Jayashankar District News
-
రేపు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు. మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్రావు, సంపత్రావులను అభినందించి, సత్కరించారు. పోచమ్మ బోనాలు టేకుమట్ల: మండలకేంద్రంలోని పోచమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. భక్తులు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. మహాముత్తారంలో వడగళ్ల వాన మల్హర్(మహాముత్తారం): మండలంలోని పోలారం, కనుక్కునూరు, నిమ్మగూడెం, యత్నారం, సింగంపల్లి తదితర గ్రామాల్లో గురువారం వడగళ్ల వాన కురిసింది. తోటల్లోని మిర్చి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. తడిసిన పత్తి నల్లబారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్పలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధికారులు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్షా, తరుణ్గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొనియాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు పాల్గొన్నారు. -
ఉదయ భాస్కర్కు అర్చకరత్న అవార్డు
గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్కి అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు. -
కాళేశ్వరాలయంలో ‘పంచాంగ పఠనం’
కాళేశ్వరం: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వేదపండితులు భక్తులకు ‘పంచాంగ పఠనం’ చేశారు. గురువారం సాయంత్రం ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి పణీంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు బైకుంఠపాండాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాశులవారీగా ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ చెమ్మాల సుధీర్, మాజీ సర్పంచ్లు వసంత, రాంరెడ్డి, మాజీ డైరెక్టర్లు సమ్మయ్య, శ్యాందేవుడా, కె.శ్రీనివాస్రెడ్డి, ఎస్.శ్రీనివాస్రెడ్డి, గందెసిరి సంతోష్, రామన్న, రమేష్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
గుంతలమయంగా రహదారి రేగొండ మండలంలో రహదారులు పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినటం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేమి చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, చీమ చింత, మల్బరీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటుచేసి అక్కడక్కడ డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్, పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడి కక్కడ సిమెంటు ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
మొబైల్, మద్యం మాయలో..
● ఆన్లైన్ గేమ్స్తో కష్టాలు ● పలు కేసుల్లో మైనర్లు అరెస్ట్ ● అప్పులతో పెరుగుతున్న ఆత్మహత్యలుమొబైల్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో ప్రతీఒక్కరికి మొబైల్ సాధారణమైంది. కొందరు మొబైల్ను మంచి కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్కు, చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువగా వాహనాలను నడిపేవారు మొబైల్లో మాట్లాడుతూ నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యువత లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తేనే సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చి తమ జీవితాలను అందంగా మార్చుకునే వీలుందని అభిప్రాయపడుతున్నారు. -
ఉగాది సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
భూపాలపల్లి రూరల్: ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మంజూర్నగర్లో ఇల్లందు క్లబ్ హౌజ్లో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాలు–2026 సంజీవనం పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, సంప్రదాయ విలువలను పెంపొందిస్తాయన్నారు. ‘సంజీవనం’ వంటి పుస్తకాలు మన సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్ తరాలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కౌన్సిలర్లు, ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక
భూపాలపల్లి: రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం పోలీసు అధికారులు, సిబ్బందికి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇఫ్తార్ విందు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పండుగలను సమష్టిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యతను మరింత బలపరిచే పండుగగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు
మొగుళ్లపల్లి: ఉద్యాన పంటల సాగుతో అధిక లా భాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఇస్సిపేట గ్రామంలో ఉద్యాన పంటల సాగుపై అవగాహన, శిక్షణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యత, తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్రెడ్డి, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి శ్యాంసుందర్, సర్పంచ్ యార ముకుందం, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వాసు, ప్రీతం, అజయ్, రమేష్, జైన్, ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధులు శ్యామ్ కు మార్, రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్ -
హక్కులు, బాధ్యతలపై అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సురక్షితమైన ఉత్పత్తులు–నమ్మకమైన వినియోగదారులు’ అనే నినాదంతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొనుగోలు సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచాలన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సకాలంలో సరఫరా చేయాలి ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సీరియల్ క్రమాన్ని పాటించాలని, వినియోగదారులకు సకాలంలో సిలిండర్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల సమావేశంలో జిల్లాలోని అన్ని ఎల్పీజీ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏజెన్సీల వారీగా స్టాక్ లభ్యత, రోజువారి సరఫరా పరిస్థితి, ఆయిల్ కంపెనీలకు పంపిన ఇండెంట్లు, పెండింగ్ బుకింగ్స్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ కిరణ్కుమార్, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
ఉగాది భవిష్యత్కు పునాది
వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు. – హన్మకొండ కల్చరల్తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడుతారు. పంచాంగం విని భవిష్యత్కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పచ్చడి ప్రత్యేకత.. కాలాన్ని బట్టి వచ్చే పండుగల్లో ఆయా కాలాల్లో పండించిన వాటిని దేవుడికి నివేదించడం ప్రకృతిపై ప్రేమతో మనిషి ఏర్పర్చుకున్న నియమావళి. అదేవిధంగా చైత్రమాసం నాటికి ప్రజలు తాము కొత్తగా పొందే చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. తెలంగాణలో ఉగాది పచ్చడిని పానీయంలా చేయడం సంప్రదాయం. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. కానీ నీళ్లలో కలిపి పానీయంగా తాగితే ఎండాకాలంలో మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళస్నానం.. కొత్త సంవత్సరంలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ శరీరంలోని పాత మురికిని తొలగించుకోవడం కోసం పండుగనాడు విధిగా నువ్వుల నూనెతో శరీరమంతా రుద్దుకొని ఒకగంట ఆగిన తర్వాత తలస్నానం చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. పండుగనాడు నువ్వుల నూనెతో చేసే స్నానాన్ని మంగళస్నానంగా పిలుస్తుంటారు. మంగళస్నానం ఆచరిస్తే శరీర, మనసులోని మలినం పోతుందని హిందువులు నమ్ముతుంటారు. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం.. చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి మహాన్యాసకపూర్వక పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, కాళికాపూజ, శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ఠాపన పూజలు, భక్తులకు ఆరోగ్య ఐశ్వర్య విద్యశాంతి ఒనగూరాలని సంకల్పిస్తూ సుదర్శన హోమం నిర్వహిస్తున్నట్లు.. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల దేవాలయం ఈఓ అనిల్కుమార్ తెలిపారు. రోడ్ల రద్దీ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చిన వారితో నగరంలోని పలు కూడళ్లలో రద్దీ ఏర్పడింది. శ్రీపరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’ శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, మంత్రిగా కుజగ్రహాలు ఉన్నాయి. ఫలితంగా గురువు రాజైతే పాలకులు కర్మాయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు, ప్రభువులు సన్మార్గులు, నీతివేత్తలుగా జీవిస్తారు. ప్రజలు సుభిక్షం, ఆరోగ్యం, సుఖం కలుగుతాయి. మంత్రి కుజుడు కావున అగ్నిచేత దహనాలు, యుద్ధాలు తప్పవు. ఈ సంవత్సరం పాడి అభివృద్ధి, సుగంధ ద్రవాలు, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి, రస జాతి వస్తువుల ధరలు తగ్గుతాయి. – గంగు ఉపేంద్రశర్మ రుషులు అందించిన అద్భుత విజ్ఞానమే పంచాంగం.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్ లాంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం. – డాక్టర్ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్పంచాంగ శ్రవణానికి ముస్తాబైన ఆలయాలు జిల్లాలో పండుగ సందడి జోరుగా వేపపువ్వు, కుండలు కొనుగోళ్లుబంచ్కు రూ.50 పలుకుతున్న ధర సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వరంగల్లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రతీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టే శుభదినమన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజలందరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ పండుగ ప్రతిఒక్కరికి సు ఖసంతోషాలను తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం పరిధిలోని పురాతన విగ్రహాల పరిరక్షణకు పు రావస్తు శాఖ, దేవాదాయశాఖ సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. బుధవారం ఈఓ మహేష్తో కలిసి పు రావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మా ధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్యలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా కాళేశ్వరంలోని పురాతనమైన నృసింహస్వామి, సోమేశ్వరాలయం, చంద్రశేఖరాలయాలు, కాళేశ్వరాలయం ఆవరణలోని పురాతన విగ్రహాలను, వివిధ ప్రాంతాల్లో నిరాధరణకు గురైన చారిత్రక విగ్రహాలను అధికారులు పరిశీలించారు. నిబంధనల మేరకు విగ్రహాలను రసాయన పదార్థాలతో శుభ్రం చేసి మెరుగులు దిద్దడం, భక్తులు, పర్యాటకుల సందర్శనార్థం దేవాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా భద్రపరస్తామని అధికారులు తెలిపారు. రూ.120 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. -
శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు
రేగొండ: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్లో మంచి రేటు లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి సురేష్ పాల్గొన్నారు. -
ర్యాగింగ్ శిక్షార్హ నేరం
భూపాలపల్లి అర్బన్: తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం శిక్షార్హ నేరమని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు పరస్పర గౌరవంతో, స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలన్నారు. ర్యాగింగ్తో మానసిక, శారీరక ఒత్తిడి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ర్యాగింగ్ ఘటనలు గమనించిన వెంటనే ప్రొఫెసర్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అవసరమైతే హెల్ప్లైన్ 18001805522, డయల్ 100 వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఎస్పీ సంకీర్త్ -
న్యూ కనెక్షన్ ఇక ఈజీ..
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026గతంలో కొత్తలైన్లకు జౌట్ రైట్ కంట్రిబ్యూటర్ చార్జీలు వసూలు చేసేది. దీంతో కొత్తలైన్లు, కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి చార్జీలు చెల్లించలేని వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యూలేషన్ కమిషన్ సులభతరంగా పారదర్శకంగా ఒక కిలోమీటర్ వరకు ఉచితంగా సర్వీస్ లైన్లు అందే విధంగా ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.హన్మకొండ: నూతన విద్యుత్ సర్వీస్ల మంజూరును విద్యుత్ పంపిణీ సంస్థలు సులభతరం చేశాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 జారీ చేసింది. దీని ప్రకారం విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతరంగా, పారదర్శకంగా సర్వీస్ పొందే అవకాశం కలిగింది. కొత్త ఎల్టీ కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్చార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించారు. ఒక కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలూ వర్తించవు. కిలోమీటర్ దూరం తర్వాత పొందే విద్యుత్ సర్వీస్కు మాత్రమే సర్వీస్ లైన్, ఇతర చార్జీలు చెల్లించాలి. లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు విధిస్తారు. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన అవసరం లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు మంజూరు చేస్తారు. ఈ విధానం టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ను వేగంగా పొందుతారు. చార్జీల చెల్లింపులో స్పష్టత ఉంటుంది. 20 కిలోవాట్ వరకు డెవలప్మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పై వాటికి కేవలం సర్వీస్ లైన్చార్జీలు మాత్రమే వర్తిస్తాయి. డెవలప్మెంట్ చార్జీలు ఉండవు. – మల్చూర్ నాయక్, ఎస్ఈ, జయశంకర్ భూపాలపల్లి నూతన విద్యుత్ సర్వీస్ల మంజూరు నిబంధనలు మరింత సులభతరంకిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలు లేవు.. సర్వీస్ లైన్ చార్జీలను సరళం చేసిన విద్యుత్పంపిణీ సంస్థలు అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీ స్టోర్ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు భారం వినియోగదారునిపై పడదు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే. నూతన ఏకరీతి విధానం రైతులకు ఎంతో ఉంటుంది. అధిక ఖర్చుల భారం పడదు. ఒక కిలో వాట్కు కేవలం రూ.1000 మాత్రమే చెల్లించాలి. కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు -
నిలిచిన నిధులు..
భూపాలపల్లి రూరల్ : లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా నిధులు మంజూరు నిలిచిపోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయి. జిల్లాలో 45 రైతువేదికలు గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 45 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45 వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారుగా 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటివరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 45 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.కోటి 62లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈఓలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు. క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు.. జిల్లాలోని 12 మండలాల్లో 45 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి ఏఈఓలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. కలెక్టర్ ఆదేశానుసారం నిర్వహణ లోపం లేకుండా చూస్తున్నాం, రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా ఏఈఓలు చూస్తున్నారు. నిధులు మంజూరు కాగానే రైతు వేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారిమండలాలు 12 రైతువేదికలు 45 ఒక్కోదానికి బకాయి 3.60లక్షలు మొత్తం బకాయిలు 1.62 కోట్లుజిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు కంప్యూటర్లు ఉన్న విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటి నుంచి నెలనెలా నిధులు విడుదల చేయాలని ఏఈఓలు, రైతులు కోరుతున్నారు. అధికారులకు భారమైన నిర్వహణ కనీస వసతుల కల్పనపై పట్టింపేది? ఇబ్బందుల్లో రైతులు, ఏఈఓలు -
నల్ల బ్యాడ్జీలతో నిరసన
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలని ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్ డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి బస్ యాత్రలో భాగంగా మంగళవారం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గనుల కార్మికులు, యూనియన్ నాయకులు శ్రీనివాస్, ఆసిఫ్పాషా, శంకర్ పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని హెచ్పీ గ్యాస్, సింగరేణి కాలరీస్కు చెందిన భారత్ గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్ సరఫరాలో జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్ను సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం కలెక్టర్ రాహుల్శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 6 గృహవినియోగ సిలిండర్ల స్వాఽధీనం జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్ సెంటర్లపై సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గృహ వినియోగ ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లయి ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ.. గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లను వాణిజ్య వంటలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ వినియోగం వల్ల ప్రభుత్వానికి నష్టం కలగడమే కాకుండా, అర్హులైన గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
నకిలీ హాజరుకు చెక్
భూపాలపల్లి రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్లో కూలీల హాజరు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. నూతన యాప్తోనే.. గతేడాది ఆగస్టు నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్ఎంఎంఎస్ నూతన యాప్ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు. నమోదు ఇలా.. పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్ ఎంచుకుని మాస్టర్లో కనిపించే పేర్లపై కూలీ ఫొటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో అనేక సంఘటనలు.. జిల్లా వ్యాప్తంగా 1,06,033 జాబ్ కార్డులు ఉన్నాయి. 2,26,233 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 6,97,226 యాక్టివ్ జాబ్ కార్డులు, 1,24,549 మంది కూలీలు యాక్టివ్గా పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు కుటుంబ సభ్యులు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నట్లు ఘటనలు సామాజిక తనిఖీల్లో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదుకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్తో నకిలీ హాజరు ఉండదు. అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. పనులకు వచ్చిన వారికే కూలీ వస్తుంది. హాజరు శాతంలో పారదర్శకత ఉంటుంది. – బాలకృష్ణ, డీఆర్డీఓగ్రామపంచాయతీలు 248 జాబ్ కార్డులు 1,06,033 కూలీల సంఖ్య 2,26,270 యాక్టివ్ జాబ్ కార్డులు 69,726 యాక్టివ్ కూలీల సంఖ్య 1,24,349 నూతన యాప్తోనే నమోదు ముఖం ఫొటోతోనే గుర్తింపు ఈ కేవైసీతో సరిపోతేనే కూలీ నమోదు -
కాళేశ్వరంలో అర్చకుడి నియామకం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిగా కొడమంచిలి ఫణికుమార్శర్మను నియమించారు. మంగళవారం దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పలు అభియోగాల నేపథ్యంలో కశ్యప్శర్మ నియామకాన్ని నిలిపివేశారు. ఆయన స్థానంలో కొడమంచిలి ఫణికుమార్ శర్మను నియమించినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. పోలీస్స్టేషన్ తనిఖీ మల్హర్(మహాముత్తారం): మహాముత్తారం పోలీస్ స్టేషన్ను మంగళవారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాలను క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై మహేందర్కుమార్, ఎస్సై– 2 మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి పలిమెల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి మొదటి విడత గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ లోకిలాల్ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలిమెల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్, పైలట్ ప్రాజెక్టు విలేజ్ పంకెన గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని అధికారులతో కలిసి అయన పరిశీలించారు. ఈ సందర్భంగా లోకిలాల్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాగె వైకుంఠం, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ సందీ ప్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఆన్లైన్లో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాపారస్తులు ఈ నెల 31వ తేదీలోపు పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించాలని సూచించారు. గడువు తరువాత ఏప్రిల్ 30 వరకు 25శాతం, మే 1 తరువాత 50 శాతం పెనాల్టీ విధించనున్నట్లు హెచ్చరించారు. పన్ను చెల్లింపును కార్యాలయంలో లేదా సీడీఎంఏ తెలంగాణ ఆన్లైన్ ద్వారా చేయవచ్చని తెలిపారు. -
అంతర్మథనం
భూపాలపల్లి అర్బన్: కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదు. గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలలో సర్పంచ్లు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచ్లకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి మండల సభలు గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్లు హాజరయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్లు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో సర్పంచ్లకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి. గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్లు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మండలసభ ఏర్పాటుచేస్తే అధికారులకు, సర్పంచ్లకు మధ్య సమన్వయం ఏర్పడుతుందని అంటున్నారు. మండల పరిషత్ పాలక వర్గాలు లేక ఇబ్బందులు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో.. -
వ్యర్థాలు తిని వంద గొర్రెల మృత్యువాత
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారంలో భక్తులు పడేసిన వ్యర్థాలు (ఎండి పోయిన అన్నం) తిని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా మరికెల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కొద్ది రోజుల క్రితం తనకున్న 200 గొర్రెలను తీసుకుని మేత నిమిత్తం తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఊరట్టం పంచాయతీ పరిధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో గొర్రెల మంద పెట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా గొర్రెలు అస్వస్థకు గురై సుమారు వంద మృత్యువాత పడ్డాయి. మేడారం వనదేవలతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పడేసిన వ్యర్థాలు తినడంతో గొర్రెలు అస్వస్థకు గురై మృత్యువాత పడినట్లు బాధిత గొర్రెల యజమాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల పైగా నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిగతా గొర్రెలు కూడా అనారోగ్యంగానే కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు. ములుగు: బాలల రక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంపత్రావు పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో నూతనంగా బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, 14 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. బాలల రక్షణపై అవగాహన కల్పించడం, ఆరేళ్లకు పైబడిన బాలలందరూ బడికి వెళ్లేలా చూడడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించడం కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. -
వినతులు పరిష్కరించండి..
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్లో బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో 46 వినతులు రాగా అదనపు కలెక్టర్ సంపత్రావు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 11 వినతులు రాగా డీడీ జనార్దన్, ఏవో రాజ్కుమార్లు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని అధికారులకు సూచించారు. ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని భూపతిపురానికి చెందిన రైతు, వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన మరో రైతు ఇందిర సౌర జలగిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురంలో కంటేజెంట్ వర్కర్గా పనిచేస్తున్న ఉద్యోగి 28 నెలలుగా వేతనం రావడం లేదని ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లికి చెందిన రైతు రైతుబంధు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి చెందిన ప్రజలు పెసా గ్రామసభ నిర్వహించాలని కోరారు. మిగిలిన వారు ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్(ఎస్డీసీ)అనిల్, మేనేజర్ శ్రీనివాస్, కొండల్రావు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సంపత్రావు, ఐటీడీఏ డీడీ జనార్దన్ ప్రజావాణిలో 46, గిరిజన దర్బార్లో 11 వినతులు స్వీకరణ -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో మూడంచెల పోరాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
భూపాలపల్లి: సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 52 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, ఆ దరఖాస్తుల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
పెండింగ్ సమస్యలపై వినతి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఎంఓఏఐ భూపాలపల్లి అధికారుల సంఘం ప్రతినిధులు సోమవారం ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్ మాట్లాడుతూ..కోలిండియా లిమిటెడ్లో అమలవుతున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణి అధికారులకు కూడా అమలు చేయాలని కోరారు. కోలిండియాలో చెల్లిస్తున్న అన్ని భత్యాలు, పే అప్గ్రేడేషన్, పీఆర్పీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు ప్రకటించిన ఇతర భత్యాలను అధికారులకు కూడా అమలు చేయాలని, వివిధ పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. చార్జ్షీట్ విచారణలను పారదర్శకంగా నిర్వహించి త్వరితగతిన ముగించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ఏరియా కార్యదర్శి అరుణ్, జాయింట్ ట్రెజరర్ సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీ మన్నాన్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మిర్జా యాసిన్ బేగ్, అధికారులు శ్రీనాథ్, సమ్మిరెడ్డి, మహేందర్, జ్యోతి పాల్గొన్నారు. -
లక్ష్మీదేవర బోనాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల పంచాయతీలో లక్ష్మీదేవర బోనాల పండుగను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో ఆటపాటలతో బోనం సమర్పించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారె విజయలక్ష్మి శంకర్, ఉపసర్పంచ్ ఓద్ది చంద్రయ్య, నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ మేనేజర్కు వినతి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సింగరేణి సెక్యూరిటీ గార్డులకు రన్నింగ్టెస్ట్ నిబంధన తొలగించాలని సోమవారం కొత్తగూడెం కార్పొరేట్ సెక్యూరిటీ మేనేజర్కు ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ప్రతినిధి బౌతు కమలాకర్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సంస్థ ఆస్తుల రక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త టెండర్ ప్రక్రియలో భాగంగా రన్నింగ్ టెస్ట్ నిర్వహించే నిబంధనతో 45నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అనుభవజ్ఞులైన పాత సిబ్బంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత సిబ్బందికి రన్నింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ సిబ్బంది మేరుగు రమేష్, కుమారస్వామి, రాజు, కటకం సతీష్, భోగి రాజేందర్, మారం రామిరెడ్డి, సతీష్ పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితుల పేరుతో గ్యాస్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. క్రూడాయిల్ ధరల మార్పులను కా రణంగా చూపుతూ ప్రజలపై భారాన్ని మో పడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, యాకుబ్ పాషా, గోలి లావణ్య, ఎండీ సాబీర్, పొనగంటి లావణ్య పాల్గొన్నారు. రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేటలో ఓ ఇంటి వద్ద గుడుంబా తయారు చేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఆ ఇంట్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసి అమ్ముతున్న మంద పరుశురాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా గుడుంబా అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో 2023లో జరిగిన హత్య కేసులో కోర్టు విచారణకు హాజరు కాని ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగే అనిల్, భూపాలపల్లికి చెందిన గోల్కొండ శివ పలుమార్లు కోర్టు విచారణకు హాజరు కాలేదు. మెజిస్ట్రేట్ వారిపై నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. సోమవారం ఎస్సై పవన్ కుమార్ నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా దివస్ కార్యక్రమంలో 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పీపీ వాదనలతో నిందితులకు శిక్షలు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలతో చాలా మంది నిందితులకు శిక్షలు పడ్డాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్న పీపీ శ్రీనివాస్ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీపీ శ్రీనివాస్ కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ జరిగిందన్నారు. అందులో ఏడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్షను కోర్టు విధించిందని ఎస్పీ వెల్లడించారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పిలవని పేరంటానికి వెళ్తే..
శుభకార్యాలకు పిలవకున్నా వెళ్లి భోజనం చేసేవారికి ఆదివారం భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు పెట్టారు. సింగరేణి ఫంక్షన్ హాల్లో ఆదివారం వివాహం జరిగింది. ఫంక్షన్ హాల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఫంక్షన్కు సంబంధం లేనివారు వందలాది మంది వచ్చి భోజనాలు చేస్తున్నారని నిర్వాహకులు గుర్తించారు. దీంతో ఇతరులెవరూ రాకుండా ఫంక్షన్ హాల్ ఎదుట ‘వివాహానికి సంబంధం లేనివారు వస్తే రూ.5వేల జరిమానా, 3నెలల జైలు’ అని ఫ్లెక్సీ పెట్టారు. భోజన ప్రియులు బోర్డును చూసి వెనుదిరిగి వెళ్లారు. గతంలో శుభకార్యాలు చేసినప్పుడు భోజనాలు సరిపోక ఇబ్బందులు అయ్యేవని.. ఫ్లెక్సీ ఏర్పాటుతో అందరికీ భోజనాలు సరిపోయాయని నిర్వాహకులు అన్నారు. – భూపాలపల్లి రూరల్ -
‘మేడిగడ్డ’ వినాశనానికి బాధ్యత వహించాలి
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వినాశనానికి అప్పటి కేసీఆర్ సర్కారే బాధ్యత వహించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం సభ్యులు పి.సుదర్శన్, బి.వెంకట్, సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో పార్వతి (సుందిళ్ల) బ్యారేజీలతో, పంపుహౌస్ను వారు ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ కుంగిపోయిన పియర్లు, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు రూ.90 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ప్రజాధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ భారీ వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వమే ప్రాథమిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేవలం కమీషన్లు, ప్రచారం కోసం శాసీ్త్రయత లేకుండా పనులు చేయించడంతో మేడిగడ్డ బ్యారేజీలో 19 నుంచి 22 వరకు ఉన్న గేట్ల ప్రాంతం కుంగిపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన వారి ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులతోనే జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకే పరిమితం చేయకూడదని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, నిపుణుల కమిటీ సూచనల మేరకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంటలకు సకాలంలో నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైందా అని నాయకులు ప్రశ్నించారు. సీఎం రేవంత్ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరమ్మతు చేయాలి అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతు, కూలీ, కార్మిక సంఘాల డిమాండ్ -
కాన్షీరాం జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: కాన్షీరాం మహారాజ్ 92వ జయంతి వేడుకలు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏ సీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ మాట్లాడు తూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ, సాంస్కృతిక సమానత్వానికి పునా ది వేసిన బహుజన యోధుడు కాన్షీరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నా యకులు సామల శ్రీనివాస్ కనకం మల్లయ్య, చిట్యాల శ్రీనివాస్, మంద రమేశ్, కోరళ్ల శ్యా మ్, పుల్ల అశోక్, చిర్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. ‘గిరిజనేతరుల భూములను పంచాలి’ వాజేడు: వలస గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివాసులకు పంచాలని నవ నిర్మాణ సేన జిల్లా కన్వీనర్ ఎట్టి విద్యాసాగర్ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలో ఆదివారం హరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్టలో ఆచార్య వినోబాబావే భూదాన్ ట్రస్ట్ బర్డ్ ద్వారా పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం దారుణమన్నారు. పేదల భూములను లాక్కున్న ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి వలస గిరిజనేతరులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. వలస గిరిజనేతరుల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆదివాసులకు పంచాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్, సునీల్, సూర్యం, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. పోచమ్మతల్లికి బోనాలు వాజేడు: మండల కేంద్రంలోని ప్రజలు ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ప్రతీ ఇంటి నుంచి బోనంతో మహిళలు తరలివెళ్లారు. పోచమ్మతల్లికి చీరె, సారె సమర్పించారు. కోళ్లను కోసుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా పోచమ్మ చెట్టు వద్దకు చేరుకున్న భక్తులు సల్లంగా సూడు పోచమ్మ తల్లి అంటూ మొక్కుకున్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ములుగు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో, సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందని వెల్లడించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్పా విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ దివాకరతో కలిసి ఈద్ కా తోఫా కానుకలను అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, నాయకులు భగవాన్రెడ్డి, వంగ రవియాదవ్ పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
జిల్లాలో క్యాన్సర్ కేసుల వివరాలుభూపాలపల్లి అర్బన్: జిల్లాలో క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐదేళ్లలో 358 కేసులు నమోదయ్యాయి. పేదరికం, నిరక్షరాస్యతతో గ్రామీణులకు క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. మొదట్లో గుర్తించకపోవడంతో చివరి దశలో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. జిల్లాలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు.. జిల్లాలో ప్రతీ ఏట పదుల సంఖ్యలో క్యాన్సర్తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవన శైలిలో మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధిపై అవగాహన ఉంటే ఆదిలోనే అరికట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో నోటి, వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ లేకపోవడంతో వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకొని వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఇలా గుర్తించండి.. నోటి, రొమ్ము, సర్విక్ క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్లో రక్తం, తెల్లబట్ట, ఎర్ర బట్ట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే సర్విక్ క్యాన్సర్గా భావించి హెచ్పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడం ద్వార ముందస్తుగా గుర్తించే వీలుంటుంది. నోటి అల్సర్లు, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి క్యాన్సర్ పరీక్ష చేయించాలి.హెచ్పీవీ వ్యాక్సిన్తో అప్రమత్తం క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు హెచ్పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్ సీహెచ్సీలో 14 నుంచి 15 ఏళ్ల పిల్లలకు హెచ్పీవీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మహిళల్లో అధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అధికంగా నమోదుతున్నాయి. ఈ క్యాన్సర్ను నివారించాలని ముందస్తుగా బాలికలను వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాయామం చేయాలి.. క్యాన్సర్ను మొదట్లో గుర్తిస్తే నయం చేయొచ్చు. రొమ్ము, సర్విక్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే ఆస్పత్రికి వెళ్లాలి. నిత్యం అర గంట వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రెడ్మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. – డాక్టర్ శ్రీదేవి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి -
పలుగుల రోడ్డుకు మోక్షం
మల్లన్న బోనాలుమల్లన్న పట్నాలు వేస్తున్న భక్తులు మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలోని గోదావరి ఒడ్డున వెలిసిన మల్లన్న దేవుడి ఆలయంలో ఆదివారం మల్లన్న పట్నాలు, బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులతో పట్నాలు నిర్వహించి మల్లన్న దేవుడికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు డప్పుచప్పుళ్ల మధ్య శివశక్తుల పూనకాలతో భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. – కాళేశ్వరంకాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామానికి వెళ్లే ఆరు కిలోమీటర్ల ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దకాలంగా ఇసుల రీచుల గుండా తరలివచ్చిన లారీలతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రహదారిని పునర్నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రూ.22 కోట్లతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా వర్షాకాలంలో రాత్రి ఆపదొస్తే కనీసం 108 అంబులెన్స్ వెళ్లలేని దుస్థితిలో ఈ రహదారి ఉంది. కీలక రవాణా మార్గం.. పలుగుల రహదారి పలుగుల టు కుంట్లం గ్రామాల ప్రజలకు కీలక రవాణా మార్గంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా రహదారి తీవ్రంగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారింది. ముఖ్యంగా ఇసుక రీచ్ల నుంచి వచ్చే భారీ లారీల రాకపోకలతో రహదారి ఆనవాళ్లు కోల్పోయి పూర్తిగా చెడిపోయింది. మోకాలు లోతు గుంతలు, దుమ్ము కారణంగా వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రయాణం చేయడం కూడా కష్టంగా మారేది. రహదారి నిర్మాణం పూర్తయితే పలుగుల, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు రవాణా మెరుగుపడి కాళేశ్వరం పాఠశాలకు రానున్నారు. కొత్త రహదారి నిర్మాణంతో ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.22 కోట్లతో మంత్రి శంకుస్థాపన పదేళ్ల నరకయాతనకు చెక్ ఇసుక రీచుల లారీలతో ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మల్హర్(కాటారం): మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని ఎల్జీ గార్డెన్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చెర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. కలెక్టర్ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి అర్చనలు జరిపించి స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలను బహుకరించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
‘జైన గుడిని పరిరక్షించాలి’
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప ఆలయ పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య కోరారు. ఆదివారం వారు రామప్ప పరిసరాల్లోని కాకతీయ కట్టడాల ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం జైన ఆలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్ధమండపం, రెండింటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణకలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన శిఖరం, దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్ధం పడుతున్నాయని వివరించారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం, శిల్పం, చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి లాంఛనమని తెలిపారు. అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరుడికి అంకితం చేశారన్నారు. వాస్తు నైపుణ్యం ఉన్న ఈ ఆలయాన్ని సైతం పదిలపరిస్తే సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనుగుడిని కూడా ఆ జాబితాలో చేర్చాలని వారు కోరారు. -
ప్రాదేశికం ఎప్పుడు?
రేగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి దాదాపు 9 నెలలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఆ పదవులపై కన్నేసిన వారికి ఉత్కంఠ తప్పడం లేదు. గతేడాది జూలై 4వ తేదీన జెడ్పీ, మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా, మండల పరిషత్లు ప్రత్యేధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 12 జెడ్పీటీసీ, 119 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటరు జాబితా సిద్ధం చేసింది. మారనున్న రిజర్వేషన్లు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు (42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం) కేటాయించినా, ప్రస్తుత పరిస్థితులతో అవి మారే అవకాశాలే అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అప్పటి రిజర్వేషన్లను రెండు సార్లు అమలు చేయాలి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాజకీయ సమీకరణాలతో కొత్త మండలం ఏర్పాటు కావడం, ఓటర్ల సంఖ్య పెరగడం లాంటి కారణాలతో రిజర్వేషన్లలో మార్పులు ఖాయమంటున్నారు. మూడు నెలలు ఆగాల్సిందేనా? ఇటీవల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం ఆ వెంటనే ప్రాదేశిక సమరానికి సిద్ధపడుతుందని ఆశావాహులు భావించారు. కానీ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేస్తుందనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఎంపీపీ, జెడ్పీ చైర్ పర్సన్ స్థానాలకు పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఏ పద్ధతి అయినా ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితులైతే కనిపించడం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. ఇంకా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఆశావహుల ఎదురుచూపు -
రేపటినుంచి ఒంటి పూట బడులు
భూపాలపల్లి అర్బన్: వేసవికాలం.. పైగా ఎండలు అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 430 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 24 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు. ఎమ్మెల్యే పరామర్శ చిట్యాల: మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల గ్రామంలో క్రేన్ వైర్ తెగి మృతిచెందిన ముగ్గురి మృతదేహాలను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, చిలుకల రాయకోంరు, గుర్రపు తిరుపతి గౌడ్, బుర్ర శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ రఫీ, అల్లం రాజు ఉన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు మండలంలోని కాటారం ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 13నుంచి ఈనెల 15 (ఆదివారం) వరకు హైదరాబాద్లోని చింతల్బస్తీలో జరుగుతున్న సీనియర్ మెన్ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో చరణ్, శివబాలాజీ పాల్గొంటున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలారం, పీడీ కుడిమేత మహేందర్, పీటీ మంతెన శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడిమంగపేట: మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి చరిత్ర, ఆలయ పురాణం వివరించి ఆశీర్వచనం ఇచ్చారు. -
అక్రమ వినియోగంపై నిఘా..
ఎల్పీజీ సిలిండర్లు దాచివేత, బ్లాక్ మార్కెటింగ్, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్యానికి వినియోగించడం వంటి అక్రమాలపై కఠిన నిఘా ఉంచినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో గ్యాస్ సరఫరా అందుబాటును నిరంతరం పర్యవేక్షించేందుకు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలను జిల్లా అధికారులు సమన్వయం చేస్తూ వినియోగదారులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా కొనసాగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ సిలిండర్లు ప్రాధాన్యతతో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. – రాహుల్ శర్మ, కలెక్టర్ -
బుకింగ్ డబుల్
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026భూపాలపల్లి: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో భారత్లో గ్యాస్ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో జిల్లాలో గృహావసరాలకు మినహా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగడం లేదు. ఫలితంగా జిల్లాకేంద్రంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయగా, పలువురు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. డబుల్ అయిన గ్యాస్ బుకింగ్.. జిల్లాలో హెచ్పీ, భారత్, ఇండేన్ కంపెనీలకు చెందిన 12 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల్లో డొమెస్టిక్(గృహావసర) కనెక్షన్లు 1,32,330 ఉన్నాయి. ఆయా వినియోగదారులు గతంలో నెలకు సుమారు 1,500 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే వారు. యుద్ధ వాతావరణం నేపథ్యం, గ్యాస్ కొరత తీవ్రం అవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు 2,800 నుంచి 3వేల మంది సిలిండర్ల కోసం బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకరోజుకు జిల్లాకు సుమారు 2వేల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ సిలిండర్ల కొరత కొంతమేరకు మాత్రమే ఉంది. బుకింగ్ చేసుకున్న వారు ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు.. వంటగ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని నిలిపివేసింది. దీంతో జిల్లాకేంద్రంతో పాటు కాటారం డివిజన్ కేంద్రంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు గ్యాస్ సిలిండర్లు లేక ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. పలు రెస్టారెంట్ల యజమానులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో తెలియదనే ఉద్ధేశంతో వంటచెరుకును ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. కట్టెలను కొనుగోలు చేసి హోటల్, రెస్టారెంట్ సమీపంలో పొయ్యిలను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. రీసైక్లింగ్ షురూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొనడంతో కొందరు వ్యాపారులు కొత్త దందాకు దిగినట్లు సమాచారం. గృహావసరాల సిలిండర్లను రూ.1,500 నుంచి రూ.1,800 వరకు కొనుగోలు చేసి కమర్షియల్ సిలిండర్లలోకి రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాకేంద్రంలోని పలు షాపుల యజమానులు సైతం డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి రీసైక్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజుకు 3వేల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యాపార సంస్థలకు కమర్షియల్ గ్యాస్ నిలిపివేత మూతబడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు పలుచోట్ల కట్టెల పొయ్యితో వంటల తయారీ -
ఎవరికీ పట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు. హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. 33మంది మిల్లర్ల నిర్లక్ష్యం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టం మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
● నలుగురు విద్యార్థులు గైర్హాజరు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సింగరేణి పాఠశాల, ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కలెక్టర్ రాహుల్శర్మ జంగేడు పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరీక్ష నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గణపురం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ను సందర్శించారు. 3,544 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్ మహాముత్తారం, మహదేవపూర్ పాఠశాలలను సందర్శించారు. రెండు ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణ చేశాయి. -
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ఏటూరునాగారం: సర్పంచ్లు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, సేవల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సఖి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్లైన్–1098, జిల్లా హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వంటి విభాగాల ద్వారా మహిళలు, బాలికలు, పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు ఎదుర్కొనే గృహహింస, వేధింపులు, అత్యాచారం వంటి సమస్యలపై సఖి కేంద్రం ద్వారా అందించే వైద్యం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను సర్పంచ్లు గుర్తుంచుకొని కావాల్సిన వారికి సాయం చేయాలన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న లేదా సహాయం అవసరమైన పిల్లల కోసం చైల్డ్ హెల్ప్లైన్ 1098 ద్వారా 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా డీహెచ్ఈడబ్ల్యూ ద్వారా మహిళల సాధికారత, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తదితర అంశాలపై సర్పంచ్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈ పురుషోత్తం, ఈజీఎస్ ఏపీఓ చరణ్రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీవిద్య, వసంత, బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజు, సఖి కౌన్సిలర్ కల్పన, చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
జాతీయ సంఘాలు సమాధానం చెప్పాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు ఆలస్యంగా ఇవ్వడం, ప్రమోషన్ పాలసీ అమలు చేయకపోవడం, కార్మికులను వివిధ స్కీముల పేరుతో తొలగించడం వంటి సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు సమాధానం చెప్పాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలను ఎంతవరకు అమలు చేశారో బహిరంగ చర్చలో చెప్పాలని ఐఎన్టీయూసీ నాయకత్వానికి సవాల్ చేశారు. కార్మికుల ఐక్య పోరాటాలతో సాధించిన హక్కులను కొన్ని జాతీయ సంఘాలు ప్రభుత్వాలు, యాజమాన్యాలతో కుమ్మకై ్క తాకట్టు పెట్టాయని ఆరోపించారు.ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్రెడ్డి, దాసరి జనార్దన్, నామల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో మున్సిపాలిటీ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ ఆధ్వర్యంలో రెస్టారెంట్లలో కిచెన్ షెడ్లను పరిశీలించారు. పాడైన చికెన్, కలుషితమైన ఆహార పదార్థాలు కనిపించడంతో భూమిలో పూడ్చిపెట్టారు. రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కమిషనర్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకంగా తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలు అందించనుంది. ఈమొత్తాన్ని పొందేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు www. epass. telangana. gov. inద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చేసుకుని పత్రాలను, సంబంధిత సమగ్ర శిశు, అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి రేగొండ : పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓ రాజుకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఎంజేపీ బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకదశ అని అన్నారు. సమయాన్ని వినియోగించుకుని ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ, ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు. విజయ్బాబు మృతి తీరని లోటు భూపాలపల్లి: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన విజయ్బాబు అకాల మరణం తీరని లోటని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్న గడ్డం విజయ్బాబు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చేరుకొని ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయంగా రూ.30 వేలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 1990లో పోలీసుశాఖలో విధుల్లో చేరిన విజయ్బాబు అకాల మరణం తమను కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి గౌరవ డాక్టరేట్ వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ను బుధవారం ప్రదానం చేసింది. -
తెల్లకాగితమే రశీదుగా..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పే రూముల్లో గోల్మాల్భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జనరల్ వార్డులు, ఆస్పత్రి నిర్వహణ కోసం 11 పెయింగ్(అద్దె) రూమ్లు ఏర్పాటు చేశారు. జనరల్ వార్డులో ఉండడం ఇష్టం లేని పేషెంట్లు రోజుకు రూ.500 చెల్లించి ఉంటారు. ప్రతీ రూమ్లో ఒకటి పేషెంట్కు మరొకటి అటెండెంట్కు కలిపి రెండు బెడ్లు ఉంటాయి. అయితే ఈ అద్దె రూమ్లకు ఇన్చార్జ్గా అర్హత లేని శానిటేషన్ సూపర్వైజర్ ఏళ్ల తరబడి కొనసాగుతుండడమే కాకుండా గది కిరాయి.. అడ్వాన్స్ తదితరాలకోసం రశీదులకు బదులుగా తెల్లకాగితాన్ని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వసూలు చేసిన డబ్బులు గోల్మాల్ జరిగినట్లు ఆస్పత్రిలో బహిరంగ చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అతనే ఎందుకు..? గతంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో శానిటేషన్ సూపర్వైజర్కు అద్దె గదుల బాధ్యత అప్పగించారు. దీంతో నాటి నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. మెడికల్ కళాశాల ఏర్పడి ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిగా మార్పు చెంది మూడేళ్లు గడిచింది. కావాల్సిన సిబ్బంది నియామకం కూడా జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రికి పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ ఇంకా శానిటేషన్ సూపర్వైజర్తోనే అద్దె గదుల నిర్వహణ కొనసాగిస్తుండడంపై రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రశీదులు లేకుండానే.. అద్దె గది తీసుకున్న పేషెంట్లకు రశీదులు ఇవ్వకుండా శానిటేషన్ సూపర్వైజర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. రశీదులకు బదులుగా తెల్లకాగితంపై అడ్వాన్ తీసుకున్నట్లు రాసిస్తున్నాడు. డిశ్చార్జి అయి వెళ్తున్న క్రమంలో మిగితా డబ్బులను తీసుకుంటారు. కానీ, రశీదులు అడిగిన కూడా ఇవ్వడం లేదని పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. అద్దె గదులు 11 ఉండగా ఒకటి ప్రత్యేకంగా శానిటేషన్ సూపర్వైజర్, మరొకటి డ్యూటీలో ఉండే నర్సింగ్ సిబ్బంది వినియోగించుకుంటున్నారు. మిగతా తొమ్మిది రూమ్లకు ప్రతీ రోజు రూ.4,500 చొప్పు న ఆదాయం వస్తుంది. అడ్మిట్ అయిన పేషెంట్ల వద్ద ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి సైతం సంబంధం లేకుండానే పేషెంట్ల సంబంధికుల నుంచి అడ్వాన్స్ రూపకంగా శాని టేషన్ సూపర్వైజర్ డబ్బులు తీసుకుంటున్నాడు. కలెక్టర్ దృష్టిసారిస్తే.. ఆస్పత్రిలో పేదల నుంచి వసూలు చేసిన డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సొంతానికి వినియోగించడంపై కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడి జమ అవుతున్న డబ్బులు, ఖర్చులపై కలెక్టర్ అడిట్ చేయిస్తే అవకతవకలు బయటపడనున్నాయి. అద్దె గదుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు సరికాదు. వసూలు చేసిన డబ్బులను ఆస్పత్రి అవసరాలకు వాడుకుంటున్నాం. ఏమైనా ఆరోపణలు ఉంటే సాక్ష్యాధారాలతో చూపిస్తే చర్యలు తీసుకుంటాం. అద్దె గదులను ఆస్పత్రి కార్యాలయ సిబ్బందితోనే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి అక్రమాలు జరగలేదు. – డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ బిల్లులు, ఖర్చుల లెక్కలు చూపని వైనం ఆస్పత్రి సిబ్బంది ఉన్నా ఇతరులకు బాధ్యతలు కానరాని రశీదు బుక్ అద్దె గదుల నుంచి వసూలైన డబ్బులను ఆస్పత్రి అత్యవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డబ్బులు వసూలు చేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్తోనే ఆస్పత్రి ఖర్చులు పెట్టిస్తుండడం గమనార్హం. వసూలు చేసిన డబ్బులను ఎవరి ఇష్టానుసారంగా కాకుండా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కమిటీ సమీక్షంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, సూపర్వైజర్ చేస్తున్న ఖర్చులకు సరైన బిల్లులు, పత్రాలు ఉండడం లేదని సమాచారం. చేసిన ఖర్చులకు అధిక ధరలు వేసి నకిలీ బిల్లులు ఆఫీసులో అప్పగించి సొమ్ము చేసుకుంటునట్లు తెలిసింది. అద్దె గదుల ద్వారా వచ్చిన డబ్బుల జమ, ఖర్చుల లెక్కలు లేవనే ప్రచారం జరుగుతోంది. గతంలో కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో ఓ వైద్యురాలి అండతో ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు సమాచారం. ఇటీవల ఈ సూపర్వైజర్ను కార్యాలయ సూపరింటెండెంట్ ప్రశ్నించగా సరైన లెక్కలు చూపించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ, అతని పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటనే సందేహం వ్యక్తమవుతోంది. -
టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
భూపాలపల్లి అర్బన్: టెన్త్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్తోపాటు ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ రాబోయే పరీక్షలకు ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా చదివి సిద్ధం కావాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్షలపై భయం లేకుండా అవగాహన కల్పించాలని సూచించారు. చదివిన అంశాలపైనే పరీక్ష ఉంటుందని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంత రం పాఠశాలలోని మధ్యాహ్న భోజనశాలను పరిశీ లించిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ దేవానాయక్, సీఎంఓ రమేష్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
సోదర భావానికి ప్రతీక రంజాన్
భూపాలపల్లి: సోదర భావానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలో సింగరేణి ఫంక్షన్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, పరస్పర సహకారం, సామాజిక ఐక్యతకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
మళ్లీ జనగణన
● కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ● ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం ● పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021 లో జనగణన చేపట్టాల్సి ఉండగా.. కరోనాతో జరగలేదు. 15ఏళ్ల అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్, జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ము లుగు జిల్లాలుగా విభజించారు. ఇది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణ నలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేప ట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికా రులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమో దు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగనుంది. రెండో దశలో జనా భా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. మార్చి 1 2027 ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూ డు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్ఓ, డీఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు పాల్గొంటున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జనగణనను రెండుదశల్లో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల అధి కారులతో రాబోయే 2027 జనగణన (సెన్సెస్–2027) ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ఉంటుందని తెలిపారు. ఈదశలో ఎన్యూమరేట ర్లు ఇంటింటికీ వెళ్లి గృహాల వివరాలు సేకరిస్తార ని తెలిపారు. గృహ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కుటుంబాల ఆస్తుల సమాచా రం నమోదు చేస్తారన్నారు. ఈ వివరాలు రెండో దశ జనగణనకు ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ దశలో ఫీల్డ్ వర్క్తో పాటు 15 రోజుల స్వీయ నమోదు అవకాశం కూ డా ఉంటుందన్నారు. రెండో దశలో ఎన్యూమరేటర్లు ప్రజల వ్యక్తిగత వివరాలు నమో దు చేస్తారన్నారు. ఫీల్డ్ వర్క్ అనంతరం 5 రోజుల రివిజన్ రౌండ్ నిర్వహించి వివరాలను ధ్రువీకరించాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో సర్వేను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నందున అధి కారులు పొరపాట్లుకు తావులేకుండా లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు. కాగా.. జిల్లా కేంద్రంలోని శ్రీనివా స ఫంక్షన్ హాల్లో నేడు(గురువారం) జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీ, ము న్సిపల్ అధికారులతో శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సీపీఓ జవహర్, డీపీఓ శ్రీలత, ము న్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. -
సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఏరి యాలోని యూనియన్ కార్యాలయంలో బుధవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కార్మికుల ఐక్యపోరాటాల ద్వారా తిరిగి సాధించుకున్న మెడికల్ బోర్డు నిర్వహణను గత సంవత్సరం నమోదైన ఏసీబీ కేసును సాకుగా చూపుతూ నిలిపివేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుమారు పది నెలలుగా అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేక మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను పిలవకపోవడం, పైగా వారిపై నిబంధనల పేరుతో చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. పాత పద్ధతిలో మెడికల్ బోర్డును కొనసాగిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని తెలిపారు. యాజమాన్యం ఒప్పుకున్న ఒప్పందాలను అమలు చేయకపోవడం, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు రాకపోవడం వల్ల సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18న శ్రీరాంపూర్ ఏరియా నుంచి ప్రారంభమయ్యే ‘సేవ్ సింగరేణి జాతా’ ద్వారా కార్మికులను చైతన్యపరుస్తూ 30న కొత్తగూడెం హెడ్ఆఫీస్ వద్ద జరిగే ము గింపు సభను విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోటపలుకుల రమేష్, రామచందర్, సుధాకర్రెడ్డి, ఆసిఫ్ పాషా పాల్గొన్నారు.కొరిమి రాజ్కుమార్ -
28న జాతీయ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీని యర్ సివిల్ జడ్జి నాగరాజ్ తెలిపారు. బుధవారం న్యాయవాదులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ మార్గాన్ని ఎంచుకొని వివాద రహిత జీవితాలను గడిపేలా కక్షిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కు వ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, చీఫ్ లీగల్ ఎయి డ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, అదనపు పీపీ రఫీక్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, న్యాయవాదులు భిక్షపతి, రమేష్, సుభాష్, విష్ణు, మొయినుద్దీన్, సంధ్య పాల్గొన్నారు. -
పంట మార్పిడితో అధిక లాభాలు
టేకుమట్ల: ప్రతీ సీజన్లో రైతులు పంట మార్పిడి చేసి సాగు చేయడం ద్వారా దిగుబడి పెరిగి అధిక లాభాలను పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధి కారి సునీల్కుమార్ తెలపారు. మండలంలోని పంగిడిపల్లిలో గ్లోబల్ డ్రిప్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు డ్రిప్ పరికరాలు, పంటల్లో వచ్చే చీడపీడల నివారణపై బుధవారం అవగాహన కల్పించి, ఉ ద్యాన మిషన్ పథకం ద్వారా రైతులకు కూరగాయ ల మినీ కిట్లను పంపిణీ చేశారు. అలాగే డ్రిప్ విని యోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృషి విజ్ఞా న కేంద్రం రామకిరికిల్ల కీటక శాస్త్రవేత్త వెంకన్న మా ట్లాడుతూ.. పంటల్లో చీడ పీడల నివారణకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఏఓ కల్యాణి, ఏఈఓలు రాహుల్, రామాచారి తదతరులు పాల్గొన్నారు.ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్కుమార్ -
కార్మికుల సమస్యలపై ఆరోపణలు సరికాదు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేని వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొంతకాలంగా కార్మికుల సమస్యలను పరిష్కరించామని, కార్మిక సంక్షేమానికి యాజమాన్యంతో నిరంతరం చర్చలు జరిపి పలు ప్రయోజనాలను సాధించామని తెలిపారు. కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు చేయకుండా కార్మిక సంక్షేమానికి కలిసి పని చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు మధుకర్రెడ్డి, జోగు బుచ్చయ్య, శశరత్నం, సమ్మిరెడ్డి, అశోక్, హుస్సెన్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.పసునూటి రాజేందర్ -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లువరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లపై సౌర వెలుగులు
హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. సౌర శక్తిని వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం దీని ఉద్దేశం. ఈపథకం ద్వారా వినియోగదారుడు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడంతోపాటు అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే అవకాశముంది. ఇంటి పైకప్పు సోలార్ ఫలకల ఇన్స్టలేషన్కు అనువుగా ఉండాలి. 20.16 కోట్ల రాయితీని విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు.. సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్బన్ డయాకై ్సడ్ సమానమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 4 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టుబడి పొందవచ్చు. మిగతా 20 ఏళ్లు పూర్తి లాభదాయకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాయితీ వినియోగించుకోవాలి..ప్రభుత్వం రూఫ్టాప్ సోలార్ప్లాంట్ (ఫలకల) ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. విద్యుత్ను ఉచితంగా వాడుకోవడమే కాకుండా విక్రయించి సైతం ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. – మహేందర్రెడ్డి, రెడ్కో హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల మేనేజర్ఉమ్మడి జిల్లాలో సోలార్ ఫలకల ఏర్పాటు ఇలా.. (సామర్థ్యం మెగావాట్లలో)... దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది. పీఎం సూర్యఘర్తో ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు వినియోగం ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్టాప్ ఇన్స్టలేషన్జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్లు దరఖాస్తులుభూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
జిల్లాలో 9 మంది ఎస్సైల బదిలీ
భూపాలపల్లి: జిల్లాలో 9 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ ఇన్చార్జ్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొగుళ్లపల్లి ఎస్సై బి.అశోక్ను గణపురం ఎస్సైగా, టేకుమట్లలో పని చేస్తున్న ఎస్సై డి.సుధాకర్ను రేగొండకు, చిట్యాలలో పని చేస్తున్న జి.శ్రావణ్కుమార్ను భూపాలపల్లి ఎస్సై 2గా, వేకెన్సీ రిజర్వ్లో ఉన్న ఎస్సైలు సాయి త్రిలోక్నాథ్రెడ్డిని కొత్తపల్లి గోరి ఎస్సైగా, పి.సతీష్ను చిట్యాల ఎస్హెచ్ఓగా, అమూల్యను టేకుమట్లకు, ములుగు జిల్లాలో వేకెన్సీ రిజర్వ్లో ఉన్న ఎం.సురేష్ను మొగుళ్లపల్లికి, గణపురం, కొత్తపల్లి గోరి ఎస్సైలు ఆర్.అశోక్, ఎస్.దివ్యలను వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పలువురు ఎస్సైలు మంగళవారం సాయంత్రమే ఆయా ఠాణాలకు చేరుకొని బాధ్యతలు తీసుకున్నారు. ఆధునిక శిక్షణతో యువతకు ఉపాధి భూపాలపల్లి అర్బన్: ఐటీఐలో ఆధునిక శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే సత్యనారాయణరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2ఈ, 3ఈ మిషన్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్, ఎలకి్ట్రక్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన ఎలకి్ట్రక్ వాహనాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ నడిపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐటీఐ విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఏటీసీ కేంద్రం ద్వారా విద్యార్థులు ఆధునిక యంత్రాలపై శిక్షణ పొందుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలి పారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలు యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జమ్మూలాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామప్పలో సింగరేణి బృందంవెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసివచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. అనంతరం వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్స్ లీడర్స్ శ్రీనివాసరావు, స్వామి , మాస్టర్స్ రమేశ్, కుమార్, భాస్కర్, శైలజ, ప్రకాష్, సుమన్, నీలిమ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
మూడు నెలల క్రితం రేగొండ మండలం బాగిర్ధిపేట క్రాస్రోడ్ మీదుగా పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న మూడు ట్రాలీలను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టేకుమట్ల బూర్నపల్లి వద్ద సివిల్ సప్లయీస్ టాస్క్ఫోర్స్ అధికారులు గత నెల 11వ తేదీన రెండు ట్రాలీలను పట్టుకొని సుమారు 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ప్రతీ నెల ఒకటి రెండు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భూపాలపల్లి: జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు ఏడాది క్రితం వరకు మహా రాష్ట్రకు అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించా రు. కాగా ఇప్పుడు అక్కడ దందా బంద్ కావడంతో స్థానిక దళారులు ఆ బియ్యాన్ని నేరుగా జిల్లాలోని రైస్మిల్లులకే పంపిస్తుండడం గమనార్హం. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్ కింద సివిల్ సప్లయీస్ గోదాంలకు తరలిస్తున్నారని, దళారులకు సివిల్ సప్లయీస్ అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి మిల్లులకు రవాణా.. కూలీలు సేకరించిన, రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్లకు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లయీస్ శాఖలోని కొందరు అధికారులు ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైస్మిల్లులకే చేరుతున్న పేదల బియ్యం జిల్లాలో జోరుగా అక్రమ వ్యాపారం రేషన్ డీలర్లు, దళారుల నుంచి మిల్లులకు చేరవేత రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద సర్కార్కు అప్పగింత సహకరిస్తున్న సివిల్ సప్లయీస్ అధికారులు..?జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1.25 లక్షల తెల్లరేషన్కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి 6 కేజీల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. అయితే కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఏర్పడి, వారంతా బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారులకు విక్రయిస్తారు. అంతేకాక పలువురు దళారులు నేరుగా రేషన్ డీలర్లతో డీల్ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం ఈ దళారులంతా రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్మిల్లుకు తరలించగా, ప్రస్తుతం ఆ రైస్మిల్ బంద్ కావడంతో జిల్లాలోని పలు రైస్మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. -
అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి అర్బన్: మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల పనులను వేగంగా చేసి గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంత్య పుష్కరాల పనులు ఏప్రిల్ 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలి ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డు సభ్యుల శిక్షణా తరగతులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం, 12వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి సంబంధించి విభాగాల వారీగా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో మెడికవర్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా కలెక్టరేట్లో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సమగ్ర కార్యక్రమాలతో వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడేలా సమగ్ర కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చేపట్టాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంటల దిగుబడి, పంట మార్పిడి, ఎరువుల వినియోగంపై, పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీజీఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డాక్టర్ మధుసూదన్, ఫణికుమార్, డాక్టర్ వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, స్వాతి, వ్యవసాయ అధికారి బాబూరావు, ఉద్యాన అధికారి సునిల్ కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
రేపు కాళేశ్వరానికి మంత్రి శ్రీధర్బాబు రాక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రానున్నారు. రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది. ఈ మేరకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది. రూ.21కోట్ల నిధులు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.35కోట్లతో సరస్వతినది పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సరస్వతీనది అంత్యపుష్కరాలను అదే మాదిరిగా మే నెలలో నిర్వహించడానికి రూ.31.60 కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.21కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిధులతో పుష్కరాల పనులు ప్రారంభం కానున్నాయి. రూ.1.20కోట్లతో మ్యూజియం పనులకు శంకుస్థాపన -
సీటీ స్కాన్ నిరుపయోగం
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026రూ.3.40 కోట్ల నిధులతో ఏర్పాటు ● టెక్నీషియన్లు, సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యం ● ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్న రోగులుభూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం నిరుపయోగంగా మారింది. రూ.3.40 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈసీఐఎల్ సంస్థ యంత్రాన్ని ఏర్పాటుచేసినా టెక్నీషియన్లు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో పేద రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. గతేడాది ప్రారంభమైనా.. గతేడాది నవంబర్ 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అస్పత్రిలో సీటీ స్కానింగ్ యంత్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రోడ్డు ప్ర మాద బాధితులు, తలకు, మెదడు, గుండె సంబంధిత సమస్యలు, అంతర్గత గాయాలు తదితర రోగులకు ప్రయోజనం కలుగుతుందని అనుకున్నారు. కానీ ప్రారంభించి నాలుగు నెలలు అవుతున్నా రేడియాలజీ, సీటీ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఆఫిసర్లను నియమించలేదు. దీంతో సీటీస్కాన్ సేవలు రోగులకు అందడం లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులను పరీక్షిస్తున్న వైద్యులు సీటీస్కాన్ అవసరం ఉంటే వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేస్తున్నారు. లేదంటే ప్రైవేట్లో డబ్బులు పెట్టి సేవలు పొందాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. టెక్నీషియన్ల ఏర్పాటుపై నిర్లక్ష్యం.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా సీటీ స్కానింగ్ యంత్రం నిర్వహణపై ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టిసారించడం లేదు. కావాల్సిన సిబ్బంది నియామకంపై సంబంధింత అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు కనిపిస్తుంది.యంత్రాన్ని ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని జిల్లా ప్రజలు అంటున్నారు. రెండు నెలల క్రితమే టెక్నీషియన్ నియామకానికి నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థుల ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ ఎంపికలో పారదర్శకత పాటించడం లేదని కలెక్టర్ తిరస్కరించినట్లు తెలిసింది. ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనం మూలంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మల్హర్(కాటారం): ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. కాటారం మండలకేంద్రంలో పల్లె ప్రకృతి వనం క్లీనింగ్ పనులను డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు. 108 వాహనం తనిఖీ రేగొండ: మండలకేంద్రంలో 108 వాహనాన్ని 108 జిల్లా మేనేజర్ రాజునాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనంలోని పరికరాల పనితీరు, మందులు, రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ శంకర్రావు, పైలట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏఐఎఫ్బీ జిల్లా కన్వీనర్గా నరసింహారెడ్డి భూపాలపల్లి అర్బన్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) జిల్లా కన్వీనర్గా లక్కిరెడ్డి నరసింహారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కన్వీనర్, వైస్ ప్రెసిడెంట్ అంబటి జోజిరెడ్డి సోమవారం హైదరాబాద్లో నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. నరసింహారెడ్డి నాయకత్వంలో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయ ఈఓగా బాధ్యతల స్వీకరణవెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయానికి నూతన ఈఓగా (ఆలయ కార్యనిర్వహణాధికారి) ఇమ్మడి భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ మండలం వేలేరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్కు రామప్ప ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు కల్పిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న బిల్ల శ్రీనివాస్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మండలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ భాస్కర్ రామప్ప రామలింగేశ్వరస్వామికి కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్శర్మ ఈఓ దంపతులను శాలువాతో సత్కరించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ఉపయోగించుకోవాలిములుగు: పీఎం విశ్వకర్మ పథకాన్ని అర్హులందరూ ఉపయోగించుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో ఈడీసీర్యాంప్ ఆధ్వర్యంలో పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు. వడ్రంగులు, కంసాలులు, కుంచెవారు, దర్జీలు, నాయీబ్రాహ్మణులు, మట్టి పనివారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనుల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ యంత్రం కోసం అవసరమైన గదులు, మౌలిక వసతులను కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని తెలిపారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తిచేసి, ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో సంబంధిత వైద్య అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన
చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్, కై లాపూర్ గ్రామ శివారులో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై సోమవారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్కుమార్ హాజరై డ్రిప్ పరికరాల పనితీరుపై జైన్ డ్రిప్ కంపెనీ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు, పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ వంటి పంటలను సాగు చేసుకుంటే మార్కెట్లో మంచి ధరతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. అనంతరం ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. -
గళమెత్తిన కౌన్సిలర్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, పక్కన కలెక్టర్ రాహుల్శర్మభూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ తొలి సమావేశంలోనే కౌన్సిలర్లు పట్టణంలోని అనేక సమస్యలపై గళమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కమిషనర్ ఉదయ్కుమార్ హాజరయ్యారు. తొలుత వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల నివేదికలను వెల్లడించారు. సమావేశంలో పలువురు కౌన్సి లర్లు పట్టణంలోని సమస్యలను నివేదించారు. ఆమోదం పొందని ఎజెండా అంశాలు.. కౌన్సిల్ సమావేశంలో పొందుపరిచిన ఎజెండాలోని అంశాలకు కౌన్సిలర్లు ఆమోదం తెలపలేదు. తప్పుడు బిల్లులు సమర్పించారని, కౌన్సిల్ ఏర్పాటుకు ముందు ఖర్చు చేసిన బిల్లులకు ఇప్పుడు ఆమోదం కోరడమేంటని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. నిధులు దుర్వినియోగం చేయొద్దు : కలెక్టర్ రాహుల్ శర్మ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పలువురు కౌన్సిలర్లు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందిస్తూ.. వీధి వ్యాపారులకు మంజూరుచేసిన రుణాలపై నివేదిక అందించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే సత్యనారాయణరావు జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి రూ.82కోట్ల నిధులు ఇప్పించానని, త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. కౌన్సిలర్లు హుందాగా వ్యవహరిస్తూ గౌరవ మర్యాదలను కాపాడుకోవాలన్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీష్ మాట్లాడుతూ తన వార్డులో తాగునీటి పైప్లైన్లు లీకేజీ అవుతున్నాయని, బోర్లు కాలిపోతున్నాయని అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన చెత్తాచెదారం ఇష్టారాజ్యంగా పడేస్తున్నారని, రైతుల పంట పొలాలు కలుషితం అవుతున్నాయని తెలిపారు. 19వ వార్డు కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్ష్మీనగర్లో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, వెంటనే తొలగించాలని కోరారు. 29వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీశ్రెడ్డి మాట్లాడుతూ తన వార్డులోని బోరు పని చేయడం లేదని, డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. సీఎస్ఆర్ నిధులతో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. పల్లె దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉందని, కేటీకే 6వ ఇంక్లైన్ ప్రహరీ వెంట ఉన్న యూకలిప్టస్ చెట్టు భారీగా పెరిగి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 6వ ఇంక్లైన్ బ్యారెక్స్ వెనుక భాగంలో పార్కు, జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. కోతుల బెడద తీవ్రంగా ఉందని పలువురు కౌన్సిలర్లు కోరగా.. ఎమ్మెల్యే సత్యనారాయణరావు స్పందిస్తూ... తన నిధుల నుంచి వేయి కోతులు పట్టించేందుకు నిధులు ఇస్తానని, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సింగరేణి జీఎంలు కూడా తమవంతుగా నిధులు కేటాయించి కోతుల బెడద తీర్చాలని సూచించారు. ఎజెండా అంశాలను ఆమోదించని సభ్యులు పట్టణాభివృద్ధికి తోడ్పడాలి : ఎమ్మెల్యే, కలెక్టర్ -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 45 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. దరఖాస్తులను అధికారులు జాప్యంచేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు బాధ్యతాయుతంగా దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వరే.. సరి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. సాగునీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ కారణంగా రైతులు మళ్లీ వరి వైపు మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది. యాసంగి సాగు ఇలా... గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగుకాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. వరి సాగు పెరగడానికి కారణాలు... హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేర విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వరి సాగు విస్తీర్ణం కొంత తగ్గిన ప్రాంతాలు కూడా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం పంటలు వరి వరంగల్ 1,96,722 95,152 హనుమకొండ 1,77,735 1,11,380 జనగామ 2,07,353 1,79,010 మహబూబాబాద్ 2,13,665 1,07,617 జేఎస్ భూపాలపల్లి 1,17,085 89,000 ములుగు 70,320 52,420 మొత్తం 9,82,880 6,34,579 మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం వరి నమోదు గతంతో పోలిస్తే పెరిగిన వైనం.. మిగతా పంటలతో పోలిస్తే మేలంటున్న రైతులు -
ఆర్చరీలో అనయకు గోల్డ్మెడల్
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ గోల్డ్మోడల్ సాధించించి. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి–13 విభాగం ఆర్చరీ పోటీల్లో అనయ 360లో 354 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 26వ తేదీ నుంచి విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో అనయ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించనున్నట్లు కోచ్ నగేష్ వెల్లడించారు. కోచ్ నగేష్, కుటుంబ సభ్యులు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆమెను అభినందించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీలలో అనయ మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారం అవుతుందని తెలి పారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అ ప్పగిస్తూ పేద ప్రజలపై భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ విధానమైందని విమర్శించారు. చేనేత కార్మికురాలికి సన్మానం కాళేశ్వరం: జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహదేవపూర్ టస్సర్ కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు గొర్రె కావ్యను ఆదివారం శాలువాతో సన్మానించారు. ప్రశంస పత్రం అందజేశారు. భూపాలపల్లి జిల్లా నుంచి ఆమెను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. నిరసన సెగ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆది వారం రాత్రి నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్కు నిరసన సెగ ఎదురైంది. స్థానిక యూని యన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశాన్ని బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనక్ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసగిస్తుండగా యూనియన్ నాయకులు కొందరు నిల్చొని జనక్ప్రసాద్కు వ్యతిరేకంగా నినాదానాలు చేస్తూ స్టేజీపైకి దూసుకెళ్లారు. ఏడాది కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, సొంతింటి పథకం కల నెరవేర్చడం లేదని, వేజ్బోర్డు కోసం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ విధానాలతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని మండిపడ్డారు. దీంతో స్పందించిన జనక్ప్రసాద్ త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను ఐఎన్టీయూసీ మాత్రమే పరిష్కరిస్తుందన్నారు. నిరంతర విద్యుత్ ములుగు రూరల్: మండల పరిధిలోని మల్లంపల్లి ట్యాపింగ్ పాయింట్ నుంచి 3/11 కేవీ పత్తిపల్లి వరకు నిర్మించిన 33కేవీ ఇంటర్ లింక్ లైన్ను విజయవంతంగా చార్జీ చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఆనందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ లింక్లైన్ ద్వారా కాసిందేవిపేట, పత్తిపల్లి సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించవచ్చని తెలిపారు. -
మహిళల పాత్ర కీలకం
భూపాలపల్లి: సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా ముందుకుసాగుతూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, రాణి లక్ష్మీబాయి వంటి మహనీయ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలు విద్య, ఉపాధి, పరిపాలన, క్రీడలు తదితర రంగాల్లో పురోగతి సాధిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, భూపాలపల్లి సీఐ డి.నరేష్కుమార్, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి యువత గంజాయి, మాదకద్రవ్యాలు లాంటి ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడా రంగాల్లో రాణించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన టీంలకు జిల్లా పోలీసు కార్యాలయంలో బహుమతులు అందజేశారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ అతిథిగా కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. అలాగే సినీనటుడు బాబు మోహన్ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా బాబుమోహన్కు పూజారులు అమ్మవార్ల కండువా కప్పి ప్రసాదం అందజేశారు. జంపన్నవాగులో నీరు లేకపోవడంతో పాటు స్నానఘట్టాల వద్ద ఒక షెవర్ కూడా లేకపోవడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు.వనదేవతలకు మొక్కులు -
మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు
భూపాలపల్లి అర్బన్: అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించే మహాశక్తి మహిళలకు ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి నిజమైన దారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీ్త్రమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని, గ్రంథాలయానికి వచ్చి చదువుకునే మహిళా పాఠకులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి, లైబ్రేరియన్ రాణి, పాఠకులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు -
తగ్గనున్న దూరభారం
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన కిషన్రావుపల్లి రహదారి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి గతంలో టెండర్ ప్రక్రియ కావడంతో రోడ్డు పనులు నడుస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల మండల కేంద్రం నుంచి భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 2017 సంవత్సరంలో అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ భూపాలపల్లి వన్ఇంకై ్లన్ మైన్ ఫారెస్ట్ రోడ్డులో ఫారెస్ట్ అధికారులు నిర్ధారించిన రోడ్డు ప్రదేశంలో మట్టి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు పూర్తికాగానే లెవలింగ్ పనులు చేపట్టి అవసరమైన చోట కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. తగ్గనున్న దూరభారం.. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూరభారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగుపడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో తాడిచర్లతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతాయి. కిషన్రావుపల్లి ఫారెస్ట్లో రానున్న ఆరు నెలల కాలంలో రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి అనువుగా ఉంటుంది. ప్రయాణభారం తగ్గుతుంది. జిల్లా కార్యాలయాలకు, ఇతర అవసరాలకు భూపాలపల్లికి వెళ్లడానికి కొయ్యూరు నాగులమ్మ మీదుగా భూపాలపల్లికి పోతున్నాం. ఈ రోడ్డు పూర్తయితే ఉపయోగకరంగా ఉంటుంది. – చింతలపల్లి మల్హల్రావు, మాజీ ఎంపీపీ, మల్హర్● పెరగనున్న రవాణా సౌకర్యం పారిశ్రామికంగా మరింత అభివృద్ధిరిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీశాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. కాగా ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సదరు నిధులు చెల్లించింది. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్ ప్రకియ పూర్తయింది. -
భూపాలపల్లిలో ఆస్తిపన్నుల వివరాలు..
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026అసెస్మెంట్లు 12,413 ప్రస్తుత డిమాండ్ రూ. 6.7 కోట్లు ఫెనాల్టీ రూ. 21.33 లక్షలు పాత బకాయిలు రూ. 1.74 కోట్లు పాత బకాయిల ఫెనాల్టీలు రూ. 99.2 లక్షలు ఈ సంవత్సరం వసూలు రూ. 3.5 కోట్లు పాత బకాయిల వసూలు రూ. 22.57 లక్షలు రావాల్సిన మొత్తం బకాయిలు రూ. 3.2 కోట్లు -
ఉత్తమ గేయ రచయితగా నందకిషోర్
గణపురం : మండలకేంద్రానికి చెందిన తాళ్లపెల్లి నందకిషోర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ 2025 అవార్డులలో ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన కుబేర సినిమాలో నంద కిషోర్ రెండు పాటలు రాయగా అందులో ఆకలితో నువ్వు పస్తుంటే అనే పాటకు ఆయనను ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నందకిషోర్ను పలువురు అభినందిస్తున్నారు. విద్యుత్ సమస్య రాకుండా చూడాలి చిట్యాల: వినియోగదారులకు ఎండాకాలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సుందర్కుమార్ విద్యుత్ సిబ్బందికి తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా విద్యుత్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా అధిక లోడు ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానిని గుర్తించి కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్లు వెంకటేశ్ , రమేశ్, ఎస్కే అక్బర్, ఎస్ఎల్ఐ కుమార్స్వామి, లైన్ ఇన్స్పెక్టర్ సతీష్, ఏఎల్ఎం, సిబ్బంది పాల్గొన్నారు. మంజూరు పత్రాల అందజేత హన్మకొండ కల్చరల్: వరంగల్జోన్ పరిధి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరస్వామి దేవాలయంలో పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ పవన్కుమార్, ప్రధానార్చకుడు క్రిష్ణమూర్తిలకు అర్చక సంక్షేమ నిధినుంచి రూ.8లక్షలు మంజూరయ్యాయి. ఆ మంజూరు పత్రాలను శనివారం హనుమకొండలోని రాంనగర్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వారికి అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జోన్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామల సునీత పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధే లక్ష్యం
నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ● కౌన్సిలర్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి ● వీఐపీ రిపోర్టర్, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళములుగు: ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు.. తెల్లవారుజాము నుంచి పొద్దుగూకే వరకు పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధులు, డ్రెయినేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రపరుస్తున్నారు.. చెత్తాచెదారాన్ని తొలగిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సరైన రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు మున్సిపల్ తొలి చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతనిప్పుల చంద్రకళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చూపేందుకు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 4వ వార్డులో పర్యటించి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చంద్రకళ: ఎలా ఉన్నారు.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్వరూప: ప్రభుత్వం అందించే రూ.9,500 వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచి ఆదుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాం. సెలవురోజుల్లో కూడా పనులు చేస్తూ వీధులు శుభ్రపరుస్తున్నాం. చంద్రకళ: సొంత ఇళ్లు అందరికీ ఉన్నాయా? పూలమ్మ: ఇరవై ఏళ్లకు పైగా కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. కార్మికులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చంద్రకళ: ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? విజయ: డ్రెయినేజీలు శుభ్రం చేయడం, చెత్తను తరలించే క్రమంలో దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కార్మికులకు గ్లౌస్, మాస్క్లు, బూట్లు, భద్రత పరికరాలు పంపిణీ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు శాశ్వత ఉద్యోగ కల్పనతో పాటు వేతనాలు పెంచాలి. చంద్రకళ: తాగునీటి సరఫరా ఎలా ఉంది? రాజక్క: కాలనీలో చేతిపంపులు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఎండాకాలం ప్రారంభమైనందున తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. చంద్రకళ:అందరికీ పింఛన్లు వస్తున్నాయా? మల్లిక: కాలనీలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకు రాలేదు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వృద్ధాప్య, వింతంతువు, దివ్యాంగులకు పింఛన్లు అందించాలి. చంద్రకళ:కాలనీలో ఇంకా ఏమైనా సమస్యలు నెలకొన్నాయా? రమ: కోతుల బెడద తీవ్రంగా ఉంది. అన్ని కాలనీల్లో కోతులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రోడ్డుపై నడిచి వెళ్లేవారితో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. -
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
మంత్రి సీతక్క సహకారంతో ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రతీ కాలనీని నేరుగా సందర్శించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాను. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఇంటింటికీ నల్లానీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీకాలనీలో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మారుస్తాం. ప్రధానంగా డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిలర్ల సహకారంతో సంబంధిత అధికారులతో చర్చించి ముందుకెళ్తాం. – చింతనిప్పుల చంద్రకళ, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ -
ఆటల పోటీలు
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో శనివారం మహిళలతో పాటు మహిళా ఉద్యోగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, లేడీస్ క్లబ్ సభ్యులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. -
బాలికలకు ఆరోగ్య భరోసా
భూపాలపల్లి అర్బన్: మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వారా (సర్వైకల్) క్యాన్సర్ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గత నెల 28వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించనున్నారు. క్షేత్రస్థాయిలో బాలికలకు టీకా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ తన కార్యాలయంలో ప్రోగ్రాం అఽధికారులు, వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీచేశారు. 100కు పైగా నమోదు.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో 100 కేసులకు పైగా నమోదయ్యాయి. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుందని చెబుతున్నారు. శరీరంలోనూ వైరస్ కారణంగా ఇది సోకుతుంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల తరబడి వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం కావడానికి అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ అవగాహన లేమితో చాలామంది పరీక్షలు చేయించుకోక దీనిబారిన పడుతున్నారు. మొదటి దశలో గుర్తించలేక వ్యాధి ముదిరిపోయే దశలో బయటపడి మరణానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 2,400మంది విద్యార్థులు ఇప్పటికే టీకా వేయడంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే జరిపి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలు 2,400 మంది ఉన్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరికి ఒక డోసు హెచ్పీవీ టీకా వేయనుండగా భవిష్యత్లో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా నియంత్రించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వేకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా 95శాతం వరకు రక్షణ ఇస్తుందని వైద్యులు గుర్తించారు. మొదటి విడత మూడు కేంద్రాల్లో.. మొదటి విడతలో 30 రోజుల పాటు మూడు కేంద్రాల్లో వాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్పెషల్ డ్రైవ్ కింద జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్లోని సీహెచ్సీలో హెచ్పీవీ వాక్సిన్లు వేస్తారు. ప్రతీ బుధవారం, శనివారాల్లో మాత్రమే టీకా వేయనున్నారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని నేడు జిల్లాలో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో 2,400మంది బాలికలను ఇప్పటికే గుర్తించాం. టీకా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే టీకా తీసుకున్నవారు తిరిగి తీసుకోవద్దు. – డాక్టర్ చల్లా మధుసూదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మొదటి విడతలో భూపాలపల్లి, చిట్యాల, మహదేవపూర్ 14–15 ఏళ్లలోపు మధ్య వారికి టీకాలు జిల్లాలో 2,400వేల మంది గుర్తింపు -
తగ్గని నేరాలు.. అందని న్యాయం
● ప్రతీ ఏటా మహిళలపై దాడులు ● అత్యధిక శాతం కేసులు పెండింగ్లోనే.. ● బాధితులకు సకాలంలో అందని న్యాయం భూపాలపల్లి: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ప్రతీ ఏటా వందల కేసులు నమోదవుతున్నా.. అత్యధిక కేసులు ఠాణాలు, కోర్టుల్లో పెండింగ్లో ఉండటంతో నేరస్తులకు సకాలంలో శిక్షలు పడటం లేదు. వరకట్న వేధింపుల కేసులే ఎక్కువ.. లైంగిక దాడులు, హత్యలు ఒకటి రెండు మాత్రమే నమోదవుతుండగా.. వరకట్న వేధింపుల కేసులే అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలో మూడేళ్లుగా మహిళలపై నేరాల కేసులు 250కి పైగా నమోదు కాగా.. సగం కేసులు వరకట్న వేధింపులవే ఉన్నా యి. ఇందులో నూటికి 90 శాతం కేసులు చార్జ్షీట్ రాక పోలీస్స్టేషన్లలో పెండింగ్లో ఉండగా.. పదిశాతం కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించిన కేసులు రెండో స్థానంలో నమోదవుతున్నాయి. లైంగిక దాడులవి ఏటా పదివరకు నమోదవుతున్నాయి. పెండింగ్లోనే కేసులు.. వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యయత్నం, వేధింపులు, మహిళల హత్యలు, లైంగికదాడి, కిడ్నాపింగ్, మహిళల గౌరవానికి భంగం, రెండో పెళ్లిళ్లు తదితర కేసులు ప్రతీ ఏటా జిల్లాలో సగటున 250 వరకు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో లోక్ అదాలత్లో పరిష్కారం అవుతుండగా, 150 వరకు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. మిగిలినవన్నీ పోలీస్స్టేషన్లలో పెండింగ్, చార్జిషీట్ కోసం వేచి చూడటం తదితర కారణాలతో ఉన్నాయి. 2025లో నమోదైన కేసుల వివరాలు.. 2025 సంవత్సరంలో వరకట్న ఆత్మహత్య కేసు ఒకటి నమోదు కాగా.. కోర్టులో పెండింగ్లో ఉంది. ఆత్మాహత్యాయత్నం కేసులు ఆరు నమోదుకాగా రెండు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వరకట్న వేధింపుల కేసులు 117 నమోదు కాగా 77 కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మహిళ హత్య కేసులు ఐదు నమోదు కాగా.. ఒకటి కోర్టు పెండింగ్లో ఉంది. లైంగిక దాడుల కేసులు 10 నమోదు కాగా.. ఏడు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కిడ్నాపింగ్ కేసులు 17 నమోదు కాగా ఒకటి కోర్టులో ఉంది. మహిళ గౌరవానికి భంగం కేసులు 97 నమోదు కాగా ఒక కేసులో రాజీ కుదరగా.. 59 కోర్టు పెండింగ్లో ఉన్నాయి. భర్తకు రెండో పెళ్లి కేసులు రెండు నమోదయ్యాయి. -
సొంత నిర్ణయంతోపాటు తల్లిదండ్రుల సూచనతోనే కోర్సు ఎంపిక మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ సర్వేలో విద్యార్థినుల మనోగతం
‘మేం రోజువారీ తీసుకునే నిర్ణయాల్లో సగమే స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాం.. ఇటు తల్లిదండ్రుల సూచన, సొంత నిర్ణయంతో ఇప్పుడు చదువుతున్న కోర్సులను ఎంచుకున్నాం. మేం తీసుకునే నిర్ణయాల్లో సగమే మద్దతు వస్తోంది. పూర్తి స్థాయిలో రావాలి. అదే సమయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా మేం ఉండాలి.’ అని అంటున్నారు విద్యార్థినులు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ‘మీరెంత ఇండిపెండెంట్’.. అన్న అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 18–25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థినులను ‘సాక్షి’ సర్వే చేసింది. పలు అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. – సాక్షి నెట్వర్క్ ఏ) పూర్తిగా బీ) కొద్దిమేర సీ) లేదు 3. మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది? 2. మీరు ప్రస్తుతం ఎంచుకున్న కోర్సును మీరు కావాలనే ఎంచుకున్నారా?ఏ) నా సొంత నిర్ణయం58ఏ) 50 %44ఏ4. ఒక సీ్త్ర ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే.. ఎవరి సహకారం ఎక్కువ అవసరం? 18బీ) 100%బీ8సీ) సమాజంసీ) 25%ిసీబీ) స్నేహితులు24ఏ) కుటుంబంబీ) మా తల్లిదండ్రుల నిర్ణయం 88సీ) స్నేహితుల సూచనడీ) 0%సర్వే శాంపిల్ : ప్రతీ జిల్లా నుంచి 20 మంది, ఆరు జిల్లాల నుంచి 120 మంది●ఇండిపెండెంట్గా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం1. మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు. -
‘ప్రగతి ప్రణాళిక’ ఘనంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణకు ప్రతీ శాఖకు సంబంధించి నోడల్ అధికారులను నియమించామన్నారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు శుభ్రత, ఫైల్ క్లియరెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు రోడ్డు భద్రత అలైవ్–అరీవ్ అనే థీమ్తో రోడ్డు భద్రతపై అవగాహన, ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్ 12వ తేదీ వరకు శాఖలకు కేటాయించిన తేదీల్లో ఆయా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సమావేశానికి హాజరైన కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, చాహత్బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, దివాకర టీఎస్, అధికారులుసాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నా రు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: ఇన్సర్వీస్ అభ్యర్థుల నుంచి ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జుమ్లానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వృత్తిలో కనీసం మూడు సంవత్సరాల అనుభవంతో పరిశ్రమలలో పనిచేస్తూ జీపీఎఫ్, ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిగి ఉన్న ఇన్ సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తు ఫారాలు అందించనున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్ల జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి రూరల్: జిల్లా ఉప సర్పంచ్ల కమిటీని ఎన్నుకున్నట్లు ఆ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల కార్తీక్ తెలిపారు. జిల్లాకేంద్రంలో రైస్మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గట్టు ప్రదీప్ గౌడ్, (గోరి కొత్తపల్లి), జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బొబ్బిలి రాజు (కొయ్యుర్), జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శంకర్ (రేగొండ)తో పాటు తదితరులను ఎన్నుకున్నారు. రమేశ్కు జాతీయ సేవారత్న అవార్డు భూపాలపల్లి అర్బన్: స్థానిక న్యాయవాది భూక్యా రమేశ్నాయక్ను జాతీయ సేవా రత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రమేశ్నాయక్ న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తూనే సేవా కార్యక్రమాల్లో చేసిన విశిష్ట కృషికి సేవా రత్న నేషనల్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అటవీశాఖ కార్యాలయంలో వేడుకలు భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కాళేశ్వరం సర్కిల్ మినిస్టీరియల్ ఫోరం అధ్యక్షుడు సలీం రాజిమీర్జా, కోశాధికారి మధుప్రసన్న ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏఓ కొమురయ్య, సభ్యులు పాల్గొన్నారు. వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. పనులు పూర్తి చేయండివాజేడు: జాతీయ రహదారి విస్తరణ పనులను పూర్తిచేయాలని నేషనల్ హైవే ఈఈ మనోహర్ అన్నారు. వాజేడు మండలంలోని జగన్నాథపురం నుంచి చెరుకూరు వరకు 10 కిలో మీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. శుక్రవారం వాజేడుకు వచ్చిన ఆయన రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట నేషనల్ హైవే ఏఈ రామ్ముర్తి ఉన్నారు. -
ప్రతీ కుటుంబం పరిశుభ్రత పాటించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని.. ప్రతీ కుటుంబం పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, డ్రెయినేజీలు, కాలనీలు, ఇళ్ల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సౌకర్యాలు, డ్రెయినేజీ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, మిడిల్ పోల్స్ అవసరం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటుచేసి విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవీ హెల్త్ మిషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూన్ 9వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్యసేవలను నేరుగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
సర్వర్ సమస్య
కాళేశ్వరం: ఉపాధిహామీ పథకంలో మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. పనులకు వచ్చే కూలీలకు (ఎఫ్ఆర్ఎస్) ముఖహాజరు విధానాన్ని అమలు చేస్తుంది. పథకంలో వెలుగుచూసిన అక్రమాలు, అవకతవకలు అరికట్టడంతో పాటు కూలీలకు సరైన న్యాయం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానానికి ఆదిలోనే సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. సర్వర్ సమస్య.. ఇంతకు ముందు కూలీలందరినీ ఒక బృందంగా ఫొటో తీసి (ఎన్ఎంఎంఎస్) నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో నిక్షిప్తం చేసేవారు. కొత్త విధానం అమలు ద్వారా ప్రతి కూలీ ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ పూర్తయిన కూలీలకు మాత్రమే పని ప్రదేశంలో సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. తద్వారా వేరొకరి పేరిట హాజరు వేయడం అసాధ్యమవుతుంది. ఈ–కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఉపాధిహామీ పథకంలో పనికి తగిన వేతనం లభించే అవకాశం ఉంటుంది. మార్చి 1 నుంచి.. ప్రస్తుతం కొత్త విధానం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య ముఖగుర్తింపు విధానానికి సవాలుగా మారుతుంది. శివారు ప్రాంతాల్లో కూలీలు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనిని అధిగమించేందుకు పని ప్రదేశంలో ఫొటోలు తీసుకొని సిగ్నల్ వచ్చే ప్రాంతాలకు వెళ్లి అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తేనే ఇబ్బందులు రావని పలువురు ఫీల్డ్అసిస్టెంట్లు అంటున్నారు. దీంతో ప్రతీ కూలీ ఐరిస్(కంటి ఆధారిత) ద్వారా తీసుకొని తరువాత గ్రూప్ ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. పని ప్రారంభం ముందు..నాలుగు గంటల తరువాత మరో ఫొటో తీయాలని నిబంధన విధించారు. చాలా మంది కూలీలకు ఈకేవైసీ పూర్తయినప్పటికీ యాప్లో ఐరిస్ క్యాప్చర్ కావడం లేదు. ఉదాహరణకు 50–60 మంది కూలీలు పనికి వస్తే నాలుగు నుంచి ఐదుగురికి క్యాప్చర్ అవుతుంది. ఫొటోకు ఫొటోకు మధ్యన సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఫీల్డ్అసిస్టెంట్లకు భారం పెరిగిందని అంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కూలీలు మొరపెడుతున్నారు. దీంతో మొదటి రెండు రోజులు కొంత మంది వేచి చూసి వెనుదిరిగారని తెలిసింది. ఉపాధిహామీ పనులకు వచ్చే వారికి సర్వర్ సమస్యలకు అధికారులు కొంత మినహాయింపు ఇచ్చారు. జన్మనరేగా యాప్తో మస్టర్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. చిట్యాల మండలంలో మొదటి రోజు సోమవారం పనికి వచ్చిన కూలీలకు మస్టర్ పడకపోవడంతో తిరిగి వెళ్లారు. దీంతో రెండు రోజుల ముందుగానే మస్టర్ డిమాండ్ ఫా రంలో కూలికి వచ్చే వారి పేర్లు నమోదు చేసి జన్మనరేగా యాప్తో మస్టర్లు వేస్తున్నారు. మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో ఐరిస్తో ఇబ్బందులు తప్పడం లేదు. టేకుమట్ల మండలం రామకృష్ణపూర్లోని సర్వర్ డౌన్ ఉండడంతో టేకుమట్లకు వచ్చి మస్టర్ నమోదు చేస్తున్నారు. కూలీలు పనిచేసి తిరిగి వచ్చి ఫొటోదిగి వెళ్తున్నారు. ఇలా నాలుగుసార్లు వచ్చిపోతున్నారు. పలిమెల మండలంలో సర్వర్ సమస్యతో మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. మహదేవపూర్ మండలంలో బీరసాగర్, ఏన్కపల్లిలో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. దీంతో యాప్తో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మస్టర్లు వేస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు సర్వర్ పని చేస్తుంది. ఆ తరువాత పని చేయడం లేదు. మహాముత్తారం మండలం సింగారం, బోర్లగూడెం, నర్సింగపూర్ గ్రామాల్లో సర్వర్ పని చేయడం లేదు. మల్హర్లో చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయి. ఆదిలోనే సమస్యలు కంటిఆధారితంగా తీసుకోని క్యాప్చర్ సర్వర్ సమస్యలు సరిచేయాలని కూలీల మొర ప్రస్తుతం నాలుగువేల మందికి అటెండెన్స్ఉపాధిహామీలో కొత్త విధానంతో సమస్యలు ఉన్నది వాస్తవమే. కానీ త్వరలో అప్డేట్ చేస్తారు. గ్రామాల్లో సర్వర్ సమస్యలతో ఇబ్బందులను గుర్తించాం. కూలీల హాజరుకు ఇబ్బంది లేదు. మొత్తం ఏడు వేల మంది కూలీలు పనికి వచ్చేవారు ఉండగా.. రెండు రోజులుగా నాలుగు వేలకు పైన కూలీలకు అటెండెన్స్ వేశారు. త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి. – బాలకృష్ణ, డీఆర్డీఓ -
క్రీడలతో శారీరక దారుఢ్యం
భూపాలపల్లి: క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో అంబేడ్కర్ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాలుగవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ ఆడారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకొని వారికి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐ డి.నరేష్కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
బెదిరిస్తే పనెలా చేయాలని ఏఈ నిరసన!
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మార్కింగ్ చేయడానికి వచ్చిన తనను పబ్లిక్ బెదిరిస్తున్నారని, వారు చెప్పినట్లు మార్కింగ్ ఇవ్వాలని అంటున్నారని నిరసిస్తూ హౌసింగ్ ఏఈ బైఠాయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఏఈ మాట్లాడిన తీరు.. తాను ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేస్తానని.. స్లాబ్ ఏరియా 600 స్క్వేర్ఫీట్లు మించొద్దని చెప్పినా కొంతమంది వినిపించుకోవడం లేదన్నారు. తనను బెదిరిస్తున్నారని వాళ్ల డాడీకి ఫోన్ చేసి ఇంటికి ఉద్యోగం వదిలి వెళ్లొస్తానని తెలిపారు. కలెక్టర్, గవర్నర్కు చెప్పి ఇక్కడికి తీసుకురావాలని అతడి డాడీతో బాధ వ్యక్తం చేశాడు. లేకపోతే సచ్చిపోతానని తెలిపాడు. మర్యాద లేదని, తనది కోపం కాదు.. బాధ అంటు కష్టపడి చదువుకొని ఉద్యోగంలోకి వచ్చాను.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలువలేదని అన్నాడు. పక్కనే ఉన్నవారంత నచ్చజెప్పి ఏఈని అలా మాట్లాడొద్దని బతిమిలాడారు. అనంతరం ఏఈ జిల్లా ఉన్నతాధికారికి కూడా ఫోన్ చేసి బాధను వివరించాడు. ఇటీవల జరిగిన ఈ విషయం ప్రజల వ్యవహారశైలితో విసుగు చెందిన ఏఈ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. ఈ విషయమై మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్కు ఫోన్చేయగా అందుబాటులోకి రాలేదు. -
దరఖాస్తు గడువు పెంపు
భూపాలపల్లి అర్బన్: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు డీవైఎస్ఓ రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షకేంద్రం తనిఖీ చిట్యాల: మండలకేంద్రంలోని మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ పరీక్షలను అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కళాశాల సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ ఉన్నారు. కార్మిక చట్టాలపై అవగాహన భూపాలపల్లి అర్బన్: ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నూతన కార్మిక చట్టాలపై జీఎం కార్యాలయ ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నాగశేషు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్మిక కోడ్ల ముఖ్యాంశాలను కార్మికులకు వివరించారు. నూతన కార్మిక కోడ్ల అమలుతో దేశ కార్మిక చరిత్రలో కొత్త దశ ప్రారంభమైందని తెలిపారు. కార్మిక సంక్షేమం, భద్రత, కనీస వేతనాలు, గౌరవప్రదమైన జీవన విధానానికి ఈ చట్టాలు ప్రాధాన్యం ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) రవికుమార్, డీవైఎస్ఈ అశోక్రెడ్డి, పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్కుమార్, సివిల్ సూపర్వైజర్లు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. వేం నరేందర్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి రూరల్: హైదరాబాద్లోని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు, రా జ్యసభకు ఎంపికై న వేం నరేందర్ రెడ్డిని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్లో జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలి మొగుళ్లపల్లి: అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. గురువారం రంగాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం–2లో నిర్వహించిన బారసాల, అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మిస్తారన్నారు. స్థానికంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినడం ద్వారా ప్రతిరోజు అంగన్వాడీలో అందించే పాలు, గుడ్డు, భోజనం చేస్తే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. చిరుధాన్యాలు ఖచ్చితంగా ఒకపూట భోజనంలో చేర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేసు మమత, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
● కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి అర్బన్: పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు నేపథ్యంలో గురువారం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలన్నారు. ప్రతీ శాఖ తమ పరిధిలో ఉన్న పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, డీపీఓ శ్రీలత, మున్సిపల్ కమిషనర్, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. పరీక్షలకు సిద్ధం కావాలి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ధైర్యంగా సిద్ధం కావాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, డీఈఓ రాజేందర్, ఎస్ఓ ఈశ్వరిలు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం పరిశీలన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, పరీక్షల విభాగం చీఫ్ సూపరింటెండెంట్ సదానందం, సిబ్బంది పాల్గొన్నారు. మీ సేవ రాత పరీక్ష మీ సేవ సెంటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. -
చెత్త కుప్పలు..
● రోడ్ల వెంట చెత్త నిల్వలు ● పట్టించుకోని పాలకవర్గం, అధికారులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ నిర్వహణ అధ్వానంగా మా రింది. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏ మూ లన చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేనితనం మూలంగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా.. పట్టణ ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. కాలనీల ప్రజలతో పాటు విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉండగా చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. కాలనీల్లో వారానికి, పదిరోజులకు ఒక సారి చెత్త సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారని ఆయా కాలనీ ల వాసులు అంటున్నారు. చెత్త సేకరణ రోజువారీగా చేయకపోవడంతో కాలనీ వాసులు రోడ్లు, ఖాళీ స్థలాలు, మురికికాలువల్లో చెత్తను పడేస్తున్నారు. కాలనీలపై అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పది రోజుల పాటు రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త కుళ్లిపోవడంతో దోమలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ మాత్రమే ఉంది. పట్టణంలో ఉన్న మురికినీటి కాలువల్లో చెత్తా చెదారం నిండిపోయి నీరు నిలుస్తోంది. చిన్న వర్షం వస్తే ఆ నీటితో కాలువలు పూర్తిగా నిండిపోతాయి. చాలావరకు ఇళ్లనుంచి వచ్చే చెత్తాచెదారాన్ని రోడ్డు పక్కన, కాలువల్లో పారవేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల తాగునీటి కాలువలు పగిలి నీరు బయటకు వచ్చి సమీపంలోని మురికికాలువల్లో కలుసున్నాయి. దీంతో రోడ్డు మార్గంలో వచ్చిపోయే వారు ముక్కు మూసుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెత్త కుళ్లిపోవడం వలన దోమలు వ్యాపించి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. భూపాలపల్లి పట్టణంలోని 30 వార్డుల్లో సుమారు 70వేల మంది నివసిస్తున్నారు. ఇంత పెద్ద పట్టణానికి కేవలం 17 చెత్త కుండీలు మాత్రమే కొనుగోలు చేసి అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అవి అక్కడక్కడ ధ్వంసమై నిరుపయోగంగా మారాయి. కాలనీల్లో వారంలో ఒకటి రెండు సార్ల మాత్రమే చెత్తను సేకరించడం వలన చెత్తను నిల్వ చేసుకోలేక కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురికి కాలవల్లో చెత్తను పడేస్తున్నారు. పట్టణంలో ప్రతీ కాలనీలో రెండు కుండీలను ఏర్పాటు చేయడం వలన రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త పడేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిరుపయోగంగా మారిన పాడైన చెత్తకుండి -
‘మద్దతు’ ఇవ్వని మార్క్ఫెడ్!
దిక్కు తోచని స్థితిలో మొక్కజొన్న రైతులుసాక్షి ప్రతినిధి, వరంగల్: మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్లో ఎలాగోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 2.11 లక్షల ఎకరాల్లో సాగు.. ఎంఎస్పీ బహు జాగు 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొచ్చని భావించి ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువసగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పెట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లేదు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.2025–26లో జిల్లాల వారీగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం.. మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’.. క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. ‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు ఉమ్మడి వరంగల్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక అన్నదాతల ఆందోళనఖర్చు అంశం సుమారు ఖర్చు రూ.లు)భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000 విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000 ఎరువులు 5,000 – 7,000 మందులు (కీటక నివారణ) 3,000 – 5,000 కూలీల ఖర్చు 6,000 – 8,000 నీటి ఖర్చు 3,000 – 5,000 కోత – రవాణా 4,000 – 6,000 మొత్తం ఖర్చు 28,000 – 40,000 జిల్లా సాగు విస్తీర్ణం ( ఎకరాల్లో...)హనుమకొండ 58,000 వరంగల్ 46,000 జనగామ 30,150 మహబూబాబాద్ 40,230 ములుగు 20,125 జేఎస్ భూపాలపల్లి 16,995 మొత్తం 2,11,500 -
రైతులను ఆదుకోవాలి..
టీజీ మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలి. ఎకరానికి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి చివరకు రెక్కల కష్టం కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోవాలి. – టి.సారయ్య, ఉపాధ్యక్షుడు, ఎంఏసీఎస్, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి దళారులు ఇబ్బంది పెడుతున్నారు..మార్క్ఫెడ్ అధికారులు సరైన విధంగా కొనుగోలు కేంద్రాలు తెరవని కారణంగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు మక్కలు కొంటున్నారు. ఖరీఫ్లోనూ రైతులకు మక్కలు అమ్ముకునే విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు యాసంగి మొక్కజొన్నల విషయంలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించాలి – రామారపు సాంబయ్య, రైతు, మాణిక్యాపూర్, భీమదేవరపల్లి -
మానసికోల్లాసానికి స్పోర్ట్స్ మీట్
● ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నిత్యం విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు మానసికోల్లాసం కలిగించడానికే జిల్లా స్థాయి నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా స్థాయి నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను ఈనెల 6తేదీ (శుక్రవారం) నుంచి ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 194 మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నట్లు చెప్పారు. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలను పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. నిత్యం విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న పోలీస్ సిబ్బందికి ఒత్తిడిని తగ్గించడం, శారీరక ధృఢత్వం పెంపొందించడం ఈ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీస్ సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, పరస్పర సమన్వయం పెంపొందించడమే ఈ స్పోర్ట్స్ మీట్ ముఖ్య లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల యువతను భాగస్వామ్యం చేయించడం ద్వారా పోలీసులు, ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫోరెన్సిక్ నివేదికలు కీలకం
భూపాలపల్లి అర్బన్: కేసుల విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ నివేదికలు, వేలిముద్రల విశ్లేషణ, చేతిరాత పరిశీలన, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్ నివేదికలపై న్యాయవాదులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే కేసుల విచారణ సులభతరం అవుతుందన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలను సకాలంలో సేకరించి, వాటిని శాసీ్త్రయంగా విశ్లేషించి కోర్టు ముందు సమర్పించినప్పుడు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మోహన్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, భూపాలపల్లి ఎస్సై రవళి, సీనియర్ న్యాయవాదులు కూనూరి సురేష్కుమార్, పగడాల ఆనందరావు, రాజ్కుమార్, చిరంజీవి, రవీందర్, ప్రియాంక పాల్గొన్నారు. -
నేడు మహబూబాబాద్లో ఉమ్మడి జిల్లా సమావేశం
సాక్షి, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం మహబూబాబాద్లో ఉమ్మడిజిల్లా అధికారుల సమావేశం జరగనుంది. సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు, ముఖ్య అధికారులు పాల్గొననున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో 99 రోజుల ప్రణాళికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాన్ని కింది స్థాయి అధికారులకు చేరవేయడం, ఇందులోని ముఖ్యాంశాలను నేడు జరిగే సమావేశంలో వివరించనున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై సమీక్ష.. హాజరు కానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశంఈనెల 31 వరకు గడువు.. విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి. – మహబూబాబాద్ అర్బన్అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు 48,941 ఉన్నారు.అన్నీ ఉచితంగానే..ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఎంపికైతే ప్రత్యేక శిక్షణ -
హరిత లక్ష్యం ఖరారు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా నాటనున్న మొక్కల లక్ష్యాన్ని జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. 2026–27 సంవత్సరానికిగాను జిల్లా వ్యాప్తంగా 2,51,814 మొక్కలు నాటాలని నిర్ణయించింది. డీఆర్డీఓ, మున్సిపల్, అటవీశాఖల ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటినుంచి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో అధికారులు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకానికి అవసరమైన కసరత్తు ప్రారంభించారు. జూన్ నాటికి మొక్కలు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. వేసవి ప్రారంభమై ఎండలు ముదురుతున్న నేపద్యంలో మొక్కల సంరక్షణకు గ్రీన్ షెడ్ కట్టే పని చేపట్టారు. జిల్లాలో 2,51,814 లక్షల మొక్కలు.. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా జిల్లాలోని 248 గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల చెరువుల నుంచి మట్టి తీసుకు వచ్చి పాలిథిన్ బ్యాగుల్లో నింపుతున్నారు. మరికొన్ని చోట్ల మట్టి నింపి విత్తనాలు కూడా నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఆ శాఖకు అవసరమైన మొక్కలతో పాటు ఇతర శాఖలకు కూడా అందించేలా మొక్కలను పెంచే దిశగా చర్యలు ప్రారంభించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతుంది జూన్ మాసం వరకు.. డీఆర్డీఓ ఆధ్వర్యంలో మండలాల వారీగా జిల్లా వ్యాప్తంగా 2,51,814 మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా అటవీ, మున్సిపల్ శాఖ లకు లక్ష్యం నిర్ధేశించిన ప్రభుత్వం.. మిగతా శాఖ లకు సుమారు లక్ష వరకు మొక్కలు నాటించే విధంగా లక్ష్యాలను కేటాయించారు. వచ్చే జూన్లో లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాల్సిఉంది. పండ్లు, నీడనిచ్చే మొక్కలు.. హరితహారంలో ప్రజలు ఎక్కువగా కోరుకునే మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పాటు, బాదం, వేప, కానుగ, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు. సింగరేణి, తాడిచెర్ల ఏఎంఆర్ మైనింగ్శాఖలు నిర్ధేశించిన మొక్కలతో పాటు అదనంగా పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. జూన్ నెలలో మొక్కలు నాటే విధంగా పెంపకం జరుగుతుంది. మొక్కలను లక్ష్యానికి అనుగుణంగా పెంచుతాం. – బాలకృష్ణ, డీఆర్డీఏ వివిధశాఖల ఆధ్వర్యంలో నర్సరీల ఏర్పాటు మొక్కల పెంపకానికి కసరత్తు షురూ -
వైభవంగా నరసింహుడి రథోత్సవం
● జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతర వైభవంగా సాగింది. బుధవారం ఉదయం హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం స్వామి వారికి బోనాలు సమర్పించినట్లు ఆలయ అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ ముఖ్యఅతిథిగా హాజరై పెద్ద రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నారసింహుడి నామస్మరణతో.. కోటంచ ఆలయ పరిసర ప్రాంగణం భక్తుల నారసింహుడి నామస్మరణతో మార్మోగింది. భక్తులు ఎడ్లబండ్లతో పాటు ప్రభ బండ్లు, ఇతర వాహనాలతో జాతర ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. జాతరకు జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, ములుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. డీఏస్పీ సంపత్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఆల య ఈఓ మహేష్, కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ లైన్మెన్ల పాత్ర గొప్పుది
చిట్యాల: విద్యుత్ సరఫరాలో లైన్మెన్ ఉద్యోగుల పాత్ర గొప్పదని చిట్యాల విద్యుత్ శాఖ ఏడీఈ సుందర్కుమార్ అన్నారు. జాతీయ లైన్మన్ దివాస్ కార్యక్రమాన్ని బుధవారం మండలకేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉత్తమ సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన లైన్మెన్లకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈ చంద్రశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తేదీన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించున్నట్లు మై భారత్ జిల్లా అధికారి సీహెచ్ అన్వేష్ బుధవా రం ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 50 ఏళ్ల ఎమర్జెన్సీ, భారతీయ ప్రజాస్వామ్యానికి పాఠాలు అనే అంశంపై 3 నిమిషాల ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల వ య స్సు కలిగిన అభ్యర్థులు ఈనెల 7న ఉదయం 10 గంటలకు స్థానిక సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు రావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు మైభారత్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. రోడ్డు నియమాలు పాటించాలి మల్హర్(కాటారం): వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. ఆరైవ్.. ఆలైవ్ రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎస్పీ ఆధ్వర్యంలో 150 మంది ఆటోడ్రైవర్లు, లారీ డ్రైవర్లకు కాటారం సెంటర్లో ఐ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్ట్ వినియోగం అలవాటు చేసుకోవాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పదిలమైన ప్రణాళిక!
మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్లో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులుకాళేశ్వరం: పదోతరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం మార్పులు చేసింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వార్షిక పరీక్షలు ఆదివారాలు, సెలవు రోజులను మినహాయించి వరుసగా నిర్వహించే వారు. ఒక్కో పరీక్షకు మధ్యలో గడువు ఉండేది కాదు. ప్రస్తుతం మారిన విధానం ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. ఒక్కో పరీక్షకు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్లో విద్యార్థులు చదివి పరీక్షలకు సిద్ధమై మంచి ఉత్తీర్ణత మార్కులు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 12 మండలాల్లో 122 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 1,701 మంది, బాలికలు 1,843 మంది కాగా మొత్తం 3,544 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రీఫైనల్ పరీక్షల ఆధారంగా.. ఇప్పటికే ప్రీఫైనల్ పరీక్షలు ముగియడంతో ప్రత్యేక కార్యాచరణ ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రీఫైనల్ పరీక్షల సమాధాన పత్రాలను దిద్ది వాటిని తల్లిదండ్రులకు పంపించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కడ వెనుకబడి ఉన్నారు.. ఎక్కడ తప్పులు రాస్తున్నారు.. ఉపాధ్యాయులు గుర్తించి సరైన సమాధానాలు రాసేలా చూడాలి. ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ మూడు గ్రేడ్లుగా విభజించి వారిలో సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. మారిన పరీక్షల విధానంతో ఉత్తీర్ణత శాతం పెరగడానికి అవకాశం ఉంది. పరీక్షల మధ్యన గ్యాప్ సమయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి. ఉపాధ్యాయులు నిర్వహించే ప్రత్యేక తరగతులకు తప్పక హాజరుకావాలి. పట్టుదలతో చదవి మంచి మార్కులు సాధించాలి. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రత్యేక తరగతులకు పంపించాలి. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారిమొదటి తెలుగు పరీక్ష తర్వాత హిందీ పరీక్షకు మధ్యలో మూడు రోజుల సమయం ఉంది. ఈ మూడు రోజులు విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. సబ్జెక్టు టీచర్ వారికి రోజుకు మూడు పీరియడ్లు నిర్వహించి సబ్జెక్టులో మెరుగైన మార్కులు సాధించేలా శిక్షణ ఇస్తారు. మొదటి పీరియడ్లో రివిజన్, రెండో పీరియడ్ ప్రాక్టీస్ టెస్ట్, మూడో పీరియడ్లో సమాధాన పత్రాలు దిద్ది తప్పులు సరిచేస్తారు. గంట సమయంలో 20 నిమిషాలు పాఠ్యాంశ బోధన, 40 నిమిషాలు సమాధానాలు రాసేందుకు కేటాయిస్తారు. ఇలా ప్రతీరోజు సబ్జెక్టు సాధన చేయిస్తారు. ప్రతీ పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల సమయం ఉంటుంది. మధ్యలో పండుగలు, ఆదివారాలు మినహాయిస్తే మూడు నుంచి నాలుగు రోజుల సమయం విద్యార్థుఽలకు లభిస్తుంది. -
ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి
భూపాలపల్లి: ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలు కార్యాచరణ అమలుపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, సంక్షేమ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్థవంతంగా అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై విపులంగా దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలపై మండలాల వారీగా నివేదికలు, అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాల వివరాలు, మరమ్మతు, విద్యుత్, మంచినీటి సమస్యలపై మండలాల వారీగా నివేదికలు సమర్పించాలన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి 60 రోజుల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల పూర్తి, మహిళా సంఘాల్లో నమోదు కాని సభ్యులను నమోదు చేయాలన్నారు. గ్రామపంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్ స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరగా పూర్తి చేయాలని, బ్యాంకర్లను సమన్వయం చేస్తూ రుణ మేళాలను నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రూ. 500కే గ్యాస్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ తదితర పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి గ్రామసభల్లో చదివి వినిపించాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
పెద్దల సభకు వేం నరేందర్రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం నేడు నామినేషన్ దాఖలుపేరు: వేం నరేందర్రెడ్డి తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ భార్య: విజయ కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారు -
కాళేశ్వరాలయం మూసివేత
చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, ఉప ఆలయాలను కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు ద్వార బంధనం చేశారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ మహేష్ తెలిపారు. చంద్రగ్రహణం ఎఫెక్ట్తో కాళేశ్వరంలో భక్తులు లేకపోవడంతో గోదావరి తీరం, ఆలయం, ప్రధాన వీధులు బోసిపోయాయి. చంద్రగ్రహణం విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి దర్శనానికి వచ్చిన భక్తులకు నిరాశకు గురై వెనుదిరిగారు. మల్హర్(కాటారం): అడవులు, వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాటారం ఫారెస్ట్ రేంజ్ అధికారి జాడి స్వాతి అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం రేంజర్ స్వాతి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది కాటారం సెంటర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడవుల్లో ఉండే జంతువులను రక్షించుకోవాలని సూచించారు. అడవులను మరింత పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడించారు. అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారితో పాటు అటవీ పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు వేయరాదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్లు జి.సురేందర్, శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ అర్చన, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: 33/11 కేవీ జంగేడు సబ్ స్టేషన్లో 11 కేవీ లైన్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నందున నేడు (బుధవారం) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని భూపాలపల్లి పట్టణ విద్యుత్శాఖ ఏఈ విశ్వాస్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని జంగేడు, ఫకీర్ గడ్డ, ఆకుదారివాడ, కాకతీయకాలని, వేశాలపల్లి, భాస్కర్గడ్డ, డబుల్ బెడ్రూం, పెద్దకుంటపల్లి, మల్లంపల్లి, కమలాపూర్ గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. పోస్టాఫీస్ ద్వారా రాములవారి తలంబ్రాలు భూపాలపల్లి అర్బన్: శ్రీ రామనవమి సందర్భంగా ఈనెల 27న భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర ‘కల్యాణ తలంబ్రాలు’ పోస్టాఫీస్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపిణీ చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు సమీప పోస్టాఫీస్లో రుసుం చెల్లించి తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలు (1 ముత్యం, కుంకుమ, మిశ్రీ, కాజు గింజలు) రూ.450, ముత్యాల తలంబ్రాలు (1 ముత్యం) రూ. 151 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు పంపించనున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి మహోత్సవాలకు హాజరుకాలేని భక్తులకు ఈ సేవ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. -
దశాబ్దకాలం లేట్!
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ప్రయాణించాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. కాగా, సుమారు రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను ఇప్పటికై నా వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు 95 శాతం వరకు పూర్తయ్యిందని చెబుతున్నా.. పెండింగ్లో ఉన్న 5 శాతం పనులతో కాజీపేట–విజయవాడ మూడో లైన్కు మోక్షం కలగడం లేదు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. వాస్తవానికి హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. పదేళ్లయినా ఉమ్మడి వరంగల్ నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. రెండు ప్రధాన రాష్ట్రా(తెలంగాణ, ఏపీ)లను కలిపే ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడో లైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది, గూడ్స్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు 44.624 కిలోమీటర్లు అసంపూర్తిగా పనులు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
ఆకాశంలో అద్భుతం
కనువిందు చేసిన రెడ్ మూన్ ● 3.27 గంటల సేపు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు వీడింది. మొత్తం 3.27 గంటల సేపు ఎరుపు వర్ణంలో (రెడ్ మూన్) చందమామ పలు విధాలుగా కనువిందు చేశాడు. వంద సంవత్సరాల తర్వాత రంగుల పండుగ హోలీ రోజున వచ్చిన చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ 6:56 -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా ఉదయం హోమం, బలిహరణం, మహాపూర్ణాహుతి కార్యక్రమాల అనంతరం భక్తులకు నైవేద్యం అందజేశారు. అనంతరం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేశారు. జాతరలో పోలీస్ బందోబస్తు.. కోటంచలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. మంగళవారం జాతరలో పోలీస్ బందోబస్తు గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరలో 10 మంది ఎస్సైలు, 170 మంది పోలీస్ సిబ్బంది పని చేయనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, జంక్షన్లు, గ్రామపరిధిలో మొత్తం 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఘర్షణలు పడకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షించేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ క మిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, గణపురం సీఐ కరుణాకర్, ఎస్సైలు రాజేష్, దివ్య, షాఖాన్, అమూల్య, శంకరయ్య, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేటినుంచి జాతర ప్రారంభం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం బోనాలు తిరుగుటతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం పెద్ద రథోత్సవం, స్వామి వారి, అమ్మ వార్ల గజవాహనాల ఊరేగింపు, ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఇతర వాహనాలు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు బుచ్చమాచార్యులు తెలిపారు.కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు, రేపు జరిగే జాతరకు పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజరు ఇందు తెలిపారు. కోటంచ జాతరకు వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
పోడుభూముల్లో కందకాలు
ఎస్ఎస్తాడ్వాయి: పోడు భూముల్లో కందకాలు తీస్తున్న అటవీశాఖ అధికారులను మంగళవారం కాల్వపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి రైతులు భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధి సంగారం బీట్ పరిధిలో 25 ఏళ్లుగా సుమారుగా 162 ఎకరాల్లో 47 కుటుంబాలు పోడు భూములను సాగుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అటవీశాఖ అధికారులు రైతుల పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తవ్వుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని తవ్వకాల పనులను అడ్డుకోవడంతో అటవీశాఖ అధికారులు, రైతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములే తమకు జీవనాధారమని వాటిని వదిలే ప్రసక్తే లేదని బాధిత రైతులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు తిరిగి వెళ్లిపోయారు. అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు -
‘కోఆప్షన్’ ఎవరికో..?
భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని భూపాలపల్లి పట్టణంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవలే మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కై వసం చేసుకొని తన పట్టును నిరూపించుకోగా, ఇప్పుడు అందరి దృష్టి కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై పడింది. పాలకమండలిలో కీలకంగా వ్యవహరించే ఈ నాలుగు స్థానాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పది మందికి పైగా ఆశావహులు.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డు స్థానాలు ఉండగా నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమిస్తారు. అందులో ఇద్దరు మైనార్టీలు (ఒక మహిళ, ఒక పురుషుడు), మిగిలిన రెండింటిలో ఒకరు మాజీ ప్రజాప్రతినిధి, మరొకరు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వారిని నియమిస్తారు. నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీలో ఓటరుగా ఉండి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. ఈ రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో, ఆయా వర్గాలకు చెందిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో, ఈ పదవులను దక్కించుకుంటే స్థానికంగా పట్టు సాధించవచ్చని ఆశావహులు భావిస్తున్నారు. మైనార్టీ విభాగం నుంచి హఫీజ్, మాజీ ప్రజాప్రతినిధుల విభాగం నుంచి తాటి అశోక్, శిరుప అనిల్, ముంజాల రవీందర్, సజ్జనపు స్వామితో పాటు మరి కొంతమంది కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్ణయమే అత్యంత కీలకం. దీంతో ఆశావహులంతా ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏం ఆశించకుండా కష్టకాలంలో సైతం వెన్నంటి ఉన్నాం.. ఇప్పుడైనా తమ కష్టానికి గుర్తింపునిచ్చి అవకాశం ఇవ్వాలి.. అంటూ ఆశావహులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకుంటున్నారు. ఓడిపోయాం.. ఒక్క చాన్స్ ప్లీజ్.. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు, లేదా రిజర్వేషన్ల మార్పు వల్ల పోటీచేసే అవకాశం కోల్పోయిన వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. వీరంతా కౌన్సిల్లో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలని తహతహలాడుతున్నారు. ఈ కోఆప్షన్ పదవులను మాజీ కౌన్సిలర్లు ఒక ‘లైఫ్ లైన్’లా భావిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరమైన కొందరు సీనియర్లు కూడా ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ సత్తన్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి -
యూడీఐడీ కార్డుల ప్రక్రియ వేగవంతం
భూపాలపల్లి అర్బన్: రాబోయే రెండు నెలల్లో నమోదు చేసుకున్న ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ కార్డు, సదరం సర్టిఫికెట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని చర్యలు చేపట్టాలని వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన సశక్తికరణ విభాగం), సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ కార్యదర్శి వి.విద్యావతి ఆదేశించారు. ఆస్పిరేషన్ జిల్లాల్లో యూడీఐడీ(ఈఐఈ) కార్డుల జారీపై సోమవారం భారత ప్రభుత్వ కార్యదర్శి విద్యావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పిరేషన్ జిల్లాల్లో దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు జారీ చేసే ప్రక్రియ, నమోదు పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించే విధానంపై సమగ్రంగా వివరించారు. జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక చర్యలను కలెక్టర్ రాహుల్శర్మ వివరించారు. ఈ సమావేశంలో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, డీఆర్డీఓ, డీపీఎం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ ప్రతీ ఇంటా ఆనందం, ఐక్యత, స్నేహభావాలను నింపాలని ఆకాంక్షించారు. హోలీ మన సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పండుగ అన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటామని అన్నారు. -
హనుమంత వాహనసేవలో..
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి హనుమంత వాహనసేవలో స్వామి వారిని మాడ వీధుల గుండా ఊరేగించారు. ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి దోపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ఆలయ ఈఓ మహేష్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది రవిందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రేపటి నుంచి జాతర ప్రారంభం కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు (మంగళవారం) హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఉన్నందున ఉదయం నిత్యవిధి, హోమ, బలిహరణములు, మహాపూర్ణాహుతి, నైవేద్యం తదుపరి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. బుధవారం బోనాలు తిరుగుటతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం పెద్ద రథోత్సవం, శ్రీ స్వామి వారి, అమ్మ వార్ల గజవాహనముల ఊరేగింపు, ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఇతర వాహనాలు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
భూపాలపల్లి అర్బన్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 65 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా దరఖాస్తులను అధికారులు జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్డీఓ హరి కృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంకితభావంతో పనిచేసిన నాయకుడు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు అంకితభావంతో పనిచేశారని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. 89వ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత, నైతిక విలువలు ప్రతీ ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
జీవనోపాధి కల్పించాలి
మార్కెట్ విలువ ప్రకారం మా భూములకు సరైన పరిహారం అందించాలి. మా జీవనోపాధి అయిన భూములు తీసుకోవడంతో నష్టం జరుగుతుంది. మాకు జీవనోపాధి కల్పించి, పరిహారం అందేలా చూడాలి. అధికారులు రైతులకు న్యాయం చేయాలి. – ముత్యాల రమేశ్, రైతు, కాళేశ్వరం భూ నిర్వాసిత రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వనుంది. త్వరలో గ్రామసభల ద్వారా నివేదికలు తయారు చేస్తాం. లీజు విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. త్వరలో వచ్చేలా చూస్తాం. – రామారావు, తహసీల్దార్, మహదేవపూర్ -
ప్రజలకు చేరువగా పోలీస్ శాఖ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు చేరువగా పోలీస్శాఖ పని చేస్తుందని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 8 ఫిర్యాదులు అందగా, వాటిని శ్రద్ధగా విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ సూచనలు జారీ చేశారు. సమస్యలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో తక్షణ పరిష్కారం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీపాదరావుకు ఘననివాళి దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ సంకీర్త్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన ప్రజాసేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, ఆర్ఐలు రత్నం, పూర్ణచందర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ సంకీర్త్ -
వైభవంగా పదహారు రోజుల పండుగ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం పదహారు రోజుల పండుగను శ్రీశుభానంద ముక్తీశ్వరుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రికి ఉత్సవమూర్తుల కల్యాణం జరిగి సోమవారానికి 16 రోజులు కావడంతో ఉదయం 10.30 గంటలకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో కల్యాణం కార్యక్రమాన్ని పూజాకార్యక్రమాలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఆర్చరీలో గోల్డ్మెడల్ మల్హర్(కాటారం): ఆర్చరీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో కాటారం ఎర్రగుంటల్లికి చెందిన రామిళ్ల అనయ గోల్డ్మెడల్ సాధించింది. ఈ నెల 8న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో పొల్గొనేందుకు అర్హత సాధించిందని కరీంనగర్ ఆర్చరీ జనరల్ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్, కోచ్ నగేష్ తెలిపారు. కేన్సర్తో అంగన్వాడీ టీచర్ మృతి టేకుమట్ల: మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ బోయిని ఝాన్సీ(45) సోమవారం మృతి చెందింది. కొంతకాలంగా కేన్సర్ బారిన పడి చికిత్స పొందగా.. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె భర్త సైతం ఐదు సంవత్సరాల క్రితం కేన్సర్ బారిన పడి మృతిచెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా తల్లిదండ్రుల మృతితో అనాథలైన కూతుర్లను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. పెద్దకూతురు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రాస్తుండగా.. చిన్న కూతురు 9వ తరగతి చదువుతోంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ రికార్డుల పరిశీలనములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విజిలెన్స్ డ్రగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ స్టోర్, మెడికల్ కళాశాల సెంట్రల్ స్టోర్ను విజిలెన్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జన్ను కిరణ్కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన 50 ఇంజక్షన్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టారు. ప్రభుత్వం నుంచి పునిస్కా కంపెనీకి చెందిన 0217 బ్యాచ్ నంబర్ కలిగిన 1,700 మెట్రోనైడోజనల్ ఇంజక్షన్లు సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు సరఫరా కాగా ములుగు ఆస్పత్రికి 1,286 ఇంజక్షన్లు సరఫరా అయ్యాయని తెలిపారు. మిగిలిన 414 నిల్వ ఉన్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజ్ చేయాల్సిన మందులను ఇష్టానుసారంగా నిల్వ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
సండే సందడి
రామలింగేశ్వరస్వామికి పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో ఆదివారం పర్యాటకులు సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో లక్నవరం సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి ఆనందంగా గడిపారు. తేలాడే వంతెనపై నడుస్తూ.. సరస్సులో బోటు షికారు చేస్తూ సందడిగా గడిపారు. -
నేడు పదహారు పండుగ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం జరిగి (నేడు)సోమవారానికి 16 రోజులు అవుతున్న సందర్భంగా పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన ఉత్సవ మూర్తుల కల్యాణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. నిందితులతో కఠినంగా ఉండాలి చిట్యాల: శాంతిభద్రతల పరిరక్షణపై బాధితులతో స్నేహంగా, నిందితులతో కఠినంగా ఉండాలని చిట్యాల సీఐ మల్లేష్ అన్నారు. పోలీస్స్టేషన్లో పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణపై ఆదివారం మండల కేంద్రంలో సీఐ మల్లేష్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. వారి సమస్యలను సానుభూతితో విని భరోసా కల్పించాలని తెలిపారు. తప్పు చేసిన నిందితుల పట్ల మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది డ్యూటీకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా లాఠీలు వెంట తీసుకెళ్లాలని అన్నారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది నిజాయితీగా పని చేయాలని కోరారు. ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావన్కుమార్, ఎస్సై–3 ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరులకు నివాళులు భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంస్పీ అనుబంధ సంఘాల నాయకులు గాజుల భిక్షపతి మాదిగ, దోర్నాల రాజేందర్, అంతడుపుల సురేష్, సుమన్, నేరుపటి అశోక్, ఎర్ర భద్రయ్య మాదిగ పాల్గొన్నారు. యాదాద్రిలో ఎమ్మెల్యే గండ్ర దంపతుల పూజలు భూపాలపల్లి రూరల్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు–పద్మ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఆలయ మండపంలో దేవస్థాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. రామప్ప శిల్పకళ అద్భుతం వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఛత్తీస్ఘడ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు వెంకటేశ్వర్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొనియాడారు. అమెరికాకు చెందిన క్రిస్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టతను గైడ్ వివరించగా టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. -
మూణ్నాళ్ల ముచ్చట
భూపాలపల్లి అర్బన్: జీవితాంతం కలిసిమెలసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ఒక్కటైన కొందరు దంపతులు.. పెళ్లి ముచ్చట తీరకముందే గొడవలు పడుతున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సి వారు అపోహలు, అనుమనాలతో విడిపోతున్నారు. ‘నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతా’ అంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపేవారు.. ఆ తర్వాత వాటిన్నంటిని మరిచిపోయి ఒకరిపై ఒకరు ఛీదరించుకోవడం, కోప్పడడం.. చివరకు విడాకుల వరకు వెళ్తున్నారు. కొందరు చిన్నచిన్న విభేదాలు, వివాదాలతో కోర్టుకు ఎక్కుతుంటే.. మరికొందరు కక్షకార్పణ్యాలతో రగిలిపోతున్నారు. జీవితాంతం కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు తమ బంధాలను బలహీనపర్చుకుంటున్నారు. గృహహింస విభాగం సిబ్బంది, పోలీసులు కౌన్సెలింగ్తో కొందరు సర్దుకుపోతున్నారు. మరికొందరు భవిష్యత్ను అంధకారం చేసుకోవడంతో పాటు వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను దూరం చేస్తున్నారు. తరచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పెళ్లి అంటేనే పిల్లల తల్లిదండ్రులు ఆలోచనలో పడుతున్నారు. వివిధ కారణాలతో.. పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోవడం లేదని, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని మహిళలు గృహ హింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు. మరికొందరు నేరుగా కోర్టులో కేసు పెడుతున్నారు. జిల్లాలో 2022 నుంచి 2025 సంవత్సరం వరకు పోలీస్స్టేషన్, కోర్టు, సఖి కేంద్రంలోని గృహ హింస విభాగాన్ని 600 మందికిపైగా ఆశ్రయించారు. వీరిలో 40 మంది గృహహింస విభాగం సిబ్బంది ఇచ్చిన కౌన్సెలింగ్లో రాజీపడ్డారు. కోర్టులో 401 మంది కేసులు ఫైల్ చేశారు. వీరిలో 213 కోర్టు ద్వారా విడాకులు సైతం తీసుకున్నారు. 188 మంది కేసులు పెండింగ్లో ఉన్నాయి. కౌన్సెలింగ్ ఇచ్చినా.. వివిధ కారణాలతో విడిపోయేందుకు సిద్ధపడుతున్న దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడంతో సంప్రదాయాలు, సత్సంబంధాలు తెలి యడం లేదు. ఒకరి నిర్ణయాలకు ఒకరు గౌరవించుకోకపోవడం, మొండివైఖరితో భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారని పోలీసులు, గృహ హింస కౌన్సెలింగ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు. వేరు కాపురాలపై ఆసక్తి ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకు అధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తమ కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. కారణం ఏదైనా చిన్న కుటుంబంగా జీవించడం అలవాటు పడుతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలకు ససేమిరా అంటున్నారు. ఇది కూడా పండంటి కాపురాలకు అవరోదంగా మారింది. ఎవరికి వారే మొండిపట్టు..గతంలో సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్దలను తొలగించేందుకు కుటుంబ పెద్దలు ప్రయత్నించేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలు ఇద్దరినీ ఒక్కటి చేసేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దలమాటను గౌరవించని, సమాజ విలువలు పాటించని, వివాహబంధాలను లెక్కచేయని యువతీ యువకులు వివాదాల్లో చిక్కుకుని, కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారు. నాలుగేళ్లలో 213 జంటలకు విడాకులు పెండింగ్లో 200లకుపైగా కేసులు కౌన్సెలింగ్తో కొన్ని జంటలు మాత్రమే కలయిక పెళ్లయినా కొన్నిరోజులకే విడిపోతున్న వైనం -
నారసింహుడికి సింహవాహనసేవ
● కోటంచలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలురేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం నాలుగో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి సింహవాహన సేవలో మాడవీధుల గుండా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాల చప్పుళ్లతో ఊరేగించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి గరుడోత్సవం, సదస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ధర్మకర్తలు, గ్రామపెద్దలు కనుకుంట్ల దేవేందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు హనుమంతవాహన సేవ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. రాత్రి చిన్న రథసేవ, దోపోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. -
బడిలో మట్టి కుండల వర్క్షాప్
కాళేశ్వరం: జిల్లాస్థాయి జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలను మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మట్టి కుండల తయారీ వర్క్ షాప్తో ప్రారంభించారు. కుమ్మరివారితో కుండల తయారీ విధానాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి స్వామి మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైనటువంటి మట్టిపాత్రలు వాడాలని తెలిపారు. ప్రాచీన కాలంలో ఇంట్లో ప్రతీ వస్తువు మట్టితో తయారుచేసిన వంట పాత్రలు, నీటిని నిలువ చేసే పాత్రలు, ధాన్యం నిల్వచేసే కాగులు పేర్పులు మొదలగు మట్టిపాత్రలు ఉపయోగించేవారని తెలిపారు. దీంతో ప్రజలందరికీ మంచి ఆరోగ్యంతో పాటు కుటీర పరిశ్రమలు బలపడేవని తెలిపారు. నేటి సమాజంలో మట్టి పాత్రలన్నీ కనుమరుగైపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం, బయోసైన్స్ జిల్లా ఫోరమ్ అధ్యక్షుడు బి.ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ హసీనభాను, ఉపసర్పంచ్ శ్రీజ, బాలికల పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం సరిత, పి.కల్యాణి, ఉర్దూ పాఠశాల హెచ్ఎం యాస్మిన్, వివిధ పాఠశాలల సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు -
న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష
భూపాలపల్లి అర్బన్: అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సముదాయం ఎదుట నిర్వహించిన దీక్షకు సంఘీభావంగా న్యాయవాదులు స్వచ్ఛందంగా కోర్టు విధులను బహిష్కరించారు. ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తూ, రక్షణ బిల్లును తక్షణమే అమలుచేయాలని కోరారు. న్యాయవాదుల ఆత్మగౌరవం, సమష్టి భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను వెంటనే చట్టసభల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాసచారి, జనరల్ సెక్రటరీ శ్రవణ్రావు, న్యాయవాదులు మహేందర్, రవీందర్, ప్రియాంక, అక్షయ, రాజ్కుమార్, శివకుమార్ పాల్గొన్నారు. -
గణపురం టు హైదరాబాద్
● బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర గణపురం: గణపురం మండలకేంద్రం నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు సర్వీసును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మండలకేంద్రం నుంచి హైదరాబాద్కు నైట్హాల్ట్ బస్సు సేవలు ఉండేవని.. గత ప్రభుత్వంలో దానిని తీసి వేశారన్నారు. ప్రజల కోరిక మేరకు తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. గణపురం వయా ములుగు మీదుగా హనుమకొండ హైదరాబాద్ బస్సు వెళ్తుందన్నారు. ఈ సర్వీస్తో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు
భూపాలపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది నిరంతరం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, బరువు తదితర సాధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వచ్చే నెలలో ప్రత్యేక వైద్యులతో మెగా క్యాంపు నిర్వహించి వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, టీజీఓ కార్యదర్శి సునిల్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహ్మద్ సంధాని పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక.. టెన్త్ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిషు వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో రోజువారీ పరీక్షలు, వారాంత మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
దసలి పట్టు రైతులు సాంకేతికంగా ఎదగాలి
కాళేశ్వరం: దసలి పట్టు రైతులు సాంకేతికంగా ఎదగాలని సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయ, జార్ఖండ్ రాష్ట్రం రాంచి శాస్త్రవేత్త శంకర్గిరి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలకేంద్రంలోని సెరికల్చర్ కార్యాలయం వద్ద దసలి పట్టు రైతుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసలి పట్టులో అధిక దిగుబడికి కా వాల్సిన చర్యలపై సవివరంగా వివరించారు. వారివెంట చెన్నూర్కు చెందిన శాస్త్రవేత్తలు కిరణ్కుమార్, రజితతో పాటు మహదేవపూర్ సెరికల్చర్ అఽధికారి సమ్మయ్య పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి మల్హర్(కాటారం): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రవర్ణాల కుల దురహంకారానికి రజక కుటుంబానికి చెందిన రెండేళ్ల పసికంద బలికావడం అత్యంత హేయమైనచర్య అని.. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. మండలం కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడారు. తక్షణమే నిందితులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుని జుడిషియల్ విచారణ జరిపించాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు. కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఐత బాపు, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యులు దారకొండ సూర్య శంకర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించాలి రేగొండ: మండలంలోని కొడవటంచ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఈఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని తెలిపారు. మగవారు పంచె, కండువా, సీ్త్రలు చీర, లేదా పంజాబీ డ్రెస్ ధరించి వస్తేనే అంతరాలయ దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. అంతరాలయంలో దర్శనంకోసం వచ్చే వీఐపీ భక్తులకు రూ.1000, ప్రత్యేక దర్శనం కోసం రూ.200 టికెట్లు తీసుకోవాలని తెలిపారు. జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ సాంబమూర్తి, సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాంబమూర్తి మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసం, శారీరక ధృడత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. భూపాలపల్లి, చిట్యాల, గణపురం, మహదేవపూర్ బ్లాక్లలో విజేతలైన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి పైస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెల్దండ సురేష్, ఎస్జీఎఫ్ సెక్రటరీ జైపాల్, ఎస్జీఎఫ్ ప్రెసిడెంట్ రమేష్, పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కల్యాణం కమనీయం
లక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్దిన అశ్వవాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామస్తులు, భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఎదురుకోళ్లు కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారు, ఆండ్రాలు, లక్ష్మీ అమ్మవార్లను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలతో అలంకరించి పల్లకీసేవలో ఆలయ ఆవరణలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దంపతులు, కలెక్టర్ రాహుల్శర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. డప్పుచప్పుళ్లు, వాయిద్యాల నడుమ వేదమంత్రాల సాక్షిగా ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చామచార్యులు ఆధ్వర్యంలో నరసింహుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్, ఆలయ అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, జిల్లా నాయకులు పున్నం రవి, పట్టెం శంకర్, వీరబ్రహ్మం, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ● అశ్వవాహనంపై ఊరేగిన నరసింహుడు ● కోటంచకు పోటెత్తిన భక్తజనం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతీ ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలతో స్వామి వారికి ధ్వజారోహణం, గరుడముద్ద పూజలు చేశారు. గరుడ ముద్దను అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. -
అన్నదాతలకు అందని సాయం
భూపాలపల్లి: రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు ఖాతాల్లో జమ చేస్తుందా అని అన్నదాతలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఆర్థికంగా రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చేసేది లేక అడ్తీదారులు, వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు.. గత వానాకాలం సీజన్లో రైతులు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. అకాల వర్షాలు కురవడంతో పత్తి, మిర్చి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి పంటలను పురుగు ఆశించడంతో పలువురు రైతులు చేసేది లేక ఆ పంటను తొలగించి మొక్కజొన్న సాగు చేశారు. వానాకాలంలో పెట్టిన పెట్టుబడులు సైతం రాకపోవడంతో యా సంగిలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా సకాలంలో ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద నూటికి రూ.3 చొప్పున మిత్తికి, అర్తీదారుల వద్ద అప్పులు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతు భరోసా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రైతు భరోసా విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ప్రభుత్వం నుంచి విడుదల కాగానే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రైతులు చేస్తున్న పంటల సాగు, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. – బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మరో నెలన్నర రోజుల్లో ముగియనున్న యాసంగి సీజన్ పెట్టుబడి కోసం అడ్తీదారుల వద్ద అప్పులు జిల్లాలో 1,08,418 మంది లబ్ధిదారులు -
ఐఏఎస్ల ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రట్రరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబా బాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ప్రభుత్వం నియమించింది. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగుళాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఐటీడీఏ పీఓ టు కరీంనగర్ కలెక్టర్.. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 2024 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దీంతో ఆమెను ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్బాజ్పాయ్.. ‘గ్రేటర్’ కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీగ్రేటర్ వరంగల్ ఇన్ ? అవుట్ చాహత్ బాజ్పాయ్ హనుమకొండ ఇన్ చాహత్ బాజ్పాయ్ అవుట్ స్నేహ శబరీష్ జనగామ ఇన్ సందీప్కుమార్ ఝా అవుట్ షేక్ రిజ్వాన్ బాషా మహబూబాబాద్ ఇన్ స్నేహ శబరీష్ అవుట్ అద్వైత్సింగ్ ఏటూరునాగారం ఐటీడీఏ ఇన్ ? అవుట్ చిత్రామిశ్రాస్నేహ శబరీష్ వివరాలు..చాహత్ బాజ్పాయ్ వివరాలు.. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పోషకాహారం విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రత పాటించడంతో పాటు, తాజా ఆహార పదార్థాలనే వినియోగించాలన్నారు. గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించరాదని ఆదేశించారు. భోజనం నాణ్యంగా ఉందని అభినందిస్తూ, ప్రతిరోజూ ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించి మంచి అలవాట్లు అలవరచుకోవాలని కోరారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
జీపీ ట్రాక్టర్లకు రిపేర్లేవి!
కాళేశ్వరం: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కీలకంగా ఉండాల్సిన చెత్త సేకరణ ట్రాక్టర్లు పలు పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు లేక మూలకు పడ్డాయి. రెండేళ్ల నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు పంచాయతీల భారం కార్యదర్శులు భరించారు. దీంతో నిధుల లేమితో నిర్వహణ అంతంతే నిర్వహించారనే విమర్శలు లేకపోలేదు. కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తున్నా పాత ట్రాక్టర్లకు మరమ్మతులు, నిర్వహణకు నిధులులేక పలు గ్రామాల్లో కొంతమంది సర్పంచులు స్వంత ఖర్చులు పెట్టి మరమ్మతులు చేసినా, పలు పంచాయతీల్లో చెత్త సేకరణ చేయడం లేదు. దీంతో కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లు పనికిరావడం లేదు. కొన్ని గ్రామపంచాయతీల్లో నెలల తరబడి ట్రాక్టర్లు షెడ్ల వద్ద నిలిచిపోవడంతో చెత్త సేకరణకు అడ్డంకిగా మారింది. నిధులొచ్చినా.. జీపీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. వచ్చిన కొంతమేర నిధులతో పాత సర్పంచులు చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు చేయాలని పంచాయతీ చుట్టూర ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఖర్చులు పెట్టిన కార్యదర్శులు తమ బాకీల వసూలు పనిలో పడ్డారు. ప్రస్తుతం కొత్త సర్పంచులు చేపట్టిన పనుల భారంతో చెల్లింపులు చేయలేక వారికి గొడవలు మొదలయ్యాయని తెలిసింది. జిల్లాలో ఇలా.. జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. భూపాలపల్లిలో 4, మొగుళ్లపల్లి 5, రేగొండ 2, చిట్యాల 3, టేకుమట్ల 4, కాటారం 4, మహాముత్తారం 4, మహదేవపూర్ 4, మల్హర్ 3, పలిమెల 2 గ్రామపంచాయతీ ట్రాక్టర్లు రిపేర్లతో మూలకుపడ్డాయి. లైసెన్స్, ఇన్సూరెన్స్ లేక! పలు జీపీల్లో ట్రాక్టర్లు నడిపేందుకు లైసెన్స్, అనుభవం లేని డైవర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ట్రాక్టర్లపై అవగాహన లేకపోవడంతో నిత్యం మరమ్మతులకు కారణం అవుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు జీపీ ట్రాక్టర్లకు సంబంధించి సగానికిపైగా ట్రాక్టర్లకు ఇన్సురెన్స్ కూడా లేదని తెలిసింది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో జీపీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో కోర్టు పంచాయతీ నుంచి సదరు మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది దృష్టిలో ఉంచుకొని జీపీ ట్రాక్టర్లకు లైసెన్స్, ఇన్సురెన్స్ కూడా సరిగ్గా చూసుకోవాల్సి ఉంది. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీపీలు లైసెన్స్లేని డ్రైవర్లు.. ఇన్సూరెన్స్ లేని ట్రాక్టర్లు దృష్టిసారించని అధికారులుచెత్త సేకరణ లేకపోవడంతో పలు పంచాయతీల్లో వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తూ, దోమల సమస్య తీవ్రతరం అవుతుంది. పాఠశాలలు, అంగన్వాడీలు, కాలనీలు, హోటళ్లు, లాడ్జిలు, కిరాణ దుకాణాలు, పాన్ డబ్బాలు, పాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ గ్రామాల లక్ష్యాలపై పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. చిన్నపాటి మరమ్మతులతో తిరిగి వినియోగంలోకి వచ్చే ట్రాక్టర్లను పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. తక్షణమే ట్రాక్టర్లకు మరమ్మతులు చేసి చెత్త సేకరణను పునఃప్రారంభించి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అన్ని జీపీల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్లు ఉంటే పంచాయతీల్లోనే చేయిస్తారు. జిల్లాలో జీపీ ట్రాక్టర్లకు రిపేర్లు ఎక్కడ ఉన్నవి సమాచారం లేదు. ఉన్నతాధికారులు కూడా ట్రాక్టర్లపై సమాచారం అడగలేదు. – శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి రూరల్: ప్రాధాన్యత రంగాలకు రూ.2971.20 కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా.. డిసెంబర్ మాసం నాటికి రూ.1937.21 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కన్సల్టేటివ్, జిల్లాస్థాయి రివ్యూ కమిటీ, జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కమిటీ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ తయారుచేయాలని సూచించారు. రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందించాలని తెలిపారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు తిరిగి రెన్యూవల్ చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆపుతున్నారని అన్నారు. రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పడే 100 మంది రైతులను చూపిస్తానని అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రిలేషన్ మెయింటైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్సాయి, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
కొవ్వొత్తులతో ర్యాలీ
చిట్యాల: నాగర్ కర్నూల్ జిల్లా బమ్మెరలో అగ్రవర్ణాల చేతిలో బలైన చిన్నారికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జాక్, రజక సంఘాలు మానవహారంతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు బుర్ర వెంకటేష్గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల అహంకారానికి అభం శుభం తెలియని చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తౌటం నవీన్, పుల్ల అశోక్, శీలపాక నాగరాజు, పుల్ల మల్లయ్య, పాండ్రాల వీరస్వామి, రవీందర్, కుమారస్వామి, కిరణ్, తిరుపతి, శశికుమార్, కిషన్ పాల్గొన్నారు. రోడ్డుపై నిర్లక్ష్యం.. ప్రమాదానికి నెలవు! కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇలా మోడువారి ప్రమాదానికి నెలవుగా ఉన్నప్పటికీ ఆర్అండ్బీ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వేసవి కాలంలో గాలిదుమారాలు వస్తే వాహనదారులపై పడే ప్రమాదం ఉంది. ప్రమాదం జరగకముందే మోడువారిన చెట్లను తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను డీఐఈఓ వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ద్వితీయ సంవత్సరంలో 76 మంది విద్యార్థులకు గాను 75 మంది, ఒకేషనల్ కోర్సులో 27 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని చెప్పారు. మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి, మల్లూరు పుష్కరఘాట్ నిర్మాణం అంచనా నివేదికను మంత్రి సీతక్కకు గురువారం అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ తెలిపారు. ఇటీవల మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి హేమాచలక్షేత్రం అభివృద్ధి, మల్లూరులో పుష్కరఘాట్ ఏర్పాటుపై నివేదిక అందజేయగా సానుకూలంగా స్పందించిన సీతక్క కలెక్టర్తో మాట్లాడి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో అంచనా నివేదిక తయారు చేయాలని ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనులపై రూపొందించిన నివేదికను గురువారం మేడారంలో మంత్రి సీతక్కను కలిసి అందజేసినట్లు వెల్లడించారు. -
అట్టహాసంగా బ్రహ్మోత్సవాలు
రేగొండ: భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అభిషేకంతో మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ సేవలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు అధికారులు ఆలయాన్ని దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ఆలయ సిబ్బంది శ్రావణ్, రవీందర్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. నిత్య అన్నసత్రం ప్రారంభం వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్య అన్న సత్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కాసం నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, సభ్యులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు కొడవటంచ ఆలయంలో నేడు ధ్వజారోహణం (గరుడముద్ద), రాత్రి అశ్వవాహనసేవ, ఎదురుకోళ్లు అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. -
డ్రోన్తో భూముల సర్వే
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరినది పుష్కరాలకు వీఐపీఘాటు నుంచి మెయిన్ఘాటు వరకు ఘాట్లు, రోడ్డు విస్తరణపై గోదావరి పొడవునా డ్రోన్ కెమెరాతో భూముల సర్వే చేపట్టారు. బుధవారం రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్శాఖల ఆధ్వర్యంలో భూములను డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. కాగా, వీఐపీఘాటు నుంచి మెయిన్ఘాటు వరకు 860 మీటర్ల పొడవుతో 10.5 ఎకరాల భూమిని రైతులు 20 మీటర్ల వరకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట అధికారులు 50 మీటర్ల వరకు తీసుకుంటున్నామని కొలతలు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడంతో రైతులు సర్వేను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి 20 మీటర్ల వరకు ఇచ్చేందుకు రైతులను ఒప్పించారు. దీంతో ఘాట్లు, రోడ్డు నిర్మాణం అడ్డంకులు తొలిగిపోయాయి. నిధులు మంజూరు కావడంతో పనులు మొదలు కానున్నాయి. వంతెన వరకు డ్రోన్ సర్వే... వీఐపీఘాటు నుంచి అంతరాష్ట్ర వంతెన వరకు డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టారు. గోదావరి పుష్కరాల వరకు పుష్కరఘాటు, రోడ్డు విస్తరణ చేపట్టాడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం వీఐపీఘాటు టు మెయిన్ ఘాటు వరకు సర్వే చేసినప్పటికి, పుష్కరాల వరకు మళ్లీ విస్తరణ చేయాల్సి వస్తుందని ముందస్తుగానే అధికారులు సర్వేను చేపట్టారని తెలిసింది. ఇదే కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలపై దృష్టిసారించారని సమాచారం. -
‘క్యూమార్ట్’లో మిల్లెట్ యూనిట్ ఉత్పత్తులు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని చెల్పూరు మహిళ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారుచేసిన పోషకాహార తినుబండారాలను హైదరాబాద్లోని క్యూ మార్ట్లో విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన క్యూమార్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా తయారవుతున్న నాణ్యమైన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. చెల్పూరు మహిళ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారవుతున్న మిల్లెట్ పౌడర్, మిల్లెట్ రైస్, మిల్లెట్ ఉప్మా రవ్వ, రాగి లడ్డు, నువ్వుల లడ్డు వంటి పోషకాహార పదార్థాలు క్యూ మార్ట్లో విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్న ఉత్పత్తులకు నగర మార్కెట్ అందుబాటులోకి వస్తుందని, తద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరగడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ, క్యూ మార్ట్ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.హైదరాబాద్లో విక్రయించేందుకు ఒప్పందం -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
మల్హర్(కాటారం): కాటారం మండలం బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాల్వ నిర్మాణ పనుల కోసం అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కాల్వ నిర్మాణానికి సంబంధించిన సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకుని తమ ఆందోళన, నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి తమ కుటుంబాల జీవనాధారమని, ఆ భూముల మీదుగా కాల్వ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనం, పరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు సర్వే పనులు జరగన్విమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు నిలిచిపోయాయి. కాగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
పలిమెల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని పంకెనలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీలోని డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్, పీహెచ్సీ బిల్డింగ్లను సందర్శించి పనుల పురోగతిని డీఈ సాయిలును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి పవన్, ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఆర్ఐ, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయె
రేగొండ: భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం స్వస్తి వాచనము, శేషవాహనము సేవ (పుట్టబంగారం సేవ), అంకురారోహణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. తరలిరానున్న భక్తజనం కోటంచ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తనున్నారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు నిలువనున్నాయి. జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఆలయ మాఢవీధుల గుండా మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాతనే విడిది చేయడం ఇక్కడి ఆనవాయితీ. భక్తుల రవాణా సౌకర్యం కోసం పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి కొడవటంచ ఆలయానికి ప్రభుత్వం రూ.12.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అతిథి గృహాలు నిర్మించడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస చేసే సౌకర్యం ఉండటంతో అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. భక్తుల తాగునీటి వసతి కోసం ప్రభుత్వం రూ.86.90 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఆలయ ప్రాంగణంలో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు, వసతి గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు పైపులైన్ వేశారు. ఆలయ ఆవరణలో రూ.1.2 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. జాతరలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి జాతర కోటంచకు పోటెత్తనున్న భక్తజనం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు -
రాలుతున్న ఆశలు
భూపాలపల్లి రూరల్: మామిడి రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. గత పదిరోజులుగా వాతావరణ మార్పులతో బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి మామిడితోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పూత, పిందెలు నేలరాలుతున్నాయి. కళ్లెదుటే రాలిపోతున్న పూత, పిందెలను చూస్తూ మామిడి రైతులు నిరాశ చెందుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టాలపాలవుతామని ఆందోళనకు గురవుతున్నారు. ఆదిలోనే కష్టాలు.. జిల్లాలో డిసెంబర్, జనవరి నెల నుంచే మామిడి చెట్లకు పూత పూయడం ప్రారంభమైంది. పూత పూసిన నెలరోజుల తర్వాత పిందెలు కాయడం, ఆ తర్వాత నెల, రెండు నెలలకి కాయ సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూత బాగా రావడంతో రైతులు సంతోషపడ్డారు. కానీ ప్రస్తుత వాతావరణ మార్పులతో ఆదిలోనే కష్టాల్లో పడ్డారు. బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు మామిడి తోటలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో మామిడి పూత, పిందెలు రాలిపోతున్నాయి. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి, ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పిందెలురాలి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా.. తెగుళ్ల ఉధృతి తగ్గడం లేదని అంటున్నారు. ఏడాదిగా కష్టపడుతూ అనేక మందులు కొడుతూ తోటలను కాపాడుకున్నా.. వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నేలపాలవుతున్న మామిడి పూత, పిందెలు ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్ల తోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన నేలలు ఉండాలి. జిల్లాలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువ. సాగునీటి విషయానికి వస్తే చెరువులు, కుంటలతో పాటు బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఈ క్రమంలోనే జిల్లాలో మామిడి, బత్తాయి, బొప్పాయి, జామ, సపోట డ్రాగన్ప్రూట్ తదితర పండ్లతోటలను సాగు చేస్తున్నారు. ఆయా పండ్లతోటల కంటే మామిడి సాగు ఎక్కువగా ఉంది. జిల్లాలో 654 ఎకరాల్లో మామిడి తోటలు పిందె, కాయ దశలో ఉన్నాయి. తోటలపై తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి వాతావరణ మార్పులే కారణం దిగుబడులపై తీవ్ర ప్రభావం ఆందోళనలో మామిడి రైతులు -
డేంజర్ జోన్ నిర్వాసితులతో సమావేశం
మల్హర్: మండలంలోని పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులతో బుధవారం హైదరాబాద్లోని మంత్రి శ్రీధర్బాబు తన కార్యాలయంలో జెన్కో సీఎండీ హరీష్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపెన్కాస్ట్ బ్లాస్టింగ్లతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఇళ్లను సేకరించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్వాసితులు మంత్రి, సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. శాసీ్త్రయ పద్ధతిలో సర్వే నిర్వహించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ అజయ్, తాడిచర్ల సర్పంచ్ స్వామి, నిర్వాసితులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: హకీంపేట్ తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కోసం మండల, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10 బాలికలు, బాలుర చొప్పున మొత్తం 20 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేటి (గురువారం) నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. మండల స్థాయి పోటీలు మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలు భూపాలపల్లిలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఎంపికలో శారీరక ప్రమాణాలు, క్రీడా పరీక్షలు, మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాల ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు మండల విద్యాఅధికారిని సంప్రదించాలన్నారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్పీ తిప్పనబోయిన రామకృష్ణ ప్రకృతిని గౌరవిస్తూ వృక్షపూజ నిర్వహించారు. బుధవారం పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠ్యబోధనలో భాగంగా విద్యార్థులకు ప్రకృతిలో చెట్ల గొప్పతనాన్ని వివరించారు. పర్యావరణానికి హాని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మానవాళికి, పక్షులకు, జంతువులకు, జీవరాసులకు కేంద్రమైన చెట్లు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం అధ్యక్షుడు కమలాకర్, ఆర్పీలు ఏడుకొండలు, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు.ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. -
మహిళా శక్తి దేశాభివృద్ధికి పునాది
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: మహిళల శక్తి దేశాభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, యువతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు షురూ
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులను తెలుగు పరీక్షను నిర్వహించారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. 1,829 వందల మంది విద్యార్థులకు గాను 1,772 వందల మంది హాజరు కాగా 57 మంది గైర్హాజరైనారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యానోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జాతీయ చేనేత దినోత్స వం సందర్భంగా అవార్డులకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ జిల్లా అధికా రి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లకు వృత్తిలో నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డును అందించనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపి కైనవారికి రూ.25,000 నగదుతోపాటు సర్టిఫికె ట్ అందజేసి సత్కరిస్తారని తెలిపారు. మార్చి 31లోగా సహాయ సంచాలకులు, చేనేత, జౌళి శాఖ వరంగల్ కార్యాలయలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు చేనేత, జౌళి శాఖ వరంగల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఆలయాల అభివృద్ధికి కృషి రేగొండ : ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం మండలంలోని కోటంచ ఆలయంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరుణ్రెడ్డి ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సంపత్రావు, ఈఓ మహేష్ పాల్గొన్నారు. మల్హర్(కాటారం): కాటారంలో ఏర్పాటు చేసిన సౌర ప్యానళ్లను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇళ్లకు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల వివరాలను సంస్థ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటినీ సౌర విద్యుత్ కేంద్రంగా మార్చాలని సీఎండీ సంస్థ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్చూర్, డీఈఈ (టెక్నికల్) జగదీష్, కాటారం డీఈఈ నాగరాజు, డీఎం రెడ్కో మహేందర్రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. పోలీస్ స్పోర్ట్స్లో జిల్లా పోలీసుల ప్రతిభ భూపాలపల్లి: తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో జిల్లా పోలీసులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన నాల్గో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో బాస్కెట్బాల్ పోటీల్లో మహదేవపూర్ సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేజ్ హస్సేన్లు బ్రాంజ్ మెడ ల్స్ సాధించారు. ఆర్మ్ రెజ్లింగ్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాశీరాం బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. జిల్లాకు పతకాలు తీసుకొచ్చిన వీరిని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ మంగళవారం అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి రూరల్: కలెక్టరేట్లో అధికారులు పోష యాక్ట్– 2013 పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణలో పోష చట్టం ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా ఇన్చార్జ్ సంక్షేమాధికారి మల్లీశ్వరీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 44 అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 ప్రైవేట్ సంస్థల్లో ఐసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కృష్ణ, రాధిక, ఉమ తదితరులు పాల్గొన్నారు. మంగపేట: హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి సీతక్క సిఫారసు లేఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత, ఆల య కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్, అర్చకులు కలెక్టర్ దివారకు మంగళవారం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మహే శ్ మాట్లాడుతూ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులపై మంత్రి సీతక్కకు సోమవా రం ఆలయ అర్చకులు నివేదికను అందజేసిన విషయం విధితమే. ఈ మేరకు అభివృద్ధి పనులకు ఎస్టిమేషన్ నివేదిక సిద్ధం చేయాలని దేవాదాయశాఖ డీఈ రమేష్బాబును ఆదేశించారని తెలిపారు. -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరంలో 1,544 మంది, వృత్తి విద్యా కోర్సుకు 298 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,586 మంది, సెకండియర్ వృత్తి విద్యా కోర్సుకు 350 మంది మొత్తం 3,778 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలకు 20 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,544 మంది పదోతరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకన్న పాల్గొన్నారు. కంట్రోల్ రూం రూం ఏర్పాటు.. విద్యార్థులకు సలహాలు, సందేహాల నివృత్తి, పరీక్షా కేంద్రాల సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 97052 99368, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 80088 78060 నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ యాప్ తప్పనిసరి.. గ్రామస్థాయిలో మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈ –డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఇంటర్మీడియట్ వార్షిక కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు. 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలు రాయనున్న 3,778 మంది విద్యార్థులు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు -
పదిశాతం పనులు కూడా చేయలె
ఆస్పత్రి పనులను పరిశీలిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, చిత్రంలో మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, శంకర్ నాయక్ తదితరులు ● రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ● వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలన – ఎంజీఎం -
దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..
ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరిన దామోదర్, 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు. ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2003లో మేడారం ఎల్ఓఎస్ ఇన్చార్జ్గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు. 2006లో ఖమ్మం–కరీంనగర్–వరంగల్ (కేకేడ బ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు, 2007లో డివి జనల్కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం)గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన దామోదర్, యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
కోటివరాల కొడవటంచ
రేగొండ: భక్తజన బాంధవుడిగా పేరుగాంచిన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి (గురువారం) నుంచి ప్రారంభమై వారం రోజులపాటు వైభవంగా కొనసాగునున్నాయి. ఇటీవలే స్వామి వారి పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు వైభవంగా చేపట్టారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని కొలిస్తే కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన కొడవటంచ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొడవటంచ క్షేత్రం నిత్యపూజలతో భక్తిపారవశ్యంతో పొంగిపోతుంది. వందల సంవత్సరాల క్రితం వెలసిన కొడవటంచలో ఒకప్పుడు జాతర సమయంలోనే భక్తులు మొక్కులు చెల్లించుకునేవారు. కోరికలు నెరవేరడంతో జాతర సమయంలోనే కాకుండా నిత్యం స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. కొత్త వాహనాలకు పూజలు చేసేందుకు కూడా భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఉదయం ఐదు గంటల నుంచే స్వామి వారికి సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎక్కడాలేని విధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచ ఆలయంలోనే నిర్వహించడం ప్రత్యేకత. ప్రతి నెలా స్వామి వారికి స్వాతి నక్షత్రంలో కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. నివేదన సమయంలో ఆలయ సన్నిధిలో సమానత్వానికి సూచికగా భక్తులను కూర్చోబెట్టి స్వామి వారి ప్రసాదాన్ని అందిస్తారు.స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తాం. – నాయినేని సంపత్ రావు, ఉత్సవ కమిటీ చైర్మన్వారం రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో, ఎలాంటి వివాదాలకు దారి తీయకుండా శాంతియుతంగా జరుపుకోవాలి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జాతరలో అల్లర్లకు పాల్పడే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. – రాజేష్, ఎస్సై, రేగొండ●26న (గురువారం) ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం స్వస్తి వాచనము, శేషవాహనము సేవ (పుట్టబంగారం సేవ), అంకురారోహణం బ్రహ్మోత్సవాలు ప్రారంభం 27న (శుక్రవారం) ధ్వజరోహణం (గరుడముద్ర) కార్యక్రమాలతోపాటు అశ్వవాహన సేవ, స్వామి వారి ఎదుర్కోలు, స్వామి వారి కల్యాణం (తలంబ్రాలు) 28న (శనివారం) ఉదయం గజవాహనసేవ, రాత్రి చంద్రవాహన సేవ 01న (ఆదివారం) ఉదయం సింహవాహన సేవ, రాత్రి గరుడోత్సవం, సదస్యము 02న (సోమవారం) ఉదయం హనుమంతవాహనసేవ, రాత్రి చిన్న రథ సేవ, దోపోత్సవం 03న (మంగళవారం) హోళి పండుగ రోజున చంద్రగ్రహం ఉన్నందున ఉదయం నిత్యవిధి, హోమ, బలిహరణములు, పూర్ణాహుతి, నైవేథ్యం అనంతరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం మూసివేత 04న (బుధవారం) బోనాలు,, జాతర, సాయంత్రం పెద్ద రథోత్సవం 05న (గురువారం) ఉదయంచక్రస్నానం, జాతర రాత్రి శ్రీపుష్పయాగము రేపటి నుంచి కోటంచ బ్రహ్మోత్సవాలు షురూ 27న స్వామి వారి కల్యాణం -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్లతో కలిసి మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, యూరియా కోసం రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేయుట తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, టీజీ ఎండీసీ శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే తక్షణమే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి రిమాండ్ చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలకే ఇసుక రవాణా జరగాలని, జిల్లా దాటి పోకుండా చూడాలన్నారు. నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న కొడవటంచ దేవాలయ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు, మరుగుదొడ్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిగత వివరాలు... కుటుంబ నేపథ్యం..
పేరు: బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా. మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి. తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ). ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం, గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్కౌంటర్లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ జైలులో ఉన్నారు.సగర్వంగా స్వాగతం పలుకుతాం చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. – కొప్పుల జగన్నాథరావు, దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లి ● -
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
కాళేశ్వరం: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. మహదేవపూర్ మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 9 గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీడీఓ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో వార్డు సభ్యుల విధులు, చేయాల్సిన కార్యక్రమాలు, నిధులు తదితర అంశాలపై వివరించారు. తహసీల్దార్ రామారావు, టీఓటీ కుమారస్వామి, మహదేవపూర్ సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్, రాణిబాయిరామారావు, ఆకుతోట సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు వార్డుసభ్యులకు శిక్షణ తరగతులు -
సమస్యల గోడు..
● ఒక్కొక్కరిది.. ఒక్కో సమస్య ● జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులుభూపాలపల్లి అర్బన్: పరిష్కారానికి నోచుకోని భూ సమస్య.. భూములకు అందని నష్టపరిహారం.. భూ నిర్వాసితులకు అందని నష్టపరిహారం.. అందని సన్నధాన్యం బోనస్ డబ్బులు.. ఇలా జిల్లా నలుమూలల నుంచి సోమవారం ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్కు తమ గోడును చెప్పుకుని పరిష్కారం చూపండని వేడుకున్నారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ రాహుల్శర్మ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. జాప్యం చేయొద్దు.. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.అన్యాయంగా పట్టా చేసుకున్నరు..మహాముత్తారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 468లో 6.17 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా మార్క బాలయ్య, మార్క వెంకటేశ్వర్లు పట్టాదారులుగా చేరారు. 75 ఏళ్ల క్రితం 30కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం మార్క లచ్చయ్య వద్ద నుంచి కొనుగోలు చేశాం. ఇళ్ల స్థలాలుగా భూమి ఉండగా.. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రతీ ఏడాది రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నారు. మేము కొనుగోలు చేసినట్లు పురోక్తునామా ఉన్నది. కలెక్టర్ స్పందించి పట్టా రద్దు చేయాలి. – బాధితులు, మహాముత్తారంప్రజావాణికి వినతుల వెల్లువ -
సీఎం పర్యటనలతో ప్రజాధనం వృథా
ములుగు: ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్రెడ్డి మూడుసార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించినా స్థానికులకు ఒరిగిందేమీలేదని, పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధుల కోసమే తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్నారు. రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్రెడ్డి సీఎం ఎలా అయ్యేవారని విమర్శించారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్ను విమర్శించే అర్హత రేవంత్రెడ్డికి లేదన్నారు. జిల్లాలోని గంగారం, కొత్తగూడెం మండలాలకు పాఖాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు తుపాకుల గూడెంలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాలను రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బైకాని ఓదెలు, కోగిల మహేశ్, పోరిక విజయరాం నాయక్, కుడుముల లక్ష్మినారాయణ, లకావత్ నర్సింహనాయక్, చెన్న విజయ్, ఆకుతోట చంద్రమౌళి, గోనెల భారత్, బైకని సాగర్, అనుముల సురేష్, గండి కుమార్, ముంజాల భిక్షపతి, మాచర్ల ప్రభాకర్, గొర్రె సమ్మయ్య పాల్గొన్నారు.● బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి -
శాసీ్త్రయ దృక్పథంతో కొత్త ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు శాసీ్త్రయ ధృక్పథంతో విషయాలను పరిశీలించి కొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని సెక్టోరియల్ అధికారి విజయపాల్రెడ్డి కోరారు. జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్లు విజయపాల్రెడ్డి, రమేష్, రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా సైన్స్ అభివృద్ధి చెందుతోందని, సైన్స్ ద్వారా సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. ప్రతీ విద్యార్థి శాసీ్త్రయ దృక్పథంతో విషయాలను పరిశీలించి కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు కొత్త అనుభూతిని కలిగించింద న్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ స్వామి, జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు బిల్ల రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిప్రసన్న పాల్గొన్నారు.


