 7 గంటలకే హరిత హోటల్నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వీరికి నూతనంగా నిర్మించిన ప్రధాన ఆర్చ్ నుంచి ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పైలాన్ను ప్రారంభించారు. ఉదయం సూర్య కిరణాలు పడుతున్న సమయంలో సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని తొలి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా అమ్మవార్లకు చీర పెట్టి, పూలమాల వేశారు. పూజారులు, మంత్రి సీతక్క.. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ మంత్రులకు కంకణాలు కట్టగా, పూజారులు అమ్మవార్ల పసుపు, కుంకుమ బొట్టుపెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి, కుటుంబ సభ్యులు, మంత్రులకు పూజారులతో కలిసి మంత్రి సీతక్క చీర, సారె, పట్టువస్త్రాలు అందించి ప్రసాదం(బెల్లం) బహూకరించారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం, అధికార గణమంతా రెండు రోజులు మేడారంలోనే పర్యటించడంతో ముందస్తుగానే జాతర మొదలైందన్న సందడి కనిపించింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరలు కట్టుకుని హాజరయ్యారు. పైలాన్ వద్ద మూడు రాతి శిలలు.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ ప్రారంభోత్సవానికి మూడు రాతి శిలలతో ఆదివాసీ సంప్రదాయంగా పైలాన్ ఏర్పాటు చేశారు. అందులో ఒక రాతి శిలపై సీఎంతోపాటు, మంత్రుల పేర్లు చెక్కగా మరో రాతిపై పూజారులు, మరోదానిపై దేవాదాయశాఖ, ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల పేర్లను చెక్కించారు. ఈ పైలాన్ వద్ద అధికారులు, భక్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. గద్దెలకు నూతన శోభమేడారం సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను రకరకాల పూలతో అలంకరించడంతో నూ తన శోభ సంతరించుకుంది. అమ్మవార్ల గద్దెలు, సాలహా రం చుట్టూ ఆర్చ్ ద్వారాలను పూలతో అలంకరించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్రెడ్డి.. వనదేవతలను ద ర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో క్యూలైన్లో ఉన్న భక్తులను ఆప్యాయంగా పలకరించారు. సీఎంను చూసిన భక్తులు జై రేవంత్రెడ్డి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మొక్కుల అనంతరం సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్లో నిలబడి భక్తులకు అభివాదం చేశారు.మంత్రి ధనసరి సీతక్క -
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సందడి చేశారు. అలాగే సమ్మక్క– సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్రావు అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శమని తెలిపారు. -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి: మహిళా సాధికారతే తమ లక్ష్యమని, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అపార గౌరవం ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని టీ 2 క్వార్టర్స్ చుట్టూ రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా సంఘాలకు రూ. కోటి బ్యాంక్ లింకేజీ, రూ. 20 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేయడంతో పాటు, 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి సంకల్పంలో భాగంగా వారికి సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.60 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి బాంబులగడ్డ నుంచి గణపురం గాంధీనగర్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మెప్మా పీడీ రాజేశ్వరి, ఎంపీడీఓ తరుణ్ప్రసాద్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం రేగొండ: పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో రూ.3.75 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ నిర్మాణంతో చుట్టూ పక్కల మండలాలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్టీసీ కార్పొరేషన్ ఈడీ సలోమన్, ఆర్ఎం విజయభాను, డీఎం హిందూ, ఆర్టీఓ సంధాని, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి చేయకపోతే ఓట్లు అడగను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పైసలుంటేనే పోటీ
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ వార్డుల వారి ఓటర్లకు సంబంధించిన తుదిజాబితా విడుదల కావడం, రిజర్వేషన్ల ప్రకటన కూడా పూర్తి కావడంతో పార్టీలు పోరుకు సిద్ధమవుతున్నాయి. బరిలో ఉండాలనుకుంటున్న ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలను కూడా ధన రాజకీయాలే ప్రభావితం చేశాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలవాలన్నా డబ్బులు ఖర్చుపెట్టే నాయకులను బరిలో దింపే ఆలోచనల్లో పలు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులవైపే మొగ్గుచూపించే వాతావరణం కనిపిస్తోంది. ఆర్థికంగా ఉంటేనే అభ్యర్థిత్వం అన్ని పార్టీలు ఆర్థికంగా కాస్త ఉన్నవారినే పురపోరులో బరిలో దింపాలని చూస్తున్నాయి. అన్ని పార్టీలు పార్టీ ఫండ్తో పాటు ఎన్నికల్లో స్వయంగా ఖర్చు చేసే నేతల వైపే చూస్తున్నాయి. అన్ని పార్టీలతో పోలిస్తే అర్ధబలం, అంగబలంలో బీఆర్ఎస్ అందరి కన్నా మెరుగ్గా ఉంది. బీఆర్ఎస్ ధీటుగా ఎదగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏదేమైనా ఈసారి మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్ జెండా ఎగరాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల ఖర్చులో కూడా రెండు పార్టీలు ఏమాత్రమూ తగ్గకుండా నిధుల సమీకరణ ఉండనుందని తెలిసింది. అభ్యర్థుల్ని తట్టుకోవాలంటే పార్టీ ఇచ్చే నిధులతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వారినే బరిలో నిలపాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పోటీచేయాలని భావిస్తున్న వారు డబ్బు సమకూర్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో ఖర్చుల కోసం డబ్బులను ఈలోపే సర్ధుబాటు చేసుకోవాలని అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చు తడిసి మోపైడెంది. కనీసం 500 మంది ఓటర్లు లేని పంచాయతీల్లో కూడా అభ్యర్థుల ఖర్చు రూ.5 లక్షలు దాటింది. ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలు మరింత కాస్లీగా ఉండనున్నాయి. ఒక్కో వార్డులో సగటున 2,200 జనాభా ఉంటే కనీసం 1500 పైగా ఓటర్ల ఉండే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ వార్డుల్లో పోటీలో ఉండే ఒక్కో అభ్యర్థికి సుమారుగా రూ.20 లక్షల కన్నా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. డబ్బు సర్దుబాటు చేసుకుంటున్న ఆశావహులు ఆర్థికంగా ఉన్న అభ్యర్థుల వైపే పార్టీల మొగ్గు -
అనుమతి లేని ఆస్పత్రులపై చర్యలు
భూపాలపల్లి: జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాల్లో అనుమతులు లేకుండా ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు నిర్వహించరాదన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించాలని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మార్గదర్శకాల ప్రకారం బయో మెడికల్ వేస్ట్ చార్జీలను ఆస్పత్రుల వద్ద తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్యసేవల నిమిత్తం ఆస్పత్రులు, క్లినిక్లకు వచ్చే రోగులకు రాసే చీటీలో కాంపోజిషన్తో పాటు మందుల వివరాలు అర్థమయ్యేలా రాయాలన్నారు. వైద్యసేవల రుసుము తెలిసేలా చార్జీల పట్టిక ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతీ మహిళకు చీర అందించాలి.. మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. పురపాలక సంఘాల్లో మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరెల పంపిణీ అంశాలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమానికి సంబంధించి భూపాలపల్లి మున్సిపాలిటీకి ఆర్డీఓ హరికృష్ణను ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్వయం సహాయక సంఘాలలో సభ్యులు కాని మహిళలకు చీరల పంపిణీకి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలక్రిష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఉద్యోగ శిక్షణ కరపత్రం ఆవిష్కరణ.. టీజీఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా అందించనున్న ఉద్యోగ శిక్షణ కరపత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 27 దరఖాస్తులు స్వీకరించి, దరఖాస్తులను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
తరలొచ్చిన సర్కారు.. మురిసిన మేడారం
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, వరంగల్: కాంక్రీట్ జంగిల్లో నుంచి రాష్ట్ర సర్కారు పచ్చని వనానికి చేరుకుంది. కంచు గజ్జల సవ్వడితో.. కొమ్ము బూరల నాదంతో.. జంపన్న వాగు అలల సాక్షిగా.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందం, అధికార గణానికి గిరిజనులు ఆత్మీయ స్వాగతం పలకగా, వనసిరి వెలుగుల్లో.. మారిన నవ మేడారం ముఖచిత్రం చూసి అందరూ అబ్బురపోయారు. సాయంత్రం నుంచి వనంనుంచి రాష్ట్ర పాలన సాగించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమంతా తరలిరావడంతో మేడారం ఆదివారం పోలీసులమయమైంది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న కీకారణ్యంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాహసోపేతమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మేడారంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రి వర్గ సభ్యులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, డీజీపీలు, సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ ఆదివారం సాయంత్రం మేడారం చేరుకున్నారు. రూ.251 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు, శిలలతో సాలాహారాలు, ద్వార బంధాలు, గద్దెల సుందరీకరణ పనులను ప్రత్యేకంగా పరిశీలించేందుకు మంత్రులు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. సమ్మక్క–సారలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో జరిగే మేడారం జాతర ఈసారి ప్రత్యేకంగా ఉండాలని మంత్రి సీతక్క పట్టుబట్టడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పనులు వేగంగా జరిగేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం, మొక్కుల సమర్పణతోపాటు మంత్రి వర్గ సమావేశానికి సైతం కార్యాచరణకు శ్రీకారం జరిగింది. పోలీసుల వలయంలో మేడారం మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబ ల్యం తగ్గినప్పటికీ సీఎం, మంత్రుల బస నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా పికెట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఏఎన్పీఆర్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులముందు నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మేడారంలో పర్యటించి ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేశారు. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్కేకన్ అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు అతిథుల కోసం మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. 10 మంది ఐపీఎస్ అధికారులు, 1,600 పోలీసు అధికారులు, సిబ్బంది మేడారంలో బందోబస్తు నిర్వహించారు. మంత్రులు మాత్రమే.. మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కేవలం మంత్రులు, మంత్రి వర్గ సమావేశ ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే అనుమతించారు. చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీని కూడా అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి హరిత హోటల్ ముఖ ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, మంత్రులు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం సమావేశం నిర్ణయాలను ప్రకటించేలా మీడియా బ్రీఫింగ్ భేటీకి మాత్రం హైదరాబాద్ సమాచార పౌర సంబంధాలశాఖ తయారు చేసిన జాబితాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులను అనుమతించారు. కాగా, మొదట ఆదివారం సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు సుమారు గంటపాటు మంత్రివర్గ సమావేశం ఉంటుందని సీఎం టూర్ షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. అయితే, ఖమ్మం జిల్లా పాలేరులో కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి 5:30 గంటలకు మేడారం చేరుకోవడం వల్ల సుమారు గంట ఆలస్యంగా కేబినెట్ సమావేశం మొదలైంది. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత హరిత హోటల్లో పలు అంశాలపై చర్చ కేబినెట్ భేటీకి మంత్రులకు మాత్రమే అనుమతి మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు -
అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై కొందరు కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని.. వాటిని తక్షణమే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టంచేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ రెండేళ్లలో భూపాలపల్లి మున్సిపాలిటీలో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం జీఓలు తీసుకొచ్చామని తెలిపారు. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గ్రామంలో సలేంద్ర శ్రూకేష్ స్మారకార్థం గొల్లబుద్ధారం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి కిరణ్, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
సీఎం రేవంత్కు ఘన స్వాగతం
● జంపన్నవాగు పుష్కరఘాట్ పనుల పరిశీలన ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: ఖమ్మం నుంచి హెలికాప్టర్లో మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రులు, అధికారులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు ధనసరి సీతక్క, ఉత్తమ్ కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతోపాటు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళి నాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్, ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడినుంచి నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి జాతర ప్రాంతాల దృశ్యాలను తిలకించారు. ఏఐ అత్యాధునిక కెమెరాలు, ఏఎన్పీఆర్ కెమెరాల పనితీరును పోలీసు అధికారులు వివరించారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ వద్ద సీఎంకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పనుల పరిశీలన జంపన్నవాగు వద్దకు వెళ్లిన సీఎం, మంత్రులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, బాత్రూమ్లు, షవర్లను పరిశీలించారు. అనంతరం కాలినడకన హరిత హోటల్ సమీపంలోని సర్కిల్, ఊరట్టం స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్లో సుందరంగా తీర్చిదిద్దిన కళాచిత్రాలను పరిశీలించారు. -
మౌని అమావాస్య.. భక్తుల పూజలు
కాళేశ్వరం: మౌని అమావాస్య సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో ఆదివారం భక్తులు ప్రత్యేకంగా పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. గ్రామంలోని శ్రీచంద్రశేఖరస్వామి ఆలయంలో శివలింగాన్ని భక్తులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. సాయంత్రం వీఐపీఘాటు వద్ద గోదావరికి నిత్య హారతి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి నెలకొంది. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండలం కమలాపూర్ నుంచి రాంపూర్ గ్రామాల మధ్య అడవిలో 11 కేవీ స్తంభం ప్రమాదకరంగా ఉంది. వారం రోజులుగా విద్యుత్ స్తంభం వంగి రోడ్డు పక్కన చేతికి అందే ఎత్తులో ఉంది. భూపాలపల్లి నుంచి అటవీ గ్రామాలకు వెళ్లే విద్యుత్ ప్రధాన లైన్ కావడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. విద్యుత్శాఖ అధికారులు దృష్టి సారించి విద్యుత్లైన్ సరిచేయాల్సిన అవసరం ఉంది. ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం భక్తులు మొక్కులు చెల్లించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. భక్తులు అమ్మవారికి పసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పసుపు–కుంకుమ సమర్పించారు. అనంతరం మేడారం బయలుదేరి వెళ్లారు. ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం, కేబినెట్ సమావేశానికి ఆదివారం సీఎంతో పాటు మంత్రులు మేడారానికి చేరుకోవడంతో ఏ రోడ్డు చూసినా వాహనాల రద్దీ కనిపించింది. అధికారుల వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయింది. హరిత హోటల్, బస్టాండ్, మేడారం గద్దెల రోడ్ల గుండా వెళ్లేందుకు అధికారులు, రాజకీయ నాయకుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగితా భక్తుల వాహనాలను దారి మళ్లించారు. వన్వే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వాహనాల మళ్లింపుపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రైవేట్ వాహనాలను గద్దెల చుట్టు పక్కల ప్రాంతాలకు అనుమతించలేదు. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ, నందీశ్వరుని విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని శేషాద్రి కొనియాడారు. -
24 అంశాలపై శిక్షణ
భూపాలపల్లి రూరల్: ఇటీవల ఎన్నికై న సర్పంచ్లకు 24 అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్పంచ్ల విధులు, బాధ్యతలు, నిధులు సమకూర్చడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 248 సర్పంచ్లు, 2,103 మంది వార్డు సభ్యులు ఉండగా.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పక్కన గల ఎస్సీ, బీసీ హాస్టల్ నూతన భవనాల్లో సర్పంచ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్సీ హాస్టల్లో 50మందికి, బీసీ హాస్టల్లో 50 మంది సర్పంచ్లకు మొత్తంగా 100 మందికి మొదటి విడతలో శిక్షణ ఇవ్వనున్నారు. వార్డు సభ్యులకు మండలకేంద్రాల్లో త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్కు ఐదు రోజుల పాటు శిక్షణ ఉండనుంది. ఏఏ అంశాలపై అంటే.. గ్రామ పాలనలో వ్యవస్థలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారాలు, సర్పంచ్లకు బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాథమిక లక్ష్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశుద్ధ్యం, సమావేశాలు, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, వన మహోత్సవం, నిధులపై ఆడిట్, ప్రజా ఆరోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ అప్లికేషన్, ఆర్థిక ప్రణాళిక ఇలా 24 అంశాలపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.. అన్ని అంశాలపై పట్టు సాధించి గ్రామాభివృద్ధికి కృషి చేసే విధంగా ప్రోత్సహించనున్నారు. పంచాయతీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేయకుండా పల్లె అభివృద్ధికి కృషిచేసేలా వివరించనున్నారు. శిక్షణకు తప్పక రావాల్సిందే.. శిక్షణ సమయంలో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోనున్నారు. ఆధార్ లింక్ ద్వారా బయోమెట్రిక్ అంటెండెన్సు శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు ప్రతీ సర్పంచ్ తప్పక హాజరు కావాలి. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే పంది మంది మాస్టర్ ట్రైనర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు., రెండు విడతల్లో శిక్షణ.. ఈనెల 19వతేదీ నుంచి 23వ తేదీ వరకు మొదటి విడతగా భూపాలపల్లి, కొత్తపల్లిగోరి, రేగొండ, మహదేవపూర్ , గణపురం మండలాల్లోని 100 మంది సర్పంచ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మేడారం జాతర పూర్తయిన తర్వాత రెండో విడత షెడ్యూల్ ప్రకటించి 148 మంది సర్పంచ్లకు విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. రేపటినుంచి 100 మంది సర్పంచ్లకు ట్రైనింగ్ మేడారం జాతర తర్వాత రెండో విడత -
జాతరలో భక్తుల భద్రత కీలకం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల భద్రత కీలకమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మేడారం జాతర సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం రాత్రి సందర్శించారు. జాతర ప్రాంతాలలో సుమారు 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని భారీ ఎల్ఈడీ స్క్రీన్పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను మంత్రి సీతక్క ప్రత్యక్షంగా వీక్షించారు. జాతర సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు, సన్నాహాలు ఏమిటన్న అంశాలను పోలీస్ అధికారులు మంత్రికి వివరించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతీ చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పోలీస్ అధికారులకు ఆదేశించారు. భక్తులు నిర్భయంగా, ప్రశాంతంగా జాతరలో పాల్గొనేలా భద్రతా ఏర్పాట్లు ఉండాలని, పోలీస్ యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర, ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వేదికను మంత్రి పరిశీలించి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏర్పాట్ల వివరాలను మంత్రి సీతక్కకు వివరించారు. బందోబస్తూ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ దివాకర సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల కోసం నియమించిన ప్రత్యేక అధికారులతో ఆర్డీఓ వెంకటేశ్ సమావేశం నిర్వహించి వారి విధుల నిర్వహణ, ఏర్పాట్లపై సూచనలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఈడీ స్క్రీన్ల పరిశీలన -
రోడ్డుపైనే పార్కింగ్..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారంలో ఇసుక లారీలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం లారీలు ఇరువైపులా పార్కింగ్ చేసి ఉండడంతో దామెరకుంట వైపు, చెన్నూర్, కాళేశ్వరం మీదుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. టెంట్ సిటీ.. లగ్జరీ టెంట్లు ఏటూరునాగారం: మహాజాతరకు వచ్చే భక్తులు బస చేసేందుకు మేడారం పోలీస్ క్వార్టర్స్ పక్కనే లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేశారు. దానికి టెంట్ సిటీగా నామకరణం చేశారు. ఈ నెల 18, 19వ తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన ఉండడంతో వాటిని మరింత అత్యాధునికంగా రూపొందించా రు. టెంట్లను ప్రభుత్వం రెండు రోజుల పాటు అ ద్దెకు తీసుకొని మేడారం వచ్చే మంత్రులకు ఇందులో సకల ఏర్పాట్లు చేయనుంది. మంత్రులు, వీవీఐ పీలు, ఇతర అధికారులు సైతం ఇక్కడ విశ్రాంతి తీసుకోవడంతో పాటు పడుకునేందుకు సౌకర్యాలను కల్పించారు. సీఎం పర్యటన పూర్తయిన తర్వాత టెంట్లను అద్దెకు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
లెక్కలు తలకిందులు
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే భూపాలపల్లిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం శనివారం వెలువడిన వార్డుల వారీగా రిజర్వేషన్లు పలువురి ఆశలపై నీళ్లు చల్లాయి. గత ఎన్నికల రిజర్వేషన్ల సరళిని బట్టి ఈసారి తమకు అనుకూలంగా వార్డు కేటాయింపు ఉంటుందని ఆశించిన కొందరికి షాక్ తగిలింది. 2014, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్లను విశ్లేషించుకుని ఈసారి కచ్చితంగా తమ సామాజిక వర్గానికే వార్డు రిజర్వేషన్ దక్కుతుందని ధీమాతో ఉన్న పలువురు ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. శనివారం విడుదలైన అధికారిక జాబితాలో వార్డుల రిజర్వేషన్లు తలకిందులు కావడంతో ఆశావహులు ఒక్కసారిగా డీలా పడ్డారు. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ ఆశించిన చోట ఎస్సీ, బీసీ కేటాయింపులు రావడం, జనరల్ అనుకున్న చోట మహిళా రిజర్వేషన్లు రావడం ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ సొంత వార్డుల్లో రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో, ఆశావహులు ఇప్పుడు ‘ప్లాన్–బి’ అమలు చేసే పనిలో పడ్డారు. తమ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్న పక్క వార్డుల వైపు దృష్టి సారిస్తున్నారు. మరికొందరు సొంత వార్డు వదులుకోలేక, మహిళా రిజర్వేషన్ వచ్చిన చోట తమ కుటుంబ సభ్యులు(భార్య లేదా తల్లి)ని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. పార్టీ మారుతూ అయినా సరే, అనుకూలమైన వార్డు నుంచి పోటీ చేయాలని కొందరు గట్టి పట్టుదలతో ఉన్నారు. రిజర్వేషన్ల మార్పుతో మున్సిపాలిటీ పరిధిలో పాత సమీకరణాలన్నీ మారిపోయాయి. కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుండగా, సీనియర్ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి ఇతర వార్డుల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో రాబోయే రోజుల్లో వార్డుల మధ్య అభ్యర్థుల మార్పిడి, కొత్త పొత్తులు ఆసక్తికరంగా మారనున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ఎస్టీ 2, ఎస్సీ 6, బీసీ 7, అన్ రిజర్వుడ్ 15 స్థానాలు కేటాయించారు. మహిళలకు ఎస్టీ వార్డుల్లో 1, ఎస్సీ వార్డుల్లో 3, బీసీ స్థానాల్లో 3, అన్ రిజర్వుడ్లో 8 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను శనివారం లాటరీ పద్ధతిలో కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపిక చేశారు. ఒకటవ వార్డు జనరల్ మహిళ, రెండో వార్డు బీసీ జనరల్, మూడో వార్డు జనరల్కు కేటాయించారు. 4వ వార్డు బీసీ జనరల్, 5 ఎస్సీ జనరల్, 6 బీసీ మహిళ, 7 జనరల్ మహిళ, 8 ఎస్సీ మహిళ, 9 జనరల్, 10 జనరల్ మహిళ, 11, 12, 13 జనరల్, 14 జనరల్ మహిళ, 15 ఎస్సీ జనరల్, 16, 17 జనరల్ మహిళ, 18 బీసీ జనరల్, 19 జనరల్, 20 ఎస్టీ జనరల్, 21 ఎస్టీ మహిళ, 22 బీసీ మహిళ, 23 జనరల్ మహిళ, 24 బీసీ మహిళ, 25 జనరల్ మహిళ, 26, 27 ఎస్సీ మహిళ, 28 ఎస్సీ జనరల్, 29 జనరల్, 30 బీసీ జనరల్కు కేటాయించారు. చాలామందికి అనుకూలంగా రాని వైనం పక్క వార్డుల్లో పోటీకి సమాలోచనలు -
డివైడర్ల తొలగింపు
ఏటూరునాగారం: మహాజాతర సమయంలో 29వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి గద్దెలకు తీసుకొచ్చే ముందు మేడారం గ్రామంలోని సమ్మక్క గుడికి రావడం ఆనవాయితీ. అయితే గుడి ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై ఇటీవల డివైడర్లను నిర్మించారు. సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పూజారులు, ఆదివాసీలు, కుటుంబాలు, యువత, భక్తులు లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండడం వల్ల ఈ డివైడర్లతో మరింత కిక్కిరిసిపోవడంతో పాటు అమ్మవారి సేవకు అడ్డు ఏర్పడే అవకాశం ఉందని పూజారులు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే సెంట్రల్ లైటింగ్ పోల్స్, డివైడర్లను కూల్చి వేశారు. అధికారులకు ముందు చూపులేని తనంతో లక్షలాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని దామరకుంట సోషల్ వెల్ఫేర్ విదార్థిని మంతెన శ్రీహర్షిని ఎంపికై నట్లు పెద్దపెల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.లక్ష్మణ్, వేల్పుల కుమారు తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు నారాయణపేట జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఖోఖో చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. విద్యార్థిని ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ నజ్మా, పీడీ రాజేశ్వరి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. హేతుబద్ధీకరణను విరమించుకోవాలి భూపాలపల్లి అర్బన్: త్వరలో చేపట్టబోయే హేతుబద్ధీకరణను విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చేపట్టే రైజింగ్ 2047లో భాగమే ఈ హేతుబద్ధీకరణ అని దుయ్యబట్టారు. విద్యారంగానికి సరిపో యే బడ్జెట్ కేటాయించకుండా విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు తిరుపతి, శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి, వీరేశం, బోజ్జా నాయక్, వీరన్న, ప్రభాకర్ పాల్గొన్నారు. పోరుదీక్ష పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి రూరల్: ఈనెల 20న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్నె యుగేందర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో కళాకారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన్నె యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం తమ ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ సాధించుకున్నామన్నారు. అయినప్పటికీ ఉద్యమ కళాకారులకు ఉపాధి లేకుండా నిరాశ్రయులుగా దీనస్థితిలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గెం శ్రావణ్, రాజేష్, రాజా, సడవలి, మధుకర్, సమ్మరాజ్, రాజశేఖర్, సంధ్యారాణి, నిర్మల పాల్గొన్నారు. చెట్లు, స్తంభాలకు రంగులు ఏటూరునాగారం: మహాజాతర సందర్భంగా వచ్చిపోయే వాహనాలు, భక్తులకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, స్తంభాలు కనిపించే విధంగా ఆర్అండ్బీశాఖ ఎరుపు, తెలుపు గుర్తులతో ప్రతీ చెట్టుకు, స్తంభానికి కలర్ వేయించారు. దీంతో రోడ్డు వెంట ఏమి ఉన్నాయి, ఎంత దూరం వరకు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులకు, భక్తులకు రక్షణ కల్పించేలా ఈ రంగులు సహాయ పడనున్నాయి. -
‘ముందు’చూపు!
● మున్సిపోల్స్కు ముందస్తు ప్రచారం ● ఓటరు ఇంటి తలుపు తడుతున్న ఆశావహులు ● సమస్యలు తెలుసుకుని మరీ పరిష్కరించే ప్రయత్నంమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ వెలువడకముందే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కనిపించనివారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఆశావహులు ఓటరు తలుపుతడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం పది రోజులుగా గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రిజర్వేషన్ కలిసిరాకుంటే ఏం చేయాలా అన్న దానికీ ప్లాన్బీతో రెడీగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ వస్తే కుటుంబ సభ్యులను బరిలో దించాలన్న ఆలోచనతో ముందస్తుగానే ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన డబ్బులను రెడీ చేసి పెట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతం ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు. పలకరిస్తూ.. పనులు చేస్తూ.. భూపాలపల్లి మున్సిపాలిటీలో తుది ఓటరు జాబితాలను ప్రకటించారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్నవారంతా జనంబాట పట్టారు. ఒకరిద్దరు మాజీ కౌన్సిలర్లు ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రెయినేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత్ దీపాలు, పైపులైన్ల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు. ఇంతకాల ముఖం చూపని వారు పొద్దున లేవగానే గల్లీలు తిరుగుతూ అందరినీ పలకరిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిన్నమొన్నటి దాకా పట్టించుకోని వారు ఎన్నికల లొల్లి మొదలవుతుందనగానే వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలతో.. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆలయాలు, చర్చిలు, మజీద్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మాజీ కౌన్సిలర్ల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవాల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొని రోడ్డు పనులు తమ ద్వారానే జరుగుతున్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేశారు. అప్పుడే తాయిలాలు.. జిల్లా కేంద్రంలో కొందరు ఆశావహులు సంక్రాంతి పండుగ కోసం రంగుల ప్యాకెట్లను ఇంటింటికీ పంపిణీ చేశారు. మరికొందరు వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందించారు. సంక్రాంతి పండుగ పూట మాంసం, మందు కూడా పంపిణీ చేశారు. వీలిన గ్రామాల్లో పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చిన యువకులతో మాట్లాడి మంచి చెడులను చర్చించారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని మర్యాదులు సైతం చేశారు. వార్డుల్లో కమ్యూనిటీ బోర్లకు సంబంధించిన సంఘాలు, కుల సంఘాలు, సంక్షేమ సంఘాలు, అభివృద్ధి సంఘాలు, కాలనీ సంఘాల వారీగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారం భించారు. -
ముందు ‘మున్సిపల్’.. తర్వాత గ్రేటర్!
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపాలిటీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్కు రెండు రోజుల ఆలస్యంగానైనా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వెంటనే మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలకశాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు మేయర్, చైర్మన్ స్థానాల్లో 3 కార్పొరేషన్లు, 38 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించారు. అయితే ఏ జిల్లాలో ఏ నగరం, ఏ పట్టణం ఎవరికి కేటాయిస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఇందులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు 12 మున్సిపాలిటీలపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అందరూ ఊహించినట్లుగా ‘పుర’పోరుకు వేగంగా పావులు కదులుతుండగా.. రెండు, మూడు రోజుల్లో (20వ తేదీ వరకు) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని అంటున్నారు. ఈ విషయమై అధికారులు, అధికార పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్లు ప్రచారం ఉంది. త్వరలోనే రిజర్వేషన్లు.. నోటిఫికేషన్ ముందుగా ప్రకటించిన ప్రకారం సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం, జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదివారం, సోమవారం.. రెండు రోజులు మేడారంలో బస చేయనున్న ఆయన సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రారంభించడం, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకు ముందే నిర్వహించే కేబినేట్ సమావేశంలో ఎన్నికల అంశం ప్రధానం కానుండగా.. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కూడా రేవంత్రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారానికి తోడు రెండు రోజుల కిందట మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రకటన కూడా ఊతం ఇస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లలో ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో ఏ మున్సిపాలిటీ ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందోనన్న చర్చ కూడా సీరియస్గా సాగుతోంది. వార్డుల ఆధారంగా కూడా రిజర్వేషన్ల అంశం రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందన్న ప్రచారం ఆశావహులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా మున్సిపల్ వార్డులు, చైర్మన్ల కోసం అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపే వ్యూహంలో తలమునకలవుతున్నారు. గ్రేటర్లో డివిజన్ల విస్తరణ లేనట్లే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ డివిజన్ల విస్తరణ ఉంటుందని భావించారు. ప్రజాప్రతినిధులు కూడా కొందరు ప్రయత్నాలు చేశారు. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది మే 7న ముగియనుంది. ఈలోగా పెరిగిన జనాభా, ఇళ్ల నిర్మాణానికి తోడు విస్తరించిన నగరాన్ని దృష్టిలో పెట్టుకుని 66 డివిజన్లను 88 డివిజన్లకు పెంచాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 2011 జనాభా లెక్కలకు ప్రస్తుత జనాభాతో పోలిస్తే భారీగానే పెరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 406 చదరపు కిలోమీటర్ల మేరకు నగరం విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఒక్కో డివిజన్కు 7 వేల నుంచి 9 వేల ఓటర్లను తీసుకుని 88 డివిజన్లు చేయాలని పురపాలక శాఖ డైరక్టర్ టీకే శ్రీదేవికి పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలోనే వార్డుల రిజర్వేషన్లపై ప్రకటన వెలువడటంతో ఇప్పట్లో డివిజన్ల విస్తరణ లేనట్లేనన్న చర్చ మొదలైంది. దీంతో పాటు ఈ సారి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను మళ్లీ మహిళలకే కేటాయిస్తారా? ఏమైనా మార్పులు చేస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్? అధికారులకు సంకేతాలు ‘గ్రేటర్’ సహా 12 మున్సిపాలిటీల్లో వార్డులు ఖరారు మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లపై నేడు ప్రకటన ‘బల్దియా’ల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు మేడారంలో రేపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీమున్సిపాలిటీల వారీగా రిజరేషన్లు – 2026 జిల్లా మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ(జ) అన్ రిజర్వుడుహనుమకొండ జీడబ్ల్యూఎంసీ 66 2 11 20 17 16 పరకాల 22 1 5 5 7 4 వరంగల్ నర్సంపేట 30 3 4 8 8 7 వర్ధన్నపేట 12 3 2 1 4 2 జనగామ జనగామ 30 1 5 9 9 6 స్టేషన్ఘన్పూర్ 18 1 5 3 6 3 మహబూబాబాద్ మహబూబాబాద్ 36 7 5 6 10 8 డోర్నకల్ 15 4 3 0 4 4 మరిపెడ 15 6 1 0 4 4 తొర్రూరు 16 2 3 3 5 3 కేసముద్రం 16 3 2 3 5 3 భూపాలపల్లి భూపాలపల్లి 30 2 6 7 8 7 ములుగు ములుగు 20 2 3 5 6 4 -
కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, అనుబంధ దేవాలయాల హుండీలను శుక్రవారం లెక్కించారు. మూడు నెలల హుండీల ఆదాయం రూ.34,42,598 లక్షలు సమకూరినట్లు ఈఓ ఎస్.మహేష్ తెలిపారు. హుండీల పర్యవేక్షణను దేవాదాయశాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది, శ్రీ వల్లి సేవా ట్రస్ట్ (కరీంనగర్), శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, నరసింహ సేవా సమితి (హైదరాబాద్) సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఆదేశించారు. శుక్రవారం భూపాలపల్లి మున్సి పాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను కమిషనర్ ఉదయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా ఎన్నికలను ప్రశాంత వాతా వరణంలో నిర్వహించాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ సునీల్కుమార్, కార్యాలయ మేనేజర్ సుభాష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గోదారంగనాథుల కల్యాణ ఉత్సవం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కనుల పండగగా గురువారం నిర్వహించారు. భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాథచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామి వారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి గోదా రండనాయక స్వామి వారికి ఒడి బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పార్కింగ్ స్థలాల పరిశీలన కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా పార్కింగ్ స్థలాలు, రహదారులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలకు పాత నక్ష ప్రకారం కన్నెపల్లి వంతెన గుండా రహదారి పక్కన 20–30 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని, వరంగల్ గుండా వచ్చే వాహనాలకు వన్వే మీదుగా వచ్చే వాహనాలకు పూస్కుపల్లి, కాళేశ్వరం వద్ద పార్కింగ్ స్థలాలు పరిశీలించారు. వారి వెంట ఎస్సై తమాషారెడ్డి తదితరులు ఉన్నారు. కాళేశ్వరంలో ఫ్రాన్స్ దంపతుల సందడి కాళేశ్వరం: ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫిలిఫ్స్–క్యాచీ దంపతులు కాళేశ్వరంలో శుక్రవారం కలియ తిరుగుతూ సందడి చేశారు. రెండు రోజులుగా హరిత హోటల్లో బస చేసి కాళేశ్వరాలయం, గోదావరి పరిసరాలు, వీఐఫీ ఘాటుతో పాటు గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాలను చుట్టేశారు. సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులతో ముచ్చటించారు. శుక్రవారం వీఐఫీఘాటు వద్ద నిత్య హారతి కార్యక్రమంలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. గ్రామంలోని పలువురు ఇళ్లలో కాసేపు కూర్చుని ముచ్చటించారు. దీంతో వారిని చూసేందుకు, మాట్లాడటానికి గ్రామస్తులు సంబురపడ్డారు. -
ప్రమాదవశాత్తు కారు దగ్ధం
● మేడిపల్లి టోల్ప్లాజా వద్ద తప్పిన ముప్పుమల్హర్(కాటారం): ప్రమాదవశాత్తు ఓ కారు దగ్ధమైన ఘటన కాటారం మండలంలోని మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్కు చెందిన ఇద్దరు కారులో కాళేశ్వరం వెళ్తున్నారు. టోల్ ప్లాజా వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో కారు పూర్తిగా కాలిపోయింది. కాటారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. అదుపుతప్పి కారు బోల్తా మల్హర్(కాటారం): కారు అదుపు తప్పి కల్వర్డును ఢీకొట్టడంతో బోల్తా పడిన ఘటన కాటారం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామానికి చెందిన దేవేందర్, సురేష్ కాటారం(గారెపల్లి) నుంచి మంథని వైపున వెళ్తున్నారు. మండలకేంద్రంలోని సొసైటీ బ్యాంకు వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు కారులోనే ఇరుక్కుపోయి గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. -
మినీ మేడారం పనులు చేపట్టాలి
● అధికారులతో కలెక్టర్ సమీక్ష భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించే మినీ మేడారం జాతర అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మినీ మేడారం జాతరలపై సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో కలెక్టర్ స్పందించి శుక్రవారం కలెక్టరేట్లోని మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్, విద్యుత్, ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమశాఖ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులతో జాతరల నిర్వహణపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతర ప్రాంగణంలో పొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. జాతర సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. జాతరలు జరిగే మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా పొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలని, మలుపుల వద్ద సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించి చేయాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జాతరలు నిర్వహించే మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మినీ మేడారం జాతరలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు సునిల్, బాబురావు, విద్యుత్ శాఖ డీఈ రాజిరెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, డీఎల్పీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. -
3గంటలు ట్రాఫిక్ జామ్
● డ్రైవర్ నిర్లక్ష్యంతో 353(సీ) జాతీయ రహదారిపై ట్రాఫిక్ ● పునరుద్ధరించిన పోలీసు, ఎన్పీడీసీఎల్ సిబ్బందికాళేశ్వరం: నిర్లక్ష్యంతో విద్యుత్ స్తంభాన్ని ట్యాంకర్ డ్రైవర్ ఢీకొట్టడంతో 353(సీ) జాతీయ రహదారిపై సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ నుంచి మహదేవపూర్ మండలం కాళేశ్వరం గుండా మధ్యప్రదేశ్కు వెళ్తున్న (సోడియం క్లోరైడ్ లాజిస్టిక్ కెమికల్) ట్యాంకర్ పలుగుల బైపాస్ క్రాస్ వద్ద నిలిపాడు. డ్రైవర్ ట్యాంకర్ నిలిపి కిరాణ దుకాణం వెళుతున్న క్రమంలో రివర్స్ తీస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ట్యాంకర్ ఒక పక్కకు ఒరిగింది. దీంతో రాత్రి ఎలాంటి ప్రమాదం జరుగొద్దనే ఉద్దేశంతో పోలీసు, ఎన్పీడీసీఎల్ సిబ్బంది అక్కడే ఉన్నారు. శుక్రవారం కన్నెపల్లి పంప్హౌస్ మెఘా కంపెనీకి చెందిన భారీ క్రేన్ సాయంతో పోలీసుల పహారా మధ్య లారీని తొలగించారు. ట్యాంకర్ ఢీకొన్న స్తంభంపై 11 కేవీ విద్యుత్ వైర్లు ఉండటంతో, భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు సుమారు 3 గంటల పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ కారణంగా అటు మహారాష్ట్ర, ఇటు వరంగల్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఇసుక లారీలు రహదారిపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం ట్రాఫిక్, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో రాకపోకలు యధావిధిగా జరిగాయి. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!
● పరీక్షల ఫలితాలకు ఏడాది దాటే అవకాశం ● క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తయ్యాకే ముందడుగుకాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ పునరుద్ధరణకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలు, క్షేత్రస్థాయి పరీక్షల నిర్వహణలో జాప్యం కారణంగా పునరుద్ధరణ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యారేజీ నిరుపయోగంగా మారి ఇప్పటికే రెండేళ్లు పూర్తవుతున్నా, పునరుద్ధరణ ఎప్పుడవుతుందో ఇంకా స్పష్టత రావడం లేదు. రేండేళ్లుగా.. మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న ఏడోబ్లాక్లోని 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్లలో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి, అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ ఆదేశాలు, సూచనల మేరకు పలు పరీక్షలు నిర్వహించారు. మళ్లీ పునరుద్ధరణ చేపట్టడానికి పరీక్షలు చేయడానికి ఈనెలలో అడుగులు వేస్తున్నారని తెలిసింది. డిజైన్స్ టెండర్లు.. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్వహించాల్సిన పరీక్షల అనంతరం చేపట్టే పనులకు అవసరమైన డిజైన్ల రూపకల్పన కోసం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) డిజైన్ సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఒప్పందాలు పూర్తయినా, క్షేత్రస్థాయిలో జరిగే పరీక్షలు పూర్తికాకపోతే పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. 9 రకాల పరీక్షలు చేయడానికి సిద్ధం.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్లో ఇప్పటికే ఒక దఫా పరీక్షలు నిర్వహించిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) మరోసారి పూర్తి స్థాయిలో పరీక్షలు చేపట్టనుంది. ఏడో బ్లాక్తోపాటు మిగిలిన ఏడు బ్లాకుల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధానంగా జియో ఫిజికల్, జియో టెక్నికల్, ఎన్డీటీతోపాటు తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించడానికి సిద్ధం అయినట్లు అధికారుల ద్వారా తెలిసింది. పరీక్షలు 25 నుంచి 30 మీటర్ల లోతు వరకు బ్యారేజీ కింద భూమి స్వభావాన్ని అధ్యయనం చేయనున్నారు. దీంతోపాటు కాంక్రీటు పరిస్థితి, గేట్ల పనితీరు, ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్, జీపీఆర్, నాన్–డిస్ట్రక్టివ్ టెస్టులు సహా మొత్తం పది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారం లేదా ఫిబ్రవరిలో.. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొన్ని పరీక్షల ఫలితాలు రావడానికి కనీసం ఆరు నెలలు కానుంది. మరికొన్నింటికి ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందని తెలిసింది. నీటి నిల్వ చేయడానికి బ్యారేజీలు వచ్చే ఖరీఫ్ సీజన్కు కూడా సిద్ధంగా లేవని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావును ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. -
సరస్వతి అంత్యపుష్కరాలకు ఏర్పాట్లు
కాళేశ్వరం: మే నెలలో వచ్చే సరస్వతినది అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే పుష్కరాల పనులపై కాళేశ్వరం దేవాలయ ఈఓ కార్యాలయంలో ఎస్పీ సంకీర్త్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్కిటెక్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలిసి నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన సరస్వతి ఆది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అంత్య పుష్కరాలకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత పుష్కరాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకూడదన్నారు. అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 30.16 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో రూ.16 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అంచనాలు తయారుచేసి ప్రతిపాదనలు పంపించాలని వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలోపే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా శాశ్వత పనులు చేపట్టాలని, పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత వంటి అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలను ఆది పుష్కరాల మాదిరిగానే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంత్య పుష్కరాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, పెండింగ్లో ఉన్న దేవాదాయ శాఖ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా త్వరలోనే శ్రీకాళేశ్వర ఖండంశ్రీ అనే పుస్తకాన్ని విడుదల చేస్తామన్నారు.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రూ.30.61 కోట్లు మంజూరుచేసిన ప్రభుత్వం రూ.16 కోట్లతో శాశ్వత పనులు పనులపై అధికారులతో కలెక్టర్ రాహుల్శర్మ సమీక్ష -
వైభవంగా గోదారంగనాథుల కల్యాణం
భూపాలపల్లి అర్బన్: ధనుర్మాసం, సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ఆలయాల్లో బుధవారం శ్రీగోదారంగనాథ స్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. తొలుత స్వామివార్లు ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించగా వేలాది మంది తరలివచ్చి చూసి పులకించిపోయారు. పలువురు ప్రముఖులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొదండరామాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి దంపతులు హాజరయ్యారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
వార్డులు 30ఓటర్లు 52,726పోలింగ్ స్టేషన్లు 86భూపాలపల్లి: మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. వార్డుల వారిగా ఓటర్ల జాబితా వెల్లడి కావడంతో రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందో.. చైర్మన్ స్థానం ఏ వర్గాల వారిని వరిస్తుందోనని ఆశావాహులు అంచనాలు వేస్తూ టెన్షన్కు గురవుతున్నారు. చైర్మన్ సీటుపైనే అంతా చర్చ.. కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి గ్రామ పంచాయతీ 25 జనవరి 2012న నగర పంచాయతీగా ఏర్పడింది. అనంతరం జరిగిన 2014, 2020 ఎన్నికల్లో చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈసారి రిజర్వేషన్ల అమలులో మార్పులు జరుగకపోయినప్పటికీ రొటేషన్ పద్ధతిలో చైర్మన్, వార్డు స్థానాల రిజర్వేషన్లు మారనున్నట్లు అనధికారికంగా తెలిసింది. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానం బీసీ జనరల్ లేదా జనరల్ స్థానానికి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న వారు ఇప్పటి నుంచే పరోక్షంగా ప్రచారంలోకి దిగారు. వార్డుల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మచ్చిక చేసుకోవడం, చైర్మన్ స్థానాన్ని తాను ఆశిస్తున్నానని బహిరంగంగానే చెబుతూ సహకరించాలని కోరడం మొదలైంది. వార్డుల్లోనూ జోరుగా పోటీ.. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఈనెల 12 ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. 16న ఫొటోలతో కూడిన జాబితాను విడుదల చేయనున్నారు. 30 వార్డులు ఉండగా ప్రధాన పార్టీల నుంచి కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసేందుకు పలువురు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పార్టీ బీ ఫాం ఆశిస్తుండగా, బీఆర్ఎస్లోనే దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు వార్డుల్లో ప్రజల మద్ధతు ఉన్న అభ్యర్థులు, గెలుపు గుర్రాల కోసం అంతర్గతంగా సర్వే చేపిస్తున్నట్లు సమాచారం. తాజా మాజీ కౌన్సిలర్లు, ఓడిపోయిన కౌన్సిలర్లు అధిక సంఖ్యలో మరోసారి ఎన్నికల రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. నేతల చుట్టూ ప్రదక్షిణలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బస్తీబాట పేరిట పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్ స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారు తమ నేతల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. చైర్మన్ స్థానం రిజర్వేషన్పై సర్వత్రా చర్చ ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్ -
ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు
భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాపై చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, రవాణా, టీజీఎండీసీ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గతంలో మాన్యువల్ కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక అందించామని, ఇకపై ఆ విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి ఇసుక అవసరమైన లబ్ధిదారులు తప్పనిసరిగా ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఇసుక పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. త్వరలోనే తహసీల్దార్లు, టీజీఎండీసీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై విశ్లేషణ చేస్తామన్నారు. జిల్లాలోని ఇసుక రీచ్లను గుర్తించేందుకు ఇరిగేషన్, టీజీఎండీసీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి ఓవర్ లోడింగ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. జిల్లాలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలించినా, అక్రమ డంప్లు ఏర్పాటు చేసినా చర్యలు తప్పవన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతర తనిఖీలు చేపడుతున్నామని, చెక్పోస్ట్ల వద్ద మరింత నిఘా పెంచుతామన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీటీఓ సంధాని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ -
గాలిపటమా పద పద..
వరంగల్ ఎల్లంబజార్లో నిజాం కాలం నుంచి విక్రయాలుఖిలా వరంగల్: సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈసారి ఈగల్, డోరేమాన్, లేడీబర్డ్, జాజ్, పందెం కోడి వంటి ఆకర్షణీయమైన పతంగులు కనువిందు చేస్తున్నాయి. నిజాం నవాబుల కాలం నుంచే వరంగల్ ఎల్లంబజార్లో పతంగులు విక్రయిస్తూ ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, గుజరాత్ నుంచి పతంగులను దిగుమతి చేసుకుంటున్నారు. 2017 నుంచి చైనా మాంజా విక్రయాలపై నిషేధం.. 2016లో జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో 2017 నుంచి చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా కొందరు వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాంజాను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిజాం కాలం నుంచి అమ్ముతున్నాం.. వరంగల్ ఎల్లంబజార్లో నివాసం ఉంటాం. తాత ముత్తాతలు పతంగుల వ్యాపారం చేసేవారు. వంశపారంపర్యంగా నిజాం కాలం నుంచి పతంగులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. మా ఇద్దరు కుమారులు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారు. 30 రోజులు మాత్రమే సీజన్ ఉంటుంది. –చౌహాన్ సూరాజ్, వ్యాపారి, ఎల్లంబజార్, వరంగల్మా షాపునకు వందేళ్ల చరిత్ర.. సురాజ్ మాల్కు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ షాపును నమ్ముకొని నా ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువత ఇక్కడి నుంచి హోల్సేల్, రిటైల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. –చౌహాన్చంద్, వ్యాపారి పెద్దల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి. నాణ్యమైన గాలిపటాలు కొనుగోలు చేసి కాటన్ దారాలు మాత్రమే వాడాలి. చైనా, ఇతర మాంజాలు వాడొద్దు.భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు. జనావాసాలకు దూరంగా విశాలమైన మైదాన ప్రదేశంలోనే ఎగురవేయాలి. పైకి చూస్తే భవనంపై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయొద్దు. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
నల్లబెల్లి: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యం ఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లా ప్రజలందరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతీ ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు. కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలన్నారు. పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని కోరారు. కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే నెలలో జరుగు సరస్వతినది అంత్యపుష్కరాల పనుల ప్రతిపాదనలపై బుధవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ రాహుల్శర్మ, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరాలయం కార్యాలయంలో జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆయన ఆలయంలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవిని దర్శించుకున్నారు. ఆయనను కండువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు ముగిసినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మంగళవారం డీఈఓ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ 159 మంది విద్యార్థులకు 113 హాజరు కాగా.. 46 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ 50 మంది విద్యార్థులకు గాను 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. భూపాలపల్లి రూరల్: మానవ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ప్రాణనష్టం జరుగుతుందని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా గొల్లబుద్ధారం గ్రామంలో మంగళవారం రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా ఎస్పీ హాజరై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రమాదాల కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి కిరణ్, భూపాలపల్లి రవాణాశాఖ అధికారి సంధాన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 14న బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు.. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 14న బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయ ప్రాంగణంలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న మహిళలందరికీ ఔత్సాహిక బహుమతి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే మహిళలు ఎవరి ముగ్గులు, కలర్లు వారే వెంట తీసుకొని రావాలని తెలిపారు. చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో వెలిసిన నాపాక ఆలయాన్ని సినీ గేయ రచయిత వరికుప్పుల యాదగిరితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పెండెల ప్రభాకా రాచార్యులు వారిని ఘనంగా సన్మానించారు. భూపాలపల్లి రూరల్: 1,650 గ్రాముల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. సోమవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన కుంట శివ, భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన ఉర్సు దిలీప్ కుమార్ సోమవారం ఉదయం భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీచేయగా గంజాయి లభ్యమైంది. కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు. వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించగా రూ.6,71,954 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో జేబు దొంగలున్నారు..జాగ్రత్త చేతివాటం ప్రదర్శించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మేడారంలోని నార్లాపూర్ పీఎస్ పోలీసులు గత జాతరలో జేబు దొంగతనాలకు పాల్పడిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్ను సోమవారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భక్తులు నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు జాగ్రతగా ఉంచుకోవాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
భూపాలపల్లి: నోటిఫికేషన్ వెలువడగానే మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఐడీఓసీ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి, సీఎస్ పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్ తన చాంబర్లో జిల్లా, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. హోదాల వారీగా ఎన్నికల సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వినతులు సమర్పించిన వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణికి 46 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు.. ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ హెచ్చరించారు. తన చాంబర్లో సోమవారం పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, సహకార శాఖ, డీఆర్డీఏ, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లతో సమీక్ష నిర్వహించారు. వివేకానందుడి బోధనలు మార్గదర్శకం.. యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకమని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం
కాళేశ్వరం: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ప్రతీ రైతు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకుని యునిక్ ఫార్మర్ ఐడీ నంబర్ పొందాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్, పంట బీమా, సబ్సిడీలు, రుణాలు వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రైతుల అనాసక్తి.. జిల్లాలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, చాలా మంది రైతులు ఇప్పటికీ నమోదు చేయించుకోలేదు. జిల్లాలో ఇప్నటివరకు 65శాతం వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన రైతుల పేర్లు మళ్లీ రావడంతో కొంత ఆలస్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో 45 క్లస్టర్లలో 2.36 లక్షల ఎకరాల్లో 80వేల వరకు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. మీసేవ ద్వారా.. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోకపోవడంతో వారికి పీఎం కిసాన్ సహా ఇతర పథకాల నిధులు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ పూర్తి చేయని రైతుల మొబైల్ ఫోన్లకు సర్వే నంబర్లతో సహా ఎస్ఎంఎస్ సందేశాలు పంపిస్తున్నారు. దీంతో స్పందించిన కొందరు రైతులు మీ సేవ కేంద్రాలు, రైతు వేదికలు, లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కొన్ని మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో మరికొందరు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు మిగిలిన రైతులకు ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందిస్తూ, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలా.. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ వివరాలు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకెళ్లాలి. సమీపంలోని మీ సేవ కేంద్రం, వ్యవసాయ శాఖ కార్యాలయం, లేదా రైతు వేదిక వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్నప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు పంట బీమా, సబ్సిడీలు, రుణాలు పొందే అవకాశం ఉంటుంది.రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతుల వివరాలు సంబంధిత ఏఈఓల వద్ద అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతీ రైతుకు యునిక్ ఐడీ ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులందరూ వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో కూడా చేసుకోండి. లేకపోతే భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 65 శాతం రిజిస్ట్రేషన్ జరిగింది. ఆన్లైన్ సమస్యల వల్ల సజావుగా సాగడం లేదు. రెండు రోజుల్లో పూర్తి చేస్తాం. ఈ అంశంపై జూమ్ మీటింగ్లు జరుగుతున్నాయి. – జాడి బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటున్న వ్యవసాయశాఖ జిల్లాలో ఇప్పటికి 65శాతం రిజిస్ట్రేషన్లు -
లక్ష్మీదేవరకు బోనమెత్తిన భక్త జనం
కాళేశ్వరం: కాళేశ్వరంలో లక్ష్మీదేవర కిష్టస్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నాయకపోడ్ పూజారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం కల్యాణం, బోనాల సందర్భంగా మహిళా భక్తులు బోనమెత్తారు. ఆలయం చుట్టూర డప్పు చప్పుళ్లు, శివసత్తుల ఆటపాటలు, పూనకాలతో జయజయ ధ్వానాలతో మార్మోగింది. లక్ష్మీదేవరకు పట్నంతో బోనం సమర్పించి ప్రత్యేకంగా పూజలు, మొక్కులు చెల్లించారు. దీంతో భారీగా భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజారులు ఇనుముల వెంకటేష్, ఇనుముల రాకేష్, పోలం లస్మయ్య, ఇనుముల రాములు, ఇనుముల కిష్టయ్య, కిరణ్ పాల్గొన్నారు. -
గాలిపటం.. గణిత పాఠం
ఆకాశంలో ఎగిరే పతంగిలో దాగి ఉన్న లెక్కల లోకంభూపాలపల్లి అర్బన్: సంక్రాంతి వస్తుందంటేనే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటం. పొలాల్లో పంటలు కోసిన ఆనందాన్ని, కొత్త ఏడాదిపై ఆశలను ఆకాశంలో ఎగిరే పతంగుల రూపంలో వ్యక్తపరుస్తారు. ఉదయం నుంచే పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలతో మమేకమవుతారు. రంగురంగుల కాగితాలు, పొడవైన తోకలు, చుట్టూ తిరిగే దారం దృశ్యం పల్లె సంక్రాంతికి ప్రత్యేక శోభను ఇస్తుంది. సరదాగా కనిపించే ఈ ఆట వెనుక గణితం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. గాలిపటం నిజానికి ఒక ఎగిరే గణిత నమూనా. అందుకే దీనిని ‘గణిత మంత్రం’గా చెప్పుకోవచ్చు. పతంగుల తయారీలో లెక్కల జాదూ.. గాలిపటం తయారీ పూర్తిగా కొలతల మీద ఆధారపడి ఉంటుంది. కాగితాన్ని సమానంగా మడవడం, మధ్యలో చీలిక చేయడం, రెండు వైపులా సమతుల్యత ఉండేలా కత్తిరించడం.. ఇవన్నీ గణిత లెక్కలే. పొడవు, వెడల్పు సరిపోలకపోతే పతంగి ఆకాశంలో నిలవదు. కడ్డీలు పెట్టేటప్పుడు కేంద్రబిందువు కచ్చితంగా ఉండాలి. ఈ ప్రక్రియలో పిల్లలకు సహజంగానే జ్యామితి పరిచయం అవుతుంది. చతురస్రం, త్రిభుజం, సమాంతర రేఖలు వంటి భావనలు ఆటలోనే అలవడతాయి. దారం తయారీలో సూత్రాల శాస్త్రం పతంగి ఎంత అందంగా ఉన్నా దారం బలంగా లేకపోతే గెలుపు సాధ్యం కాదు. అందుకే సంక్రాంతి ముందు నుంచే దారం తయారీకి ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. పిండి, గాజు పొడి, రంగులు ఇవన్నీ సరైన నిష్పత్తిలో కలపాలి. ఎక్కువ గాజు ఉంటే ప్రమాదం, తక్కువైతే బలం ఉండదు. దారం మందం, పొడవు కూడా ముందే అంచనా వేస్తారు. ఇక్కడే పిల్లలకు నిష్పత్తులు, శాతం లెక్కలు అనుభవంగా నేర్చుకుంటారు. కన్నాలు కట్టడంలో లెక్కలు పతంగులకు కన్నాలు కట్టడం అత్యంత కీలకం. ఒక కన్నా పొడవుగా ఉంటే పతంగు ఒక వైపు వంగిపోతుంది. రెండు కన్నాలు సమాన పొడవులో ఉండాలి. మధ్య కన్నా కోణం కచ్చితంగా ఉండాలి. ఇది పూర్తిగా కోణాల గణితం. చిన్న తేడా కూడా పతంగు ప్రయాణాన్ని మార్చేస్తుంది. అందుకే పెద్దలు పిల్లలకు కన్నాలు కట్టేటప్పుడు ఓర్పుతో నేర్పిస్తారు. ఈ ప్రక్రియలో కొలతల ప్రాముఖ్యత వారికి అవగతమవుతుంది. భద్రతలో కూడా గణితమే.. గాలిపటాలు సరదానే కానీ జాగ్రత్తలు తప్పనిసరి. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. రోడ్లపై ఎగురవేయకూడదు. దారం పొడవు ఎంత వరకు వదలాలో అంచనా ఉండాలి. చిన్న పిల్లలకు గాజు దారం ఇవ్వకూడదు. ఇవన్నీ ముందస్తు లెక్కలు. భద్రత అంటే కూడా సరైన అంచనాలే. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే పండుగ ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి గాలిపటం ఒక ఆట మాత్రమే కాదు అది ఒక జీవన పాఠం. పల్లె సంక్రాంతికి ప్రాణంగా మారిన గాలిపటం సంస్కృతి సరదా ఆటలో శాసీ్త్రయ ఆలోచనలకు బీజం పిల్లల చేతుల్లో నుంచి పుట్టే భవిష్యత్ గణితంగాలిపటం ఎగురవేయడం అంటే గాలి వేగం, దారం ఒత్తిడి మధ్య సమతుల్యత గాలి దశను అంచనా వేసి దారం వదలాలా, పట్టాలా అనేది నిర్ణయించాలి. ఇది తక్షణ నిర్ణయ గణితం గాలి బలంగా ఉన్నప్పుడు దారాన్ని ఎక్కువగా వదలాలి. గాలి తగ్గితే కాస్త పట్టాలి. ఈ లెక్క తప్పితే గాలిపటం పడిపోతుంది. ఆటలోనే పిల్లలు వేగం, బలం, దిశ వంటి భౌతిక శాస్త్ర గణిత సూత్రాలను అర్థం చేసుకుంటారు. -
స్వామి వివేకానంద స్ఫూర్తితో..
అభివృద్ధి చేస్తామంటున్న యువ సర్పంచ్లుఎమ్మెస్సీ పూర్తిచేసి మెడికల్ కోడింగ్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల సర్పంచ్గా బరిలో దిగి విజయం సాధించాను. కేవలం 25 సంవత్సరాల వయస్సులో సర్పంచ్గా నాకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజల వెన్నంటే ఉంటా. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరేలా కృషి చేస్తా. యువకులు రాజకీయంలో విజయాలు సాధిస్తారనే నమ్మకంతో బరిలో దిగి విజయం సాదించాను. – ఇసంపెల్లి హారిక, ఎంపేడు సర్పంచ్, టేకుమట్లరెండు దశాబ్ధాలుగా నాన్న సంగి రవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రభావంతోనే బీఎస్సీ నర్సింగ్ చేసిన నేను చిన్న వయసులోనే(23) రాజకీయంలో అడుగుపెట్టాను. సర్పంచ్గా ప్రజలు బాధ్యతను కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. యువతులు సైతం అభివృద్ధి చేస్తారనేలా సేవ చేసి ప్రజలతో శభాష్ అనిపించుకుంటాను. – సంగి అంజలి, దుబ్యాల సర్పంచ్, టేకుమట్ల -
కాళేశ్వరాలయంలో సందడి
సంక్రాంతి సెలవుల సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి తోడు ముందస్తుగా మేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిధి గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రాకపోకలు జరుగడంతో గ్రామంలో భక్తుల రద్దీ నెలకొంది. – కాళేశ్వరం -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రులు సురేఖ, వాకిటి శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జి. సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
పోరాటయోధుడు ఓబన్న
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాటయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ధైర్య సాహసాలు ప్రదర్శించారన్నారు. ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షురాలు దారంగి మంజుల, శివరాత్రి రమేష్, మిర్యాల మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (సోమవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రేగొండ: అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై దివ్య ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన జూపాక రాధమ్మ ఇంటి వద్ద అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
నవ్విపోదురు గాక..
భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ నుంచి భూపాలపల్లి, కాళేశ్వరం వెళ్లేందుకు రెండు వేర్వేరు దారులు ఉన్నాయి. ఇక్కడ మూడు రకాల బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాయి. అందులో ఒక బోర్డులో భూపాలపల్లి 4 కిలోమీటర్లు, మరో రెండు బోర్డుల్లో 5, 7 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అక్కడి నుంచే కాళేశ్వరం ఒక బోర్డులో 46.. మరో బోర్డులో 47 కిలోమీటర్లుగా రాశారు. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు స్పందించి బోర్డులను సరిచేయాల్సిన అవసరం ఉంది. – భూపాలపల్లి అర్బన్భూపాలపల్లి 4 కిలోమీటర్లుగా సూచిక రాయి భూపాలపల్లి 5 కిలోమీటర్లు బోర్డు -
రాజకీయ పరిస్థితులతో అడుగులు
నాది పేద మధ్యతరగతి కుటుంబం. నేను డిగ్రీ(బీఏ) వరకు చదివాను. నా వయస్సు 28 సంవత్సరాలు. కరోనాకు ముందు హైదరాబాద్లో ట్రావెల్స్ బిజినెస్ చేసి పరిస్థితులు బాగా లేక మహదేవపూర్ మండలంలోని సొంతం గ్రామం అన్నారం చేరాను. గ్రామంలో చిన్న ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్న. ఇంకా ఎన్జీఓలో ఆర్టీఐ, ఎన్హెచ్ఆర్ఎస్లో ప్రజల కోసం పనిచేస్తున్న. గ్రామంలో నెలకొన్న రాజకీయ నాయకుల వైఫల్యాలతో నేను సర్పంచ్గా గెలిచి ఊరును బాగు చేయాలని అనిపించింది. ప్రజల సహకారంతో సర్పంచ్గా గెలిచాను. ఊరులోని బడి, ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మధ్యవర్తిత్వం లేకుండా వారికి దరిచేరే విధంగా శ్రమిస్తాను. మౌలిక వసతులపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తా. – నీర్ల ప్రభాకర్, అన్నారం సర్పంచ్, మహదేవపూర్● -
పది విద్యార్థులకు స్నాక్స్
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు చిరుతిళ్లు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే నెల 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు 19 రోజులపాటు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదివే వారికి రోజుకో రకం స్నాక్స్ అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పిల్లలకు ఆకలి నుంచి ఉపశమనం లభించనుంది. వంద శాతం ఉత్తీర్ణతకు.. మార్చిలో నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యాశాఖ గతేడాది దసరా సెలవులు ముగిసిన అనంతరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. మొదట ఒక పూటతో ప్రారంభించగా.. డిసెంబరు నుంచి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 4.15గంటల నుంచి 5.15గంటల వరకు రోజూ రెండు గంటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్న భోజనం తిన్న తరవాత సాయంత్రం ఖాళీ కడుపుతో ప్రత్యేక తరగతులు వినాల్సి వస్తోంది. ఇంటికి వెళ్లే సరికి చీకటి పడి ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. కాలే కడుపుతో ఉంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చెవికెక్కవు. దీన్ని గుర్తించిన విద్యాశాఖ పిల్లల ఆకలి తీర్చడానికి స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. జిల్లాలో 97 పాఠశాలలు, 2,739 మంది విద్యార్థులు సాయంత్రం పూట అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలుజిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు 97 ఉన్నాయి. వాటిలో 2,739 మంది విద్యార్థులు పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. చిరుతిళ్ల కోసం జిల్లాకు ప్రభుత్వం రూ. 3.50లక్షలు మంజూరు చేసే అవకాశం ఉంది. వీటితో రోజూ పెసర్లు, పల్లీలు, బెల్లం, చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బెర్లు, శనగలు, ప కోడి అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచే ప్రారంభిస్తే ప్రయోజనం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. -
బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్
మల్హర్: తాడిచర్ల ఓపెన్కాస్ట్–2 ప్రాజెక్ట్ ఏర్పాటుకు మండలంలోని మల్లారం (దుబ్బపేట) కస్తూర్భా సమీపంలోని వ్యవసాయ భూముల్లో జీహెచ్ఐ కంపెనీ బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్ చేస్తుంది. జీహెచ్ఐ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యవసాయ భూమిలో ఇప్పటికే 450 మీటర్ల లోతులో డ్రిలింగ్ చేపట్టారు. మరో 200 నుంచి 300 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించవచ్చని అంటున్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్రావుపల్లిలో, తాడిచర్ల శివారులోని పెద్దతూండ్ల ఆరెవాగు వంతెన సమీపంలో డ్రిల్లింగ్ వేశారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షకు 159 మందికి గాను 113 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షకు 50 మంది విద్యార్థులకు 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడిమంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: సంక్రాంతి సెలవుల సందర్భంగా దొంగతనాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీసు గస్తీని మరింత పటిష్టం చేస్తామన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సొంత ఊర్లకు వెళ్లే ముందు విలువైన వస్తువులు, నగదు, బంగారం లాంటివి ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే వారు ముందస్తుగా స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందిస్తే రాత్రి వేళల్లో నిఘా ఉంచడంతో పాటు పోలీసు బృందాలు గస్తీ చేపడుతాయన్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూమిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
వామ్మో డేంజర్..
మల్హర్ మండలం కొయ్యూరు నాగులమ్మ సమీపంలో బొగ్గుల వాగు వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన సైడ్ వాల్ను గతంలో లారీ ఢీకొట్టడంతో వాల్ సగభాగం కూలిపోయింది. వంతెన మీదుగా మంథని–కాటారం ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 28న నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీ పెరగనుంది. జిల్లా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనకు సైడ్ వాల్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – మల్హర్ -
పనుల ప్రారంభమెప్పుడో..?
● పలు మండలాల్లో మినీ జాతరలు ● సౌకర్యాలు కల్పించాలని భక్తుల వేడుకోలుభూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: జిల్లాలోని మినీ మేడారం జాతరలపై రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, ప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రతీ జాతర సమయంలో నిధులు కేటాయించే ప్రభుత్వం ఈ సారి ఇప్పటివరకు కేటాయించలేదు. చాలా సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమ్మక్క, సారలమ్మ మినీ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ జాతరలకు వేలాది మంది భక్తులు హాజరవుతున్నారు. వీరికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు మాత్రం విఫలమవుతున్నారు. ప్రతీ రెండేళ్లకోకసారి ఎంతో వైభవంగా జరిగే సమ్మక్క–సారలమ్మ మినీ జాతర పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జాతరకు ఇంకా 18 రోజుల సమయమే మిగిలి ఉంది. జాతర జరిగే ప్రాంగణం చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత జాతరలకు నామమాత్రంగా.. గత నాలుగు జాతరలకు నిధులు అంతంత మాత్రమే కేటాయించారు. జాతరకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని చిన్న జాతరల అభివృద్ధికి 2016లో అప్పటి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఏడు సంవత్సరాల క్రితం ప్రతీ జాతర వద్ద మౌలిక వసతులకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయించారు. గతంలో చేసిన పనులకు టెండర్లు దక్కిందుకున్న కాంట్రాక్టర్లు జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. నమ్మక్క, సారలమ్మ గద్దెలకు చేసిన కాంక్రీటు పనులు, సీసీ రోడ్లు, కల్వర్టులు, కరెంట్ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలను నామామత్రంగా చేశారు. ప్రస్తుతం జాతర ప్రాంగణాలు పిచ్చి మొక్కలు, వ్యర్థాలతో నిండిపోయాయి. కనీసం పిచ్చి మొక్కలు తొలగించడానికి కూడా నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించాలి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ స్పందించి ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్న జాతరలో భక్తులకు కావాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు తయారుచేసి నిధులు మంజూరు చేయాలి. మరుగుదొడ్లు, కరంట్, తాగునీరు, స్నానాలు చేసేందుకు బోర్లు, ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మినీ జాతరలు జరిగేవి ఇక్కడే.. భూపాలపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. భూపాలపల్లి మండలంలోని గుర్ర పేట, కమలాపూర్, చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం–చైన్పాక గ్రామాల శివారులోని పూరేడుగుట్ట, మొగుళ్లపల్లి–ముల్కలపల్లి గ్రామాల మధ్య చలివాగు పక్కన, రేగొండ మండలంలోని తిరుమలగిరి–జగ్గయ్యపల్లి గ్రామాల్లో జరుగనుంది. -
ఇసుక అక్రమ డంపులు
మల్హర్: మండలంలో తాడిచర్ల (కాపురం రెవెన్యూ) శివారులోని తాడిచర్ల–పెద్దతూండ్లకు వెళ్లే ప్రధాన రహదారి (పెద్దతూండ్ల ఆరెవాగు) సమీపంలో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారు. పెద్దతూండ్ల ఆరెవాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంపు చేశారు. సుమారు 35 నుంచి 40 ట్రాక్టర్ల మేర ఇసుక డంపులు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ రవికుమార్ను వివరణ కోరగా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వలేదని.. రెవెన్యూ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆర్ఎంఓల నియామకం భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నలుగురు ఆర్ఎంఓలను నియమించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రాజేష్ ఆర్ఎంఓ–1, డాక్టర్ నాగా శశికాంత్ ఆర్ఎంఓ–2, డాక్టర్ మృదుల అరుణ్ ఆర్ఎంఓ–3, డాక్టర్ పవన్కుమార్ ఆర్ఎంఓ–4లను నియమించి వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్ లోయర్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్, లోయర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో ప్రతిభ కాళేశ్వరం: కామారెడ్డి జిల్లాకేంద్రంలో జనవరి 7, 8, 9 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో మహదేవపూర్ గ్రీన్వుడ్ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. సంతోషపు నైసి, వెన్నపురెడ్డి మధుప్రియ రీక్రియేషనల్ మాథమెటికల్ థింకింగ్ విభాగంలో ‘గోల్డెన్ రేషియో’ ప్రాజెక్ట్కు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం చీర్ల శ్రీనివాస్రెడ్డి గైడ్ టీచర్ మొగిలి విద్యార్థులను అభినందించారు. గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలుములుగు రూరల్ : ఆది దేవత గట్టమ్మ తల్లిని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో కొలువైన గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హేమాచలుడి వరపూజకు ఆహ్వానం మంగపేట : మల్లూరు హేమాచల క్షేత్రంలో ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవం (పెళ్లిచూపులు) కార్యక్రమానికి రావాలని ఈఓ రేవెల్లి మహేష్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ప్రతి ఏటా హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శనివారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలు, బందోబస్తు ఏర్పాట్లు, ప్రొటోకాల్కు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. సీఎం పర్యటన సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో మ్యూజియం, ఆర్టీసీ పార్కింగ్ స్థలాలు, టెంట్ సీటీ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఉపాధి హామీని కొనసాగించాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి అర్బన్: ఉపాధి హామీ పథకం పేరు మార్చకుండా యథావిధిగా కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్తో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను.. నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హమీలతో పాటు ప్రస్తుతం చేపడుతున్న శంకుస్థాపనల అభివృద్ధి పనులు 2028 సంవత్సరం నాటికి పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగనని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి బైపాస్ రోడ్డుకు డీపీఆర్ టెండర్లు జరుగుతున్నాయని అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మధు, జంపయ్య, రాంచంద్రయ్య, సాంబమూర్తి, రమేష్, అనిల్, అశోక్, శ్రీలత, రజిత, కిషోర్రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం కప్.. వేళాయె..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో విడత క్రీడాపోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో షెడ్యూల్ను ప్రకటించింది. మొదటగా గ్రామ పంచాయతీ స్థాయిలో 17నుంచి క్రీడలు మొదలుపెట్టి రాష్ట్రస్థాయి పోటీలు ఫిబ్రవరి 26న ముగించనుంది. మొదటి విడత అట్టహాసంగా నిర్వహించిన సీఎం కప్ క్రీడలను మరోసారి అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ, క్రీడా సంఘాలు, రాష్ట్రస్థాయి క్రీడా అధికారులతో జూమ్ సమావేశాలు నిర్వహించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్తో పాటు పారా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా టార్చ్ ర్యాలీలు.. క్రీడల సన్నాహాల కోసం టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని జిల్లా క్రీడల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జనవరి 8 నుంచి 17 వరకు గ్రామ, మండల స్థాయిల్లో టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లోని గ్రామాలు, మండలాలను కవర్ చేసేలా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రముఖక్రీడాకారులు, మాజీ అథ్లెట్స్, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిదులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా ఒలింపిక్ సంఘాలు, క్రీడా సంఘాలు, యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. 17 నుంచి మొదలుకానున్న క్రీడలు ఈ నెల 17 నుంచి సీఎం కప్ 2వ విడత క్రీడలను ప్రారంభించనున్నారు. మొదటగా గ్రామ పంచాయతీ స్థాయిలో 17 నుంచి ఈ నెల 22 వరకు ఆరు రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. అనంతరం మండలస్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు జిల్లాస్థాయి క్రీడలను నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలను ఫిబ్రవరి 19 నుంచి 26వరకు 8 రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. సుమారు 44 క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్ 2వ విడత పోటీలు సుమారు 44 క్రీడాంశాలలో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో తదితర గ్రామీణ స్థాయి క్రీడలతో పాటు ఇతర క్రీడలను సైతం నిర్వహించనున్నారు. పారా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీలను సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలలో క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. మొదటి విడత సీఎం కప్ అందరి భాగస్వామ్యంతో జిల్లాలో విజయవంతం కావడంతో మరోసారి సీఎం కప్ను ఉత్సాహంగా నిర్వహించేందుకు జిల్లా క్రీడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. రెండో విడత సీఎం కప్ పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు సీఎం కప్ పోటీల నిర్వహణ ఉంటుంది. గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నాం. మండల, జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను పంపనున్నాం. సీఎం కప్ పోటీల నిర్వహణలో అందరినీ భాగస్వామ్యం చేసి విజయవంతం చేస్తాం. – సీహెచ్ రఘు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సుమారు 44 క్రీడాంశాలు.. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు గ్రామ పంచాయతీ, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహణ -
బొమ్మాపూర్ క్వారీ లోడింగ్ నిలిపివేత
కాళేశ్వరం: జిల్లాలోని మహదేవపూర్ మండలంలో ఇసుక క్వారీల్లో అక్రమ లోడింగ్ పేరిట లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా శుక్రవారం బొమ్మాపూర్ క్వారీలో లోడింగ్ను సంబంధిత శాఖ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. వారం రోజులుగా సాక్షి పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించి అంతర్గతంగా నిఘా వర్గాలతో విచారణ జరిపారు. లోడింగ్ పేరిట అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు తేలడంతో పాటు ఫిర్యాదులు రావడంతో క్వారీకి సంబంధించిన అగ్రిమెంట్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. శుక్రవారం మరో రెండు క్వారీల్లో పలుగుల–8, పూస్కుపల్లి క్వారీల్లో లోడింగ్ యథావిధిగా జరుగుతుంది. ఈ విషయంపై టీఎండీసీ పీఓ రామకృష్ణను ఫోన్లో సంప్రదించగా.. తమకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో బొమ్మాపూర్ క్వారీ అగ్రిమెంట్ పూర్తి కాగా, అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ను నిలిపివేసినట్లు తెలిపారు. హన్మకొండ: మీటర్లు మార్చి విద్యుత్ చౌర్యానికి పాల్పడిన టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్ ఉద్యోగి చిల్లా శ్రీరామ్ను భూపాలపల్లి ఎమ్మార్టీ డీఈ సదానందం శుక్రవారం సస్పెండ్ చేశారు. డిసెంబర్ 16న డీపీఈ ఏఏఈ ఎల్.రాజమౌళి హనుమకొండ న్యూ రాయపురాలోని సిల్లా సుజాత ఇంటిని తనిఖీ చేశారు. ఆ సమయంలో మంజూరైన మీటర్కు, అమర్చిన మీటర్కు తేడా ఉన్నట్లు గుర్తించి, వినియోగదారురాలను విచారించారు. దీంతో ఆమె భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పని చేస్తున్న తన కుమారుడు చిల్లా శ్రీరామ్తో ఫోన్లో మాట్లాడారు. అదే ఫోన్ను తనిఖీకి వచ్చిన అధికారికి ఇవ్వగా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఇంట్లో భద్రపర్చిన అసలు మీటరును తీసుకొచ్చి తనిఖీ అధికారికి చిల్లా సుజాత అప్పగించారు. వెంటనే ఈ విషయాన్ని ఆపరేషన్ యాదవనగర్ ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వచ్చి మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకు రూ.1,12,200 జరిమానా విధించారు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పని చేస్తున్న శ్రీరాం మీటర్ మార్చినట్లు తెలిసినా సంబంధిత డీఈ 25 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి. ఈ నెల 9న సాక్షిలో ‘సొంత సంస్థకు కన్నం’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సంబంధిత డీఈని ఎందుకు చర్య తీసుకోలేదని మందలించినట్లు తెలిసింది. దీంతో ఎట్టకేలకు విద్యుత్ చౌర్యానికి కారకుడైన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన ఆలయ పనులు రేగొండ: కొడవటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై శుక్రవారం కొడవటంచ ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి పునఃప్రతిష్ట, స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి రానున్నట్లు తెలిపారు. అంతకుముందు బాలాలయంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఆలయ ఛైర్మన్ భిక్షపతి, ఈఓ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పర్యాటకుల జోష్.. గోవిందరావుపేట: మండలంలోని లక్నవరంలో పర్యాటకులు శుక్రవారం సందడి చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు లక్నవరం సరస్సుకు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ప్రకృతి అందాలను చూసి తరించారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ పాయింట్కు చేరుకున్నారు. -
మొక్కజొన్న సాగుకే మొగ్గు
రేగొండ: యాసంగి సీజన్లో రైతులు మొక్కజొన్న పంట సాగుపై మొగ్గు చూపడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది. నీటి సౌకర్యం ఉన్న రైతులు మొక్కజొన్నపైనే మక్కువ చూపుతున్నారు. రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల వ్యాప్తంగా దాదాపు 5వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అడవి పందుల బెడద ఉన్నప్పటికీ వాటి నుంచి రక్షించుకునేందుకు సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకుని మరీ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు, కూలీల ఖర్చు తక్కువ, స్థిరమైన ఆదాయం రావడంతో రైతులు ఈ పంటలను ఎంచుకుంటున్నారు. కూరగాయల సాగుకు కూలీ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. దీంతో పాటు స్థిరమైన ఆదాయం రాకపోవడంతోనే రైతుల చూపు ఆదాయం వచ్చే పంటలపై మరలుతోంది. ఖరీఫ్ నుంచి రబీలో.. ఒకప్పుడు ఖరీఫ్లో మొక్కజొన్న సాగు చేసేవారు. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు ఇబ్బందిగా మారుతుండటంతో రబీలో సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఈ పంటకు మార్కెట్లో సరైన డిమాండ్ ఉంది. మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ.2,350 ధర పలుకుతోంది. రబీలో దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తుండడంతోనే దీనిపై మక్కువ చూపుతున్నారు. మండల పరిఽధిలో.. రేగొండ మండల పరిధిలోని కనిపర్తి, నాగుర్లపల్లి, లింగాల, రేపాక, తిరుమలగిరి కొత్తపల్లిగోరి మండల పరిధిలో కొత్తపల్లిగోరి, నిజాంపల్లి, జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి తదితర గ్రామాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం మద్దతు ధర రూ.2,350 ఉండగా, రేగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. రైతులు మార్కెట్కు తరలించకుండా, దళారుల పాలు కాకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్లే ప్రస్తుతం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలం పత్తి సాగులో ఆశించిన దిగుబడులు రాలేదు. దీంతో యాసంగిలో ఐదు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నాను. ఇతర పంటల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. తక్కువ పెట్టుబడితో మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రైతులకు అవగాహన కల్పించాలి. – వన్నాల శివాజీ, రైతు, కొత్తపల్లిగోరి యాసంగిలో పెరిగిన సాగు విస్తీర్ణం ఆసక్తి చూపిస్తున్న రైతులు -
గొంతెమ్మ గుట్టపై పురాతన చిత్రకళ
మల్హర్(కాటారం): కాటారం మండలం ప్రతాపగిరి శివారులో ఉన్న గొంతెమ్మ చిన్న గుట్టపై పురాతన చిత్రకళ ఆనవాళ్లను గుర్తించినట్లు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తతంగా పర్యటించి ఆది మానవుల చరిత్రను, సంస్కతిని రికార్డు చేస్తున్న డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, టీం సభ్యులతో కాటారంలో గొంతెమ్మ గుట్టను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్న గుట్ట కుంతి దేవికి అంకితం చేయబడిందని.. అందుకే గొంతెమ్మ గుట్టగా పిలుస్తారని పేర్కొన్నారు. కృష్ణుడు, సుభద్ర, కుంతీదేవి కొంతకాలం ఇక్కడ జీవించారని స్థల పురాణం చెబుతుందన్నారు. 18.62495 అక్షాంశం, 80.01390 రేఖాంశముల మధ్య ఉన్న పడగ రాయి కింద ఆది మానవులు వేసిన పల్లికాయను పోలి ఉన్న గంటు చిత్రం (పెట్రోగ్లిప్) ఉందన్నారు. ఇది పల్లి చేను పీకినప్పటి దశను సూచిస్తుందని చెప్పారు. గుట్టపైకి ఎక్కే క్రమంలో డిస్కవరీ టీం సభ్యులకు మధ్య శిలాయుగానికి చెందిన సూక్ష్మ రాతి పనిముట్లు లభించాయని తెలిపారు. ఈ పనిముట్లను బట్టి ఈ చిత్రం సామాన్య శక పూర్వం 10 నుంచి 5 వేల మధ్య కాలానికి చెందినదై ఉంటుందని ఆయన వెల్లడించారు. పడగ రాయి కింద ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఆలయం ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని షెల్టర్ గానూ, సెంట్రీ పాయింట్ గాను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు. అప్పుడే ఇక్కడ శివలింగమును స్థాపించినట్లు తెలుస్తోందన్నారు. గుడి ముందు ఉన్న పాదాలను కృష్ణుని పాదాలుగా భావిస్తారని అన్నారు. గుడి వెనుక గోడలో మహిషాసుర మర్ధిని శిల్పం, గుడి లోపల పై శిలకు పువ్వు శిల్పం ఉందని చెప్పారు. పువ్వు శిల్పం సౌభాగ్యం, లక్ష్మీదేవికి ప్రతీక అన్నారు. ఈ పల్లికాయ చిత్రమే లక్ష్మీదేవికి ప్రతీకగా భావించి ఈ గొంతెమ్మ గుట్టపై ప్రతి ఏటా లక్ష్మీదేవర కల్యాణం ఘనంగా చేస్తారని వివరించారు. గ్రామస్తులంతా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క లక్ష్మీదేవరతో ఊరేగింపుగా బయలుదేరి గొంతెమ్మ గుట్టకు చేరుకుంటారని చెప్పారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసులు, స్థానిక గ్రామాల వాళ్లు పాల్గొంటారని అన్నారు. ఈ క్రమంలో భక్తులు తమ కోరికలు నెరవేరిన సందర్భంలో పడగ రాయి కింద పాదాల చిత్రాలను వేయించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. గుట్టపై మూడు దశల్లో నిర్మించిన కోట గోడలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పారం రాజు, అడ్లకొండ రాజేష్, వినయ్ గోలి, నాగరాజు, మహేశ్, అనిరుద్, స్థానిక యువకులు ఉన్నారు. వారసత్వ సంపదగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి -
సహకార ఎన్ని‘కలే’నా..?
సొసైటీ పాలకవర్గ పదవులు నామినేటెడ్ చేసే యోచనలో ప్రభుత్వంభూపాలపల్లి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రతిపాదికన ఎన్నుకుంటారనే చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఇటీవల ఆయా పాలకవర్గాలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు డీసీసీబీ చైర్మన్, పాలకవర్గాన్ని ఎన్నుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకార సొసైటీల పదవులను నామినేటెడ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలియడంతో నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారు. గ్రామీణ స్థాయిలో డిమాండ్ ఉన్న పదవి కావడంతో సహకార ఎన్నికలు హోరాహోరీగా సాగేవి. కానీ ప్రస్తుతం పదవులను నామినేట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వరంగల్, హైదరాబాద్ దారిపట్టిన నాయకులు తమ పేర్లు నామినేట్ చేయాలని కోరుతున్నారు. కొత్త సొసైటీల కోసం.. జిల్లాలో సహకార సంఘాలను పెంచేందుకు ఇప్పటికే కసరత్తు జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 11 సహకార సొసైటీలు ఉన్నాయి. కానీ సహకార పదవులు నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వనున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన రైతులు అఖిల పక్షాల ఆధ్వర్యంలో తమ గ్రామం కేంద్రంగా సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు టేకుమట్ల, కొత్తపల్లిగోరి మండలాల్లో మండలం పేరిట సొసైటీ లేదు. ఇక్కడ సొసైటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం చేసింది. అధికార పార్టీ నాయకుల మధ్య డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులతో పాటు అన్ని సహకార సంఘాల్లో చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోసం పోటా పోటీ నెలకొన్నది. జిల్లాలో మరికొన్ని గ్రామాలకు సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో చిగురిస్తున్న ఆశలు జిల్లా నాయకుల మద్దతు కూడగట్టుకునే యత్నంపీఏసీఎస్లను రద్దు చేసిన తరువాత నామినేటెడ్ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్ల నియమాకాలు చేపడుతారని ఊహాగానాలు రావడంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సహకార సంఘాల పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సహకార ఎన్నికల్లో సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఎన్నికలు జరిగేవి. -
సొంత సంస్థకు కన్నం..!
వాతావరణం జిల్లాలో ఉదయం తీవ్ర మంచు ఉంటుంది. మధ్యాహ్నం చల్లని గాలులు వీస్తాయి. రాత్రివేళ చలితో పాటు మంచు కురుస్తుంది.హన్మకొండ: విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా చూడాల్సిన ఓ వ్యక్తి కక్కుర్తి పడి సంస్థ ఆదాయానికి కన్నం వేశాడు. టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్లోని ఎమ్మార్టీ డివిజన్కు చెందిన ఓ ఉద్యోగి తన గృహానికి టెస్టింగ్ మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఎన్పీడీసీఎల్ డీపీఈ విభాగం తనిఖీల్లో సర్వీస్ నంబర్కు మంజూరు చేసిన మీటర్ నంబర్ తేడాగా ఉండడంతో మీటర్ మార్చిన బాగోతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హనుమకొండలోని రాయపురలో నివాసముంటున్నాడు. కరెంట్ బిల్లు తక్కువ వచ్చేందుకు అసలు మీటర్ స్థానంలో టెస్టింగ్ మీటర్ను మారుస్తున్నాడు. డీపీఈ విభాగం అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా రాయపురలోని ఆ ఉద్యోగి ఇంటిలోని మీటర్ను తనిఖీ చేయగా సర్వీస్ నంబర్కు, కేటాయించిన మీటర్ నంబర్ తేడాగా ఉండడం గమనించారు. కూపీలాగితే మీటర్ మార్చినట్లు వెలుగు చూసింది. అతనికి రూ.1.30 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఉద్యోగి ఏడాదికాలంగా మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అతనిపై టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్ సూపరింటెంటెండ్ ఇంజనీర్, ఎమ్మార్టీ డీఈలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టెస్టర్గా పనిచేస్తుండడంతో సులువుగా మీటర్ మార్పు.. సాధారణంగా గృహ విద్యుత్ వినియోగదారులు తమ మీటర్లలో లోపాలుంటే అందులోని వైఫ ల్యాన్ని గుర్తించడానికి రూ.200 ఆపరేషన్ డీఈ పేరుతో ఫీజు చెల్లించి సెక్షన్లో దరఖాస్తు చేసుకుంటాడు. ఈ మీటర్ను పరీక్షించేందుకు ఎమ్మార్టీ విభాగం ల్యాబ్కు పంపిస్తారు. ఇక్కడ టెస్టర్గా విధులు నిర్వహించే ఉద్యోగి ఆ మీటర్కు సాంకేతిక పరీక్షలు నిర్వహించి మీటర్ బాగుందా లేదో తేలుస్తాడు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో టెస్టర్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి టెస్టింగ్ కోసం వచ్చిన మీటర్లను తన ఇంటికి తీసుకెళ్లి తన మీటర్ స్థానంలో టెస్టింగ్ మీటర్ను అమరుస్తూ విద్యుత్ వాడుకుంటున్నాడు. రీడింగ్ తీయడానికి కొన్ని రోజుల ముందు యధావిధిగా పాత మీటర్ను అమర్చుతున్నాడు. ఈ మీటర్లో రీడింగ్ తక్కువ నమోదు అవుతుండడంతో బిల్లు కూడా తక్కువగా వస్తుంది. సొంతింటికి టెస్టింగ్ మీటర్ల వినియోగం ఎమ్మార్టీలో పనిచేస్తుండడంతో సులువుగా మీటరు మార్పు బిల్లు తీసేనాటికి సొంత మీటరు అమర్చుతున్న ఉద్యోగి డీపీఈ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమం -
సరిపడా యూరియా సరఫరా
భూపాలపల్లి: రాష్ట్రానికి కేంద్రం నుంచి సరిపడా యూరియా పంపిణీ అవుతుందని, కొంతమంది దళారులు కొరత సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు అన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం భూపాలపల్లికి వచ్చిన సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాంచందర్రావు మాట్లాడారు. పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం, గ్యాస్ సబ్సిడీ తదితర పథకాలన్నీ కేంద్రం ఇస్తున్నవేనని అన్నారు. భూపాలపల్లికి జాతీయ రహదారి మంజూరు చేశామని, ఎఫ్సీఐని పునరుద్ధరించి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కేటీపీపీ, సింగరేణి భూ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందలేదని చెప్పారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు సకాలంలో ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. గతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో అవినీతికి ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లాలో సుమారు వంద వార్డు స్థానాలు బీజేపీ కై వసం చేసుకోవడం హర్షనీయమన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద దేశంలోని అన్ని పట్టణాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి బీజేపీని ఆదరిస్తే భూపాలపల్లికి భారీగా నిధులు మంజూరు చేస్తామని రాంచందర్రావు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు వీరేందర్గౌడ్, నిషిధర్రెడ్డి, పాపయ్య, నారాయణరెడ్డి, యుగేందర్, గౌతమ్రావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు ఇబ్బందులు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు -
వ్యూహాలకు పదును
మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంమున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనున్నందున ఈ ఎన్నికల్లో గెలుపునకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించగా 12న తుది జాబితా వెలువరించనుంది. అనంతరం రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. – భూపాలపల్లి అర్బన్మున్సిపల్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన పార్టీకి సాధారణ ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని పార్టీల నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాల కోసం అధికార పార్టీ సహా ఇతర పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి. వారం రోజులుగా మున్సిపాలిటీలో పెండింగ్ పనులు, నూతన పనులకు నిధులు కేటాయించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ వార్డుల వారీగా బస్తీబాట నిర్వహిస్తోంది. ఖర్చును బట్టి టికెట్ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలరనే దాన్ని బట్టి టికెట్ కేటాయింపులకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆశావహులతో పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ వార్డుకు ఎంతమంది పోటీ పడుతున్నారనే విషయంపై స్పష్టత తెస్తున్నట్టు సమాచారం. పోటీ ఎక్కువగా ఉండే వార్డుల్లో గెలుపు కోసం ఎవరు ఎంత ఖర్చు చేయగలరని వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ.20లక్షలు ఖర్చు చేసేవారే పోటీలోకి దిగాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వారి వార్డుల్లో టికెట్ ఆశించే వారిని నొప్పించకుండా సర్దిచెప్పి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులకు కసరత్తులు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మినహా ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. వార్డుల వారీ రిజర్వేషన్లు సైతం ఖరారు కావడమే ఆలస్యం ఆయా వార్డుల్లో ఉన్న ఓటర్ల సంఖ్య గెలుపోటముల అంచనాలకు అనుగుణంగా పొత్తులుంటాయని, జాతీయ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ప్రభావం అంతగా ఉండదని, ఎన్నికపై ఓటర్లు వ్యక్తుల వ్యక్తిత్వానికే పట్టం కడతారనే ఆలోచనతో గెలుపే లక్ష్యంగా పట్టణంలో పొత్తులు ఉండే అవకాశముందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం ఎన్నికల పొత్తుపెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపనల్లో అధికార పార్టీ బిజీ బస్తీబాటలో బీఆర్ఎస్ పార్టీమున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనతో ఉన్న పలు పార్టీల నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆశావహుల సంఖ్య ఈ సారి ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపాలిటీపై పట్టున్న బీఆర్ఎస్కు చెందిన నేతలు అధిక శాతం మంది బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పొత్తుల ద్వారా లాభపడాలని సీపీఎం, బీజేపీ యోచిస్తుండగా సీపీఐ నుంచి మరికొంత మంది పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలామంది ఆయా పార్టీల నుంచి ఆశావహులు బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. -
ప్రథమ స్థానంలో నిలవాలి
భూపాలపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భూపాలపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సకాలంలో ఫొటో క్యాప్చర్ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించకుంటే రద్దు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణాలకు రుణ సదుపాయం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు లేని లబ్ధిదారులకు లక్ష రూపాయల సహాయం అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల ఖర్చులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిధుల సమస్య ఏమీ లేదని, బిల్లులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తే నిధులు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ప్రగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ డీఈ శ్రీకాంత్, అధికారులు ఉన్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్గా రాజ్కుమార్
చిట్యాల: రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్గా చిట్యాల మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజ్కుమార్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శంషాబాద్లో నిర్వహించిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో రావుల కృష్ణను నియమించారు. తన నియామకానికి కృషిచేసిన వారికి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు. మోడల్ ఉమెన్స్ గ్రామ పంచాయతీగా ఎడపల్లి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఎడపల్లి పంచాయతీ జిల్లాస్థాయిలో మోడల్ ఉమెన్స్ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. సర్పంచ్ మోతే నీలరాణిని మహారాష్ట్రలోని పుణేకు శిక్షణ కోసం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు తీసుకెళ్లారు. 8న గురువారం, 9న శుక్రవారం రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశంలో మహిళా సాధికారత, గ్రామాభివృద్ధి, ఉత్తమ పాలన విధానాలపై విస్తృతంగా జరగనున్న చర్చల్లో పాల్గొంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి 13 మంది ఎంపికయ్యారు. సర్పంచ్ను పలువురు అభినందించారు. రేపు లక్ష తులసి అర్చన కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామచంద్రస్వామి ఆలయంలో లక్ష తులసి అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 10న శనివారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. యువత భవిష్యత్ను మార్చేలా సీఎం కప్ రేగొండ: క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డీవైఎస్ఓ రఘు ఆధ్వర్యంలో క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో క్రీడలపై అవగాహన కల్పించేందుకు సీఎం కప్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దివ్య, ఎంఈఓ రాజు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత, సీఎంఓ రమేష్, ఏఎంఓ విజయ్పాల్ రెడ్డి, సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. బస్సు నడిపించాలని డీఎంకు వినతి కాళేశ్వరం: కాళేశ్వరం వయా మద్దులపల్లి మీదుగా చెన్నూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని మద్దులపల్లి సర్పంచ్ ఎల్పుల సరిత భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందుకు గురువారం వినతిపత్రం అందజేశారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వయా మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా మంచిర్యాల జిల్లా చెన్నూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని భూపాలపల్లిలో విన్నవించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు మూడు ట్రిప్పులు బస్సు సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేశారు. డీఎం సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ.. మద్దులపల్లి గ్రామపంచాయతీలో గురువారం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, కార్యదర్శి స్వాతి, వీఏఓ జాడి మొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: గురువారం సమ్మక్క రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు ఆరగించారు. -
వామ్మో.. సర్పంచ్ గిరి
కాళేశ్వరం: కొత్త సర్పంచ్లు గ్రామపంచాయతీల్లో నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మోస్తూ గ్రామ సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు బిత్తరబోతున్నారు. రెండేళ్లుగా కార్యదర్శులు తన డబ్బులను పెట్టి అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం పనుల కోసం సర్పంచ్లు స్వంతంగా రూ.లక్షలు పెట్టుబడులు పెడుతున్నారు. ఖర్చులు తడిసి మోపెడు.. గ్రామాల్లో రోజువారీ అవసరాలు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో కొంతమంది కొత్త సర్పంచ్లు లక్షల రూపాయలు స్వయంగా పెట్టుబడిగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీధిదీపాల బిల్లులు, నీటి మోటార్లు, చెత్త సేకరించే ట్రాక్టర్ల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వంటి ఖర్చులు సర్పంచ్లే భరించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని పలు పంచాయతీల సర్పంచ్లు ఇప్పటికే ఎన్నికల కోసం తెచ్చిన అప్పులు కట్టలేక.. పంచాయతీల్లో నిధుల లేమితో ఇటు మళ్లీ అప్పులు తీసుకురావాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కార్యదర్శులు అంతే.. రెండేళ్లుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు పాలన చేపట్టారు. దీంతో కార్యదర్శులు పూర్తిస్థాయిలో పంచాయతీ బాధ్యతలు తమమీద వేసుకున్నారు. నిధులు లేకపోయినా పనులు నిలిపివేయలేక తమ జేబుల నుంచి ఖర్చులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు. ఫలితంగా వారు అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. నిధులు వస్తే బిల్లులు వచ్చి అప్పులు తీర్చుకుంటామని ఎదురుచూస్తున్నారని తెలిసింది. స్పష్టత కరువు.. నిధులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడం, ఇప్పటికే చేసిన ఖర్చులు ఎలా తిరిగివస్తాయో తెలియక సర్పంచ్లు, కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బకాయిలను విడుదల చేసి గ్రామ పంచాయతీలకు ఊతమివ్వాలని, లేకపోతే గ్రామ పాలన పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని ప్రజాప్రతినిధులు ఆందోళన పడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం, ఇతర నిధులు కేంద్రం త్వరితగతిన విడుదల చేయాలి. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వస్తుంది. ట్రాక్టర్లకు మరమ్మతులు, వీధిదీపాలు, నీటిమోటార్లు, పారిశుద్ధ్యంపై ఖర్చులు పెరిగాయి. రెండేళ్ల తరువాత పంచాయతీలకు సర్పంచ్గా ఎన్నికై నిధుల సమీకరణకు కొత్తగా అప్పులు తీసుకుంటున్నాం. నిధుల విడుదల జరిగితే సర్పంచ్లకు ఊరట కలుగుతుంది. గ్రామంలో అభివృధ్ది జరుగుతుంది. – మాట్ల శ్రీనివాస్, సర్పంచ్, టేకుమట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూపు రూ.లక్షల పెట్టుబడులు పెడుతున్న కొత్త సర్పంచ్లు రెండేళ్లుగా కార్యదర్శులు ఖర్చులు పెట్టి అప్పులతో సతమతం కొత్త పంచాయతీలకు తడిసిమోపెడు.. -
పన్ను వసూళ్లపై నజర్
భూపాలపల్లి రూరల్: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివిధ రకాల పన్నులను ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.4,30,11,513 లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.1,05,95,987 (24.64 శాతం) వసూలు చేయగా రూ.3,24,15,526 వసూలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది వందశాతం వసూళ్లు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పన్నులు వసూలైతేనే నిధులు.. గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. పంచాయతీలు ఇంటిపన్ను, తాగునీటి పన్నుతో పా టు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాయి. ఈ మేరకు ఆయా గ్రామాల్లో కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే గ్రామ అవసరాలకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వ పరంగా ఎస్ఎఫ్సీ ఆర్థిక సంఘం నుంచి నిధులతో పాటు పలు సందర్భాల్లో పన్నుల రూపేణ వచ్చే నిధులు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వందశాతం పన్ను వసూలు చేసిన గ్రామాలకు మాత్రమే ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో పంచాయతీలు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లను కార్యదర్శులు అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 24.64 శాతం వసూలు చేశారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. వచ్చిన ఆస్తిపన్ను వివరాలను ఈ–వెబ్పైట్లో నమోదు చేస్తున్నారు. ఈ వెబ్సైట్లోని వివరాల ఆధారంగా కలెక్షన్ బ్యాలెన్స్ (డీసీబీ) పత్రాలను ప్రింట్ తీసి ఈఓపీఆర్డీలు కార్యదర్శులకు అందజేస్తారు. అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఈ–పంచాయతీ వెబ్సైట్లో నమోదు చేయడం ద్వారా పన్ను వసూళ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంటింటికీ తిరుగుతున్న కార్యదర్శులు ఇప్పటివరకు 24.64 శాతం మాత్రమే.. జిల్లాలో 248 పంచాయతీలురెండేళ్లుగా 90శాతంపైగా పన్నులు వసూళ్లు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరం కూడా వందశాతం వసూలు లక్ష్యంగా కృషి చేస్తున్నాం. గత నెలరోజులు కార్యదర్శులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించాం. ప్రతీరోజు అధికారులు, కార్యదర్శులతో గ్రూప్ కాల్స్ చేస్తున్నాం. – శ్రీలత, డీపీఓ -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొర్లవీడులో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఫర్నిచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం హెచ్ఎం అనిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్ బెంచీలు, సైన్స్ లాబరేటరీ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, ఫర్నిచర్ అందించి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తూ పరోక్షంగా విద్యార్థుల ప్రగతికి సహకార అందిస్తున్నారన్నారు. వారి సేవలు మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని కోరారు. ట్రస్ట్ రిసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ లీల సుజిత్ మాట్లాడుతూ భవిష్యత్లో దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థుల కోసం సైకిళ్లు అందజేస్తామన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ భాస్కర్, సర్పంచ్ మందల లావణ్య, సంస్థ ప్రతినిధులు పింగిలి విజయపాల్ రెడ్డి, రమేష్, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సుభాకర్ రెడ్డి, వంశీ, కుమారస్వామి, శంకర్రావు, వాసుదేవ్, నవనీత్ మాలతి, రియాజ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు ఊరట్టం గ్రామ పంచాయతీలో రేపు (9వ తేదీన) తైబజారు ఓపెన్ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొమరం శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఊరట్టం, కొత్తూరు, కన్నెపల్లి గ్రామాల పరిధిలో గల దుకాణాలకు వేలం పాట ఉంటుందని వివరించారు. జీపీలో ఉదయం 10: 30 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ. 50వేల డిపాజిట్ సొమ్మును జీపీ కార్యాలయంలో చెల్లించాలని వివరించారు. -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరియా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వి.పి.గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
గురుకులం పిలుస్తోంది..
మొగుళ్లపల్లి: ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. 5 నుంచి 9వ తరగతిలో చేరే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ గురుకుల విద్యాలయాలు ఎంతగానో దోడ్పడుతున్నాయి. ఆంగ్ల మాద్యమంలో బోధిస్తూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన సీటు కేటాయించనున్నారు. జిల్లాలోని కాటారం, భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ గురుకులాల్లో అడ్మిషన్ పొందేందుకు అర్హత పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన సర్టిఫికెట్లు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ లేదా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, కులం, ఆదాయం జిరాక్స్, పాస్ఫొటోతో సమీప మీసేవా కేంద్రంలో సంప్రదించాలి. గ్రామీణ ప్రజల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రజల వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులు. గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన ఉంటుంది. గురుకులాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. అన్ని పత్రాలతో మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఎస్.శారద, ఎంజేపీ ప్రిన్సిపాల్, మొగుళ్లపల్లిఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీజీసెట్. సీజీజీ. జీఓవీ. ఇన్ అనే వెబ్సైట్ లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 21వ తేదీ వరకు గడువు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష జిల్లా వ్యాప్తంగా 7 గురుకులాలు -
మందుల కొరత లేకుండా చూసుకోవాలి
మల్హర్: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని జిల్లా వై ద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు. ఈ మే రకు మండలంలోని అన్సాన్పల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని పల్లె దవాఖానాను బుధవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రి కార్డులను పరిశీలించి, స్టేట్, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం వివరాలు, ఇమ్యూనైజేషన్ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖానాలో మందుల నిల్వలను ఎప్పటికప్పడు సరిచూసుకోని తె ప్పించుకోవాలన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, డీడీఎం మధుబాబు, డాక్టర్ కె. ప్రత్యూష, ఏఎన్ఎం, ఆశలు పాల్గొన్నారు. మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణానికి చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని దామెరకుంట గ్రామంలో బుధవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో 6.02 ఎకరాలు, మల్లారంలో 17.15, గూడురులో 6.01 ఎకరాలు, జాదరావుపేటలో 5.04 ఎకరాలు మొత్తం దామెరకుంట క్లస్టర్ పరిధిలోని 34.22 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదివి వినిపించారు. అలాగే పలువురి రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ వెంకన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఓ పంక్షన్ హాల్లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు అవగాహనతో పాటు బా ధ్యతాయుత పౌరులుగా వ్యవహారించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయాలన్నారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీలు, అనువాంచిన లింక్లు, సోషల్ మీడియా హ్యాకింగ్పై అవగాహన కల్పించారు. ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీఒక్కరూ హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీఓ సంధాన్, సీఐలు, ఎస్సైలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొగుళ్లపల్లి/ చిట్యాల: గ్రంథాలయాల్లో సమయపాలన పాటించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. బుధవారం మొగళ్లపల్లి, చిట్యాల మండలకేంద్రాల్లోని గ్రంథాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రంథాలయం అనేది చాలా విలువైనదని, రోజు గ్రంథాలయాలకు వచ్చే అలవాటు చాలా మందికి ఉంటుందన్నా రు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రంథపాలకురాలు రాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, బుర్ర వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం నుంచి చలి ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తుంది. పూరేడు గుట్ట జాతరలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి. వెంచరామి నుంచి జాతర వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చొరవ తీసుకోవాలి. గతంలో జాతర ఏర్పాట్లకు రూ.30 లక్షల నిధులు కేటాయించారు. శాశ్వత పనులు చేపట్టాలి. రూ.50లక్షల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కోరుతున్నా. – కాసు రమ, వెంచరామి సర్పంచ్ పూరేడు గుట్ట జాతర పనులు రెండు రోజుల్లో ప్రారంభిస్తాం. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. భక్తులకు లోటుపాట్లు లేకుండా అధికారులతో కలిసి సమష్టిగా పని చేస్తాం. – గీతారెడ్డి, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ -
పట్టింపేది?
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026● దారులన్నీ గుంతలమయం ● 22 రోజుల్లో జాతర.. ● నేటికీ ప్రారంభం కాని పనులు ● పలు జిల్లాల నుంచి రానున్న భక్తులుచిట్యాల: మండలంలోని వెంచరామి శివారులోని పూరేడు గుట్ట వద్ద శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర ప్రతీ రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా జరుగుతుంది. జాతరకు కేవలం 22 రోజుల సమయం మాత్రమే ఉన్నా కనీసం ఇప్పటి వరకు పనులేవీ ప్రారంభం కాలేదు. జాతరకు ప్రతీ యేటా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పనులకు మోక్షం కలగడం లేదు. -
నిద్ర మత్తులో ‘నిఘా’
● ఇసుక అక్రమ వసూళ్లపై గప్చుప్ ● విజిలెన్స్ బృందాల జాడెక్కడకాళేశ్వరం: జిల్లాలో ఇసుక అక్రమ వసూళ్లపై నిఘా, విజిలెన్స్ బృందాలు నిద్రమత్తులో ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక రీచులలో జరుగుతున్న బహిరంగ అక్రమ దందాపై సంబంధిత శాఖలు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు విజిలెన్స్, నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. కాంట్రాక్టర్ల సిబ్బంది ఒక్కో క్వారీలో రోజుకు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. టీజీఎండీసీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వారికో ‘లక్కీ లైన్’ సంబంధిత శాఖల నిఘా, విజిలెన్స్ అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర పట్టణాల్లో నివసిస్తూ కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే ఆధారపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వారానికి రెండుసార్లు వస్తుండడంతో.. ఫలితంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఇది లూప్లైన్ కాదు.. ఒక లక్కీ లైన్గా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి అక్రమ ఇసుక వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని పలువురు కోరుతున్నారు. టీజీఎండీసీ అధికారులు, అధికారులు దృష్టి సారిస్తే అక్రమ వసూళ్లు ఆగిపోయే అవకాశం ఉంది. పూస్కుపల్లి క్వారీ నిలిచినట్లు తెలిసింది. మిగితా, పలుగు–8, బొమ్మాపూర్ క్వారీల్లో లోడింగ్ జరిగింది. ఇసుక రీచులలో ఎక్స్ట్రా బకెట్ దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఆదేశాలు జారీచేసిన సమయంలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా మూడు విడతల్లో విధులు నిర్వర్తించి అక్రమాలకు కట్టడి చేయగలిగాయి. ప్రస్తుతం మహదేవపూర్ మండలంలోని బొమ్మపూర్, పూసుకుపల్లి, పలుగుల–8 ఇసుక క్వారీ రీచులలో పరిస్థితి మారింది. సంబంధిత కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్ల నుంచి ఒక్కో వాహనానికి రూ.2,000 నుంచి రూ.3,000 వరకు లోడింగ్ పేరిట వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవని సమాచారం. -
చైనా మాంజాతో పక్షులకు ప్రమాదం
● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ భూపాలపల్లి: సంకాంత్రి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా వాడటం వలన మనషులతో పాటు పక్షులకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) డాక్టర్ ప్రభాకర్ అన్నారు. మాంజా వాడితే కలిగే నష్టాలను వివరించి.. వాల్పోస్టర్ను మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చైనా, సింథటిక్, గ్లాస్తో తయారు చేసిన మాంజాను జాతీయ హరిత ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఈ మాంజా దారం తగిలి ప్రతీ ఏటా మనుషులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. ఎవరైనా ఈ మాంజా విక్రయించినా, వినియోగించినా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎఫ్డీఓ అప్పలకొండ, ఎఫ్ఆర్ఓ నరేష్, అటవీశాఖ అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
నేడు మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. 9న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9న సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పంతకాని సమ్మయ్య, పూతల సమ్మయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్–8 నుంచి అండర్–20 లోపు బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల జిల్లా అధికారులు జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను మంగళవారం గుర్తించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు పోలీసు, రవాణా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖ అధికారులు రేగొండ మండలం కొప్పుల క్రాస్రోడ్ నుంచి మహదేవ్పూర్ జంక్షన్ వరకు పర్యటించి రోడ్డు ప్రమాదాలు జరిగే 10 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలు, రహదారి లోపాలు, సైన్ బోర్డుల లేమి, మలుపులు, లైటింగ్ సమస్యలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని, అవసరమైన మరమ్మతులు, సైన్ బోర్డుల ఏర్పాటు, స్పీడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఓ మహ్మద్ సంధాని, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఐరాడ్ డీఆర్ఎం లక్ష్మణ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయగా.. 8 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మొగిలి రాజయ్యకు చెందిన గొర్రెల పాకలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వీధి కుక్కలు లోపలికి చొరబడ్డాయి. కరవడంతో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో 50వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు మొగిలి రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పులి కాదు.. అడవి పిల్లి రేగొండ: మండలంలోని మడతపల్లి శివారులోని రైస్ మిల్ వద్ద మంగళవారం పులి తిరుగుతున్నట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. దీంతో అటవీ సెక్షన్ అధికారి ప్రవీణ్ సిబ్బందితో కలిసి రైస్ మిల్లు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పాదముద్రలను పరిశీలించారు. అడవి పిల్లిగా నిర్ధారించారు. ఫోన్లో వీడియో తీసిన మిల్లు కార్మికుడిలో మాట్లాడి వివరాలు సేకరించారు. మిల్లు పక్క నుంచి జంతువు వెళుతుండగా అతి సమీపంలో నుంచి వీడియో తీసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు గీత, రాజేందర్ పాల్గొన్నారు. -
అభ్యంతరాల్లో మచ్చుకు కొన్ని..
● భూపాలపల్లి మున్సిపాలిటీ 22 వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో 2–150/1 నుంచి 2–150/14డీ ఇంటి నంబర్పై 86 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా ఇదే కాలనీలో 20133/1, 2–134/1 ఇంటినంబర్లలో 42 ఓట్లు నమోదు చేశారు. ● రెండేళ్ల క్రితం ఇతర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిన వారిని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేశాలపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు కేటాయించారు. ఇందులో సుమారు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గృహాల్లో ప్రస్తుతం ఉంటున్న వారి పేర్లు భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్, కాశీంపల్లి, జంగేడు, కారల్మార్క్స్కాలనీ, కృష్ణానగర్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల ఓటరు జాబితాలో ఉన్నాయి. ● నర్సంపేట మున్సిపాలిటీలో సోమవారం వరకు 19 అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వచ్చాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారి వేర్వేరు వార్డుల్లో వచ్చాయని రెండు, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లాయని మూడున్నాయి. అలాగే, ఓట్లు లేకుండా పోయిన వారు ఒకటి, మృతుల పేర్లున్నాయని నాలుగు... ఇలా అభ్యంతరాలున్నాయి. ● జనగామ మున్సిపాలిటీ పరిధిలో 30 దరఖాస్తులు రాగా.. ఇందులో ఐదో వార్డు, 8వ వార్డులో పక్క వార్డులకు సంబంధించిన అదనపు ఓట్లు కలిశాయన్న ఫిర్యాదులున్నాయి. మిగతా దరఖాస్తులో ఓట్ల మిస్సింగ్, తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పు తదితర విషయాలకు వచ్చాయని ఇచ్చారు. ● తొర్రూరు మున్సిపాలిటీలో రెండో వార్డులోని ఓటరు మూడవ వార్డులో నమోదయ్యాడు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు అందింది. ములుగు మున్సిపాలిటీలో ఓటరు పేరు సవరణ, రెండు ఓట్ల నుంచి ఒకటి తొలగింపు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిన ఓట్లను సవరించాలని మొత్తంగా 31 అభ్యంతరాలు అధికారులకు అందాయి. -
ముసాయిదాపై గుస్సా!
సాక్షిప్రతినిఽధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇందులో 9 మున్సిపాలిటీలు పాతవి కాగా, కొత్తగా ఏర్పడిన ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వరకు అభ్యంతరాల సంఖ్య 509కి చేరింది. మొదట ఐదో తేదీ వరకే స్వీకరించనున్నట్లు చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ నెల 8 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీంతో వార్డుల వారీగా అభ్యంతరాల సంఖ్య పెరుగుతోంది. ఓటర్ల జాబితాలో అంతా గందరగోళం.. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ము సాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరకాల, స్టేషన్ఘన్పూర్ నుంచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు తొలగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి పొరుగు గ్రామాలకు మకాం మార్చిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటంపై అభ్యంతరాలున్నాయి. మహబూబాబాద్, జనగామ తది తర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నివాసం ఉంటున్న వారి ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లతోపాటు విదేశాలకు వెళ్లిన వారివి కూడా ఉన్నట్లు ఫిర్యాదులుండగా.. ఒకే ఇంటివారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండడం, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లడంపై అభ్యంతరాలు ఉన్నాయి. పరకాలలో వార్డులు మార్చాలనే ఫిర్యాదులు.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 అభ్యంతరాలు వచ్చాయి. అందులో తమ ఓట్లు మరో వార్డులో వచ్చాయని.. వాటిని మార్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా యాదవనగర్ కాలనీలోని ఒకేవాడకు చెందిన వారి ఓట్లు మూడు వార్డుల్లో ఉండటంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆందోళనలో సీతారాంపూర్ గ్రామ వాసులు.. గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్లో 2,200 మంది ఓటర్లు ఉండగా ఒక్కరిది కూడా అభిప్రాయం తీసుకోకుండా మూడు వార్డులు (6,7,9) విభజించారని..ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సవరణ చేయాలంటూ అధికారులకు అభ్యంతరం తెలిపారు. ఒకే కాలనీలోని 500 మంది ఓటర్లను మూడు వార్డుల్లో కలిపారు. దీంతో పేరుకు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నా ప్రయోజనం లేదు. సమస్యను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు చూపించుకుంటూ పట్టించుకోవడం లేదు. ఈసారైనా న్యాయం జరుగుతుందన్న ఆశతో మున్సిపల్ అధికారుకు ఫిర్యాదు చేశాం. – ఉడుత చిరంజీవి, సీతారాంపూర్, పరకాల మున్సిపాలిటీ తప్పులపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ జాబితాలో స్థానికేతరులు, చనిపోయిన వారి పేర్లు పదో తేదీ నాటికి లిస్ట్ ఫైనల్ అనుమానమే -
మీ పేరుందా?
భూపాలపల్లి అర్బన్: పురపాలక ఎన్నికల పోరుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. పురపాలికలో ఓటర్లు పేర్లు చూసుకునే పనిలో ఉన్నారు. జాబితాలో పలు రకాల తప్పులు నమోదయ్యాయి. ఒక వార్డులోని ఓటర్లు మరో వార్డు జాబితాలోకి, మరికొందరివి రెండు, మూడు వార్డుల్లో నమోదయ్యాయి. మరోవైపు జాబితాలో ఉన్న పేర్లు పోర్టల్లో కనిపించకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఆయా వార్డుల్లో వాటిపై అభ్యంతరాలు తెలిపే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. అభ్యంతరాలుంటే పురపాలిక కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలి. అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తుది జాబితాను ఈనెల 10న ప్రచురిస్తారు. సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో చూసుకొనే విధానం https://tsec.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల పేర్లు సరిచూసుకోవచ్చు. పోర్టల్లో మెనూ ఆప్షన్ ఎంచుకొని డౌన్లోడ్ ఓటరు స్లిప్ బై ఎపిక్ ఐడీని ఎంచుకోవాలి. ఇందులో జిల్లా, పురపాలక, వార్డు, ఎపిక్ నంబరును నమోదుచేస్తే వివరాలు కనిపిస్తాయి. జాబితాలో పేరులేని వారు పురపాలిక కార్యాలయంలో ఈ నెల 10 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కొత్త వారికి ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. సాధారణ ఎన్నికల జాబితానే కీలకమని అధికారులు చెబుతున్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి సోమవారం వరకు 73 ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు అభ్యంతరాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. 20కిపైగా ఓటరు జాబితాలో పేరు కనిపించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్లైన్లో చూసుకునేందుకు అవకాశం అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఈనెల 10న తుది జాబితా -
సరిపడా యూరియా నిల్వలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బా బురావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. వదంతులు నమ్మి అవసరానికంటే ఎక్కువగా యూరియా బస్తాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. నిల్వ చేయడం వలన మిగతా రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 3,787 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1893098307ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దు చిట్యాల: వాహనదారులు మద్యం తాగి వాహనం నడపవద్దని జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఎస్సై శ్రావన్కుమార్తో కలిసి వెంకట్రావుపల్లి(సీ) నుంచి విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం డీటీఓ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతీ వాహనదారుడికి లైసెన్స్ తప్పకుండా ఉండాలన్నారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అనంతరం విద్యార్థులు మానవహారం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేవారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సుందర్లాల్, శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. -
ఏజెన్సీల ఇష్టారాజ్యం
భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం ఇష్టారాజ్యంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వారే ఉద్యోగులను ఎంపిక చేసి నియామక పత్రాలను రెండు రోజుల క్రితం అందించినట్లు తెలిసింది. దీంతో అనర్హులు ఉద్యోగాలు పొందగా అర్హులు అన్యాయానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 34 మంది నియామకానికి.. టెక్నికల్, నాన్ టెక్నికల్, పారామెడికల్, ఎలక్ట్రిషన్, ల్యాబ్ అటెండెంట్, అనస్తీషియా, రేడియో గ్రాఫర్ టెక్నీషియన్లకు సంబంధించిన 34 మంది నియామకానికి గత నెల 27వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 30వ తేదీ వరకు అమ్మ సోషల్ సర్వీస్, శ్రీ వినాయక మాన్పవర్ సొల్యూషన్స్, శ్రీ వెంకటేశ్వర ఎస్సీ, ఎస్టీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తులను స్వీకరించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకాలకు సంబంధించిన దరఖాస్తులు సంబంధిత కార్యాలయ అధికారులు స్వీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత ఏజెన్సీలకు జాబితా అందిస్తారు. అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు నియమాక పత్రాన్ని అందిస్తారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నియామకాల్లో నిబంధనలు పాటించలేదు. పరిశీలన లేకుండానే.. 34 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన ఏజెన్సీల నిర్వాహకులు పరిశీలనలు చేపట్టకుండానే నియామకాలు ఆదివారం రాత్రి అందించినట్లు తెలిసింది. వచ్చిన పూర్తి దరఖాస్తులను పరిశీలించిన మెరిట్ జాబితాలను పదర్శించిన తరువాత నియామకాలు చేపటాల్సి ఉంటుంది. కలెక్టర్, సంబఽంధిత మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సూపరిటెండెంట్కు సైతం సమాచారం లేదు. ఆస్పత్రిలో పనిచేసే వారికి కనీస అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 20 మంది ఔట్ సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి అవకాశం కల్పించలేదు. అనుభవం లేని వారికి రాజకీయ బలం, ధన బలం ఉన్నవారికి నియామక పత్రాలు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. విధులు నిర్వర్తిస్తున్న తమకు అవకాశం కల్పించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది సోమవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దరఖాస్తుల స్వీకరణ.. నియామక పత్రాలు అందజేత కలెక్టర్ స్పందిస్తే అర్హులకు న్యాయం -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: పేదలకు సొంత గృహం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మున్సిపల్, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3,943 ఇళ్లు మంజూరు కాగా, 765 ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిత్తడి నేలలను గుర్తించాలి.. జిల్లాలో చిత్తడి నేలలను (వెట్ ల్యాండ్స్) గుర్తించి, వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర డేటాను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డితో కలిసి జిల్లా చిత్తడి నేలల జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇరిగేషన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. క్రీడాపోటీలకు ఏర్పాట్లు చేయాలి.. సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఫిజికల్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయిలో, అనంతరం మండల, జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 47 దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆధార్ ఆధారిత హాజరు విధానం పాటించాలని సూచించారు. చిత్తడి నేలల వివరాలు సమర్పించాలి సీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు కలెక్టర్ రాహుల్ శర్మ


