breaking news
Jayashankar District News
-
బైపాస్ రోడ్డు మంజూరు చేయాలి
భూపాలపల్లి: వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా మారిన భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కోరగా సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కావ్య... భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా సింగరేణి, కేటీపీపీ పరిశ్రమల మూలంగా ఎన్హెచ్ 353సీ మీద వాహనాల రద్దీ పెరిగి పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో 576 ప్రమాదాలు జరిగి 233 మంది చనిపోయారని తెలిపారు. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భూపాలపల్లి బైపాస్ రోడ్డులో రూ.175 కోట్లు నిర్మాణ పనులకు, రూ.75కోట్లు భూసేకరణకు వినియోగించాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి.. వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య వెల్లడించారు.కేంద్ర మంత్రిని కోరిన వరంగల్ ఎంపీ కావ్య -
కోడి‘గుడ్’..విధానం!
సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ‘ఆన్లైన్’ ప్రక్రియసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనునన్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటు... ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కోడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే.. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ ఆగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వా త కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరి మాణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొన్న విధంగా కాకుండా తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటా యించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. విద్యాలయాల్లో 7.33 కోట్ల కోడిగుడ్లకు.. సుమారు రూ.40.60 కోట్లు ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాలకే టెండర్లు.. భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ ఈ నెల 6 నుంచి 12 వరకు షెడ్యూల్ దాఖలు.. 12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్ అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..జిల్లా సరఫరా కేటాయించిన చేయాల్సిన డబ్బులు (రూ.లలో) కోడిగుడ్లు హనుమకొండ 1,31,14,397 6,71,45,713 వరంగల్ 1,40,76,730 7,89,70,455 మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636 జనగామ 1,26,05,592 7,09,69,483 ములుగు 78,11,600 4,39,79,308 భూపాలపల్లి 79,54,004 4,47,81,042 మొత్తం 7,33,49,825 40,59,89,637 -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
● జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ● ఉత్తమ లిరిక్రైటర్గా గుర్తింపు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులుహన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత -
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మల్హర్ మండలంలో మొక్కదశలో ఉన్న పత్తిచేనుపలిమెల 375.1 భూపాలపల్లి 348.5 మొగుళ్లపల్లి 318.4 రేగొండ 311 టేకుమట్ల 304.5 చిట్యాల 303.4 మహాముత్తారం 293.9 గణపురం 283.5 మహదేవపూర్ 278.3 మల్హర్ 257.7 కాటారం 247.2 కొత్తపల్లిగోరి 214.2 కల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీదేవరకు పూజలు మల్హర్: శ్రావణ శుక్రవారం సందర్భంగా మండలంలోని కొయ్యూరు పీవీనగర్ గ్రామంలో ఆదివాసీలు శ్రీ లక్ష్మీదేవర ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలోని లక్ష్మీదేవర తల్లికి మహిళలు గాజులు సమర్పించి, పసుపు, కుంకమలతో అభిషేకం చేశారు. అనంతరం మహిళలు ఒకరికొకరు గా జులు వేసుకొని సంబరాలు జరుపుకున్నారు. ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఓపెన్ ఇంటర్, టెన్త్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడుపును పొడిగించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాద రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ వరకు, అపరాద రుసుముతో 28వ తేదీ వరకు ప్రవేశాల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం ప్రతీ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్టడీ సెంటర్లను సంప్రదించాలని కోరారు. 75శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కాకతీయ గనుల్లో గడిచిన జూలై మాసంలో 75శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై మాసంలో 2.91 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2.18లక్షల బొగ్గు ఉత్పత్తిని వెలికితీసినట్లు చెప్పారు. వెలికితీసిన బొగ్గును రవాణా చేసినట్లు తెలిపారు. జూలై మాసంలో అత్యధికంగా 265 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఉత్పత్తి శాతం తగ్గిందన్నారు. రక్షణతో కూ డిన ఉత్పత్తిని సాధించాలని, గైర్హాజరు కాకుండా ప్రతీ రోజు విధులకు హాజరుకావాలని సూచించారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. మిర్చి, వరి సాగుపై తీవ్ర ప్రభావం.. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురవకపోవడంతో వరి, మిర్చి పంటల సాగు ఆలస్యం అవుతోంది. జూన్, జూలై నెలల్లో కురిసిన వానలు పత్తి పంటలకు అనుకూలంగా మారాయి. ఆ వర్షాలకు వడ్లు అలికి వరిసాగుకు సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం నిరాశ చెందుతున్నారు. సరిపడా వర్షాలు పడకపోవడంతో ఇప్పటికీ వరినాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బోర్లు, బావులు, చెరువులు, కాల్వల కింద ఉన్న రైతులు ధైర్యంచేసి వరి నాట్లు వేస్తుండగా వానల మీద ఆధారపడే రైతులు ఇంకా నాట్లు వేయడం లేదు. దీంతో నారు ముదిరి రంగు మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మిర్చి సాగుచేసే రైతులు గింజలు అలుకగా అవి మొక్క దశలో ఉన్నాయి. మరిన్ని వర్షాలు కురిస్తే మిర్చి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాలపల్లి: ఈ ఏడాది వర్షాలు అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడ క, లోటు వర్షపాతం నమోదు కావడం, చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరకపోవడంతో పంటల సా గుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నా యి. పత్తికి వర్షాలు అనుకూలంగా కురుస్తున్నప్పటికీ వరి, మిర్చి పంటల సాగు ఆలస్యమవుతోంది. లోటు వర్షపాతమే.. జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో ప్రధానంగా వరి 1,12,218, పత్తి 93,823, మిర్చి 28వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. జూన్ నెలలో మోస్తారు వర్షాలు కురవగా, జూలైలో మూడు, నాలుగవ వారాల్లో సాధారణ, లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో జిల్లావ్యాప్తంగా సగటున 16 రోజుల పాటు వర్షం కురిసినట్లుగా నమోదైనప్పటికీ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్, కొత్తపల్లిగోరి మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం వేడెక్కి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వర్షాలు కురుస్తాయా లేదా పంటల సాగు ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో కనిపించని నీరు.. వర్షాకాలం ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలోని ఏ ఒక్క రిజర్వాయర్, చెరువు కూడా నిండలేదు. చిన్న, చిన్న కుంటలు నిండినప్పటికీ ఆయకట్టులో పెద్దగా సాగు జరిగే అవకాశం లేదు. దీంతో జలాశయాల మీద ఆధారపడి సాగుచేసే రైతులు వరణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో 1వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్కార్డు, రేషన్కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఆదాయం సర్టిఫికెట్లు జతచేసి ఈనెల 8వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లేదా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దరఖాస్తు అందించాలని కోరారు. వివరాలకు జిల్లాషెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నేడు మంత్రి పర్యటన మల్హర్: మండలంలోని తాడిచర్ల గ్రామంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పర్యటించనున్నారు. తాడిచర్లలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పీఏసీఎస్ భవనం, రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. రూ.15 లక్షలతో తహసీల్దార్ కార్యాలయం ప్రహరీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.న్యూస్రీల్స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ షురూజనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) విడుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొటో అప్లోడ్ అయ్యేందుకు అరగంట సమయం పట్టిందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. సాంకేతిక సమస్య ఇలాగే కొనసాగితే అటెండెన్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ నమోదు వివరాలు..జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు శాతం ర్యాంకు రిజిస్ట్ట్రేషన్వరంగల్ 534 3,211 2,085 64.93 08 హనుమకొండ 472 2,987 1,883 63.04 16 మహబూబాబాద్ 768 3,859 2,231 57.81 26 జనగామ 459 2,773 1,572 56.69 27 ములుగు 337 1,557 832 53.44 29 భూపాలపల్లి 414 1,927 901 46.76 33 మళ్లీ మొఖం చాటేసిన వానలు మూడు రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండ గత నెలలోనూ జిల్లాలో లోటు వర్షపాతం ఆలస్యం అవుతున్న వరి, మిర్చి పంటల సాగు ఆందోళనలో రైతులు ఇప్పుడిప్పుడే వరినాట్లు .. గత నెలలో కురిసిన వర్షాలకు చిన్నచిన్న చెరువులు నిండాయి. వర్షాలతో పత్తి పంటలకు ఇబ్బంది లేదు. రైతులు గడిచిన పది రోజులుగా వరినాట్లు ప్రారంభించారు. మరిన్ని వర్షాలు పడితే వరి సాగుచేసే రైతులంతా నాట్లు వేసే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – వీరునాయక్, డీఏఓ -
సరిహద్దు భూ సమస్యలను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రెవెన్యూ, అటవీ సరిహద్దు భూ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్హాల్లో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్ మండలాలలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలు ఉన్నట్లు తెలిపారు. అటవీ, రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారానికి సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు కేటాయించాలన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరువురు శాఖల అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఎఫ్డీఓ సందీప్రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. పనులను వేగవంతం చేయాలి.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ పరికరం ఏర్పాటు పనులను కలెక్టర్ రాహుల్శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీటీ స్కాన్ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టంచేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 68వేల మందికి సబ్సిడీ గ్యాస్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ను రూ.500కి అందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,36,243 లక్షల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి రూ.655.19 లక్షల సబ్సిడీ మంజూరు చేసినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన గణపురం: మండలంలోని బుర్రకాయల గూడెం గ్రామంలో కలెక్టర్ రాహుల్ శర్మ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎరువుల దుకాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయంలోని భూ భారతి దరఖాస్తుల స్టోర్ రూంను పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. నిర్మాణ పనులలో జాప్యం లేకుండా నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్ధార్ను ఆదేశించారు. గొర్రెల వైద్య సేవలకు వచ్చిన రైతు కలెక్టర్కు గొర్రె పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
లాభం ఎంత..?
గత ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించని సింగరేణి యాజమాన్యం 69.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి సంస్థ గతంలో మారిదిగానే 2024–25 ఆర్థిక సంవత్సరం టర్నోవర్ను అధిగమించడంలో వెనుకబడింది. అనుకున్న స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని సాధించలేకపోయింది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కోల్ ఇండియాతో పోటీ పడింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంకాగా.. 64.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది.● నాలుగు నెలలుగా ఎదురుచుస్తున్న కార్మికులు ● లాభాల వాటా పెంచాలని డిమాండ్ ● రూ.35 వేల కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు అంచనా భూపాలపల్లి అర్బన్: సింగరేణికి ప్రధాన బలం ఉద్యోగులేనని, విధుల్లో వారి కృషి, పట్టుదలతో సంస్థకు లాభాలు వస్తున్నాయని ప్రతిసారీ యాజమాన్యం చెబుతోంది. అందుకే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా లాభాల్లో వాటా చెల్లిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపుతోంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా నేటికీ కార్మికులకు 2024–25 ఆర్థిక సంవత్సర లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదు. అయితే సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 59.84 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కార్మికులకు వాటా.. కోలిండియాలో సంస్థ లాభాలు సాధిస్తే అందులో కార్మికులకు వాటా చెల్లిస్తామని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంస్థ బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్లిన క్రమంలో సంస్థను లాభాల బాట పట్టించేందుకు అప్పటి గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 1999– 2000 ఆర్థిక సంవత్సరంలో 10 శాతంతో ప్రారంభమైన లాభాల వాటా.. గత ఏడాది 32 శాతానికి చేరుకుంది. సంస్థ చరిత్రలోనే 2018–19లో అత్యధికంగా రూ.1,766 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో కార్మికుల వాటా 28 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి సగటున రూ.లక్ష వరకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాది ఆలస్యమే..! గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్న ఇప్పటి వరకు కార్మికులకు రావాల్సిన లాభాలను సింగరేణి ప్రకటించలేదు. ప్రతి ఏడాది మాదిరిగానే అడిట్ పూర్తి కాలేదని సింగరేణి యాజమాన్యం సమాధానాలు చెబుతుంది. సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించేందుకు ప్రతీ సంవత్సరం నాలుగైదు నెలల సమయం తీసుకుంటుంది. అధునాతన విధానాలను అమలు చేస్తూ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కలు చేస్తున్న క్రమంలో ప్రతీ ఏడాది ఇదే విధంగా ఆలస్యం చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. లాభాలు ప్రకటించి ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటి వరకు యాజమాన్యం ప్రకటించకపోవడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ లాభాలను ప్రకటించాలి సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించాలి. సకాలంలో కార్మికులకు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరిగా నామాత్రపు లాభాలు ప్రకటించొద్దు. నెలలు గడిస్తే కాని యాజమాన్యం లెక్కలు పూర్తి చేయడం లేదు. ఈసారి సంస్థ సుమారు రూ.4 వేల కోట్లకు పైగా లాభాలు సాధించి ఉంటుంది. లాభాలు ప్రకటించి కార్మికులకు 40 శాతం ప్రకటించాలి. – కంపేటి రాజయ్య, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శిసింగరేణి లాభాలు, కార్మికులకు పంపిణీ చేసిన శాతం సంవత్సరం లాభాలు పంపిణీ శాతం (రూ.కోట్లలో)2017–18 1,200 27 2018–19 1,766 28 2019–20 993 28 2020–21 273 29 2021–22 1,227 30 2022–23 2,222 32 2023–24 2388 33 -
విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హెల్త్ ప్రొఫెల్ తయారు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆస్పత్రికి వచ్చే రోజుల సంఖ్యతోపాటు, ఆస్పత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రిలో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని చెప్పారు., డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరాలు వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా వివిధ గ్రామాల్లోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించి బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని నిర్వాహకులు తెలియజేయగా.. వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారికి ఫోన్ చేసి విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లును పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, డాక్టర్ ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంీపీఓ నాగరాజు ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు, పంచాయతీ సెక్రెటరీ శశిధర్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
చెట్లను కాపాడితేనే పర్యావరణ పరిరక్షణ
మల్హర్: చెట్లను కాపాడితేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఏఎమ్మార్ ల్యాండ్ అక్వేషన్ అధికారి మూర్తి, ఇన్విరాల్మెంట్ అధికారి రాజ్కుమార్ అన్నారు. మండలంలోని తాడిచర్ల ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్ల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతిరెడ్డి, కంపెనీ సిబ్బంది అభిషేక్, రామ్మూర్తి, నవీన్, నరేష్ పాల్గొన్నారు.నియామక పత్రం అందజేతమల్హర్: మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన దండు రమేశ్ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎన్నికై న విషయం తెలిసిందే. ఈమేరకు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు గురువారం రమేశ్కు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్వప్నరెడ్డి, తిరుపతిరావు, సమ్మయ్య, రమేష్రెడ్డి, శ్రీనివాస్, సదానందం, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.ఇన్స్పైర్ మానక్ నామినేషన్లు పూర్తి చేయాలిభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఇన్స్పైర్ మానక్ నామినేషన్లు పూర్తి చేయాలని జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియ జూలై 15 నుంచి మొదలైందని.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు తమ పాఠశాలలోని ఐదుగురు విద్యార్థులతో ఐదు నామినేషన్లు పూర్తి చేయించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, రిసోర్స్ పర్సన్ గోనె శ్రీనివాస్, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.‘ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం’ములుగు రూరల్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను ఇచ్చిందని, ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన ఏ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, దళితబంధు, పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావూద్, రఘుపతి, గ్యానం వాసు, కృష్ణబాబు, రమేష్, రత్నం ప్రవీణ్, హుస్సేన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం
మొగుళ్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపు బాలుర గురుకుల విద్యాలయంతోపాటు కొర్కిశాలలోని కేజీబీవీని వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి సందర్శించారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిష్టర్లను పరిశీలించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంజేపీ గురుకులంలో కరెంట్, నీటి సమస్య తీవ్రంగా ఉందని, కేజీబీవీలో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని విద్యార్థులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ఎంజేపీ గురుకులానికి మిషన్ భగీరథ నీటిని సరిపడా సరఫరా చేయాలని ఏఈతో ఫోన్లో మాట్లాడారు. కరెంట్ తీగలు వేలాడుతున్నాయని, స్వీచ్బోర్డులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కుళ్లిన కూరగాయలను చూసి ఇలాంటి కూరగాయలతో భోజనం పెడితే ఫుడ్ పాయిజన్ అవుతుందని ప్రిన్సిపాల్ శారదపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన సూచించారు. గురుకులానికి పర్మనెంట్ ఎలక్ట్రీషయన్, వెల్డర్లను నియమించాలని సూచించారు. అదేవిధంగా నీటి సమస్య తీర్చడం కోసం బోర్లు వేయించాల్సిన అవసరం ఉందని, కరెంట్ తరచూ పోతున్న కారణంగా సోలార్లైట్స్, సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫా మ్ దుస్తులు అందించకపోవడం బాధాకరమని అన్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కలెక్టర్ను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బల్గూరి తిరుపతిరావు, జోరుక సదయ్య, కొడారి రమేష్, రవి, దేవునూరి కుమార్, గడ్డం రాజు, తదితరులు ఉన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి
భూపాలపల్లి అర్బన్: ఏకాగ్రతతో చదివి ఉత్తమఫలితాలు సాధించాలని శాసన మండల ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలు, గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు, అమరవీరుల స్థూపానికి పూలమాల వేపి నివాళులర్పించారు. కేటీకే 1, 5వ గనుల్లో పర్యటించి కార్మికులతో మాట్లాడారు. పదవి విరమణ పొందుతున్న కార్మికులను సన్మానించారు. అనంతరం వేశాలపల్లి గ్రామంలో పలువురు బాధితులను పరామర్శించి, జంగేడు కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ప్రహరీ పనులు వేగవంతం చేయాలని ఏఈని ఆదేశించారు.శాసన మండల ప్రతిపక్ష నేత సిరికొండ -
ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి
భూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే ఆకాంక్షించారు. పోలీసు శాఖలో 35 ఏళ్లపాటు సమర్థవంతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన రేగొండ ఏఎస్సై మల్యాల ప్రభాకర్, గణపురం ఏఎస్సై బైరి అబ్బయ్యను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రత్నం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
షాపుల నిర్వహణకు వేలం
● కాళేశ్వరాలయానికి రూ.61.31లక్షల ఆదాయంకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థాన ఆవరణంలో వివిధ షాపులు నిర్వహణకు లైసెన్స్ హక్కుల కోసం ఈ–టెండర్, సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం రెండు సంవత్సరాలకు ఈఓ మహేష్ ఆధ్వర్యంలో కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించారు. గురువారం నిర్వహించి ఈప్రక్రియలో టెండర్ల ద్వారా ఆలయానికి సంవత్సరానికి గాను రూ. 61.31 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. ఎండోమెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నందనం కవిత పర్యవేక్షించారు. మరో 6 టెండర్లు సరైన పాట దారులు రానందున వాయిదా వేసినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. రెండో సంవత్సరం కూడా ప్రస్తుతం టెండరు దక్కించుకున్న నిర్వహకులు ఇదే ధర ప్రకారం టెండరు డబ్బులు చెల్లించాలని ఈఓ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి పాడిగేదెలు
భూపాలపల్లి: ఎమ్మెల్యే చెప్పినందుకే షెడ్డు కూలగొడుతున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారంటూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి పాడిగేదెలను పంపి బాధితులు నిరసన తెలిపారు. ఈ ఘటన భూపాలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్నగర్ కాలనీ సింగరేణి ఏరియా ఆస్పత్రి పక్కన గల స్థలంలో కూరాకుల ఓదెలు, లలిత దంపతులు గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. పాడిగేదెలు(బర్రెలు)ను సాకుతూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. రహదారిని ఆక్రమించుకొని షెడ్డు ఏర్పాటు చేసుకున్నారని, దానిని తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నెలన్నర క్రితం రమేష్ అనే వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నెల రోజుల క్రితం ఓదెలుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడినుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీపీఓ సునిల్కుమార్ గురువారం జేసీబీ సాయంతో ఓదెలు షెడ్డును కూల్చివేయించాడు. దీంతో బాధిత దంపతులు సాయంత్రం తమ పాడిగేదెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలోకి పంపారు. తమ షెడ్డు కూల్చివేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పినట్లుగా మున్సిపల్ అధికారులు తెలిపారని, అందుకే ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలోకి గేదెలను పంపి నిరసన తెలుపుతున్నామని వెల్లడించారు. తమకు న్యాయం జరిగే వరకు గేదెలు, మేము ఇక్కడే ఉంటామని భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంపు కార్యాలయానికి చేరుకోగా ఓదెలు క్రిమిసంహారక మందు తాగేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గేదెలను బయటకు పంపి ఓదెలు, లలితను అదుపులోకి తీసుకొని మాట్లాడి ఇంటికి పంపించారు. తమ షెడ్డు కూల్చారని బాధితుల నిరసన -
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
చిట్యాల: ఎరువుల దుకాణాలలో యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని సహకార సంఘం, తహసీల్దార్ కార్యాలయం, పలు ఎరువుల దుకాణాలు, పశువుల ఆస్పత్రి, ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఎరువులు షాపులలో అధిక ధరలకు విక్రయిస్తే లైసె న్స్ రద్దు చేయడంతో పాటు పోలీస్ కేసులు నమో దు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. యూరియా కావాలంటే ఆర్గానిక్ ఎరువులు కొనాలనే ఆంక్షలు పెడితే కేసు నమోదు చేయాలని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ప్రజలు జ్వరాల బారిన పడకుండా గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, డీసీఓ వాలియా నాయక్, పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ కుమారస్వామి, ఆర్డీఓ రవి, వ్యవసాయశాఖ ఏడీఏ రమేష్, ఏఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్రెడ్డి, తహసీల్దార్ షేక్ ఇమామ్బాబా, వ్యవసాయశాఖ మండల అధికారి శ్రీనివాస్రెడ్డి, ఆర్ఐ రాజేందర్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆకుదారివాడ, మహబూబ్పల్లి, కుందూరుపల్లి, పూల్లూరిరామయ్యపల్లి, కాకతీయకాలనీలకు చెందిన 94మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: వర్షాకాలంలో డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. కాటారం మండలం జాదారావుపేట, చిద్నెపల్లి గ్రామపంచాయతీల్లో రెండు డెంగీ కేసులు నమోదు కావడంతో బుధవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బాధిత ఇళ్లను సందర్శించారు. డెంగీతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స పొందుతున్న తీరు, ప్రభుత్వ వైద్య సిబ్బంది ద్వారా అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి సరైన వైద్య పరీక్షలు చేయాలని వైద్యులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. నిత్యం వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ అధికారులకు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీదేవి, ఎంపీఓ వీరస్వామి, మండల వైద్యాధికారిణి మౌనిక, గ్రామపంచాయతీ, వైద్య సిబ్బంది ఉన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
వేగంగా.. సులువుగా..
భక్తులు వనదేవతలను దర్శించుకునేలా సమాలోచనలుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం భక్తులకు సులువుగా కల్పించేందుకు అధికారులు, పూజారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, డీఎస్పీ రవీందర్, ఈఓ వీరస్వామి, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల పూజారులతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని సందర్శించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో చేయడం వల్ల భక్తులకు సులువుగా దర్శనం కలుగుతుందన్న ఆలోచనపై పూజారులతో చర్చించారు. అర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్, అధికారులు తయారు చేసిన మ్యాప్లను పూజారులకు కలెక్టర్ వివరించారు. అంతిమ నిర్ణయం పూజారులదే.. అర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్ వల్ల అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తల్తెత్తుతాయనే అభిప్రాయాన్ని పూజారులు అధికారులకు వివరించారు. కానీ, అధికారులు సమ్మక్క– సాలరమ్మల గద్దెల పక్కన వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఉంచడంపై పూజారులు సమాలోచనతో సానుకూల నిర్ణయానికి వచ్చారు. సారలమ్మ ఎంట్రెన్స్ గేట్ను సుమారుగా 20 ఫీట్ల దూరం విస్తరించి వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పూజారులు కొంతమేరకు ఏకీభవించారు. నలుగురు దేవతలను వరుస క్రమంలో ఉండడం వల్ల టీటీడీ కల్యాణ మండపం ద్వారా, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు రెండు వైపులా దర్శనం సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెండు వైపులా క్యూలైన్ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన భక్తుల్లో ఒకేసారి పదిమంది వెళ్లేలా వెడల్పాటి మరో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గద్దెల మార్పుపై రెండుమూడు రోజుల్లో పూజారులతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని గోవిందరాజు పూజారి.. అధికారులకు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్లు.. ఈసారి మహాజాతరలో షెడ్యూల్ ప్రకారం వీఐపీ, వీవీఐపీలు, అధికారులు, మీడియాకు దర్శనం పాస్లు జారీ చేయాలనుకుంటున్నారు. అందరికీ ఒకేసారి పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈసారి జాతరకు ముందుగా నాలుగైదు తేదీల్లో పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జాతర నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే, ఆపైస్థాయి వారికి పాస్లు జారీ చేసే ఆలోచన చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా సమ్మక్క మ్యూజియం, సారలమ్మ ఎంట్రెన్స్నుంచి జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు వరకు దారిని విస్తరించాలని పూజారులు కలెక్టర్ను కోరారు. కాగా, రోడ్డును కూడా కలెక్టర్..ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.మొక్కుల చెల్లింపులో ఇబ్బంది లేకుండా.. మేడారంలో పూజారులతో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పూజారులదే ఫైనల్ నిర్ణయంఅమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకల చెల్లింపులో భక్తులు ఇబ్బందులు పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను వరుస క్రమంలో భక్తులు దర్శనం చేసుకునే సమయంలో పూజారులు సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్ లోపల ఉండి భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం తీసుకుని తిరిగి ప్రసాదం అందించడంతోపాటు మొక్కు బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తరలించే మార్గాలను పరిశీలించారు. నాలుగు గద్దెలు వరుసక్రమంలో ఉంటే వీఐపీ, వీవీఐపీల దర్శనం సమయంలోనూ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీవీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా హెలిపాడ్ ప్రదేశానికి వెళ్లేలా సా రలమ్మ ఎగ్జిట్ గేట్నుంచి ఐరన్తో ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరింత సులువుగా ఉంటుందని సమాలోచన చేశారు. పూజారులు తమ నిర్ణయాన్ని త్వరగా తెలిపితే పదిహేను రోజుల్లో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దివాకర టీఎస్ చెప్పారు. -
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫార్మర్ డైరెక్టర్ మోహన్రెడ్డి సూచించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏరియా అధికారులకు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్మికులు, సూపర్వైజర్లతో ఎలా మాట్లాడాలి, వారితో ఎలా ప్రవర్తించాలి, నాయకత్వ లక్షణాలకు ఎలా పెంపొందించుకోవాలనే అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు మారుతి, రవీందర్, డాక్టర్ పద్మజ, రాజేశ్వర్, పోషమల్లు, రజిని, బాలరాజు పాల్గొన్నారు. -
కలుషిత నీరు తాగేదెలా?
కాటారం: కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయితీ పరిధిలోని సమీప కాలనీలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుంది. వారం రోజులుగా పూర్తిగా కలుషితమైన నీరు సరఫరా అవుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు. కలుషిత నీటితో కనీసం కాలకృత్యాలు సైతం తీర్చుకునే పరిస్థితి లేదని.. ఒకవేళ తాగితే రోగాల పాలు కావాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అన్నారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
కాటారం: మంత్రి శ్రీధర్బాబు సహకారంతో జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని గ్రంథాలయాన్ని బుధవారం కోట రాజబాబు సందర్శించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, వార్తా పత్రికలు, సౌకర్యాలపై ఆరాతీసి రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయాల్లో పాఠకుల కోసం పూర్తి సౌకర్యాలు కల్పించి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. లైబ్రరీ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఇష్టానుసారంగా హాజరవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం లైబ్రేరియన్ రజిత పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు -
తనిఖీలు లేవు..!
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నాణ్యతను పట్టించుకోవాల్సిన అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. పదుల సంఖ్యలో అనుమతులు ఉండగా వందల సంఖ్యలో హోటల్, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. నాణ్యత పాటించకపోవడంతో ఏమైనా తినాలంటే ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అనుమతి పదుల్లో.. జిల్లాలో సుమారు 500 వరకు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, 10 వరకు రెస్టారెంట్లు, 5 వరకు దాబాలు ఉన్నాయి. భూపాలపల్లి, కాటారం, గణపురం, టేకుమట్ల, చిట్యాల, కాళేశ్వరం వంటి ప్రాంతాలతో పాటు ప్రతీ మండల కేంద్రంలో హోటళ్లు, బేకరీలు, మెస్లు మొదలైనవి వందల సంఖ్యలో నడుస్తున్నాయి. జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కేంద్రంలో కొన్ని తప్ప ఇతర ప్రాంతాల్లో నడిచే షాపులకు ఎటువంటి అనుమతులు పొందకుండా యఽథేచ్ఛగా నడిపిస్తున్నారు. సిబ్బంది లేమితో సతమతం జిల్లాలో హోటళ్లు, ఇతర దుకాణాలలో పర్యవేక్షణ కరువైంది. జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ ఫుడ్సెఫ్టీ డిగ్జినేటెడ్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. ఈ కార్యాలయంలో గెజిటెడ్ ఆఫీసర్, ఇద్దరు ఫుడ్ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు అటెండర్లు ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ లేరు. కలెక్టరేట్లో కార్యాలయం ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. జిల్లా వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రోగ్రాం అఽధికారికి జిల్లా గెజిటెడ్ ఆఫీసర్గా ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండేళ్లుగా ఒక్క కేసు కూడా లేదు.. జిల్లా ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతుంది. మూడు నాలుగేళ్ల క్రితం వరకు 10లోపు కేసులను నమోదు చేశారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో యథేచ్ఛగా కల్తీ చేసిన వస్తువులను విక్రయాలు చేపడుతూ, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తినుబండారాలను అమ్ముతున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్ల యజమానుల ఇష్టారాజ్యం గెజిటెడ్, ఫుడ్ఇన్స్పెక్టర్లు ఇన్చార్జ్లే..పై ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్. ప్రధాన రహదారిపై నిబంధనలు పాటించకుండా హోటల్లో అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఈగలు వచ్చి తయారు చేసిన ఆహార పదార్థాలపై వాలుతున్నాయి. వాహనాల దుమ్ము ధూళి సైతం నూనెలో పడుతుంది. అపరిశుభ్ర వాతావరణమే కాకుండా రెండు మూడు రోజుల పాటు వినియోగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేస్తున్నారు. నూనె పూర్తిగా నల్ల రంగుగా మారి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇక్కడ ఒక దగ్గరే కాదు.. ప్రతిచోటా ఇదే పరిస్థితి ఉంది. చట్టరీత్యా చర్యలు భోజన ప్రియులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారం అందించాలి. వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలి. నిబంధనలు పాటించని నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. భోజనం తయారుచేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్కోర్టులు, ఇతరత్రా చిన్న సెంటర్లలో ఏ రోజు ఆహార పదార్థాలను ఆరోజే కస్టమర్లకు అందజేయాలి. ఒకసారి వినియోగించిన నూనెను మరోసారి వాడకూడదు. – డాక్టర్ ఉమాదేవి, ఇన్చార్జ్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
కాళేశ్వరం: వర్షాల నేపథ్యంలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కాళేశ్వరం పీహెచ్సీ, వ్యర్థాలను దహనం చేసే యంత్రం, సరస్వతీ ఘాట్ వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్శాఖకు తెలిపారు. పోలీసుశాఖ నిరంతరం గోదావరి వద్దకు వచ్చే భక్తులపై నిఘా ఉంచాలని ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే స్పందించాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో స్థానిక రెవెన్యూ అధికారులను లేదా కంట్రోల్ రూం 90306 32608 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన విద్యార్థులు కోల శాన్వి, నాగుల తులసి, గంట హరిచందన హకీంపేట్ స్పోర్ట్స్ పాఠశాలకు ఎంపికై న సందర్భంగా వారిని, కోచ్ను అభినందించారు. సృజనాత్మకతను వెలికితీస్తే అద్భుతాలు విద్యార్ధులు ఒక నిర్ధేశ లక్ష్యంతో చదివితే అనుకున్న లక్ష్య సాధనకు చేరుతారని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాళేశ్వరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంలో న్యూటన్ సిద్ధాంతాలపై నిర్వహించిన దశవధానంపై చేసిన అంశం, మరో 12 మంది విద్యార్థుఽలు రసాయనశాస్త్రంలోని 118 మూలకాల పేర్లు ఎనిమిది సెకన్ల వ్యవధిలో చదవడంతో ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటుదక్కింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థిని అక్షయ, గౌడ్ టీచర్ రాజేందర్లను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రశంసా పత్రం, మెడల్ను అందచేశారు. మిగితా విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ సిద్ధం అరుణ్ కుమార్, ఇన్చార్జ్ హెచ్ఎం రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రామారావు, ఎంఈఓ ప్రకాశ్బాబు పాల్గొన్నారు. సమగ్ర పర్యవేక్షణకు క్లస్టర్ అధికారుల నియామకం భూపాలపల్లి: జిల్లాలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు, ప్రజాసేవల అమలుపై సమగ్ర పర్యవేక్షణకు క్లస్టర్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల్లో ప్రభుత్వ సేవల అమలు, రెగ్యులేటరీ చర్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పటిష్టమైన పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత మండలాలకు క్లస్టర్ అధికారులుగా నియమించిన అధికారులు మండల ప్రత్యేక అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. రుణమాఫీ కోసం సిఫారసు.. జిల్లాలో అర్హత కలిగిన 140 మంది చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ ఆమోదించి, రాష్ట్ర కమిటీకి సిఫారసు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత శాఖ ఏడీ శ్రీకాంత్రెడ్డి, వరంగల్ సీఈఓ వజీర్ సుల్తాన్, ఎల్డీఎం తిరుపతి, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి.. జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాలను జారీ చేయడానికి అర్హుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మల్లీశ్వరి, డీటీవో సంధాని తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్రూం ఏర్పాటు పోలీసుశాఖ నిరంతరం నిఘా ఉంచాలి కలెక్టర్ రాహుల్శర్మ -
యూరియా కొరత రానివ్వొద్దు
భూపాలపల్లి: యూరియా కొరత లేకుండా రైతులకు సరిపడా సరఫరా చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశపు హాల్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి యూరియా లభ్యతపై వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులు, సహకార సంఘాల చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు యూరియా పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకం లేని రైతులకు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకుని యూరియా ఇవ్వాలని చెప్పారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే దుకాణాల లైసెన్సులు రద్దుచేసి పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఈఓలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, సహకార అధికారి వాలియానాయక్, మార్క్ఫెడ్ అధికారి శ్యామ్, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని 20, 21వ వార్డుల పరిధిలోని హనుమాన్నగర్, శాంతినగర్ కాలనీల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకొని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు చేశారు. తరువాత క్యాంపు కార్యాలయానికి చేరుకొని కొత్తపల్లిగోరి మండలం బాలయ్యపల్లి గ్రామంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
సమస్యలు పరిష్కరించాలి
చిట్యాల: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.తిరుపతి కోరారు. మంగళవారం డీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్, నాయకులు వీరేశం, సుధర్శన్, వెంకట్రాం నర్సయ్య పాల్గొన్నారు. మినీ ల్యాబ్ పరిశీలన భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో సింగరేణి సంస్థ నేషనల్ టీమ్ ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్ను బెంగళూరు అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధి కారులు నాగదేవ్, శ్రీకాంత్లు సందర్శించి వి ద్యార్థులతో మాట్లాడి ల్యాబ్ ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్ర ధానోపాధ్యాయురాలు ఝాన్సీరాణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సుజాత, గీత పాల్గొన్నారు. బస్సునుంచి జారి మహిళకు తీవ్రగాయాలు భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజూర్నగర్లోని వెయ్యి క్వార్టర్స్ కాలనీకి చెందిన కంగూరి కవిత పని నిమిత్తం హనుమకొండకు వెళ్లి పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో భూపాలపల్లికి వస్తుంది. ఈ క్రమంలో మంజూర్నగర్లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా బస్సులో నుంచి జారీపడింది. దీంతో కవితకు తల, నడుము భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి 108 ద్వారా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్కు తరలించారు. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ మొగుళ్లపల్లి: నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భూపాలపల్లికి చెందిన కురుమిళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన నడిగోటి రాము ను ఎన్నుకున్నారు. శ్రీనివాస్, రామును మండలాల అధ్యక్ష, కార్యదర్శులు అభినందించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ను కలిసిన డీఎంహెచ్ఓ ములుగు రూరల్ : మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణలతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెను శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ ఎడ్యుకేషన్, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత నియంత్రణ జిల్లా అధికారి చంద్రకాంత్ ఉన్నారు. ఆగస్టు 5న సీపీఐ జిల్లా మహాసభ ములుగు రూరల్: ఆగస్టు 5న జిల్లాకేంద్రంలో సీపీఐ జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ తెలిపారు. మంగళవారం మల్లంపల్లిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మహాసభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల ఐలయ్య, శ్యామ్ సుందర్, రవి, రాజు పాల్గొన్నారు. -
ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ.617.21 కోట్లు ● 589 కిమీ 49 హ్యామ్ రోడ్ల ఉన్నతీకరణకు నిధులు ● హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్ల పర్యవేక్షణ ● పల్లెల నుంచి పట్టణాలకు మెరుగవనున్న కనెక్టివిటీ ● హైదరాబాద్ను కలిపే జిల్లా, మండల కేంద్రం రోడ్లకు నిధులు సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లతో ఉమ్మడి వరంగల్కు కొత్త కళ రానుంది. హ్యామ్ మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్యాకేజీల వారీగా మొత్తం 373 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.6,478.33 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఆర్అండ్బీ ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లకు 588.65 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.617.21 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 49 రోడ్లకు మహర్దశ పట్టనుండగా.. 588.65 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో రోడ్లను ఉన్నతీకరించనున్నారు. ‘హ్యామ్’ విధానం ఇలా.. రోడ్లు ఎక్కడెక్కడంటే.. హ్యామ్ విధానంలో మేజర్ రోడ్లయితే 60 శాతం నిధులను ఉమ్మడి జిల్లాలో టెండర్ల ద్వారా పనులు పొందిన గుత్తేదారు సంస్థలే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రోడ్లను అభివృద్ధి చేసేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు సర్కిళ్ల పరిధిలో 49 పనులకు రూ.617.21 కోట్లు కేటాయించగా.. గ్రామీణ ప్రధాన రహదారుల ఉన్నతీకరణతో పాటు పల్లెల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ ఉన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇదిలా ఉండగా 49 రోడ్లలో ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ నుంచి హనుమకొండ రోడ్డు (ఓల్డ్ ఎన్హెచ్–163) (జీడబ్ల్యూఎంసీ పరిధి)ను 14 కిమీ మేర అభివృద్ధి చేసి, విస్తరించనున్నారు. కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు (కాజీపేట, ఫాతిమానగర్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ) 9.47 కిమీ రోడ్డుకు సుమారు రూ.20 కోట్లకు పైగా మంజూరు చేశారు. ఆత్మకూరు నుంచి పరకాల వయా శాయంపేట, పెద్దకోడెపాక వరకు ఒకటి 3 కిమీ, మరోటి 11 కిమీ కలిపి మొత్తం 14 కిమీ ఉన్నతీకరించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట టు కక్కిరాలపల్లి (వర్ధన్నపేట, నందనం, రాంనగర్, కక్కిరాలపల్లి) వరకు 14.50 కిమీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. స్టేషన్ఘన్పూర్లో మడికొండ నుంచి నారాయణగిరి (ఎలుకుర్తి, ముప్పారం, నారాయణగిరి) రోడ్డు 10.50 కిమీ మేర బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం–నెల్లికుదురు రోడ్డు (కేసముద్రం, భూక్యారాం తండా, మహమూద్పట్నం, ఇనుగుర్తి, చిన్న గంగారం, తారాసింగ్బాయి తండా, భూక్యాదన్యతండా, సపావత్ తండా, భోజ్యతండాను కలిపే)ను 20.60 కిమీ మేర అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మొదటి విడతలో మొత్తం 49 రోడ్ల కోసం రూ.617.21 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ నిధులతో మండలం, జిల్లా కేంద్రాలను కలిపే పల్లెరోడ్లు కళకళలాడనున్నాయి. న్యూస్రీల్సర్కిళ్ల వారీగా పనులు, నిధులు, పర్యవేక్షణ..రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఒక వరుస రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన సర్కిళ్ల వారీగానే టెండర్లు, పనుల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లు ఉండగా.. హనుమకొండకు 394.42 కిమీ మేర 39 రోడ్ల ఉన్నతీకరణ కోసం రూ.467.90 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 10 రోడ్లను 194.23 కిమీ మేర అభివృద్ధి, విస్తరణ కోసం రూ.249.31 కోట్లు విడుదల చేశారు. హ్యామ్ రోడ్లపై ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ సూచన మేరకు ఆర్అండ్బీ సర్కిల్ వారీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వుల జారీ చేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి నేషనల్ హైవేలకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆ రోడ్లకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టు సంస్థలు టోల్ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇక్కడ చేపట్టే హ్యామ్ రోడ్లకు మాత్రం టోల్ట్యాక్స్ అనేది ఉండదు. ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు గుత్తేదారు సంస్థే అగ్రిమెంట్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. -
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కాటారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు హెచ్చరించారు. కాటారం మండలం రేగులగూడెం డీసీఎంఎస్ ఎరువుల విక్రయ కేంద్రం, అరవింద కృప ఫర్టిలైజర్ను బాబురావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ నిల్వలు, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడంతో పాటు ధరల, స్టాక్ పట్టికలను ఏర్పాటు చేయాలని దుకాణాల ని ర్వాహకులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందుల దుకాణాలను నిర్వహించాలని తెలిపారు. ప్రతీ కొనుగోలుపై రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, రైతులకు అవసరం లేకుండా లింకు ఎరువులను అంటగట్టవద్దని సూచించారు. డీఏఓ వెంట మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఏఈఓ ఉన్నారు. నానో యూరియా వాడకంతో ప్రయోజనం రైతులు పంట సాగులో నానో యూరియా, నానో డీఏపీ వినియోగించడం వలన బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలం రేగులగూడెం రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నానో యూరియా, డీఏపీ వినియోగంపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ పంటలో పోషకాల లభ్యత, పోషకాలను పెంచడంలో నానో యూరియా, డీఏపీ ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, ఎంఏఓ పూర్ణిమ, ఏఈఓ అస్మా, రైతులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు -
హేమాచలుడి హుండీ ఆదాయం రూ.9లక్షలు
మంగపేట : మండలంలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.9.18లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ పరకాల డివిజన్ పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు కానుకలను లెక్కించారు. ఆరు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని భక్తులు హుండీల్లో స్వామివారికి సమర్పించారు. అర్చకులు శేఖర్శర్మ, పరిచారిక ఈశ్వర్చంద్, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మీనారాయణ, అజయ్, నవీన్, గణేష్ పాల్గొన్నారు. -
ఆపుకోవాల్సిందే..
మరుగుదొడ్లు లేక ‘కాళేశ్వరం’లో ఇబ్బందులు కాళేశ్వరం: కాళేశ్వరాలయంలో టెండర్ల ద్వారా దుకాణదారుల నుంచి సంవత్సరానికి సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నా.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రధానంగా మరుగుదొడ్లు లేకపోవడంతో దుకాణదారులు, భక్తులు, అర్చకులు, సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండుకు వెళ్లాలంటే బయట పరిసరాలకు లేదా.. ఇంటికి వెళ్లే దాక ఆపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తప్పదనుకుంటే ఇంటికి వెళ్లి రావాల్సిన పరిస్థితి. ఉత్సవాలు జరిగే సమయంలో జనసమూహం ఎక్కువ ఉండడంతో దుకాణదారులు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం.. శ్రీరామాలయం వెనుకభాగంలో దుకాణాల సముదాయాల వెనుకాల దేవాదాయశాఖ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాగులమ్మ దేవాలయం సమీపంలో నిర్మాణంలో మరో మరగుదొడ్డి కూడా అసంపూర్తిగానే ఉంది. ఈఓ కార్యాలయం వెనుక భాగంలో సులభ్ కాంప్లెక్సు ఉన్నా దుకాణ సముదాయాలకు దూరంగా ఉంది. దీంతో దుకాణాలు వదిలేసి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. భక్తులు వెళ్లడానికి అడ్రస్ అడుగుతూ వెళుతుంటారు. ఎవరికి కూడా అందుబాటులో లేదు. రెండు హోటళ్లు, బేకరి నడిపిస్తున్న దుకాణాల సముదాయంలో మరుగుదొడ్లు ఉన్నా అంతంతమాత్రమే. సముదాయాల చుట్టూరా చెత్తాచెదారం పెరిగి, పాములకు ఆవాసంగా మారింది. గతేడాది బతుకమ్మ సమయంలో ఓ హోటల్ నిర్వాహకుడి కుమార్తెకు హోటల్లోనే పాము కాటు వేయడంతో వారం పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది.16దుకాణాలు.. రూ.కోటి ఆదాయం.. కాళేశ్వరాలయం లోపల, బయట కలిపి మొత్తంగా 16 దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీటికి టెండర్ల ద్వారా దేవాదాయ శాఖ అధికారులకు ప్రతి సంవత్సరం రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దుకాణదారుల్లో పురుషులు, మహిళలు ఉన్నారు. టెండర్ల ద్వారా ఆదాయం పొందుతున్న అధికారులు దుకాణదారులకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ప్రధానంగా మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణదారులే కాదు.. ఆలయానికి వచ్చే భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది సైతం మరుగుదొడ్లు లేక ఒకటి, రెండు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బందికి కూడా మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉంది. వీరు సైతం సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అందరికీ ఉపయోగం దేవస్థానం అర్చక, సిబ్బంది, దుకాణ నిర్వాహకులు, భక్తులకు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువస్తాం. గతంలో వచ్చిన రూ.25కోట్ల నిధుల నుంచి మిగిలిన నిధులతో రెండు చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. కొన్ని రోజులుగా పనులు నిలిచాయి. మళ్లీ ప్రారంభించాం. త్వరలో మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువస్తాం. ఎవరికీ ఇబ్బంది కలగనివ్వం. – శనిగల మహేష్, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం●రేపు దుకాణాలను టెండర్లు..కాళేశ్వరాలయంలో ఈనెల 30న 11 దుకాణాలకు రెండు సంవత్సరాల కాల వ్యవధితో టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఏడాదికి ఒకసారి నిర్వహించేవారు ప్రస్తుతం రెండు సంవత్సరాలకు నిర్వహిస్తున్నారు. టెండర్లలో 1.బొమ్మలు, గాజులు విక్రయించడం, 2. టెంకాయలు, పూజాసామగ్రి విక్రయించుట, 3. బొమ్మలు, గాజులు విక్రయించుట, 4. స్వీట్హౌస్, 5 పూలు, పూలదండలు విక్రయించుట, 6. కొబ్బరి ముక్కలు పోగుచేసుకునుట, 7. అమ్మవార్ల చీరలు, శేషవస్త్రములు పోగుచేయుట 8, పాదరక్షలు, బ్యాగులు, లగేజీ భద్రపరుచుట, 9, సులభ్ కాంప్లెక్సు నడుపుకునే హక్కు, 10 ఫొటోలు, చరిత్ర పుస్తకాలు విక్రయించుట, 11. భక్తులను ఫొటోలు తీసుకొనే హక్కు కోసం సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించున్నారు. రెండు హోటళ్లు, బేకరికి మరోసారి టెండర్ జరుగనున్నట్లు తెలిసింది. దుకాణదారులు, భక్తులు, అర్చకులకూ.. ఒకటి, రెండుకు బయట పరిసరాలు లేదా ఇంటికి వెళ్లాల్సిందే.. ఉత్సవాలు జరిగే సమయాల్లో చెప్పుకోలేని బాధ దృష్టిసారించని దేవాదాయశాఖ అధికారులు -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
కాటారం: మారుమూల గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ సూచించారు. మహాముత్తారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని పేర్కొన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. సబ్కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
కాళేశ్వరాలయంలో శ్రావణ సందడి
శ్రావణమాసం సోమవారం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రావణశోభ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. గోదావరి మాతను సైకత లింగాలను చేసి పూజించారు. గోదావరిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. స్వామివారి గర్భగుడిలో ద్విలింగాలకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీమహాసరస్వతి అమ్మవార్ల ఆలయాల్లో పూజలు చేశారు. మహిళలు ఉసిరిచెట్టు వద్ద దీపారాధనలు, ప్రదక్షిణలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. ఈఓ మహేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. – కాళేశ్వరం -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: తొలి శ్రావణ సోమవారం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ చెల్లింపు భూపాలపల్లి అర్బన్: ఆసరా పెన్షన్లను ఇక నుంచి ముఖ గుర్తింపు యాప్ ద్వారా చెల్లించనున్న ట్లు డీఆర్డీఓ బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకాలం వేలి ముద్రలు వేసి పెన్షన్ పొందిన పెన్షన్దారులు ఇకపై ముఖ గుర్తింపు హాజరు ద్వారా డబ్బులు అందుకోనున్నట్లు తెలిపారు. ఈ విధానంతో సమ యం ఆదా, అవకతవకలు జరగకుండా పెన్షన్ సక్రమంగా అందనున్నట్లు పేర్కొన్నారు. వేతనాలు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలువేరు ఆశోక్, అయిత తిరుపతి కోరారు. జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2008 సంవత్సరంలో కాంట్రాక్ట్ టీచర్స్గా వివిధ పాఠశాలల్లో నియామకమైనట్లు తెలిపారు. పెండింగ్ వేతనాలు జమచేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. పోలీసుల విస్తృత తనిఖీ పలిమెల: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సోమవారం మండలం కేంద్రంలో పలిమెల ఎస్సై జె.రమేష్ అధ్వర్యంలో వాహనాల తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించే వాహనదారులను ఆపి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వారి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, టీఎస్ఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. -
హెపటైటిస్ను విచ్ఛిన్నం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాలేయంకు సంబంధించిన హెపటైటిస్ వ్యాధిని ముందస్తుగా గుర్తించి విచ్ఛిన్నం చేయాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యారోగ్యశాఖ శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి సూచించారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని పీహెచ్సీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశానికి డాక్టర్ శ్రీదేవి హాజరై మాట్లాడారు. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించి ఉండే వాపు అన్నారు. ఇది వివిధ రకాల వైరస్ల వలన ఏర్పడుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలు చేయడం, వ్యాక్సినేషన్, చికిత్స కోసం ప్రోత్సహించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సురక్షిత నీరు, ఆహారం తీసుకోవడం, హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించుకోవడం, రక్తమార్పిడి ముందు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. దీంతో దీనిని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ రోహిణి, సీహెచ్ఓ సదానందం, సిబ్బంది, ఆశా పాల్గొన్నారు.జిల్లా ఇన్చార్జ్ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి -
వ్యాపారాలే లేవనడం హాస్యాస్పదం
భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యాపారాలే లేవనడం హాస్యాస్పదమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, విదేశాల్లో వెంకటరమణారెడ్డికి ఉన్న వ్యాపారాల చిట్టా త్వరలోనే మీడియా ముందు విప్పుతానని అన్నారు. అక్రమ కేసులు మోపడం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అలవాటని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు సతీష్, శ్రీకాంత్, కురిమిళ్ల శ్రీనివాస్లపై అక్రమ కేసులు మోపి జైలుకు పంపింది మీరు కాదా అని ప్రశ్నించారు. హనుమకొండలో జీఎంఆర్ కట్టడాల కోసం మానేరు ఇసుకను మోరంచపల్లి బ్రిడ్జి వద్ద డంప్ చేసి తరలించింది మీరు కాదా అన్నారు. వెంకటరమణారెడ్డి పదేళ్లు భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉండి చేసిందేమీ లేదని, 18 నెలల్లో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బచ్చా అని, కనీస అవగాహన లేక సీఎం రేవంత్రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పిప్పాల రాజేందర్, అప్పం కిషన్, క్యాతరాజు సాంబమూర్తి, ముంజాల రవీందర్, మధు, తోట సంతోష్ పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న వ్యాపారాల చిట్టా విప్పుతా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
వృత్తి నైపుణ్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
భూపాలపల్లి: వృత్తి నైపుణ్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాల అడ్మిషన్లకు సంబంధించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్యానికి నాణ్యతను అందించే కేంద్రాలు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలన్నారు. యువత జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఆధ్వర్యంలో 2025–26/27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ నూతన కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. ఏటీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రభుత్వ ఏటీసీ భూపాలపల్లి కార్యాలయంలో లేదా 89851 00563 నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యుడు, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేంద్రప్రసాద్, సహాయ కార్మిక అధికారి నారాయణస్వామి, ఆర్డీఓ రవి, భూపాలపల్లి ఏటీసీ ప్రిన్సిపాల్ జుమ్లానాయిక్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి 59 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు నిశితంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి పాల్గొన్నారు. ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు గణపురం: జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎవరైనా కావాలని ఎరువుల కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. గణపురం మండలకేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాముల్లో ఎరువులు, విత్తన స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎరువుల సమస్య వస్తే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 89777 41771, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 78930 98307 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్, మండల వ్యవసాయ అధికారి అయిలయ్య పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించి రైతు కూలీలతో మాట్లాడారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రం, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతీ గురుకులాన్ని సందర్శించి అక్కడి సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ను గెలిపించాలని కార్మికులను కోరారు. కాంగ్రెస్ ఆగడాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. త్వరలోనే జిల్లాకో పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 3,400 పల్లెలను జీపీలుగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసినవాటిని చెప్పుకోవడంలో విఫలం అయినందునే ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. మరోమారు అలా జరుగకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఇంటింటికీ తెలుపాలని సూచించారు. గండ్రకే ఎమ్మెల్యే టికెట్... తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు సోదరుడిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన సభాపతి పదవి ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేబినెట్ హోదాకు సమానమైన శాసన మండలి ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చూసుకుంటారని, ఆయనకే టికెట్ అని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. గండ్ర నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీ సులు అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. గోరీల మీద మాదిరిగా ఇక్కడి ఎమ్మెల్యే శిలాఫలకాలపై ఫొటోలు వేయించుకుంటున్నాడని అన్నారు. తాను భూకబ్జా చేశానని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, నాయకులు కటకం జనార్దన్, గొర్రె సాగర్ పాల్గొన్నారు. గురుకులాలను గాలికొదిలిన ప్రభుత్వం జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. కేసులకు జంకొద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భూపాలపల్లి, ఇస్సిపేట, మొగుళ్లపల్లిలో పర్యటన -
మేడిగడ్డకు పెరిగిన వరద
కాళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరద తాకిడితో గోదావరికి ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది. ఆదివారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో పుష్కరఘాట్లను తాకుతూ నీటిమట్టం దిగువకు ప్రవహించింది. దీంతో కాళేశ్వరం వద్ద 9.070 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి వరదనీరు చేరి 4.40 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలి రాగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరద నీటిని ఔట్ఫ్లోను దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు. -
ఆదివాసీ మారణహోమాన్ని నిలిపివేయాలి
కాటారం: ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్న మారణ హోమాన్ని నిలిపివేసి చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఆదివాసీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కాటారం మండలకేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ 15 నెలల కాలంలో 600 మంది అమాయక ప్రజలను బూటకపు ఎన్కౌంటర్ పేరిట చంపారని విమర్శించారు. ఈ సమావేశంలో వేదిక కోఆర్డినేటర్ గడ్డం లక్ష్మణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగ భూషణం, పీడీఎం రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, మార్వాడి సుదర్శన్, సారంగపాణి, తగరం శంకర్లాల్, ఐతే బాపు, పార్వతక్క పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు భరోసా
కాటారం: ఉపాధి హామీ జాబ్కార్డు కలిగిన కూలీలకు ప్రధాన మంత్రి సురక్ష పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కూలీలతో కొంత ప్రీమియం సొమ్ము చెల్లింపజేసి వారికి బీమా కల్పించేలా ప్రొత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కూలీల్లో బీమా ఉన్నవారు ఎవరు.. లేనివారు ఎవరనే సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. బీమాకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మండల ఉపాధిహామీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. 71ఏళ్లలోపు వారు అర్హులు.. జిల్లాలో మొత్తం 71,120 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా.. ఇందులో 1,32,120 మంది కూలీలు పని చేస్తున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 71 ఏళ్లలోపు వారు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన కూలీలు జాతీయ బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా ఆధార్తో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్లో ఖాతా నుంచి ఏటా రూ.20 బీమాకు జమచేయాలని అంగీకారపత్రాన్ని కూలీలు ఇవ్వాల్సి ఉంటుంది. పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైన ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యం కలిగినా ప్రధాన మంత్రి సురక్ష యోజన పథకం ద్వారా రూ.2లక్షల పరిహారం అందే అవకాశం ఉంటుంది. పాక్షికంగా వైకల్యం కలిగిన వారికి రూ.లక్ష పరిహారం అందుతుంది. సమస్యగా మారిన చెల్లింపు.. ఉపాధి కూలీలకు బీమా చెల్లింపు సమస్యగా మారింది. బీమా నమోదు కోసం లబ్ధిదారులు ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు బ్యాంకులకు దూరంగా ఉండటంతో నిరక్షరాస్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది కూలీలు తమ వేతనాలను సీఎస్సీ కేంద్రాల ద్వారా తీసుకుంటారు. కానీ బీమా పొందాలంటే వేతనదారుడి ఇంటి పేరు, తండ్రి, భర్త, వయస్సు, బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయాలి. వేతనదారుల నుంచి ఉపాధి సిబ్బంది అనుమతి పత్రం సేకరించి బ్యాంకుల్లో అందజేయాలి. ప్రతి రోజు పథకం కింద నమోదైన వివరాలు జిల్లా ఉపాధి కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వందశాతం కూలీలకు బీమా సౌకర్యం కల్పించేలా ఉపాధి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ కూలీకి వర్తింపు.. ఉపాధిహామీ పనులకు వచ్చే ప్రతీ కూలీకి బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఎవరెవరికి బీమా లేదని బ్యాంకుల వద్ద సేకరించి వారికి బీమా కల్పించేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. బీమా ఆవశ్యకతపై కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. – బాలకృష్ణ, డీఆర్డీఓ జిల్లా ఉపాధిహామీ వివరాలు..12241ఉపాధి హామీ బ్లాకులు గ్రామపంచాయతీలు జాబ్ కార్డుల సంఖ్య కూలీల సంఖ్య యాక్టివ్ జాబ్ కార్డులు యాక్టివ్ కూలీల సంఖ్యప్రధాన మంత్రి సురక్ష యోజన బీమా పథకం అమలు బీమా లేని వారిని గుర్తించే పనిలో అధికారులు వందశాతం అమలు చేసేందుకు చర్యలు -
లాభాల వాటా ప్రకటించాలి
భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో సాధించిన లాభాలను వెల్లడించి కార్మికుల వాటా ప్రకటించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లాభాల వాటా గతంలో 33 శాతం ఇచ్చారని, ఈ సారి 35 శాతం ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. త్వరలోనే లాభాల వాటా ప్రకటన వస్తుందన్నారు. కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా యాజమాన్యం కమిటీ వేసిందని త్వరలోనే రిపోర్టు రాగానే కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన పోరాడే ఏకై క సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, రామచందర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రమౌళిలు పాల్గోన్నారు.ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ -
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రంలో ప్రతిభ చాటుతున్నారు. భౌతికశాస్త్రంలో దశావధానం, రసాయనశాస్త్రంలో 12మంది విద్యార్థులు 118 మూలకాలను 15 సెకన్ల కాల వ్యవధిలో, అంతకు తక్కువ సమయంలోనే చెప్పడం అబ్బుర పరుస్తుంది. ఈ రెండు అంశాలను ఇటీవల ఫిజికల్సైన్స్ ఉపాధ్యాయుడు దొనికల రాజేందర్ ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు వీడియోలు, ఫొటోలు పంపించారు. ఆ సంస్థ విద్యార్థుల ప్రతిభను చూసి ఎంపిక చేశారు. దీంతో మంగళవారం ఈ అవార్డుల ప్రదానాన్ని కలెక్టర్ రాహుల్శర్మ చేతులమీదుగా కాళేశ్వరం పాఠశాల ఆవరణలో అందజేయనున్నారని పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం దొనికల రాజేందర్ ఆదివారం తెలిపారు. అధికారుల సూచనలు పాటించాలి భూపాలపల్లి రూరల్: జిల్లాలోని రైతులు అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి బాబురావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలతో మురుగునీరు పొలాల్లో, పత్తి చేలల్లో నిలిస్తే వెంటనే తీసేయాలన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, చెరువులు, కుంటలకు రైతులు దూరంగా ఉండాలని సూచించారు. హైపవర్ వేతనాలు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్ కోరారు. భూపాలపల్లి ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం బీఎంఎస్ డిమాండ్ల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణిలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, కనీసం 50శాతం ఉత్పత్తి వారితోనే చేయించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలతో పాటు సీఎంపీఎఫ్ ఖాతాలు, వైద్య, క్వాటర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎంపీఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్లైన్ చేయాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, పెర్క్స్పై ఐటీ రీయింబర్స్మెంట్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రఘుపతిరెడ్డి, మొగిలి, రాజు, రాజన్న, సాగర్ పాల్గొన్నారు. రూ.3లక్షల ఆర్థిక సాయం రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని నిజాంపల్లి గ్రామానికి చెందిన రాయినేని రాజు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో 2000–01 బ్యాచ్కు చెందిన పదవ తరగతి మిత్రులు ఆదివారం మిత్రుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు కొండ్రా నరేష్, లక్ష్మారెడ్డి, వక్కల వెంకటేష్, లక్ష్మణ్రావు, రాకేష్, కిషోర్, రాంబాబు, గోపి, రమేష్ పాల్గొన్నారు. ఎరుకలకు ప్రాధాన్యం కల్పించాలి కాటారం: రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీ ఎరుకలకు ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. కాటారం మండలకేంద్రంలో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఆదివాసీ ఎరుకల ప్రజలు విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోయారన్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ రిజర్వేషన్లలో ఎరుకల కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతాటి రవికుమార్, కోశాధికారి వనం రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్యాల రాము పాల్గొన్నారు. -
రామప్పలో సండే సందడి
వనదేవతలకు మొక్కులువెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో సండే సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. సూర్యభగవానుడి అలంకరణలో రామలింగేశ్వరస్వామి పర్యాటకులకు దర్శనమిచ్చాడు.ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో శ్రావణశోభ నెలకొంది. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు చేశారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీమహాసరస్వతి అమ్మవార్ల ఆలయాల్లో పూజలు చేశారు. మహిళలు ఉసిరిచెట్టు వద్ద దీపారాధనలు, ప్రదక్షిణలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. -
కలలకు రంగులద్దారు. ఆశలకు జీవం పోశారు. భవిష్యత్కు భరోసా ఇచ్చారు. తిన్నాతినకపో యినా.. అడిగిందల్లా కొనిపెట్టారు. అలాంటి అమ్మానాన్నలు కనిపించే దైవాలు. నేడు (ఆదివారం) జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వారి తల్లిద
జనగామ: నాన్న అబ్దుల్ మజీద్ పోలీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పని చేశారు. అమ్మ షీరీ గృహిణి. పంద్రాగస్టు, జనవరి 26 ఇలా జాతీయ దినోత్సవ కార్యాక్రమాల వేళ నాన్న తన వెంట తీసుకెళ్లేవారు. అప్పుడే కలెక్టర్ కావాలనే తపన కలిగింది. చదువు విషయంలో నాన్న ఎప్పుడు రాజీ పడలేదు. కష్టపడి చదువుకుని ఇన్ఫోసిస్లో ఉద్యోగం సంపాదించా. నాలుగేళ్లు పని చేశా. అయినా తృప్తి లేదు. నాన్నా.. నేను సివిల్ సర్వీసు వైపు వెళ్తా అన్నాను. ‘గో హెడ్’ అన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశా. అంత పెద్ద జాబ్ వదులుకున్నా, మొదటిసారి ర్యాంకు రాకపోయినా.. ప్రోత్సహించారు. నాన్న ఎలాంటి ఒత్తిడి లేకుండా పెంచారు. తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువే. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి, మన భవిష్యత్కు బాటలు వేసే తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పిల్లల జన్మకు సార్థకత అని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు.శ్రమకోర్చి ప్రయోజకుల్ని చేసి.. జీవితాలకు బాటలు వేసిన తల్లిదండ్రులు ఆదర్శంగా నిలుస్తున్న పేరెంట్స్ నేడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం అనుబంధాన్ని పంచుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కంటికి రెప్పలా కాపాడుకోవాలి -
నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం: గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మొదటి దశ 500 మెగావాట్లలో ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన ప్లాంటులోని బాయిలర్ ట్యూబ్ లీకేజీతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు కేటీపీపీ అధికార వర్గాలు తెలిపాయి. మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని త్వరలోనే విద్యుత్ పునరుత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం మల్హర్: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా తాడిచర్ల ఓపెన్కాస్ట్లోకి భారీగా వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓపెన్కాస్ట్లో రోజుకు లక్ష మెట్రిక్ టన్నుల ఓబీ, ఆరు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మైన్ మొత్తం బురదమయంగా మారి వాహనాలు కదలని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీంతో 30వేల మెట్రిక్ టన్నుల బొగ్గు, 5లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయని వెల్లడించారు. పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు మల్హర్: మండలంలోని పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వీరభద్రయ్య ఆదేశించారు. మండల కేంద్రం తాడిచర్లలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను డీపీఓ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా గ్రామాల్లోని ప్రతీ వార్డులో చెత్తాచెదారంతో పాటు మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేయాలని తెలిపారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్రెడ్డి, పంచాయయతీ కార్మికులు ఉన్నారు. నేడు కేటీఆర్ రాక భూపాలపల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నేడు(ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చేరుకొని మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మిసాయి గార్డెన్స్లో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. అనంతరం చిట్యాల మీదుగా జిల్లాకేంద్రానికి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. పరీక్ష ఫీజు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను ఆగస్టు 5వ తేదీలోపు చెల్లించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. గతంలో పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత పొందని వారు, గత సంవత్సరంలో ప్రవేశం పొంది పరీక్ష రాయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.25 అపరాధ రుసుంతో ఆగస్టు 10వ తేదీలోపు, రూ.50 అపరాధ రుసుంతో 15వ తేదీలోపు తత్కాల్ ఫీజుతో 18వ తేదీలోపు ఫీజు చెల్లించాలని కోరారు. బ్యాంకు ఖాతాలను మార్చుకోవాలి భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్న బ్యాంకులకు తమ ఖాతాలను మార్చుకోవాలని ఏరియా అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల బీమా సౌకర్యం కల్పనపై గతంలో వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు 323 మంది బీమా సౌకర్యం కలిగిన బ్యాంకులో ఖాతాలు తీసుకోవాలని కోరారు. -
తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలి
‘సాక్షి’తో వరంగల్ నార్కొటిక్ విభాగ డీసీపీ సైదులుసాక్షి, వరంగల్: మాదకద్రవ్యాల వ్యసనం ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. దీనికి అలవాటుపడిన వారిలో ఎక్కువగా యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులే తప్పుదారి పడుతున్నారు. చెడు స్నేహాలు, ఒకరిని చూసి మరొకరు ఇలా మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఈనేపథ్యంలో తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వరంగల్ నార్కొటిక్ విభాగం డీసీపీ సైదులు ‘సాక్షి’కి శనివారం తెలిపారు. కుటుంబం తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలతో డ్రగ్స్, గుట్కా, గంజాయి, సిగరెట్ మొదలగు చెడు అలవాట్ల వైపు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్మోడల్గా ఉండాలని సూచించారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వ్యసనాలకు అలవాటుపడకుండా చూసుకోవాలని, ఒకవేళ పిల్లలు మాదకద్రవ్యాలకు బానిసలైనట్టు తెలిస్తే వెంటనే నిపుణుల సాయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
● కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మల్హర్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తప్పిదాలకు తావులేకుండా త్వరితగతిన పరిష్కరించా లని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్నా రు. మండల కేంద్రం తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను తహసీల్దార్ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అన్ని దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్ లాగిన్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని తహసీల్దార్కు సూచించారు. అనంతరం గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. యూరియా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలికాటారం: భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుదారులకు నోటీసులు జారీచేసి పరిశీలన పూర్తిచేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ రెవెన్యూ అధికారులకు సూచించా రు. మహాముత్తారం మండలకేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయాన్ని శనివారం సబ్కలెక్టర్ తనిఖీచేశారు. నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ భవనాన్ని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. సబ్కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్రావు, సిబ్బంది ఉన్నారు. -
ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ప్రకటించారు. ఈమేరకు సీఎం, మంత్రులు ఓరుగల్లు అభివృద్ధిపై తరచూ సమీక్షలు చేస్తున్నారు. తాజాగా.. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్లోని అంబేడ్కర్ సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరా జ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్కు, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఓరుగల్లు అభివృద్ధిపై ఆశలు.. మామునూరు ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూసే కరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, రూ.205 కోట్లు విడుదల చేశామని, భూ సేకరణకు గ్రీన్చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి అక్కడ రాజీవ్గాంధీ టౌన్షిప్లో ఆర్–ఆర్ ప్యాకేజీ కింద 1,398 మంది లబ్ధిదారులను గుర్తించి 863 ప్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కాలనీలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వెటర్నరీ హాస్పిటల్, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం నిర్మించాలని, మెగా టెక్స్టైల్ పార్కులో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. 2057జనాభాను దృష్టిలో పెట్టుకొని వరంగల్లో రూ.4,170కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరగా ప్రారంభించాలని, పనులను విభజించుకుని దశల వారీగా చేపట్టాలని మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడి యం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సార య్య, అంజిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మ డి వరంగల్ జిల్లా కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద, రిజ్వాన్బాషా షేక్, వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, ఎస్పీలు శబరీష్, కిరణ్ఖరే పాల్గొన్నారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భద్రకాళి.. భద్రకాళి ఆలయ మాడవీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానని, రోప్వే, గ్లాస్బ్రిడ్జితో సహా అన్ని పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. భద్రకాళి చెరువు ప్రాంతంలో ఇంతవరకు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించామని, రూ.2.06 కోట్ల విలువైన మట్టిని విక్రయించామని అధికారులు వివరించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమి గుర్తించాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్, టెండర్, పనులు ప్రారంభించడానికి, పూర్తిచేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పారు.ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం.. సీఎం, మంత్రుల వరుస సమీక్షలు త్వరలో ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం మెగా టెక్స్టైల్ పార్కు, ‘భద్రకాళి’, ‘స్మార్ట్’ పనుల పరుగులు హైదరాబాద్లో సమీక్షించిన ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు -
వ్యవసాయం చేసి.. కొడుకును అమెరికా పంపారు
టేకుమట్ల: ఈఫొటోలో కొడుకు, కోడలు, మనవళ్లతో ఉన్న వృద్ధ దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూబల శ్రీనివాస్–సరోజన. వీరికి ముగ్గురు కుమారులు.. కాగా పెద్ద కుమారుడు రమేశ్ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తుండగా.. రెండో కుమారుడు వెంకటేశ్ ఎంసీఏ, చిన్న కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఉన్న కొద్ది పాటి భూమిలో సాగు చేసుకుంటూ, మరికొన్ని రోజులు కూలీలుగా పనులు చేస్తూ కుమారులను ప్రయోజకులను చేశారు. కష్టపడి చదివించారు. ఎంసీఏ పూర్తి చేసిన రెండో కుమారుడు వెంకటేశ్ 2008లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. 2012, 2023లో రెండుసార్లు అమెరికాకు తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను తల్లిదండ్రులకు చూపించాడు. -
ఇక.. భూసేకరణ వేగవంతం
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో పరిహారం విషయమై ఇప్పటికే డిస్టిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా నిర్ణయించింది. పాత ఎయిర్ స్ట్రిప్నకు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లు కేటాయించింది. అందుకు పరిపాలన అనుమతుల మంజూరు శుక్రవారం ఇవ్వడంతో ఇక భూసేకరణ వేగవంతం కానుంది. కాగా, 50 శాతంమందికి పైగా రైతులు తమ కన్సెంట్ (అంగీకార పత్రం) తెలపడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే భూసేకరణ జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.205 కోట్లు కేటాయించిన జీఓ ఆధారంగా ఇప్పుడు బడ్జెట్ కేటాయించారంటున్నారు. మూడు జిల్లాలను అనుసంధానించేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూసేకరణ అవసరం. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ దిగి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు ఆటంకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వరంగల్లోనే నేరుగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని భావించింది. అలాగే, ఉత్తర తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్తోపాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు మామునూరు విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించేలా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్–కరీంనగర్ మధ్య 80 కిమీ మేర ఎన్హెచ్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వరంగల్ –ఖమ్మం నేషనల్ హైవే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా లేదు. నల్లగొండ జిల్లా ప్రజలను ఓరుగల్లుతో అనుసంధానించేందుకు వరంగల్–దంతాలపల్లి–సూర్యాపేట వరకు రెండు వరుసల ఎన్హెచ్ ఉంది. దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అలాగే, వరంగల్ నుంచి 15 కిమీ దూరంలో ఉన్న మామునూరుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట నుంచి రేడియల్ రోడ్లు నిర్మించాలి. నగర ఇన్నర్, ఔటర్ రింగురోడ్లను ఎయిర్పోర్టుతో అనుసంధానిస్తారు. పర్యాటకం, ఐటీ పరిశ్రమలకు బూస్ట్.. ● మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మాదిరిగానే భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి భక్తులు, సందర్శకులు పెరుగుతారు. ● టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణలో భాగంగా ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కై టెక్స్ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు ముందుకు వస్తాయి. దీంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. ● మామునూరు సమీప ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది.మరో రూ.112 కోట్లు అవసరమే.. విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. వ్యవసాయ భూమికి రూ.288 కోట్లు్, వ్యవసాయేతర భూమికి రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండగా.. మరోదఫా ప్రభుత్వం రూ.112 కోట్లు అవసరం. భూసేకరణ పూర్తయి, ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే 150 నుంచి 186 మంది ప్రయాణించే ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.మామూనూరు విమానాశ్రయంపై సర్కారు నజర్ తాజాగా 253 ఎకరాల కోసం రూ.205 కోట్లకు పాలనాపరమైన అనుమతులు విమానాశ్రయానికి 50 శాతం మందికిపైగా రైతులు అంగీకారం మరో రూ.112 కోట్లు అత్యవసరం -
మరో పోరాటం తప్పదు
భూపాలపల్లి రూరల్: పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించి మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. పింఛన్ల పెంపు కోసం మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి అధ్యక్షతన శుక్రవారం జిల్లాకేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6 వేలు, ఆసరా పెన్షన్దారులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు అందించాలన్నారు. పెన్షన్దారులకు ఇవ్వాల్సిన రూ.20 వేల కోట్లు ఎవరికి దోచిపెట్టారని ప్రశ్నించారు. పింఛన్లు పెంచడం చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పింఛన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దుమ్ము వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్ర, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు నోముల శ్రీనివాస్, దోర్ణాల రాజేందర్, గాజుల భిక్షపతి, బొల్లి బాబు, అంతదుపుల సురేష్ పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
భూపాలపల్లి: వివిధ మండలాల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు పారదర్శకంగా, బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. జిల్లాకు బదిలీపై వచ్చిన ముగ్గురు ఏపీఎంలు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణతో కలిసి ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఏపీఎంలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రేమ్రాజ్ రేగొండ, పద్మ భూపాలపల్లి, రాజన్నను మహదేవపూర్ మండలానికి కేటాయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల అమలుకు ఏపీఎంలు కృషి చేయాలన్నారు. శాఖాపరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానుకూలంగా సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ బాలకృష్ణ పాల్గొన్నారు. దివ్యాంగుల్లో అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యాలు భూపాలపల్లి రూరల్: దివ్యాంగుల్లో అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉంటాయని అవకాశం కల్పిస్తే ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తారని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మహిళా శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పర్పుల్ ఫెయిర్ 2025కు హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఈఓ రాజేందర్, వాసవి క్లబ్ నుంచి శిరుప అనిల్, తదితరులు పాల్గొన్నారు. సివిల్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ చిట్యాల: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలపై నమ్మకం కలిగేలా వైద్యులు పనిచేయాలని కల్టెకర్ రాహుల్ శర్మ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులతో సమావేశం నిర్వహించారు. వైద్యులు సమయపాలన పాటించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా తిరుమల
కాటారం: కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా కాటారం మండలకేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య సతీమణి పంతకాని తిరుమల నియమితులయ్యారు. చైర్పర్సన్తో పాటు కమిటీని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. వైస్ చైర్మన్గా మండలంలోని బయ్యారానికి చెందిన చినాల బ్రహ్మారెడ్డి, సభ్యులుగా పిల్లమర్రి రమేశ్, రామగుండం శ్రీనివాస్, మహేశ్ తిరుపతిరావు, ఎండీ ఈర్షాద్, ముల్కల్ల శ్రీనివాస్రెడ్డి, గోమాల సడ్వలి, పోత రామకృష్ణ, దాసరి సంతోష్, జాటోత్ రాజరాంనాయక్, పాగె రాజయ్య, ముక్క శ్రీనివాస్, నడిపెల్లి భారతి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఏడీఏ అగ్రికల్చర్, కాటారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరుమల నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలిపారు. -
పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు
కాటారం: ప్రతాపగిరి సమీపంలోని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక చరిత్ర కలిగిన గొంతెమ్మగుట్టను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి తెలిపారు. మహదేవపూర్ ఎఫ్డీఓ సందీప్రెడ్డి, అటవీశాఖ సిబ్బందితో కలిసి శుక్రవారం గొంతెమ్మ గుట్టను ఆయన పరిశీలించారు. గుట్టపై ప్రాంతాన్ని, ఆధ్యాత్మిక, చారిత్రాత్మిక ఆనవాళ్లపై ఆరాతీశారు. శ్రావణమాసంలో గుట్టపైకి భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు జనవరిలో నిర్వహించే గొంతెమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. గుట్టపైకి ట్రెక్కింగ్ ఏర్పాటు, గుట్టపై సోలార్ విద్యుత్, సోలార్ తాగునీటి బోరు, కమాన్ ఏర్పాటు, గ్రామం నుంచి గుట్టపైకి భక్తులు వెళ్లడం కోసం మట్టి రోడ్డు నిర్మాణం, కల్వర్టుల పునఃనిర్మాణం, చేపట్టాల్సిన ఇతరత్రా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మరింత కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎఫ్ఓ వెంట కాటారం ఎఫ్ఆర్ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్లు సురేందర్నాయక్, శ్రీనివాస్, ఎఫ్ఎస్ఓ చంద్రశేఖర్, ఎఫ్బీఓలు సంజీవ్, మోయినోద్దిన్, అశోక్, అర్చన, సిబ్బంది ఉన్నారు.జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి -
శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
–8లోuమధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ కనెక్షన్లు పాఠశాలలన్నింటికీ కనెక్షన్లు ఇటీవల ప్రభుత్వం అన్ని పాఠశాలలకు నాణ్యమైన వంటపాత్రలు అందించింది. గ్యాస్ కనెక్షన్లు కూడా ఇస్తుండటంతో విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆయా మండలాల పరిధిలో స్థానిక ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వంట కార్మికులకు గ్యాస్ సిలిండర్, స్టౌవ్ ఉచితంగా అందిస్తుండగా గ్యాస్ మాత్రం కార్మికులే నింపుకోవాలి. పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చుతున్నాయి.● జిల్లావ్యాప్తంగా 409 పాఠశాలల గుర్తింపు ● ఆగస్టు 15లోగా కనెక్షన్లు పూర్తిచేయాలని ఆదేశం ● రాయితీపై గ్యాస్సిలిండర్ ఇవ్వాలని వినతులుకాళేశ్వరం: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 409 పాఠశాలలను గుర్తించారు. ఆగస్టు 15లోగా అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు వెలుబడ్డాయి. భోజన తయారీలో ఆలస్యం, పొగచూరడం, ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని మధ్యాహ్న భోజన కార్మికులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లావ్యాప్తంగా 430 పాఠశాలల్లో 20వేల మంది విద్యార్థులు, 900మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. 409 పాఠశాలల్లో కట్టెల పొయ్యి మీద వండుతున్నట్లుగా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేసింది. గత నెలలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం కట్టెల పొయ్యితో భోజనం తయారీ వల్ల మహిళా కార్మికులు పడుతున్న బాధలను స్వయంగా చూసింది. పొగ వల్ల కార్మికులకే కాకుండా విద్యార్థులకు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ప్రభుత్వాలకు సూచించగా అమలుకు శ్రీకారం చుట్టారు. గ్యాస్ కనెక్షన్లతో భారంగా మారే అవకాశం ఉందని, రాయితీ కింద గ్యాస్ ఇవ్వాలని వంట వండే మహిళలు కోరుతున్నట్లు తెలిసింది.●న్యూస్రీల్ -
కాళేశ్వరాలయంలో జిల్లా జడ్జి పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని జిల్లా జడ్జి సీహెచ్ రమేష్బాబు గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. అనంతరం ఆయనకు స్వామి వారి శేష వస్త్రాలతో ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ సన్మానించి, తీర్థ ప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు. 29న అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు భూపాలపల్లి అర్బన్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను ఈ నెల 29న అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్–8 నుంచి అండర్–20లోపు బాలబాలికలు, మహిళలు, పురుషులకు పరుగు పందెం, స్టాండింగ్ బ్రాండ్ జంప్, లాంగ్జంప్, జావెలిన్ ట్రెయాతలాన్, షాట్పుట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు సర్టిఫికెట్ ప్రదానం చేసి ఆగస్టు 3న హనుమకొండ, 7న జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షానికి కూలిన ఇల్లు మల్హర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మి ఇల్లు గురువారం కూలింది. మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఇల్లు తడిసింది. దీంతో ఇంటి పై కప్పు భాగం రెండు వైపులా కూలిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇల్లే దిక్కని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. బొగతలో మరమ్మతులు వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద గురువారం మరమ్మతు పనులను చేపట్టారు. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షానికి జలపాతం సమీపంలో ఉన్న రెయిలింగ్, భద్రత కోసం ఏర్పాటు చేసిన కంచె కొట్టుకు పోయాయి. దీంతో గురువారం రేంజర్ చంద్రమౌళి, ఫారెస్టర్ భిక్షపతి, ఎఫ్బీఓ ప్రసాద్ ఆధ్వర్యంలో బొగత సిబ్బంది రెయిలింగ్ మరమ్మతు పనులను చేపట్టారు. -
ఆగస్టు 4 నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సింగరేణి జీవీటీసీలో ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టీఏఎస్కే) శిక్షణ కేంద్రంలో ఆగస్టు 4వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ మురళీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత టెక్నికల్, నాన్ టెక్నికల్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఈ శిక్షణకు డిప్లోమా, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, పీజీ, ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల నిర్వహణ వలన యువతలో నైపుణ్యలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచనున్నట్లు చెప్పారు. వివరాలకు 96184 49360 ఫోన్నంబర్ను సంప్రదించాలని సూచించారు. 108 వాహనం తనిఖీ మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 108 అంబులెన్స్ను 108 జిల్లా మేనేజర్ మేరగు నరేష్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలోని ముందులు, మెడికల్ ఎక్విప్మెంట్స్, రికార్డులు, కండీషన్ను పరిశీలించారు. మూడు నెలల పర్ఫామెన్స్పై సిబ్బందితో నరేష్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108కి ఫోన్ రాగానే మండల ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాస్కర్, పైలెట్ సంపత్ ఉన్నారు. -
నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం
భూపాలపల్లి: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో విద్యా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, డీసీఓలు, ప్రత్యేక అధికారులు, రెసిడెన్షియల్, వసతి గృహాల ప్రిన్సిపాల్లు, ప్రధానోపాధ్యాయులు, తదితర అధికారులతో వసతి గృహాలు, పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం ప్రత్యేక అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. ఆహార నాణ్యతలు పాటించేందుకు ఆహార కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా కౌన్సెలింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూ భారతి దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాటారం డివిజన్లోని పైలెట్ మండలాల్లో అన్ని ఇండ్ల నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు భూ భారతి దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు.. ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పాలన అధికారి పరీక్షను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామని, 38మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్ష జిల్లా కేంద్రంలోని జీవీటీసీ కేంద్రంలో రాత, ప్రాక్టికల్ పరీక్షలను అదే రోజు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు కాటారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్శర్మ హెచ్చరించారు. గారెపల్లి పీఏసీఎస్ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణం, మండల కేంద్రంలోని మరో రెండు ఫైర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. మండలకేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతిగదులు, వంటశాల, స్టోర్ రూం, కూరగాయల నిల్వలు కలెక్టర్ పరిశీలించారు. జీవన జ్యోతి మండల మహిళా సమైఖ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం, చిల్డ్రన్స్ పార్క్ పరిశీలించారు. కలెక్టర్ వెంట సబ్కలెక్టర్ మయాంక్సింగ్, వ్యవసాయ అధికారి బాబు, డీఈఓ రాజేందర్, తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఏడీఏ శ్రీపాల్, ఎంపీఓ వీరస్వామి ఉన్నారు.కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు 90306 32608 కంట్రోల్ రూం నంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. కంట్రోల్ రూం 24 గంటల పాటు పనిచేస్తుందని, ప్రజలు ఏ సమయంలోనైనా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగొద్దు కలెక్టర్ రాహుల్ శర్మ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగొండ: అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక గ్రామంలోని రైతువేదికలో 79మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. బాలయ్యపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు సూరం వీరేందర్, నర్సయ్య, వీరబ్రహ్మం, తొట్ల తిరుపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పర్యావరణ సమతుల్యతను కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: నేటితరం యువత ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఏరియా ఇన్చార్జ్ జీఎం కవీంద్ర తెలిపారు. గురువారం ఏరియాలోని సింగరేణి పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత, జీవావరణ వ్యవస్థను సింగరేణి పరిసర ప్రాంతాల్లో స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఖాళీ స్థలాలు, ఓబీలలో మొక్కలు నాటి సింగరేణి హరిత సింగరేణిగా మారుస్తున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరు తప్పనిసరిగా మూడు నుంచి ఆరుమొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, పోషమల్లు, మారుతి, పాఠశాల ప్రిన్సిపాల్ జాన్సీరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్స్
ఉమ్మడి జిల్లాలో 10 పాఠశాలలు ఎంపిక ఏఆర్, వీఆర్ ల్యాబ్లకు సంబంధించి మోడల్ చిత్రాలు జనగామ : ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలు చేస్తూ ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుస్తోంది. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, కనీస వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. కొత్తగా ఏఆర్(అగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్(వర్చువల్ రియాల్టీ) ల్యాబోరేటరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 పీఎం శ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు. బోధన.. ప్రయోజనాలిలా.. ● ఏఆర్, వీఆర్ ల్యాబ్లతో ఆస్ట్రోనమీ (ఖగోళ శాస్త్రం), రెండవ ప్రపంచ యుద్ధం, గుండె పనితీరు, మానవ శరీరంలోని అవయవాల కదలికలు, నాటి చరిత్రలు (హిస్టరీ) తదితర సబ్జెక్టుల వారీగా బోధన చేసే సమయంలో విద్యార్థులు ప్రత్యక్ష అనుభూతికి లోనవుతారు. ● దిగువ స్థాయి పిల్లవాడినుంచి బాగా చదువుకునే విద్యార్థి వరకు ఏఆర్, వీఆర్ బోధన పరికరాలతో టీచర్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ● విద్యార్థులు గుండె, కణాల నిర్మాణం వాటి విధులు, జీవశాస్త్ర, ఆస్ట్రానమీ లాంటి ఫిజిక్స్, గణిత, గతంలోకి వెళ్లి హిస్టరీ పాఠాలను ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించి వీఆర్ ద్వారా వాటిలోకి ప్రవేశించి స్వీయ అనుభవంతో నేర్చుకుంటారు. ● పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతీ పాఠశాలకు 10 ఏఆర్, వీఆర్ పరికరాలు, ఒక బీన్ బ్యాగ్, ఒక చార్జింగ్ ట్రాలీ, ఒక టాబ్, ఒక టీచర్ సపోర్టింగ్ ట్యాబ్, ఒక స్టోరేజ్ కేస్, 1 కేవీఏ యూపీఎస్ పరికరాలను ల్యాబ్లో అమర్చనున్నారు. ● 5 నుంచి 10 తరగతి వరకు జనరల్ సైన్స్, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాన్ని బోధించడానికి, విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తారు. 5డీ మోడ్లో.... వీఆర్ హెడ్గేర్ రాష్ట్ర పాఠ్యాంశాలకు మ్యాప్ చేసిన కంటెంట్తో లోడ్ చేశారు. దీని ద్వారా విద్యార్థులు ఇంటరాక్టివ్ , 5డీ(ప్రస్తుత టెక్నాలజీ) మోడ్లో పాఠాలను నేర్చుకోగలుగుతారు. గుండె పనితీరును బోధించే సమయంలో ఉపాధ్యాయులు బోర్డుపై హృదయ రేఖాచిత్రాన్ని గీసి చూపించాలి. వీఆర్ ఆధారిత అభ్యాసం విషయంలో హెడ్గేర్ను ఉపయోగించడంతో త్రీడీలో హృదయం తెరపై కనిపిస్తుంది. మనిషి ఆర్గాన్ పనితీరును విద్యార్థులు చూడడంతోపాటు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎం శ్రీ ఎంపిక చేసిన పాఠశాలల్లోనే.. ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన స్కూల్స్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తోంది. పరికరాలు సైతం వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ జారీ చేశారు. మెటీరియల్ వినియోగం, నిర్వహణ కోసం పాఠశాలలోని ఫిజికల్ లేదా బయాలజీ టీచర్ను నియమిస్తారు. ఏజెన్సీ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్ల పరికరాలు వచ్చిన వెంటనే హెచ్ఎంలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. – బొమ్మన బోయిన శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జనగామఉమ్మడి జిల్లాలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లా మండలం ఉన్నత పాఠశాల భూపాలపల్లి భూపాలపల్లి గొల్లబుద్దారం హనుమకొండ ఐనవోలు ఒంటిమామిడిపల్లి హనుమకొండ కాజీపేట మడికొండ జనగామ అర్బన్ ధర్మకంచ మహబూబాబాద్ మహబూబాబాద్ బాలికల మహబూబాబాద్ తొర్రూరు తొర్రూరు మహబూబాబాద్ గూడూరు పొనుగోడు మహబూబాబాద్ దంతాలపల్లి దంతాలపల్లి వరంగల్ నర్సంపేట నర్సంపేట, బాలికల వరంగల్ రాయపర్తి కొండూరు ప్రతీ సబ్జెక్టుతో అనుసంధానం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి -
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
రేగొండ: విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం మండలంలోని మహాత్మజ్యోతిబాపులే పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. గ్రామాలలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీదేవి, డీసీఓ స్వప్న, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల వైద్యాధికారిని హిమబిందు, పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పొంగుతున్న వాగులు, చెరువులు, నదుల్లోకి వెళ్లవద్దని, సెల్ఫీలు, రీల్స్ చేసేందుకు అనుమతి లేదన్నారు. వర్షంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, సెల్ టవర్లు, చెట్ల కింద నిలబడవద్దన్నారు. విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం లేదా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు కంట్రోల్ రూం నంబర్ 90306 32608 కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 87126 58129ను సంప్రదించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జలాశయాల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. -
ముసురు వాన
రెండు రోజులుగా కురుస్తున్న వర్షం● చెరువుల్లోకి చేరుతున్న వరద నీరు ● వాగుల్లో ఇప్పుడిప్పుడే జలకళ ● పలుచోట్ల వాగుల్లో తెగిన తాత్కాలిక రోడ్లు ● రాకపోకలకు అంతరాయం ● సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా వానలు అంతంత మాత్రంగానే కురవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేని వర్షం పడుతుంది. దీంతో వర్షాకాల వాతావరణం కనిపిస్తుంది. వాగుల్లో జలకళ కనిపిస్తుండగా చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. మానేరు వాగులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాశయాల్లో జలకళ.. జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేని వర్షం కురిసింది. ఫలితంగా వారం రోజుల క్రితం వరకు ఎడారిలా తలపించిన చెరువులు వరదనీరు రావడంతో జలకళను సంతరించుకున్నాయి. వాగుల్లో సైతం ఇప్పుడిప్పుడే వరద నీరు పారుతోంది. బుధవారం కురిసిన వర్షానికి టేకుమట్ల మండలం వెలిశాల చెరువు మత్తడి పోస్తుంది. టేకుమట్ల మండలం బూర్నపల్లి–కిష్టంపేట, కలికోట–పెద్దపల్లి జిల్లా ఓడేడు మధ్య గల మానేరు వాగుల్లో తాత్కాలిక రోడ్డు కోతకు గురైంది. దీంతో భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మండలంలోని సోమనపల్లిలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు మినహా చెరువులన్నీ మత్తడి పోసే అవకాశాలు ఉన్నాయి. ఓపెన్కాస్ట్ల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. వర్షం కారణంగా బుధవారం జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్కాస్ట్లో 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్కాస్ట్ 2, 3 ప్రాజెక్టుల్లో ఒక్కరోజే మూడు షిఫ్ట్ల్లో కలిసి 4వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. గోదావరిలో స్వల్పంగా వరద.. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద బుధవారం 5.560 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తుంది. వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి చేరుతుంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. అక్కడ 98,440 క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు విడుదల అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాళేశ్వరానికి ఎగువన ఉన్న మహదేవపూర్ మండలంలోని అన్నారం(సరస్వతీ)బ్యారేజీకి వరద నీరు స్వల్పంగానే వస్తుంది. బుధవారం వర్షాపాతం వివరాలు (మి.మీ) మహదేవపూర్ 47.3 మహాముత్తారం 36.5 కాటారం 32.0 కొయ్యూరు 22.0 భూపాలపల్లి 20.5 మల్లారం 20.3 చెల్పూరు 16.3 కాళేశ్వరం 15.0 టేకుమట్ల 14.5 చిట్యాల 13.5 రేగొండ 12.8 రేగులగూడెం 9.3 తాడిచర్ల 8.8 మొగుళ్లపల్లి 6.0 -
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
భూపాలపల్లి అర్బన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు అంబేడ్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు సొత్కు ప్రవీణ్కుమార్, కుమ్మరి రాజు, జోసెఫ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని, ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్, మణికంఠ, వరుణ్, వికాస్, రాజేష్, అజయ్, పవన్, విష్ణు, హర్షవర్ధన్ పాల్గొన్నారు. -
సీటి, ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు చేయాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీటి స్కానింగ్, ఎంఆర్ఐ సౌకర్యం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆయూష్ ఆస్పత్రి భవనం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులను పరిశీలించారు. మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ వైద్యసేవలు పొందుతున్న రోగులు, బాలింతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి కల్పించాలన్నారు. భవన నిర్మాణాలను వేగవంతంగా చేపట్టి పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్ ఆస్పత్రిని ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సిబ్బందిని నియమించకుండా ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జనార్దన్, సంపత్కుమార్, రఘుపతిరావు, సిద్దు, హరీశ్రెడ్డి, బీబీ చారి, అవినాష్రెడ్డి పాల్గొన్నారు. -
మావోయిస్టుల కదలికలపై నిఘా
కాటారం: మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూ వారికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. మహాముత్తారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీఎస్పీ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు, నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై మహేందర్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సై, సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులను ఛేదించడం, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన పద్ధతులపై డీఎస్పీ వివరించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రొబేషనరీ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.కాటారం డీఎస్పీ సూర్యనారాయణ -
జాప్యం లేకుండా సేవలు
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో వివిధ గనులలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి ఉద్యోగులకు జాప్యం లేకుండా సేవలు అందించాలని ఏరియా పర్సనల్ మేనేజర్ మారుతి తెలిపారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్ల సంక్షేమ అధికారులతో మారుతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు నిత్యం సమాచారం అందిస్తూ, వేగంగా పరిష్కరించాలని సూచించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్ల సంక్షేమ అధికారులు గైర్హాజరవుతున్న వారిని విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి వారినైనా ఉపేక్షించకుండా డిస్మిస్చేసే అవకాశాలు త్వరలో రాబోతున్నాయన్నారు. గైర్హాజరు అవుతున్న ఉద్యోగులకు తెలియజేయాలని, విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు జాప్యం లేకుండా తీసుకునేలా గని మేనేజర్లకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్ మేనేజర్లు గుండు రాజు, క్రాంతికుమార్, అన్ని గనుల సంక్షేమ అధికారులు అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ, మైనారిటీ విద్యార్థులు నూతన, రెన్యువల్ కోసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకానికి.. 2025–26 విద్యా సంవత్సరానికి గాను విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకా నికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షె డ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండవ విడత ఐటీఐ ప్రవేశాలకు.. ఐటీఐ రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్సీవీటీ ప్యాట్రన్ కింద వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేపు పెన్షన్దారుల జిల్లా సదస్సు భూపాలపల్లి రూరల్: ఈనెల 25న జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్హాల్లో పెన్షన్దారుల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబాల చంద్రమౌళి తెలిపారు. సదస్సుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృఫ్ణ మాదిగ హాజరవుతున్నారని.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు, పెన్షన్దారులు హాజరుకావాలని కోరారు. బీజాపూర్ ఎమ్మెల్యే పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారిని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి దర్శించుకున్నారు. ఆయన బుధవారం ఆలయానికి రాగా అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి అభిషేకం నిర్వహించి శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. అనంతరం అక్కడ స్వామివారి శేషవస్త్రాలతో అర్చకుడు రామాచార్యులు సన్మానించి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదం అందజేశారు. ఎంజేపీ పాఠశాల తనిఖీ మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని ఎంజేపీ గురుకుల బాలుర పాఠశాలను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి, హాస్టల్, వంట గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాకాలంలో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా వైద్య పరీక్షలు చేపించాలని సూచించారు. మెనూ పాటించాలని, సరుకుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎరువుల గోదాం తనిఖీ మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎరువుల గోదాంను జిల్లా సహకార అధికారి వాల్యానాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువులకు సంబందించిన వివరాలను పరిశీలించారు. యూరియా విక్రయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. పట్టదారుపాస్బుక్, ఆధార కార్డ్ ద్వారా ప్రతీ రైతుకు రెండు యూరియా బస్తాలు అందించాలని..ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఈఓ అప్పం సాగర్ ఉన్నారు. -
మంత్రులు నిధుల వర్షం కురిపించారు..
భూపాలపల్లి: రాష్ట్ర మంత్రులు భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తున్నారు.. పోతున్నారు.. చేసిందేమీ లేదని, కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు అనడంలో అర్థం లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రుల సహకారంతో గణపురం మండలంలోని గాంధీనగర్లో ఇండస్ట్రీయల్ పార్కు వద్ద రూ.4 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. రూ. 5.50 కోట్లతో చెల్పూరు బస్టాండ్ నిర్మాణం చేపట్టబోతున్నామని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లాకేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రులు ప్రారంభించారన్నారు. కొడవటంచ, బుగులోని జాతర, కోటగుళ్ల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చానని, రూ. 200 కోట్లతో గాంధీనగర్ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ టెండర్ల దశలో ఉందన్నారు. జిల్లా ఆస్పత్రిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేయించానని, సీటి స్కాన్ యంత్రం వచ్చిందని, త్వరలోనే నిపుణుడిని నియమిస్తామన్నారు. వంద రోజుల్లోపు రూ. 9.80 కోట్ల విలువైన ఎంఆర్ఐ మిషన్ను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రూ. 480 కోట్లతో నిర్మించనున్న భూపాలపల్లి బైపాస్ రోడ్డు డీపీఆర్ దశలో ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం లేదని కొందరు అంటున్నారని, గేట్లు తెరిస్తే జిల్లాకు చుక్క నీరైనా వస్తుందా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల రాజేందర్, చల్లూరి మధు, ముంజాల రవీందర్, దాట్ల శ్రీనివాస్, శిరుప అనిల్, తోట రంజిత్ పాల్గొన్నారు. త్వరలోనే జిల్లా ఆస్పత్రికి ఎంఆర్ఐ స్కాన్ మిషన్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఆర్టీసీకి మహాలక్ష్మి కళ
సంస్థకు అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులుఉచిత ప్రయాణంతో మహిళలకు గౌరవం నేను ఔట్సోర్సింగ్ ప్రైవేట్ ఎంప్లాయిని. రోజూ ముల్కనూరు నుంచి హనుమకొండకు వచ్చి వెళ్తాను. జనరల్ పాస్ తీసుకోవడం ద్వారా నెల కు రూ.960 చార్జీలు అయ్యేవి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పుడు నాకు ఆ డబ్బులు మిగులుతున్నాయి. ఉచిత ప్రయాణంతో మహిళలకు ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది. – పావని, ముల్కనూరు, ప్రయాణికురాలు డబ్బులు ఆదా అవుతున్నాయి.. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా డబ్బు ఆదా అవుతోంది. నాకు నెలకు రూ.2వేలు బస్సు చార్జీలు అయ్యేవి. ఇప్పుడు ఈ ఖర్చులు ఆదా అవుతున్నాయి. పేద మహిళలకు ఉచిత ప్రయాణం ఎంతో మేలు చేస్తోంది. – సుమలత, మడికొండ, ప్రైవేట్ ఉద్యోగి మెరుగైన సేవలందిస్తున్నాం.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యంతో ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈమేరకు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం. రద్దీ ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచాం. ప్రయాణికులను సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం. – డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్నేడు అన్ని బస్డిపోలు, స్టేషన్లలో సంబురాలు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిన సందర్భంగా నేడు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ సంబురాలు జరుపుతోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్లోని అన్ని డిపోలు, ప్రధాన బస్ స్టేషన్లలో మేనేజర్లు ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పటికే వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులో క్రమం తప్పకుండా ప్రయాణించే ఐదుగురు మహిళలను ఎంపిక చేసి సన్మానించనున్నారు. వారికి బహుమతులు అందించనున్నారు. ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులను ఆహ్వానించారు. వరంగల్ బస్స్టేషన్లో జరిగే సంబరాల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. ●హన్మకొండ: ఆర్టీసీకి మహాలక్ష్మి కళ సంతరించుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ప్రగతి రథ చక్రాలు పరుగులందుకున్నాయి. గతంలో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు సైతం ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. పథకానికి ముందు 70 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో పథకం అమలయ్యాక 93 శాతానికి పెరిగింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 నుంచి 120 శాతానికి చేరుకుంది. మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో వారి కుటుంబ సభ్యులు (పురుషులు) కూడా ఆర్టీసీలోనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత బస్సు సొమ్మును ఆర్టీసీకి చెల్లిస్తుండడంతో సంస్థ ఆర్థిక లేమి నుంచి క్రమంగా బయటపడుతోంది. వరంగల్ రీజియన్లో ఇలా.. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి నేటి వరకు వరంగల్ రీజియన్లో 15,41,10,000 మంది మహిళలు ప్రయాణించి రూ.688,35,58,000 చార్జీలు ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఉచిత, చార్జీలు చెల్లించిన ప్రయాణికులు మొత్తం 23,98,67,000 మంది ప్రయాణించగా.. రూ.1401,63,14,000 ఆదాయం వచ్చింది. ఇందులో చార్జీలు చెల్లించిన ప్రయాణికులు 8,57,58,000 ఉన్నారు. వీరి ద్వారా రూ.713,27,56,000 ఆదాయం వచ్చింది. మొత్తం ప్రయాణికుల్లో ఉచిత ప్రయాణం చేసిన వారు 64శాతం మంది ఉన్నారు. వీరి ద్వారా ఆర్టీసీకి 49శాతం ఆదాయం వచ్చింది. చార్జీలు చెల్లించిన వారు 36శాతం ప్రయాణించగా వీరి ద్వారా 51శాతం ఆదాయం వచ్చింది. వరంగల్ రీజియన్లోని డిపోల వారీగా ప్రయాణికులు, ఆదాయం వివరాలు (లక్షల్లో)... ఉచిత ప్రయాణంతో 93 శాతానికి పెరిగిన ఓఆర్ ఆర్థికలేమినుంచి బయటపడుతున్న సంస్థ నేడు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో సంబురాలుడిపో మహాలక్ష్మి నాన్ మహాలక్ష్మి ప్రయాణికులు ఆదాయం ప్రయాణికులు ఆదాయం హనుమకొండ 305.68 9658.61 128.93 8351.40 వరంగల్–1 132.63 5541.54 101.14 15325.45 వరంగల్–2 127.35 7818.34 105.23 12972.48 పరకాల 147.91 5920.53 83.28 4221.54 భూపాలపల్లి 144.71 7447.00 77.25 6428.55 జనగామ 226.64 10897.12 112.77 7492.23 మహబూబాబాద్ 138.31 5956.19 68.15 3389.06 నర్సంపేట 173.34 7335.12 98.55 6357.02 తొర్రూరు 144.52 8261.13 82.27 6789.83 -
ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు
భూపాలపల్లి: రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెప్పులు క్యూ లైన్లలో ఉంచే పరిస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భూపాలపల్లికి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీన మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మొగుళ్లపల్లి, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడతారని అన్నారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతు చేయకపోవడంతో కొన్ని వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతుందన్నారు. మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, నాయకులు రఘుపతిరావు, సెగ్గం సిద్ధు, నూనె రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న భూపాలపల్లికి కేటీఆర్ రాక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్, రూ.20 వేల నగదును తిరిగి అందించి కండక్టర్, డ్రైవర్లు మానవత్వం చాటుకున్నా రు. భూపాలపల్లి ఆర్టీసీ బస్సులు మంగళవా రం ఉదయం హైదరాబాద్కు వెళ్తుండగా స్టేష న్ఘన్పూర్లో బస్సు ఎక్కిన ప్రయాణికుడు ఉప్పల్ క్రాస్లో తన బ్యాగ్, అందులో రూ.20 వేల నగదును వదిలి దిగి వెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తిరిగి వస్తు న్న క్రమంలో ఉప్పల్ క్రాస్ వద్ద కంట్రోలర్ సమక్షంలో ప్రయాణికుడికి బ్యాగ్, నగదును కండక్టర్ అనిత, డ్రైవర్ వేణు అందించారు. ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ విజయవంతం భూపాలపల్లి అర్బన్: మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలో నూతనంగా సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ విజయవంతమైనట్లు భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ తెలిపారు. సబ్స్టేషన్లో మంగళవారం 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ను విజయవంతం చేశా రు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల్లో ఓవర్లోడ్ సమస్యను తగ్గించడానికి, వినియోగదారుల కు నాణ్యమైన, నిరంతరం విద్యుత్ను అందించేందుకు నూతన సబ్స్టేషన్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈ, ఏడీఈ, ఏఈ, ఓఅండ్ఎం, ఎంఆర్టీ విభాగాల బృందాలు పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు
ఏటూరునాగారం/మంగపేట/ఎస్ఎస్తాడ్వాయి/ కన్నాయిగూడెం: అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్ఎస్తాడ్వాయి, మంగపేట మండలాల్లో మంగళవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించగా మంత్రి హాజరై మా ట్లాడారు. పదేళ్లుగా ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు చాలా ప్రధానమన్నారు. ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, వ్యక్తిగత బీమా సౌకర్యం, ఇతర అవసరాలకు కూడా రేషన్ కార్డు ప్రధానమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం నుంచి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రేషన్కార్డుల ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని దళారులను నమ్మకుండా నేరుగా మీసేవ కేంద్రాల్లో, సంబంధిత మండల అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మంగపేటలో రేషన్కార్డులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎఫ్ఎస్సీఎస్ కార్యాలయ ఆవరణలో నాబార్డు, డీసీసీబీ వారి సహకారంతో మల్టీసర్వీస్ కోఆపరేటీవ్స్(ఎంఎస్సి) స్కీం ద్వారా రూ 76 లక్షల నిధులతో 1000 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే సామర్ధ్యంతో నిర్మించిన నూతన గోదాంను ప్రారంభించారు. డీసీసీ బ్యాంకు ప్రారంభం ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన బ్యాంకును మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో కలిసి ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
ఒకరోజు శాస్త్రవేత్తలుగా జూకల్ విద్యార్థులు
చిట్యాల: మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంద్రపాల శైలేంద్రనాథ్ (పదవ తరగతి), మామునూరి నిశాంత్(ఎనిమిదవ తరగతి), జంపుల సౌమిత్ (పదవ తరగతి), కౌటం అభిలాష్ (ఎనిమిదవ తరగతి)లు ఒకరోజు శాస్త్రవేత్తలుగా ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల్లో శాసీ్త్రయ దృష్టికోణాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం జిజ్జాస అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ పరీక్షల ద్వారా విద్యార్థులు ఎంపికై నట్ల ఆయన తెలిపారు. నేడు(బుధవారం) కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ –సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎస్ఐఆర్–సీఎఫ్టీఆర్ఐ)లో నిర్వహించనున్న శాస్రవేత్తలతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఈ విద్యార్థులు పాల్గొని ఒకరోజు శాస్త్రవేత్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు.వేలం ఆదాయం రూ.6.46 లక్షలువెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయ ఆవరణలో మంగళవారం కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు వేలం పాటలు నిర్వహించగా రూ.6.46లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా పాట నిర్వహించగా గతేడాది కంటే లక్షా 26 వేల ఆదాయం ఎక్కువగా సమకూరిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలకులు కవిత, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, సిబ్బంది సంతోష్, అవినాష్రెడ్డి పాల్గొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలిరేగొండ: జిల్లాలో బీజేపీ బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నిక సన్నాహక సమావేశాన్ని మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాలని సూచించారు. నాయకులంతా సమష్టిగా పని చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. విలేకరులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, మల్లేష్, శివకృష్ణ, చల్ల విక్రమ్, రాజుకుమార్, రమేష్ పాల్గొన్నారు.30, 31న ఎంఏ తెలుగు ప్రవేశాలకు ఇంటర్వ్యూహన్మకొండ కల్చరల్ : వరంగల్ హంటర్రోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 30, 31వ తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వరంగల్ జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పీఠాధిపతి తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్లు, మూడు పాస్పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు 99891 39136, 99894 17299 నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు.ఏజెన్సీలో భారీవర్షంఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగా రం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో గోదావరి, వాగులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అధికారులు అలర్ట్ చేశారు. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమై వాగుల వద్ద సిబ్బంది గస్తీ ఉండేలా చర్యలు చేపట్టారు. -
భూసేకరణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ భూసేకరణ దిశగా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా డిస్ట్రిక్ట్ లెవల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ నిర్ణయించడంతో దాదాపు సగానికిపైగా మంది రైతులు తమ భూమి ఇచ్చేందుకు సుముఖమంటూ కన్సెంట్ లెటర్లు రెవెన్యూ అధికారులకు అందించారు. ఈనేపథ్యంలో గాడిపల్లి గ్రామానికి చెందిన ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న యజమానులతో ఈనెల 25న అదే గ్రామంలోని వార్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సామాజిక ఆర్థిక సర్వేపై తుది విచారణ ఉంటుందని, సంబంధిత వ్యక్తులంతా హాజరుకావాలంటూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి మంగళవారం నోటీస్ జారీ చేశారు. భూమి, ఇళ్లు కోల్పోయిన యజమానులకు సరైన పరిహారం చెల్లించడానికి ఈచట్టంలోని సెక్షన్ 16(4), 16(5) సెక్షన్ల కింద ఏర్పాటు చేసిన ఈగ్రామసభలో ఏమైనా సందేహాలు, సూచనలుంటే తెలపాలని అందులో కోరారు. విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 61,134.5 చదరపు గజాల వ్యవసాయేతర భూమితో పాటు 12 మంది ఇళ్లు కోల్పోతున్నారు. ఇప్పటికే భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరంగల్లో పర్యటించిన కేంద్ర రైల్వేమంత్రి ఆశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వగానే మామునూరు విమానాశ్రయ నిర్మాణ కేంద్రం ప్రారంభిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కటి కొలిక్కి వస్తూ... 2024 డిసెంబర్ 1న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. పరిహారం, భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో పారదర్శకత హక్కుల చట్టం, 2013లోని సెక్షన్ 11(1) ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరిస్తోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పలుదఫాలుగా సమావేశమైన డిస్ట్రిక్ట్ లెవల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ ఈ ఏడాది జూన్ 5న వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,887గా నిర్ణయించారు. ఇంతకుమించి పెంచేది లేదని ఎకరాకు రూ.65 లక్షలకే నిర్ణయించాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సెంట్) అవార్డు కింద రూ.1.20 కోట్లు వరకు నిర్ణయించామని కలెక్టర్ సత్యశారద తేల్చి చెప్పడంతో 50 శాతానికిపైగా మంది తమ కన్సంట్ను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఆగస్టులోపు మిగతా రైతులంతా తమ అంగీకారాన్ని తెలుపుతారని అధికారులు భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశపడుతున్నా, చివర్లో వారు కూడా ఇచ్చే అవకాశముంది. ఒకవేళ అంగీకరించకపోతే జనరల్ అవార్డు కింద వారి భూమి సేకరిస్తామని, వారు కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి అన్నారు. మామునూరు విమానాశ్రయం కోసం ఇప్పటికే భూముల ధర ఫైనల్ ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న వారితో 25న గ్రామసభ ఖిలావరంగల్ మండలం గాడిపల్లిలో సామాజిక ఆర్థిక సర్వే విచారణ 50 శాతానికిపైగా రైతులు కన్సెంట్ ఇచ్చారంటున్న రెవెన్యూ అధికారులు -
నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి: నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. నానో యూరియా వినియోగం, ఎరువులు సక్రమ సరఫరాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, సహకార సంఘాల సీఈఓలు, ఇన్పుట్ డీలర్లతో ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నానో యూరియాతో మొక్కల పెరుగుదల బాగా ఉంటుందని, కావాల్సిన పోషకాలు అందుతాయన్నారు. ఫీల్డ్ డెమో, గ్రామ సభల ద్వారా నానో యూరియా ప్రయోజనాలు రైతులకు తెలియజేయాలని సూచించారు. యూరియా వ్యవసాయానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, సమృద్ధిగా నిల్వలు ఉన్నాయన్నారు. ఎరువుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 89777 41771 లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 78930 98307 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నరేష్కుమార్, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి బాబు, సహకార అధికారి వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు. రేషన్కార్డులు పంపిణీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని, విచారణ, పెండింగ్ ఉన్న దరఖాస్తులు క్లియర్ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, సీఎస్ రామకృష్ణా రావులు మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడుతూ.. మహిళల ఉచిత బస్సు పథకంపై బస్డిపోలో వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. భూమాత దరఖాస్తుల విచారణలో వేగం పెంచాలని ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
గోదావరి ముంపు ప్రాంతం పరిశీలన
వాజేడు: సరిహద్దులోని గోదావరి ముంపు ప్రాంతాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని పేరూరు పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు స్టేషన్ సెక్యూరిటీకి సంబంధించి పలు వివరాలు సూచించారు. అనంతరం మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం చివరన రేగు మాగు ఒర్రె వద్ద గోదావరి ముంపునకు గురయ్యే ప్రదేశాన్ని సందర్శించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా కట్టు దిట్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ఏఎస్పీ వెంట వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
డంపింగ్ యార్డుగా కేన్ప్రాంతం
వెంకటాపురం(ఎం): తెలంగాణ రాష్ట్రంలోనే అరుదుగా లభించే కేన్ మొక్కల రక్షిత ప్రాంతం అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డుగా మారుతుందని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ఆరోపించారు. సోమవారం పరిశోధక బృందంతో కలిసి ఆయన మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజలు అవగాహన లోపంతో కేన్ ప్రాంతంలో వ్యర్థ పదార్థాలు, చెత్త వేస్తూ డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కేన్ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా కేన్ ప్రాంతంలో అటవీ సంబంధ దేశీయ మొక్కలను నాటే విధంగా కృషి చేయాలని ఉన్నతాధికారులను సతీష్ కోరారు. -
శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి
భూపాలపల్లి రూరల్/రేగొండ: శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి పోలీస్స్టేషన్, జిల్లా గంథ్రాలయం, వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కేంద్రాలు యువత తమపై తాము ఆధారపడేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. సింగరేణి, జెన్కో వంటి ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు ఈ కేంద్రాలు ఉపాధి కల్పన వేదికగా నిలవాలని చెప్పారు. యువతకు స్కిల్ శిక్షణ కార్యక్రమాలు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతకు స్కిల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం కలిగిన యువతకు బహుళ జాతి సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, టాస్క్ ద్వారా 50 పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు సింగరేణి, విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అంతకుముందు కొత్తపల్లిగోరి మండలానికి మొదటి ఎస్సైగా సాకపురం దివ్య మంత్రుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకేంద్రంలోని భాస్కర గడ్డలో రెండు పడక గదుల ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించారు. నూతన బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, తహసీల్దార్లు లక్ష్మిరాజయ్య, శ్వేత, ఎంపీడీఓ వెంటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. యువతకు ఉపాధి కల్పన ధ్యేయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జర్నలిస్టుల నిరసన– వివరాలు 8లోu– వివరాలు 9లోu -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ గతంలో కేవలం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసివేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడమిక్ మానిటరింగ్ కమిటీలు, డీఐఈఓలతో పాటు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ద్వారా సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా.. గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దాంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒకరోజు రాకుంటే ఆ పీరియడ్లో వేరే అధ్యాపకుడు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది.హనుమకొండ 9 వరంగల్ 11 భూపాలపల్లి 5మహబూబాబాద్ 10జనగామ 7ములుగు 8ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల సంఖ్య ఇలా..నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఒక్కో జూనియర్ కళాశాలకు 14 నుంచి 16 వరకు కేటాయింపు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్ సౌకర్యం, ఫిజిక్స్వాలా శిక్షణఫిజిక్స్వాలా శిక్షణపై.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిజిక్స్వాలా ద్వారా సంబంధిత వెబ్సైట్ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్సెట్, నీట్లాంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజిక్స్వాలా శిక్షణకు సంబంధించిన టైంటేబుల్ను డీఐఈఓల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించారు. ప్రతిరోజూ ఏదో ఒక సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ల్యాప్ట్యాప్లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్ప్లాంట్స్ టేబుల్స్ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్ మానిటర్లో వెబ్సైట్ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణకు ప్రతీజిల్లాకు ఒకరి చొప్పున ఇన్చార్జ్లను నియమించారని సమాచారం. అలాగే డీఐఈఓలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈఓ కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక టెక్నీషియన్ చొప్పున నియమించారు.నిరంతర పర్యవేక్షణతో విద్యాబోధన మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడుతుంది. విద్యార్థుల హాజరు పెరగడంతోపాటు అధ్యాపకులు విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రయోగాలు చేయడం, టైంటేబుల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జిల్లాల్లో డీఐఈఓలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నిఘా ఉండి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తారు. – శ్రీధర్సుమన్, వరంగల్ డీఐఈఓ -
25నుంచి రేషన్కార్డుల పంపిణీ
భూపాలపల్లి: జిల్లాలో రేషన్కార్డుల పంపిణీపై సమావేశం నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీకి అన్ని మండలాల వారీగా షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు. మంగళవారం నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తన దుకాణాల్లో తప్పనిసరిగా స్టాకు బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయాఽధికారి బాబు, ఇరిగేషన్ ఈఈలు తిరుపతిరావు, ప్రసాద్, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
సాగు సగమే..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వర్షభావంతో సాగు ఇప్పటివరకు సగానికే పరిమితమైంది. జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించి 2,06,469 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు కేవలం 1,01,387 ఎకరాలు సాగైంది. అంచనాలకు మించి సాగులోకి వస్తుందని భావించిన పత్తి సైతం 97,870 ఎకరాల్లోనే సాగైంది. ఈనెల 15తో విత్తు గడువు ముగిసింది. ప్రధాన పంట వరి 1,12,218 ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా వేయగా ప్రస్తుతానికి 3,231 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. మరో 1,08,987 ఎకరాల్లో వరి నారు సిద్ధంగా ఉంది. మొక్కజొన్న 87 ఎకరాలు సాగు చేయగా, కంది 21 ఎకరాలు, పెసర్లు 85 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. వరి రైతుల్లో దిగులు.. జిల్లాలో వరి సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. ఈసారి వరి అంచనాలకు మించి 1,12,218 ఎకరాల్లో సాగులోకి వస్తుందని భావిస్తే ఇప్పటివరకు భారీ వర్షాలు లేకపోవడం రైతులను కుంగదీస్తుంది. ఎక్కడా కూడా చెరువులు, కుంటల్లో నీరులేకపోవడం కూడా కలవరానికి గురి చేస్తుంది. నారుమడులు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయడానికి రైతులు వెనకంజ వేస్తున్నారు. భారీ వర్షాలు వచ్చి ఉంటే బోరుబావుల్లో భూగర్భజలాలకు ఢోకా ఉండేది కాదు. భూగర్భజలాలు తగ్గి బోర్లు కూడా సన్నగా పోస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈసారి రైతులు వరి సాగును తగ్గుంచుకునే ఆలోచనలో ఉన్నారు. భారీ వర్షాలు వచ్చి ఉంటే బోరుబావుల్లో భూగర్భ జలమట్టానికి ఢోకా ఉండేది కాదు. బోరు బావుల్లో నీరు తగ్గడం.. మరోవైపు వర్షాలేక సాగును తగ్గించుకునే ఆలోచనలో రైతులు ఉన్నారు. భారీ వర్షాలొస్తే తప్ప సాగు స్వరూపం మారే అవకాశం కనిపించడం లేదు.2.06 లక్షల ఎకరాల అంచనా ఇప్పటివరకు సాగైంది.. 1,01,387 ఎకరాలు వరి నాట్లు కేవలం 3,231 ఎకరాల్లోనే.. వర్షాభావంతో అంతంతమాత్రమేఈ ఫొటోలోని రైతు గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మాసం రాకేష్. గ్రామంలో ఐదెకరాలకు 1224 సన్న రకం ధాన్యానికి సంబంధించి నారు పోసుకున్నాడు. వర్షం కురిస్తే నాట్లు వేద్దామని ఎదురుచూస్తున్నాడు. వర్షాలు లేకపోవడంతో నారు ముదిరిపోతుందని రాకేష్ ఆందోళన చెందుతున్నాడు. బోరునీరు సరిగా రాకపోవడంతో పక్కన ఉన్న వారి బోరుతో నారుమడికి నీరుపెడుతున్నాడు. మరో పదిరోజులు వర్షాలు కరువకుంటే నారు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో చాలామంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది.ఆగస్టు 15వరకు నాట్లు వేసుకోవచ్చు.. వాతావరణ శాఖ సూచనలతో త్వరలోనే మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెట్ట వంటల సాగు ప్రస్తుతం జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా వస్తే వరి సాగుకు ఇబ్బంది ఉండదు. ఆగస్టు చివరివరకు వరి నాట్లు వేసుకోవచ్చు. – బాబురావు, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి24.1మి.మీ.ల లోటు వర్షపాతం.. వానాకాలం సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో లోటు వర్షపాతమే నమోదవుతుంది. జూలైలో ఇప్పటివరకు 211.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 108.6 మిల్లీమీటర్లు నమోదైంది. 24.1 మిల్లీమీటర్లు లోటు వర్షపాతం నమోదైంది. సగానికి పైగా మండలాల్లో సరైన వర్షం లేక సరిగా పత్తి గింజలు మొలకెత్తలేదు. రెండేసి సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటలకు అనుకూలంగా మారాయి. -
పుస్తకాల మోత
పెరిగిన పుస్తకాల బరువు.. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు 75వరకు ఉండగా, వాటిలో సుమారు 15వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో ఒకప్పుడు ఆరు సబ్జెక్టులకు ఆరు నోట్బుక్స్తో పాటు ఒక రఫ్ బుక్ ఉండేది. ఇప్పుడు సబ్జెక్టుకు ఒక రఫ్ బుక్తోపాటు గైడ్లు, డ్రాయింగ్, స్క్రాప్ బుక్స్, రికార్డులు, డైరీలు స్కూల్ బ్యాగుల్లో కిలోల కొద్ది పుస్తకాలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 6నుంచి 12 కిలోల బరువైన బ్యాగులు.. ఉన్నత పాఠశాలల విద్యార్థులు 12నుంచి 17కిలోల బ్యాగులను ప్రతి రోజు వీపు మీద మోస్తున్నారు. రోజు ఇంతింత బరువులు మోయడం, ఒకటి, రెండు అంతస్తుల మోడలు ఎక్కి క్లాస్రూం వరకు వెళ్లడం కారణంగా చాలామంది పిల్లలు వెన్నునొప్పి, జాయింట్ పెయిన్స్ బారిన పడుతున్నారు. ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు ● సొంత సిలబస్తో బరువెక్కుతున్న బ్యాగులు ● అధిక బరువు బ్యాగులతో వంగిపోతున్న విద్యార్థులుభూపాలపల్లి అర్బన్: బాల్యం భవిష్యత్పై పుస్తకాల భారం పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ సొంత సిలబస్తో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ సంఖ్య మోతెక్కిస్తున్నాయి. దీంతో బ్యాగుల బరువు మోయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలకు తోడు టిఫిన్బాక్స్, వాటర్బాటిల్, బూట్లు తదితర వస్తువులు మరింత భారంగా మారుతున్నాయి. పిల్లల బాధ చూడలేక చాలామంది తల్లిదండ్రులు పాఠశాల వరకు బ్యాగులు మోసుకెళ్లి దిగబెట్టి వస్తున్నారు. పుస్తకాల బరువుపై ప్రభుత్వం ఐదేళ్ల క్రితం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఈ విద్యాసంవత్సరం కూడా గత విద్యాసంవత్సరం లాగే కొనుగోలు చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ జాబితాను అప్పగించి బలవంతంగా కొనుగోలు చేయించారు. ప్రభుత్వ మార్గదర్శకాలివే.. చిన్నారులకు కిలోల కొద్ది బ్యాగుల మోతను తగ్గించేలా రాష్ట్ర విద్యాశాఖ 2020 సంవత్సరంలో మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం ఒకటి, రెండో తరగతుల పుస్తకాల బరువు బ్యాగుతో సహా 1.5 కిలోలు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతుల పిల్లల బ్యాగులే సుమారు 4నుంచి 8 కిలోల బరువు ఉంటున్నాయి. మూడు, నాలుగు, ఐదు తరగతులకు 3 కిలోలు, ఆరు, ఏడు తరగతులకు 4 కిలోలు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు నాలుగున్నర నుంచి ఐదు కిలోల వరకు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఒక్కో తరగతికి 30 పుస్తకాలపైనే.. జిల్లాలో పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రైమరీకి 15నుంచి 25 పుస్తకాలు ఉండగా హైయర్లో 30 పుస్తకాలకు పైగా ఉన్నాయి. కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతిలో 32 రకాల పుస్తకాలను పాఠశాలలోనే ఇచ్చారు. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, డ్రాయింగ్, స్టోరీ, డైరీ, ఇతర వర్కుబుక్లను ఇచ్చారు.అమలు చేయాల్సిందిలా.. ఆరు, ఏడు తరగతులకు మూడు లాంగ్వేజ్ బుక్స్తో పాటు గణిత, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, సహా మొత్తం ఆరు పుస్తకాలే ఉండాలి. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు ఈ ఆరు పుస్తకాలతో పాటు జీవశాస్త్త్రం కలిపి ఏడు పాఠ్యపుస్తకాలు ఉండాలి. ప్రతీ సబ్జెక్టుకు 200 పేజీల నోట్బుక్ మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎఫ్ఏలకు, స్లిప్టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా రోజు తీసుకురావాల్సిన అవసరం లేదు. పాఠ్యాంశాల చివరన ఉన్న ఎక్సర్సైజ్లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్లను కేటాయించాలి. ఆరు నుంచి పదో తరగతుల విద్యార్థులకు హోంవర్క్ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు కేటాయించేలా ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టుకు ఏ రోజు అనేది ఉపాధ్యాయులు ఏయే పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్ తెచ్చుకోవాలో టీచర్లు ముందుగానే చెప్పాలి. స్టేట్ సిలబస్ను అమలుచేసే అన్ని పాఠశాలలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్ణయించిన పుస్తకాలనే వినియోగించాలి. అంతకుమించి అదనపు పుస్తకాలేవీ ఉపయోగించకూడదు. -
పులకించిన హేమాచల క్షేత్రం
మంగపేట : మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సుదూర ప్రాంతాల నుంచి స్వయంభూ లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో హేమాచలక్షేత్రం పులకించింది. ఆది, సోమవారాలు రెండు రోజులు సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఏజెన్సీలోని లక్నవరం, బొగత తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రామప్ప, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిల తైలాభిషేకం పూజలు జరిపించి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి కై ంకర్యాదులు నిర్వహించారు. మూడు గంటల పాటు వేచి ఉండి మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభూ స్వామవారి అభిషేక పూజలో పాల్గొని ఆలయ చరిత్ర, స్వామివారి ప్రత్యేకతను తెలుసుకుని పులకించారు. అనంతరం సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన దంపతులతో పాటు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. పూజారులు ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
భద్రకాళికి ఆలయంలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, కన్స్ట్రక్షన్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏకే సిన్హా దంపతులు, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ డి.సుబ్రమణియన్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈఓ శేషుభారతి వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయ ప్రాంగణంలో ఈఓ శేషుభారతి మొక్కలు నాటారు. -
వడ్డీ బకాయిల విడుదల
గీసుకొండ: బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్న సెర్ప్ పొదుపు సంఘాల మహిళలకు రెండు నెలల వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలను చేపడుతుండగా తాజాగా వడ్డీ బకాయిల చెల్లింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సకాలంలో వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల వడ్డీ నిధులు మంజూరు చేయలేదు. విడుతల వారీగా చెల్లింపులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023–24 సంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల బకాయిలను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు పది నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 48,717 సంఘాలకు రూ.92.74 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అలాగే, ఇటీవల ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు సంబంధించి ఎస్హెచ్జీలు 50,372 ఉండగా వారికి వడ్డీ కింద రూ.20.27 కోట్లను మంజూరు చేయడంతో పొదుపు సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి ఊతం.. మహిళా సంఘాల్లోని సభ్యులు బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్)తో ఆర్థికంగా ఎదగటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలువురు చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లను నెలకొల్పుతున్నారు. క్యాంటీన్ల ఏర్పాటు, పెరటికోళ్ల పెంపకం, గేదెల పోషణ, కిరాణం, క్లాత్స్టోర్లు, టైలరింగ్, సానిటరీ న్యాప్కిన్ల తయారీ తదితరాలను ఎంచుకుని ఆదాయం పొందుతూ చిన్నపాటి పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. అలాటి వారికి వడ్డీ బకాయిలను సకాలంలో అందిస్తే మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రత్యేక మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సంఘాల వారు ఆర్టిఫీషియల్ జ్యూయలరీ, పౌల్ట్రీ, డైరీ తదితర రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పాత బకాయిల చెల్లింపు ఊసేలేదు.. ఇది ఇలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాం నుంచి వడ్డీ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే గత బీఆర్ఎస్ సర్కారు కాలంలో పేరుకుపోయిన భారీ మొత్తంలోని బకాయిల గురించి ఎవరూ ఊసెత్తడం లేదు. అటు అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో అయోమయం నెలకొంది.ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు విడుదలైన వడ్డీ బకాయిలు ఎస్హెచ్జీలకు రెండు నెలల వడ్డీని మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 50,372 సంఘాలు రూ.20.27 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమజిల్లా పేరు లబ్ధిపొందిన వచ్చిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) వరంగల్ 9,669 4.32 హనుమకొండ 8,600 3.86 జనగామ 9,216 3.41 మహబూబాబాద్ 11,552 4.51 ములుగు 5,308 1.92 జయశంకర్ భూపాలపల్లి 6,027 2.25 -
నేడు మంత్రుల పర్యటన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో నేడు(సోమవారం) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్లపల్లిగోరి పోలీస్స్టేషన్ ప్రారంభం, గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో బస్స్టాండ్ పనులకు శంకుస్థాపన అనంతరం గ్రామంలో సభ ఉంటుందన్నారు. భూపాలపల్లి భాస్కర్గడ్డలో డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి, అనంతరం ఎస్పీ కార్యాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా గ్రంథాలయం ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. మంత్రులతో పాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొంటారని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, బుర్ర కొమురయ్య, చల్లూరి మధు. బట్టు కరుణాకర్, ఆకుల మహేందర్, శిరుప అనిల్, ముంజాల రవీందర్, కురిమిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో అర్హులైన అధ్యాపకులను నియమించినట్లు తెలిపారు. ఈ సబ్జెక్టులలో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు పూర్తి బయోడేటా, ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 23వ తేదీలోపు డిగ్రీ కళాశాలలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు. చిట్యాలను నియోజకవర్గం చేయాలి చిట్యాల: భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలకేంద్రాన్ని పునర్విభజనలో భాగంగా చిట్యాలను కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని గొర్ల, మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సకినాల మల్లయ్య కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తాలుకాగా పేరుగాంచిన చిట్యాల మండలంలో సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు అరుదైన స్థలం భౌగోళికంగా నియోజకవర్గానికి సరిపడే వసతులు ఉన్నాయని చెప్పారు. చిట్యాలకు సమీప మండలాలైన టేకుమట్ల, మొగుళ్లపల్లి , రేగొండ, కొత్తపల్లిగోరిని కలుపుకుని నూతన నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని మల్లయ్య కోరారు. టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రొడ్డ రవి భూపాలపల్లి అర్బన్: ది కాకతీయఖని టిప్పర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భూపాలపల్లి అధ్యక్షుడిగా రొడ్డ రవీందర్ ఎన్నికయ్యారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కమిటీని నియమించారు. ఉపాధ్యక్షుడిగా జాడి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కుప్పాల ప్రభాకర్, సహాయ కార్యదర్శిగా బొమ్మన తిరుపతి, కోశాధికారిగా కుసుమ రమేష్, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, మధుకర్రెడ్డి, కుమార్, కుమారస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 25న మంద కృష్ణమాదిగ రాక చిట్యాల: దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈనెల 25న జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీస్ జిల్లా ఇన్చార్జ్ రుద్రారం రామచంద్ర మాదిగ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో–ఇన్చార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ, మండల అధ్యక్షుడు దొడ్డి శంకర్ మాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల వంశీ కృష్ణ, ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నేరేళ్ల ఓదేలు పాల్గొన్నారు. వాహనాల తనిఖీ వెంకటాపురం(కె) : మండల పరిధిలోని బోదాపురం గ్రామశివారులో ఆదివారం ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. మండల కేంద్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వచ్చి వెళ్లే వాహనాలు, వాజేడు మండలం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారస పడితే వారి నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నారు. తనిఖీల్లో పీఎస్సై సాయికృష్ణ, సీఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు. 23 నుంచి కేయూ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 23, 25, 28, 30, ఆగస్టు ఒకటి, నాలుగో తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. -
చెస్తో మేధస్సు పెంపొందుతుంది
భూపాలపల్లి అర్బన్: చెస్ ఆడటం వలన మేధస్సు పెంపొంది సహనం, ఓర్పు వస్తుందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెస్ పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి ప్రకాశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడారు. చెస్ క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పంతకాని సమ్మయ్య, రవిపటేల్, మహేష్, ఆసిఫ్, మురళి, ప్రకాశ్, శ్రీరాములు, రామనారాయణ పాల్గొన్నారు. -
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్, పారదర్శక సేవలకు ఈ–సైన్తో రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొనసాగించే జిల్లా రిజిస్ట్రార్లకు ఏడాదిలోపే స్థానచలనం కల్పించింది. పదోన్నతులకు బ్రేక్.. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతులు కల్పించడంలో జాప్యం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా జిల్లా రిజిస్ట్రార్ స్థానంలో అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగుతోంది. కాగా, ఒక్కో జిల్లా రిజిస్ట్రార్ రెండు మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో బదిలీ అయిన ఫణీందర్ హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్గా ఆఫీస్ డ్యూటీలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని గతంలో విధులు నిర్వర్తించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు, వివిధ జిల్లాలకు చెందిన గ్రూప్–1 అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పదోన్నతులకు బ్రేక్ పడింది. త్వరలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ! ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతేడాది ఆగస్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అటెండర్ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీలు అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధ్యతలను స్వీకరించి లాంగ్ లీవ్లోకి వెళ్లిపోయిన సబ్ రిజిస్ట్రార్లు, సహాయ రిజిస్ట్రార్ చిట్స్లు అనగా స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఆర్వో చిట్స్ కార్యాలయంలోని అధికారులతోపాటు వరంగల్ ఆర్వోకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు సైతం స్థానచలనంలో భాగంగా నేడో రేపో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, మేరా నంబర్ ఆయేగా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకోవడం గమనార్హం. డేంజర్ జోన్లకు వెళ్లేందుకు జంకుతున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్తోపాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డేంజర్ జోన్లుగా మారిపోయాయి. ట్రాన్స్ఫర్ ఓకే కాని డేంజర్ జోన్లకు వద్దు అంటూ తలలు పట్టుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. పదోన్నతులు లేక ఇన్చార్జ్లతోనే పాలన నేడో రేపో సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం -
మరో పోలీస్ సర్కిల్
భూపాలపల్లి: జిల్లాలో మరో కొత్త పోలీస్ సర్కిల్ ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం మహదేవపూర్, కాటారం, చిట్యాల సర్కిళ్లు ఉండగా కొత్తగా గణపురం సర్కిల్ ఏర్పాటు కానుంది. చిట్యాల సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి పోలీస్స్టేషన్లు ఉన్నాయి. కాగా ఈ సర్కిల్ పరిధి పెద్దగా ఉన్నందున, విభజించి గణపురం, రేగొండ, కొత్తగా ప్రారంభం కానున్న గోరికొత్తపల్లి పోలీస్స్టేషన్లను కలిపి గణపురం సర్కిల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే జిల్లాలో నాలుగవ సర్కిల్ ఏర్పాటు కానుంది. ● చిట్యాలను విభజించి గణపురం సర్కిల్ ఏర్పాటు -
ఉపాధి అవకాశాలపై ఆశలు
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ఫ్యాక్టరీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80శాతం పూర్తికావొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో స్థానిక యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అనేక ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోపాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. శనివారం రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ను సందర్శించనున్నారు. వ్యాగన్షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్.. కాజీపేట మండలం అయోధ్యపురంలో 160 ఎకరాల్లో సుమారు రూ.786 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టారు. 2023 జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ సుబేదారి ఆర్ట్స్కాలేజ్ గ్రౌండ్లో నుంచి కాజీపేట వ్యాగన్షెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట రైల్వే మల్టీపుల్ యూనిట్గా ప్రకటన చేసి మంజూరు చేశారు. రీ డిజైనింగ్ చేసి జపాన్ టెక్నాలజీతో మల్టీపుల్ యూనిట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో వ్యాగన్, కోచ్, వందేభారత్, ఎల్హెచ్బీ, మెము కోచ్లు తయారు చేయనున్నారు. 80శాతం పూర్తయిన విభాగాలు.. యూనిట్లోని మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్టు, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్/పంప్హౌజ్, టాయిలెట్ బ్లాక్స్, ప్యాకేజీ సబ్స్టేషన్, షవర్ టెస్ట్, రోడ్వే బ్రిడ్జి, పంప్హౌజ్/జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్ట్/ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, పాండ్, (2000 కేఎల్ కెపాసి టీ), స్క్రాప్ బిన్స్ పనులు 80శాతం పూర్తయ్యాయి. పెండింగ్ పనులు.. రైల్వే కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మాణం, కోచ్ల తయారీకి షెడ్లలో మిషనరీ ఫిట్టింగ్, కనెక్టివిటీ రోడ్లు, ఎంట్రెన్స్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం, ఇతరత్రా సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో యూనిట్ను ప్రారంభిస్తామని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. వీటిపై దృష్టిపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పంజాబ్ మాదిరి ఉద్యోగ అవకాశాలు కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మంది ఉపాధి లభించనుంది. ఈ ఉద్యోగాలు ఉమ్మడి జిల్లావాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యేక జీఓ తీసి అక్కడి ప్రజలకు ఉద్యోగావకాశాలు ఇచ్చారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అయోధ్యపురంలో రైల్వే యూనిట్కు 112మంది 160 ఎకరాల భూమి ఇచ్చారు. ఇద్దరు ఇళ్లు కోల్పోయారు. మొత్తం 114మంది నిర్వాసితులు ఉండగా ప్రభుత్వం ఎకరాకు రూ.8లక్షలు చెల్లించింది. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.33 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.8 లక్షలు రైతుకు ఇచ్చి, రూ.25లక్షలు దేవాదాయశాఖ(ఈ భూమి దేవాదాయశాఖకు సంబంధించి కావడం)కు ఇచ్చారు. 8మంది రైతుల భూమి సీలింగ్ ల్యాండ్ అని నష్టపరిహారం నిలిపివేశారు. ఇప్పటివరకు వారికి రాలేదు. కోట్ల రూపాయల విలువైన భూమి కోల్పోయామని, రైల్వే యూనిట్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి రైల్వేశాఖ ఆదుకోవాలని రైతులు కేంద్రమంత్రులను కోరుతున్నారు. రైల్వే మంత్రి దృష్టికి కాజీపేట డివిజన్ ప్రస్తావన.. రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని స్థానిక రైల్వే నాయకులు తెలిపారు. అదేవిధంగా టౌన్ స్టేషన్ అభివృద్ధి, ఫాతిమానగర్లో ట్రైయాంగిల్ స్టేషన్ నిర్మాణం, కాజీపేట రైల్వే ఆస్పత్రి సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్గ్రేడ్, కాజీపేట రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ఫాంల నిర్మాణం, అన్ని హంగులతో కూడిన రైల్వే క్లబ్ (ఇనిస్టిట్యూట్) భవనం, బెజవాడ తరహాలో రైల్వే ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నేడు యూనిట్ను విజిట్ చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొందరు రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేనా..? వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయం -
రైతుల గోస మంత్రికి పట్టదా..
కాటారం: మంత్రి శ్రీధర్బాబు సొంత మండలం కాటారంలో రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నా ఆయనకు ఏ మాత్రమూ పట్టింపులేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను కలిసి పుట్ట మధు మాట్లాడారు. రెండు మూడు రోజులుగా యూరియా కోసం లైన్లలో నిల్చుంటున్నామని రైతులు పుట్ట మధుతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతపై పుట్ట మధు పీఏసీఎస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై శ్రీధర్బాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు, పప్పు దినుసు విత్తనాలు అందించడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికై నా రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పుట్ట మధు వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, మండల ఇన్చార్జ్ జోడు శ్రీనివాస్, నాయకులు జక్కు శ్రావణ్, ఊర వెంకటేశ్వరరావు ఉన్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు -
ప్రభుత్వాలు జీఓ 49ని రద్దు చేయాలి
కన్నాయిగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీఓ 49 రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధికార ప్రతినిధి పొడెం బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గుండ్ల పాపారావు అధ్యక్షతన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆదివాసీల అత్యవసర సమావేశంలో పొడెం బాబు మాట్లాడారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న జీఓ నంబర్ 49 రద్దు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తూ అటవీ సంపదను దోచుకుపోవడానికి చూస్తున్నాయని ఆరోపించారు. ఈ జీఓతో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, అసీఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెంతోపాటు మరో కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించొద్దంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి నిలిపివేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మురళి, ఆలం రాంబాబు, సంపత్, పొడెం శోభన్, ఆలం కుమార్ పాల్గొన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధికారప్రతినిధి బాబు -
కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం
చిట్యాల: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు డీఆర్డీఏ, సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షత వహించగా.. మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందన్నారు. మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలను చేపట్టి అభివృద్ధి చెందాలని కోరారు. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బ్యాంక్ లింకేజీ, వడ్డీలేని రుణాలు, లోన్బీమా, ప్రమాద బీమా, ఇందిరా మహిళా శక్తి యూనిట్ల కింద రుణాలు, ఆర్టీసీ బస్సుల కిరాయి చెక్కులను అందజేశారు. అభివృద్ధి దిశగా నియోజకవర్గం.. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. విద్య, వైద్యం పరంగా ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మోరంచపల్లి బాధితులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిహారం చెల్లించామని గుర్తుచేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ డైరెక్టర్ రజని, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, డీసీఓ, మండల ప్రత్యేక అధికారి వాల్యూనాయక్, ఆర్డీఓ రవి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎంపీడీఓ జయశ్రీ, తహసీల్దార్ షేక్ ఇమామ్బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలి మంత్రి సీతక్క -
జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్గా ‘కోట’
కాళేశ్వరం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజబాపును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర సెక్రటేరియట్లో ఆర్డర్కాపీని తీసుకొని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాజబాపు గతంలో సర్పంచ్గా, కాళేశ్వరం దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు కాంగ్రెస్పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ దేవస్థానం డైరెక్టర్ అశోక్, నాయకులు శ్రీశైలం ఉన్నారు. -
పారిశుద్ధ్య పనులు బాధ్యతగా నిర్వహించాలి
ములుగు రూరల్: మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులను బాధ్యతగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ప్రేమ్నగర్లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రై డే ప్రై డే కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలతోపాటు చుట్టు పక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. డ్రెయినేజీల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. -
కేంద్రమంత్రుల షెడ్యూల్..
● శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ● 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు చేరుకుంటారు. ● 02:45 గంటల వరకు యూనిట్ను విజిట్ చేస్తారు. ● అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. ● 05:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. -
నిరుపయోగంగా బ్యాటరీ వెహికిల్స్
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ప్రతిరోజు పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా దివ్యాంగులు, వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. శని, ఆదివారం భక్తులు, విద్యార్థులు, పర్యాటకులు వేలాది సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. రామప్ప ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు లేకపోవడంతో ఆలయ ప్రధాన గేటునుంచి రామప్ప ఆలయం వద్దకు నడిచి వెళ్లడానికి, ఆలయ మెట్టు ఎక్కే సమయంలో నానా తంటాలు పడుతున్నారు. రామప్పలో బ్యాటరీ వెహికిల్స్ రెండు ఉన్నప్పటికీ వాటిని వీఐపీలు వచ్చినప్పుడే వినియోగిస్తూ తర్వాత మూలన పడేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్కు చెందిన గోలి సావిత్రి అనే దివ్యాంగురాలు రామప్ప సందర్శనకు వచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురైంది. దివ్యాంగులు, వృద్ధులకు వీల్చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న విలేకరులకు తమ గోడును వెల్లబోసుకుంది. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వీఐపీలు వచ్చినప్పుడే కాకుండా వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించి, వారికి ప్రత్యేక దర్శనం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. -
దందా
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025ఆగని ఇసుకఉదయం 6 గంటలకే కాల్వపల్లి నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు ● మానేరు వాగు నుంచి జోరుగా రవాణా ● తెల్లవారుజాము నుంచే లోడింగ్ ● ఒక్క కూపన్తో రెండు, మూడు ట్రిప్పులు ● అమలు కాని అధికారుల ఆదేశాలు ● అధిక ధరలకు ఇసుక విక్రయాలు భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సమీక్షలు నిర్వహించి మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా నిరోధానికి నిబంధనలు విధించి, తగు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు. ఇసుకాసురులు షరా మాములుగానే తమ దందాను కొనసాగి స్తున్నారు. అధికారులు ఆదేశించినా.. కాళేశ్వరం ఇసుక కంటే జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల మండలాల మీదుగా ప్రవహించే మానేరు వాగులోని ఇసుక నాణ్యత ఎక్కువగా ఉండటంతో డిమాండ్ ఉంటుంది. జిల్లాకేంద్రంతో పాటు మండలాల్లో కాంట్రాక్టు పనులు, బిల్డింగ్ల నిర్మాణానికి ఇక్కడి ఇసుకనే వినియోగిస్తుంటారు. దీంతో మానేరు వాగు నుంచి గతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరిగేది. ఈ అక్రమ దందాకు ఎలాగైనా చెక్ పెట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులు భావించారు. ఈమేరకు ఈ నెల 5వ తేదీన చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల తహసీల్దార్లు, పోలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించిన టోకెన్లు ఉన్న వారికి మాత్రమే మానేరులో ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్కు అనుమతి ఇవ్వాలని, అది కూడా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్ధేశించిన ధరలకు మాత్రమే రవాణా చేయాలని ఆదేశించారు. అయినా దందా అలాగే కొనసాగుతుంది. సమయపాలన లేదు.. అధిక ధరలకు విక్రయాలు.. కలికోటపల్లి, కాల్వపల్లి వద్ద మానేరులో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే టోకెన్ ఉన్న వారు ఇసుక లోడింగ్ చేసుకొని రవాణా చేసుకోవచ్చని రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రకటించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే మానేరులో ఒక్కో చోట సుమారు 20 ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. అధికారులు రాకముందే ఒక్కో ట్రాక్టర్ యజమాని రెండు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా మానేరు వాగులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ఉండే కొందరు సిబ్బంది సహకారంతో కొందరు ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇళ్ల ఒక్క టోకెన్తో రెండు, మూడు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం పడొద్దనే ఉద్దేశంతో కలెక్టర్ రాహుల్ శర్మ మండలాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక ధరను నిర్ణయించారు. అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం అధిక ధరలకే విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్ ఇసుకను ప్రస్తుతం చిట్యాల మండలంలో రూ. 4వేలు, టేకుమట్లలో రూ.3,500, రేగొండలో రూ.4,500, భూపాలపల్లిలో రూ.5వేల నుంచి రూ.5,500 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. టిప్పర్లలో హైదరాబాద్కు రవాణా.. మానేరు ఇసుకను కొందరు వ్యక్తులు అక్రమంగా హైదరాబాద్కు సైతం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల కూపన్లు తీసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతానికి తరలించి డంప్ చేస్తున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో డంప్ చేశాక అధికారుల కదలికలను గమనిస్తూ టిప్పర్లలో లోడ్ చేయించి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న అర్ధరాత్రి రేగొండ మండలకేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఇసుక లోడ్ చేసిన ఒక పొక్లెయినర్ను సీసీఎస్ పోలీసులు పట్టుకొని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. న్యూస్రీల్అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు.. నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇస్తున్నాం. మానేరులో ఇసుక తోడే ప్రాంతంలో సిబ్బందిని ఏర్పాటు చేశాం. టోకెన్ ఉన్న ట్రాక్టర్లనే వాగు లోపలికి అనుమతి ఇస్తారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు. – విజయలక్ష్మి, తహసీల్దార్, టేకుమట్ల -
స్థానికం తర్వాతే ‘ట్రస్టుబోర్డు’
రూ.6కోట్లకు చేరిన కాళేశ్వరం వార్షికాదాయంకాళేశ్వరాలయం కాళేశ్వరం: కాళేశ్వరం ట్రస్టుబోర్డు (పాలకవర్గం) నియామకం స్థానిక ఎన్నికల తరువాతే అని చర్చ జరుగుతుంది. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీనది పుష్కరాలను ఘనంగా నిర్వహించింది. ఆ సమయంలో ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందని ఆశావహులు ఆనందపడగా ఉత్సవ కమిటీతో సరిపెట్టారు. దీంతో పూర్తి స్థాయిలో కమిటీ నియామకం ఎప్పుడు జరుగుతుందని ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒకటి. ఒక్కసారైనా ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి చేపట్టాలని ధృఢ సంకల్పం స్థానిక నాయకుల్లో బలంగా ఉంది. చైర్మన్ పదవితో రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు, ప్రత్యేక హోదా లభిస్తుంది. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ట్రస్టుబోర్డు ఏర్పాటు జరిగే అవకాశం లేదని తెలస్తుంది. ఆదాయం రూ.6కోట్లు కాళేశ్వరాలయం వార్షికాదాయం రూ.6కోట్లకు చేరింది. దీంతో ఇటీవల దేవాదాయశాఖ 6ఏ ఆలయం నుంచి ఏసీ (అసిస్టెంట్ కమిషనర్)హోదా పెంపుపై ఈఓకు పత్రాలు అందినట్లు తెలిసింది. దీంతో ఆదాయ, వ్యయాలు, ఉద్యోగలు సంఖ్య, ఇతర వ్యవహారాలన్నీ కమిషనర్ కార్యాలయానికి పంపారు. దీంతో ఏసీ హోదా పెరిగితే క్యాడస్ స్ట్రెంత్ ప్రకారం ఉద్యోగులు, ఇతర సౌకర్యాలు మెరుగవుతాయి. ఆలయ అభివృద్ధి జరుగుతుంది. ఆ స్థాయిలో ఉండే చైర్మన్, పాలకవర్గం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలు! ఇటీవల సరస్వతీ నది పుష్కరాల సమయంలో వేసిన ఉత్సవ కమిటీనే పొడిగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు బోర్డు వేయలేదు. ఆశావహులు మాత్రం ఏడాది కాలంగా మంత్రి శ్రీధర్బాబు చుట్టూరా తిరుగుతున్నారు. అప్పుడేమో ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డురాగా, ప్రస్తుతం స్థానిక ఎన్నికల కోడ్ పడనున్న నేపథ్యంలో కనీసం రెండు నెలలు ఆగాల్సిందేనని చర్చ జరుగుతుంది. సరస్వతీనది పుష్కరాలకు ఉత్సవ కమిటీతో సరి గతేడాది కాలంగా ట్రస్టుబోర్డు ఏర్పాటులో జాప్యం ఆశావహులకు తప్పని ఎదురుచూపుగతేడాది నుంచి జాప్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు నియామకానికి దేవాదాయ శాఖ నోటిఫికేషన్ వేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా 40 వరకు దరఖాస్తులు దాఖలు అయ్యాయి. అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. తరువాత ఈ ఏడాది జనవరి 5న ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మళ్లీ రీ నోటిఫికేషన్ను దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆశావహుకులు 90కిపైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన కుంభాభిషేకానికి ట్రస్టుబోర్డు వేస్తారని ఆశించి భంగపడ్డారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అత్యంత శ్రద్ధతో 43 ఏళ్ల తరువాత వైభవోపేతంగా ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించారు. ఈ తేదీలకు ముందుగానే ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందని ఆశావహులు అనుకున్నప్పటికీ నిరాశ తప్పలేదు. అదే నెలలో ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు ట్రస్టుబోర్డు ఉంటుందని సంబరపడ్డ నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుతగిలింది. -
నేడు మంత్రి సీతక్క రాక
చిట్యాల: మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమం కోసం సభా స్థలాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నేడు (శుక్రవారం) మండలకేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిఽ ధనసరి అనసూయ (సీతక్క) రానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహిళలు సభకు హాజరుకావాలని కోరారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, డీఆర్డీఓ బాలకృష్ణ, డీసీఓ వాల్యూనాయక్, డీపీఎంలు రవి, గోవింద్ చౌహాన్, వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, ఎంపీడీఓ జయశ్రీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ పాల్గొన్నారు.సభాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ -
14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖ వరంగల్, ములుగు సర్కిళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్లో ఖరీఫ్ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు. నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన.. ఉమ్మడి వరంగల్లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ వరంగల్ సర్కిల్ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీలను త్వరలోనే అధికారులు ప్రకటించ నున్నారు. చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలు.. ‘స్కివం’ కమిటీ సూచనలు.. ములుగు సర్కిల్ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు తగినంత ఇన్ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూచించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని కూడా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈ ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది. వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఇది ‘స్కివం’ కమిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు వరంగల్, ములుగు సీఈల ప్రతిపాదనలకు ఆమోదం ప్రస్తుత నీటి లభ్యతను బట్టి నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్ అండ్ ఆఫ్.. 15 రోజులకోసారి వారబందీ పద్ధతిన విడుదల -
గైర్హాజరు కార్మికులకు కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి విధులకు గైర్హాజరువుతున్న కార్మికులకు గురువారం అఽధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏరియాలోని మైన్స్రెన్స్ స్టేషన్ కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్కు ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. గైర్హాజరుకు గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. విధులకు హాజరకాకపోవడం వలన కుటుంబంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులను జీఎం వివరించారు. విధులకు హాజరయ్యేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు. విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్మికుల అనారోగ్య కారణాలను డాక్టర్ సురేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అఽధికారులు రవీందర్, జోతి, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి, అన్ని గనుల సంక్షేమ అధికారులు, కార్మికులు, సేవా కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థినులు చదువులో రాణించాలి
చిట్యాల: విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయాన్ని ఆసక్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి క్లాస్రూంలోకి వెళ్లి విద్యార్థినులతో హిందీ పాఠం చదివించారు. స్టోర్రూం, వంట గదిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు విద్యలో బాగా రాణించాలని అన్నారు. చక్కగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థినులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. విద్యార్థినులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో మురుగునీరు వెళ్లేందుకు అవుట్లేట్, కాంపౌండ్ వాల్, సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్కు పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత కోరగా పరిష్కరించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంఈఓ కొడెపాక రఘుపతి, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ప్రిన్సిపాల్ సుమలత, ఆర్ఐ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
యూరియా, డీఏపీ మినహా అన్ని రకాల రేట్లు పెంపు
భూపాలపల్లి రూరల్: రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. 28–28–0, డీఏపీ, యూరియా మినహా మిగతా వాటి ధరలు రూ.50 నుంచి రూ.330 వరకు పెంచి రైతులపై ఎనలేని భారాన్ని మోపాయి. ఏటేటా పెరుగుతున్న ధరలతో రైతులకు పంటసాగు భారంగా మారుతోంది. జిల్లాలో ఈ వానాకాలం సాగుచేసే వివిధ రకాల పంటలకు 99,893 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతుండగా పెరుగుతున్న ధరలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూరియా, డీఏపీ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఇతర ఎరువులను తీసుకుంటేనే యూరియా, డీఏపీలను ఇస్తామని జిల్లాలోని కొన్ని షాపుల ఎరువుల డీలర్లు తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. నానో యూరియాపై అనాసక్తి.. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపడితే మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా స్థానంలో నానో యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చింది. ధర తక్కువగా ఉండే నానో ఎరువుల వినియోగంతో రైతులకు పెట్టుబడి భారం తగ్గి.. దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. రైతులు మాత్రం ఆసక్తి చూపలేకపోతున్నారు. ప్రస్తుతం వాడుతున్న సాధారణ యూరియాను పంటకు చల్లడం ద్వారా కేవలం 30 శాతం మాత్రమే పంటకు వెళ్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే నానో యూరియా 80 శాతం పంటకు వెళ్తుందని చెబుతున్నారు. లీటర్ డబ్బాలో లభించే నానో యూరియా 45 కిలోల బస్తాతో సమానం, రాయితీ పోను యూరియా బస్తా ధర రూ.286 ఉండగా, నానో యూరియా రూ.240కే లభిస్తుంది. యూరియా తర్వాత రసాయన నానో డీఏపీని అందుబాటులోకి తెచ్చారు. ఒక బస్తా డీఏపీ 500 మిల్లీ లీటర్ల నానో డీఏపీతో సమానం. బస్తా డీఏపీ ధర రూ.1,350 ఉండగా నానో డీఏపీ రూ. 600కే లభిస్తుంది. అయితే నానో ఎరువుల వినియోగంతో కలిగే లాభాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలున్నాయి. ఎరువుల ధరలు ఇలా.. (50 కిలోల బస్తా రూ.లో)ఎరువు రకం పాతధర కొత్తధర పొటాష్ 1,535 1,800 20–20–013 (ఫ్యాక్టస్) 1,300 1,425 20–20–013 (గ్రోమోర్) 1,300 1,350 20–20–013 (పీపీఎల్) 1,300 1,400 10–26–26 1,470 1,800 12–32–16 (ఇప్కో) 1,470 1,720 16–16–16 1,450 1,600 15–15–15–0–9 1,450 1,600 16–20–0–13 1,250 1,300 28–28–0 1,700 1,700 24–24–09 (మహాధన్) 1,700 1,800 20–20–13(మహాధన్) 1,350 1,450 14–35–14 (గ్రోమోర్) 1,700 1,800 డీఏపీ 1,350 1,350 సింగిల్ సూపర్ఫాస్పెట్ 580 640 యూరియా 45 కిలోలు 266 266 ఏటేటా పెరుగుతున్న ధరలతో రైతులకు తప్పని తిప్పలు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కరువు ఆసక్తి చూపని రైతులు జిల్లాలో ఈ సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా -
కోటగుళ్లలో పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ములుగు, భూపాలపల్లి ఎక్సెజ్ సూపరింటెండెంట్ వేముల శ్రీనివాస్, రజని దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం వారి ని పూలమాల, శాలువాతో సన్మానించారు. నేడు నీటి సరఫరా నిలిపివేత భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో నేడు(శుక్రవారం) మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. కొనంపేట పంపుహౌజ్ వద్ద పైపులైన్లు, మోటార్లు మారమ్మతు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్పీకి ఎస్సీ కమిషన్ నోటీసులు కాళేశ్వరం: తనకు తప్పుడు ధ్రువీకరణ నివేదిక ఇవ్వడంతో ఒడిశాలోని ఓ కంపెనీలో ఉద్యోగం రాలేదని మహదేవపూర్ మండలం మద్దులపల్లికి చెందిన చకినారపు రవి ఎస్సీ కమిషన్కు ఈనెల 3వ తేదీన ఫిర్యాదు చేశాడు. 15 రోజు ల్లో యాక్షన్ టేకన్ రిపోర్టును సమర్పించాలని ఎస్సీ కమిషన్ గురువారం ఎస్పీ కిరణ్ఖరే, గతంలో కాటారం డీఎస్పీగా పనిచేసిన గడ్డం రామ్మోహన్రెడ్డి, కాళేశ్వరం ఎస్సై గన్రెడ్డి తమాషారెడ్డిలకు నోటీసులు పంపించింది. ధ్రువీకరణ నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు విద్యార్థుల ఎంపిక కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు ఎంపికయ్యారు. ఈనెల 1నుంచి 8వరకు హైదరాబాద్లోని హకీంపేట్ క్రీడాపాఠశాల ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన కోల శాన్వి, గంట హరిచందన, నాగుల తులసి హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపికయ్యారు. శాన్వి, హరిచందన ప్రభుత్వ పాఠశాలో చదువుతుండగా, తులసి ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంది. వీరిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. డీఆర్డీఓ సేవలు అభినందనీయం భూపాలపల్లి రూరల్: డీఆర్డీఓగా నరేష్ సేవలు అభినందనీయమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మే 28న జగిత్యాలకు బదిలీపై వెళ్లిన డీఆర్డీఓ నరేష్ను గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా నరేష్ సేవలను కలెక్టర్, అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేశ్వరి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకరయ్య, స్వామి, ఉదయ్, రఘు పాల్గొన్నారు. పట్టణంలో వర్షం భూపాలపల్లి రూరల్: గురువారం రాత్రి భూపాలపల్లి పట్టణంలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. వారం రోజులు ఎండలతో సతమతమవుతున్న రైతులు, ప్రజలకు వర్షం ఉపశమనం కల్పించించి. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో జంగేడు రూరల్ ఫీడర్పై పిడుగు పడడంతో ఇన్సులెటర్ కింద పడింది. దీంతో పుల్లూరు రామయ్యపల్లి, పెద్దకుంటపల్లి గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అధికారులు, సిబ్బంది వెంటనే మరమ్మతు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
మద్యం తాగించి.. మెడకు తాడుతో బిగించి
రేగొండ: మద్యం తాగించి.. మెడకు తాడుతో బిగించి రవిని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేగొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లేష్తో కలిసి భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన పరుష రవికి రేగొండ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహం కాగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఊరైన రామన్నగూడెంలో ఉంటుంది. రవి భూపాలపల్లి జిల్లా గూడాడుపల్లి గ్రామానికి చెందిన పాతపెల్లి రేణుకతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి కొడుకు ఉన్నాడు. రేణుకకు ఇంతకు ముందే మరొకరితో వివాహమై కొడుకు, కూతురు ఉన్నారు. కాగా గత కొంతకాలంగా రేణుక వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రవి ఆమెను శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించినా రవి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో రేణుక తన కొడుకు శ్రీకర్, గ్రామస్తుడు శ్రీపాల్తో కలిసి రవిని హత్య చేయాలని ప్లాన్ వేశారు. దీంతో శ్రీకర్ హనుమకొండకు చెందిన ఉదయ్చందర్ను సంప్రదించి రవిని హత్య చేయడానికి సాయం కోరాడు. ఉదయ్చందర్ తన సమీప బంధువులైన సందీప్, నరేష్లను సంప్రదించి శ్రీకర్తో రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందానికి శ్రీపాల్ ఆర్థిక సాయం అందించాడు. కాగా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టలప్రాంతం హత్యకు అనువైన స్థలంగా ఎంచుకుని ఈ నెల 09న రెక్కీ నిర్వహించారు. 10న రవి మొదటి భార్య కొడుకు విష్ణుకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి కారులో తీసుకెళ్లారు. కొంపల్లి శివారులోని వైన్స్ వద్ద నిందితులు మద్యం తాగినట్టు నటిస్తూ రవికి ఎక్కువ మోతాదులో మద్యం తాగించారు. అర్ధరాత్రి సమయంలో బుగులోని గుట్టల వద్దకు తీసుకెళ్లి రవిని తాడుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. శవాన్ని చెట్ల పొదల్లో పడేశారు. ఆసమయంలో రవి జేబులోని రూ.20 వేలు ఉదయ్చందర్ తీసుకున్నాడు. హత్య కు ఉపయోగించిన తాడును సమ్మక్క గద్దెల వద్ద పడేశారు. కాగా మరుసటి రోజు తానే హత్య చేశాన ని శ్రీకర్ ఒక్కడే లొంగిపోయాడు. కాగా హత్య జరి గిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు శ్రీకర్తోపా టు మరికొందరు ఈ హత్యలో పాల్గొని ఉంటారని భావించి, రవి మొదటి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మండలంలోని చెక్పోస్ట్ వద్ద వాహనలను తనిఖీ చేస్తుండగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చా యి. నిందితుల నుంచి ఆరు సెల్ ఫోన్లు, కారు, రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన సీఐ మల్లేష్, ఎస్సై సందీప్కుమార్, సిబ్బందిని డీఏస్పీ అభినందించారు. రవిని హత్య చేసిన నిందితులు ఆరుగురి అరెస్ట్, రూ.5 వేలు స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
భూపాలపల్లి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. ప్రతి నాయకుడు, అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రజల అభిమానం చూరగొన్న నాయకులకే ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. అదేవిధంగా, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు చిట్యాల మండల కేంద్రంలో జరిగే మహిళా శక్తి సంబురాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు. ఈ సంబురాల్లో అన్ని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనేలా చూడాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో అర్బన్ అధ్యక్షుడు దేవన్, భూపాలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు రాంనర్సింహారెడ్డి(ఆర్ఎన్ఆర్) తదితర నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
కాళేశ్వరం: కాటారం సబ్డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్న సబ్కలెక్టర్ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీనిఆ కాటారం మయాంక్సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్, హాస్టల్ వసతి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో విద్యాబోధన, హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ గురించి చర్చించారు. అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కాటారంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కుంట్లంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై ఆరా మహాదేవపూర్ మండలంలోని కుంట్లం గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల విషయంలో ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కుంట్లం గ్రామ ప్రజలు గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడు ముంపునకు గురవుతుందని, ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని సీఎంఓ ప్రజాదర్బార్లో ఆర్జి ద్వారా కోరడంతో సబ్ కలెక్టర్ ఇరిగేషన్శాఖ వారితో చర్చించినట్లు తెలిపారు. ఈ విషయంలో సమగ్ర పరిశీలన చేసి పూర్తి నివేదిక సమర్పించనున్నట్లు సబ్ కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఎంపీఓ ప్రసాద్ ఉన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ కుంట్లం గ్రామంలో రైతులతో సమావేశం -
డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు
ఏటూరునాగారం: విద్యార్థులు డ్రగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్లో బుధవారం డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్పై డిగ్రీ కళాశాల, గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత చెడుదారుల వైపు వెళ్లకుండా ప్రణాళికతో చదివి లక్ష్యం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజం, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు, ప్రేమ వలలో పడి విలువైన జీవితాలను బలి చేసుకోవద్దని తెలిపారు. సమస్యలు, ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీసులను కలిసి సమస్యను వివరించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ క్రైమ్స్కు గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
మొక్కలు, చెట్లే ప్రకృతికి అందం
భూపాలపల్లి: మొక్కలు, చెట్లే ప్రకృతికి అందమని, భవిష్యత్ తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవంలో జిల్లా పోలీసులు ముందుండాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్ల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రి జర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
ఆ తర్వాతే సర్పంచ్, వార్డు సభ్యులు
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం సాక్షిప్రతినిధి, వరంగల్ : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? బుధవారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించడం వెనుక మతలబు ఇదేనా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిందా?.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. అధికారవర్గాలు కూడా స్థానిక సంస్థల నోటిఫికేషన్ త్వరలోనే రావచ్చని చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు భావిస్తున్నారు. ● ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం ● ఉమ్మడి వరంగల్లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాల వెల్లడి ● వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్? ● అధికారులకు ఎన్నికల సంఘం సంకేతాలు.. సిద్ధమవుతున్న పార్టీలుఉమ్మడి వరంగల్లో జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు -
టీబీ నిర్మూలనకు వైద్యుల సహకారం అవసరం
భూపాలపల్లి: జిల్లాలో టీబీ వ్యాధిని నిర్మూలించడంలో ప్రైవేట్ వైద్యుల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్, సింగరేణి ఆస్పత్రుల వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతోపాటు ప్రైవేట్ వైద్యుల భాగస్వామ్యం అవసరమన్నారు. జిల్లాలో 95 వేల మందికి టీబీ పరీక్షలు చేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,695 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. జూన్ 9న జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 100 రోజుల్లో 95 వేల మందికి పరీక్షలు చేయాల్సి ఉందని, ఐదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్ రే కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వాటితో నిర్ణీత వ్యవధిలో పరీక్షలు పూర్తి చేయలేకపోతున్నామని, ప్రైవేట్ వైద్యులు, ఎక్స్ రే కేంద్రాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ సోకిన వ్యక్తులను గుర్తించిన వెంటనే సమాచారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అందించాలన్నారు. తద్వారా రోగి నివసించే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, మెడికల్ క్యాంపులు నిర్వహించి, వ్యాధి వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్కుమార్, సింగరేణి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
మల్హర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో కాటారం సీఐ నాగార్జునరావుతో కలిసి 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవాలంటే వాతావరణం సమత్యులంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టుందని పేర్కొన్నారు. విరివిగా మొక్కలు నాటి అటవీ విస్తీర్ణం పెంపునకు కృషి చేసి భావితరాల భవిష్యత్కు తోడ్పాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.కాటారం డీఎస్పీ సూర్యనారాయణ -
బడిబాట పట్టించేలా..
పకడ్బందీగా ‘ఆపరేషన్ ముస్కాన్’ ● మహిళా, శిశుసంక్షేమ, పోలీసు, కార్మికశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ● ఈనెల 31వరకు బాల కార్మికుల గుర్తింపు ● బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలుప్రత్యేక బృందాలు.. మహిళా, శిశు సంక్షేమశాఖ (బాలల పరిరక్షణ విభాగం) (డీసీసీయూ), పోలీసు, కార్మిక, చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బడి మానేసి పనులు చేస్తున్న చిన్నారులను ఈ ప్రత్యేక బృందాలు గుర్తిస్తున్నాయి. పని ప్రదేశం నుంచి వారిని రక్షించడంతో పాటు బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పనులను వదిలి బడిబాట పట్టేలా చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించి వారి బాగోగులు చూసుకుంటున్నారు. గుర్తించిన వారిలో 14ఏళ్లలోపు పిల్లలు బాల కార్మికులుగా పనులు చేస్తుంటే బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బాల కార్మికుల వయస్సు ఆధారంగా వారి భవితకు దిశా నిర్దేశం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాటారం: చిన్నారుల బాల్యం బందీ కాకుండా వెట్టిచాకి రి వైపు వెళ్లకుండా ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీని ద్వారా బాలలు బడిబాట పట్టేలా అధికారులు కృషి చేస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారు 128మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1నుంచి 31వరకు ఆపరేషన్ ముస్కాన్ను పకడ్బందీగా నిర్వహిస్తూ బాల కార్మికులను గుర్తిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ కరువు.. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల సమయంలో మాత్రమే సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో బాల కార్మికులపై నిఘా పెడుతున్నారు. ఆ తర్వాత కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఏటా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పేరిట గుర్తించిన బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. ఆ తర్వాత వారు బడికి వెళ్తున్నారా లేదా అని సమీక్షించడం లేదు. ప్రత్యేక తనిఖీలతో సరిపెట్టకుండా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. ఐదేళ్లుగా తనిఖీల్లో గుర్తించిన పిల్లల వివరాలు2021 28 2022 27 2023 29 2024 22 2025 22మొత్తం 128 -
జీసీసీ గోదాం పరిశీలన
వెంకటాపురం(కె): మండల కేంద్రలలోని జీసీసీ గోదామును మంగళవారం జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ రాంపతి, జీసీసీ ఎంఎల్ఎస్ పాయింట్ గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదాములో ఉన్న స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి సరుకును పరిశీలించారు. గోదాము, స్టాక్ రిజిస్టర్లో ఉన్న స్టాక్కు 250 క్వింటాల బియ్యం తక్కువగా వచ్చినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు అధికారికంగా ప్రకటించడం లేదు. మాయమైన 250క్వింటాళ్ల బియ్యానికి డబ్బులు చెల్లించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. -
శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి
● కేవీపీఎస్ ములుగు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ గోవిందరావుపేట: ఈ నెల 22, 23, 24 తేదీలలో సూర్యాపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ములుగు జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ అన్నారు. మండల పరిధిలోని పస్రా గ్రామంలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి అధ్యక్షతన మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సామాజిక అంతరాలు, కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం కేవీపీఎస్ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సాధించుకున్నామని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనంపై నిరంతరం పోరాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సకాలంలో అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు మెరుగు పర్చాలని కోరారు. దళిత బహుజనులందరికీ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ భౌగోళిక అంశాలపైన అవగాహన కల్పించేందుకు కేవీపీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, దేవేందర్, కోటయ్య, జగదీశ్, నరేష్, యాదగిరి, మహేందర్ పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శరత్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఐటీడీఏ నుంచి వీసీలో పీఓ చిత్రామిశ్రా, డీటీడీఓ పోచం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జేఏఎన్ఎంఏఎన్), ధర్తీ ఆభా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్(డీఏ జేయూఏ) పథకం ద్వారా 26 రాష్ట్రాల్లోని 5.5 కోట్ల గిరిజన జనాభాకు రూ.80 వేల కోట్లతో అసాధ్యమైన ప్రాంతాల్లో వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో గిరిజనులకు రోడ్లు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, టెలీకమ్యూనికేషన్, విద్యుత్, గృహ నిర్మాణం వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన గ్రామాల్లోని విద్యార్థులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అత్యవసర చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం, వసతి కల్పించాలన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వీసీలో ట్రైబల్ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శి శరత్ -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: ప్రజలు ఎయిడ్స్ వ్యాధిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సామాజిక వైద్యశాల ఐసీటీసీ కౌన్సిలర్ గులగట్టు వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని రామన్నగూడెంలో మంగళవారం ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు దిశ వారి సౌజన్యంతో హెల్త్ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, టీబీ, హైపటైటిస్బీ, సిఫిలిస్, హెచ్ఐవీ పరీక్షలు 50 మందికి చేసినట్లు వివరించారు. ఎవరికై నా హెచ్ఐవీపై అనుమానం ఉంటే క్రాస్రోడ్డులోని సామాజిక ఆస్పత్రిలో ఐసీటీసీ సెంటర్లో ఉచితంగా పరీక్షలు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్సీ మొబైల్ వాహన కౌన్సిలర్ అనూష, ల్యాబ్ టెక్నీషియన్ సాగర్, ఏఎన్ఎం ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ జైలు బాబు, గ్రామ కార్యదర్శి జ్యోతి, ఆశ కార్యకర్తలు కాశింబీ, లావణ్య, ఔట్ రీచ్ వర్కర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు -
దరఖాస్తుల విచారణ పూర్తిచేయాలి
కాటారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులపై ఆరాతీశారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమందికి నోటీసులు జారీ చేశారు. ఎన్ని దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన జరిగాయనే వివరాలు తహసీల్దార్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సబ్ కలెక్టర్ సూచించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్తో పాటు ఆర్ఐ భాస్కర్ ఉన్నారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ -
నిట్తో జర్మనీ యూనివర్సిటీ ఎంఓయూ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్తో జర్మనీకి చెందిన నార్దౌసెన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ మంగళవారం ఆన్లైన్లో ఎంఓయూ కుదుర్చుకుంది. వర్చ్యువల్గా డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్యూఏఎస్ జర్మనీ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లు జాంగ్ వ్యాగ్నర్, జెన్నీలు పాల్గొని ఎంఓయూపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అకాడమిక్, పరిశోధనలకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని, తొలిసారిగా ఆన్లైన్లో ఎంఓయూ చేసుకోవడం ఆనందంగా ఉందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో నిట్ డీన్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని 12 మండలాల్లో ఫిజియోథెరపీ వైద్యులు, స్పీచ్ థెరఫిస్టులను తాత్కాలిక పద్ధతిలో నియామకానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగున్నర బీపీటీ కోర్సు పూర్తి చేసి రాష్ట్ర పారా మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న కాళేశ్వరం కెనాల్ నిర్మించొద్దు కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువు గుండా వెళ్తున్న డీ1, డీ2, డీ3 ప్రధాన కెనాల్(కాల్వలు) నిర్మించొద్దని రైతులు సంతకాలు చేసి తీర్మానం చేశారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కెనాల్ నిర్మించడం వలన ఏర్పడు నష్టాలను ఆయనకు రైతులు వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డితో సమావేశం నిర్వహించి తీర్మానం చేయించాలని ఆదేశించారు. దీంతో మంగళవారం పీఏసీఎస్ చైర్మన్ అధ్యక్షతన మహదేవపూర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు (డిస్ట్రిబ్యూటరీ కెనాల్) డీ1, డీ2, డీ3 కాల్వలు తమ భూముల గుండా వెళుతుండడంతో పంటనష్టం జరుగుతుందని వాపోయారు. కాల్వల నిర్మాణంతో తమపంటలు పండించడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పోత వెంకట్స్వామి, శేఖర్, నాయకులు అక్భర్ఖాన్, వరప్రసాద్, కటకం అశోక్ పాల్గొన్నారు. సీజ్ చేసిన ఇసుక వేలం చిట్యాల: మండలంలోని కాల్వపల్లి గ్రామంలో ఇటీవల ఎనిమిది ప్రాంతాలలో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపులను సీజ్ చేయగా మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వేలం పాట నిర్వహించారు. వేలంలో ఏడుగురు సభ్యులు పాల్గొనగా.. కాల్వపల్లి గ్రామానికి చెందిన సూర తిరుపతి రూ.5.72 లక్షలకు పాడి కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ షేక్ ఇమామ్బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ మోబినోద్దీన్ పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలి కాటారం: ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా అక్రమార్కులు ప్రభుత్వ భూముల పట్టాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి చెందిన పలు రకాల భూములను అక్రమార్కులు కబ్జా చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూ భారతిలో దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ భూములు ఉంటే తిరస్కరించాలని కోరారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని తోగుగూడెంలో మావోయిస్టు ఆత్మపరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం వాల్పోస్టర్లు వెలిశాయి. అడవిని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రండి.. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వెలువడంతో చర్చనీయాంశంగా మారింది. -
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
కాటారం: వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలని ఉపాధిహామీ ఏపీడీ మంజులాదేవి ఉపాధిహామీ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటడం కోసం గుంతలను తవ్వించాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఓ వెంకన్న, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలోనూ ఆరాతీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌజ్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది.కీలక అధికారుల్లో మొదలైన గుబులు.. వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ అరెస్టు నేపథ్యం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు మురళీధర్ కుమారుడు అభిషేక్ సన్నిహితులపై నిఘా కాళేశ్వరం ఇంజనీర్లు ఒక్కొక్కరిపై దాడి గురి.. ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 58 మంది ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న అన్ని ప్రజావాణి దరఖాస్తులతో పాటు ప్రజాభవన్, హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి పరిష్కార నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్
హసన్పర్తి: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అత్తామామలకు చెప్పినప్పటికీ.. డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా.. డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ను లైవ్గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు.‘రీల్స్ గర్ల్’ మోజులో గుండైవెద్య నిపుణుడు భార్యకు శారీరక, మానసిక వేధింపులు.. దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి రూరల్: స్వయం ఉపాధి, పునరావాసం కోసం జిల్లాలోని దివ్యాంగులు ఈనెల 14నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి మల్లీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్సిడీతో రుణాలు మంజూరుచేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువ పత్రాలను మున్సిపల్ పరిధివారు మున్సిపల్ కార్యాలయంలో, మండలాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలన్నారు. మరిన్ని వివరాలకు 96523 11804 లేదా కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శిగా రాజ్కుమార్ భూపాలపల్లి అర్బన్: సీపీఐ జిల్లా కార్యదర్శిగా కొరిమి రాజ్కుమార్ ఐదవ సారి ఎన్నికయ్యారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా గురుజపెల్లి సుధాకర్రెడ్డి, పైళ్ల శాంతికుమార్, 29మంది కౌన్సిల్ మెంబర్స్, 11మంది జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు గణపురం: మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.52లక్షల నిధులతో ధర్మరావుపేట గ్రామంలో శివాలయానికి ప్రహరీ, బస్వరాజ్పల్లిలో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, అంగన్వాడీ భవన నిర్మాణ పనులు, గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మొగుళ్లపల్లి: మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మండలంలోని చింతలపల్లి గ్రామ శివారులో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమతి పత్రాలులేని రెండు ఇసుక ట్రాక్టర్లు మండలకేంద్రం శివారులోని పెద్దవాగు నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్ ఓనర్లు పోతుగల్ గ్రామానికి చెందిన గాజుల పరమేష్, బొల్లెపల్లి రాములు, పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి శ్రీను, డ్రైవర్లపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పత్తిచేనులోకి దూసుకెళ్లిన కారు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో మహా రాష్ట్రకు చెందిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లిది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం మహరాష్ట్రలోని గడ్చిరోలి నుంచి కాళేశ్వరం వస్తుండగా అంతర్రాష్ట్ర వంతెన దాటిని తర్వాత వేగంగా రావడంతో అదుపుతప్పి జాతీయ రహదారి 353(సీ) నుంచి 150 మీటర్ల దూరంలో పత్తి చేనులోకి వెళ్లింది. ప్రమాదంతో కారు డ్రైవర్ తలకు, మొహంపై స్వల్పగాయాలు అయ్యాయి. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారులో మహారాష్ట్రలో వాడే దేశీదార్ మద్యం కాటన్లు ఉన్నట్లు సమాచారం. మద్యం బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లారని ప్రచారం జరుగుతుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీస్తున్నారు. -
ఎండుతున్న నారు మడులు
జిల్లాలో వర్షాలు సంవృద్ధిగా కురవకపోవడంతో వరి నారు మడులు, కూరగాయల మొలకలు ఆదిలోనే ఎండిపోతున్నాయి. జూన్ నెల చివరలో కురిసిన వర్షాలతో జిల్లాలో రైతులు చెరువుల కింద వరి నార్లు, వర్షాదార పంటల సాగు ప్రారంభించారు. జూలై మొదటివారంలో కొంతమేర వర్షాలు కురవడంతో వరి గింజలు, ఇతర గింజలు మొలకెత్తాయి. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో భూపాలపల్లి, మల్హర్ మండలాల పరిధిలోని కాశీంపల్లి, జంగేడు, కొంపల్లి, కుంభంపల్లి, అన్సాన్పల్లి, నాచారం శివారుల్లోని పొలాల్లో వర్షాధార వరి నార్లు, కూరగా యల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పంట పొలా లు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. – భూపాలపల్లి అర్బన్/మల్హర్ మల్హర్ మండలం అన్సాన్పల్లి శివారులో ఎండిన వరి నారుభూపాలపల్లి మండలం జంగేడు శివారులో ఎండిన వరి నారు -
భూభారతి పెండింగ్!
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం సంబంధిత అధికారులు సతమతమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి వేలల్లో వినతులు వచ్చాయి. వందల సంఖ్యలోనే పరిష్కారానికి అవకాశం కలుగుతోంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. దరఖాస్తులు పెట్టుకున్న రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాదాబైనామాలు.. సాదాబైనామాలు, పీఓటీ, ప్రభుత్వ భూములకు సంబంధించి 18వేలకు పైగా ఆర్జీలు వచ్చాయి. తెల్ల కాగితాలపై జరిగిన భూ క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో వేలాది మంది ఈ సమస్య పరిష్కారం కోసం వేచిచూస్తున్నారు. మిగతావి సర్వేనంబర్ మిస్సింగ్, డిజిటల్ సైన్ పెండింగ్పై వచ్చాయి. మిగతా దరఖాస్తుల్లో కోర్టు కేసులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూమి రకంలో మార్పు, విరాసత్, కుటుంబ సభ్యుల పేర్లలో తప్పులు తదితర సమస్యలపై వచ్చినవి ఉన్నాయి. వీటన్నింటినీ అధి కారులు ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు నోటీసులు ఇస్తూ దరఖాస్తుదారుల వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలు పరిశీలిస్తున్నారు.వేలాదిగా వచ్చిన దరఖాస్తులు ● ఆగస్టు 15వరకు పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశం ● వందల్లోనే సమస్యలు పరిష్కారం ● కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ ● సాదాబైనామాలకు కలగని మోక్షంమిస్సింగ్ సర్వే నంబర్ 5,724 అసైన్డ్ ల్యాండ్: 10,031 సక్సెసెషన్ 3,599పీఓటీ 3,159సాదాబైనామా 5,179డీఎస్ పెండింగ్1,720 వేల దరఖాస్తులు.. దగ్గర పడుతున్న గడువు జిల్లావ్యాప్తంగా గత నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన భూ భారతి గ్రామ సదస్సుల ద్వారా జిల్లాలోని 11 మండలాల్లో 48,651 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 200పైచిలుకు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా వేలాది దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీలోపు భూభారతి ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గడువులోపు దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేలా లేదు.తిరస్కరణకు అధికం అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో అత్యధికంగా తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిసింది. భూమిని పట్టా చేసేందుకు అధికారులు రైతులకు అనేక చిక్కుముడులు పెడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముందుగా డిజిటల్ సైన్ పెండింగ్, సక్సెషన్పై వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. డీఎస్ చేసేందుకు రైతుల నుంచి పాత పాసు పుస్తకాలు ఉండాలని, రెవెన్యూ రికార్డుల్లోని పహణీల్లో కాస్తు కాలంతో పాటు పట్టాదారు కాలంలో ప్రస్తుతం దరఖాస్తు రైతుల పేర్లు ఉండాలని సూచించారు. సక్సెషన్కు సంబంధించి బాధలు అనేకం ఉన్నాయి. రెండు తరాల క్రితం చనిపోయిన పట్టాదారు (రైతు) డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధనలు విధించారు. అన్నీ ఉన్నా ఆర్ఎస్ఆర్(సెత్వార్)లో వ్యత్యాసం ఉందని దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. పరిశీలన వేగవంతం చేస్తాం.. జిల్లాలో భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేస్తున్నాం. ఇప్పటివరకు మండలాల వారీగా టీమ్లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పూర్తి చేస్తాం. ఆర్ఎస్ఎస్ సమస్యలను పరిష్కరించేందుకు భూముల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించి అనర్హులకు నోటీసులు అందించి వారి పేర్లు తొలగిస్తాం. త్వరలో లైసెన్స్డ్ సర్వేయర్లు, జీపీఓలు అందుబాటులోకి రానున్నారు. – అశోక్కుమార్, అదనపు కలెక్టర్ ● -
ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి: అనధికార చిట్ఫండ్, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. సోమవారం ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 24మంది బాధితుల నుంచి ఎస్పీ వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు అనధికార చిట్ఫండ్, అక్రమ ఫైనాన్స్ ఆగడాలపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అనధికార చిట్ఫండ్, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం వలన ఇబ్బందులు ఎదుర్కొనే వారు సీసీఎస్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మొబైల్ నంబర్కు 87126 58108 ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఎస్పీ కిరణ్ ఖరే -
కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం
కాటారం/కాళేశ్వరం: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో మంత్రి శ్రీధర్బాబు సోమవారం పర్యటించారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలల ఆవరణలో విద్యార్థులకు షూ పంపిణీ, వనమహోత్సవం, చిన్న కాళేశ్వరం రైతులతో సమావేశం, కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కుల పంపిణీ, మహాముత్తారం ఎంపీడీఓ కార్యాలయం నూతన భవనం, రూ.73.50 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ కార్యాలయం భవనం, గోదాం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలను ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నట్లు తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తామని మంత్రి అన్నారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ఫ్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలానికి వంద మంది మహిళలకు కుట్టు మిషన్ నేర్పించే కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్డీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కమిట్మెంట్తో పనిచేస్తా.. మంత్రిగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తానని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మహదేవపూర్లో 650 మంది విద్యార్థులకు పాఠశాల షూస్, స్పోర్ట్స్ షూస్లను పంపిణీ చేశారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున కృషి చేస్తుందని తెలిపారు. మండలంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 245 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్బాబు వెంట కలెక్టర్ రాహుల్శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, డీఈఓ రాజేందర్, తహసీల్దార్లు నాగరాజు, శ్రీనివాస్, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబుకు కృతజ్ఞతలు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మహదేవపూర్ ఉన్నత పాఠశాలలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు ఉపాధి రంగాలను వినియోగించుకోవాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
భరోసా ఏది..?
పెట్టుబడి కోసం కౌలురైతుల ఎదురుచూపుఎలా గుర్తించాలో స్పష్టత కరువు.. ఇప్పటికే జిల్లాలో వానాకాలం సాగు షురూ అయింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పట్టాదారులకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. కౌలు రైతుల వివరాలు లేవు. వీరిని ఎలా గుర్తించాలనే దానిపై స్పష్టత లేదు. జిల్లాలో కౌలు రైతులతో పాటు చిన్న, సన్నకారు రైతులు కలిపి సుమారుగా 35వేలకు పైగా ఉన్నారు. వీరు రైతు భరోసా కింద సాయం అందుతుందని ఆశిస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 12లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం(రైతు భరోసా) రూ.120కోట్లకు పైగా సహాయం అందుతుంది. కౌలు రైతులకు కూడా సాయం అందిస్తే సంఖ్య మరింత పెరగనుంది.కొంపెల్లి శివారులో పత్తికి గుంటుక కొడుతున్న రైతుభూపాలపల్లి రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో కౌలు రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కౌలు రైతులకు సైతం ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 19 నెలలవుతోంది. గత వానాకాలం, యాసంగి సీజన్లో ఇవ్వలేదు. ఈ సారైనా హామీ నెరవేరుతుందనే ఆశలో కౌలు రైతులు ఉన్నారు. ఆశగా ఎదురుచూపు.. జిల్లాలో సుమారు 35వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు 2016లో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. ఆరెకరం భూమి ఉన్న రైతులు ప్రతిఏటా తమకున్న కొద్దిపాటి భూమితో పాటు ఇతరుల పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. పత్తి, మిర్చి తోటలకు ఎకరాకు కౌలు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు చెల్లిస్తున్నారు. వరి పొలాలకు రూ.12వేల వరకు చెల్లిస్తున్నారు. పంట చేతికొచ్చినా, రాకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తుంది. సాగుకు కావాల్సిన, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కౌలు, చిన్న, సన్న కారు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసాలో భాగంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని అంటున్నారు. జిల్లాలో సుమారు 35వేల మంది.. గుర్తింపులో స్పష్టత కరువు నెరవేరని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీ -
శిక్షణ తరగతులు నిర్వహించాలి
రేగొండ: గ్రామాలలో వైద్యసేవలు అందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆర్ఎంపీ, పీఎంపీల జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్, దుబాసి బాలరాజు అన్నారు. ఆదివారం మండలంలోని కోటంచ ఆలయ ప్రాంగణంలో సంఘం జిల్లా ఈసీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఎంపీలకు శిక్షణ తరగతులు నిర్వహించేవారన్నారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు, నియోజక వర్గంలో మౌలిక వసతులకు ప్రాధాన్యన ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్నగర్లో రూ.3 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటుచేసిన బోరు మోటారును స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా రాజవీరు భూపాలపల్లి రూరల్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా రాజవీరును ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చిట్యాల శశికుమార్, జాలిగాపు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా మూషిక రమేష్, సహాయ కార్యదర్శులుగా యుగేందర్, రమేష్, కోశాధికారిగా అంకం సదానందం, సహాయ కోశాధికారి తిరుపతితో పాటు తదితర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మొగుళ్లపల్లి: మండలంలోని మేదరమెట్ల గ్రామ శివారులోని చలివాగు నుంచి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. మేదరమెట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు మంద హరీశ్, కొనుకటి దీక్షత్, పెండ్లి భూపతి, కొనుకటి ప్రవీణ్, పెండ్లి అరవింద్ అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా రంగాపురం శివారులో పట్టుకుని వారిపై నమోదు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్న కాళేశ్వరం పైపులైన్పై నిపుణుల పరీక్షలు కాళేశ్వరం: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పఽథకానికి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన పైపుల (గ్లాస్ రేయిన్ఫోర్స్డ్ పాలిషిడ్) నాణ్యతా ప్రమాణాలను నిట్ ప్రొఫెసర్ల బృందం ఆదివారం పరిశీలించింది. పదేళ్లుగా వానకు తడుస్తూ.. ఎండకు ఎండటంతో నాణ్యతను పరిశీలించాలని మంత్రి శ్రీధర్బాబు ఇటీవల ఇరిగేషన్ శాఖను ఆదేశించగా.. ఇరిగేషన్శాఖ లేఖను వరంగల్ నిట్ ప్రొఫెసర్లు పంపించారు. దీంతో ఆదివారం శిరీష్, రఘురాజు, జయ్పటేల్ వచ్చి పైపులను పరిశీలించారు. అమర్చిన, బయట నిల్వ ఉంచిన పైపులను పరీక్షించి కొన్ని నమూనాలను ల్యాబ్కు తీసుకెళ్లినట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. త్వరలో పరీక్షలకు సంబంధించిన వివరాలు రానున్నాయని వారు పేర్కొన్నారు. దీంతో నాణ్యతా ప్రమాణాలపై దృష్టిసారించినట్లు తెలుస్తుంది. వారివెంట ఇన్చార్జ్ ఈఈ సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఈ యాదగిరి ఉన్నారు. -
తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి
కాళేశ్వరం: తెలంగాణ సస్యశామలంగా ఉండాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని కోరానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆలయ రాజ గోపురం వద్దకు రాగా.. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆలయంలోని ద్విలింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద మహేశ్కుమార్గౌడ్కు సూపరింటెండెంట్ శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరాలయం మహా అద్భుతమని, రానున్న రోజుల్లో గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కాళేశ్వరాలయంలో పూజలు -
అధ్వానం.. పల్లె ప్రకృతివనం
భూపాలపల్లి రూరల్: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో 10 గుంటల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలాన్ని సేకరించి భారీ సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు ఉదయం నడక కోసం వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో నిర్వహణ బాధ్యతను ఉపాధి కూలీలకు అప్పగించగా వారు ఆయా వనాల్లో కలుపు తీయడం, నీరు పట్టడం వంటి పనులు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించారు. దీంతో సిబ్బందికి అదనపు పనులు కావడంతో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా తయారయ్యాయి. పలు ప్రకృతి వనాల్లో కలుపు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి ఇదీ పరిస్థితి.. జిల్లాలో 241 పంచాయతీల్లో 241 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రకృతి వనం ఏర్పాటుకు గాను ఉపాధిహామీ పథకం నిధులు రూ.రెండు లక్షల వరకు వెచ్చించారు. కేటాయించిన స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటుచేసి గేటు బిగించి పల్లె ప్రకృతి వనాలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక నాటిన మొక్కలు కనిపించకపోగా పిచ్చిమొక్కలతో నిండి దర్శనమిస్తున్నాయి. గేట్లకు తాళం వేసి ఉంచడంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. బయటి నుంచి సైతం ముళ్లపొదలు పెరిగి ప్రకృతి వనాలు వాటి ఆనవాళ్లు కోల్పోయాయి. కొన్ని గ్రామానికి దూరంలో ఉన్న ప్రకృతి వనాలు మద్యం తాగడానికి సిగరేట్లు కాల్చడానికి ఆవాసాలుగా మారినట్లు ఆయా గ్రామస్తులు వివరిస్తున్నారు. రూ.కోట్ల ప్రజాదనంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. నిర్వహణ నిల్ పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న వనాలు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల వేడుకోలు -
ప్రజాసమస్యలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
రేగొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర సహా య కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో సీపీఐ జిల్లా మహసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటినా నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సహాయ కార్యదర్శి పైళ్ల శాంతికుమార్, మండల కార్యదర్శి పెంట రవి, నాయకులు సమ్మిరెడ్డి, క్రాంతికుమార్, రాజయ్య, వెంకటేష్, సుధాకర్, చంద్రమౌళి పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
గణపురం: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు న మ్మకం కలిగేలా నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న వైద్యసేవలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఆపరేషన్ గదితోపాటు ఫార్మసీని తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యసిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, పోగ్రాం ఆఫీసర్ ఉమాదేవితోపాటు సిబ్బంది ఉన్నారు. వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలి రేగొండ: సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని డీహెచ్ రవీంద్రనాయక్ అన్నారు. మండలంలోని తిరుమలగిరి ఆరోగ్య ఉపకేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న పాంతాల్లో లార్వాలు అభివృద్ధి చెందకుండా డ్రై డే పాటించాలని తెలిపారు. గర్భిణులకు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించి, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం జరిగేలా చూడాలని సూచించారు. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా శిశువులందరికీ సరైన సమయంలో టీకాలు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీదేవి, పీఓ ఎన్సీడీ సందీప్, డీపీఓ చిరంజీవి, డీడీఎం మధు, మండల వైద్యాధికారి హిమబిందు, ఎఎన్ఎం సదాలక్ష్మి, దీనా, ఆశావర్కర్లు స్వప్న, సుమలత, వనిత, వజ్ర, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ -
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు నిర్ణయించడం హర్షనీయమన్నారు. సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీ 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి భూపాలపల్లి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తపల్లి గోరి గ్రామ ఎంపీటీసీ పరిధిలోని ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీలు, మండల ప్రాదేశిక ఎన్నికల్లో అన్నింటా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశా, నిర్దేశం చేశారు. ప్రజాభిమానం ఉన్న వారికే టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తల ముఖంలో ఆనందం చూడాలంటే వారికి కూడా అధికారం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో క్రమశిక్షణ తప్పిన వారిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హెచ్చరించారు. -
కొత్త వ్యక్తులకు ఆశ్రయమివ్వొద్దు
కాళేశ్వరం: గ్రామాల్లో కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని, అలాంటివారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డిలతో కలిసి శనివారం సాయంత్రం ఆయన మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో కార్డెన్సెర్చ్ నిర్వహించి, గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో వాహన పత్రాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. పెండింగ్ చలానా ఉన్న వాహనాలను క్లియర్ చేయించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని, అలాంటి కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. యువత మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. చెడు వ్యవసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. గంజాయి, గుడుంబా, మట్కాలకు అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే గ్రామస్తులు సహకరించొద్దని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ పోలీసులు ఉన్నారు. రహదారిని పునఃప్రారంభించాలి భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం రోడ్డుకు అడ్డుగా కాల్వ తీయడం సరికాదని, రహదారిని పునఃరుద్ధరించాలని కోరుతూ పట్టణంలోని కారల్మార్క్స్కాలనీ వాసులు శనివారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజ్ సతీష్ మాట్లాడుతూ.. కారల్మార్క్స్ కాలనీలోని 25వ వార్డు పరిధిలో సింగరేణి పాఠశాల పక్క న కాలనీకి వెళ్లే రోడ్డుకు సింగరేణి యాజ మాన్యం కాల్వ తీసినట్లు తెలిపారు. 30 సంవత్సరాల క్రితం కాలనీ వాసులు సౌలభ్యం కోసం రోడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు మూసి వేయడంతో విద్యార్థులు, 6వ గనికి వెళ్లే కార్మికులు, సులభ్ కాంప్లెక్స్ వెళ్లే కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రోడ్డు పున:ప్రారంభించాలని కోరుతూ జీఎంకు కాలనీవాసులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు తిరుపతిరెడ్డి, రవి, రాజు, మహేష్, చంద్రయ్య, వెంకన్న, సురేష్, వెంకటేష్ పాల్గొన్నారు. సమ్మక్కసాగర్ వద్ద తగ్గిన నీటి ప్రవాహం కన్నాయిగూడెం: రెండు రోజుల పాటు ఉగ్రరూపంలో ప్రవహించిన గోదావరి నీటి ప్రవాహం శనివారం కొంతమేర తగ్గింది. తుపాకులగూడెం వద్ద గోదావరిపై సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద శుక్రవాకం ఎగువ నుంచి 7 లక్షల పైబడి క్యూసెక్కుల నీరు ప్రవహించింది. శనివారం నాటికి 2 లక్షల క్యూసెక్కుల మేర తగ్గి 5,20,630 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 80.50 మీటర్ల నీటి మట్టం ఉంది. భూ పోరాటాలకు దిక్సూచి ఓంకార్ ములుగు రూరల్: రైతాంగ భూ పోరాటాలకు దిక్సూచి ఓంకార్ అని ఎంసీపీఐ(యూ)రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఓంకార్ శతజయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నర్సంపేట నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన నేత ఓంకార్ అని అన్నారు. ఓంకార్ తన జీవితాన్ని పీడిత ప్రజల విముక్తికి అంకితం చేశారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.67 వేల ఎకరాల భూమిని పేదలకు దక్కే విధంగా కృషి చేశారని కొనియాడారు. -
బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు
గణపురం: ప్రతీఒక్కరు బాధ్యతగా పనిచేయాలని లేదంటే చర్యలు తప్పవని డీఆర్డీఓ బాలకృష్ణ అన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పనులపై సోమవారం ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 17వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన రూ.3.81 కోట్ల పనులకు సంబంధించి వారం రోజులుగా తనిఖీ బృందాలు గ్రామాల్లో పరిశీలించి తయారు చేసిన నివేదికలపై జిల్లా విజిలెన్స్ అధికారి రుబీనా, క్వాలిటీ కంట్రోల్ అధికారి ధరమ్ సింగ్తో కలసి సమీక్ష నిర్వహించారు. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించకపోవడం, మస్టర్ల నమోదులో వ్యత్యాసాలు, మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, రికార్డులు సక్రమంగా లేకపోవడం వంటి అంశాలను తనిఖీ బృందాలు ప్రజావేదిక ముందు పెట్టాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. జాబ్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పించాలని అవసరమనుకుంటే అదనంగా పనులు గుర్తించి అనుమతులు పొందాలన్నారు. చేసిన పనులకు సంబంధిత కూలీల సమక్షంలో కొలతలు నమోదు చేయాలని చెప్పారు. రికార్డులు సరిగా లేకపోతే సంబంధిత శాఖ అదికారులు ఇంటింకి పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు తీరు సరిగా లేకున్నా తొలగించే అధికారం ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్ఆర్పీ రంజిత్ కుమార్, ఏపీఓ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి డీఆర్డీఓ బాలకృష్ణ -
ప్రకృతి ప్రేమికుడు
ఏటూరునాగారం: చేసేది టెంట్హౌజ్ వ్యాపారం... కానీ ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్క నాటుతాడు. ఉదయం నిద్రలేవగానే మొదట మొక్కలకు నీళ్లు పట్టిన తన దినచర్యను ప్రారంభిస్తారు. ఏటూరునాగారంలోని 5వ వార్డుకు చెందిన మార్కండేయ. ఇప్పటి వరకు కాలనీలో 40 మొక్కలు, రామాలయంలో 540, తన ఫంక్షన్హాల్లో 420 మొక్కలు నాటాడు. తన ఫంక్షన్ హాల్ను నందన వనంగా మార్చాడు. ఇదే కాకుండా పోలీస్స్టేషన్, ఎంపీడీఓ ఆఫీస్, రోడ్ల వెంట కూడా మొక్కలు నాటాడు. అందులో పూలు, పండ్ల మొక్కలు నాటడమంటే ఎంతో ఇష్టం. ఇవే కాకుండా రోడ్ల వెంట నీడనిచ్చే మొక్కలను నాటడం కోసం తోటి వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన వేయి మొక్కలను నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచాడు. -
20 గుంటల విస్తీర్ణం.. 30 రకాల మొక్కలు●
గణపురం: ఆయన ఓ ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిని ఆస్వాధించాలనే తపనతో తన ఇంటి ఆవరణలోని 20 గుంటల్లో పండ్ల మొక్కలతోపాటు, వాణిజ్య మొక్కలు నాటుతున్నారు.. మండలకేంద్రానికి చెందిన తాళ్లపెల్లి సదానందం. 25 సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాల నిర్వహించిన ఆయన మొదటి నుంచే వన ప్రేమికుడు. ఇంటి ఆవరణలో సుమారు 30 రకాల పండ్ల మొక్కలతోపాటు, వాణిజ్య మొక్కలను పెంచుతూ వాటిని కన్నబిడ్డల్లా సాకుతున్నారు. రాజమండ్రి, కడెం ప్రాంతాల నుంచి తెప్పించిన మొక్కలు ఎదిగి సంవత్సరమంతా పండ్లను ఇస్తున్నాయని ఆనందంగా చెబుతున్నాడు.. సదానందం. అంతేగాకుండా వాణిజ్య మొక్కలైన ఎర్ర చందనం, టేకు, జామాయిల్ మొక్కలను సైతం పెంచుతున్నాడు. మొక్కలు, చెట్లుతో నిండిన ఆవరణలోకి నిత్యం అనేక రకాల పక్షులు వస్తుండడంతో వాటికోసం సైతం ప్రత్యేకంగా ఒక గుడిసెను నిర్మించిన సదానందం సాక్షితో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రేమించాలని, మొక్కలు నాటడడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చని తెలిపారు. -
చెట్లంటే ప్రాణం..
టేకుమట్ల: మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన బొద్దుల కొండల్రెడ్డి 76 సంవత్సరాల వయస్సులో సైతం మొక్కలను నాటుతూ చెట్లను ప్రాణంగా ప్రేమిస్తూ ఇంటి పరిసరాలు మొత్తం చెట్లతో నింపేశాడు. ఇంటి ఆవరణలో 19 గుంటల స్థలంలో మామిడి, జామ, నిమ్మ, ఉసిరి, అల్లనేరేడు, అరటి, వేప, టేకు, సీతాఫలం, ఎలక్కాయ, తదితర మొక్కలను చాలాకాలంగా పెంచుతూ వన ప్రేమికుడిగా గుర్తింపు పొందాడు. పండ్లను విక్రయించేందుకు ప్రాధాన్యం ఇవ్వకుండా అడిగిన వారందరికీ పంచుతూ మన్ననలను పొందుతున్నాడు. చెట్లంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రతీ చెట్టును ప్రాణంగా చూసుకుంటానని చెబుతున్నాడు.. వన ప్రేమికుడు కొండల్రెడ్డి. -
బదిలీపై వెళ్తున్న మేనేజర్కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఆరో గని మేనేజర్ రామ్ భరోస్ మెహతో బదిలీపై వెళ్తున్న సందర్భంగా స్థానిక జీఎం కార్యాలయంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. గనిలో ఉత్పత్తి, ఉత్పాదకతలను మేనేజర్ మెరుగు పరిచారని కొనియాడారు. ఉద్యోగులతో సౌమ్యంగా వ్యవహరిస్తూ గనిని అభివృద్ది పథంలో నడిపించడానికి కృషి చేసినట్లు తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, రవికుమార్, రవీందర్, ప్రసాద్, సురేఖ, మారుతి, సిబ్బంది ఉన్నారు. -
హరితం.. ఆనందం
మొక్కలు, చెట్లను పసిపాపల్లా పెంచుతున్న వనప్రేమికులు మొక్కల పెంపకమే ప్రాణం పర్యావరణ హితమే వ్యాపకం వృక్షాలను రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయనే నానుడి. దానిని నిజం చేస్తూ మొక్కల పెంపకాన్నే వ్యాపకంగా చేసుకున్నారు అనేకమంది. ఇంటి ఆవరణలోనే చెట్లను పెంచుతూ పర్యావరణానికి దన్నుగా నిలుస్తున్నవారు కొందరైతే.. పెద్దల స్మారకార్థం మొక్కలతో బృందావనాన్నే పెంచుతున్నవారు మరికొందరు.. ఇలా అనేక పూలు, పండ్ల మొక్కలతోపాటు ఔషధ గుణాలున్న మొక్కలు, చెట్లను పెంచుతూ ప్రాణంగా చూసుకుంటున్నారు. చెట్లు, మొక్కలను పెంచుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ వాతావరణాన్ని కాపాడుతున్న వారి వివరాలే నేటి ‘సాక్షి’ సండే స్పెషల్.చిట్యాల: జన్మనిచ్చిన అమ్మ మృతి చెందడంతో తట్టుకోలేక ఆమెకు గుర్తుగా మొక్కలను నాటి భద్రంగా చూసుకుంటున్నారు.. ముగ్గురు కుమారులు. మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన మేరుగు పద్మ గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందింది. అమ్మ దూరం కావడంతో ఆమె కుమారులు నాగేందర్, మహేందర్, రాజేందర్.. తల్లిపేరిట రెండు గుంటల్లో బృందావనం ఏర్పాటు చేసి మొక్కలను నాటి కాపాడుకుంటున్నారు.. వీరు పెంచుతున్న వాటిలో జౌషధ మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. అమ్మకు మొక్కలంటే ఎంతో ఇష్టమని అందుకే మొక్కలను నాటామని, మొక్కల వద్ద లైటింగ్తోపాటు పక్షులకు నీరు, దాన అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నారు.. ఈ అన్నదమ్ములు. అమ్మ ప్రేమకు గుర్తుగా.. -
మహిళా శక్తి సంబురాల కళాజాతా
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలో ఇందిర మహిళా శక్తి సంబురాల్లో భాగంగా సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా శక్తి కళాజాతా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల సమైఖ్య ఎపీఏం అంబాల రవివర్మ, కళాకారులు మైస ఎర్రన్న, సెగ్గం శీరీష, సుమలత, రాధిక, ప్రవీణ్, మధుబాబు, శంకర్, రవి, శ్యామల , స్వాతి, స్వప్న, విజయ్కుమార్, యాకూబ్, అనిత, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
కాటారం: దీ కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని ప్ర భుత్వ హై స్కూల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంక్ ఖాతా ప్రాముఖ్యత, బ్యాంకింగ్ సేవలను గూర్చి బ్యాంక్ మేనేజర్ హరిరామ్నాయక్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మేనేజర్ మా ట్లాడుతూ.. బ్యాంక్ ఖాతా కల్గి ఉండటం తప్పనిస రి అని దాని వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు. అనంతరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పుట్టిన రోజు పురస్కరించుకొ ని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఫీల్డ్ ఆఫీసర్ రాజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై సమావేశం
పలిమెల: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మంజుల, ఎంపీడీఓ ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల సామాజిక తనిఖీల్లో వచ్చిన అభ్యంతరాల తొలగింపు కోసం రిప్లై ఇవ్వాలని మండల అధికారులకు సూచించారు. రానున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్లాంటేషన్ కోసం అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శులు పీటర్ పాల్, శ్రీధర్, వినయ్కృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్, సాంబశివరావు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్
రేగొండ: కొత్తపల్లిగోరి మండలానికి నూతనంగా ఏర్పాటైన పోలీస్స్టేషన్ను ఆధునిక హంగులతో నిర్మిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం తాత్కాలిక భవనాన్ని డీఎస్పీ సంపత్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తపల్లిగోరి మండలానికి పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోలీస్స్టేషన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తారని తెలిపారు. ఇసుక అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు తెలిపిన ధరల ప్రకారం ఇసుక సరఫరా చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ట్రాక్టర్లను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా కోసం గ్రామాల్లో ఎవరైనా డంప్లు ఏర్పాటుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్కుమార్, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద్, మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, కాటం సదయ్య, వీరబ్రహ్మం, సుదర్శన్, పత్తి తిరుపతి, పుట్ట రవి, ప్రేమాజీ, పల్లెబోయిన తిరుపతి, పసుల రాకేష్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థల పరిశీలన రేగొండ: కొత్తపల్లిగోరి మండలానికి పోలీస్స్టేషన్ మంజూరు చేస్తూ జీఓ విడుదల కావడంతో శుక్రవారం మండలకేంద్రంలోఎస్పీ కిరణ్ఖరే పోలీస్స్టేషన్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. తాత్కాలిక పోలీస్ స్టేషన్ భవన సముదాయాన్ని పరిశీలించి, మరమ్మతుల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, ఎస్సై సందీప్కుమార్ పాల్గొన్నారు.