Jayashankar District News
-
తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్
కాజీపేట రూరల్: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్ పెగడపల్లిలో అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సు మలత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు. -
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
వరంగల్ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్సింగ్ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. నాన్న ప్రిన్సిపాల్ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన మోటివేషన్ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలో అవగాహన కల్పించేవారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తీర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్ప్రీత్సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
నడిచే దైవం.. నాకు తొలినేస్తం
ఖిలా వరంగల్: వరంగల్ 34వ డివిజన్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రసెంటేటివ్గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్ ఇండియా సివిల్ సర్వీస్లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది. -
బలోపేతం దిశగా..
కాటారం: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతంచేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుంది. ప్రస్తుతం కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రాల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పాటు సేవలను మరింత విస్తృత పరిచేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. చిన్నారులకు ఎంతో ప్రాముఖ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటపాటలతో కూడిన విద్య.. గ్రామాల్లో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఈ నెల 11నుంచి అమ్మ మాట–అంగన్వాడీ బాట పేరుతో పలు కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో టీచర్లు, సిబ్బంది తమ కేంద్రాల పరిధిలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఈ నెల 17న సామూహిక అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సెలబస్ రూపొందించి విద్యను బోధించడానికి సిద్ధమయ్యారు. చిన్నారులు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది. బడిబాట పట్టేలా.. అంగన్వాడీ కేంద్రాల్లోని 3నుంచి 6ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటుపడేలా, పౌష్టికాహారం అందించి ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టేలా తీర్చిదిద్దేవారు. గతేడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్బుక్కులు అందించి వారితో హోంవర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరుతో ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్ భారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టనున్నారు. దీంతో చిన్నారుల మేథస్సు వికసించడంతో పాటు మానసిక మార్పులు చోటు చేసుకోనున్నాయి. చిన్నారుల సంఖ్య పెంచేలా.. ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు చర్యలు చేపడుతున్నారు. కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడం కోసం కసరత్తు చేస్తున్నారు. అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరిస్తున్నారు. చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య ఆవశ్యకత, అంగన్వాడీలకు పంపించడం ద్వారా వారికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారుల సంఖ్య పెంచేలా కార్యక్రమాలు.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అమలు తీరుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీకి పంపించడం ద్వారా వారిలో మేథాశక్తి పెంపొందుతుంది. – మల్లీశ్వరి, డీడబ్ల్యూఓ అంగన్వాడీలపై దృష్టి సారించిన ప్రభుత్వం అమ్మ మాట–అంగన్వాడీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చిన్నారుల సంఖ్య పెంచేలా కసరత్తు 17వరకు పలు కార్యక్రమాల నిర్వహణజిల్లా వివరాలు.. మండలాలు 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు 2 (భూపాలపల్లి, మహదేవపూర్) అంగన్వాడీ కేంద్రాలు 643 చిన్నారుల సంఖ్య 10,364(సుమారు) -
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధం
ములుగు రూరల్: ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసినా లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చినా, ముంపునకు గురైనప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు సహాయార్ధం బృందాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటే సమీప పోలీస్స్టేషన్కు గాని, 100కు కాల్ చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే అక్కడికి చేరుకుని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సులభంగా ఉంటుందని వివరించారు. -
ఆపదకాలంలో ఆదుకునేందుకు రక్తదానం
భూపాలపల్లి అర్బన్: ఆపదకాలంలో ఆదుకునేందుకు ప్రతి ఏడాది రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐటీ మాస్టర్ నిర్వాహకుడు శంకర్ తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీ మాస్టర్ యాజమాన్యం, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ జిల్లా కమిటీ) ఆధ్వర్యంలో శనివారం ఐటీ మాస్టర్ క్యాంపస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. 2008వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఐటీ మాస్టర్ యజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, ప్రజలకు చికిత్స నిమిత్తం అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి జర్నలిస్టులతో పాటు ప్రజాసంఘాలు, స్టూడెంట్స్, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా 280 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు క్యాతం సతీష్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
భూమి అమ్మి చదివించారు..
నల్లబెల్లి: చదువు ఒక్కటే తరగని ఆస్తి అని బలంగా నమ్మారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్. కూలీ చేసి కొనుక్కున్న 4 ఎకరాల భూమిని కుమారుడు ప్రశాంత్ చదువు కోసం అమ్మేశారు. తండ్రి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రశాంత్ ఇష్టంగా చదివారు. ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో పని చేస్తున్నారు. ‘నాకోసం భూమి అమ్మి కుటుంబ పోషణ కోసం నాన్న 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. నాన్న ప్రోత్సాహమే నన్ను వైద్యుడిని చేసింది. నా విజయం నాన్నకు అంకితం’ అంటున్నారు ప్రశాంత్. -
రాజీమార్గంతో వివాదాలకు దూరం
భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని రాజీపడి కేసుల్లో నుంచి బయటపడాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. క్షమాగుణాన్ని కలిగి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరాభావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు -
వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025జఫర్గఢ్: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాధరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలుపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఇన్నయ్యను నాన్న అంటూ అప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.న్యూస్రీల్ -
మత్స్యకారులకు అండగా ఉంటాం..
ములుగు రూరల్: ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్లో యుఎల్టీ, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందించిన తెప్పలు, వలలను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు అవసరమైన తెప్పలు, వలలు అందించడం అభినందనీయమన్నారు. ములుగు మండలంలోని జీవింతరావుపల్లిని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ క్లోరినేషన్ డౌసింగ్ సిస్టంను ప్రారంభించారు. మంత్రి సీతక్క -
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
రేగొండ: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని రామన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాములు (55) కుల వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు నడుముకు ఉన్న మోకు జారడంతో రాములు తాటిచెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య రమ, కూతురు, కొడుకు ఉన్నాడు. -
సమస్యల పరిష్కారం కోసం సదస్సులు
గణపురం: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. గణపురం మండలం అప్పయ్యపల్లె గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. రెవెన్యూ శాఖ అందించే సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణస్వామి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
కొనుగోలు కేంద్రాలు 204 రైతులు 20,583 సేకరించిన ధాన్యం 1,11,337 మెట్రిక్ టన్నులు ధాన్యం విలువ రూ.258కోట్లు చెల్లించింది రూ.150కోట్లు సన్నధాన్యం రైతుల సంఖ్య 19,763 సన్నధాన్యం కొనుగోలు 25,924 టన్నులు అందించాల్సిన బోనస్ రూ.9.88 కోట్లుబోనస్ రాలే.. నేను ఆరెకరాల్లో వరి పంట సా గుచేశాను. 100 క్వింటాల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. ధాన్యం డబ్బులు ఖాతాలో జమయ్యా యి. ఇక బోనస్ ఎప్పుడు వేస్తారో తెల్వదు. ఇదే విషయమై అధికారులను అడిగితే డబ్బులు రావడానికి ప్రాసెస్ జరుగుతుందని చెబుతున్నారు. – బొల్లు సరోత్తం రెడ్డి, టేకుమట్ల త్వరలోనే ఖాతాలో జమవుతాయి.. సన్న రకం ధాన్యానికి సంబంధించి బోనస్ రూ.9.88 కోట్లు ఇచ్చేది ఉంది. దానికి సంబంధించిన రూ.7.61 కోట్లు బోనస్ ఆన్లైన్ అయ్యాయి, మిగితావి త్వరగా ఆన్లైన్చేసే విధంగా ఆదేశించాం. ప్రభుత్వం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయి. – శ్రీనాఽథ్, జిల్లా పౌరసరఫరాల అధికారి న్యూస్రీల్ -
నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల
ములుగు రూరల్: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని గ్రంథాలయ సంస్థచైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాన్ని బట్టి ప్రతీ సోమవారం బిల్లు చెల్లిస్తున్నామని, లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతనిప్పుల భిక్షపతి, భోడ రఘు, అనిల్, షకిల్, జాఫర్, అభినయ్, రాజన్న, మహేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు ఇచ్చి లాక్కున్నారు.. వాజేడు: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ మంజూరు పత్రాలను ఇచ్చారని, మీరు అర్హులు కారని తిరిగి తీసుకున్నారని మండల అంగన్వాడీ సిబ్బంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, మాజీ జెడ్పీటీసీ తల్లడి పుష్పలతలతో కలిసి భద్రాచలం వెళ్లారు. తమకు గత నెల 7న మంత్రి పర్యటనలో భాగంగా మంజూరు పత్రాలను ఇవ్వడంతో 5 రోజులు ఆగి తాము కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి పాత ఇంటిని తొలగించినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ సీఈ ఎం.చైతన్యకుమార్, పీడీ లోకిలాల్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించి మంజూరైన 56 ఇళ్లలో ముగ్గుపోసిన 21, బేస్మెంట్ లెవల్లో ఉన్న 4 ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ లబ్ధిదారులు 400 స్కేర్ఫీట్ నుంచి 600 స్కేర్ఫీట్ల లోపు నిర్మాణం చేయాలన్నారు. లబ్ధిదారులకు నాలుగు విడతల్లో బిల్లులు జమ అవుతాయని తెలిపారు. రూ.లక్ష బేస్మెంట్ లెవల్, రూ.లక్ష లెంటల్ లెవల్, రూ.రెండు లక్షలు స్లాబ్ లెవల్, రూ.లక్ష ప్లాస్టరింగ్ వరకు విడతల వారీగా జమ చేస్తారన్నారు. నిర్మాణం చేసే మేసీ్త్రలకు ప్రభుత్వం ఒక ధర నిర్ణయించినట్లు తెలిపారు. అధిక డబ్బులు అడిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఏఈ, డీఈలు ఉన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం
భూపాలపల్లి అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పుల్లూరిరామయ్యపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హిమబిందు తన కూతురు ప్రహర్షిని అదే పాఠశాలల్లో ప్రీ ప్రైమరీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రషీద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ రమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శానిటేషన్, మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు భూపాలపల్లి అర్బన్: పురపాలక సంఘ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శానిటేషన్ సిబ్బంది, మెప్మా ఆర్పీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ వైద్యాధికారులతో కలిసి వైద్యశిబిరం ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఈ అన్నపూర్ణ వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాఽధికారులు డాక్టర్ రోహిణి, డాక్టర్ స్వాతి, వైద్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర కులగణన సాహసోపేత నిర్ణయం కాటారం: దేశంలో సమగ్ర కులగణన బిల్లును అమల్లోకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి మోదీ చేస్తున్న కృషి సాహసోపేతమైందని కులగణన సాధన సమితి జాతీయ కన్వీనర్, బీసీ నాయకుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. శుక్రవారం కాటారం వచ్చిన ఆయనను అఖిల భారత పద్మశాలి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎలుబాక సుజాత ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా బీసీ లెక్కలు తేల్చాలనే ఏకై క డిమాండ్తో ప్రధాన మంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, డిల్లీ వరకు ప్రత్యక్షంగా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, రుషికేశ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరం బస్టాండ్లో షీ, మాతాశిశు కేంద్రం కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్లో షీ రూమ్ (సానిటరీ హైజిన్ ఎంపవర్మెంట్), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షీ, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాళేశ్వరంలోని శాశ్వత బస్టాండ్కు మార్చినట్లు కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చే మహిళలకు బస్టాండ్లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని సూచించారు. -
యూనిఫాం అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా డిప్యూటేషన్పై వెళ్లిన మహిళా ఎస్అండ్పీసీ సిబ్బందికి శుక్రవారం ఏరియా ఇన్చార్జ్ జీఎం కవీంద్ర యూనిఫాం అందజేశారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా విధుల్లో చేరుతున్న మహిళా ఉద్యోగులు ఎస్అండ్పీసీకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సింగరేణి ఉద్యోగంలో చేరే మహిళలు సంస్థలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ పద్మజ, మారుతి, మురళీమోహన్, మహిళా సెక్యూరిటీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న రేషన్ పంపిణీ
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్ధేశ్యంతో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేయడాన్ని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీలో 80శాతం మంది లబ్ధిదారులు అమ్మకాలు చేపట్టడంతో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టేది. కానీ సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు సద్వినియోగం అవుతుంది. జిల్లాలో 94,628 కార్డులు జిల్లాలోని పది మండలాల్లో 94,628 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల జిల్లాలో 1,714 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో మూడు నెలలకు గాను 5,157 టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరిసాగు చేస్తున్నారు.మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ జిల్లాలో 94,628 కార్డులు తూకాల్లో అవకతవకలు లేకుండా నిత్యం తనిఖీలు సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్ -
అధికారంలోకి వచ్చి తీరుతాం..
భూపాలపల్లి రూరల్: నరేంద్ర మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లుతుందని, 11 ఏళ్ల పాలన అభివృద్ధికి నిదర్శమని రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశీధర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల్లో బీజేపీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ, అవగాహన లేక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని చెప్పారు. పార్టీలోని అన్ని కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో మోదీ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు, క్రమశిక్షణ సంఘం కన్వీనర్ నాగపూరి రాజమౌళి గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య, నాయకులు జన్నె మొగిలి, ప్రసాద్రావు, దొంగల రాజేందర్, బట్టు రవి, కంబాల రాజయ్య, వేషాల సత్యవతి, సయ్యద్ గాలిఫ్ పాల్గొన్నారు.బీజేపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ -
పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి
భూపాలపల్లి అర్బన్: చిన్నపిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో యావత్తు ప్రపంచం బాల కార్మిక నిర్మూలన కోసం కదులుతుందని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా నడవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రోత్సాహమేది?
కాటారం: ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయంగా నిలిచిన జిల్లాలోని పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమవుతున్నాయి. పల్లెప్రాంతాల్లో నాణ్యమైన, తాజా కూరగాయలను పండించి పట్టణ ప్రాంతాలకు తరలించే రైతులు పలు కారణాలతో సాగుపై నిరాసక్తి కనబరుస్తున్నారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ద్వారా సరైన ప్రోత్సాహం అందకపోగా సాగు రైతులకు సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించకపోవడంతో క్రమంగా జిల్లాలో కూరగాయల సాగు తగ్గిపోతుంది. పండించిన కూరగాయలను విక్రయించడానికి మార్కెట్ లేకపోవడం సాగుపై మరింత ప్రభావం చూపుతుంది. కూరగాయల సాగుకు కేరాఫ్గా ఉన్న గ్రామాలు ప్రస్తుతం వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు ఎకరాల కొద్ది కూరగాయలు సాగుచేసిన రైతులు కేవలం తమ ఇంటి అవసరాలకు కూరగాయలను పండించడానికి పరిమితం అవుతున్నారు. సాగు తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో అత్యల్పంగా సాగు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం గతేడాది 190 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో సుమారుగా 250 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు కూరగాయల సాగు జరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా కొద్ది మొత్తం వ్యత్యాసంతోనే కూరగాయల సాగు జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని మిగితా జిల్లాలతో పోల్చుకుంటే జిల్లాలో అత్యల్పంగా సాగు జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కాటారం, చిట్యాల, మహదేవపూర్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పలు రకాల కూరగాయలను పండించేవారు. ప్రస్తుతం అలాంటిది కనిపించడం లేదు. పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్థానికంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో జిల్లాలో కూరగాయల కొరత ఏర్పడుతుంది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో కూరగాయల ధరలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు చూస్తే టమోట కిలో 60, వంకాయ కిలో రూ.50, బెండకాయ రూ.60, పచ్చిమిర్చి కిలో రూ.60, బీరకాయ రూ.80, దొండకాయ రూ.70గా ఉన్నాయి, అందుబాటులో లేని మార్కెట్.. జిల్లాలో సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడం కూరగాయలు సాగు చేసే రైతులకు సమస్యగా మారింది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కూరగాయలు పండిస్తే అవి అమ్ముకోవడానికి వారు తీవ్ర ఇబ్బందులుపడాల్సి వస్తుంది. రైతుల చేతికి వచ్చిన కూరగాయలను గోదావరిఖని, వరంగల్ మార్కెట్కు తరలించి అమ్ముకోవాల్సి వస్తుంది. అధిక రవాణా భారం, సమయం వృథా అవుతుండటంతో రైతులు కూరగాయల సాగుకు స్వస్తి పలుకుతున్నారు. కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో సాగు పెంచేందుకు ఉధ్యానశాఖ ద్వారా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలు తప్పకుండా రైతులకు చేరేలా చూస్తాం. కూరగాయల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించి మంచి దిగుబడులు సాధించేలా పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం. – మణి, హార్టికల్చర్ అధికారిణి, మహదేవపూర్ సబ్ డివిజన్జిల్లాలో సాగు వివరాలు..సంవత్సరం ఎకరాలు 2020–21 271 2021–22 130 2022–23 123 2023–24 75 2024–25 190 2025–26(ప్రస్తుతం) 250 అంచనాకూరగాయల సాగుకు ఆదరణ కరువు ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థాయి మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో రైతుల ఇబ్బందులు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలంకానరాని అవగాహన.. ప్రభుత్వం ద్వారా కూరగాయల సాగు రైతులకు ప్రోత్సాహం అందకపోవడంతో పాటు సంబంధిత అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో రైతులు కూరగాయల సాగుకు దూరమవుతున్నారు. గతంలో కూరగాయల విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసేది. పందిర్ల నిర్మాణం, డ్రిప్ ఏర్పాటుకు సబ్సిడీ అందజేసేవారు. ప్రస్తుతం కూరగాయలు సాగుచేసే రైతులకు అవేమీ అందడం లే దు. ప్రభుత్వం పత్తి, మిర్చి, వరి విత్తనాలతో పాటు మరికొన్ని వాణిజ్య పంటలకు రాయితీలు ఇస్తుంది. దీంతో రైతులు వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. తమ ఇళ్ల వద్ద ఉండే అరెకరం, ఎకరం భూ విస్తీర్ణంలో సైతం పత్తి, మిర్చి సాగుకు పూనుకుంటున్నారు. నీటి సౌకర్యం ఉంటే వరి పండిస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. బడిబాటలో భాగంగా నైన్పాక ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ అధ్యక్షతన పండుగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రాజేందర్ హాజరై విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు కావాలసిన అన్ని వసతులు కల్పించామన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో సమగ్రమైన విజ్ఞానం అందించబడుతుందని తెలిపారు. గ్రామస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ద్వారా విద్యాబోధన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పదవ తరగతిలో మండలంలో అత్యధిక మార్కులు సాధించిన నైన్పాక విద్యార్థిని రమ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడెపాక రఘుపతి, సీఎంఓ రమేష్, సెక్టోరియల్ ఆఫీసర్ రాజగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతయ్య, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, తల్లిదండ్రులు, విద్యావంతులు పాల్గొన్నారు. చిట్యాలలో... మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎంఈఓ కొడెపాక రఘుపతి విద్యార్థులకు పాఠ్యప్తుకాలు, నోట్ బుక్కులు, దుస్తులు పంపిణీ చేశారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు బొకేలు ఇచ్చి ఆహ్వానించారు.డీఈఓ రాజేందర్ -
లింగ నిర్ధారణను ప్రోత్సహిస్తే నేరమే
భూపాలపల్లి అర్బన్: లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, పరీక్ష చేయించడం, ప్రోత్సహించడం నేరమేనని అందరూ శిక్షార్హులు అవుతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 14 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ఇందులో ఐదు ప్రభుత్వ ఆధీనంలో 9 ప్రైవేట్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై దృష్టి పెట్టాలన్నారు. లింగ నిర్దారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరీక్షలు చేయించి ప్రోత్సహించిన వారికి మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982, 63032 39891 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్టు డాక్టర్ కవిత, పీడియాట్రిషన్ డాక్టర్ సురేందర్, డెమో శ్రీదేవి, సోషల్ వర్కుర్లు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ మధుసూదన్ -
డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
కాటారం: కాటారం డీఎస్పీగా సూర్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన రామ్మెహన్రెడ్డి సాధారణ బదిలీలో భాగంగా ఇటీవల బదిలీ కాగా హైదరాబాద్ ఎస్ఐబీలో పనిచేస్తున్న సూర్యనారాయణ కాటారం బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని సబ్ డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఉపాధి లక్ష్యాలు పూర్తిచేయాలిరేగొండ: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని డీఆర్డీఓ బాలకృష్ణ అన్నారు. ఉపాధి హామీ పనులపై గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు పూర్తి చేయడంలో అధికారులు పోటీతత్వంతో పనిచేయాలని తెలిపారు. లక్ష్యం ప్రకారం మండలంలో ప్లాంటేషన్ చేపట్టాలని, అందులో సుమారు 100 ఎకరాలలో పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లేబర్ టర్న్ఔట్ పెంచాలని, కూలీలకు వంద శాతం చెల్లింపులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంజుల, ఎంపీఓ రాంప్రసాద్, టీఏలు రాజు, రమేష్ పాల్గొన్నారు.మెడికల్ బోర్డును పునరుద్ధరించాలిభూపాలపల్లి అర్బన్: మూడు నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల కాలం నుంచి సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మెడికల్ బోర్డులో జరిగిన కుంభకోణం దోపిడీ విషయంలో విచారణ పేరుతో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం సరైనది కాదన్నారు. దీనిపై గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాదరెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, ఎండి సాజిత్ పాల్గొన్నారు.కొనసాగుతున్న క్రికెట్ క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఐదవ లీగ్ మ్యాచ్ను సీఐ నరేష్కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్సీయూ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అధ్యక్షుడు కర్ణాకర్, కోచ్లు పాల్గొన్నారు.శిలాఫలకం కూల్చారు..టేకుమట్ల: మండలంలోని ఆరెపల్లి శివారులో రైతుల భూములకు వెళ్లే దారి మరమ్మతు కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. గురువారం కాంగ్రెస్ నాయకులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కల్పించడమే లక్ష్యం
రేగొండ: పేద, దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా భూమి కొనుగోలు పథకం కొనసాగుతోందని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, చెన్నాపూర్ శివారులోని భూములను గురువారం భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఎంపిక ప్రక్రియలో సమీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రామస్థాయి సమావేశాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, సర్వేయర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ముస్తాబు.. స్వాగతం
వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు ముస్తాబు చేసి విద్యార్థులకు స్వాగతం పలికారు. మామిడి కొమ్మలు, బెలూన్లు, పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూల అందజేసి స్వాగతం పలికారు. పలు మండలాల్లో పాఠశాలలను డీఈఓ రాజేందర్, ఎంఈఓలు సందర్శించి విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండగ వాతావరణంలో పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. –భూపాలపల్లి అర్బన్ -
ధరలు భగభగ!
కొనలేని స్థితిలో సామాన్యులు● వర్షాభావంతో పెరిగిన ధరలు ● మింగుడు పట్టని పప్పన్నం ● మరింత పెరిగే అవకాశంకాళేశ్వరం: జూన్ మాసంలో వర్షాల జాడలేక ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు పౌష్టికాహారం తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలను వ్యాపారులు తగ్గించడం లేదు. గతంలో పోల్చితే ఈఏడాది కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలతో కూడా కూరగాయల పంటకు దిగుబడిని తగ్గింది. వాతావరణంలో వచ్చే మార్పులతో కూడా ఎండలకు కూరగాయల దిగుబడి లేక ధరలు పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో మరింత అధిక ధరలు ఉన్నాయి. సామాన్యుడు కనీసం తాజా కూరగాయలు కొనుగోలు చేయడం లేదు. గతంలో రూ.200–300 వరకు డబ్బులు పెడితే సంచినిండా కూరగాయలు ఇంటిల్లిపాదికి వారం పాటు సరిపోయేది. ప్రస్తుతం రూ.400–500 పెట్టి కొనుగోలు చేసినా సరిపడా కూరగాయలు లభించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. పప్పుతో ముద్దదిగని పరిస్థితులు నెలకొన్నట్లు సామాన్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయాలని సామాన్యులు కోరుతున్నారు.ఎండల ప్రభావం ఇలాగే ఉంటే.. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఎండల ప్రభావం ఇలానే ఉంటే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. టమాట ధర ఇప్పటికే పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ధరలు అకాశన్నంటుతున్నాయి. దీంతో కూరగాయలకు గిరాకీ కూడా తగ్గుతుంది. – మక్సూద్, కూరగాయల వ్యాపారి, కాళేశ్వరంకూరగాయలు కొనలేం.. ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెంచారు. సామాన్యులం కూరగాయలు కొనలేం. మరింత పెరుగుతాయని వ్యాపారులు చెపుతున్నారు. వారానికి రూ.500పెడితే కూడా సరిపడా కూరగాయలు వస్తలేవు. ఽటమాట ధర పెరుగుతుంది. ధరలను నియంత్రించాలి. – స్వప్న, టేకుమట్లధరలు (కిలోకు..)టమాట రూ.40–50 పచ్చి మిర్చి రూ.60 వంకాయ రూ.50 బెండకాయ రూ.40 కొత్తిమీర రూ.120 కాకరకాయ రూ.70 బీరకాయ రూ.100 సోరకాయ రూ.20(ఒక్కటి) అలసంద రూ.50 కాలీఫ్లవర్ రూ.80 క్యాబేజీ రూ.40 మునుగకాయ రూ. 80 దోసకాయ రూ.40 చిక్కుడుకాయరూ.90 అడవి కాకరకాయ రూ.350 -
ఫీజు రాయితీ కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్ట్ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ.. గురువారం టీఎస్జేయూ నాయకులు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రాయితీ కల్పించే విధంగా సర్క్యూలర్ జారీ చేయాలని కోరారు. దీంతో స్పందించిన డీఈఓ రాయితీ కల్పించేలా ఆదేశాలిస్తూ ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, నాయకులు రవీందర్, రవి, భూపాల్, సతీష్, చంద్రమౌళి, జగన్ పాల్గొన్నారు. -
నేటినుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం
● అన్ని హంగులతో ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు ● తొలిరోజే పాఠ్య, నోట్ బుక్స్, యూనిఫాం పంపిణీ ● అధునాతన టెక్నాలజీతో విద్యాబోధనభూపాలపల్లి అర్బన్: వేసవి సెలవుల అనంతరం 2025–26 విద్యా సంవత్సరం నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్, వర్క్బుక్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన విద్య అందించడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టింది. పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించడానికి పూనుకుంది. అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులతో బడి బాట కార్యక్రమం చేపట్టి వసతులపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చూస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలోనే సాంకేతికతను జోడించి ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన చేపట్టేందుకు ప్రత్యేక కార్యచరణ తీసుకుంది. కలిసొచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వం పాఠశాలల్లో గత ప్రభుత్వం నిర్వహించిన మన ఊరు–మన బడి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అమ్మ ఆదర్శ పాఠఽశాలల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు చేపట్టింది. తొలి విడతగా 149 పాఠశాలలను అభివృద్ధి చేయడగా ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా 265 పాఠశాలల్లో రూ.12కోట్లతో సౌకర్యాలు కల్పించింది. ఇప్పటికే 230 పాఠశాలలకు పనులు పూర్తి చే శారు. గతంలో లేని విధంగా విద్యుత్, తాగునీరు, టాయిలెట్ తదితర సౌకర్యాలను కల్పించగా మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. పుస్తకాలు, యూనిఫాంలు సిద్ధం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరైన 1.49లక్ష పుస్తకాలకు గాను జిల్లా కేంద్రం నుంచి 1.45 లక్షల పాఠ్య పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. అలాగే నోట్ బుక్స్, ఒక్కో జత యూనిఫాంలు సిద్ధమయ్యాయి. తొలిరోజే విద్యార్థులకు అదించనున్నారు. తీరిన ఉపాధ్యాయుల కొరత జిల్లాలో గతంతో తీవ్రంగా ఉన్న ఉపాధ్యాయుల కొ రత కొంత మేరకు తీరింది. మూడు,నాలుగేళ్లుగా మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ఉపాధ్యాయుల కొరత వేధించింది. గ తేడాది ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నూతన నియామకాలతో ఈ సమస్యల తీ రింది. జిల్లాలో ఇంకో 50 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాళీలను కూడా పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత సర్దుబాటు చేయనున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ.. కాళేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుంచి అప్అండ్ డౌన్ చేస్తుండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతుండటంతో ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు పాఠశాలలపై శ్రద్ధ చూపితేనే పరిస్థితులు మారవని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాలలు 317ప్రాథమికోన్నత పాఠశాలలు 44ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 69మొత్తం పాఠశాలలు 430విద్యార్థులు 19,788జిల్లాలో పాఠశాలల వివరాలు అన్ని ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన పాఠ్య, నోట్ పుస్తకాలు, జత యూనిఫాం సిద్ధం చేశాం. మొదటి రోజు వీటిని పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే బడిబాట ద్వారా ప్రవేశాల పెంపునకు కృషి జరుగుతోంది. మధ్యాహ్న భోజ నంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓపండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలి: కలెక్టర్ టీఎస్ దివాకర పాఠశాలల పునఃప్రారంభం పండుగ వాతావరణంలో చేపట్టాలని కలెక్టర్ టీఎస్ దివాకర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, యూనిఫాం అందించాలని, పాఠశాలను పండుగ వాతావరణంలో ప్రారంభించి విద్యార్థులను, తల్లిదండ్రులను ఆహ్వానించి వేడుకలా చేయాలన్నారు. విద్యార్థుల హాజరును మొదటి రోజు నుంచే నమోదు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, బడిబాటను పకడ్బందీగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించి, బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
కాళేశ్వరం: మేడిగడ్డ వద్ద గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుధవారం మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఈనెల 7న మేడిగడ్డ సమీపంలోని గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతుల వివరాలపై ఆరా తీశారు. మేడిగడ్డ సమీపంలో గోదావరి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరో ఘటన జరకముందే రక్షణ చేర్యలు తీసుకోవాలన్నారు. అంతకు మందు సూరారంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. రిటైర్డ్ ఉద్యోగులు ఆయనను శాలువాతో సన్మానించారు. వారి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ -
పాండవుల గుట్టలు అద్భుతం
రేగొండ: పాండవుల గుట్టలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ కలెక్టర్లు అన్నారు. బుధవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ల బృందం సౌరభ్శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్ కుమార్, కరోలిన్ చింగ్తాయిన్మావిలు సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా వారు గుట్టలోని కుంతీదేవి, కొలనుకుంటా, పాండవుల కాలం నాటి రాతి చిత్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాండవుల గుట్టలు అతి సుందరమైనవని, మహాభారత కాలం నాటి చారిత్రాక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్నారు. వారి వెంట తహసీల్దార్ శ్వేత, జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారి రఘు, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ అధికారి శ్రీనివాస్, ఎఫ్ఎస్ఓ గౌతమి, ట్రెయినీ ఎస్సై దివ్య, ఆర్ఐ భరత్రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
మల్హర్: భూభారతి రెవెన్యూ సదస్సులను సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. మండలంలోని వల్లెంకుంట గ్రా మంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రైతులు ఏ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి భూ సంబంధిత సమస్యలను తెలుసుకున్నారు. భూ నమోదులు, రికార్డులు సర్దుబాటు, వాస్తవికంగా భూములపై ఉన్న హక్కుల విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించి, సంబంధిత రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు చేశారు. భూముల సర్వే నంబర్ల చేర్పులు మార్పుల్లో పేరు నమోదు కోసం వల్లెంకుంటలో 337, మల్లంపల్లిలో 68 దరఖాస్తులను రైతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి కుమార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.కారుణ్య నియామక ఉత్తర్వుల అందజేత భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో కారుణ్య పద్ధతి ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు బుధవారం కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై నియామక పత్రాలు అందించి మాట్లాడారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న వారు అంకితభావంతో పనిచేయాలని కోరారు. మహిళా ఉద్యోగులు భూగర్భ గనుల్లోకి వెళ్లి విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జోతి, సురేఖ, మారుతి, శ్రావణ్కుమార్, ప్రణయ్సాగర్, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, మధుకర్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేందర్భూపాలపల్లి రూరల్: ఎన్హెచ్ఆర్సీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్హర్ మండడాలనికి చెందిన వెల్పుల మహేందర్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు దుండ్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయనకు నియామక పత్రం అందించారు. ఈ నియామకానికి సహకరించిన జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల భద్రయ్యకు, జిల్లా అధ్యక్షుడు కుమార్ యాదవ్లకు మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటనహన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్తారు. -
అక్రమార్కులు ఎవరు?
సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వ బడిలోనే చదివా.. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట గ్రామం. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి పదో తరగతి వరకు, వరంగల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు ప్రభుత్వ కళాశాలల్లో చదివాను. నాన్న వ్యవసాయం చేసేవారు. నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేశాను. ఆ రోజుల్లో చదువుతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యం ఇచ్చే వారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతి గదుల్లో బంధిస్తూ పుస్తకాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఇరుకు గదులు, అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల తర్వాత మొదటి రోజు సంతోషంగా పాఠశాలకు వెళ్లి నూతన పుస్తకాలు తీసుకొని మురిసిపోయే వాళ్లం. – సంపత్రావు, డీఎస్పీ, భూపాలపల్లి ● -
మెరుగైన సేవలు అందించాలి
చిట్యాల: మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈడీఏం శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాలను తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాల్లో అందించే సేవలను, సౌకర్యాలను పరిశీలించారు. నిర్వాహకులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వం నిర్ధేశించిన రుసుం మాత్రమే తీసుకోవాలన్నా రు. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మీసేవ కేంద్రాలకు వచ్చిన ప్రజల ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాగరాజుకు దళిత సేవారత్న అవార్డుకాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీడాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దళిత సేవారత్న అవార్డులను అందజేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన రేవెల్లి నాగరాజుకు దళిత సేవారత్న అవార్డు అందున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయనను అభినందించారు. క్రమశిక్షణతోనే విజయం సాధ్యం భూపాలపల్లి రూరల్: క్రీడాకారులు క్రమశిక్షణతోనే ఆటలు ఆడితే విజయం వరిస్తుందని ఎస్సై సాంబమూర్తి అన్నారు. బుధవారం జి ల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సురిమిల్ల శ్రీని వాస్ ఆధ్వర్యంలో మహబూబ్బాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య అండర్–19 షిఫ్ట్ లీగ్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్తో కలిసి ఎస్సై సాంబమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ క్రీడాకారులు రాజు, తిరుపతి, సంపత్, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పోల్ట్యాక్స్ను రద్దు చేయాలి భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతున్న పోల్ ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని ఇండిపెండెంట్ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేశ్బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై బుధవారం జి ల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్క్లబ్లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి మాట్లాడారు. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకు న్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కే బుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటున్నారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్లతో పోటీ పడడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికే నష్టాల్లో నడుపుతున్న కేబుల్ ఆపరేటర్లపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు బొట్ల రాజు, ఓదెల సురేష్, నల్లవేని రాజు, నన్నపు సతీష్, ఐలయ్య, గట్ట య్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మేము ట్రాక్టర్లు నడపలేం..
కాటారం: ఆర్థిక భారం దృష్ట్యా గ్రామపంచాయతీల్లో వినియోగిస్తున్న ట్రాక్టర్లలో డీజిల్ నింపి నడిపే పరిస్థితిలో లేమని తెలియజేస్తూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఎంపీడీఓ బాబుకు ట్రాక్టర్ తాళాలను అప్పగించారు. రాష్ట్ర జేఏసీ కార్యచరణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. నిధుల కొరత ఉన్నందున ట్రాక్టర్ల నిర్వాహన భారం పడుతుందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలకు నిధుల కెటాయింపు లేకపోవడంతో అప్పులు తెచ్చి కాలం వెల్లదీయాల్సి వస్తుందన్నారు. ఆర్థికభారంతో తాము సతమతమవుతున్నామని, విధులు నిర్వర్తించడం కష్టతరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల కార్యదర్శులు బీరెల్లి కరుణాకర్, రాజశేఖర్, సురేశ్, రవి, కృష్ణవేణి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓకు జీపీ ట్రాక్టర్ల తాళాలు అప్పగించిన పంచాయతీ కార్యదర్శులు -
‘భూభారతి’తో ప్రతీ రైతుకు న్యాయం
భూ భారతి చట్టంతో ప్రతీ రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.– 8లోuఉపాధ్యాయులంటే భయం, భక్తి.. చిట్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదవాను. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నాడు ఉపాధ్యాయులు భయంతో కూడిన ప్రేమ చూపేవారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు వచ్చి చెప్పేవారు. ఉపాధ్యాయులు అంటే భయం భక్తి ఉండేది. తల్లిదండ్రులు ఆనాడు ఉపాధ్యాయులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. భయంతో చదువుకున్నాం. భీంరావు వాగు వచ్చినా కూడా సైకిల్పై వచ్చి పాఠాలు బోఽధించే వారు. తొలిరోజు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందంటే ఎలాంటి భయం లేకుండా త్వరగా తయారై మిత్రులను కలుపుకొని పాఠశాలకు వెళ్లేవాడిని. ఆ రోజుల్లో సెల్ఫోన్, ల్యాండ్ఫోన్ లేదు. పాత మిత్రులను కలవాలని ముందుగానే వచ్చి కలుసుకునేవాళ్లం. – తూటిచర్ల, స్వామి, సీఐ, ఖమ్మం -
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuకఠినంగా శిక్షించాలి నాసిరకం విత్తనాలను అంటగట్టి మోసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు చూడాలి. కొన్నిచోట్ల నకిలీ విత్తనాలు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. విత్తన దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి నాణ్యమైన విత్తనాలను విక్రయించేలా చూడాలి. – మ్యాకల యాదయ్య, రైతు, పీచర, వేలేరు మండలం నకిలీ విత్తనాలను అరికట్టాలి.. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టి రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు అందించాలి. ముందస్తు వర్షాలు పడడంతో పత్తి విత్తనాలు వేసేందుకు భూమిని సిద్ధం చేశాం. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తుండడంతో రైతులం నష్టపోతున్నాం. నకిలీ, అసలు విత్తనాలకు తేడా తెలియక ఆందోళనకు గురవుతున్నాం. వీటిపై అవగాహన కల్పించాలి. – ముంజ సాంబయ్య, రైతు, వెంకటాపురం (ఎం), ములుగు జిల్లా నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వ్యాపారస్తులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను, పురుగు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ కమిషనరేట్రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తి ● సీజన్ ఆరంభంనుంచే దందా ● పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత ● పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు ● నిఘా పెంచాలని కోరుతున్న రైతులుసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ. ● గత మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి. ● తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ● యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి. న్యూస్రీల్ -
మీడియాపై కక్ష సాధింపు చర్యలు
భూపాలపల్లి అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని భూపాలపల్లి కాకతీయ ప్రెస్క్లబ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. సాక్షి సీనియర్ రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాస్రావు అరెస్ట్, సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టి సాక్షి దినపత్రిక, న్యూస్చానల్పై దాడులు చేస్తోందన్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులు సరికాదన్నారు. 50 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును అధికారం ఉందనే అహంకారంతో అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టులతో ఇబ్బంది పెడుతున్న ఏపీ ప్రభుత్వం భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవిభాస్కర్, శ్యాం, సంపత్, సరేశ్వర్రావు, సుధాకర్, ప్రవీణ్, వెంకటస్వామి, జగన్, రాజేష్, మహేందర్, సాంబయ్య, నరేందర్, చంద్రమౌళి, శేఖర్, సుమన్, సతీష్, నరేందర్ పాల్గొన్నారు. దాడులను నిరసిస్తూ జర్నలిస్టుల ఆందోళన -
భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ కాటారం: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. మండలంలోని గారెపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ పరిశీలించారు. సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ, ఆఫ్లైన్లో భాగంగా రిజిస్టర్లో దరఖాస్తుల వివరాల నమోదు, తదితర అంశాలపై ఆయన ఆరాతీశారు. ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో ఖచ్చితంగా నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుకు సంబంధించి క్షుణ్ణంగా చదివి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సదస్సుల నిర్వహణ చేపట్టాలని పేర్కొన్నారు. కార్యాలయంలో ఇతర పనులు పెండింగ్ ఉండకుండా సిబ్బందిని కేటాయించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట తహశీల్దార్ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలిరేగొండ: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్కుమార్ అన్నారు. మంగళవారం రేగొండ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్తో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా పండ్ల తోటలు పెట్టే రైతులకు, పందిరి సాగు ద్వారా కూరగాయలు పండించే రైతులకు, వివిధ ఉద్యాన యాంత్రీకరణ పరికరాలకు, తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులందరూ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పత్తి విత్తనాలు 60నుంచి 75 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకోవాలన్నారు. రశీదులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసుదేవారెడ్డి, మండల విస్తరణ అధికారులు పాల్గొన్నారు. -
14న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టులలో ఈ నెల 14వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు కోరారు. మంగళవారం పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదరహిత జీవితాలను గడిపే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల్లో రాజీపడితే ఇరువర్గాలకు మంచిదన్నారు. పెద్దఎత్తున కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు, జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అదనపు ఎస్పీ నరేష్కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎస్పీ సంపత్రావు, సర్కిల్, సబ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నిబంధనలు పాటించకుంటే లైసెన్స్ రద్దు కాటారం: విత్తనాల విక్రయ డీలర్లు, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేపడితే లైసెన్స్ రద్దుచేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరునాయక్ హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలు, ఫర్టిలైజర్ షాపులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, నిల్వలు, విత్తనాల ప్యాకెట్ల కంపెనీలను డీఏఓ పరిశీలించారు. నాసిరకం, లూజ్ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు. రైతులకు తప్పనిసరిగా కొనుగోలు రశీదు ఇవ్వాలని ఆదేశించారు. విత్తనాల నిల్వలు, విక్రయాలను ఎప్పటికప్పుడు స్థానిక వ్యవసాయశాఖ అధికారికి తెలియజేయాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీపాల్, కాటారం, మహదేవపూర్ ఏఓలు పూర్ణిమ, సుప్రజ్యోతి పాల్గొన్నారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం భూపాలపల్లి రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆట పాటలతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు, తల్లిదండ్రులు బడీడు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి పట్ణణం సుభాష్కాలనీలో ఏర్పాటుచేసిన అమ్మమాట, అంగన్వాడీ బాట కార్యక్రమానికి మల్లీశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లో ప్రతి పిల్లవాడు అంగన్వాడీ కేంద్రాల్లోనే చదివే విధంగా టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఆరోగ్యపరంగా కిశోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రజిత, అంగన్వాడీ టీచర్లు సుజాత, రమ, సుచరిత, అరుణ, ఉమామహేశ్వరి, సునీత, ఆయాలు పాల్గొన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలు నాటాలిచిట్యాల: రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలని భూపాలపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.రమేష్ అ న్నారు. మండలకేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులలో మంగళవారం వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తనిఖీల్లో భాగంగా వివిధ కంపెనీల విత్తన ప్యాకెట్లను, క్రయవిక్రయ రశీదులను, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు విత్తన కొనుగోలు సమయంలో జాగ్రత్త వహిస్తూ నాణ్యమైన విత్తనాలనే ఎంపిక చేసుకుని నాటుకోవాలన్నారు. బీటీ–3 పత్తి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీటీ–3 విత్తనాలను పెట్టవద్దని సూచించారు. ఇక వేళ సాగుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై శ్రావన్కుమార్, ఏఈఓ రమణకుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థుల పరిశుభ్రతపై దృష్టి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి సూచించారు. జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఒకరోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అధ్యక్షతన కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. విద్యను ప్రథమ ప్రాధాన్యతగా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. దేశ భవిష్యత్ను నిర్ణయించడంలో విద్య కీలకపాత్ర వహిస్తుందన్నారు. విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించాలని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మధ్యాహ్నం భోజనం నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యకరమైన పిల్లలే రేపటి దేశ భవిష్యత్ను నిర్ణయిస్తారని.. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో మొదటి ఐదుగురు విద్యార్థులకు ప్రత్యేక బహుమతి ఇస్తానని హమీఇచ్చారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులను శ్రద్ధతో చదివించి వందశాతం ఫలితాలు రాబట్టడానికి కృషి చేయాలన్నారు. రేపటినుంచి ప్రారంభం కానున్న ఈ విద్యా సంవత్సరం పండగ వాతావరణంలో ప్రధానోపాధ్యాయులు గ్రామంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులను పాఠశాలకు ఆహ్వానించాలన్నారు. విద్య ఆవశ్యకతను వివరించి ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఅర్డినేటర్లు రమేష్, లక్ష్మణ్, దుప్పటి రాజగోపాల్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
రామప్పను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్లు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం ట్రెయినీ ఐఏఎస్లు సౌరభ్శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్ కుమార్, కరోలిన్ చింగ్తాయిన్మావిలు సందర్శించారు. హైదరాబాద్లోని శిక్షణ పొదుతున్న ట్రెయినీ ఐఏఎస్లు తెలంగాణ దర్శన్లో భాగంగా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు, టూరిజం అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
విమానాశ్రయానికి మరో అడుగు
సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనేపథ్యంలో సమీప గ్రామాల ప్రజల నుంచి సేకరించే భూమికి పరిహారం నిర్ణయించడం.. అందుకు భూనిర్వాసితులు సానూకూలత వ్యక్తం చేయడంతో విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు పడ్డట్లైంది. కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ నిర్వాసితులతో చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887 ఇస్తామని, అంతకు మించి పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి భూనిర్వాసితులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వీరిలో గుంటూరుపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములు మెయిన్ రోడ్డుకు ఉన్నాయని, ఇంకాస్త ఎక్కువ ధర వస్తుందన్న ఆలోచనలో ఉన్నవారితో తహసీల్దార్, ఆర్ఐ తదితరులు చర్చించి ఎక్కువ ధర ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. కలెక్టర్ తనకున్న విచక్షణాధికారాలతో జనరల్ అవార్డు కింద రూ.65 లక్షలు ఉంటే కన్సంట్ అవార్డు కింద రూ.కోటి 20లక్షల వరకు తీసుకొచ్చారని వివరించారు. గత బుధ, గురువారాల్లో జరిగిన భూసేకరణ ధర పెంపు నిర్ణయంపై సమావేశంలో పాల్గొనని రైతులకు కూడా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. అయితే తమ భూములు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న చాలా మంది రైతులు అవసరమైన వివరాలు, పత్రాలు(పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్బుక్) సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే డాక్యుమెంట్లు ఇచ్చారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కలెక్టర్ సత్యశారద నిర్ణయంతో మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అదనంగా అవసరం కానుండడంతో ఇప్పటికే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించినట్టు తెలిసింది. భూసేకరణ కాగానే పనులు మొదలు.. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్కు ఒప్పందం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరపడంతో గతేడాది నిరంభ్యంతర పత్రం వచ్చింది. 2024 నవంబర్లోనే 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయిస్తూ జీఓను ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సైతం భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాగానే పనులు ప్రారంభించేందుకు రూ.450 కోట్లు నిధులను కేటాయించింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే ఏఏఐ విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావచ్చింది. భూ నోటిఫికేషన్ ప్రకారం రైతులు తమ భూపత్రాల వివరాలు ఇవ్వగానే, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూనే భూమి సేకరించనుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు పలు దఫాలుగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించే వీలున్న 37.6 మీటర్లు పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. మామునూరు ఎయిర్పోర్ట్ భూనిర్వాసితులతో చర్చించిన అధికారులు ధరల నిర్ణయాలపై మెజార్జీ నిర్వాసితుల సానుకూలత వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు.. వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,000.. -
ఏడాదిన్నరగా ఎదురుచూపు
కాటారం: కౌలు రైతులకు సైతం ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం అందజేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. హామీ ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట సాగుతో వచ్చిన కొంత మొత్తంతో వడ్డీలు కట్టలేక ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ప్రతి సీజన్లో ప్రభుత్వం నుంచి సహాయం అందక పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 40వేల మంది కౌలు రైతులు.. జిల్లాలో సుమారు 40వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు 2016లో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అరెకరం, ఎకరం భూమి ఉన్న రైతులు ప్రతి ఏటా తమకున్న కొద్దిపాటి భూమితో పాటు ఇతరుల భూములు కౌలుకు తీసుకొని పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. గతేడాది పత్తి, మిర్చి తోటలకు ఎకరాకు కౌలుకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.20వేల వరకు పెరిగింది. వరి పొలాలకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు కౌలు ఉండగా రూ.15వేల వరకు భూ యజమానులు కౌలు రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. పంట చేతికొచ్చినా, రాకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తుంది. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కౌలు, చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం నానా పాట్లు పడుతున్నారు. కౌలు రైతుకు అందని పెట్టుబడి సాయంపంట సాగు వివరాలు.. పెరిగిన కౌలు, విత్తన, ఎరువుల ధరలు నెరవేరని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ప్రైవేట్ అప్పులతో కౌలు రైతుపై ఆర్థిక భారంఏడాదిన్నరగా ఎదురుచూపు.. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకుంటామని స్పష్టంగా పేర్కొంది. అర్హులైన ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ.15వేలు సహాయంగా అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ఆ హామీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు సహాయం అందుతుందని రైతులు భావించినప్పటికీ నిరాశే మిగిలిపోయింది. మూడు సీజన్లు గడుస్తున్నప్పటికీ కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. -
బిల్లులు వెంటనే చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులు వెంటనే చెల్లించాలని కార్మికులు సోమవారం అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ మాట్లాడారు. జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలలుగా వంట బిల్లులు ఇవ్వలేదన్నారు. వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. కోడిగుడ్లు, అల్పాహార బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వరలక్ష్మి, ఉమాదేవి, బెల్లంకొండ స్వప్న, సంబడి చంద్రక్క, వేముల రాజేశ్వరి, సమత, సరోజన, కళావతి, మమత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు
భూపాలపల్లి: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి
కాళేశ్వరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలని, నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మహదేవపూర్ మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి విద్యార్థులు చేరేలా చూడాలని చెప్పారు. బడిమానేసిన పిల్లలను బడిలో చేర్పించేలా తల్లిదండ్రులతో మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజిరెడ్డి, సీఎంఓ రాజేష్, ఎంఈఓలు ప్రకాశ్బాబు, వెంకట్రాజం ఉన్నారు.జిల్లా విద్యాధికారి రాజేందర్ -
పత్తాలేని వర్షాలు
టీపీసీసీలో నేతలకు పదవులు కాంగ్రెస్ అధిష్టానం సోమవారం రాత్రి ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉమ్మడి జిల్లా నాయకులకు కీలక పదవులు కట్టబెట్టింది.వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.వారం రోజులుగా రైతుల ఎదురుచూపు– 8లోuభూపాలపల్లి అర్బన్: జిల్లాలో రోహిణి కార్తెలో ముందస్తు వర్షాలు మురిపించినా వారం రోజులుగా జాడ లేకపోవడంతో అన్నదాతలు వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ యేడు మే చివరి మాసంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అన్నదాతలు ఉత్సాహంగా పంటల సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వానాకాలం సీజన్లో పత్తి, మొక్కజొన్న కంది పంటలను వర్షాధారంగానే సాగు చేస్తారు. 2,47,293 ఎకరాలలో సాగు.. వానాకాలం సీజన్లో జిల్లాలో 2,47,293 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మే 20వ తేదీ నుంచి 30వరకు భారీ వర్షాలు కురిసిన తర్వాత ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడక్కడా మొలకెత్తిన పత్తి మొలకలు వాడిపోతున్నాయి. జిల్లాలో జూన్ 1నుంచి 9వరకు సాధారణ వర్షపాతం 60 మి.మీ.లు కాగా, ఇప్పటి వరకు 23 మీ.మీల లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. దాదాపుగా అన్ని మండలాల్లో అధిక లోటు వర్షపాతం కనిపిస్తుంది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే వేసిన విత్తనాలు నేలపాలయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం రెండు మూడురోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ ప్రారంభం నుంచి..జూన్ ప్రారంభం నుంచి వర్షాల జాడే కనిపించడం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు రావడం లేదు. జూన్ 1నుంచి 9వరకు జిల్లాలో కనిష్టంగా 23 మి.మీ.ల వర్షం కురిసింది. జూన్ ప్రారంభం నుంచి వర్షాలు కురిసి ఉంటే ఇప్పటివరకు 50శాతం పంటల సాగు పూర్తయ్యేదని రైతులు చెబుతున్నారు. మే చివరి మాసంలో కురిసిన వర్షాలకు సాగునీటి వసతి ఉన్న కొంతమంది రైతులు పత్తి విత్తనాలను వేశారు. నేలలో సరైన తేమ ఉంచడంతో ఇప్పటికే విత్తనాలు కూడా మొలకెత్తాయి. వారం రోజులుగా వర్షపు జాడ కనిపించకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు స్పింకర్ల ద్వారా మొలకలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. నీటివసతి లేని రైతులు మాత్రం వరుణుడి కరుణపైనే భారంవేస్తూ వదిలేస్తున్నారు. ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చుచేసి విత్తనాలను విత్తినట్లు చెబుతున్నారు. అధికారులు మాత్రం ముందస్తు వర్షాలకే తొందరపడవద్దంటూ సూచిస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు మరింత సమయం ఉందని పేర్కొంటున్నారు. తప్పని ఎదురుచూపు జిల్లాలో ఎక్కువగా వర్షాధార వంటలనే సాగుచేయడంతో వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రైతులు వర్షాలకోసం గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చిట్యాల, రేగొండ, టేకుమట్ల, భూపాలపల్లి మండలాల్లో కొంతమంది రైతులు పత్తి విత్తనాలు విత్తారు. జిల్లావ్యాప్తంగా 25శాతం పంటల సాగు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగితా పంటల సాగును వర్షాలు కురిసిన తర్వాతనే చేపట్టే అవకాశం కనిపిస్తుంది. కొంత మంది రైతులైతే మే మాసంలోనే పొడినేలల్లోనే విత్తనాలు వేసి వదిలేశారు. వర్షాలు కురవగానే పత్తి విత్తనాలు మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు. ఆశపెట్టిన రోహిణి.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడతాయన్న నానుడి ఉండేది. కానీ ఈ యేడు రోహిణి కార్తెలోనే భారీ వర్షాలు కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో ఆదరాబాదరగా అన్నదాతలు పంటల సాగును ప్రారంభించారు. జూన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో అన్నదాతల అంచనాలు తారుమారవుతున్నాయి. ముందస్తు వర్షాలతో మురిపించినా తొలకరి వర్షాలు కరుణించడం లేదంటున్నారు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె మొదలైనా వరుణుడు కరుణించకపోవడం గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంది. దీంతో పంటల సాగు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. నేలలో 60నుంచి 70శాతం తేమ ఉంటేనే విత్తనాలను విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లరేగడి నేలల్లో కొంత తేమ ఉన్నా చలక నేలలు మాత్రం బీటలు వారి కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విత్తనాలను విత్తుతే మొలకెత్తే పరిస్థితి ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. రోహిణి కార్తెలో ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పటివరకు 25శాతం పంటల సాగు పూర్తి వాడిపోతున్న పత్తి మొలకలు -
పచ్చాపల పండుగ
చేపల మార్కెట్లో చేపలు కొనుగోలు చేస్తున్న పట్టణవాసులుపోలీస్స్టేషన్ రోడ్డులో చేపల విక్రయాలుగణపురం: చేపల మార్కెట్ వద్ద కొనుగోలుదారులు మృగశిర కార్తె ప్రారంభం నేపథ్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని చేపల మార్కెట్, పోలీస్స్టేషన్ రోడ్డు, ఫారెస్ట్ కార్యాలయం, సుభాష్కాలనీ రోడ్డులో చేపల అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు చేపల అమ్మకాలు చేపట్టారు. చేపలను కొనేందుకు పట్టణ వాసులు ఉదయం నుంచే బారులుదీరారు. కొర్రమీను, రవులు, జెల్లలు, చందమామలు, పచ్చి రొయ్యలు ఎక్కువగా అమ్ముడు పోగా రకాలను బట్టి కిలోకు రూ.300 నుంచి రూ.500 ధర పలికాయి. – భూపాలపల్లి అర్బన్ -
ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
రూ.లక్ష ఎక్స్గ్రేషియా: మంత్రి శ్రీధర్బాబు మృతిచెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి అంబట్పల్లిలోని మృతులు పట్టి మధుసూదన్, శివమనోజ్ తండ్రి వెంకట్స్వామి, కర్ణాల రాహుల్ తండ్రి సమ్మయ్య, రక్షిత్ తల్లి తోగరి సాంబను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్పార్టీ నాయకులు విలాస్రావు, రాజబాబు, పద్మ, ప్రభాకర్రెడ్డి, చల్ల తిరుపతి ఉన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు విడుతల వారీగా మంజూరుచేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని దామరంచపల్లి, విజ్ఙయ్యపల్లి, రాజక్కపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆదివారం మంజూరు పత్రాలు అందజేశారు. దామరంచపల్లిలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసనం లేదన్నారు. పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ రవికుమార్, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు దుర్గాభవాని, స్వప్న, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, మొట్టే కిరణ్, బండారి దేవేందర్, వీరబ్రహ్మం, రవిసామ్రాట్, ఏనుగు రవీందర్రెడ్డి, మధుసూదన్, మెండయ్య పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో.. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం జగ్గయ్యపేట పాఠశాలకు సంబంధించిన బడిబాట కార్యక్రమం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!
అమాత్యుల శాఖలు పదిలం మంత్రివర్గ విస్తరణలో ఈసారి కనీసం నలుగురికి అవకాశం ఉంటుందని భావించినా.. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో ఎమ్మెల్యే, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రానున్న కాలంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విస్తరణ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు చెందిన శాఖల మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(గ్రామీణ నీటిసరఫరా సహా), మహిళా శిశుసంక్షేమ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రి వరకు శాఖలు కేటాయించలేదు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగలేదు. దీంతో మంత్రుల శాఖలు మారతాయనేది ఉత్త ప్రచారమని తేలిపోయింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఓరుగల్లు నేతలకు ఆదివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో మూడో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొండా సురేఖ, ధనసరి సీతక్కలకు రేవంత్రెడ్డి కేబినేట్లో స్థానం దక్కింది. సుమారు 16 నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మూడో మంత్రి కోసం పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆశావహులకు నిరాశ మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుంచి వాయిదా పడుతుండగా.. చివరకు శుక్రవారం పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు అగ్రనేతలతో ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. 2014లో టికెట్ దక్కకున్నా ఇండిపెండెంట్గా గెలుపొందిన మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ టికెట్పైన గెలిచిన ఈయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినా జరగలేదు. ఈసారి కూడా తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరినా దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని వదలకుండా ఉన్న తనకు కూడా అవకాశం ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పార్టీ పెద్దలకు తన వాయిస్ వినిపించారు. మాజీ ఐపీఎస్ అధికారి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు ప్రచారం. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి ఆశించిన ఎవరికీ అమాత్యపదవి దక్కక పోవడం కొంత నిరాశ పర్చింది.ఫలించని ఓరుగల్లు సీనియర్ నేతల ప్రయత్నాలు డిప్యూటీ స్పీకర్తోనే సరిపెట్టిన పార్టీ అధిష్టానం విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా రామచంద్రునాయక్ శాఖలను పదిలం చేసుకున్న మహిళా మంత్రులు ఊహాగానాలకు తెర దింపిన హైకమాండ్ -
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
భూపాలపల్లి రూరల్: నేడు (ఆదివారం) భూపాలపల్లి పట్టణంలోని 11 కేవీలైన్ మంజూరునగర్ ఫీడర్పై చెట్లకొమ్మలు తీయడం, మరమ్మతుల దృష్యా జవహర్నగర్ కాలనీ, 5ఇంక్లైన్ కమాన్, లారీల అడ్డా, మైసమ్మకాలనీ, కలెక్టర్ కార్యాలయం, జీఎంఆర్ వెంచర్, వెంగళరావు వెంచర్, బీసీ కాలనీ, మాధవరావుపల్లి, కుందురుపల్లి గ్రామాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని భూపాలపల్లి విద్యుత్ శాఖ ఏఈ విశ్వాస్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపటినుంచి లోక్ అదాలత్ భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లా కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో వివిధ కారణాలతో కేసుల పాలైన వారు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇరువర్గాలు హాజరై సంబంధిత కేసులను తొలగించుకోవాలని సూచించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి కన్నాయిగూడెం: మండలంలో బాండ్ పేరుతో రైతులను మోసం చేసిన మొక్కజొన్న కంపెనీలు రైతుల అకౌంట్లలో తక్షణమే డబ్బులు జమ చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు కావిరి నాగయ్య అధ్యక్షతన శనివారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. సోమవారం వరకు డబ్బులు జమ చేయకుంటే రైతులను సమీకరించి ఆందోళన చేస్తామన్నారు. నకిలీ విత్తనా ల క్రయ విక్రయాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తోకల రవి, సురేష్, పాషా, రామారావు, లక్ష్మిపతి, మధు, రవీందర్, పాపారావు, రాజబాబు, రఘుపతి, శ్రీను, మహేష్ పాల్గొన్నారు. గీత కార్మికుడికి తీవ్రగాయాలు చిట్యాల: మండలంలోని జడల్పేట గ్రామానికి చెందిన బయగాని సమ్మయ్య వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి తలకు తీవ్రంగా గాయమైంది. తోటి కార్మికులు 108లో వరంగల్కు తరలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. విద్యుదాఘాతంలో దుక్కిటెద్దు మృతి భూపాలపల్లి రూరల్: విద్యుదాఘాతంలో దుక్కిటెద్దు మృతిచెందిన ఘటన శనివారం భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన యాస శంకరయ్యకు చెందిన ఎద్దు మధ్యాహ్నం పొలం వద్ద 11కేవీ లైన్కు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు విలువ సుమారు రూ.80వేలకు పైగా ఉంటుంది. బాధితుడు శంకరయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గాలివాన బీభత్సంఏటూరునాగారం : మండలంలోని ఎలిశెట్టిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ వైర్లు తెగిపడగా, ఇంటి కప్పులు, రేకులు ఎగిరిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. కొన్ని చోట్ల మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో జంపన్నవాగు నుంచి ఈదుకుంటూ పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో పడవలను నడుపుతున్నారని వాపోయారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని గోవిందరావుపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో క్లీనింగ్, హైజీన్ అండ్ సానిటేషన్ వన్ డే వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా విద్యా శాఖ అధికారి జి.పాణిని, జీసీడీఓ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాణిని మాట్లాడుతూ పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 9 మండలాల కేజీబీవీ, టీఎస్ఎంఎస్ గర్ల్స్ హాస్టల్స్, టీఎస్ఆర్ఈఐఎస్ బండారుపల్లికి చెందిన స్కావెంజర్స్, ఏఎన్ఎంఎస్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు●● జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల పరిధిలో శనివారం నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరపత్రాలను డీఈఓ ఆవిష్కరించారు. పదో తరగతి ఫలితాల్లో 551 మార్కులు సాధించిన అజయ్ను డీఈఓ సన్మానించారు. గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా విద్య, ఆరోగ్యం, న్యూట్రిషన్లపై శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న నూతన సాంకేతిక విద్య, క్రీడా, సాంస్కృతిక, ఇతర అంశాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవానాయక్, సీఎంఓ రమేష్, కోఆర్డినేటర్లు లక్ష్మణ్, రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు అశోక్ పాల్గొన్నారు. టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలి ములుగు రూరల్: జిల్లాలోని రామప్ప, బొగత, మల్లూరు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచరామాలు వెళ్లేందుకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసిందని వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామప్ప, బొగత, మల్లూరు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.530, పంచరామాలు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.2300 చార్జి తీసుకుంటున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం 99592 26048, 90634 52131, 93465 54351 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు. దరఖాస్తు చేసుకోండి వాజేడు: ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కోర్సులలో చేరడం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వాజేడు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 సంవత్సరానికి గాను 10వ తరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ చేసే సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 21వరకు గడువు ఉందని ఆ లోగా తప్పనిసరిగా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. -
నదీతీరం..శోకసంద్రం
మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు ● సాయంత్రం 6 గంటల నుంచి 11.50 వరకు సాగిన గాలింపు చర్యలు.. లభించని ఆచూకీ ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో విషాదంగల్లంతైన వారు.. అంబట్పల్లి వాసులు: పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంట వాసి: బొల్లెడ్ల రాంచరణ్(17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్(19)కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొకరు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడవ బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాధం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. సాయంత్రం 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం.. పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూపు.. గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. నేనూ సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా. -
ఉద్యానవన పంటల సాగుతో అధిక దిడుబడి
ములుగు రూరల్ : ఉద్యానవన పంటల సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యానవనశాఖ జిల్లా అధికారి సంజీవరావు సూచించారు. శుక్రవారం మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో శాఖ రైతులకు అందజేస్తున్న వివిధ రాయితీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇందిర సౌర గిరి జల వికాస్ పథకం ద్వారా ఆయిల్పామ్, పండ్ల తోటలు, పూలసాగుపై రాయితీ లభిస్తోందని వివరించారు. ఎంఐడీహెచ్ పథకం ద్వారా పండ్లు, కూరగాయల సాగులో 50శాతం రాయితీ, మల్చింగ్, పందిరి కూరగాయల సాగుకు రాయితీ వర్తిస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుచేసే రైతులు రూ.20 చెల్లిస్తే మొక్కలు అందజేస్తామని, అంతర పంట సాగుకు రూ.4,200లు యజమానికి అందిస్తుందని అన్నారు. 5ఎకరాల లోపు ఉన్న రైతులకు 90శాతం రాయితీ, అంతకుపైన ఉన్న రైతులకు 80శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 100శాతం రాయితీ బిందు సేద్యానికి అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యానవనశాఖ అధికారి శ్రీకాంత్, విస్తరణ అధికారి రమేష్, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు హేమంత్రెడ్డి, నవీన్ నాయక్, జగదీశ్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు దేవేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.జిల్లా అధికారి సంజీవరావు -
టీబీ రహిత జిల్లాగా మార్చాలి
● జిల్లా వైద్యాధికారి గోపాల్రావు ములుగు రూరల్ : ములుగును టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో 100 రోజుల అవగాహన కార్యక్రమాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మొదట టీబీ బాధితులు, మద్యపానానికి గురైన వ్యక్తులు, మధుమేహం కలిగినవారు, హెచ్ఐవీతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించాలన్నారు. ప్రతీఒక్కరికి తెమడ పరీక్షల నిర్వహణకు గ్రామాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. నడవలేని వారి వివరాలను సేకరించి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి ఎక్స్రేలు, సిబినాట్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని అన్నారు. టీబీ మిత్రను భాగస్వాములను చేసి న్యూట్రిషన్ కిట్లు, ఆర్థికసాయం అందించాలని తెలిపారు. టీబీపై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పోషకాహారలోపం ఉన్న వ్యక్తులు గుర్తించి తెమడ పరీక్షలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, టీబీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సమ్మయ్య, చంద్రమౌళి, రాజు ల్యాబ్ టెక్రిషియన్, ప్రోగ్రాం సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
నాసిరకం విత్తనాలతో మోసపోవద్దు
కాటారం : రైతులు విత్తనాల ఎంపికలో నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని, నాసిరకం విత్తనాలు కొని మోసపోవద్దని డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి సూచించారు. కాటారం మండలం ప్రతాపగిరిలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో కలిసి రైతులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ సాగుకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వినియోగం, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తక్కువ ధరకు లభించే లూజ్ విత్తనాలు, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయొద్దని రైతులకు సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే టప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు తావొవ్వద్దన్నారు. అనుమానితులు ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మ్యాక అభిన వ్, ఏఈఓ రాజన్న, రైతులు పాల్గొన్నారు.డీఎస్పీ రామ్మోహన్రెడ్డి -
‘అమ్మ ఆదర్శం’ అస్తవ్యస్తం
పనులు త్వరగా పూర్తి చేయాలి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధికి నిధులు ఉన్నప్పటికీ పనులు జరగడం లేదు. మన ఊరు మన బడి పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయాలి. – కొత్త కుమారస్వామి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిభూపాలపల్లి అర్బన్: జిల్లాలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతేడాది చేపట్టిన పనులు ఏడాది గడిచిన నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం మరో ఐదు రోజులైతే పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 438 ఉండగా వాటిలో సుమారు 24వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని యాజమాన్యాల కింద ఉన్న 265 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసింది. ఇందులో భాగంగా చిన్నపాటి మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, టైల్స్ వంటి పనులు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విద్యుత్, తాగునీటి పనులు 90శాతం వరకు పూర్తయ్యాయి. మరుగుదొడ్లు, ఇతర మేజర్ పనులు మాత్రం 60 నుంచి 70శాతం మాత్రమే పూర్తయ్యాయి. 265 పాఠశాలలకు రూ.12.41కోట్లు మంజూరయ్యాయి. 220 పాఠశాలల్లో పనులు పూర్తి జిల్లాలో ఎంపిక చేసిన 265 అమ్మ ఆదర్శ పాఠశాల్లో గతేడాది ఏప్రిల్ మాసంలో పనులను ప్రారంభించారు. వాటిలో ఇప్పటి వరకు 220 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. మిగతా 45 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. పూర్తి చేసిన పనులకు ఇప్పటి వరకు కలెక్టర్ రూ.5 కోట్ల నిధులు కమిటీలకు విడుదల చేశారు. సంబంధిత ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణ లోపం, కమిటీ వద్ద పనులు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో ముందుకు సాగడం లేదని పలువురు తెలిపారు. ‘మనఊరు–మన బడి’ పనులు కూడా అంతంతే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో రూ.32 కోట్లతో 149 ప్రభుత్వ పాఠశాలల్లో 2023 సంవత్సరంలో పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో మనఊరు–మనబడికి నిధులు కేటాయించకపోవడంతో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, కంపౌండ్, కిచెన్ షెడ్లు, భోజనశాలలు మధ్యలోనే నిలిచిపోయాయి.పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపడుత్ను పాఠశాలల అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లిస్తున్నాం. ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఎంబీ రికార్డు చేయడంలో కొంత ఆలస్యం అవుతోంది. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని కమిటీలకు ఆదేశాలు జారీచేశాం. పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారిఏడాది దాటినా పూర్తి కాని అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు జిల్లా వ్యాప్తంగా 265 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక రూ.12.41 కోట్ల నిధుల కేటాయింపు ఇప్పటివరకు చెల్లించింది రూ.ఐదు కోట్లు మాత్రమే మరో ఐదు రోజుల్లో పాఠశాలల పునఃప్రారంభం -
బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
గణపురం: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చెంచుకాలనీలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందజేస్తోందని, ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధనను అందిస్తున్నామని వివరించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలో చదువుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.డీఈఓ రాజేందర్ -
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
చిట్యాల: భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని దూత్పల్లి, భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. అనంతరం అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆన్లైన్, రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్వీకరించిన దరఖాస్తులను రిజిస్ట్రర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్డెస్క్లను, రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారిగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, భూపాలపల్లి తహసీల్దార్లు షేక్ ఇమామ్ బాబా, శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
గుండెపోటుతో తహసీల్దార్ మృతి
హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47)శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై శ్రీకుడాశ్రీలో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లోనూ పాల్గొంటున్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల్లో ఆయనకు మంచిపేరు, గుర్తింపు ఉన్నాయి. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన ఇంటికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. -
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్ : పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. కమలాపూర్, నందిగామ, నాగారం, ఆజాంనగర్, పంబాపూర్, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, రాంపూర్, ఆముదాలపల్లి, కొంపల్లి, గుడాడ్పల్లి, గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి, కొత్తపల్లి (ఎస్ఎం) మోరంచపల్లి, శ్యాంనగర్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. మొదటి విడతలో పేరురాని వారు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, నాయకులు తోట సంతోష్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. బడిబాట ప్రారంభించిన ఎమ్మెల్యే.. మండలంలోని కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట పోస్టర్లను ఆవిష్కరించారు.పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, గ్రామస్తులు సహకరించాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి దేవానాయక్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
గణపురం : జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారంతో ముగిసినట్లు జి ల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు తెలిపారు. మండలకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బ్యాడ్మింటన్ ముగింపు కార్యక్రమానికి డీవైఎస్ఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. కోచ్ రవీందర్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఎంపికకు సాధన చేయాలి కాటారం : స్పోర్ట్స్ స్కూల్ ఎంపికకు చిన్నారులు సాధన చేయాలని అథ్లెటిక్ అసోసియేషన్ చైర్మన్ పంతకాని సమ్మయ్య అన్నారు. మండల కేంద్రంలో నెలరోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణ అనంతరం సైతం ప్రాక్టిస్ కొనసాగించాలని సూ చించారు. కాటారంలో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికై న 14 మంది చిన్నారులను అభినందించారు.4వ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులు శిక్షణ ఇప్పిస్తే స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. క్రీడా శిబిరం విజయవంతానికి కృషి చేసిన మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ నాయక్, వ్యాపారి మద్ది సంపత్, ఆత్మకూరి కుమార్, కోచ్ అశోక్ను ప్రత్యేకంగా అభినందించారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సౌబ్రాతృత్వంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అన్ని మతా లను గౌరవించే భారతదేశ సంస్కృతిలో బక్రీద్ పండుగ విశేష స్థానం కలిగి ఉందన్నారు. ఈ పండుగను శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పుష్కర పనులు పూర్తి చేయాలికాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు కాళేశ్వరంలో జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా పుష్కరాల సమయంలో సమయాభావంతో కొన్ని పనులు నిలిచిపోయాయి. వాటిని రెండు రోజుల్లో ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు ఈఓ మహేష్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆయన సంబంధిత కాంట్రాక్టర్లకు రెండు రోజుల్లో నిలిచిన పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, వీఐపీ ఘాటు పుష్కరఘాటు, సరస్వతీ అమ్మవారి విగ్రహంపై స్లాబు, అక్కడి తోరణాలు, ప్రసాద కౌంటర్, కల్యాణకట్ట భవనం, మరుగుదొడ్ల నిర్మాణాలు, మెయిన్ఘాటు తోరణం పనులు నిలిచిన విషయం తెలిసిందే. ఎన్ఎంఎంఎస్కు 21 మంది విద్యార్థుల ఎంపిక భూపాలపల్లి అర్బన్ : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్నకు (ఎన్ఎంఎంఎస్) జిల్లా వ్యాప్తంగా 21 మంది విద్యార్థులు ఎంపికై నట్లు డీఈఓ రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్లో నిర్వహించిన అర్హత పరీక్షకు జిల్లా నుంచి 55 పాఠశాలలకు చెందిన 425మంది విద్యార్థులు హా జరు కాగా 21మంది అర్హత సాధించినట్లు వివరించారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.12వేల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీసిన ఉపాధ్యాయులను అభినందించారు. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలిచిట్యాల: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యలో భాగమేనన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటి వరకు 540 మందిని చట్ట విరుద్ధంగా హత్య చేశారన్నారు. చట్ట విరుద్ధ హత్యలను సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వామపక్ష , లౌకిక, ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు చర్చలు చేయాలని కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీకళాశాలనుంచే పీహెచ్డీ గైడ్షిప్కోసం దరఖాస్తు చేసుకోవాల్సింటుంది. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజు ల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్ధులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వీరు రాసుకునే అవకాశం కల్పి స్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కే యూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫి కెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జి యాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రి జిస్ట్రార్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో జూన్!
ఉద్యాన పంటల సాగు లాభదాయకం రైతులు తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీ పొందుతూ ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని ఉద్యాన అధికారి సుస్మిత తెలిపారు.పెట్టుబడి మాసం.. నెలంతా భారమే..శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025ప్రైవేట్ చదువులకు ఖర్చులు (అంచనా) ఇలా.. ● పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లో అడ్మిషన్ ఫీజు రూ.5 వేల నుంచి రూ.7వేలు ● స్కూలు, ట్యూషన్ ఫీజు రూ.15 నుంచి రూ.30వేలు ● పుస్తకాలకు రూ.4వేల నుంచి రూ.8వేలు ● రెండు జతల యూనిఫాం, స్పోర్ట్స్ డ్రెస్లు రూ.3 వేల నుంచి రూ. 5వేలు ● బస్సు రవాణా కోసం రూ.8 నుంచి రూ.10 వేలు ● హాస్టల్ వసతికి రూ.40 వేల నుంచి రూ. 70వేలుబక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి కాళేశ్వరం: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాటారం డీఎస్పీ రామ్మోన్రెడ్డి తెలిపారు. మండలంలోని మహాదేవపూర్ పోలీస్స్టేషన్లో బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హింసకు తావు లేకుండా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లింలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పవన్కుమార్, మహాదేవపూర్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. పర్యావరణాన్ని ప్రతిఒక్కరూ కాపాడాలి భూపాలపల్లి అర్బన్: పర్యావరణాన్ని ప్రతిఒక్కరూ కాపాడి భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్ తెలిపారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ అవగహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తున్నట్లు వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే రానున్న రోజుల్లో మానవాళిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రవణ్రావు, విష్ణువర్ధన్రావు, శివకుమార్, అక్షయ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం భూపాలపల్లి రూరల్: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి అధ్యక్షతన 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం–సంకల్పంతో సాకారం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచదేశాలతో పోటీపడుతూ దేశంలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి మోదీ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. దేశానికి బలమైన నాయకుడు మోదీ తప్పా మరేవరూలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి నిజాయితీలో దేశాన్ని అభివృద్ధి చేస్తుందని, రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ● వ్యవసాయ పెట్టుబడులకు వ్యయం ● పాఠశాల ప్రవేశాల ఖర్చు తడిసిమోపెడు ● మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారంభూపాలపల్లి అర్బన్: జూన్ మాసం వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలు, రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం, రైతులకు పంట సాగులో పెట్టుభారం తప్పడం లేదు. జూన్ మొదటి వారం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి కాలం. పిల్లల చదువులకు అన్ని రకాల ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు జూన్ వచ్చిందంటేనే దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మృగశిర కార్తె నుంచి వ్యవసాయ ఖర్చులు కూడా మొదలవుతున్నాయి. వాతావరణం చల్లబడుతున్న తరుణంలో సామాన్యులకు మాత్రం ఈ మాసం ముచ్చెమటలు పట్టిస్తోంది. మధ్యతరగతి ప్రజలు, వ్యవసాయ ఆధార కుటుంబాలు ఖర్చులకు అవస్థలు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు.. జిల్లాలో దాదాపు 1.25 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. ఈ వర్షాకాలం సీజన్ల్లో పంటలకు పెట్టుబడి కాలం.. వ్యవసాయ పంట భూములను చదను చేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయదారులు దుక్కులు, విత్తనాల కొనుగోలు వంటి పనులు ప్రారంభించారు. కనీసం ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అవసరం కానుంది. ఐదెకరాలున్న రైతు దాదాపు రూ.లక్షకు పైగా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం వస్తున్నా.. అది సరైన సమయానికి చేతికందడం లేదు. పైగా బ్యాంకుల రుణాలు కూడా అవసరమైన సమయానికి అందడం లేదు. దీంతో రైతులు ఒకవైపు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే మరోవైపు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అటు పిల్లల చదువులు ఇటు వ్యవసాయ పెట్టుబడికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. పిల్లల బడి ఫీజులు భారం.. జిల్లాలో దాదాపు 70కికు పైగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. గ్రామీణ, మండల స్థాయిలో కొంతమేర తక్కువ ఫీజులు వసూలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ మొత్తంలో ఫీజులు ఉన్నాయి. ప్రీ ప్రైమరీ తరగతులకు రూ.20 వేలకు పైగా, ప్రైమరీకి రూ.40వేలు, హైస్కూల్కు రూ.50 వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఏటా 10 నుంచి 20 శాతం మేర ఫీజులు పెరుగుతుండడంతో తల్లిదండ్రులపై భారం పడుతోంది. దీనికి తోడు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫాం, బ్యా గులు, స్టడీ మెటీరియల్ ఇతర ఖర్చులతో తల్లిదండ్రులపై భారం పెరుగుతోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన కుమార్తె 9వ తరగతి చదువుతుండగా.. నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు యూనిఫాం, బడి ఫీజు, అడ్మిషన్ ఫీజు వంటివి కలుపుకొని రూ.లక్ష వరకు అవుతుందని చెప్తున్నారు. కాగా ఇంత మొత్తం ఖర్చును భరించలేక ప్రభుత్వ విద్యాసంస్థలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇలా ఫీజుల భారం మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువగా పడుతోంది.వాల్పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్, అధికారులున్యూస్రీల్ఖర్చు పెరుగుతోంది.. జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక సంఘం కార్యాలయంలో వర్కర్గా పని చేస్తున్న. పని చేస్తూనే మా ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్న. చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు రోజువారీ ఖర్చులు, నిత్యావసరాలు, ఇంటి అద్దె పోను రూపాయి కూడా మిగలడం లేదు. మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. – ఎనుగుల భిక్షపతి, భూపాలపల్లిరెండువైపులా భారం.. జూన్ వచ్చిందంటే చాలు రెండువైపులా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒకవైపు పిల్లల చదువులపై, మరోవైపు పంట పెట్టుబడులు. ఇలా రెండు వైపులా ఒకేసారి ఒకే నెలలో ఖర్చు పెట్టాల్సి రావడంతో భారం పడుతోంది. ఏటా వేసవి సెలవులు పూర్తవుతున్నాయంటేనే తీవ్ర మానసిక ఒత్తిడి కలుగుతోంది. ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు త్వరగా ఇవ్వాలి. ఈ డబ్బులతో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. – పోలవేని రాజేందర్, వేశాలపల్లి -
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతులు పండించిన ధాన్యాన్ని వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా సేకరిస్తున్న ప్రభుత్వం.. మర ఆడించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైస్మిల్లులకు అప్పగిస్తోంది. కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మరాడించి బియ్యాన్ని గడువులోగా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్సీఐలకు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో గతేడాది రెండు సీజన్లలో సీఎంఆర్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగలేదు. అయినప్పటికీ అధికారులు ఈ వానాకాలానికి సంబంధించి కూడా సుమారు 281 రా రైస్, పారాబాయిల్డ్ రైసుమిల్లులకు సీఎంఆర్ ధాన్యం సరఫరా చేశారు. రెండు నెలలు కావస్తున్నా కేవలం 2.19 శాతం మాత్రమే రైస్మిల్లర్లు బియ్యం ప్రభుత్వరంగ సంస్థలకు చెల్లించారు. సర్కారు ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం.. సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చే క్రమంలో రైస్మిల్లుల యజమానులకు గడువు విధించి నిర్దేశించిన సమయంలోగా అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అయితే ఏటా మిల్లుల యజమానులు గడువును లెక్కచేయకుండా ధాన్యాన్ని బియ్యంగా మార్చి సొంత వ్యాపారం చేసుకుంటూ.. వారికి నచ్చినప్పుడు పౌరసరఫరాల సంస్థ, ఎఫ్సీఐలకు బియ్యం అప్పగిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్మిల్లులకు ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 7,42,261 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇచ్చారు. ఇందుకు 5,04,737 మెట్రిక్ టన్నుల బియ్యం ఆగస్టు వరకు పూర్తిగా ఇవ్వాల్సి ఉండగా.. రెండు నెలల్లో కేవలం 11,068(2.19 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే మిల్లర్లు ఇచ్చారు. గతేడాది వానాకాలం, యాసంగి సీఎంఆర్కు సంబంధించి సుమారు రూ.561 కోట్ల విలువైన బియ్యం పెండింగ్లో ఉండగా.. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 4,93,669 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఎప్పటి వరకు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సీఎంఆర్ జాబితాలో డిఫాల్టర్లు.. ● గత వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ కింద ధాన్యం తీసుకుని ఇంకా బియ్యం ఇవ్వని డిఫాల్టర్లకు ఈ వానాకాలంలో సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. ● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు రైస్మిల్లులను నడుపుతున్న హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.కోట్లలో సీఎంఆర్ ఎగవేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అతడిపై రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. ● హసన్పర్తి మండలం సీతంపేట సమీపంలోని ఓ రైస్మిల్లును లీజుకు తీసుకుని సివిల్సప్లయీస్ ద్వారా తీసుకున్న సుమారు రూ.15 కోట్ల విలువైన ధాన్యానికి మంగళం పాడినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే గత వానాకాలం, యాసంగి సీఎంఆర్ ఇవ్వని డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ సీజన్లోనూ రైస్మిల్లులకు బ్యాంకు గ్యారంటీ, ష్యూరిటీలు తీసుకుని సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించామని, సీఎంఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి వరంగల్కు చెందిన పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. వానాకాలం బియ్యం మరాడింపు మరి స్లో.. ఉమ్మడి వరంగల్లో మిల్లర్లకు 7.42 లక్షల మె.టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం 5.04 లక్షల మె.టన్నులు... రెండు నెలల్లో ఇచ్చింది 11,068 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే యాసంగి సీఎంఆర్పైన నిర్లక్ష్యమే.. డిఫాల్టర్లకు సీఎంఆర్ ధాన్యం? జిల్లా మొత్తం ఇవాల్సిన ఇచ్చిన ఇంకా ఇవ్వాల్సిన ధాన్యం సీఎంఆర్ బియ్యం బియ్యం (మెట్రిక్ టన్నుల్లో..) హనుమకొండ 114129 77608 2091 75517వరంగల్ 155177 105520 00 105520మహబూబాబాద్ 169073 114970 00 114970జనగామ 161246 109647 7042 102605ములుగు 72640 49395 804 48591జేఎస్ భూపాలపల్లి 69996 47597 1131 46466742261 504737 11068 493669 -
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ కాటారం: భూ భారతిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ రెవెన్యూ అధికా రులకు సూచించారు. కాటారం మండలం ధ న్వాడలో గురువారం కొనసాగిన రెవెన్యూ సదస్సును సబ్కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల సేకరణ ప్రక్రియ, దరఖాస్తుల వివరాలను త హసీల్దార్ నాగరాజును అడిగి తెలుసుకున్నా రు. దరఖాస్తుల నమోదు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రతీ దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేసి తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేయాలన్నా రు. కాగా మూడవ రోజులో భాగంగా చిద్నెపల్లిలో 178, ధన్వాడలో 329 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ సదస్సుల్లో నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు భూపాలపల్లి అర్బన్: పుణ్య క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో టూర్ ప్యాకేజీలను కల్పిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి డిపో నుంచి కొమురవెళ్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, భద్రాచలం, పర్ణశాల, మల్లూరు, నాగార్జునసాగర్, విజయవాడ, అన్నవరం ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9959226707, 9701967519 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపేయాలి
భూపాలపల్లి రూరల్: దేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, బందు సాయిలు డిమాండ్ చేశారు. గురువారం ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం సమానత్వం కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపకుండా అతికిరాతకంగా ఎన్కౌంటర్ల పేరిట చంపడం దుర్మర్గామన్నారు. కేంద్రం తన వైఖరిని మార్చుకొని మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపి మావోలు జన స్రవంతిలో కలిసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్, వెలిశెట్టి రాజయ్య, నేరేళ్ల జోసెఫ్, మాతంగి రాంచందర్, శేఖర్, లావణ్య, గోమాత, శ్రావణి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గణపురం: అర్హులైన నిరుపేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, బస్వరాజు పల్లి, జంగుపల్లి, వెంకటేశ్వరపల్లి, ధర్మరావుపేట, నగరంపల్లి, కోండాపూర్, సీతారాంపూర్, అప్పయ్యపల్లి, కర్కపల్లి, మైలారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను హౌసింగ్ పీడీ లోకిలాల్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాలపై పెట్టిన శ్రద్ధ పేదల ఇళ్లపై పెట్టలేదన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. అలాగే మండలంలోని చెల్పూర్ గ్రామంలో జరిగి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఉద్యాన సాగుకు రాయితీలు
భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటల సాగు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఉద్యాన పంట సాగువైపు రైతులు మొగ్గు చూపేందుకు వారికి ఆయా పంటల సాగు, యంత్ర పరికరాలపై రాయితీలు కల్పించనుంది. పండ్ల తోటలు, పూల సాగు, కూరగాయల సాగుకు సబ్సిడీలతోపాటు యంత్రాలు, యంత్ర పరికరాలు, సూక్ష్మనీటి సేద్యానికి 2025–26 ఏడాదికి ఉద్యానశాఖ రాయితీ అందిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 30వేల ఎకరాల ఉద్యాన పంటలు సాగవుతుండగా.. ఈ ఏడాది అదనంగా 5,200 ఎకరాలు పెంచాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్ధేశించింది. కూరగాయల పంటలకు.. టమాట పంట ఎకరాకు రూ.9,600, క్యాబేజీ రూ.9,600, క్యాలీప్లవర్, రూ.9,600, మిర్చి నారుకు రూ.9,600 సబ్సిడీ ఇవ్వనున్నారు. మల్చింగ్ వేసుకునే రైతులకు ఎకరాకు రూ.8వేలు, తీగజాతి కూరగాయల సాగు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం ఎకరానికి రూ.లక్ష, పూల రైతులకు ఎకరాకు రూ.8వేలు రాయితీగా అందించనుంది. ఆయిల్పామ్ సాగుకు.. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును పెంచాలనే లక్ష్యంతో ఎకరాకు మూడేళ్ల బిందుసేద్యంతో కలిపి రూ.50,818లను సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. గతేడాది వరకు ఆయిల్పామ్ సాగు 3,800 ఎకరాలు కాగా, ఈ ఏడాది 2,500 ఎకరాలు సాగు విస్తీర్ణాన్ని పెంచి 6300 ఎకరాలకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ఈ ఏడాది జాతీయ వెదురు మిషన్ (ఎన్బీం)ద్వారా 50 శాతం సబ్సిడీతో ఎకరాకు రూ.24,000 చొప్పున 50 ఎకరాలకు సబ్సిడీ అందించనుంది. యంత్రాలు.. ఉద్యాన పంటల సాగుకు 20 హెచ్పీ ట్రాక్టరుకు రూ.2.45లక్షల సబ్సిడీ, పవర్ టిల్లర్కు రూ.లక్ష, పవర్వీడర్కు రూ.75వేలు, బ్రష్కట్టర్స్ రూ.25వేలు సబ్సిడీ అందజేయనున్నారు. సూక్ష్మ సేద్యం.. ప్రైమ్మినిస్టర్ క్రిషి సించాయి యోజన పథకం కింద పండ్ల తోటలతో పాటు కూరగాయలకు, మిరప, ఆయిల్పామ్ సాగుకు బిందు, తుంపర సేద్యం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఇవ్వనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. ఉద్యాన పంటల సాగుకోసం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన పంటలతోపాటు కూరగాయల సాగుకు, ఇతర పంటల సాగుకు పోత్సాహం అందుతుంది. ఉద్యాన పంటలసాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రిప్ను కూడా సబ్సిడీపై అందజేస్తాం. ఆయిల్పామ్ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆసక్తిగల రైతులు వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. – సునీల్, ఉద్యాన పట్టు పరిశ్రమల జిల్లా అధికారిపండ్ల తోటలకు ప్రోత్సాహకం హెక్టారు మామిడి పంటకు రూ.19.200, నిమ్మ రూ.19,200, జామ రూ.19,200, అరటి రూ.16,800, బొప్పాయి రూ.7200, డ్రాగన్ప్రూట్ రూ.64,800, దానిమ్మ రూ.19,200, ముదురుమామిడి తోటల పునరుద్ధరణకు రూ.9,600 ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు, యంత్ర పరికరాలకు.. జిల్లాలో 30వేల ఎకరాల సాగు విస్తీర్ణం -
సర్దుబాటు ప్రక్రియ వాయిదా వేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదావేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేగూరి సుభాకర్రెడ్డి, కుసునపు కిరణ్కుమార్ కోరారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడం కోసం ఈ వేసవి సెలవులలో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఒకవైపు బడిబాట షెడ్యూల్ను ఈనెల 6వ తేదీ నుంచి 19వ తారీకు వరకు ప్రకటించి, పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియ 13వ తేదీలోపు పూర్తి చేయాలని మరొక ఉత్తర్వులను ఇచ్చి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కుసుమ కృష్ణమోహన్, నాయకులు లింగమూర్తి, హరిప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆదరణ బాగానే ఉంది..
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పొట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు లభిస్తుంది. – జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినంరోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు. – సయ్యద్ యాకుబ్, కాజీపేట -
బైపాస్ రహదారి ఏది..?
భూపాలపల్లి: నల్ల బంగారం, విద్యుత్ పరిశ్రమతో దినదినం అభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న భూపాలపల్లికి బైపాస్ రోడ్డు కలగానే మారుతోంది. గత, ప్రస్తుత పాలకులు హామీలు ఇచ్చినా, తమ మేనిఫెస్టోలో పొందుపరిచినా నిర్మాణం మాత్రం జరగడం లేదు. ఫలితంగా జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ట్రాఫిక్ సమస్య.. సింగరేణి గనులు, కేటీపీపీ పరిశ్రమలు ఉన్న భూపాలపల్లిలో నిత్యం వందల కొద్ది భారీ వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అంతేకాక కాళేశ్వరం వద్ద గోదావరి నది, మానేరు వాగుల నుంచి ఇసుక లారీలు, కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి జిల్లా కేంద్రం మీదుగా వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఆయా వాహనాలతో జిల్లా కేంద్రంలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. లారీలను జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచడం, పట్టణం లోపలి నుంచి భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాదనలకే పరిమితం.. 2018, 2023లో జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు జరిగి పార్టీలు అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణంలో పురోగతి లేదు. భూపాలపల్లి పట్టణానికి ఒకవైపు మొత్తం అటవీ ప్రాంతం ఉండటంతో మరోవైపు మోరంచపల్లి గ్రామం నుంచి గుడాడ్పల్లి, జంగేడు శివారు ప్రాంతం నుంచి పట్టణంలోని బాంబులగడ్డ అవతల అటవీ ప్రాంతం వరకు సుమారు 20 కిలోమీటర్ల దూరానికి రూ.200కోట్ల నిధులు అవసరం ఉంటాయని ఆర్అండ్బీ అధికారులు మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పునరావృతం అవుతూనే ఉంది. మాట నిలబెట్టుకుంటా.. ఎన్నికల సమయంలో ఇచ్చి న మాట ప్రకారం తప్పకుండా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయిస్తా. సీఎం రేవంత్రెడ్డి, నేను ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసి బైపాస్ రోడ్డుకు నిధులు మంజూ రు చేయాలని కోరాం. డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. డీపీఆర్ సిద్ధం కాగానే త్వరలోనే మరోమారు గడ్కారిని కలిసి నిధులు మంజూరు అయ్యేలా చూస్తా. – గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే, భూపాలపల్లి ఏళ్ల తరబడి ఎదురుచూపు రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య జాతీయ రహదారి పక్కనే లారీల నిలుపుదల నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వైనం -
పొట్టేల్..
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025కాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఏర్పడింది. ట్రై సిటీతో పాటు 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ పండుగ ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. వారు కొంత మాంసం వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్చానీ (దానం) ఇస్తారు.బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు. ధర రూ.5వేల నుంచి మొదలు -
అప్రమత్తంగా ఉండాలి
టేకుమట్ల: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. బుధవారం మండలంలోని వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రిజిస్టర్లు పరిశీలించారు. మండలంలోని గర్మిళ్లపల్లి, టేకుమట్ల, వెలిశాలలో ఇటీవల నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దొమ్మటి ప్రియాంక, హెల్త్ సూపర్వైజర్ విజయ, ఫార్మసిస్టు విద్యాసాగర్, స్టాప్ నర్సు చిత్ర, ఏఎన్ఎం సంగీత, మంజుల, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, సిబ్బంది ఉన్నారు. పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది సమయ పా లన పాటించాలని సూచించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రతీ శు క్రవారం డ్రైడే సర్వే చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. అనంతరం రంగాపురం, పిడిసిల్ల, మొట్లపల్లి గ్రామాల్లోని నూ తన సబ్ సెంటర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నాగరాణి, డా క్టర్ నవత ఏఎన్ఎంలు వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి
రేగొండ: కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణపురం మండలంలోని బుద్దారం నుంచి కోటంచ ఆలయం వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఆలయానికి సంబంధించిన ఆర్చి పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఆలయ గర్భగుడి పనుల పురోగతిపై చర్చించారు. అన్ని అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆలయానికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, ఛైర్మన్ బిక్షపతి, పీఆర్ డీఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సౌజన్య, కాంగ్రెస్ నాయకులు సంపత్రావు, పున్నం రవిభాస్కర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ప్రతీ దరఖాస్తు నమోదు చేయాలి
● కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కాటారం: రెవెన్యూ సదస్సులో భాగంగా భూ సమస్యలపై రైతులు, భూ యజమానులు అందిస్తున్న ప్రతి దరఖాస్తును మొదటగా రిజిస్టర్లో నమోదు చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ రెవెన్యూ అధికారులకు సూచించారు. భూభారతిలో భాగంగా కాటారం మండలం బొప్పారం, దామెరకుంట గ్రామాల్లో బుధవారం రెవెన్యూ సదస్సులు కొనసాగగా సబ్ కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల సేకరణ ప్రక్రియ, దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల నమోదు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తును ఆఫ్లైన్లో రిజిస్టర్లో నమోదు చేసి తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను వినాలని తెలిపారు. రెండో రోజు బొప్పారంలో 116, దామెరకుంట 249 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ సదస్సుల్లో నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం మల్హర్: భూ సమస్యలపై భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్ సింగ్ అన్నారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లారం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామసభను బుధవారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ సందర్శించారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి సదస్సులు దోహదపడుతాయని పేర్కొన్నారు. 282 దరఖాస్తులు.. మండలంలోని మల్లారం, కాపురం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ గ్రామసభలో వివిధ భూ సమస్యలపై రైతుల నుంచి 282 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. మల్లారంలో 72, కాపురంలో 282 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎస్ఓ శివ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ..
భూపాలపల్లి రూరల్: విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్టు గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తూ స్కాలర్షిప్ పొందడం కోసం అర్హత కలిగిన ముస్లిం, క్రిష్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శి జైనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులు వెబ్సైట్ద్వారా ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లారీడ్రైవర్పై గొడ్డలితో దాడి భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని లారీ మెకానిక్షెడ్లో లారీ డ్రైవర్పై దొంగ గొడ్డలితో దాడిచేసి గాయపరిచిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు డ్రైవర్ కల్యాణ్, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి షెడ్లోని లారీ బ్యాటరీని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించేందుకు ప్రయత్నాలు చేశాడు. పక్కనే ఉన్న డ్రైవర్ కల్యాణ్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగ గొడ్డలితో దాడికి పాల్పడి పారిపోయాడు. కల్యాణ్కు తలపై తీవ్రంగా గాయం కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. కొలతల ప్రకారం కూలీలు పనిచేయాలి ● డీఆర్డీఓ బాలకృష్ణ చిట్యాల/మొగుళ్లపల్లి: ఉపాధి హామీ పనిచేసే కూలీలు కొలతల ప్రకారం చేయాలని డీఆర్డీఓ పోరిక బాలకృష్ణ అన్నారు. బుధవారం చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలకు సమావేశం నిర్వహించారు. మొగుళ్లపల్లి మండలం గణేష్పల్లి గ్రామంలోని పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ కూలీలకు పని ప్రదేశంలో నీడ, ప్రథమ చికిత్స బాక్స్, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో టార్గెట్ ప్రకారం మొక్కలను నాటించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులకు పండ్ల తోటల కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు జయశ్రీ, సుభాష్ చంద్రబోస్, క్వాలిటీ కంట్రోల్ ధర్మసింగ్, ఏపీఓలు హలీం పాషా, టీఏలు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులు కీలకం
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్: భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని, భూపాలపల్లి మండలం వజినపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి సదస్సులు దోహదపడుతాయని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్కు సిఫారసు చేసి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలి.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్, డీఆర్డీఓ, విద్యా, ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వచ్చాక తదుపరి చికిత్సలు చేయడం కంటే రాకుండా ముందస్తు చర్యలు చాలా ముఖ్యమని తెలిపారు. వానాకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అన్ని పరీక్షలు నిర్వహిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని స్పష్టంచేశారు. ప్రతీ శుక్రవారం ప్రతీ కుటుంబం తప్పనిసరిగా డ్రైడే పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ వల్ల దోమల వ్యాప్తి జరుగుతుందని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. దోమలు వ్యాప్తి జరుగకుండా ఫాగింగ్ చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పీహెచ్సీల్లో ర్యాపిడ్ టీములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మధుసూదన్, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్, డీపీఓ వీరభద్రయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం సదస్సులు కాటారం: గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మంగళవారం బయ్యారం, ఆదివారంపేట గ్రామాల్లో కొనసాగిన రెవెన్యూ సదస్సులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. బయ్యారంలో 185, ఆదివారంపేటలో 34 దరఖాస్తులు వచ్చినట్లు తహశీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ సదస్సుల్లో నయాబ్ తహశీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు ప్రతీ శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
ఈసారైనా.. కొలిక్కొచ్చేనా?
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కోసం సేకరించే భూమికి పరిహారం ఇచ్చే విషయంలో ఇటు అధికారులు, అటు నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమైనప్పటికీ సంతృప్తికర చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన నేడు (బుధవారం) కలెక్టరేట్లో మరోమారు సమావేశం కానుండడంతో ఈసారైనా పరిహారం విషయం కొలిక్కివస్తుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత వ్యవసాయ భూములు కోల్పోతున్న నక్కలపల్లి (131 ఎకరాలు), గాడిపల్లి (110 ఎకరాలు) రైతులతో నేడు కలెక్టరేట్లో సమావేశం కానున్నారు. మరుసటి రోజు (గురువారం) నాన్ లేఅవుట్ ప్లాట్ల యజమానులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే మామునూరు విమానాశ్రయం కోసం 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉండగా.. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన మరో 253 ఎకరాల విషయంలో గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి రైతులను ఒప్పించడమే అధికారులకు పెద్ద టాస్క్గా మారింది. ఈప్రాంతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.పది లక్షలుంటే.. బహిరంగ మార్కెట్లో రూ.కోటిన్నర నుంచి రూ.మూడు కోట్ల వరకు ఉండడంతో రైతులు తమకు న్యాయంగా పరిహారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎకరానికి ప్రభుత్వం జనరల్ అవార్డు కింద రూ.65 లక్షలు చెల్లించనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కనీసం రూ.కోటిన్నర వరకై నా చెల్లించాలని రైతులు అంటున్నారు. మరికొందరు రైతులు భూమికి బదులు భూమి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్తో బుధవారం జరిగే చర్చలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కన్సంట్ అవార్డు కింద కలెక్టర్ తనకున్న అధికారాన్ని వినియోగించి ఎకరానికి రూ.98 లక్షలు ఇచ్చే యోచనలో ఉన్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా, భూసేకరణ చట్ట ప్రకారం తమకున్న పరిధిలో రైతులకు న్యాయం చేసేలా చూస్తామని, సాధ్యసాధ్యాలపై ఉన్నతాధికారులు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్రావు తెలిపారు. మామూనూరు విమానాశ్రయ స్థలసేకరణలో జాప్యం భూనిర్వాసితులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశం బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ నేడు మరోసారి చర్చించనున్న కలెక్టర్, రెవెన్యూ అధికారులు -
కేయూకు సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలు
కేయూ క్యాంపస్: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీలోని ఓల్డ్ అడ్మిషన్స్ డైరెక్టరేట్ బిల్డింగ్లో సో షియాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. గతంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగం (రెగ్యులర్ కోర్సు) ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీకి తరలింది.. కానీ.. ఆ విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది జాప్యం జరిగింది. ఈనెల 2న యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వగా.. మంగళవారం సోషియాలజీ విభాగాన్ని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కు షిప్ట్ చేశారు. కాగా.. మంగళవారం అక్కడే సోషియాలజీ విభాగంలో ఫైనలియర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు. కేయూకు ఎంస్డబ్ల్యూ.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ)ను కూడా కాకతీయ యూనివర్సిటీకి షిఫ్ట్ చేశారు. కాగా.. 2018లో నిర్మల్ పీజీ సెంటర్ నుంచి సోషియాలజీ కోర్సు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ ఒకే విభాగంగా కొనసాగుతూ వస్తోంది. సోషియాలజీ విభాగంలో 90 మంది, ఎంఎస్డబ్ల్యూలో 120 మంది విద్యార్థులున్నారు. సోషియాలజీ విభాగంతోపాటే ఎంఎస్డబ్ల్యూను కొనసాగించాలని విద్యార్థులు, అధ్యాపకులు అప్పటి వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో చివరికి ఎంఎస్డబ్ల్యూను కూడా వర్సిటీ క్యాంపస్కు షిఫ్ట్ చేస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 2న ఉత్తర్వులు జారీచేశారు. ఒకటి రెండురోజుల్లో ఎంఎస్డబ్ల్యూ విభాగం కూడా కేయూలోని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కే తరలించనున్నారు. ఎంఎస్డబ్ల్యూ రావడం హర్షణీయం.. ఎప్పటి నుంచో సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ క్యాంపస్లో ఉండాలని అందరూ కోరుకున్నారు. ఎట్లకేలకు షిఫ్ట్ చేయడం హర్షనీయం. వీసీ, రిజిస్ట్రార్కు కృతజ్ఞతలు. – ప్రొఫెసర్ స్వర్ణలత, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాధిపతి ఓల్డ్ అడ్మిషన్స్ బిల్డింగ్లో అన్ని ఏర్పాట్లు ఉత్తర్వులు జారీ చేసిన వర్సిటీ అధికారులు -
నేడు వేదపాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
హన్మకొండ కల్చరల్: చారిత్రక భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణంలో భాగంగా బుధవారం రాజగోపురాల నిర్మాణానికి, భద్రకాళి సాంగ ఆగమ సంస్కృత వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేషుభారతి తెలిపారు. ఈమేరకు దేవాలయం తూర్పు వైపు (మెయిన్ గేటు వద్ద) నుంచి రాజగోపురాల నిర్మాణం ప్రారంభం కానుంది. దేవాలయానికి వాయువ్య దిశలోని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం భూమిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈసందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చేతుల మీదుగా శిలాన్యాసం జరుగుతుందని తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు ఆర్.గోవింద హరి దేవాలయాన్ని సందర్శించారు. ఆయనను శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. పూజల అనంతరం భద్రకాళి శేషు, వేదపండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు అందజేసి మహదాశీర్వచనం అందించారు. గోవింద హరి వెంట రాష్ట్ర ప్రధాన స్థపతి వల్లీ నాయగం, రాష్ట్ర దేవాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు -
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: భూపాలపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి పంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పాల్గొన్నారు. నేటినుంచి గ్రామాల్లో జరిగే భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి 3,046, శాయంపేట మండలానికి 454 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలోని 211 మహిళా సంఘాలకు రూ.16.50 కోట్లు వడ్డీలేని రుణాలు అందించామన్నారు. మున్సిపల్ పరిధిలోని 12 సంఘాలకు రూ.2కోట్లు అందించినట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు డిపోల్లో పెట్టుకునే అవకాశం, పిల్లలకు స్కూల్ యూనిఫాం కుట్టే పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, గృహ నిర్మాణశాఖ పీడీ లోకిలాల్, డీఆర్ఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, చిట్యాల, రేగొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. -
ఉచిత ప్రయాణం, విద్యుత్..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకు వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలకు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పొదెం వీరయ్య తెలిపారు. రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే సన్నధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. పేదలకు సన్న బియ్యం అందించి ఆకలి తీర్చడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు లక్షా 24వేల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేయగా.. రూ.23.88 వేల కోట్ల రూపాయలు ఆదా జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు 5,233 ఇండ్లు మంజూరు చేశామన్నారు. -
డివిజన్ సరే.. సిబ్బంది నియామకమేది..?
హన్మకొండ: డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిబ్బంది నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రారంభం.. సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తులు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సేవలు అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత నెల 31న సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డివిజన్ పరిధిలోని ప్రస్తుత సెక్షన్లను విభజించి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశారు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈ పోస్టుగా మళ్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన ఇతర ఇంజనీర్లు, సిబ్బంది నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో డివిజన్ ఎప్పుడు ఏర్పాటవుతుంది..? ఎప్పటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ములుగు డివిజన్ పరిధిలో ములుగు టౌన్, మల్లంపల్లి, వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి సెక్షన్లు, ఏటూరునాగారం సబ్ డివిజన్లోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం సెక్షన్లు, ఎన్.వీ.పురం సబ్ డివిజన్లోని వెంకటాపురం(కె), వాజేడు సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటూరునాగారం, వెంకటాపురం(కె) సబ్ డివిజన్లలోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం. వెంకటాపురం(కె), వాజేడు సెక్షన్లను కలిపి ఏటూరునాగారం డివిజన్గా ఏర్పాటు చేశారు. డీఈ పోస్టు ఒకటే మంజూరు.. డివిజన్ పాలనా వ్యవహారాలు సాగించేందుకు డివిజనల్ ఇంజనీర్, ఏఈ కమర్షియల్, ఏఈ టెక్నికల్, ఇద్దరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. కాగా ఇందులో ఒక డీఈ పోస్టును మాత్రమే మంజూరు చేశారు. ఇతర పోస్టుల గురించి ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈగా మళ్లించినప్పటికీ నియామకం చేపట్టలేదు. ఇతర పోస్టుల మంజూరు, అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత లేకపోవడంతో డివిజన్ పరిపాలన కార్యక్రమాల ప్రారంభంపై స్పష్టత లేకుండా పోయింది.పని భారం పెరుగుతుందని ఆందోళన.. అదనపు పోస్టులు మంజూరు చేయకుండా.. అదనపు సిబ్బందిని నియమించకుండా ప్రస్తుత డివిజన్లోని ఉద్యోగులను విభజిస్తే వారిపై పని భారం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు, సిబ్బందిని నియమించకుండా నూతన డివిజన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు, అసోిసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలు, సర్కిళ్ల పునర్విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ వాచ్మెన్. స్వీపర్ పోస్టుల బైఫరికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. బైఫరికేషన్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు లేదు. ఇప్పటికై నా యాజమాన్యం వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సంఘాల బాధ్యులు కోరుతున్నారు.ఏటూరునాగారం కేంద్రంగా విద్యుత్ డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత కరువు ములుగు డివిజన్లోని సెక్షన్ల బదలాయింపు -
రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్: నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా, లక్ష్యాలను చేరుకునే విధంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులకు సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ రెవెన్యూ సదస్సులపై రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూకు సంబంధించిన సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మండలాల వారీగా తయారుచేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, సదస్సులపై అన్ని మండలాలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి మండలంలో ప్రజల సమస్యలు, భూ సంబంధిత వివాదాలు, పట్టాదారుల రికార్డులు, జనరల్ రెవెన్యూ పనితీరు మొదలైన అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని సమీక్షించాలన్నారు. ప్రతి దరఖాస్తు పక్కాగా రిజిస్టర్లో నమోదుచేయాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో రెవెన్యూశాఖ కీలకపాత్ర పోషిస్తున్నందున, ఈ సదస్సులు విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ముందస్తుగా టామ్ టామ్ ద్వారా ప్రచారం చేయాలన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
అంధకారంలో అమ్మవారు
కాళేశ్వరం: సరస్వతీ పుష్కరాలు ముగిసిన తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో సరస్వతీ ఘాటులో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. కనీసం విద్యుత్ దీపాలు, ఐమాస్ట్ లైట్లు, వీధి దీపాలు కూడా వెలగకుండా తొలగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారిపొడవునా విద్యుత్ దీపాలు కూడా లేవు. సరస్వతీ మాత అమ్మవారి విగ్రహం కూడా చిమ్మచీకట్లో ఉండడంతో రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవలనే టెంట్సిటీ వద్ద దొంగలు పడి ఏసీలు, కూలర్లు దొంగిలించుకుపోయిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు వెలగేలా చర్యలు తీసుకొని, విగ్రహం వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
మాట్లాడుతున్న వీరయ్య ● రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ● ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అటవీ ఆభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల ద్వారా అమలు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని తెలిపారు. పేదల సంక్షేమ, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణ 1,01,478మంది రైతులకు రూ.94.97వేల కోట్ల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం సీజన్ ముందుగానే ప్రారంభం కావడంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తనాలు, ఎరువుల నియంత్రణకు పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని పొదెం వీరయ్య తెలిపారు. టాస్క్ఫోర్సు టీములు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ధరణి లోపాలను సరిచేసేందుకు తెచ్చిన భూభారతి చట్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి శాసనసభ ఆమోదం ద్వారా చట్టాన్ని తెచ్చామని అన్నారు. భూభారతి ద్వారా భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నామని పేర్కొన్నారు. భూ భారతి చట్టంపై జిల్లావ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించామని, రేగొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి 11 రెవెన్యూ గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి భూ సమస్యల దరఖాస్తులు, చట్టంపై సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. భూ సమస్యలపై ప్రజల నుంచి దాదాపు 5,112 దరఖాస్తులు రాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులకు పట్టాలు అందజేస్తున్నట్లు చెప్పారు. కుంభమేళాను తలపించిన పుష్కరాలు త్వరలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని పొదెం వీరయ్య చెప్పారు. ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్చి నుంచి 2,375 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, 12,200మందిని చేర్పులు చేశామన్నారు. సరస్వతీ పుష్కరాలు కుంభమేళాను తలపించాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని, అశేష భక్తజనంతో కాళేశ్వరం జనసంద్రంగా మారిందని సంతోశం వ్యక్తంచేశారు. దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి సరస్వతీ మాతా ఆశీస్సులు తీసుకుని ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారని అన్నారు. ‘భూ భారతి’పై ఆశలు రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసకువచ్చిన భూ భారతితో తమ భూ సమస్యలు తీరుతాయని రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతుంది.న్యూస్రీల్– మరిన్ని ఫొటోలు, వివరాలు II,IIIలోu -
ప్రజలకు చేరువగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పోలీసులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ కిరణ్ఖరే జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. పోలీసులు వృత్తినే దైవంగా భావించి పనిచేయాలన్నారు. సమాజంలో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో కీలక భూమిక పోషించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, అదనపు ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్రావు, నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.చర్య తీసుకోవాలి కాటారం: నకిలీ భూ పత్రాలు సృష్టించి గిరిజన కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న మండలకేంద్రానికి చెందిన బాలచందర్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర పూల్సింగ్ నాయక్ తహసీల్దార్ను కోరారు. పూల్సింగ్ పలు సంఘాల నాయకులతో కలిసి సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్, జిల్లా నాయకుడు బొబ్బిలి రాజు, నాయక్పోడ్ సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లంకొండ పోశయ్య ఉన్నారు. వనదేవతలను దర్శించుకున్న ఈఓ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను అదనపు కార్యనిర్వహణాధికారి మేకల వీరస్వామి సోమవారం దర్శించుకున్నారు. మేడారం ఈఓగా బాధ్యతలను స్వీకరించిన ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. మేడా రం వచ్చిన నూతన ఈఓ వీరస్వామిని సిబ్బంది మార్యాదపూర్వకంగా కలిశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ వీరస్వామిని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు సన్మానించారు. -
మేడారంలో విత్తన పండుగ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో పూజారులు విత్తన పండుగ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క పూజారులు, స్థానిక ఆదివాసీలు గ్రామంలోని గ్రామ దేవతలను పసుపు, కుంకుమలతో అలకరించి కంకణాలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో పూజారుల కుటుంబీకులు, గ్రామస్తులు వన భోజనలకు వెళ్లారు. వనంలో కొత్త పందిరి వేసి పసుపు, కుంకుమలు, సార ఆరగించి ప్రకృతి దేవతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు, ఆదివాసీ పెద్దలు విత్తనాలు నాటేందుకు ముందుగా వర్షాలు ఏ కార్తెలో బాగా కురుస్తాయని కొత్త మట్టి కుండలో నీటిని పోసి ఒక్కొక్క కార్తె పేరు చెబుతూ ఇప్పపూలను వదులుతారు. నీటిలో ఇప్పపువ్వు తేలితే వర్షాలు అనుకూలంగా కురుస్తాయని ఆదివాసీలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయంగా విత్తన పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు తెలిపారు. అనంతరం వనంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. విత్తన పండుగతో మేడారంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, మహేశ్, భోజరావు, సిద్ధబోయిన రమేష్, సిద్ధబోయిన స్వామి, వసంతరావు, దశరథం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఛత్తీస్గఢ్ టు హైదరాబాద్
ఏటూరునాగారం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నుంచి ఐరన్ ఓర్ పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలిపోతోంది. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలో చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని, పర్మిషన్ ఉందా లేదా అంటూ ఆరా తీశారు. అయితే డ్రైవర్ సెల్ఫోన్లో ఆధారాలను చూసి విచారించి వదిలేశారు. గతంలోనే మావోయిస్టులు పలు ప్రకటనల్లో ఖనిజ సంపద తరలిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. కొద్ది రోజులకే ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ తరలిపోతుండడం గమనార్హం. ఖనిజ సంపదను తరలించేందుకే మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందా అనే అనుమానాలను పలు ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.తరలిపోతున్న ఐరన్ ఓర్ -
ప్రపంచ సైకిల్ డే ర్యాలీ
భూపాలపల్లి అర్బన్: ప్రపంచ సైకిల్ డేను పురస్కరించుకొని ఆదివారం యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించినట్లు డీవైఎస్ఓ సీహెచ్.రఘు తెలిపారు. కృష్ణకాలనీలోని అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించగా ఎస్సై సాంబమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్రెడ్డి, కోచ్ ఐశ్వర్య, క్రీడాకారులు పాల్గొన్నారు. అభినందన భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపల్ పరిధి వేశాలపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ నీరజ్ హైదరాబాద్ జింఖాన గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–14 అథ్లెటిక్ 1200 మీటర్ల పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించినట్లు కోచ్ ఐశ్వర్య తెలిపారు. బ్రాడ్జంప్లో రెండవ స్థానం సాధించి రజతం సాధించాడు. రెండు పతకాలు సాధించిన నీరజ్కు, కోచ్ ఐశ్వర్యకు సీనియర్ క్రీడాకారులు పర్స శ్రీనివాస్, సురిమిల్ల శ్రీనివాస్, రమేష్, ప్రసాద్, పురుషోత్తం, పాక శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు. విద్యుత్ మోటార్ చోరీ రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట గ్రామ శివారులో గ్రామానికి చెందిన రైతు వైనాల మహేందర్ పొలం వద్ద విద్యుత్ మోటార్ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మహేందర్ రెండు రోజుల పాటు పొలం వద్దకు వెళ్లలేదు. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా విద్యుత్ వైర్లు కట్ చేసి, మోటార్ చోరీకి గురైంది. రూ.30 వేలు నష్టం వాటిల్లిందని రైతు మహేందర్ ఆవేదన వ్యక్తంచేశాడు. బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బెగుళూర్ గ్రామానికి చెందిన సదానందం మేడిగడ్డ సమీపంలోని ఎల్ఎన్టీ రోడ్డులో బైక్ అదుపు తప్పి పడిపోయి గాయాలపాలయ్యాడు. ఆది వారం రాత్రి అంబట్పల్లికి వెళ్లి తిరిగి బెగుళూర్కు వస్తుండగా బైక్పై నుంచి పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటు ములుగు: ములుగు గ్రామ పంచాయతీ పురపాలక సంఘంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ పంచాయతీ బోర్డును తొలగించి పురపాలక సంఘ కార్యాలయం బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రస్తుతం మున్సిపల్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఆరుగురు క్రీడాకారులు.. 9 మెడల్స్ఏటూరునాగారం: మండల పరిధిలోని ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్న ఆరుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మెడల్స్ సాధించినట్లు క్లబ్ కోచ్ పర్వతాల కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని జింఖానా స్టేడియంలో నిర్వహించిన 11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2025లో వైష్ణవి దేవి 60మీటర్ల స్టాండింగ్ బ్రాడ్ జంప్లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు 60 మీటర్ల పరుగు పందెంలో మరో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే టెన్నిస్ బాల్త్రోలో గౌతమ్ ఒక మెడల్, 60మీటర్ల స్టాండింగ్ బ్రాడ్ జంప్లో గోల్డ్, 60మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ను దేవయ్య సాధించాడు, 60 మీటర్ల రన్లో రష్మిత సిల్వర్ మెడల్ అలాగే స్టాండింగ్ బ్రాడ్ జంప్లో బ్రాంజ్ మెడల్ సాధించింది, విఘ్నశ్రీ టెన్నిస్ బాల్ త్రో సిల్వర్ మెడల్, ఎం.మనోజ్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ బ్రాంచ్ మెడల్ సాధించారని కోచ్ వెల్లడించారు. -
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన
టేకుమట్ల: మండలంలోని అంకుషాపూర్–సోమనపల్లి ఆంజనేయస్వామి ఆలయ పునఃనిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలకు అంకుషాపూర్, సోమనపల్లి గ్రామాల ప్రజలు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్రెడ్డి హాజరై మొక్కులు చెల్లించారు. వారి వెంట మాజీ వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, మాజీ సర్పంచ్లు ఉద్దమారి మహేష్యాదవ్, పండుగ శ్రీను, నందకొండ రాంరెడ్డి, మంద రవి, నాయకులు తోట సాగర్, ఆలయ కమిటీ సభ్యులు, ఉన్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
పెరుగుతున్న సాగు.. గత వానాకాలం సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో జిల్లాలో పలు పంటల సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరితో పాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఇతర వంటల సాగు మరించి పుంజుకుంటుందని అధికారుల అంచనా లెక్కలు చెపుతున్నాయి. జిల్లాలో సుమారు 1,01,453 ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేసే అవకాశాలున్నాయి. సుమారు రెండు లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. 1,12,218 ఎకరాల్లో వరి సాగు జరగనుండగా 25వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు కావాల్చి ఉంది.పత్తి విత్తనాల దుకాణాలపై ప్రత్యేక నిఘా ● పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల తనిఖీలు ● అమ్మకాలు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన ● రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచనకాటారం: వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. సీజన్ ముగిసే వరకు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేయాలని పేర్కొంది. దీంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలోని సీడ్స్ దుకాణాలపై నిఘా పెట్టారు. అకస్మాత్తుగా దుకాణాల్లో తనిఖీలు చేపడుతూ వ్యాపారులను బెంబేలెత్తిస్తున్నారు. విత్తన అమ్మకాలు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అవసరమైతే దుకాణాన్ని సీజ్చేసి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.ప్రతీ దుకాణంపై నిఘా.. జిల్లాలో లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాలు సుమారు 325 వరకు ఉన్నాయి. వానాకాలం సీజన్ పసులు మొదలవడంతో వ్యాపారులు విత్తనాలు, మందులను స్టాక్ తెచ్చుకొని పెట్టుకున్నారు. కొంతమంది వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలను విక్రయించి రైతులను మోసంచేసిన ఘటనలు జిల్లాలోని పలు మండలాల్లో గత సీజన్లో ఉత్పన్నమయ్యాయి. ప్రధానంగా పత్తి, మిర్చి విత్తనాల్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అరికట్టడానికి వ్యవసాయాధికారులు, పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని విత్తన దుకాణాలపై నిఘాపెట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏ ఒక్క దుకాణాన్ని వదిలి పెట్టకుండా తనిఖీలు చేస్తూ నకిలీ విత్తన విక్రయాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. గతంలో కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, లూజ్ విత్తనాలు తీసుకొని అమాయకపు రైతులకు అంటగట్టేవారు. ప్రస్తుతం అధికారులు చేవడుతున్న తనిఖీలతో నకిలీ అనే మాట ఎత్తడానికి వ్యాపారులు జంకుతున్నారు.నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలి. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన నాణ్యతతో పాటు ప్యాకెట్పై బ్యాచ్ నంబర్ పరిశీలించాలి. లైసెన్స్ కలిగిన డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విత్తనాలు, లూజు విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే అధికారులకు సమాచారం అందించాలి. – వీరునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిన్యూస్రీల్ -
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నేడు(సోమవారం) ఉదయం 9:25గంటల కేటీపీపీ గోదావరి గెస్ట్హౌస్ నుంచి పోదెం వీరయ్య జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరనున్నారు. 9:35గంటలకు కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిపి అమరవీరులకు పుష్పాంజలి ఘటించనున్నారు. 9:45గంటలకు కలెక్టరేట్కు బయలుదేరి 9:55గంటలకు చేరుకుంటారు. 9:57గంటల నుంచి 9:59గంటల వరకు పోలీస్లతో ముఖ్యఅతిథి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన చేస్తారు. 10:05 నుంచి 10:20గంటల వరకు జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 10:20 నుంచి 10:40గంటల వరకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని కలెక్టర్ రాహుల్శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 9గంటలకు కలెక్టరేట్కు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 3గంటలకు సుభాష్కాలనీలోని సింగరేణి కమ్యూనిటి హాల్లో నియోజకవర్గ స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ధ్యానంతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: ధ్యానంతో మానసికోల్లాసం కలుగుతుందని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. యోగా, ధ్యానం చేసి ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో యోగా గురువు యర్రంకాని రాంబాబు శిక్షణ ఇచ్చారు. శ్వాస మీదనే ధ్యాస పెట్టాలని, ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రాణయామం చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ ధ్యానం, యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. శారీరకంగా, మానసికంగా, భావొద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుందన్నారు. ఒత్తిడి తగ్గి కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందని వివరించారు. ప్రతిఒక్కరూ వ్యాయామం తప్పకుండా చేయాలని ఏఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్, సీఆర్పీఎఫ్ సీఐ రాంబాబు, ప్రొహిబిషన్ ఎస్సైలు రామకృష్ణ, రచిత్ర తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం
భూపాలపల్లి అర్బన్: పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరమని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినో త్సవం సందర్భంగా శనివారం కోర్టు ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిలీప్కుమార్ హాజరై మాట్లాడారు. పొగాకు వాడటం వల న కేన్సర్ బారిన పడతారని, మెదడు, గుండె, ఊపితిత్తులకు చాలా ప్రమాదమన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారితో పొగాకు వాడటం మాన్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
అదనపు ఎస్పీగా బాధ్యతల స్వీకరణభూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీగా ఎ.నరేష్కుమార్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కాగా నరేష్కుమార్ 1991లో ఎస్సైగా ఎంపికై ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు సీఐడీ విభాగంలో పని చేశారు. 2023లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది ఖమ్మం కమిషనరేట్లో పని చేస్తూ భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ట్రైనింగ్ కిట్ల అందజేతభూపాలపల్లి: సింగరేణి జీవీటీసీలో లైసెన్స్డ్ సర్వేయర్లకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. అభ్యర్థులకు ట్రైనింగ్ కిట్లను అందజేసి, శిక్షణ కార్యక్రమంలో నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లికి బస్ సౌకర్యం కల్పించాలి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు ఆర్టీసీ బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆర్టీసీ ఆర్ఎం విజయభానుకు సింగరేణి ఏరి యా అధికార ప్రతినిధి మారుతి శనివారం వినతిపత్రం అందించారు. అడ్రియాల ఏరియా నుంచి సింగరేణి కార్మికులు భూపాలపల్లి ఏరి యాకు రావడానికి సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ద్విచక్ర వా హనాలపై విధులకు వచ్చి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, రెండు జిల్లాల మధ్య సంబంధాలు ఎక్కువగా ఉ న్నట్లు వినతిలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు సరికాదుభూపాలపల్లి అర్బన్: ఉపాధ్యాయ ఖాళీలను భ ర్తీ చేయకుండా ఉన్నటువంటి వారినే సర్దుబా టు చేయడం సరికాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలువే రు అశోక్, అయిత తిరుపతిలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తూనే మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్యను కు దింపు చేయడం సరికాదన్నారు. కలెక్టర్లకు ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వులు విరమించుకోవా లని డిమాండ్ చేశారు. ప్రతీ తరగతికి ఒక్క ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.చిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది. గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు. ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆరోజు ఏం జరిగిందంటే..! 2023 అక్టోబర్ 2న ఎన్ఐఏ ఉదయం నుంచి రాత్రి వరకు హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట, హంటర్రోడ్డు, పైడిపల్లిలో తనిఖీలు నిర్వహించింది. మావోయిస్టు పార్టీకి అనుబంధ సంఘంగా ఉందని చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) మాజీ సభ్యురాలి ఇంటితో పాటు, ఆమె తల్లిగారింట్లో సోదాలు నిర్వహించారు. అలాగే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఇంట్లోనూ సోదాలు చేశారు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్ నవత ఫొటోలను కూడా అధికారులు పరిశీ లించారు. అయితే ఆ సోదాల సందర్భంగా కూ డా ఎవరినీ ఎన్ఐఏ అదుపులోకి తీసుకోలేదు. న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
ఆధునిక పద్ధతులు అవలంబించాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడంతో పాటు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వీరునాయక్, ఏడీఏ భూపాలపల్లి రమేశ్, జిల్లా ఉద్యానవన అధికారి సునీల్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు. అలాగే కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడెపాకలో భూలక్ష్మీ, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. క్రీడలు ప్రేమానురాగాలు పెంచుతాయి చిట్యాల: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఏస్ ఆవరణంలో బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై క్రీడలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, సత్యం, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య, వెంకట్రామ్రెడ్డి, బుచ్చిరెడ్డి, స్వామి, నాయకులు పాల్గొన్నారు. -
సులభంగా.. వేగంగా..
రేపటి నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలుభూపాలపల్లి అర్బన్: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం కానుంది. గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రేపటి (సోమవారం) నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లపై అమ్మిన, కొన్నవారితో పాటు సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం పడుతుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సర్కారు సంకల్పించింది. ఇందుకోసం ఆధార్ ఈ సంతకం అమలు చేసేందుకు కూడా సిద్ధమమైంది. తద్వారా జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయవచ్చని భావిస్తోంది. సేవల్లో పారదర్శకత రిజిస్ట్రేషన్ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలని స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బు కింగ్ విధానాన్ని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్కు 48 స్లాట్లు.. సబ్ రిజిస్ట్రార్ రోజుకు 48 స్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. 48కి మించి స్లాట్లు బుక్ చేయడానికి వీలు లేదు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చాలా తగ్గిపోయాయి. ప్రస్తుతానికి 48 డాక్యుమెంట్లకు మించి అవసరం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం పైలెట్ జిల్లాలో విజయవంతమైంది. స్లాట్ బుకింగ్ ద్వారా రోజుకు ఒక సబ్ రిజిస్ట్రారు 48 స్లాట్లుగా నిర్ణయించారు. ఉదయం 24 స్లాట్లు, మధ్యాహ్నం 24 డాక్యుమెంట్లు చేసేలా విభజించారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాబ్ బుక్ చేసుకుని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లు అంటే.. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోని వారు ఈ వాక్ ఇన్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యమైన, అత్యవసర సమయంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఐదు డాక్యుమెంట్లను స్లాట్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. స్లాట్ బుక్ చేసుకోనివారు నేరుగా సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి వెళితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. స్లాట్ బుక్ చేసుకొని రావాల్సిందే.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ విధానంతో జూన్ 2 నుంచి అమలు కానుంది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు స్లాట్ బుక్ చేసుకొని రావాల్సి ఉంది. స్లాట్ బుకింగ్ సమయంలో కొనుగోలు, అమ్మకందారులు, మధ్యవర్తులు తప్పనిసరిగా ఉండాలి. స్లాట్ బుకింగ్ లేకుండా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయలేం. ప్రజలు గమనించి సహకరించాలి. – రేగళ్ల రాము, సబ్ రిజిస్ట్రార్ అత్యవసరమైన వారి కోసం వాక్ ఇన్ విధానం గంటల తరబడి నిరీక్షణకు తెర -
ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేయాలి
భూపాలపల్లి రూరల్: జిల్లాలో విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్ కేబుల్స్ సరిచేయాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ మల్సూర్ నాయక్ ఆపరేటర్లకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని విద్యు త్ కేబుల్ టీవీ వైర్లు వివిధ కంపెనీల ఇంట ర్నెట్ వైర్లు విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా తగిలించడంతో విద్యుత్ సిబ్బందికి మరమ్మతు చేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. కొన్ని రో డ్లపై కిందికి వేలాడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, భూపాలపల్లి జిల్లాలోని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో డిప్యుటేషన్ బదిలీలు
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్లతో పాటు సబ్ రిజిస్ట్రార్లకు డిప్యుటేషన్ రూపంలో స్థానం చలనం లభించింది. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ –1 సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న రామనరసింహరావు ఇటీవల స్టేషన్ ఘన్పూర్కు డిప్యుటేషన్పై వెళ్లగా, కొత్తగూడెంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రంజిత్ డిప్యుటేషన్పై స్టేషన్ ఘన్పూర్కు వచ్చారు. రామనరసింహరావు తిరిగి వరంగల్ ఆర్వోకు తన యథాస్థానం జాయింట్ –1 సబ్ రిజిస్ట్రార్ హోదాలో శనివారం చేరనున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మరో సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ను కేటాయించగా వరంగల్ ఆర్వోలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ నస్రీన్.. మహబూబాబాద్కు సబ్ రిజిస్ట్రార్గా డిప్యుటేషన్పై బదిలీ అయ్యారు.ప్రజాకవి కాళోజీ సినిమాకు గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డుహన్మకొండ కల్చరల్: జైనీ క్రియేషన్స్ బ్యానర్లో వరంగల్కు చెందిన నవలా రచయిత, సినీ దర్శకుడు ప్రభాకర్జైనీ దర్శకత్వం వహించిన, విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ప్రజాకవి కాళోజీ చిత్రం గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరున సినిమా అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజాకవి కాళోజీ చిత్రానికి గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ హర్షం వ్యక్తం చేశారు. మంచి చిత్రాలు, సామాజిక ప్రయోజనం కోసమే చిత్రాలు తీయాలనే ఉద్దేశ్యంతోనే ప్రజాకవి కాళోజీ చిత్రం తీసినట్లు, చైతన్యవంతమైన సమాజానికి ముఖ్యకారకుడైన కాళోజీని నేటి యువతరం మరిచిపోతున్నారన్నారు. మన తెలుగు జాతి వారసత్వ సంపద కాళోజీ అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజుకు ప్రభాకర్ జైనీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రేపు గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలుహన్మకొండ: ప్రతిభ కలిగిన గౌడ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు గోపా హనుమకొండ జిల్లా గౌరవాధ్యక్షుడు, ప్రతిభా పురస్కారాల ప్రోగ్రాం కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియేట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్లో జూన్ 1న జరగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 550 మార్కులకు పైగా, ఇంటర్లో 950 మార్కులకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు వేణుగోపాల్ వివరించారు. -
కాళేశ్వరంలో పెరిగిన నీటిమట్టం
బొగత జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులుత్రివేణి సంగమం వద్ద పెరిగిన నీటిమట్టం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం పెరిగింది. ఇటీవల ఎగువన అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి, ప్రాణహిత నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం 3వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు తరలిపోతోంది. గత వారం 1,800 – 2,200 క్యూసెక్కుల వరకు ప్రవాహం తరలిపోయింది.ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు శుక్రవారం తరలివచ్చారు. అడపాదడప కురుస్తున్న వర్షాలకు గుట్టలపైనున్న వాగు పొంగడంతో ఆ నీరు బొగతకు వచ్చి చేరుతోంది. దీంతో జలపాతం వద్ద కనువిందు చేస్తున్న జలధారలను వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.బొగతలో పర్యాటకుల సందడి– కాళేశ్వరం– వాజేడు -
బోడకాకర సాగుతో నికర ఆదాయం
మహబూబాబాద్ రూరల్: విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న ఆగాకర (బోడకాకర) సాగుతో అధిక దిగుబడి, నికర ఆదాయం వస్తుందని, చిన్న, సన్నకారు రైతులకు గొప్ప వరం లాంటిదని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. బోడకాకర సాగు, ఆదాయం, లాభాలు, ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే అంశాలపై ఆయన వివరించారు. లాభాలు :● బోడకాకర సాగును అన్ని పంటల కంటే ముందుగానే (మే నెలలోనే) ప్రారంభిస్తారు. 2 నెలలలోనే పంట చేతికొస్తుంది. 6 నెలల వరకు దిగుబడి ఉంటుంది. ● సీజన్, డిమాండ్ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. ● బోడకాకరలో పోషకాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే బోడకాకర సాగు లాభదాయకం. ● ఒక ఎకరంలో 4 నుంచి 6 నెలల కాలంలో కనీసం రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విత్తనం ద్వారా :● ఇది సులువైన పద్ధతి. విత్తనం మొలక 10 నుంచి 15 శాతంగా ఉంటుంది. అందులో మరలా ఆడ, మగ మొక్కలు ఉంటాయి. ఆడ మొక్కలు 15 నుంచి 20 శాతం ఉంటాయి. ఎకరాకు వరుస వరుసకు రెండు అడుగులు, పాదు పాదుకు ఒక అడుగు చొప్పున దూరంలో నాటడానికి 1,000 ఆడ మొక్కలు అవసరం అవుతాయి. దీనికి 3 వేల మొక్కలు అనగా 9 వేలు (మొలక 30 శాతం) గింజలు కావాలి. ఈ విధంగా ఎకరాకు అరకుంచం విత్తనం అవసరమవుతుంది. పొలంలో వరుస వరుసకు ఆరు అడుగులు, పాదు పాదుకు మధ్య ఆరు అడుగుల దూరంలో నాటిన స్తంభాల మధ్య వరుస వరుసకు రెండు అడుగులు, పాదు పాదుకు మధ్య రెండు అడుగుల చొప్పున 16 మొక్కలు వస్తాయి. (అనగా 36 చదరపు మీటర్లకు) ప్రతి 10 ఆడ మొక్కలకు 1 మగ మొక్కను విధిగా ఉంచుకోవాలి. దాదాపు వెయ్యి ఆడ మొక్కలకు 100 మగ మొక్కలు ఉండాలి. ● నారుమడిని వరుస వరుసకు నాలుగు అడుగులు, పాదు పాదుకు మధ్య ఒక అడుగు సైజులో, ఎత్తులో తయారు చేయాలి. 15 సెంటీ మీటర్ల వరుసల మధ్య 10 సెంటీ మీటర్ల దూరంలో విత్తనాలు విత్తాలి. వాటిపై గడ్డి వేసి పెట్టాలి. 40 నుంచి 45 రోజుల్లో మొలకలు వస్తాయి. మార్చి నెలాఖరులో నారుమడి వేస్తే, జూన్లో నాటుటకు తయారవుతాయి. నాటుట :● దుంపలను గాని విత్తనం మొక్కలను 30 నుంచి 30 సెంటీ మీటర్ల కొలతలు కలిగి పెంట ఎరువుతో నిండిన గుంతల్లో నాటుకోవాలి. నేరుగా గుంతల్లో విత్తనాలు నాటుకోవాలంటే ప్రతీ గుంతకు 10 నుంచి 15 విత్తనాలు వేస్తే 3 నుంచి 5 మొలకలు 40 నుంచి 45 రోజుల్లో వస్తాయి. అప్పుడు ఒక ఆడ తీగను ఉంచి మిగతావి వేరే చోట నాటుకోవాలి. పంట కాలం :● పంటకాలం మే/జూన్ నుంచి అక్టోబర్/నవంబర్ వరకు ఉంటుంది. తర్వాత తీగ చనిపోతుంది. దుంప భూమిలో సుప్తావస్థలో ఉంటుంది. మళ్లీ మే/జూన్లో మొలకెత్తుతుంది. ● అయితే జూన్ అక్టోబర్ మధ్యలో ఎక్కువగా పూసే ఆడ మొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకోవాలి. ● సాధారణంగా ఆకులు ఒకే తమ్మెతో తీగలు ఎక్కువ దిగుబడి ఉంటుంది. 2.5 కిలోలు మొక్కకు ఇస్తుంది. అదే ఆకులు 3 నుంచి 5 తమ్మెలుగా ఉన్న తీగలు తక్కువ దిగుబడి అంటే 1.0 నుంచి 1.5 కిలోలు మొక్క ఇస్తుంది. ● అదే విత్తనమైతే ప్రతి గుంతలో 10 నుంచి 15 విత్తనాలు వేయాలి. ● అందులో నుంచి 3 నుంచి 5 పిలుకలు / మొక్కలు 40 నుంచి 45 రోజుల్లో వస్తాయి. పందిరి :● భూమికి 4 నుంచి 6 అడుగుల ఎత్తులో కొబ్బరి తాడు / జీఐ వైరుతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి. తీగలను అంతటా పాకించాలి. లేదా ప్రతి మొక్క రెండు పాదలు ఏర్పాటు చేసుకుని తీగలను అల్లించవచ్చు. దిగుబడి : ● బోడకాకరను సాధారణంగా వెజిటబుల్ చికెన్ అని అంటారు. పంట 45 నుంచి 50 రోజుల్లో పూతకు వస్తుంది. పూత నుంచి కాయ కాయడానికి వారం రోజులు పడుతుంది. వారానికి రెండుసార్లు కోతకు వస్తుంది. ప్రతి కోతకు ఎకరం 40 నుంచి 50 కిలోలు వస్తాయి. సాధారణంగా 15 నుంచి 20 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది. ● ఆగస్టు నుంచి అక్టోబరు చివరి దాకా కాయలు వస్తాయి. ఆపై తీగలు ఎండిపోతాయి. మరల మరుసటి సంవత్సరం తొలకరికి దుంపలు చిగురిస్తాయి. వారానికి రెండు సార్లు కోత వస్తుంది. ప్రతి కోతకు 40 కిలోల కాయలు వస్తాయి. 8 నుంచి 10 క్వింటాళ్లు ఎకరాకు, అధిక దిగుబడికి మొదటగా బ్రష్తో మగ పూల నుంచి పుప్పొడి సేకరించి, ఉదయం వేళలో ఆడ పూలపై అద్దాలి. ● వెదురు బుట్టల్లో అడుగున ఎండుగడ్డి వేసి, కాయలతో నింపి తడి గోనె సంచిలో కప్పి ప్యాకింగ్ చేసి దూరం ప్రాంతాలకు మార్కెట్ చేస్తారు. కాపు అనంతరం నవంబరు నుంచి నీరు పెట్టరాదు. నిద్రావస్థలో వుంచాలి. మరలా మే నుంచి మొలకలు వస్తాయి.రోగ నిరోధక శక్తి పెంపు ప్రస్తుత వాతావరణ మార్పులు, పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, డెంగీ, కరోనా, పలు వైరసుల వల్ల కలిగే అనారోగ్య లక్షణాల నుంచి సంరక్షణకు, రోగ నిరోధక శక్తి పెరగాలంటే అధిక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్న ఆగాకర (బోడకాకర) చాలా ముఖ్యం.బోడకాకర ఏక పంటగా, అంతర పంటగా, బోర్డర్ పంటగా, టెర్రస్ (మిద్దె) తోటగా, ఇంటి ఆవరణంలో పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఈ తీగజాతి పంట, అటవీ ప్రాతంలో సహజసిద్ధంగా పండేది. రానురాను ఈ పంటకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దాంతో రైతులు ఈ పంటను చిన్నచిన్న కమతాల్లో సాగు చేసుకుంటున్నారు. ఆగాకర కాయలో ఔషధ గుణాలు, పోషక విలువలు మెండుతక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉండే బోడకాకరలో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉండి కిలో రూ.80 నుంచి రూ.200 ధర పలుకుతోంది. ఉద్యాన రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.ముఖ్యాంశాలు తప్పనిసరిగా ప్రతి 10 ఆడ మొక్కలకు, ఒక మగ మొక్క చొప్పున నాటుకోవాలి. మగపూల నుంచి సేకరించిన పుప్పొడిని మె త్తటి బ్రష్తో తీసుకొచ్చి ఆడపూలపై అద్దితే ఎక్కువ దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో వర్షపాతం తక్కువైనప్పుడు 10 రోజులకోసారి తేలికపాటి తడులు ఇవ్వాలి.రాయితీలు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం నుంచి పందిరి సాగుకు రూ.50 వేల రాయితీ ఉంది. -
‘ఉపాధి’ వేతన బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలను విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలి రూ.600లు, 200 రోజుల పనిదినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాములు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో వచ్చిన గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల ఏర్పాటు పేరుతో గ్రామాలను విలీనం చేసి లక్షలాది మందిని ఉపాధి పనికి దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంబాల స్వరూప, లోకిని స్వరూప, వేలు రజిత, చిలుక రాఘవులు, అజ్మీరా భిక్షపతి, మనీఫా చందు, నర్సింగం తదితరులు పాల్గొన్నారు. పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు -
ఆ సినిమాలకు అవార్డులు తిరస్కరించాలి
న్యూశాయంపేట: పుష్ప –2 సినిమాలో స్మగ్లర్ పా త్ర పోషించిన అల్లు అర్జున్కు, రజాకార్ సినిమాకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులను తిరస్కరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకుడు మో తె లింగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం ముగింపు సమావేశంలో శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను అవమానపరుస్తూ తీసిన రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రక వారసత్వ సినిమా అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూములను పంచిపెట్టిన చరిత్ర ఎర్రజెండా పార్టీకే దక్కిందని గుర్తుచేశారు. ఆనాడు పటేల్ సైన్యాలతో గ్రామాలపై విరుచుపడి ప్రజలపై కాంగ్రెస్ పార్టీ దాడి చేసి చంపించిందని, నేడు అదేతీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ తీసిన సి నిమాలకు ఉత్తమ సినిమా అవార్డులు ఇవ్వడం అమరవీరులను అవమానపరచడమే అని అన్నా రు. అలాగే మూఢనమ్మకాలు, అశాసీ్త్రయ భావజాలాన్ని పెంపొందిస్తూ వచ్చిన కల్కి సినిమాకు కూడా ఉత్తమ సినిమా అవార్డు రావడం భారత సమాజాన్ని మూఢ విశ్వాసాల వైపు తీసుకెళ్లడమేనని చెప్పారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, ఎన్.అశోక్ స్టాలిన్, డాక్టర్ మార్క శంకర్ నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులు మంచాల రమాదేవి, కర్రె లక్ష్మణ్, మునిగాల భిక్షపతి, బాషబోయిన సంతోష్, జక్కు రాజుగౌడ్, బత్తిని సదానందం పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు -
ప్రజల్లో ధైర్యం కల్పించేందుకే కవాతు
హసన్పర్తి: ప్రజల్లో ధైర్యం కలిగించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి కవాతు ప్రారంభించారు. హనుమకొండ బస్టాండ్, బ్రాహ్మణవాడ, అలంకార్ జంక్షన్, చౌరస్తా మీదుగా అశోక్ జంక్షన్ వరకు కవాతు సాగింది. అనంతరం కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. కేంద్రహోం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈకార్యక్రమం ఏడు రోజులు కొనసాగుతుందన్నారు. కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్స్టేషన్లలో కవాతు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణ తలెత్తినా తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా కవాతు నిర్వహిస్తున్నట్లు సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సరస్వతి, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ సతీష్, రవికుమార్, సత్యనారాయణరెడ్డితో పాటు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏడు రోజుల పాటు కార్యక్రమాలు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
‘సీకేఎం’ వైద్యుల నిర్లక్ష్యం
ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత ప్రాణం మీదికి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం వరంగల్ కాశికుంట ప్రాంతానికి చెందిన నజియా భాను ప్రసూతి సేవల కోసం సీకేఎంలో ఈనెల 25న రాత్రి చేరారు. రాత్రి సుమారు నాలుగు గంటలు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు బాబు జన్మించినట్లు తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆరు రోజులు బాలింతను కుటుంబ సభ్యులకు చూపించకుండా వైద్య సేవలు కొనసాగుతున్నట్లు చెబుతూ వచ్చారు. శుక్రవారం ఉదయం నజియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఎంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ కేస్ షీట్ అందించాలని కోరారు. కేస్ షీట్ పోయిందని, కొత్తది రాసిస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. నజియా బేగంను వెంటనే చూపించాలని పట్టుబట్టారు. అప్పటికే నజియా బేగం పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి భవనం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. -
రాయబంధంలో మావోయిస్టు సభ్యురాలికి చికిత్స
● రెండు రోజుల్లో ఎస్పీ ఎదుట హాజరు ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాయబంధంలో మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు మడకం చిట్టి అలియాస్ కీడో రహస్యంగా చికిత్స పొందుతోంది. ఇటీవల కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె ఎడమ కాలుకు బుల్లెట్ తగలడంతో ములుగు జిల్లా చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధిలోని రాయబంధం గొత్తికోయగూడెనికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, ఆమె కాలుకు గాయం కావడంతో చికిత్స కూడా చేయిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దామోదర్ రక్షణ స్థాయిలో పనిచేసే సెంట్రీగా ఆమెను పోలీసులు భావిస్తున్నారు. చిట్టి అరెస్టును పోలీసులు మరో రెండు రోజుల్లో చూపెట్టి ఎస్పీ ఎదుట హాజరుపర్చిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అనామక ఫిర్యాదులపై విచారణహన్మకొండ: అనామక ఫిర్యాదులపై సీవీసీ నిబంధనల ప్రకారం ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత, అందులో వాస్తవాలు నిర్ధారణ అయితేనే శాఖా పరమైన చర్యలు చేపడుతామని టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ చీఫ్ ఇంజనీర్ టి.మధుసూదన్ స్పష్టం చేశారు. యా జమాన్యానికి వచ్చే అనామక ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆరోపణల్లో ప్రాధాన్యం ఉంటే సీవీసీ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టడానికి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్కు పంపిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణలో వెలుగు చూసే అంశాల ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. విచా రణలో ఆరోపణలు అవాస్తవాలు అని నిరూపితమైతే ఎలాంటి శాఖాపరమైన చర్యలుండవని తెలిపారు. ఆరోపణలు వాస్తవమని నిరూపితమైతేనే చర్యలు తీసుకుంటామని వివరించారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
కాటారం: రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకాణాల్లో వ్యవసాయశాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో విక్రయిస్తున్న పత్తి విత్తనాల కంపెనీ వివరాలు, నిల్వ ఉన్న స్టాక్, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పర్యావరణానికి హానిచేసే హెచ్టీ కాటన్, బీజీ–3 విత్తనాలను విక్రయించవద్దని సూచించారు. నాన్లేబుల్డ్ సంచులలో ఉన్న విత్తనాలను అమ్మితే కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించవద్దని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో విక్రయిస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు. రైతులు అడిగిన విత్తనాలు మాత్రమే ఇవ్వాలని నాసిరకం విత్తనాలు వారికి అంటగంటవద్దన్నారు. తప్పనిసరిగా కొనుగోలు రశీదు ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ వెంట ఏఓ పూర్ణిమ, ఎస్సై మ్యాక అభినవ్ ఉన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి సూచించారు. పీఏ సీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గారెపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం డీఎస్పీ పరిశీలించారు. కొనుగోళ్లు, ధా న్యం నిల్వలు, రవాణాపై ఆరా తీశారు. కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం అంకుషాపూర్లోని అన్నపూర్ణ రైస్మిల్ను డీఎస్పీ తనిఖీచేశారు. ధాన్యం వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించా రు. డీఎస్పీ వెంట ఎస్సై మ్యాక అభినవ్, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీశ్, సిబ్బంది గోపాల్ ఉన్నారు.కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి -
లింగ నిర్ధారణ నేరం
భూపాలపల్లి అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని చెప్పుడం చట్టరీత్యా నిషేధమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరికై నా లింగనిర్ధారణ సమాచారం తెలిస్తే 63032 39891ఫోన్ నంబర్కు వాట్సాప్ చేయాలని, లేదా 104, 181, 1098, 100 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఎంసీహెచ్ పీఓ డాక్టర్ శ్రీదేవి, పీఓ డాక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు. -
అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
భూపాలపల్లి: రాష్ట్ర అవతరణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార, డీఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరవీరుల స్తూపం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ప్రొటోకాల్ పాటిస్తూ అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానాలు, సురక్షిత తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాలను భూపాలపల్లి ఆర్డీఓ ఆసాంతం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు పరిశీలన.. గణపురం: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. శుక్రవారం గణ పురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, బుర్రకాయలగూడెంలోని ధనలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లును కలెక్టర్ పరిశీలించారు. లక్ష్మారెడ్డిపల్లెలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యపు తేమ శాతాన్ని పరిశీలించి నిర్ధేశిత శాతం తేమ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. బుర్రకాయలగూడెంలో రైస్మిల్ను పరిశీలించి మిల్లర్తో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే దిగుమతి చేసుకోవాలని, అందు కు తగినంత మంది హమాలీలను సిద్ధంగా ఉంచా లని సూచించారు. శుక్రవారం వరకు 12,319 మంది రైతుల నుంచి 74,425 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ సీజన్లో 43,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, సహకార అధికారి వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులను ఇబ్బందికి గురి చేయొద్దు కలెక్టర్ రాహుల్ శర్మ -
పుస్తకం లేకుండా పాఠం!
రెండో సెమిస్టర్కు పుస్తకాలే లేవు.. డిగ్రీ, పీజీ కోర్సుల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు రావాల్సింది. పీజీ కోర్సుల్లో ఎమ్మెస్సీ బాటనీ, ఫిజిక్స్ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. మిగతా సైన్స్ కోర్సుల సబ్జెక్టుల పరీక్షల ఫలితాలు రావాల్సింది. 2023–24లో మొదటి సెమిస్టర్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రస్తుతం మూడో సెమిస్టర్లో ఉండాలి కానీ, ఇప్పటివరకు వారికి సెకండ్ సెమిస్టర్ తరగతులకు నిర్వహించకపోగా.. పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. ప్రధానంగా ఇయర్ వైజ్ పద్ధతి నుంచి సెమిస్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టాక సెమిస్టర్ సిస్టమ్లో పుస్తకాలు రాయించాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య కేంద్రంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) డిగ్రీ, పీజీ తదితర కోర్సులకు ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండేది. కానీ, కొన్నేళ్లుగా వీటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించకపోవడం, తరగతులు, పరీక్షలు నిర్ణీతసమయంలో ఉండకపోవటం, పరీక్షలు రాశాక ఫలితాలు ఎప్పుడు వస్తాయో నిరీక్షించాల్సిన పరిస్థితులతో అసలెందుకు చేరామోనని విద్యార్థులు ఆవేదన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొత్తగా చేరేవారి సంఖ్య సైతం తగ్గిపోతోంది. యూనివర్సిటీ యూజీసీ డెక్ నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలోని విద్యార్థులకు దూరవిద్య కేంద్రంలో అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2023– 24 విద్యాసంవత్సరంనుంచి సెమిస్టర్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. అన్ని కోర్సులు కలిపి 5,518మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించలేకపోయారు. ఆలస్యంగా అరకొరగానే పుస్తకాలు ఇచ్చారు. ముద్రించని మెటీరియల్.. పీజీ సైన్స్ కోర్సుల్లో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు ఒక సెమిస్టర్కు మొత్తంగా 21 పాఠ్యపుస్తకాలు ఉంటాయి. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 10 పుస్తకాలను సంబంధిత అధ్యాపకులతో రాయించారు. ఈ ప్రక్రియ కూడా ఆలస్యమవడంతో పరీక్షలకు కొన్నిరోజులముందు ముద్రించి ఇచ్చారు. మిగతా 11 పాఠ్యపుస్తకాల్లో 8 పుస్తకాలు రాయించారు. కానీ, పుస్తకరూపంలో ముద్రించడం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జనవరిలో పీజీ సైన్స్కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. కొన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ను పీడీఎఫ్లో విద్యార్థుల మొబైల్స్కు పంపారు. పీజీ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ కోర్సుల్లో కూడా మొదటి సెమిస్టర్కు పాఠ్యపుస్తకాలు కొన్నింటిని మాత్రమే ఇచ్చి, మిగతావి పీడీఎఫ్ రూపంలో అందించారు. సెన్స్ పరీక్షలు నిర్వహించిన నెలరోజుల తరువాత ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఆరునెలలకో సెమిస్టర్ పూర్తి.. ప్రతి ఆరునెలలకో సెమిస్టర్ పూర్తికావాల్సి ఉండగా.. ఏడాది దాటిపోయాకే మొదటి సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది.. పుస్తకాలు ఎప్పడిస్తారనే సమాచారం కోసం దూరవిద్యకేంద్రంలోగానీ, ఫోన్ ద్వారా కోరితే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ఉద్యోగస్తులు ఎక్కువగా ప్రమోషన్లు, తదితర అవసరాల నిమిత్తం దూరవిద్య కోర్సుల్లో చేరుతారు. కానీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ఆలస్యంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మొదటి సెమిస్టర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో 2024–25 విద్యాసంవత్సరంలో మొదటి సెమిస్టర్లకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఒక బ్యాచ్కి గత ఏడాది సెప్టెంబర్– అక్టోబర్లో, మరో బ్యాచ్కు ఈఏ డాది జనవరి –మార్చి వరకు అడ్మిషన్లు కల్పించారు. ఈరెండు బ్యాచ్లను ఒకే విద్యాసంవత్స రం కిందికే పరిగణిస్తారు. అన్నికోర్సులు కలిపి 4,498 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో కొందరికి మాత్రమే పుస్తకాలు ఇచ్చారు. ముద్రణకు టెండర్ ప్రక్రియలో జాప్యం.. పాఠ్యపుస్తకాలు రాయించడం.. వాటిని ముద్రించడంలో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నినెలల క్రితమే యూనివర్సిటీ అధికారులు పాఠ్యపుస్తకాల ముద్రణకు టెండర్ నిర్వహించగా.. హనుమకొండకు చెందిన ఓ ప్రింటర్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పుస్తకాల ముద్రణకు ఆర్డర్ ఇవ్వలేదు. కేయూ పాలకమండలి సమావేశంలో ఫైనాన్సియల్ అప్రూవల్ కోసం పెట్టాకే పుస్తకాలను ముద్రణకు ఇస్తారని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.కేయూ దూరవిద్య కోర్సుల్లో ముద్రణకు నోచని పుస్తకాలు అరకొరగా అందజేత.. మిగతావి పీడీఎఫ్ రూపంలో విద్యార్థులకు.. అస్తవ్యస్తంగా సెమిస్టర్ విధానం. ఆలస్యంగా పరీక్షల నిర్వహణ.. రోజురోజుకూ తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య -
టేకు కలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి వంశీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వెంకటాపురం మండల మీదుగా అక్రమంగా రెండు వాహనాల్లో టేకు దిమ్మలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆలుబాక గ్రామ సమీపంలో రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 17 టేకు దిమ్మలను పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.6.5లక్షలు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో ఆలుబాక సెక్షన్ అధికారి చంద్రమోహన్, ఎదిర సెక్షన్ ఆఫీసర్ జయసింగ్, సిబ్బంది ప్రణవి, లాలు, బెస్ క్యాంప్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గురువారం పౌర సరఫరాలు, డీఎం, జిల్లాలోని అన్ని బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాలలో నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు రవాణాను వేగవంతం చేయాలని సూచించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతి కోసం హమాలీలను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం స్వీకరించినట్లు మిల్లర్లు ఇవ్వాల్సిన అంగీకార పత్రాలను వెంటనే అందజేయాలని తెలిపారు. అధికారులు నిరంతరం మిల్లులు తనిఖీ చేస్తూ ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. -
పాఠశాలల పున:ప్రారంభం రోజు పంపిణీకి చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాలోని అన్ని మండలాల ఎమ్మార్సీలకు చేరుకున్నాయి. 1.45లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజే విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు.జూన్ 6నుంచి బడిబాట..ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ప్రతీ విద్యార్థికి పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తి స్థాయిలో సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందజేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.మండలాల వారీగా పంపిణీ..జిల్లా వ్యాప్తంగా 11 మండలాలు ఉండగా మండలాల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించారు. మరో మూడు నాలుగు రోజుల్లో పాఠశాలలకు పంపించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. 1,49,133 పుస్తకాలు అవసరం ఉండగా 1,45,380 పుస్తకాలు జిల్లాకేంద్రంలోని పుస్తకాల డిపోకు చేరుకోగా.. మండలాలకు పంపించారు. పార్ట్–2లో 42వేల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అక్టోబర్ మాసం వరకు మిగితా పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.పాఠశాలలకు చేరుకున్న నోట్ పుస్తకాలుప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేదలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఉచిత నోట్ పుస్తకాలు అందిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు ఒక్క నోట్స్ చొప్పున అన్ని సబ్జెక్టులకు అందించనున్నారు. ఈ నోట్ పుస్తకాలు కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు పంపించారు. 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించనున్నారు.పున:ప్రారంభం రోజే పంపిణీజిల్లాకు ఇప్పటికే 97శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మిగితా పుస్తకాలు కూడా వారం రోజుల్లో రానున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రం నుంచి మండలకేంద్రాలకు పంపించాం. అక్కడి నుంచి పాఠశాలలకు చేరుకుంటాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీచేస్తాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ -
అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతా..
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని 8, 27 వార్డులైన జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బీమ్, జై బాపూ, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా కాలనీలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ నిధులు రూ.2 లక్షల వ్యయంతో వేసిన తాగునీటి బోరు మోటారును ప్రారంభించారు. అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు ప్రజా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, టీపీసీ సభ్యులు మధు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
బ్లాస్టింగ్లతో భయాందోళన
మల్హర్: తాడిచర్ల ఓసీపీలోని బ్లాస్టింగ్లో రోజురోజుకు భయందోళనల మధ్య జీవనం సాగిస్తున్నామని పెద్దతాడిచర్ల గ్రామానికి చెందిన అనుమాల లక్ష్మయ్య, దేవక్క దంపతులు గురువారం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓసీ ప్రాజెక్టు దగ్గరగా ఉండడంతో పాటు స్థాయికి మించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ ఇళ్ల పైకప్పులు పగలడంతో పాటు, గోడలకు బీటలు వారి కూలి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లోని పక్క గది రేకులు కింద పడడంతో పరగులు తీశామని వాపోయారు. ప్రాణ నష్టం జరుగకపోయినా మున్ముందు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని భయంగా ఉందని వారు తెలుపుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయడంతో పాటు డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లు సేకరించాలని కోరారు. -
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకుమించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస పాల్గొన్నారు.ఎరువులు, విత్తనాలపై నిఘా ఉంచాలి ధాన్యం సేకరణలో దేశంలోనే మొదటి స్థానం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ సమీక్ష పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు, భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. -
వన మహోత్సవానికి సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వన మహోత్సవం నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 241 నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రక్రియ గతేడాది అక్టోబర్ నుంచే ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాలు నాటి మొక్కలను సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో ఈ ఏడాది పూలమొక్కలు, నీడనిచ్చే తదితర జాతులకు చెందిన 18.82 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా డీఆర్డీఏ 17 లక్షలు, ఫారెస్టు శాఖ 51వేలు, సింగరేణి 1.31 లక్షల మొక్కలను కేటాయించారు. ఇందులో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 29,81,400, ఫారెస్టు ఆధ్వర్యంలో 1,51,000, సింగరేణి ఆధ్వర్యంలో 1,67,000 మొత్తం 32,99,400 పెంచిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. గత సంవత్సము నాటిన మొక్కలు ఎదగక ముందు చనిపోతే వాటి స్థానంలో మళ్లీ నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, కాల్వలు, చెరువుగట్లు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటుతారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీలు, ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణకు వన సేవక్లను నియమించారు. మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు. ప్రతీ పదిహేను రోజులకోసారి కలుపు తీసి ఎరువులు వేస్తున్నారు. చనిపోయిన, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా విత్తనాలు, మొక్కలు నాటుతున్నారు. ఎండ వేడికి మొక్కలు చనిపోకుండా ప్రతీ నర్సరీలో గ్రీన్షేడ్నెట్ (నీడ పరదాలు) ఏర్పాటు చేశారు. జూన్ నెలలో ప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవంలో మొక్కలు నాటనున్నారు. భారీ వృక్షజాతుల మొక్కలు.. భారీ వృక్ష జాతుల మొక్కల పెంపకం ఈ ఏడాది నుంచి చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సుమారుగా 7.63 లక్షల మొక్కలను దాదాపు 2.5 మీటర్ల ఎత్తు పెంచడానికి నర్సరీల్లో చర్యలు తీసుకుంటున్నారు. భారీ వృక్షజాతులుగా పిలిచే గల్మోహార్, నిద్రగన్నేరు, కానుగ, సుబాబుల్, చైనా బాదం, తటోబియా, నల్లమద్ది, గీత కార్మికుల కోసం ఈత, తాటి మొక్కలు పెంచుతున్నారు. ఏడాది పాటు నర్సరీల్లో పెరిగితే దాదాపు రెండు మీటర్ల నుంచి 2.5 మీటర్ల ఉంటాయి. ఆ మొక్కలను ప్రభుత్వ స్థలాలు, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటితే నీడతో పాటు, ఆహ్లాదంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీగా మొక్కల ను నాటేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.జిల్లాలో 18.82 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం అందుబాటులో 32.99లక్షల మొక్కలు ఎండల నుంచి రక్షణకు గ్రీన్ షేడ్నెట్ ఏర్పాటు ప్రతీ నర్సరీకి వన సేవక్ల ఏర్పాటుమండలాల వారీగా పెంచిన మొక్కలు (లక్షల్లో)భూపాలపల్లి 2.98 చిట్యాల 3.09 గణపురం 2.09 కాటారం 2.98 మహదేవ్పూర్ 2.23 మహముత్తారం 2.96 మల్హర్ 1.85 మొగుళ్లపల్లి 3.09 పలిమెల 0.98 రేగొండ 4.58 టేకుమట్ల 2.98 ఫారెస్టుశాఖ 0.51 సింగరేణి 1.31ఇంటి ఆవరణలో మొక్కలు నాటుకోవాలి వన మహోత్సవంలో భాగంగా పంపిణీ చేసే పండ్ల మొక్కలు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు ప్రతీ ఇంటి ఆవరణలో నాటుకోవాలి. ఈ సంవత్సరం జూన్, జూలై మాసాల్లో వన మహోత్సవం పూర్తి చేయాలనుకుంటున్నాం. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలి. ఎండ నుంచి రక్షణ కోసం గ్రీన్ పరదాలను ఏర్పాటు చేశాం. మొక్కలు చనిపోకుండా ఎరువులు వేసి కాపాడుతున్నారు. – బాలకృష్ణ, డీఆర్డీఓ -
బొగ్గు ఉత్పత్తిని పెంచాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో ఓపెన్కాస్టులో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే ఓసీ–2లో నూతనంగా కొనుగొలు చేసిన షావల్ వాహనాన్ని బుధవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రూ.1.71కోట్లతో కొనుగోలు చేసిన వాహనానికి సరస్వతి అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ షావల్ యంత్రం లేకపోవడంతో గంటకు రూ.7వేల నష్టం సింగరేణికి వాటిల్లుతుందన్నారు. దీంతో బొగ్గు ఉత్పత్తి చేసి ముందంజలో ఉండాలని సూచించారు. ఉద్యోగులకు కేటాయించిన 8 గంటల పనిని తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, ఏర్రన్న, ప్రసాద్, వెంకటరమణ, భిక్షమయ్య, రాజరావు, కిష్టయ్య, నజీర్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీఆర్డీఓగా బాధ్యతల స్వీకరణభూపాలపల్లి రూరల్: జయశంకర్భూపాలపల్లి జిల్లా డీఆర్డీఓగా పొరిక బాలకృష్ణ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన నరేష్ జగిత్యాలకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ కార్యాలయం సిబ్బంది బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.‘చలో వరంగల్’ను జయప్రదం చేయాలి’వాజేడు: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31న వరంగల్కు వస్తున్నందున స్వాగతం పలికేందుకు నిర్వహించ తలపెట్టిన చలో వరంగల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ములుగు జిల్లా ఇన్చార్జ్ దుడ్డు రామకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుని వరంగల్కు వస్తున్న మంద కృష్ణకు స్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాదిగ, మాదిగ ఉపకుల సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు, పుల్లూరి కరుణాకర్, చె న్నం స్వామి, సమ్మయ్య, ప్రశాంత్, సర్వేశ్, నా ని, రాము తదితరులు పాల్గొన్నారు.కోటను సందర్శించిన మాల్దీవ్స్ దేశస్తులుఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను బుధవారం మాల్దీవ్స్ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్ప కళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్మహల్ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాలలో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీఎస్టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు.నిట్లో టెమ్ ఎక్స్పోకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ అకాడమీ శరత్బాబు, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
కాటారం: కాటారం మండల కేంద్రం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా వాహనంలో తరలిస్తున్న పశువులను బుధవారం కాటారం పోలీసులు పట్టుకున్నారు. ప్రొబిషనరి ఎస్సై గీతారాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు కాటారం–మంథని ప్రధాన రహదారిపై పోలీసులు, పశువైద్యాధికారి ధీరజ్ సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో మంథని వైపుగా వెళ్తున్న కంటైనర్ వ్యాన్ను పరిశీలించగా అందులో పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఏడు ఎద్దులు, 23 కోడె లేగలతో కూడిన వ్యా న్ను పోలీస్స్టేషన్కు తరలించారు. కాటారం మండలం ఇబ్రహీంపల్లికి చెందిన సయ్యద్ ఖయ్యూబ్, అఫ్రోజ్, పోతుల్వాయికి చెందిన పిట్టల అనిల్, సిద్దిపేటకు చెందిన వ్యాన్ డ్రైవర్ షరీఫ్ను అదుపులోకి తీసుకుని విచారించగా మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన హరిబాబు వద్ద పశువులను అక్రమంగా కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. పశువైద్యాధికారి డాక్టర్ ధీరజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గీతారాథోడ్ తెలిపారు. కాగా జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో పశువులను రాంపూర్ గోశాలకు తరలించారు. -
సమన్వయంతో పుష్కరాలు విజయవంతం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతంపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని, ఏర్పాట్లపై నిరంతరం ప్రభుత్వ మార్గదర్శనం మేరకు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశామన్నారు. సరస్వతీ మాతా విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతీ రోజు కాశీపండితులచే నవరత్న మాల హారతి నిర్వహించామన్నారు. టెంట్ సిటీ ఏర్పాటు ద్వారా 40 రూములు, 200 డార్మెటరీ, ఫుడ్ కోర్టు, కిడ్స్ ప్లే జోన్, వాహన పార్కింగ్ ఏర్పాట్లతో సౌకర్యాలు కల్పించామన్నారు. వర్షంతో అవాంతరాలు వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేశామన్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేయడంతో పాటు క్యూలో ఉన్న భక్తుల సౌకర్యార్థం కూలర్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల నిర్వహణ సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఇదొక మంచి అనుభవం.. సరస్వతీ నది పుష్కరాలు మంచి అనుభవంగా ఉపయోగపడుతుందని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. కాళేశ్వరం చిన్న గ్రామమని లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమని, చాలా ప్రామాణికంగా తీసుకుని బందోబస్తు నిర్వహించామన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షంతో ఇబ్బందులు వచ్చినా 24 గంటలు పనిచేశామన్నారు. పుష్కరాలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
2న యువ వికాసం ప్రొసీడింగ్స్ ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు సంబంధించి చేపట్టిన చర్యలను అధికారులకు వివరించారు. ఈ వీసీలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి క్రాంతికిరణ్, ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మల్హర్: ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. మండలంలోని కొయ్యూరు, వల్లెకుంట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్ల వారీగా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలు, నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హమాలీల కొరత లేకుండా, కొనుగోళ్ల వేగం పెంచి రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, మి ల్లులకు తలించాలని ఆదేశించారు. మండలానికి కే టాయించిన మిల్లుల టార్గెట్ పూర్తయితే పెద్దపల్లి జి ల్లాలోని మిల్లులకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ శ్రీనాథ్, నిర్వాహకుల ఉన్నారు. -
కుంభాభిషేకంతో ఘనకీర్తి
కాళేశ్వరం: కాళేశ్వరంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన కుంభాభిషేకంతో కాళేశ్వరాలయానికి ఘనకీర్తి పెరిగింది. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో కాళేశ్వరాలయం, అనుబంధ దేవాలయాల గోపురాలకు సంప్రోక్షణను ప్రత్యేకంగా తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిస్వామి, దుద్దిళ్ల మనోహరశర్మ ఆయన శిశ్యబృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆలయం కీర్తి దేశ నలుమూలలకు వ్యాపించి లక్షలాదిగా భక్తులు కాళేశ్వరం తరలివచ్చారని పండితులు పేర్కొన్నారు. అప్పుడు కుంభాభిషేకంతో.. కాళేశ్వరాలయం 1975కు పూర్వం శిథిలావస్థకు చేరింది. ఆ తరువాత అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు చొరవతో జీర్ణోద్ధరణ కమిటీ వేసి 1982లో ఆదిశంకరాచార్యులతో మహాకుంభాభిషేకం నిర్వహించగా, అప్పటి నుంచి నేటివరకు ఆలయం ప్రతిష్ట పెరిగి నిత్యం భక్తులతో విరాజిల్లుతుంది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా సరస్వతినది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టింది. తాత్కాలిక, శాశ్వత పనులు చేశారు. ఆరు నెలల ముందు నుంచి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ పలుమార్లు సమీక్షలతో సరస్వతీ నది పుష్కరాల విజయానికి బాటలు వేశారు. ప్రభుత్వం తరుఫున మంథని నియోజకవర్గం శాసన సభ్యుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి అఽధికారులతో హైదరాబాద్, కాళేశ్వరంలో రెండుసార్లు పర్యటించి పనుల్లో వేగం పెంచి విజయవంతం చేయడానికి కృషి చేశారు. సరస్వతీ నది పుష్కరాల్లో 12 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి సుమారు 15లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చారు. పుష్కరిణిలో స్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. 15న సీఎం, 24న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు వేర్వేరుగా స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నారు. 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహం తమిళనాడు మహాబలిపురానికి చెందిన శిల్పులు 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తయారు చేశారు. దీంతో వీఐపీఘాటులో ప్రత్యేకంగా పీఠంపై స్థిర ప్రతిష్ట చేశారు. దీంతో త్రివేణి సంగమానికి శోభాయమానంగా నిలిచింది. భక్తులు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు, సెల్పీలతో పుష్కరాల్లో భక్తులు ప్రణమిల్లారు. ఊహించని భక్తులు.. సమీక్షల్లో లోకల్ కిందిస్థాయి అధికారులు రోజుకు 10వేల నుంచి 20వేల వరకు భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అనుకున్నారు. కానీ కుంభాభిషేకంతో ఫేమస్గా మారిన ఆలయానికి దశ తిరిగింది. దీంతో పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రచారం పెరిగింది. దీంతో అధికారులు ఊహించిన దాని కన్నా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పార్కింగ్ స్థలాలు సరిపోక ట్రాఫిక్ మినహా ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదు.సరస్వతినది పుష్కరాలతో దేశవ్యాప్తం ఊహించిన దానికన్నా అధికంగా భక్తుల రాక నవరత్నమాల హారతి పుష్కరాలకే ప్రత్యేకం సీఎం వరాల జల్లుతో అభివృద్ధిపై ఆశలునవరత్నమాల ప్రత్యేకం.. సరస్వతినది పుష్కరాల్లో ప్రత్యేకాకర్షణగా నిలిచిన నవరత్నమాల హారతికి ప్రాధాన్యత సంచరించుకుంది. కాశీకి చెందిన పండితులు వారణాసిలో ఇచ్చే గంగా హారతిని, ప్రభుత్వం తరుఫున ప్రత్యేకంగా ఆహ్వానించారు. కాశీ పండితులు ఆశ్తోష్శర్మ ఆధ్వర్యంలో ఏడుగురు బృందం తొమ్మిది హారతులు సరస్వతీ మాత విగ్రహం వద్ద 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. దీంతో హారతిని తిలకించడానికి భక్తులు రోజూ తరలి వచ్చారు. సీఎం ప్రకటనతో ఆశలు ఈనెల 15న పుష్కర స్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్న సీం రేవంత్రెడ్డి రూ.200కోట్ల నిధులు రాబోవు గోదావరి పుష్కరాలకు మంజూరు చేస్తానని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబుకు హామీ ఇచ్చారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్సెక్రటరీ శైలజారామయ్యర్లను ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కాళేశ్వరం అభివృద్ధి ఆశలు మళ్లీ చిగురించాయని ప్రచారం జరుగుతుంది. -
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్
భూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా అధికారులు హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు ఇతర అంశాలపై సీఎం కలెక్టర్లతో చర్చించి పలు ఆంశాలపై ఆదేశాలు జారీచేశారు. అనంతరం కలెక్టర్ ఆధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు మండలస్థాయి బృందాలు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఎస్ఓ శ్రీనాథ్, డీఆర్డీఓ నరేష్, డీఎం రాములు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజలను చైతన్య పరచాలి
భూపాలపల్లి అర్బన్: మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ఉపాధ్యాయులు ప్రజలను చైతన్య పరచాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో భూపాలపల్లి, ములుగు జిల్లాల కస్తూర్బాగాంధీ, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాపై రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సమాజ భాగస్వాములై మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించాలన్నారు. మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామి అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చన్నారు. మానవ అక్రమ రవాణా జరిగినప్పుడు టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100, 181, 1930 సైబర్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక శిశు అభివృద్ధి అధికారిణి వి.శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రజల స్వచ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్, సుప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
ములుగు: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మంగళవారం నిర్వహించిన లైసెన్స్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలనకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జులై 26వ తేదీ వరకు ఇచ్చే శిక్షణ తరగతులను సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల భూ సేకరణ సర్వేలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. రెవెన్యూ గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, వివాదాల పరిష్కారానికి చేపట్టే సర్వే ఎలాంటి అంతరాలకు గురికాకుండా ఉండాలన్నారు. అనంతరం లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్జీ, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడించాలి ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు వెల్లడించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, సివిల్ సప్లయీస్ అధికారి షా ఫైజల్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ వీసీలో సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ఆయా మండలాల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకోవాలన్నారు. భూ భారతి చట్టాలను ప్రజలకు చేరువ చేయాలని, 3వ తేదీ నుంచి 20 వరకు మూడోదశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రేపటినుంచి జాతీయ కౌన్సిల్ సమావేశాలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి తనతో పాటు యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై చర్చించనున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు కోడ్లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రమేష్, సుధాకర్రెడ్డి, రాంచందర్, రాజారత్నం, రాజమహ్మద్ పాల్గొన్నారు. -
పుష్కరస్నానం ఆచరించిన సీఎస్ దంపతులు
కాటారం/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దంపతులు, ప్రత్యేక సీఎస్ వికాస్రాజ్ దంపతులు హాజరయ్యారు. సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో వారు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి రాగా ఆలయ అధికారులు, అర్చకులు వడివట్టం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు సీఎస్ దంపతులకు సరస్వతి మాత చిత్రపటాన్ని బహుకరించారు. -
‘సూపర్’ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎంజీఎం : ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఐకానిక్ అని.. దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నదని చెప్పారు. నిర్దేశిత గడువు లోగా పూర్తయ్యేలా పనుల్లో మరింత వేగం పెంచాలని అన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నరేంద్ర కుమార్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఈ నాగేంద్ర, ఎల్అండ్టీ ఏరియా మేనేజర్ వెంకట్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సీఎస్ను కలిసిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హైదరాబాద్ నుంచి వరంగల్ ఎన్ఐటీ అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన రామకృష్ణారావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కలిసి స్వాగతం పలికారు. సీఎస్ కె.రామకృష్ణారావు పనుల పరిశీలన.. ఉన్నతాధికారులతో సమీక్ష -
రిజర్వేషన్ అమలు తర్వాతే ఎన్నికలు
కాళేశ్వరం: అసెంబ్లీలో తీర్మానం చేసిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, అ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్ మండలకేంద్రంలోని మార్కెట్ యార్డు వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్కుమార్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటాను అందించాలని డిమాండ్ చేశారు. శాసీ్త్రయ పద్ధతిలో దేశవ్యాప్తంగా కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీపతిబాబు, కాళేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్చార్జ్ విజయగిరి సమ్మయ్య, జేఏసీ మండల అధ్యక్షుడు సముద్రాల తిరుపతి, నాయకులు ప్రకాశ్, బాబురావు, ధర్మయ్య పాల్గొన్నారు. -
ఈ–పాస్ యంత్రాల పంపిణీ
భూపాలపల్లి రూరల్: ఫర్టిలైజర్, ఎరువుల డీలర్లకు ఈ–పాస్ యంత్రాలను సోమవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్ మాట్లాడుతూ ఈ పాస్ యంత్రంలో రైతు ఆధార్కార్డు నంబరు నయోదు చేసుకొని ఎరువు మందులను సరఫరా చేస్తారన్నారు. దీంతో ఎరువులు, విత్తనాల అక్రమ రవాణ, కల్తీలేని నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎంఏఓ సతీష్, వివిధ మండలాల ఏఓలు, ఈ పాస్ యంత్రాల కంపెనీ ప్రతినిధులు సుభాన్, తిరుమల్, పవన్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం చిట్యాల: కాళేశ్వరం జోన్–1 పరిధి జిల్లాలోని చిట్యాల, కాటారం, భూపాలపల్లి(బాలికలు), ములుగు జిల్లాలోని జాకారం, ఏటూరు నాగారం (బాలురు), ములుగు (బాలికలు) పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కోఆర్డినేటర్, డీసీఓ టీజీ ఎస్డబ్ల్యూఆర్ఎస్ చిట్యాల ప్రిన్సిపాల్ గోల్కొండ భిక్షపతి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న తెలుగు, హిందీ, ఇంగ్లిషు, హెల్త్ సూపర్వైజర్ నియామకానికి, 29న గణితం, సైన్స్, సోషల్, లైబ్రేరియన్ సబ్జెక్టులకు, 30న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల(బాలుర) జాకారంలో పాఠ్యాంశ బోధన డెమోలు ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని హాజరు కావాలని తెలిపారు. వికసించిన మే పుష్పం రేగొండ: ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం రేగొండ మండలకేంద్రంలోని వాణి విద్యానికేతన్ పాఠశాలలోని గార్డెన్లో సోమవారం పూసింది. ఏడాదిలో ఒకసారే వికసించే ఈ పుష్పం అందరినీ ఆకట్టుకుంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ మొక్కను పుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీగా పిలుస్తుంటారు. ఇది మూడు రోజులు వికసించి ఉంటుంది. క్రీడలు ఐకమత్యాన్ని చాటుతాయి భూపాలపల్లి రూరల్: క్రీడలు ఐకమత్యాన్ని చాటుతాయని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో సోమవారం ఏర్పాటుచేసిన 8, 10, 12 సంవత్సరాల బాల, బాలికలకు సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను సీఐ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. బాల బాలికలు ప్రతిఒక్కరు ఏదైనా ఒక క్రీడలో ప్రావీణ్యం పొందాలన్నారు. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో ఆడి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ఎంపికై న బాల, బాలికలు జూన్ 1వ తేదీన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని అథ్లెటిక్ చైర్మన్ పంతకాని సమ్మయ్య తెలిపారు. ఈ ఎంపిక క్రీడల్లో అథ్లెటిక్ కమిటీ ఉపాధ్యక్షుడు అజయ్, కోచ్ రఘువీర్, కోచ్లు పాల్గొన్నారు. టీచర్ల శిక్షణ శిబిరం మార్పు విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసనపర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్వుడ్ పాఠశాలకు మార్చి నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొలుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనివార్య కారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పేర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. -
– వివరాలు, మరిన్ని ఫొటోలు 8,9లోu
పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పునీతులయ్యారు. కాళేశ్వరం సందర్శనలో జ్ఞాపకాల్ని మూటగట్టుకెళ్లారు. ఎండ, వాన.. గాలి దుమారం.. ఇవేవీ వారిని అడ్డుకోలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. నదీ పరిసరాల్లో బురద.. వారి సంతోషానికి అడ్డు కాలేదు. కిక్కిరిసిన భక్తులతో ఆర్టీసీ బస్సులు. దారి పొడవునా ప్రైవేట్ వాహనాలు. ఇలా.. లక్షలాది మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చారు. నదీ మాతకు పూజలు చేశారు. తర్పణాలు వదిలారు. పిండ ప్రదానాలు చేశారు. నదిలో దీపాలు వదిలారు. చీరెసారె సమర్పించారు. 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. నదీమాతకు నవరత్న మాల హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సోమవారంతో సరస్వతీ నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు లక్ష మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. -
పక్కా ప్రణాళికతో విజయవంతం
భూపాలపల్లి/కాళేశ్వరం: పన్నెండు రోజుల పాటు కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాలు సోమవారంతో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర, జిల్లా యంత్రాంగం ముందస్తు పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టడంతో భక్తులకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. నిండు వేసవిలో అకాల వర్షాలు కురవడం పుష్కర స్నానాలకు కలిసొచ్చింది. ట్రాఫిక్ నియంత్రణలో మాత్రం పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ముందు నుంచే ప్రణాళికలతో.. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సొంత నియోజకవర్గంలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగడంతో ముందు నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రమంత్రిగా శ్రీధర్బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఆయన సతీమణి శైలజా రామయ్యర్ ఉండటంతో పుష్కర పనులు చకచకా సాగాయి. ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేయగా, ఆ నిధులతో రహదారుల నిర్మాణం, పుష్కర ఘాట్ విస్తరణ, శాశ్వత మరుగుదొడ్లు తదితర పనులను చేపట్టారు. గతంలో ప్రధాన ఘాట్ వద్ద పుష్కరాలు జరుగగా, ఈసారి గోదావరి, ప్రాణహిత, సరస్వతి(అంతర్వాహిని) నదులు కలిసే చోట ఘాట్ను ఏర్పాటు చేసి త్రివేణి సంగమం వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన 17 అడుగుల సరస్వతి విగ్రహం, జ్ఞానదీపం, స్టాల్స్, టెంట్ సిటీ, డార్మెటరీ ఇళ్లు, లైటింగ్, కాశీ పండితులతో నది హారతి కార్యక్రమాల నిర్వహణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలోని యాగశాలలో 12రోజుల పాటు హోమాలు నిర్వహించారు. ఆలయంలోని క్యూ లైన్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అన్ని శాఖల సేవలు భేష్.. పుష్కరాల్లో ప్రభుత్వ శాఖలన్నీ తమవంతు సేవలు అందించి భక్తులకు ఇబ్బందులు రాకుండా చూశాయి. వైద్య, ఆరోగ్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ, రెవెన్యూ, పౌర సంబంధాలు, ఇరిగేషన్, మత్య్స, సింగరేణి రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మహిళా, శిశు, సంక్షేమ తదితర శాఖలు భక్తులకు మెరుగైన సేవలు అందించాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచినప్పటికీ విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు 24 గంటల పాటు పని చేశారు. కలిసొచ్చిన అకాల వర్షాలు.. పుష్కరాలకు పక్షం రోజుల ముందు త్రివేణి సంగమంలో అంతంత మాత్రంగానే నీరు ఉంది. పుష్కర స్నానం చేసేదెలా అనుకుంటున్న సమయంలో పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందు, పుష్కరాలు జరుగుతున్న సమయంలోనే మూడు రోజుల పాటు వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ త్రివేణి సంగమంలో జలకళ కనిపించింది. దీంతో భక్తులు సంతోషంగా పుష్కర స్నానాలు ఆచరించారు. ట్రాఫిక్ ఇబ్బందులు.. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. వీకెండ్ రోజులైన ఈ నెల 17, 18, 24, 25 తేదీల్లో భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కాళేశ్వరం వచ్చాయి. అదే రోజుల్లో వర్షాలు కురవడంతో పార్కింగ్ స్థలాలు మొత్తం బురదమయం అయ్యాయి. దీంతో వాహనాలు బయటకు రాలేక, రహదారిపై ఉన్న వాహనాలు కిలోమీటర్ల మేరకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు పుష్కర ప్రారంభంలోనే ఎక్కువ మొత్తంలో పార్కింగ్ స్థలాలు, హాల్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం ట్రాఫిక్ సమస్యకు కొంత కారణమైంది. వివిధ జిల్లాల నుంచి పుష్కరాల విధులకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది స్థానిక పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎస్పీ కిరణ్ ఖరే స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసినప్పటికీ కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం మూలంగా వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. కాళేశ్వరంలో ముగిసిన సరస్వతి పుష్కరాలు 6 నెలల ముందు నుంచే పనులు వేసవిలో కలిసొచ్చిన అకాల వర్షాలు ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొన్న వాహనదారులు సుమారు 15 లక్షలకు పైగా భక్తుల రాక.. ఈ నెల 15నుంచి 24వ తేదీ వరకు 8,921 ట్రిప్పుల ద్వారా 5,00,741 మందిని వివిధ బస్స్టేషన్ల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ చేరవేయగా 25, 26వ తేదీల్లో మరో 70వేలకు పైగా మందిని తరలించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ వాహనాల్లో సుమారు 9 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. మొత్తంగా ఈ పుష్కరాలకు సుమారు 15 లక్షల మంది హాజరై పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుష్కరాల ప్రారంభం రోజు, ఈ నెల 25న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరై పుష్కర స్నానం ఆచరించి ఆలయంలో పూజలు చేశారు. -
రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన!
సాక్షిప్రతినిధి, వరంగల్ : రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. కోర్టు స్టే కారణంగా కొద్ది రోజులుగా ఆ శాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) జాబితాకు బ్రేక్ పడింది. దీంతో పదోన్నతులు, నియామకాలు నిలిచాయన్న సాకుతో చాలాచోట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)లనే ఇన్చార్జ్ జిల్లా రవాణా శాఖాధికారులు(డీటీఓ)గా నియమించారు. మరికొందరు ఎంవీఐలకు.. ఎంవీఐతో పాటు ఇన్చార్జ్ డీటీఓలుగా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించారు. కాగా కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ పోస్టును పోటీపడి తెచ్చుకున్న సందర్భాలుంటే.. మరికొన్నిచోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి సీనియర్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇష్టారాజ్యం.. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో డీటీసీ, డీటీఓ పోస్టుల్లో ఇన్చార్జ్లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు నిలిపివేసి ఒక్కో సీనియర్ ఎంవీఐకి రెండు నుంచి నాలుగు జిల్లాల్లో ‘ఆన్ డెప్యూటేషన్ పోస్టింగ్’లు ఇచ్చి పెద్ద ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. కీలక సూత్రధారిగా ఉన్న ఓ అధికారి ప్రభుత్వం మారాక స్వచ్ఛంద పదవీ విరమణ పెట్టుకోవడం కొసమెరుపు కాగా.. అతడికి అండగా నిలిచిన కొందరు ఏసీబీ కేసుల్లో ఇరుక్కొని సస్పెండయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఇన్చార్జ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులతో పలువురు పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు చేయడంపై చర్చ జరుగుతోంది. పాతుకుపోయారు.. ఉమ్మడి వరంగల్లో ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వివిధ పోస్టుల్లో అక్కడే పాతుకుపోవడంతో పాలన గాడి తప్పి అవినీతి పెరిగిందన్న ఆరోపణలున్నాయి. హనుమకొండ డీటీఓ ఆఫీసులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి సుమారు పదేళ్లుగా ఉమ్మడి వరంగల్లో వివిధ చోట్ల పనిచేసి పాతుకుపోయారన్న చర్చ ఉంది. ఏడాది క్రితం హనుమకొండకు బదిలీ కాగా.. కొద్ది రోజులకే ఏసీబీ దాడులు జరిగాయి. ఈ కేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ సస్పెండ్ కావడం కలకలం రేపింది. కీలక పోస్టుల్లో ఇన్చార్జ్లు.. ● హనుమకొండ డీటీఓ, డెప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్(డీటీసీ)గా ఉన్న పుప్పాల శ్రీనివాస్పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయగా సస్పెండయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్ డీటీసీ పురుషోత్తంకు ఇన్చార్జ్ డీటీసీ బాధ్యతలు అప్పగించారు. ● హనుమకొండ డీటీఓ పోస్టు ఖాళీ కావడంతో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన రమేశ్రాథోడ్కు ఇన్చార్జ్ డీటీఓగా ఇవ్వాల్సి ఉంది. అయితే కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక ఆతను ఆసక్తి చూపకపోవడంతో 2012 బ్యాచ్కు చెందిన వేణుగోపాల్కు ఇన్చార్జ్ డీటీఓగా నియమించినట్లు ప్రచారంలో ఉంది. ● మహబూబాబాద్ గౌసుపాషా ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆయన స్థానంలో వరంగల్ ఎంవీఐ జైపాల్రెడ్డిని ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ● ములుగు డీటీఓ సిరాజ్ రెహమాన్ పదవీ విరమణ చేశాడు. అక్కడ ఎంవీఐ, డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థానంలో పెద్దపల్లి ఎంవీఐ బి.శ్రీనివాస్ను ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ప్రస్తుతం ములుగు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కూడా శ్రీనివాసే వ్యవహరిస్తున్నారు. ● జేఎస్ భూపాలపల్లి ఇన్చార్జ్ డీటీఓ వేణు బదిలీ తర్వాత ఎవరినీ నియమించ లేదు. అక్కడ ఎంవీఐగా ఉన్న సంధానికే ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా సంధానీ పని చేస్తున్నారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 8న వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటు పండింది. డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ దాడులు జరిగిన మరుసటి రోజే లక్ష్మిని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో ఎంవీఐ శోభన్బాబు ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. ఎంవీఐలే డీటీఓలు.. పలుచోట్ల ఇదే పరిస్థితి హనుమకొండ డీటీఓగా జూనియర్కు బాధ్యతలు తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు విచారణలు, ఆరోపణలున్నా.. కుర్చీలు వదలని అధికారులు ఆదాయం ఉన్న పోస్టింగ్ల కోసం ఇంకా పైరవీలు -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు గణపురం: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆదివారం స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కోటగుళ్ల సందర్శన ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని, ఆలయ శిల్ప సంపద అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని రూపిరెడ్డిపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన కొండ్ల వేణు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం పరకాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జూకల్ నుంచి పరకాలకు వెళుతున్న ఆటో రూపిరెడ్డిపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో వేణుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న బొల్లికొండ శివవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క తన కాన్వాయ్ను ఆపి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మానవతా దృక్పథాన్ని చాటుకున్న మంత్రి సీతక్కకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. -
సౌధామిని.. పుష్కర మణి!
ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే నదికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరెసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని గోదావరికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
నిర్విరామంగా వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో విస్తృతంగా వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో 10 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 40మంది వైద్యులు, 450మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని పీహెచ్సీకి తీవ్రతను బట్టి మహదేవపూర్ సీహెచ్సీ, భూపాలపల్లి జీజీహెచ్కు తరలిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆదివారం వరకు సుమారు 12వేల మంది భక్తులకు వైద్యసేవలు అందించారు. మొదటిసారి పుష్కర విధులు.. ఇన్ని రోజుల పాటు జాతరలో భక్తులకు సేవలు అందించడం మొదటిసారి. పీహెచ్సీలో ఏర్పాటుచేసిన మొయిన్ క్యాంపులో విధులు నిర్వర్తించి భక్తులకు సేవలందించాం. భవిష్యత్లో ఇటువంటి క్యాంపులకు వెళ్లేందుకు దైర్యం వచ్చింది. – డాక్టర్ కె.హారిక, వైద్యురాలుమెరుగైన సేవలు అందించాం.. సరస్వతీ పుష్కరాల సందర్భంగా పీహెచ్సీలో ఏర్పాటు చేసిన మొయిన్ క్యాంపులో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. క్యాంపు ద్వారా మరింతం అనుభవం వచ్చింది. ఇప్పుడు ఎదురైన లోటు పాట్లు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో వాటిని సరిదిద్దుకుంటాం. – డాక్టర్ సుస్మిత, వైద్యాధికారిణి●గత అనుభవంతో.. గతంలో కాళేశ్వరంలో జరిగిన పుష్కర, మేడారం జాతర విధుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు కావాల్సిన మెడిసిన్ను సిద్ధంగా ఉంచుకున్నాం. మొబైల్ అంబులెన్స్ల ద్వారా వైద్య శిబిరాలకు ఎప్పటికప్పుడు పంపించాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాం. – సదయ్య, ఫార్మసీ అధికారిసంతోషంగా ఉంది.. పుష్కరాల్లో విధులు నిర్వర్తించడం సంతోషకరంగా ఉంది. వేలాది మందికి వైద్యసేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా. మేడారం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పనిచేశాం. 7 అంబులెన్స్(108)ల ద్వారా 600 నుంచి 700 మందికి సేవలు అందించాం. మొబైల్ అంబులెన్స్ల ద్వారా 10వేలకు పైగా భక్తులకు సేవలందించాం. – మేరుగు నరేష్, 108 జిల్లా కోఆర్డినేటర్ సరస్వతీ పుష్కరాల పరిసరాల్లో మెడికల్ క్యాంపులు పీహెచ్సీలో తాత్కాలికంగా 20 పడకలు ఏర్పాటు -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రయివేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రయివేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సోర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేలు జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
పత్తి, మిర్చికే ప్రాధాన్యం
భూపాలపల్లి రూరల్: గతేడాది వానాకాలంలో 2,02,687 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయగా.. ఈ ఏడాది సుమారు 2,10,524 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి, మిర్చి, వరితోపాటు పప్పుధాన్యాలు, కొర్రలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పంటల అంచనాకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఆ రెండు పంటలకే ప్రాధాన్యం.. ప్రధానంగా జిల్లాలో గతేడాది 92,324 ఎకరాల్లో పత్తి, 25,800 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 1,01,500 ఎకరాల్లో పత్తి, 28వేల ఎకరాల్లో మిర్చి సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి విత్తనాల ప్యాకెట్లను ప్రైవేట్ డీలర్ల దగ్గర అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది మొదట్లో మిర్చితోపాటు పత్తికి అనుకూలమైన ధర పలికి, తగ్గుతూ వచ్చింది. పెద్దమొత్తంలో లాభాలు రాకపోయిప్పటికీ పెట్టుబడికి మాత్రం వస్తుందనే నమ్మకంతోనే రైతులు ఈపంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎరువులు, విత్తనాల అంచనా.. జిల్లాలో 2,10,524 ఎకరాల సాగుకు గాను 10,500 మెట్రిక్ టన్నుల యూరియా, 5,544 టన్నుల డీఏపీ, 5,544 టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో పాటు 2,772 టన్నుల పొటాష్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సాగుకు వరి, పత్తి తదితర విత్తనాలను డిమాండ్ మేర సరఫరా చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. 1,400 క్వింటాల జీలుగ, 50 క్వింటాల జనుము విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగితా విత్తనాలు పంటలు సాగుచేస్తున్న క్రమంలో అందుబాటులో ఉంచుతామన్నారు. అవగాహన లేదు.. గతంలో మే నెలలో రైతులకు వివిధ పంటల సాగు, నకిలీ విత్తనాలపై అప్రమత్తత, సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేవారు. నాలుగైదేళ్లుగా అవగాహన కార్యక్రమాలు కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం.. విత్తనాలు, ఎరువులు డిమాండ్ మేర సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటాం. రైతుల ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు, మందులు కొనుగోలు చేయాలి. భూసారాన్ని పెంచుకునేందుకు వీలుగా జీలుగ, ఇతర పప్పుల విత్తనాలు జిల్లావ్యాప్తంగా మండలకేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – వీరునాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిజిల్లాలో సాగు అంచనా వివరాలు.. (ఎకరాల్లో )పంట గతేడాది ప్రస్తుతం అంచనా వరి 1,10,899 1,12,218 పత్తి 91,510 93,823 మొక్కజొన్న 93 157 పెసర 116 21 కంది 57 98 మినుము 08 02 వేరుశనగ 04 06 ఇతర పంటలు – 4199 మొత్తం 2,02,687 2,10524 2,10,524 ఎకరాల్లో వానాకాలం సాగు అంచనా.. 1,01,500 ఎకరాల్లో పత్తి.. 28వేల ఎకరాల్లో మిర్చి.. అందుబాటులో విత్తనాలు ఉండేలా చర్యలు -
‘అంతిమ’ రాగం..
పుష్కర స్నానం.. జన్మ పునీతం!‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచి నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలూ మరువామయ్యా కొమురయ్యా.. కొడుకునెట్లా మరిసినావే కొమురయ్యా.. నీ బిడ్డనెట్లా మరిసినావే కొమురయ్యా.. బలగాన్నీ మరిసినావే కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. ఆఖరి మజిలీలో చనిపోయిన వ్యక్తితో కుటుంబానికి, బంధుగణానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు పాడడం ఇప్పుడు ఓరుగల్లులో ఆనవాయితీగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పు కళాకారుల రాగం.. భావోద్వేగాన్ని పలికిస్తోంది. అదే ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం! – సాక్షి, వరంగల్తియ్యని జ్ఞాపకం: ఎడ్లబండిలో సెల్ఫీ తీసుకుంటూ.. ఇన్ని రోజులు కలిసి ఉండి.. ఒక్కసారిగా కుటుంబంలో ఒకరు దూరమైతే కుటుంబ సభ్యులు తట్టుకోలేరు. వారి జ్ఞాపకాలు వెంటాడతాయి. వారితో ఉన్న అనుబంధాలు మదిలో మెదులుతాయి. ఇన్నాళ్లూ అంతిమయాత్రలో డప్పుచప్పుళ్లు, అందుకు అనుగుణంగా స్టెప్పులు వేసేవారు. ఇప్పుడు డప్పుకళాకారుల నోటి నుంచి వస్తున్న బంధాలను పెనవేసే పాటలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణించినప్పుడు బలగం సినిమాలో పాడిన పాట, డప్పు కళాకారుల ప్రదర్శన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఏళ్ల కిందటి సంప్రదాయం. ఇప్పుడు మరింత ట్రెండీగా మారింది. బలగం సినిమాకు ముందే... 15 ఏళ్ల క్రితమే చెన్నారావుపేట మండలం పాపాయ్యపేట యాకన్న బృందం అంత్యక్రియల్లో పాటలు పాడడం ప్రారంభించింది. ఆ తర్వాత నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన యాకాంబరం బృందం కూడా బంధుత్వ విలువలు తెలిసేలా పాటలు పాడడం మొదలు పెట్టింది. అయితే బలగం సినిమా విడుదలైన తర్వాత ఈ డప్పు కళా బృందాలకు ముఖ్యంగా పాటలు పాడే వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరు మరణించినా.. అప్పటికప్పుడు వారి గుణగణాలు తెలుసుకుని పాటలు అల్లుతూ పాడుతూ కళాకారులు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ఆదరణ పెరిగింది.. మాది చెన్నారావుపేట మండలం పాపయ్యపేట డప్పు కళా బృందం. 22 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని 14 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసుకున్నాం. ఓవైపు డప్పుచప్పుళ్లతో పాటు ఇంకోవైపు పాటలు పాడుతున్నాం. అయినా అప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇటీవల చాలా మంది మా పాటలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో మాకు గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే సరికొత్త చరణాలతో అప్పటికప్పుడు పాటలు రాస్తూ.. పాడుతూ బంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం. – అబ్బదాసి యాకన్న, డప్పు కళాకారుడు సంగెం మండలం కొత్తగూడలో ఇటీవల అంతిమ యాత్రలో పాట పాడుతున్న కళాకారుడు (ఫైల్)ఇటీవల మారిన అంతిమ యాత్ర తీరు జ్ఞాపకాలు గుర్తు చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తున్న పాటలు కట్టిపడేస్తున్న డప్పు కళాబృందాల ప్రదర్శనడప్పుచప్పుళ్లు.. పాటలు ‘నేనెళ్లి పోతున్నా దూరం.. మన ఇల్లు, నీ పిల్ల లు పదిలం.. మన బంధు బలగం పదిలం.. అని పైనుంచి తన ఆత్మ ద్వారా సుశీలవ్వ మనకు చెబుతున్నది’ అంటూ నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డప్పు కళా బృందం వరంగల్జిల్లా అనంతారంలో పాడిన పాట ఆఖరి మజిలీకి వచ్చినవారందరినీ కంటతడి పెట్టించింది. ఇలా డప్పు కళాకారులు, జానపదులు పాడుతున్న పాటలు బంధాలను బలోపేతం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి. -
చాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..
చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మనిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యామిలీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. మేం పాడే పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపు యాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండ మండలం -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుతల సమ్మయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్–8, 10, 12 సంవత్సరాల వయస్సు కలిగి బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఉదయం 6.30గంటల వరకు జనన ధృవకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. రహదారులకు మరమ్మతు కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారులకు శనివారం అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు, సరస్వతి ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారులు బురదమయంగా మారిపోయాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు హుటాహుటిన మరమ్మతు చర్యలకు పూనుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా స్టోన్ డస్ట్ వేసి రహదారులను బాగుచేశారు. ర్యాంపులేక ఇబ్బందులు చిట్యాల: కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వరస్వామి తూర్పు ద్వారం దగ్గర దివ్యాంగులకు అధికారులు ర్యాంపు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతీ నది పుష్కర స్నానానికి అనేక మంది దివ్యాంగులు వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ దివ్యాంగుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఆలయ దర్శనానికి వచ్చారు. లోపలికి రాలేని స్థితి ఉండడంతో అతని కుటుంబసభ్యులతో పాటు సేవ కార్యకర్త అరెల్లి కిరణ్ వీల్చైర్లో కూర్చోబెట్టి తూర్పు ద్వారం నుంచి ఆలయం లోపలికి ఎత్తుకెళ్లి దర్శనం చేయించారు. ఇప్పటికై నా అధికారులు దివ్యాంగుల కోసం ర్యాంపు ఏర్పాటుచేసి శ్రీముక్తీశ్వరస్వామి దర్శన భాగ్యం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు దివ్యాంగులు కోరుతున్నారు. కోతుల దాడితో చిన్నారికి గాయాలు భూపాలపల్లి రూరల్: కోతులు దాడిచేయడంతో భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన తరాల సురేష్ కుమారుడు మనివీత్ శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కోతులు గుంపులుగా వచ్చి బాబు మీద ఒక్కసారిగా దాడిచేసి పొట్టపై గాయపరిచాయి. చుట్టు పక్కలవారు కర్రలతో కోతులను తరిమేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో పలుమార్లు గ్రామస్తులపై కోతులు దాడులు చేశాయని.. అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి కోతుల బాధ నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బస్సులపై పర్యవేక్షణ కరువు
కాటారం: సరస్వతీ ఫుష్కరాల్లో భాగంగా భక్తుల ఉచిత రవాణా సౌకర్యార్థం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షటిల్ బస్సుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. పుష్కరాలకు వచ్చే భక్తుల రవాణా కోసం సింగరేణి సంస్థ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలు, ఇతరత్రా సంస్థలకు చెందిన మినీ బస్సులను సింగరేణి సంస్థ అద్దె ప్రతిపాదికన పుష్కరాల వినియోగం కోసం కేటాయించింది. మొదటగా తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు భక్తులను షటిల్ బస్సుల ద్వారా చేరవేశారు. భక్తుల రద్దీ పెరగడం ట్రాఫిక్ జాం కారణాలతో ప్రైవేట్ వాహనాలను కాళేశ్వరానికి కొంత దూరంలో నిలిపివేయడంతో అక్కడి నుంచి భక్తులను రవాణా చేయడం కోసం షటిల్ బస్సులను వినియోగంలోకి తీసుకొచ్చారు. రెండు రోజులుగా భక్తుల రద్దీ కారణంగా కాళేశ్వరంలో అస్తవ్యస్తం నెలకొనడంతో షటిల్ బస్సుల సేవలు పేలవంగా తయారయ్యాయి. షటిల్ బస్సుల సేవలను పర్యవేక్షించే వారు లేకపోవడంతో బస్సుల డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు భక్తులు తెలిపారు. భక్తులను చేరవేయాల్సిన బస్సులను డ్రైవర్లు పక్కకు నిలుపుకొని ఉంటున్నారని వారు వాపోయారు. దీంతో భక్తులు కాలినడకన ఘాట్ వద్దకు అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవాల్సి వస్తుంది. షటిల్ బస్సుల సేవలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి సేవలు సక్రమంగా అందేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
నిరంతరం చెత్త సేకరణ
పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులుకాటారం: కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా కొనసాగుతోంది. పుష్కరాల ప్రారంభం నుంచి జిల్లా పంచాయతీ విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం ఎంతో శ్రమించి పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15న పుష్కరాలు ప్రారంభం కాగా మొదటి రోజు నుంచి భక్తుల రాక మొదలైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ముందస్తు ప్రణాళికతో తగు చర్యలు మొదలుపెట్టారు. ఆలయ పరిసరాలు, ప్రధాన సరస్వతీ ఘాట్, గోదావరి ఘాట్, టెంట్ సిటీ, ప్రధాన రహదారులు, ఇతరత్రా ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశారు. భక్తులు పడేసిన చెత్త, పాలిథిన్ కవర్లు, ఇతరత్రా ఆహార పదార్థాలను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు సేకరించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఎండ, వాన లెక్కచేయకుండా పది రోజులుగా అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు భేష్గా నిలుస్తున్నాయి. వర్షంలో సైతం ఆలయ ఆవరణ, ప్రధాన ఘాట్ల వద్ద చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కృషి చేస్తున్నారు. మురుగునీరు నిలిచిన చోట, మరుగుదొడ్ల ఆవరణలో బ్లీచింగ్ చల్లి దుర్గంధం వెదజల్లకుండా చూస్తున్నారు. పుష్కరాల్లో ఎంతో ముఖ్యమైన పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పంచాయతీ అధికారులు సక్సెస్ అయినట్లు చెప్పుకోవచ్చు. 500 మంది ప్రత్యేక సిబ్బందితో.. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని భావించిన అధికారులు ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లారు. జిల్లాలోని 12 మండలాలకు చెందిన పంచాయతీ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్స్తో పాటు అదనంగా ఇతర ప్రాంతాల నుంచి తా త్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకున్నా రు. సుమారు 500 మంది సిబ్బంది రెండు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ చెందిన డీపీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు సుమారు 150 మంది విధుల్లో ఉండి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. సేవలా భావిస్తున్నా పుష్కరాల్లో పనులు చేయడం కోసం గుంటూరు నుంచి వచ్చాం. సరస్వతి ఘాట్ వద్ద చెత్తాచెదారం లేకుండా నిరంతరం శుభ్రపరుస్తున్నాం. ఇది కూడా ఒక సేవలా భావిస్తూ ఆలసట లేకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్నాం.. – దాసరి రోజా, తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికష్టమైనా ఇష్టంతో పనిచేస్తున్నా.. పుష్కరాల్లో పారిశుద్ధ్య పనులు చేయడం ఆనందంగా ఉంది. కష్టమైనప్పటికీ ఇష్టంతో పని చేస్తున్నా. ప్రతి రోజు షిఫ్టుల వారీగా పని చేస్తున్నాం. – అణెమ్మ, తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందిపది రోజులుగా పనిచేస్తున్నా.. పుష్కరాలకు ఒక రోజు ముందుగా కాళేశ్వరం చేరుకున్నాం. పది రోజులుగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నా. ఇక్కడకు వచ్చాక ఉపాధితో పాటు దైవసన్నిధిలో పనిచేసే అదృష్టం లభించింది. – కుమారి, పారిశుద్ధ్య సిబ్బందిపారిశుద్ధ్యం లోపించకుండా తగు చర్యలు.. కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆలయ పరిసరాలు, పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్యం లోపించకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ముందస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో ముందుకెళ్తూ పారిశుద్ధ్య పనులు పక్కాగా కొనసాగిస్తున్నాం. – వీరభద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు విధుల్లో 400మంది కార్మికులు, 150మంది అధికారులు