Jayashankar District News
-
రైతులు సేంద్రియ సాగుకు మొగ్గుచూపాలి
మల్హర్(కాటారం): రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకొని సేంద్రియ వ్యవసాయం సాగులో ముందుకెళ్లాలని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని కాటారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో తిరుమల మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులంతా అధునాతన సాగు మెలకువలు పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందేలా వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. అనంతరం మండలంలో భూసార పరీక్షలు నిర్వహించుకున్న రైతులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పూర్ణిమ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్నాయక్, కాటారం సర్పంచ్ సడవలి, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే
కాళేశ్వరం: సరస్వతీనది ఆది పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. అంత్య పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు వన్వే రూట్ ప్లానింగ్ చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్తో కలిసి కాళేశ్వరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వీఐపీఘాటు, సాధారణ ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, 250కి పైగా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. పోలీసుస్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించనున్నామని తెలిపారు. 12 రోజుల పాటు 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పలు షిప్టుల్లో ఉంటారన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కురిస్తే వాహనాలు దిగబడకుండా ఎరుపు నేలలను కూడా గుర్తించినట్లు తెలిపారు. గంగారం ఎక్స్రోడ్డు నుంచి కాళేశ్వరం మంథని గుండా కాళేశ్వరం వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్డు మీదుగా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్రోడ్డు నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం వస్తాయి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం మీదుగా యధావిధిగా కాటారం గుండా వరంగల్, కరీంనగర్ వైపునకు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలకు వన్వే లేదు. ఎప్పటిలాగే వచ్చి వెళ్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మంచిర్యాల గుండా వచ్చే వాహనాలు వంతెన వద్ద పార్కింగ్ స్థలాలకు చేరుకుంటాయి. అక్కడే పార్కింగ్ చేసిన తరువాత ఆటోలు, షెటిల్ బస్సులలో వెళ్లి స్నానాలు చేసి దర్శనం చేస్తారని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దు వన్వే ద్వారా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అంత్య పుష్కరాలకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
రేపటి నుంచి అథ్లెటిక్ పోటీలు
భూపాలపల్లి రూరల్: ఈనెల 6వతేదీ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనేవారు బుధవారం ఉదయం ఆరు గంటలకు జనన ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. సబ్ జూనియర్, జూనియర్స్, సీ్త్రలు, పురుషుల విభాగాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 10వ తేదీన హనుమకొండలో జవహర్లాల్నెహ్రూ స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. -
ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి: జిల్లాలో వరిధాన్యం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం పీక్ దశలో కొనసాగుతున్నందున అంతరాయాలు లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పౌర సరఫరాలు శాఖ, సంస్థ, వ్యవసాయ, సహకార, డీఆర్డీఓ, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాల పట్ల థర్డ్ పార్టీ పరిశీలనకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో తనిఖీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 185 కేంద్రాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఐదు పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించామని, ఇప్పటివరకు 108 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. ఈ సీజన్లో మొత్తం 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీసీఎస్ఓ కిరణ్కుమార్, డీఎం రాములు, డీఏఓ బాబూరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. అకాల వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సివిల్ సప్లయీస్ అధికారులు పాల్గొన్నారు. 10 వరకు స్వీయ నమోదు డిజిటల్ విధానంలో ప్రతీ ఒక్కరు జనగణన స్వీయ నమోదు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జనగణన స్వీయ నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి జనగణన స్వీయ నమోదు ప్రారంభమైందని, మే 10వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 55 దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయా జిల్లా శాఖల అధికారులను ఆదేశించారు. డిజిటల్ విధానంలో స్వీయ నమోదు చేసుకోవాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
బస్స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలి
మల్హర్(కాటారం): కాటారంలో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి చొరవ చూపాలని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానిప్రసాద్ను డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు కోరారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు సోమవారం వరంగల్లో ఆర్ఎం, భూపాలపల్లి డీఎం సంబంధిత అధికారులకు కాటారం ప్రయాణ ప్రాంగణ స్థలం నిర్మాణంపై నాయకులు వినతి పత్రం అందించారు. కోర్టులో కేసు నడుస్తునందున రాష్ట్ర లీగల్ సెల్ను అప్రమత్తం చేసి క్లియరెన్స్ తెప్పిస్తే మంత్రి శ్రీధర్బాబు బస్స్టేషన్ నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు వివరించారు. బస్స్టేషన్ నిర్మాణం, కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు ఆర్టీసీ నాయకులు లీగల్ సెల్ ద్వారా క్లియరెన్స్ సర్టిఫికెట్స్, టెండర్ ప్రాసెస్ వెంటనే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరి కుమార్, పున్నం రమేష్ పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కాళేశ్వరం: ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నామని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం పాలకవర్గం మొదటి సమావేశాన్ని నిర్వహించారు. అంత్య పుష్కరాల నిర్వహణ కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 12 రోజుల పాటు తాగునీరు, మౌలిక వసతులు ఏర్నాటు చేస్తామన్నారు. స్థానిక భక్తులకు ఉదయం నుంచి 10గంటలకు వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. ఈఓ మాట్లాడుతూ..ఆలయంలో భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేస్తామన్నారు. ప్రతీ రోజు భక్తులకు అన్నదానం ఏర్పాటుచేస్తామని తెలిపారు. 12 రోజుల పాటు వీవీఐపీలు, పీఠాధిపతులు రానున్నారని తెలిపారు. హారతి కార్యక్రమానికి కాశీపండితులు వస్తున్నారని పేర్కొన్నారు. వారి వెంట ధర్మకర్తలు సీతారాం, సీతయ్య, సత్యనారాయణ, సత్తయ్య, పద్మ, నర్సయ్య, అశోక్, దుర్గయ్య, శ్రీధర్రావు, శ్యామ్దేవుడా పాల్గొన్నారు. -
ప్రజావాణికి 11 దరఖాస్తులు
మల్హర్(కాటారం): కాటారం సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ స్థాయిలోని కాటారం, మల్హర్, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల మండలాల నుంచి వివిధ సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చినట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతీ వినతిని ప్రాధాన్యంగా తీసుకోని నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు హరికృష్ణ సూచించారు. ఈ కార్యాక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు భూపాలపల్లి అర్బన్: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న నాన్–మైనారిటీ అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్ ఎదుట లాటరీ తీయనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాఠశాల ఆవరణలో, జిల్లా మైనారిటీ అధికారి, ఉమ్మడి వరంగల్ మైనారిటీ పాఠశాలల కోఆర్డినేటర్, పాఠశాల ప్రిన్సిపాల్ సమక్షంలో దరఖాస్తులను పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు వెరిఫికేషన్ మొగుళ్లపల్లి: ఎస్సీ కార్పొరేషన్ 2025–26 రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈనెల 6న బుధవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సురేందర్గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారులు తమ ఆధార్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అన్ని ప్రతులతో హాజరుకావాలని కోరారు. అర్హత గల వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గంజాయి రవాణాదారుల అరెస్ట్ టేకుమట్ల: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బోర్నపల్లికి చెందిన మీనుగు వంశీక్రిష్ణతో పాటు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి సంతోష్, ఓడేడ్ గ్రామానికి చెందిన బీముని గణేష్ మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లాలోని ఆయా మండలాల యువకులకు విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం టేకుమట్ల మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో టేకుమట్ల రైతు వేదిక వద్ద వాహనాల తనిఖీలో వారి వద్ద 1.2కిలోల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గైకవాడ అమూల్య తెలిపారు. కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ సన్మానించారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్ ఉన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్కుమార్గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
మక్కలు కొనేదెప్పుడు?
భూపాలపల్లి: అన్నదాతలకు ప్రతీ ఏటా ప్రతీ సీజన్లో ధాన్యం విక్రయించే విషయంలో బాధలు తప్పడం లేదు. వానాకాలం సీజన్లో సమయానికి వర్షాలు కురవకపోవడం, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను అధిగమించేందుకు యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే కొనే వారు కరువయ్యారు. మక్కల కొనుగోలుకు నిరీక్షణ.. జిల్లాలోని 12 మండలాల్లోని రైతులు 29వేలకు పైగా ఎకరాల్లో ఈ యాసంగిలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. జిల్లా మొత్తంగా సుమారు 39,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొని.. ఇప్పటివరకు ఏడింటిని మాత్రమే ప్రారంభించారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో సైతం జొన్నల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం గన్నీ సంచులను అందించకపోవడమే కాకుండా రవాణా చేసే లారీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు చెందిన మక్కలను సైతం నిర్వాహకులు కొనలేని పరిస్థితి నెలకొంది. గన్నీ సంచులు మీరే కొనుగోలు చేసుకోవాలని, తర్వాత బిల్లులు చెల్లిస్తామని నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన.. మూడు రోజుల పాటు జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. మూడు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఇప్పుడు నీటి పాలైతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి జిల్లాలో ఈదురుగాలులు వీస్తూ, ఉరుముల శబ్ధం రావడంతో రైతులు ఆందోళన చెందారు. చేసేది లేక కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న బస్తాలపై పరదాలు కప్పి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షం కురిస్తే మాత్రం మక్కలు దెబ్బతింటాయని, అప్పుడు కొనేందుకు ప్రభుత్వం సైతం కొర్రీలు విధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రైతులు కోరుతున్నారు.గన్నీ సంచులు లేవు.. లారీలు రావు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షణ అకాలవర్షంతో ఆందోళనలో మొక్కజొన్న రైతులు -
వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం
ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి స్నపనంకొలనులో ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం పూజలు నిర్వహిస్తున్న యాగ్నికులుమంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం (స్నపనం) మహానివేదన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకి(సేవ)పై తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. -
మక్కలు కొనుగోలు చేయడంలో విఫలం
రేగొండ: మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్మరించారన్నారు. గన్నీ సంచులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రైతు సదస్సు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంకం రాజేందర్, హమీద్, కానుగంటి శ్రీనివాస్, కడారి జనార్ధన్, పాపిరెడ్డి, రజినికాంత్, నగేష్, గౌస్పాషా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
అడ్మిషన్ల వేట!
ప్రవేశాల కోసం ‘కార్పొరేట్’ విద్యాసంస్థల ప్రయత్నాలుమీ అమ్మాయిని మా కాలేజీలో చేర్పించడానికి ఇప్పుడే సీట్ బుక్ చేసుకోండి. మరికొద్ది రోజులైతే ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.. అంటూ గత కొద్ది రోజులుగా వచ్చే విద్యాసంవత్సరం ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. పదో తరగతి ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులను కలిసి ప్రవేశాల ఎర వేస్తున్నాయి.భూపాలపల్లి అర్బన్: విద్యా వ్యాపారంలో పోటీ పెరగడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తమ సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో సింగరేణి పరిధి కార్మిక, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను పలు రకాలుగా ఆకర్షిస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో సౌకర్యాలను వివరిస్తూ ఇప్పుడే చేరిపోవాలంటూ కోరుతున్నారు. ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లోని పలు కాలేజీలను సందర్శించి వచ్చారు. ఇంకా చాలామంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటర్తో పాటు ఐఐటీ, నీట్, సివిల్స్ ఇతర ఉన్నత విద్య ప్రవేశాల శిక్షణతో సహా ఇంటర్మీడియేట్ విద్యను అందిస్తామని హామీలు ఇస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో అనేకమంది ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారని చెబుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లో ప్రచారం చేస్తున్నారు. ప్రవేశాలకు కమీషన్లు ఆయా సంస్థలు విద్యార్థుల అడ్మిషన్లను బట్టి కమీషన్లు ఇస్తున్నాయి. పీఆర్వోలను నియమించుకుని విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెబుతూ వాయిదాలు, ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యాసంస్థల్లో చదివితే భవిష్యత్లో అవకాశాలు మెరుగు పడతాయనే ఆశతో ఫీజులు చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారు. ఎక్కువగా హాస్టల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పదో తరగతికి మార్కులు అధికంగా వచ్చిన విద్యార్థులను వేరే కేటగిరీలో చేర్చుతూ తల్లిదండ్రులను మెప్పిస్తున్నారు. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతోనూ ప్రచారం చేయిస్తున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మూడు వేలకు పైగా ఉండగా, ఇంకా అనేక మంది ఇతర జిల్లాల్లోనూ చదివారు. ఎక్కువగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్తోపాటు ఇతర నగరాల్లో ఉన్న సంస్థలు అడ్మిషన్లు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి కాలేజీల పరిస్థితి భిన్నంగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేక ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు స్కూల్ విద్యార్థులను సైతం చేరికకు ప్రైవేట్ విద్యాసంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రీ కిడ్స్ నుంచి మొదలు పది వరకు, ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ అంటూ అనేక స్కూళ్ల యాజమాన్యాలు ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి స్కూళ్లు మూతపడే పరిస్థితి వస్తోంది. సెలవులకు ముందు ప్రభుత్వ టీచర్లు అడ్మిషన్ల కోసం ప్రచారం చేసినప్పటికీ ప్రస్తుతం చేయడం లేదు. ఇదే సమయంలో ప్రైవేట్ సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయి. జిల్లా విద్యార్థులే లక్ష్యంగా ప్రచారం సీట్ల కోసం ముందస్తుగానే ఫీజు చెల్లింపులు -
నేడు సమావేశం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం(ట్రస్టుబోర్డు) నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు చైర్మన్ అవధాని మోహన్శర్మ అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల్లో చేయాల్సిన పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించుటపై చర్చించనున్నారు. పలు తీర్మానాలు చేయనున్నారని తెలిసింది. భద్రత ఏర్పాట్లపై.. కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసులతో సోమవారం(నేడు) సమావేశం నిర్వహించున్నారు. గతంలో ఇక్కడ పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది. 8, 9న జాతర మహోత్సవాలు పలిమెల: మండలంలోని నీలంపల్లిలో కొలువైన శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాలు ఈనెల 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ సేవా సమితి బాధ్యులు ఆదివారం తెలిపారు. 8న రాత్రి జాగారాలు, జానపద నృత్యాలు, సోన్నాయి మేలాల ఆటపాటలు ఉంటాయన్నారు. 9న ఉదయం సుప్రభాత సేవ, భక్తుల నదీ స్నానాలు, స్వామివారికి విశేష శాంతి కల్యాణం, పూజలు, మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ, సాయంత్రం రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సౌకర్యం, వసతి, రవాణా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ చిట్యాల: మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడు మోరే ధర్మరాజు, సర్పంచ్ కాసు రమకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణం మూలంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అతి తొందరలోనే ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అందుగుల కుమార్, సట్ల స్వామి, కార్యదర్శి గుర్రం నరేందర్, కోశాధికారి జక్కే వెంకటేశం పాల్గొన్నారు. సంఘాల వైఫల్యంతోనే కష్టాలు భూపాలపల్లి అర్బన్: ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి కష్టాలు మొదలైనట్లు సింగరేణి కోల్మైన్ కార్మిక సంఘ్(బీఎంఎస్) కార్యదర్శి మాధవనాయక్ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వాల విధానాలు, గుర్తింపు సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మండా రమాకాంత్, అప్పాని శ్రీనివాస్, వెలబోయిన సుజేందర్, సత్కూరి శ్రీనివాస్, శ్రీరాములు, ఓ లక్ష్మణ్, భాస్కర్, పని రమేష్, కటకం శ్రీనివాస్, మల్లేష్, రాజునాయక్, దేవర సమ్మయ్య, పునీత్ రావు, ప్రవీణ్, అడప రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం.. నేలవాలిన వరిపంట
మంగపేట : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చిరు జల్లులు పడగా కొత్తూరుమొట్లగూడెంలో గాలిదుమారం భారీగా వచ్చింది. దీంతో పలుచోట్ల కోత దశకు వచ్చిన వరిపైరు నేలవాలింది. మేల్ఫిమేల్ వరిపైరు సైతం నేలవాలడంతో వడ్లు రాలిపోగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. గాలివాన దాటికి గుడిసెల పైకప్పులు ఎగిరిపోవడంతో ఇళ్లలోని బట్టలు, గృహోపకర వస్తువులు తడిసిపోయాయి. ఉన్నతాధికారులు పంటనష్టంపై పరిశీలించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
నేడు ప్రజావాణి
మల్హర్(కాటారం): నేడు(సోమవారం) కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ హరికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్తో పాటు రెవెన్యూ డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నేడు సబ్కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు వారి సమస్యకు సంబంధించిన అంశంపై లిఖిత పూర్వక దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. యువత ఉద్యమించాలి భూపాలపల్లి అర్బన్: ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య భవనంలో ఆయన పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 1959 మే 3న స్థాపించబడిన ఏఐవైఎఫ్ నాటి నుంచి నేటి వరకు యువత హక్కుల కోసం పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తో ఆడుకుంటున్న పాలకులకు యువత తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ‘అందరికీ పని–అందరికీ విద్య’ లక్ష్యం సాధించే వరకు ఏఐవైఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సులభంగా లభిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక నిరాశలో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని అన్నారు. మత్తు అలవాట్లకు దూరంగా ఉండి యువత తమ భవిష్యత్ను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్, సహాయ కార్యదర్శి కృష్ణ, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దేవతామూర్తుల వేదాశీర్వచనం తీసుకుంటున్న బ్రహ్మోత్సవాల యాగ్నికులు వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్న యాగ్నికులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం రాత్రి సదస్యం(వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని యాగ్నికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) కార్యక్రమాల్లో భాగంగా ఏడోరోజు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం. వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఉదయం ఆలయంలో స్వయంభు స్వామివారి నిత్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన, ఆలయ ప్రాంగణంలోని వనదేవత(దైత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం), మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు హయగ్రీవ స్తోత్ర పారాయణం, హవనం, చతుస్థానార్చన, బలిహరణ, స్వామివారి కల్యాణ మండపంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, అమ్మవార్లకు సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, ఏడునూతుల ఈశ్వర్చంద్, అనిపెద్ది రాజీవ్శర్మ, యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరద్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహా చార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ న్యాతని సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఏడోరోజు హేమాచలక్షేత్రంలో సదస్యం వనదేవత (దైత)అమ్మవారికి స్నపనం -
తూకంలో పారదర్శకత పాటించాలి
టేకుమట్ల: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో పారదర్శకత పాటించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవారెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలలోనే లభిస్తుందన్నారు. తూకంలో లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పలు పనులకు శంకుస్థాపన బోర్నపల్లి గ్రామంలో గుట్టు మల్లన్న దేవాలయ నిర్మాణ పనులు, రామకృష్ణాపూర్ (వి)లో బీటీ రోడ్డు పనులు, వెలిశాల (కిష్టయ్యపల్లి) నుంచి రామకృష్టాపూర్(వి) వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెలిశాల నుంచి రాఘవాపూర్ గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు, పెద్దంపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండెం రవీందర్రెడ్డి, కిసాన్ సెల్ అధక్షుడు గోల్లపలి రాజేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
నీట్ ప్రశాంతం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు సిటీ నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 134 మంది విద్యార్థులకు 132మంది విద్యార్థులు హాజరుకాగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 240 మంది విద్యార్థులకు గాను 232 మంది హాజరు కాగా ఎనిమిది మంది గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తనిఖీ చేసిన అనంతరం పరీక్ష హాల్లోని అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన నీట్ పరీక్షకు సకాలంలో హాజరుకాని వి ద్యార్థినిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన లావుడియా వీణ పరీక్షకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. మధ్యాహ్నం 1.30గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 1.40గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పోలీసులు పరీక్ష కేంద్రానికి అనుమతించకపోవడంతో బోరున విలపిస్తూ ఇంటికి తిరిగి వెళ్లింది. పరీక్షకు అనుమతించాలని ఇప్పటివరకు చదివిన చదువు వృథా అవుతుందని అధికారులను వేడుకున్నా పరీక్షకు అనుమతించలేదు. -
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ఆధ్వర్యంలో కేయూ యువజన క్రీడోత్సవాలు ఇటీవల నిర్వహించగా.. శనివారం వర్సిటీలోని పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో విజేతలకు రిజిస్ట్రార్ రామచంద్రం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి ఇతర అతిథులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.భాస్కర్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎటిబిటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది. స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’... ఐదేళ్లుగా అపరిష్కృతం... ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1లోనే ఎల్ఆర్ఎస్ లాక్... 2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.మొత్తం దరఖాస్తులు (2020): 1,58,265ఫీజు చెల్లించినవి: 1,43,121జీడబ్ల్యూఎంసీ పరిధిలో: 96,000పెండింగ్ దరఖాస్తులు: 40 శాతం పైగా క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3 పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1 కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు జూలై 31 వరకు గడువు... పాత దరఖాస్తుదారులకే చాన్స్ ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు.. గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం ఇప్పటికీ పెండింగ్లో 40శాతం దరఖాస్తులు ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం, ఎఫ్టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించి , పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
దళారులకు విక్రయించి మోసపోవద్దు
మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్నాయక్, మహేష్కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. 12న తెలంగాణ జనసమితి ప్లీనరీ భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు, నామాల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధం చిట్యాల: చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని చిన్న వెంకన్న, గోపగాని రవీందర్, ఆరెల్లి కృష్ణమూర్తి, గోపగాని ఆనందం, మేరుగు ప్రభాకర్కు చెందిన మొక్కజొన్న పంటలు శనివారం ప్రమాదవశాత్తు కాలిపోయాయి. సుమారు 14 ఎకరాల్లో వేసిన పంట అగ్నికి ఆహుతి అయినట్లు బాధిత రైతులు విలపించారు. 120 పైపులు పూర్తిగా కాలిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఈప్రమాదంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. యువకుడి ఆత్మహత్య కాళేశ్వరం: తమ్మెట గుళికలు తిని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహదేవపూర్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహదేవపూర్ గ్రామం నేతకానివాడకు చెందిన చిలుమల శ్రీనివాస్ (35)కు భార్యతో మనస్పర్ధలు ఉన్నాయి. సంవత్సరం క్రితం భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తుమ్మెట గుళికలు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు రామచంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పూర్తయ్యేదెప్పుడో?
● జిల్లా కేంద్రంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య ● ఇష్టారాజ్యంగా పార్కింగ్ స్థలాలు, వాకింగ్ పాత్లు కబ్జా ● ఇబ్బందుల్లో పాదాచారులు, వాహనదారులు భూపాలపల్లి: రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జంక్షన్ల అభివృద్ధి ఊసే లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాపారులు రహదారులను సైతం కబ్జా చేస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డంతా మాదే.. పట్టణంలోని జాతీయ రహదారిలో ఉన్న వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం నుంచి జయశంకర్ చౌరస్తా వరకు ఉన్న షాపులకు చెందిన పలువురు యజమానులు తమ సామగ్రిని పార్కింగ్ స్థలాలు, ఫుట్పాత్లపై ఉంచి ప్రదర్శిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు సైతం పార్కింగ్ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. మహిళలు, చిన్నారులు నడిచేందుకు స్థలం లేక జాతీయ రహదారిపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు పొడవునా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న పనులు భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి సుభాష్కాలనీ రామాలయం వరకు బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులకు రూ.3.50 కోట్లు మున్సిపాలిటీ, రూ.4 కోట్లు ఆర్అండ్బీ నిధులు కేటాయించగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం ఈ అభివృద్ధి పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొంతమేరకు మాత్రమే రోడ్డు నిర్మాణం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. దీంతో పట్టణంలోని రెడ్డికాలనీ, ఎల్బీ నగర్, సుభాష్కాలనీ, గాంధీనగర్, రాంనగర్ కాలనీతో పాటు విలీన గ్రామాలైన కాశీంపల్లి, గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, జంగేడు, వేశాలపల్లి తదితర గ్రామాల వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీ కళాశాల ఆవరణ సమీపంలో ప్రతీ గురువారం వారసంత జరుగుతుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పలు షాపుల యాజమానుల అభ్యంతరాల మూలంగానే పనులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కబ్జాలపై చర్యలు తీసుకుంటాం.. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట షాపుల ఎదుట సైడ్ కాలువలు, ఫుట్పాత్లు, పార్కింగ్ స్థలాలపై వ్యాపారులు ఏర్పాటు చేసిన సామగ్రిని తొలగిస్తాం. వ్యాపారులకు నోటీసులు జారీ చేసి పాదాచారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. జంక్షన్ల అభివృద్ధికి సంబంధించి టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. – ఉదయ్కుమార్, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ నత్తనడకన రహదారుల విస్తరణ పనులుఠాణా వైపు రోడ్డు విస్తరణ ఎప్పుడో.. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి క్రిష్ణాకాలనీ వైపు వెళ్లే రహదారి చాలా ఇరుకుగా ఉంది. ఆ రహదారిలో సింగరేణి జీఎం కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, పోలీస్స్టేషన్, అంబేడ్కర్ క్రీడా మైదానం, కేటీకే 6వ గనితో పాటు పలు కాలనీలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డు మీదుగా ప్రతీరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు అనేకమార్లు ఏళ్ల తరబడి ప్రకటిస్తున్నారు. అయినా పనుల ప్రణాళిక కూడా రూపొందలేదు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడమే కాక, అటువైపుగా హోటళ్లు, చికెన్ సెంటర్ల యాజమానులు డ్రెయినేజీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వ్యవసాయాన్ని పండుగ చేశాం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: వ్యవసాయాన్ని పండుగ చేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. జిల్లాలో 30వేల ఎకరాలకు భూమి హక్కులు లేక రైతుల ఇబ్బందులు పడుతున్నారని, సర్వే నిర్వహించి అర్హులైన ప్రతీ ఒక్కరికి భూ హక్కు పట్టాలిస్తామని తెలిపారు. సాదాబైనామా భూములకు కూడా పట్టాలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుందని తెలిపారు. నేతన్న భద్రత బీమా కింద ఇద్దరికి రూ.10 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. దత్తత సహాయ కేంద్రం హెల్ప్డెస్క్ ప్రారంభించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ● స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలి ● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రైతులకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మార్క్ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు, సంస్థ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా.. ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు కొనుగోలు కేంద్రాల్లో గోదాం, హమాలీ, రవాణా సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వీయ జనగణనలో పాల్గొనాలి.. స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు జరుగనున్న స్వీయ జనగణన కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సీపీఓ జవహర్, ఆర్డీఓ హరిక్రిష్ణ, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ఏర్పాట్లు చేయాలి.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై శుక్రవారం ఐడీఓసీ సమావేశం నిర్వహించారు. ఫార్మర్స్ వీక్ కార్యక్రమం విజయవంతం చేయాలి.. ఫార్మర్స్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వంచారు. ఈ కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
హేమాచలుడి తిరుకల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ పెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాదన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. పట్టువస్త్రాలు అందించిన మంత్రి సీతక్క హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి మంత్రి ధనసరి సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ వీరస్వామి, ఉత్సవకమిటీ చైర్మన్ యరంగారి సురేష్, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ దంపతులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ములుగు ఆర్డీఓ వెంకటేష్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్బట్, టీఎస్ ఈజీసీ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, ఆలయ పూజారులు ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్కుమార్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు అనిపెదిద రాజీవ్శర్మ, ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం, సీతారాములు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. 2027లో జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నాటికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. 2027లో జాతరతో పాటు, గోదావరి పుష్కరాల నిర్వహణ ఉండటంతో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆయా నిధులతో రోడ్లు, పుష్కరఘాట్ల అభివృద్ధితో పాటు నూతనంగా గ్రానైట్తో శాశ్వత నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా మన్నారు. జాతరకు ఆర్టీసీ బస్సులు అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలాల నుంచి గుట్టపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఎస్సై టీవీఆర్ సూరీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. శ్రీచక్రానికి అవమానం హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సాక్షిగా హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం యంత్ర శిలకు అవమానం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన చక్రాన్ని ఆలయ అధికారులు ప్రాంగణంలోని ఆర్చీ పక్కన పడేశారు. దాని పవిత్రతను తెలియని కొందరు అక్కడే పాదరక్షలు వదిలారు. ఇది చూసిన ఆంజనేయస్వామి భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కేయూ క్యాంపస్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)– 2026కు ఉమ్మడి జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,016మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1–30గంటలకు మెయిన్ గేట్లను మూసివేస్తారు. ఆ తరువాత వచ్చేవారికి అనుమతించబోరు. దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఇస్తారు. ఆయా అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. హనుమకొండ, వరంగల్లోని పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు స్క్రైబర్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు రెండు జిల్లాల నీట్ నోడల్ ఆఫీసర్ భిక్షపతి తెలిపారు. నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని రావాలి. ● పన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు తీసుకురావొద్దు, ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల ● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ● మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు.జిల్లా సెంటర్లు అభ్యర్థులుహనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476నిబంధనలు అమలు.. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నీట్ నిర్వహణ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన(రేపు) జరుగనున్న నీట్ సందర్భంగా 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలవడం నిషేధమని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదన్నారు. మైకులు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని ఎస్పీ సంకీర్త్ అన్నారు. -
ఎరువుల భారం..
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026● ఈ ఏడాది నాలుగుసార్లు పెంపు ● రైతన్నలపై అదనపు భారంకల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సన్మానం భూపాలపల్లి అర్బన్: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేశ్బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్ర, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రేయి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి టి.కన్హయ్యలాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు పాల్గొన్నారు. బుద్ధుడి బోధనలు ఆదర్శం మల్హర్(కాటారం): బుద్ధుడి బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శమని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కాటారం గారేపల్లిలోని జై భీమ్ అంబేడ్కర్ కార్యాలయంలో బుద్ధుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను అందించి ఆచరించి ప్రపంచ మానవాళికి ఆదర్శనీయులయ్యారని చెప్పారు. ప్రతీఒక్కరు బుద్ధుడి బోధనల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు సంపత్ మహారాజు. యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్. కొండన్న. తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేసినట్లు జేఏసీ జిల్లా చైర్మన్ బురుగు రవి తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు కీలక డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు విజయలక్ష్మి, సుభాకర్రెడ్డి, కిరణ్కుమార్, సేవానాయక్, తిరుపతి, రామయ్య, శ్రీనివాసులు, దశరథం, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్లో బస్తాకు రూ.50.. ఈ యాసంగి సీజన్లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి రూ.300 పెంచడంతో రానున్న సీజన్లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సుమారుగా 96 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రైతులపై భారం.. గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేకపోవడంతో పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 2లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్లకు కలిపి లక్షా 40వేల టన్నుల ఎరువులు ఉపయోగించనున్నారు. దీని ప్రకారం రైతులపై కోట్లలో భారం పడనుంది. పెరిగిన ధరలతో రైతులకు కష్టం.. పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతుంది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు రెండు లక్షల ఎకరాలు ఉండగా సుమారుగా 98వేల మంది రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, జొన్న, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగుచేసే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని ఫర్టిలైజర్ షాపుల యాజమానులు చెబుతున్నారు. ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులపైనే భారం.. ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించేందుకు కృషిచేయాలి. ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి. – రాపాల రాజయ్య , రైతు, కొత్తపల్లి (ఎస్ఎం), భూపాలపల్లి మద్దతు ధర పెంచాలి..ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కానీ రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యానికి కూడా మద్దతు ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఎలవేని నర్సయ్య , రైతు, టేకుమట్లఘనంగా మేడే మేడే వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం కార్మికులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏరియాలోని యూనియన్ కార్యాలయాలు, బొగ్గు గనులు, ప్రధాన కూడళ్ల వద్ద సంఘాల నాయకులు జెండాలు ఎగరవేశారు. – భూపాలపల్లి అర్బన్ఎరువు పాత కొత్త పెంపు (50కిలోలు బస్తా) ధర ధర19–19–19 2.075 2,300 225 20–20–13 1,500 1,800 300 14–35–14 2,175 2,250 75 12–32–15 2.025 2,250 225 పొటాష్ 1.850 1.975 125 16–16–16 1,675 2,050 375 24–24–0 2,000 2,300 300 10–23–26 1,950 2,025 75 15–15–15–09 1,650 1,950 300 14–35–14 2,150 2,350 200 16–20–13 1,400 1,750 350 రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తరువాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016మంది అభ్యర్థులు -
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి
మల్హర్(కాటారం): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఈజీస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, రేగులాగూడెం సర్పంచ్ ఆమని సురేష్ అన్నారు. గురువారం మండలంలోని రేగులగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, సబ్సిడీ యంత్రాల పంపిణీతో రైతును రాజు చేయాలనే ప్రధాన సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పిల్లమరి రమేష్, పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంగోతి సుగుణ, డీసీసీ జనరల్ సెక్రెటరీ కుంభ స్వప్నరెడ్డి, అధికార ప్రతినిధి పంత కాని సమ్మయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమల సందీప్ పాల్గొన్నారు. -
శోభాయమానం.. పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులు, బంతులు, చామంతులు, కనకాంబరాలు తదితరపూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాలు తొలగిపోతాయని భద్రకాళి శేషు తెలిపారు. -
మళ్లీ పుష్కర శోభ
21నుంచి సరస్వతీనది అంత్యపుష్కరాలుకాళేశ్వరం: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో మళ్లీ వెలుగులు విరజిమ్మనున్నాయి. సరస్వతీనది అంత్యపుష్కరాలు ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సుమారుగా 30లక్షల మంది భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కంచి పీఠాధిపతి, గవర్నర్ ప్రతాప్శుక్లా, సీఎం రేవంత్రెడ్డి ప్రారంభపూజల్లో పాల్గొననున్నారని సమాచారం. దీంతో 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ నెలకొననుంది. సమన్వయంతో పనిచేస్తున్న శాఖలు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.38 కోట్ల విడుదల చేయగా.. అధికార యంత్రాంగం తాత్కాలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో బిజీగా ఉంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భక్తులకు తాగునీరు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం, వీఐపీఘాటు వద్ద ప్లాట్ఫామ్ పనులు, రూ.2కోట్ల వ్యయంతో నల్లగొండ పోచమ్మ గుడి నుంచి వీఐపీఘాటు వరకు రోడ్డు పనులు, ఆదిముక్తీశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు, వీఐపీ ఘాటు నుంచి మెయిన్ ఘాటు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. 12 రోజులు హారతి కార్యక్రమాలు.. గతేడాది జరిగిన సరస్వతి ఆదిపుష్కరాల్లో నిర్వహించిన కాశీపండితులతో మళ్లీ అంత్య పుష్కరాలకు గోదావరివద్ద హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 రోజుల పాటు ఎనిమిది మంది బృందంతో హారతి శోభతో వెలిగిపోనుంది. వారి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఆలయంలో హోమాలు ప్రత్యేకంగా చేపడుతున్నారు. 12 రోజుల పాటు రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతులు.. ఆది పుష్కరాల మాదిరిగానే అంత్యపుష్కరాలకు పలువురు పీఠాధిపతులు రానున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. వారి రాకకోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 12 రోజుల పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పుణ్యస్నానాలు చేయనున్నారు. ఆలయంలో దర్శనాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి నదికి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరంలో గొప్పగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.198 కోట్ల వ్యయంతో రాతి కట్టడాలు నిర్మాణం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా పుష్కరాలకు మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో మరోమారు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వేదిక కానుంది. రూ.21.38కోట్ల నిధులు మంజూరు.. పనులు చేపట్టిన ప్రభుత్వం 12 రోజులు హారతి, హోమాలు, పీఠాధిపతుల రాక ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం లక్షలాదిగా తరలి రానున్న భక్తులురాష్ట్ర దేవాదాయశాఖ అధికారులతో పాటు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బుధవారం మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అంత్యపుష్కరాల వాల్పోస్టర్, టీజర్ వీడియోను ఆవిష్కరించారు. దీంతో విస్తృతంగా పబ్లిసిటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. 100 ఎకరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అంతర్రాష్ట్ర వంతెన, వీఐపీ ఘాటు సమీపం, ఎస్సీకాలనీ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతీమాత విగ్రహం వద్ద డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టనున్నారు. -
గ్రాడ్యుయేషన్.. కొత్త భవిష్యత్కు నాంది
కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్కు ఆరంభమని కాళోజీ యూనివర్సీటీ వైఎస్ ఛాన్స్లర్ డాక్టర్ రమే్శ్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ వంటి పేరొందిన కళాశాల నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లి దండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్ల కోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్రెడ్డి కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు -
విద్యుత్ వినియోగం.. ప్రమాద రహితం!
● నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు హన్మకొండ: విద్యుత్ వినియోగంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రత వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. 18 సర్కిళ్లకు నియమించిన నోడల్ అధికారులు వినియోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి విద్యుత్ భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాన కారణాలివే.. ● నిర్లక్ష్యంగా విద్యుత్ పరికరాల వినియోగం, పాడైన, నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం. ● తెగిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి. ● తడి చేతులతో స్విచ్లు, పరికరాలు ఆపరేట్ చేయవద్దు. గృహాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ ఉండాలి. ● మీటర్లు, సర్వీస్ వైర్లు, స్విచ్ బోర్డులు మధ్యమధ్యలో తనిఖీ చేయించుకోవాలి. ● చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వాల్పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకర లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పాత వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఎలాంటి ప్రమాద సూచనలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. 24/7 పనిచేసే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి. – కర్నాటి వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ మోటార్ స్టార్టర్ల వద్ద ఇన్సులేషన్ సరిగ్గా ఉండాలి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయొద్దు. విద్యుత్ లైన్లకు సమీపంలో నీటి పైపులు, లోహ పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. -
పోచమ్మ తల్లికి బోనాలు
భూపాలపల్లి: పట్టణంలోని సుభాష్కాలనీ పోచమ్మ దేవాలయంలో గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్ఠాపన చేసి ఏడాదయిన సందర్భంగా బుధవారం సాయంత్రం అమ్మవారికి అభిషేకం, గురువారం ఉదయం హోమం, పోత లింగన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. సాయంత్రం సుభాష్కాలనీ, రాంనగర్ కాలనీ, మిలీనియం క్వార్టర్స్కు చెందిన మహిళలు పెద్దఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆయా కార్యక్రమాల్లో 29, 17వ వార్డుల కౌన్సిలర్లు గండ్ర హరీశ్రెడ్డి, బీర్తి కమల, మాజీ జెడ్పీటీసీ లట్ట రాజబాబు, ఆలయ కమిటీ సభ్యులు రాజమౌళి, చిట్టిబాబు, ప్రసాద్, రాజేందర్ పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
భూపాలపల్లి: ఏఆర్ ఎస్ఐ అల్లం వేణుగోపాల్, జిల్లా పోలీసు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ బందెల కిష్టయ్యలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్, కిష్టయ్యలను అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ పూలమాల, శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ శాఖలో 36 సంవత్సరాల పాటు నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలు అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. వారి సేవలు శాఖకు ఆదర్శప్రాయమని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ రత్నం, ఎంటీఓ ఆర్ఐ పూర్ణచందర్, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్కుమార్, డీపీఓ ఏఓ ఫర్హాన, కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
● ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం ● నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు చాన్స్ ● ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూడేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమిస్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ భాస్కర్ వారిని శాలువాతో సత్కరించారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన
మొగుళ్లపల్లి : మండలంలోని వివిధ గ్రామాల బాలికలకు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జి.మల్లేశ్వరి హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను అభ్యసించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచేలా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎస్సై సురేష్, ఏపీఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ నవత, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డి నేటర్ గుర్రం తిరుపతి, సఖి కౌన్సిల ర్ మాధవి, అనూష, మమత, కళావ తి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
98.36 శాతం ఉత్తీర్ణత
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఫలితాల్లో వెనుకబడి ఉన్న జిల్లా ముందువరుసలో ఉండాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ మాసం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షల షెడ్యూల్ సీబీఎస్ఈ తరహాలో తయారు చేసి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించారు. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఏర్పడింది. ఫలితంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలించింది. సంవత్సరాల వారీగా ఫలితాలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 122 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 3,541 మంది విద్యార్థులకు గాను 3,483 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 1,750 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1,708 ఉత్తీర్ణత సాధించారు. అలాగే 1,791 బాలికలకు 1,775 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 58 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫలించిన ప్రత్యేక తరగతులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్ష ఫలితాలు 100 శాతం సాధించే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఇందులో భాగంగా 2025 నవంబర్ నుంచి పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు నిర్ణయించిన వాటి కంటే అదనంగా టెస్టులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అభ్యాసదీపిక పేరుతో ముఖ్యమైన ప్రశ్న, జవాబులతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోని ప్రతీరోజు ఉదయం 4 గంటల నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి నిద్రలేపించడం, చదివించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెరుగుతూ.. తగ్గుతూ.. జిల్లాల పునర్విభజన తర్వాత 2016–17 సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో 14 స్థానం, 2017–18లో 5వ స్థానం, 2018–19లో 7వ స్థానాల్లో నిలిచింది. 2019–20, 2019–21వ సంవత్సరానికి కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. 2021–22లో 8, 2022–23లో 5వ స్థానం, 2023–24లో 16వ స్థానం, 2024–25 22వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11వ స్థానానికి పెరిగింది. ఈ ఏడాది 58 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా వీరిలో ఎక్కువగా తెలుగు, గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల నుంచి టెన్త్ ఫలితాల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో రావడం సంతోషకరం. వందశాతం ఫలితాల లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – రాజేందర్, ఇన్చార్జ్ డీఈఓ గణపురం: మండలంలోని గాంధీనగర్ మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఎస్.వేదిత 579 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఎం. లక్ష్మిప్రసన్న 576, కే. అర్చన 573, బి.వైష్ణవి 570, సాయిప్రియ 569, ఏ.రోజా 568 మార్కులు సాధించారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడాలి
ఏటూరునాగారం: బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బుధవారం బాలల భద్రత, సంరక్షణ, డ్రగ్స్ నిర్మూలన వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పౌరులందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ గంటా మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనేక చోట్ల డబ్బులు పోగొట్టుకుని ఇ బ్బంది పడుతున్న విషయాలు చూస్తున్నామన్నా రు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్న చిన్న విషయాలకు ఆకర్షణకు గురవుతుంటారని వివరించారు. తల్లిదండ్రులు వారిపట్ల బాధ్యతగా ప్రేమతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయఽశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ రాహుల్ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్ పోస్టర్, పుష్కరాల టీజర్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, గోవిందహరి, కృష్ణవేణి, రామకృష్ణారావు, ఈఓ మహేష్, దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ, అర్చకులు పణీంద్రశర్మ, శరత్చంద్ర, ధర్మకర్తలు శ్యామ్, పద్మ, అశోక్, సత్త య్య, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు పుష్కరాల వాల్పోస్టర్ ఆవిష్కరణ -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు
భూపాలపల్లి అర్బన్: మేడే పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ ఓపెన్ టెండర్లను వ్యతిరేకిస్తూ సింగరేణి సంస్థను కాపాడుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు మరింత బలపడాలన్నారు. ఉద్యోగ భద్రతకు కార్మిక వర్గం సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులపై లేబర్ కోడ్లు అమలు చేసి పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి జనార్దన్, పిక కిరణ్, కాసర్ల ప్రసాద్రెడ్డి, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, ఐత్య బాబు, రాళ్లబండి బాబు, జయశంకర్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని పాల్సబ్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు పద్మదేవ్సింగ్, నల్లెల స్వాతి, భరత్ కుమార్, తిరుపతి రెడ్డి, తదితరలు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
● సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ఆదేశించారు. బుధవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు. డైరెక్టర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్స్–2026లో జరిగిన కీలక మార్పులు, ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో నమోదైన ప్రమాదాలు, వాటి కారణాలు, నివారణ చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని గనుల అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ గత సమావేశ నిర్ణయాల అమలు స్థితిని సమీక్షించిన అధికారులు, కొత్తగా తీసుకొచ్చిన సేఫ్టీ సవరణలు గనుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. భద్రతా ప్రమాణాల అమలు విధానం, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. గతంలో జరిగిన ప్రమాదాలపై విశ్లేషణ చేస్తూ, మానవ తప్పిదాలు, యంత్రాంగ లోపాలు, భద్రతా నిబంధనల నిర్లక్ష్యం తదితర ప్రధాన కారణాలను గుర్తించారు. భవిష్యత్లో ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, కార్మికులకు నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతీ ఉద్యోగి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సంస్థలో సేఫ్టీ సంస్కృతి బలపడాలని, జీరో ప్రమాద లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఓసీ త్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ భిక్షమయ్య, గనుల మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా గరుడాదివాసం
మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల క్షేత్రంలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం గరుడాదివాసం కార్యక్రమాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండోరోజూ కార్యక్రమంలో భాగంగా ఆల య ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని పంచముఖాంజనేయ స్వామి వారి కి స్నపనం (అభిషేకం) పూజలు నిర్వహించారు. యాగశాలలో పూజలు యాగశాలలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సేవాకాలం, బాలబోగం నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా వైనతేయ లేఖనం (గరుడ) గరుడ చిత్రపటం వేసి ఆవాహనం పూజలు నిర్వహించారు. నేత్రోన్మీలన, గరుడాదివాసం, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభు స్వామివారికి వేదమంత్రోశ్చరణతో ప్రత్యేక అర్చనలు జరిపించి వెండి కవచం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్ శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయమైన ఘటనలు తలెత్తకుండా నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామికి స్నపనం స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి ఆభరణాల అలంకరణ -
తాగి నడుపుడు.. పోలీసులకు దొరుకుడు
భూపాలపల్లి: ఆ సెంటర్లో పోలీసోళ్లు ఉంటరు.. బండి ఈ సందులో నుంచి పోనియ్యి... అరె అక్కడ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు.. బైక్ ఇక్కడే ఆపు. కొద్దిసేపు ఆగి, పోలీసులు వెళ్లాక వెళ్దాం.. మద్యం సేవించి వాహనం నడిపే వారు ప్రతీ రోజు తీసుకునే జాగ్రత్తలు ఇవి. మందు తాగి వాహనం నడపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా, పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ప్రతీ రోజు ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనం నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రంకెన్ డ్రైవ్ వలన జరిగే ప్రమాదాలు, అనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నాం. వాహనదారులు తమ బాధ్యతను గుర్తించి మద్యం సేవించి వాహనం నడపొద్దని మా సూచన. – సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ గడిచిన మూడు నెలల కాలంలో (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 90 రోజుల వ్యవధిలోనే పోలీసులు 344 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సగటున రోజుకు సుమారు నలుగురు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఇప్పటివరకు 142 మంది వాహనదారులు కోర్టు ముందు హాజరుకాగా, వారికి న్యాయస్థానం రూ. 1,50,360 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు, ఒకరికి జైలు శిక్ష కూడా విధించింది. మిగిలిన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ●డ్రంకెన్ డ్రైవ్ వలన జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడికి మాత్రమే కాక రోడ్డుపై వెళ్లే అమాయకులు కూడా బలి అవుతున్నారు. ఇంటి యజమాని మత్తులో చేసే చిన్న పొరపాటుతో భార్యాపిల్లలు అనాథలవుతున్న ఉదంతాలు జిల్లాలో అనేకంగా ఉన్నాయి. పోలీసులు ఎంతో ఓపికతో నెలలో నాలుగైదుసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మూడు నెలల్లో 344 కేసులు ఒకరికి జైలు శిక్ష, 142మందికి జరిమానాలు మందుబాబుల్లో కానరాని మార్పు -
వైద్య కళాశాలలో అవగాహన
భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మెడికల్ కళాశాలలో షీ టీం– భరోసా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, లింగ సమానత్వం, బాలల రక్షణ, మహిళలపై వివక్ష, హింసాత్మక చర్యలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు, పిల్లల భద్రతకు ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 1930, 1098 నంబర్లను సంప్రదించాలన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు భూపాలపల్లి షీ టీంను 87126 58162 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని షీ టీం ఎస్ఐ మహ్మద్ ఫజల్ ఖాన్, భరోసా ఎస్ఐ స్వప్న కుమారి సూచించారు. మే డేను విజయవంతం చేయాలి భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన మే డేను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ వరంగల్, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు రాజేందర్, రాయిశెట్టి సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడుల రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినం మేడే వీరుల త్యాగ ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింగం, నవీన్, సమ్మయ్య పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్మన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ దేవుల పల్లి విజయ్కుమార్, వంగపండ్ల రవి పాల్గొన్నారు. -
ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జాగ్రత్తలు
భూపాలపల్లి అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై బూత్ స్థాయి అఽధికారులు జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రసునాంబ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి మండలంలోని బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కీలక సూచనలు జారీ చేశారు. 2025–2002 ఓటరు జాబితాలో షిఫ్టింగ్, డబుల్, డెత్ కేసులను గుర్తించి సంబంధిత జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఓటర్ల విషయంలో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఫారం–7 దరఖాస్తులు సమర్పింపజేయాలని సూచించారు. బీఎల్ఓ యాప్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాలను సమగ్రంగా మ్యాపింగ్ చేసి, నమోదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి, ఓటరు జాబితా శుద్ధిని ఖచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, డీటీ అంజలిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల సంఘం పరిశీలకులు -
– సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. కిన్నెర గుంశావలి (ఫైల్)విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో పలువురు రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తాలు పేరుతో కటింగ్ చేస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. మిల్లర్ల కటింగ్లతో ఒక్కో లారీకి రూ.30వేల నుంచి రూ.40వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు మించి కటింగ్ చేయడం అన్యాయమన్నారు. కటింగ్లను వెంటనే నిలిపివేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రామస్వామి, నరసింహ నాయక్, సాంబశివుడు, సుధాకర్ రెడ్డి, చందూలాల్, సదానందం, సాంబయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. తాలు పేరుతో కటింగ్లకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లు నిరసిస్తూ ఎన్హెచ్పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో -
క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్ను సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాన్ని జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులు వేసవి సెలవులను సమర్థంగా వినియోగించుకుని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. క్యాంప్లో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ క్రీడల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మే 22వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుందని, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని వివరించారు. క్రమబద్ధమైన శిక్షణతో పాటు క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ నాయకులు హుస్సేన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు.జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డి -
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొడవటంచ ఆలయ సందర్శన రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ సెషన్ జడ్ఙి రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది. కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పండ్లు సమర్పించారు. వీరితో పాటు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం పాల్గొన్నారు. -
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్లపర్వం తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లేఅవుట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడిన మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
పుస్తకాలొచ్చాయ్..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన డిపోకు చేరుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలు అందజేయనున్నారు. ఈ మేరకు 1.48లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి జూన్ మాసంలో బడిబాట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా పంపిణీ.. జిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా మండలాల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలిస్తారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు పంపించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. 1,48,880 పుస్తకాలు అవసరం ఉండగా 90,320 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన పుస్తకాల డిపోకు చేరుకోగా మండలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పార్ట్–2లో 42వేల పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అక్టోబర్ మాసం వరకు మిగితా పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నోట్ పుస్తకాలు సైతం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచితంగా నోట్ పుస్తకాలు అందిస్తుంది. ప్రతీ సబ్జెక్ట్కు ఒక్క నోట్స్ చొప్పున అన్ని సబ్జెక్ట్లకు అందించనున్నారు. ఈ నోట్ పుస్తకాలు కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య అధారంగా పాఠశాలకు పంపిస్తారు. 24వేల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందించనున్నారు.జిల్లాకు ఇప్పటికే 60శాతం పుస్తకాలు చేరుకున్నాయి. మిగితా పుస్తకాలు కూడా ఈ వారం రోజుల్లో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను భద్రపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముందస్తుగానే సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపిస్తాం. – బానోత్ సమ్మయ్య, పుస్తకాల డిపో మేనేజర్●జూన్ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న ప్రతీ విద్యార్థికి పుస్తకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయిలో సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందజేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ప్రాథమిక పాఠశాలలు 319 విద్యార్థుల సంఖ్య 24వేలు జిల్లాకు చేరిన 60 శాతం పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో 24వేల మంది విద్యార్థులు -
పెట్రోల్, డీజిల్.. నో స్టాక్
రేగొండ/చిట్యాల/మొగుళ్లపల్లి: రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్, డీజీల్ కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు టిన్నులతో బంకుల వద్ద క్యూలైన్లు కట్టారు. దీంతో సాయంత్రం వరకు ఆయా బంకుల ముందు తాళ్లు కట్టి, నోస్టాక్ బోర్డు పెట్టి బారికేడ్లు పెట్టారు. చిట్యాల మండలంలోని చిట్యాల, చల్లగరిగ, జూకల్, కొత్తపేట గ్రామాలలోని పెట్రోల్ బంక్లలో డీజిల్, పెట్రోల్ లేక వాహనాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాదారులు బంకుల వద్దకు రాగానే నో స్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులు కంగుతిన్నారు. మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం జనాలు బారులుదీరారు. డీజిల్ కోసం పెద్దఎత్తున క్యాన్లు పట్టుకొని బంకుల వద్ద భారీ క్యూ లైన్లో నిలబడ్డారు.● ఇబ్బందుల్లో వాహనదారులు ● జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత భూపాలపల్లి: జిల్లావ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 43 పెట్రోల్ బంకులు ఉన్నాయి. బంకుల్లో సోమవారం ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొరత విషయం తెలుసుకున్న వాహనదారులు సాయంత్రం పలు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరారు. దీంతో ఆయా బంకుల్లో సైతం పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ అయ్యాయి. యుద్ధం కారణంగా కొరత ఏర్పడిందని తెలుస్తోంది. పెట్రోల్ బంకుల యజమానులు ముందస్తుగా ఇండెంట్ పంపినప్పటికీ చమురు కంపెనీల నుంచి ఇంధనం రావడానికి రెండు, మూడు రోజులు పడుతుందని ఓ పెట్రోల్ బంక్ యజమాని తెలిపారు. సాధారణంగా నాలుగు రోజుల పాటు విక్రయించే స్టాక్ ఒక్కరోజే అయిపోయిందని సదరు పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు జిల్లాలోని ఒక్క బంకులో కూడా పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రామప్పలో అధికారుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) అధికారులు సోమవారం సందర్శించారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈడీ ఎస్కే.గుప్తా, జేఈ చౌదరి, జేజీఎం బాలేందర్ కుమార్, డీజీఎంలు ఉమేష్కుమార్, పర్వింద్ర తివారి, వాసీమ్, ఏజీఎం గోపాలకృష్ణ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వారికి స్వామివారి శేషావస్త్రాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకల సంపద బాగుందని వారు కొనియాడారు. అలాగే రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన ఎడ్నోల్స్ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
నీట్ ప్రశాంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నీట్ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ.. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో 374 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, డిగ్రీ కళాశాలలో 240 మంది, జూనియర్ కళాశాలలో 134 మంది హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, డీటీఓ సంధాని, డీఈఓ రాజేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నోడల్ అధికారి రమణారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. యాంటి డ్రగ్స్పై అవగాహనకు కార్యాచరణ.. జిల్లాలో బాలల సంరక్షణ, మహిళా శ్రేయస్సు, యువతలో యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన పెంపు లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో చిల్డ్రన్స్ వీక్ కార్యక్రమం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మళ్లీశ్వరి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 73 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
ఎవరి వాటా వారికి రావాల్సిందే..
భూపాలపల్లి రూరల్: ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదన్నారు. భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాదం కుమారస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, వివిధ సంఘాల సనాయకులు అజ్మీర సమ్మయ్య, రాదండి దేవేందర్, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్, భీమనాదని సత్యనారాయణ, సాయిబాబా, మేకల సుమన్, కొత్తూరు రవీందర్, చిట్యాల శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. కుల గణన చేస్తే సరిపోదు.. సంపదను పంచాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ -
రైస్మిల్లులకే..
భూపాలపల్లి: దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు వేసవిలో ఇబ్బంది ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు దళారులు, రేషన్ డీలర్లు బియ్యాన్ని కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని పలు రైస్మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే అప్పగించేందుకు పలువురు మిల్లర్లు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ, ఎఫ్ఎస్సీ, అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలు సుమారుగా 1,38,234 ఉండగా, 3,91,353 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్కు 6 కేజీల చొప్పున ప్రతీ నెల 25,36,167 కేజీల బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈసారి వచ్చిన సన్నబియ్యం అంతగా నాణ్యత లేవు. నూకశాతం కూడా ఎక్కువగా ఉంది. దీంతో లబ్ధిదారులు వాటిని వండుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న జిల్లాలోని పలువురు డీలర్లు... లబ్ధిదారులతో వేలిముద్ర వేయించుకొని కేజీ బియ్యానికి రూ.12నుంచి రూ.15 చొప్పున లెక్కకట్టి ఫోన్ పే చేస్తున్నారు. ఇండెట్లో తేడా రాకుండా ఉండేందుకు అదే రోజు రాత్రి ఆ బియ్యం మొత్తాన్ని రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. 10 క్వింటాల నుంచి 20 క్వింటాల బియ్యం జమ అయ్యాక అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని రైస్మిల్లులకు తరలిస్తున్నారు. దళారుల దందాలో మార్పు లేదు. జిల్లాలోని ప్రతీ మండలంలో ఒకరిద్దరు దళారులు రేషన్ బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ. 20 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. ఆ బియ్యం పెద్ద మొత్తం అయ్యే వరకు గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. దళారులు సేకరించిన బియ్యాన్ని జిల్లాలోని కొందరు రైస్మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏస్ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్(సంచులు మార్చి) చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్లకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖతో పాటు పోలీసుశాఖలోని కొందరు అధికారులు ఈ అక్రమ దందాకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీడీఎస్ బియ్యం రవాణాపై పెద్దగా దాడులు జరగడం లేదని తెలుస్తోంది. పేదల బియ్యం పక్కదారి జోరుగా సాగుతున్న అక్రమ దందా బస్తాలు మార్చి సీఎంఆర్కు సిద్ధం చేస్తున్న మిల్లర్లు -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. మే 1న స్వామివారి తిరుకల్యాణం హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుల అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలిసి భక్తులకు కోరిన వరాలిచ్చే లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తులకు గర్భాలయంలో ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్నారు. అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చింతామణి జలపాతం.. నాభిచందన ప్రసాదం ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం ఆలయానికి వచ్చే భక్తులు ఔషధ గుణాల ప్రసాదంగా బావిస్తుంటారు. హేమాచల కొండపై నుంచి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో ఒకే విధంగా చింతామణి జలపాతం భూమి లోపలి నుంచి పారుతూ ఉండటం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి జలపాతం వద్ధ స్నానమాచరిస్తారు. జలపాతం నుంచి వచ్చే నీరు అతి శీతలంగా ఔషధ గుణాలు కలిగి మినరల్ వాటర్ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా పాడై పోకుండా ఉండటంతో నీటిని రోజు సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు. అలాగే ఆలయంలో ప్రతీ శని, ఆదివారం స్వామివారి నాభి నుంచి స్రవించే ద్రవాన్ని మంచి గందంతో కలిపి(నాభి చందనం) సంతానం లేని వారు సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనం -
కాంగ్రెస్కు మహిళలు గుణపాఠం చెప్పాలి
ములుగు రూరల్: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సంబురాలు జరుపుకోవడం దారుణమన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా డిలీమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే దక్షణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించి బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగేదని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, సుమలత, జాడి వెంకట్, నరేశ్ పాల్గొన్నారు. -
సమస్యల స్వాగతం
ఐటీడీఏ పీఓకు.. తెరుచుకోని టైలరింగ్ శిక్షణ కుట్టుమిషన్ల కేంద్రం ● ఈఎస్ఎస్లో గ్రౌండింగ్ అంతంతే.. ● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సరళీకృతం ● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులు ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా లెనిన్ వాత్సల్ టొ ప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బా ధ్యతల చేపట్టిన పీఓకు మాత్రం ఐటీడీఏలో నెలకొ న్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్) పథకంలో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని పథకం కింద ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఆర్థిక శాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్కు నిధులు వస్తేగానీ బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలను తెరపైకి తేవడంతో ఈఎస్ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఇటీవల పీఎం కుసమ్ యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి వాటిని కేవలం కాగితాలకు పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పా టు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు. శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. హార్టికల్చర్ నర్సరీలో గతంలో రూ.23 లక్షలు వెచ్చించి పామాయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయగా ఒక్క మొక్క కూడా బతకలేదు. దీంతో రూ. 23 లక్షల నిధులు బురదలో పోసినట్లు అయ్యింది. మళ్లీ ఆ భూమిలో పండ్ల తోటల కోసం ప్లాన్ చేశారు కాని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇలా అనేక సమస్యలతో ఐటీడీఏ కొట్టుమిట్టాడుతోంది. ఇవేకాకుండా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గిరివాణిలో అనేక మంది గిరిజనులు వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన టొప్పో తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కాని ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అంతేకాకుండా కొంత మందికి ఇటుకల తయారీకి మిషనరీలు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమలను నడపడం లేదు. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి తుప్పుపట్టిపోతుంది. ఇదేకాకుండా న్యూట్రిబాస్కట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు దానిని మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు. -
వాసవి మాత జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: వాసవి మాత జయంతి వేడుకలను ఐడీఓసీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని వాసవి మాతకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు మా ట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా జరుపుకునే వాసవీ మా త జన్మదినం ఎంతో పవిత్రమైనదన్నారు. పార్వతీ దేవి అవతారమైన వాసవి మాత అహింసా మార్గాన్ని అనుసరించి సమాజానికి శాంతి, సామరస్యాని కి ప్రతీకగా నిలిచిన గొప్ప దైవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్ఐ అడ్మిన్ రత్నం వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రక్షణ పరికరాలు అందజేయాలి
భూపాలపల్లి అర్బన్ : నూతనంగా సింగరేణి ఉద్యోగంలో చేరిన కార్మికులకు రక్షణ పరికరాలు (బూట్లు, టోపీలు) తక్షణమే అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలు లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాజమాన్యం స్పందించి తక్షణమే రక్షణ కిట్లను అందజేయాలన్నారు. క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజేపల్లి సుధాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటు మల్హర్(కాటారం): రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపూర్ క్రాస్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పోలీసులు సూచిస్తున్నారు. బకాయిలు విడుదల చేయాలి భూపాలపల్లి అర్బన్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నేడు (సోమవారం) కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం, 28న విద్యార్థులతో కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా ఫిర్యాదు చేయడం, 29న జిల్లాలోని డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు మాడ హరీశ్రెడ్డి, యుగేంద్రాచారి, ఆకుదారి మనోహర్, వంశీ, 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్, బీఆర్ఎస్వీ నాయకులు భూక్య హరీశ్, కత్తి వినయ్, కళ్లపల్లి ప్రేమ్దేవ్ పాల్గొన్నారు. బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగారపు భిక్షపతి, విష్ణుమూర్తి, గురుమూర్తి, కాజుబోజు సూర్యప్రకాశ్, వేణు, రమేష్, దేవేందర్, రామ్మూర్తి, సమ్మయ్య, అంజి పాల్గొన్నారు. -
మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్
భూపాలపల్లి: ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి జనగణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ తన నివాసంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంలో స్వయంగా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడంతో ప్రజల సమయం ఆదా అవుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసిన ప్రతీ ఒక్కరు ఐడీ నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్ పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరు పాల్గొనాలి.. జనాభా లెక్కల స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియపై ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వీయ గణన ప్రక్రియ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమం జనాభా గణన 2027 కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు ప్రతీ ఒక్కరూ పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ జవహర్, డీపీఆర్ఓ శీలం శ్రీనివాస్, ఆర్డీఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
మల్లూరుగుట్టపై మంటలు
● హేమాచలక్షేత్రంలో రెండు రోజులుగా కార్చిచ్చు ● కాలిబూడిదవుతున్న అటవీ సంపద ● అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణులు మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి కొలువైన మల్లూరుగుట్ట్ట అటవీ ప్రాంతం కాలిపోతోంది. రెండు రోజుల నుంచి గుట్టపై భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో గుట్టకు అతి సమీపంలోని కొత్తమల్లూరు, మల్లూరు గ్రామాల ప్రజలు మంటల వేడికి గురవుతున్నారు. మల్లూరు నుంచి చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట వరకు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న గుట్టల్లో వారం రోజుల నుంచి కార్చిచ్చుతో అడవులు దగ్ధమవుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు అతి సమీపంలోని అదే గుట్టకు మరో వైపున గల హేమాచల లక్ష్మీనర్సింస్వామి ఆలయ ప్రాంతం నుంచి శనిగకుంట, పూరేడుపల్లి, వాగొడ్డుగూడెం వరకు గుట్టను మంటలు చుట్టు ముట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధికి మించి ఉన్న గుట్టపై గల లక్షలాది రూపాయల విలువైన సండ్ర, జిట్రేగు, నల్లమద్దితో పాటు తదితర విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. వన్యప్రాణుల ప్రాణాలు గాల్లోకి.. హేమాచలక్షేత్రం సమీప అటవీ ప్రాంతంలో చింతామణి జలపాతం, దేవునికుంట, దబ్బతోగు, చుంచుపల్లి సమీపంలోని మామిడితోగు, రమణక్కపేట, ఎర్రమ్మతోగు తదితర తోగులతో పాటు పలు ప్రాంతాల్లో నీటి ఊటలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా నీటి వసతి ఉండటంతో ఆయా అటవీ ప్రాంతాల్లో సంచరించే అడవి పందులు, కొండ గొర్రెలు, నక్కలు, తదితర జాతుల వన్యప్రాణులు అడవిలోని మంటల్లో చిక్కుకుని ఆహుతవుతున్నాయి. ఈ మంటల వేడికి తాళలేక ప్రాణాలు దక్కించుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లోకి పలు రకాల జంతువులు వచ్చి వేటగాళ్లకు చిక్కి బలవుతున్నాయి. హోర్డింగులు తప్ప చర్యలేవి? వేసవికాలంలో అడవులు దగ్ధం కాకుండా ఉండేందుకు ఫైర్లైన్స్, కార్చిచ్చు కారణంగా ఏర్పడే మంటలను ఆర్పేందుకు ఎయిర్ మెషిన్ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు. బేస్క్యాంప్ సిబ్బంది ఏర్పాటుతో పాటు అడవుల్లో నివసించే వన్య ప్రాణులను కాపాడేందుకు వివిధ రకాల చర్యల పేరుతో అటవీశాఖ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అడవికి నిప్పు మానవాళికి ముప్పు, అడవులను కాపాడుకుందాం అంటూ ఏజెన్సీలోని అభయారణ్యంలో అటవీశాఖ హోర్డింగులు ఏర్పాటు చేయడం తప్పా ఆచరణ మచ్చుకు కూడా కానరావడం లేదని వనప్రేమికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని జిల్లా సరిహద్దులోగల అటవిశాఖ చెక్పోస్టు నిర్వహణ అధికారులు, సిబ్బందితో పాటు దోమెడ, రాజుపేట, మల్లూరు సెక్షన్ల ఎఫ్ఎస్ఓ, బీట్ అధికారులు నిత్యం మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయానికి విధులపై వచ్చి వెళ్తుంటారు. వీరికి రాజుపేట మొదలుకుని మల్లూరు వరకు రోడ్డును ఆనుకుని ఉన్న గుట్ట అటవీప్రాంతం దగ్ధమవుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయుర్వేద వృక్షసంపద కనుమరుగయ్యే ప్రమాదం ప్రపంచ ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే సహజ సిద్ధ అడవులు దగ్ధం అవుతున్నాయి. అయినా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. అధికారుల తీరు చూస్తుంటే భవిష్యత్లో అడవులు అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుందని వనప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ప్యాక్స్’ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’ త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరక్టర్ సభ్యులు స్థానాలువరంగల్ అర్బన్ 12 156 30,317 (హనుమకొండ) వరంగల్ రూరల్(వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలుమొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260 -
మలేరియా నివారణకు జాగ్రత్తలు
చిట్యాల: మలేరియా నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సీహెచ్.మధుసూదన్, మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్ అన్నారు. శనివారం మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల చుట్టూ మురికి నిల్వలు ఉండకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని కోరారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించడం ద్వారా దోమల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఒడితల వైద్యాధికారి మౌనిక, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సుధాకర్, జిల్లా అకడమిక్ రమేశ్, సబ్ యూనిట్ అధికారులు హలీం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ -
దసుముడి కవితా సంకలనం ఆవిష్కరణ
హన్మకొండ: ఓరుగల్లు పోరాట వారసత్వాన్ని కవిత్వం రూపంలో వనపాక దిలీప్ రాస్తున్నారని ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దిలీప్ రాసిన దసుముడి కవిత సంకలనాన్ని మానవ హక్కుల వేది ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యురాలు, సీనియర్ జర్నలిస్ట్ వేమన వసంత లక్ష్మి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ బాలగోపాల్ వారసత్వాన్ని, ఆలోచనలు నింపుకున్న దిలీప్ ఈ తరం యువతకు ఆదర్శం అన్నారు. వేమన వసంత లక్ష్మి మాట్లాడుతూ దిలీప్ ఆలోచనలు భావస్పోరకం అన్నారు. ప్రధాన వక్త యాకూబ్ మాట్లాడుతూ.. సంకలనంలోని వివిధ కవితల్లో అతి ముఖ్యమైన పద బంధాలను వివరించారు. కవి తగుళ్ల గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, ప్రముఖ నవలా రచయిత పి.చందు, డాక్టర్ చంద్రబాను, యువకులు పాల్గొన్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిబిరం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా పరిధిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 సమ్మర్ క్యాంపులో భాగంగా 18 ఏళ్ల లోపు బాలబాలికలకు ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ శిబిరం ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు స్థానిక కృష్ణ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుందని తెలిపారు. శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడల్లో నిపుణులైన శిక్షకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ క్రీడలో 20 నుంచి 25 మంది వరకు ఎంపిక చేసి మొత్తం 25 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు తమ పిల్లల పేర్లను ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. మరణంలోనూ మానవత్వం మొగుళ్లపల్లి: మండలంలోని పాత ఇస్సిపేట గ్రామానికి చెందిన పసరగొండ శ్రీధర్ హైదరాబాద్లో నివాసముంటూ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన కుటుంబసభ్యులు శనివారం నేత్రదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ భార్య స్వప్న, కుమారుడు బాలరాజు పటేల్, తల్లి సరలక్ష్మి తీసుకున్న నిర్ణయంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది నేత్రాలను సేకరించారు. మరణానంతరం కూడా మరొకరికి చూపునివ్వడం గొప్ప విషయమని గ్రామస్తులు ఈ కుటుంబాన్ని అభినందించారు. 28న బహిరంగ వేలం రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన మడ్తపల్లి గ్రామంలోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం ఈనెల 28న మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గ సమావేశం కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) మొదటి సమావేశాన్ని ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. రామప్పలో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ (డీడీజీఈ ఢిల్లీ) అభిషేక్ అగర్వాల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట హైదరాబాద్ దూరదర్శన్ డైరెక్టర్ వెంకటరమణ, టూరిజం అధికారులు ఉన్నారు. దూరవిద్య డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డిఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
క్రీడా శిబిరాలకు వేళాయె
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన క్రీడాకారులు, పీఈటీల పర్యవేక్షణలో శిక్షణ అందించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోనే 40 రోజుల పాటు ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 24న వేసవి శిబిరాలను ప్రారంభించారు. వేసవిలో ఇళ్లలో ఖాళీగా ఉండే పిల్లలకు ఇది చక్కటి అవకాశం. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హులు. వేసవి సెలవులు వృథా కాకుండా వారికి ఇష్టమైన ఆటల్లో ప్రత్యేక శిక్షణ కల్పించనున్నారు. ఆధునిక యుగంలో పిల్లలు స్మార్ట్ పోన్లు, టీవీలకు అతుక్కుపోయి, చిన్న వయసులోనే అనా రోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. సెలవులను గ్రామీణ, పట్టణ ప్రాంత పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్లుగా ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ఆవరణ, అందుబాటులో మైదానాలు, క్రీడా ప్రాంగణాల్లో ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60వేల నిధులు కేటాయించింది. ఒక్కో కోచ్కు రూ.5 వేల చొప్పున, మొత్తం జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించుకోవడానికి రూ.50 వేలు కోచ్లకు గౌరవ వేతనం కోసం కేటాయించారు. ప్రమాదంలో గాయాలైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ కిట్కు ఇతరత్రా నిర్వహణకు రూ.10 వేలు ఖర్చు చేయనున్నారు. ఆటలకు దూరమైన పాఠశాలలకు చెందిన పిల్లలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో సమయాన్ని వృథా కాకుండా ఇష్టమైన ఆటను నేర్చుకుని పట్టు సాధించే అవకాశం ఉంటుంది. సమయ పాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాటు, ఆటలు ఆడుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలుంటాయి. ఈ క్రీడల్లో పతకాలు సాధిస్తే క్రీడా కోటా కింద ఉన్నత విద్య నభ్యసించవచ్చు. ఉపాధి అవకాశాలకు కూడా ఆ పతకాలు ఎంతో ఉపయోగపడుతాయి. కాటారం ఖోఖో చల్లగరిగ కబడ్డీ గణపురం బాల్బ్యాడ్మంటన్ మహదేవపూర్ వాలీబాల్ అంబట్పల్లి వాలీబాల్ టేకుమట్ల షటిల్ బ్యాడ్మంటన్ అందుకుతండా కబడ్డీ వేములపల్లి బాల్బ్యాడ్మంటన్ నైన్పాక బాల్బ్యాడ్మంటన్ గంగారం కబడ్డీ కాటారం అథ్లెటిక్స్ అంబేడ్కర్ స్టేడియం క్యారమ్స్, అథ్లెటిక్స్, భూపాలపల్లి బాస్కెట్బాల్ జంగేడు వాలీబాల్ మంజూర్నగర్ తైక్వాండో మున్సిపల్ గ్రౌండ్ కబడ్డీ, అథ్లెటిక్స్ భూపాలపల్లి 10 చోట్ల శిక్షణ శిబిరాలు క్రీడాకారులకు అవకాశంవేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు నిర్వహిస్తారు. ఇప్పటికే కోచ్ల నియామకం పూర్తిచేసి శిబిరాలను ప్రారంభించాం. శిక్షణ శిబిరాల్లో తాగునీరు, తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మెడికల్ కిట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలి. సీహెచ్ రఘు, జిల్లా యువజన క్రీడల ఇన్చార్జ్ అధికారి -
శాసీ్త్రయ పద్ధతిలో ఇసుకను తొలగించాలి
భూపాలపల్లి: చెక్డ్యామ్లలో పేరుకుపోయిన ఇసుకను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్హర్ మండలంలోని వివిధ చెక్డ్యామ్లలోని ఇసుకను డీ–సిల్టింగ్ ద్వారా తొలగించే అంశాలపై చర్చించారు. వల్లంకుంట గ్రామం వద్ద అడవిసోమన్పల్లి చెక్డ్యామ్, మల్లారం గ్రామంలోని చిన్న ఓదెల చెక్డ్యామ్, తాడిచెర్ల గ్రామంలోని గోపాల్పూర్, ఖమ్మంపల్లి చెక్డ్యామ్లలో ఇసుక తొలగింపుపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, మైనింగ్ ఏడీ జయరాజ్, టీజీఎండీసీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. అర్హులకు అక్రిడిటేషన్ కార్డులు.. అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాహుల్ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2026–2028 సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యే అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మీడియా ప్రతినిధుల నుంచి 330 దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీపీఆర్వో శీలం శ్రీనివాస్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు క్యాతం సతీష్, మంతెన సమ్మయ్య, ఎర్రం సతీష్, మోబిన్ అహ్మద్, సారేశ్వరరావు, మధు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి.. వైద్య కళాశాల, వైద్య విద్యార్థుల వసతి భవనం (హాస్టల్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో లేవని, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నప్పటికీ పనులు ఆలస్యమవడం సరికాదన్నారు. జనగణనకు చర్యలు.. జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ అయిన గృహ లెక్కింపు, గృహ వసతి గణన వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించబడతుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ముందుగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయాన్ని వెబ్ పోర్టల్ ద్వారా ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కలెక్టర్ రాహుల్శర్మ -
వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరపాలి
భూపాలపల్లి: ప్రతీ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా వేగమైన, నాణ్యమైన దర్యాప్తు జరుపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. విచారణలో ఉన్న గ్రేవ్, నాన్–గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, మిస్సింగ్ కేసుల వివరాలను సమగ్రంగా సమీక్షించారు. లైంగిక దాడి, పోక్సో కేసులను నిర్ణీత గడువుల్లో పూర్తిచేసి నిందితులను కోర్టు ముందు నిలపాలని జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ అమలు చేస్తూ నిత్యం వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఘనంగా గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మాడవీధుల పురోగతిని పరిశీలించారు. -
శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు మొగుళ్లపల్లి: వేసవి క్రీడ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములపల్లి గ్రామంలో బాల్బ్యాడ్మింటన్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 24నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వొద్దు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: రైతులు ఇబ్బందులు పడకుండా ధా న్యం కొనుగోలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, సహకార, డీఆర్డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, రవా ణా, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు, వివిధ శా ఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రవాణాకు లారీలు అందుబాటులో ఉంచాలని, తూ కం అవగానే ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సివిల్ సప్లయీస్ అధికారులు రాములు, కిరణ్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంటెన్సివ్ రివిజన్ వేగిరం చేయాలి.. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనగణన స్వీయ నమోదు, వరి కోతలపై హార్వెస్టర్లకు అవగాహన కార్యక్రమం, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి ఐదు రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఇందుకు తక్షణం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 69.66 శాతం ఓటర్లు మ్యాపింగ్ జరిగిందని, రెండు నెలలుగా పురోగతి రాలేదన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, వివి ధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
బస్సు పయ్య కదల్లె..
డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఆర్టీసీ కార్మికులు భూపాలపల్లి: హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడో రోజు శుక్రవారం సంపూర్ణంగా సక్సెస్ అయింది. భూపాలపల్లి డిపో నుంచి సంస్థ బస్సులు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అద్దె బస్సుల డ్రైవర్లు సైతం సమ్మెకు మద్దతు పలికి తమ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో భూపాలపల్లి డిపోలో సమ్మె సక్సెస్ అయింది. సమ్మెలో భాగంగా జేఏసీ నాయకులు, కార్మికులు పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం డిపో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించగా, మధ్యాహ్నం డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మౌన ప్రదర్శన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గురువారం ప్రైవేట్ బస్సులు నడిపించడంతో శుక్రవారం కూడా ప్రయాణికులు అంబేడ్కర్ చౌరస్తా, బస్టాండ్లో బస్సులు కోసం వేచి చూసి చివరకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ధరలు పెంచి ప్రయాణికుల తరలింపు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శుక్రవారం సంస్థ, అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆటోలు, టాక్సీల యజమానులు తమ ధరలను పెంచి ప్రయాణికులను తరలించారు. గతంలో భూపాలపల్లి–కాటారం, భూపాలపల్లి–పరకాలకు బస్సు టికెట్ ధర రూ.70 ఉండగా, శుక్రవారం ఆటోలు, టాక్సీ వాహనాల యజమానులు ఒక్కొక్కరికి రూ.100 తీసుకున్నారు. బస్సులు లేకపోవడంతో చేసేది లేక అదనపు భారాన్ని భరించి ప్రయాణాలు కొనసాగించారు. శంకర్గౌడ్కు నివాళులు.. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్కు భూపాలపల్లి డిపో కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. రాత్రి 8 గంటలకు డిపో ఎదుట శంకర్గౌడ్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శంకర్గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు పలు సంఘాల మద్దతు.. కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు మద్దతు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి డిపో వద్దకు వచ్చి ఆర్టీసీ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఎస్పీకే సాగర్, వివిధ సంఘాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, సందీప్, కొమురన్న, రాజయ్య, శ్రీనివాస్, రాధాకృష్ణ, ఎన్ఆర్ నాయక్, సమ్మయ్య, ఎల్లాగౌడ్, బేగం, సునిత, అరుణ, రవీందర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. డిపోకే పరిమితమైన సంస్థ బస్సులు మద్దతు తెలిపిన అద్దె బస్సుల డ్రైవర్లు కొనసాగిన కార్మికుల నిరసన కార్యక్రమాలు -
సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
భూపాలపల్లి రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి విద్యార్థులకు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఐటీఐ కళాశాలలో సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి యంత్రము పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి తెలిపారు. టేకుమట్ల మండలం నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని దామరంచపల్లి శివారులో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ యజమాని మోరె నరేష్, డ్రైవర్ కొమ్ము కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పలకీ సేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉద యం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. శ్రీవిద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో సందడి
భూపాలపల్లి రూరల్: స్థానిక పరిషత్ ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాలతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. త్వరలో రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను, పార్టీల నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే నెలలో ఎన్నికలు? స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. యంత్రాంగం ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లాలోని 109 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగానే రంగంలోకి.. ఎన్నికల తేదీ ఖరారు కానప్పటికీ ఆశావహులు ముందుగానే రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే ప్రజల్లో తమ పోటీ గురించి చర్చ ప్రారంభించి ఎన్నికల తేదీ వచ్చే నాటికి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే ఎంత ఖర్చయినా వెనకాడబోమని చెబుతున్నారు. అధికారంపై ధీమాతో కాంగ్రెస్.. జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని అన్ని సీట్లలో తామే జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు విజయం దక్కుతుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందన్న ఆశలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. వాస్తవానికి గతేడాది నవంబర్లో ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లుగా పోటీచేసి ఓడిపోయిన వారితో పాటు, సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ సీట్లు ఇస్తామని ఆశపెట్టి పోటీలనుంచి తప్పించిన నాయకులు, కొత్తగా యువ నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్లో కూడా టికెట్ కోసం పోటీ పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున ఎన్నికల ఖర్చు కోసం ఫండ్ భారీగానే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీలో టికెట్ కోసం పోటీ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా గ్రామాల్లో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు టికెట్ ఆశిస్తున్నారు. గ్రామాల్లో జోరందుకున్న రాజకీయ చర్చలు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభం -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముందుచూపు లేకపాయె..
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాంతాన్ని కాకతీయులు, చాళుక్యులు పాలించిన చారిత్రక ఆధారాలున్నాయి. ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (యముడు, శివుడు) కొలువైన ప్రత్యేకత కాళేశ్వరం చరిత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన అప్పటి సీఎం కేసీఆర్ రూ.25కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి ప్రారంభించారు. ఆ నిధులతో పలు నిర్మాణాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది సరస్వతినది పుష్కరాలకు రూ.35కోట్లతో శాశ్వత నిర్మాణాలు, కొన్ని తాత్కాలిక పనులు చేశారు. దీంతో అ భివృద్ధి వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 20న సోమవారం రూ.198కోట్ల వ్యయంతో కా ళేశ్వరం పునరుద్ధరణ పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేశారు. దీంతో ఆలయం రూపురేఖలు మారనున్నాయని చర్చ జరుగుతుండగా.. నిర్మాణా లు కూల్చివేతలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. శృంగేరి పీఠాధిపతులు అనుమతి.. 1982లో జీర్ణోద్ధరణ సమయంలో శృంగేరీ పీఠాధిపతితో కుంబాభిషేకం చేశారు. అనంతరం గతేడాది ఫిబ్రవరిలో కూడా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయాల తొలిగింపు ప్రక్రియకు శృంగేరి పీఠాధిప తి అనుమతి తీసుకుంటామని, నిర్మాణాలు మొదలైతే అడవిలో వెలిసిన ఆదిముక్తీశ్వరాలయంలో ద ర్శనాలు జరుగుతామని సోమవారం భూమి పూజ సమయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే నిర్మాణాలు చేపట్టారు. దీంతో మాస్టర్ ప్లాన్లో నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.198 కోట్ల వ్యయంతో కాళేశ్వరం దేవస్థానం ప్రధాన గర్భగుడి, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు రాతితో నిర్మించనున్నారు. రెండు ఆలయాలు 1978–82 మధ్యన జీర్ణోద్దరణ సమయంలో సిమెంట్, డంగు సున్నంతో నిర్మించిన కట్టడాలు. వీటిలో నాలుగైదేళ్ల కిందట నిర్మించిన ప్రధాన ఆలయం మండపానికి ఆనుకొని నిర్మించిన అనివెట్టి మండపం, ప్రధాన ఆలయానికి ఎడమ వైపున అభిషేక మండపం, ఉత్తరం వైపున నిర్మించిన శివ కల్యాణ మండపం ఇటీవల శివరాత్రికి ప్రారంభించారు. వెలుపలి ప్రకార ఆలయాలు, విగ్రహాలు, ఈఓ కార్యాలయంతో పలు నిర్మాణాలు తొలిగించనున్నారని సమాచారం. ఇంకా ప్రకారాలు, గోపురాలు తొలిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాటి స్థానంలో నూతనంగా నిర్మాణాలు జరగనున్నాయి. కాళేశ్వరం మాస్టర్ప్లాన్తో చర్చనీయాంశం ఇటీవల దేవస్థానం పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన -
భూమిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో భూమిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా సైన్స్ అధికారి స్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ‘మన భూమిని కాపాడుకుందాం–పర్యావరణాన్ని రక్షిద్దాం’ అనే నినాదంతో పాఠశాల ప్రాంగణంలో కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్సు అధికారి స్వామి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి జూట్, కాటన్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. తక్కువ దూరాలకు వాహనాల బదులు సైకిళ్లను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా సైన్స్ అధికారి స్వామి -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు
భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. స్థానిక తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్లను గుర్తించి అధికారిక చర్చలు జరపాలని సూచించారు. లేబర్ కోడ్లను ఆధారంగా చేసుకుని ఆర్టీసీ సమ్మెను అణచివేయాలని ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్ రెడ్డి, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, రవి, సా జిత్, నరసింహారెడ్డి, సలీం, మధుకర్ పాల్గొన్నారు. -
డిపోలకే పరిమితం
భూపాలపల్లి: తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు సక్సెస్ అయింది. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకే ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు భూపాలపల్లి డిపో కార్యాలయానికి చేరుకొని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. అప్పటి నుంచి డిపో ఎదుట, బస్టాండ్ సమీపంలోనే ఉంటూ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పోలీసు వ్యాన్లో అవుట్సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లను డిపోలోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నించారు. కార్మికులు గమనించి పోలీసు వ్యాన్ను అడ్డుకొని వాహనం ఎదురుగా బైఠాయించి అడ్డుకున్నారు. కార్మికుల పరిస్థితిని జేఏసీ నాయకుడు బుర్రి తిరుపతి ఔట్సోర్సింగ్ సిబ్బందికి వివరించి విధులకు వెళ్లవద్దని ప్రాధేయపడ్డాడు. దీంతో వారు సైతం వెనుదిరిగారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలుసుకున్న భూపాలపల్లి డిపో డ్రైవర్ వీఎంఎం చారి భావోద్వేగానికి లోనై, కార్మికుల హక్కుల సాధన కోసం తాను సైతం బలిదానం అవుతానంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, కార్మికులు వెంటనే అతడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నందున సంస్థ బస్సులు ఒక్కటి కూడా డిపో నుంచి బయటకు రాలేదు. డిపోకు చెందిన 22 అద్దె బస్సులు మాత్రం వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించాయి. కొంతమంది అద్దె బస్సుల యజమానులైతే బుధవారం రాత్రే తమ బస్సులను ఇంటికి తీసెకెళ్లి, పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, మంజూర్నగర్ తదితర సెంటర్ల నుంచి బస్సులను నడిపించారు. సమ్మెలో భాగంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, రాజయ్య, కొమురన్న, బండి శ్రీనివాస్, సందీప్, రాధాకృష్ణ, ఎన్ఆర్ నాయక్, సమ్మయ్య, బేగం, సునిత, అరుణ, సుమలత పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బందితో నడిపించేందుకు యత్నం అడ్డుకున్న కార్మికులు -
ఆర్టీసీ సమ్మెలో విషాదం
పసుపు ధర ౖపైపెకి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది. శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న శంకర్గౌడ్ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్ను కాపాడేందుకు 30 నిమిషాలపాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో వెంటి లెటర్పై చికిత్స పొందుతున్నట్లు రాత్రి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. భారీ బందోబస్తు... నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ నర్సంపేటలో బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు. డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో.. డ్రైవర్ శంకర్గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉర్ధూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి.నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం తీవ్రగాయాలతో హైదరాబాద్కు తరలింపు.. వెంటిలెటర్పై చికిత్స ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ -
నేడు ఉమ్మడి జిల్లా బంద్
● ఆర్టీసీ జేఏసీ పిలుపు హన్మకొండ: నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకోవడాన్ని నిరసిస్తూ, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ నేడు (శుక్రవారం) ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా బస్స్టేషన్లో ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఖరి మూలంగానే డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జేఏసీ తెలిపింది. జేఏసీ వరంగల్ రీజియన్ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాలు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్లు ● శంకర్గౌడ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం హన్మకొండ:వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. కోర్టు ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు భూపాలపల్లి అర్బన్: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమార్ నాయక్ ప్రారంభించారు. బార్ అసోసియేషన్, న్యాయవాది భూక్యా రమేష్ నాయక్, తిరుమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ద్వారా కోర్టుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జడ్జి తెలిపారు. చలివేంద్రం ఏర్పాటుకు సొంత ఖర్చులతో సహకరించిన న్యాయవాది భూక్యా రమేష్నాయక్, తిరుమలను జడ్జి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడు గంగరబోయిన రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆకు ల రాములు, లేడీ జాయింట్ సెక్రటరీ కంప అక్షయ, లైబ్రరీ కార్యదర్శి ఆకినేపల్లి రవికుమార్, ట్రెజరర్ ఇందరపు శివకుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ నాగరాజ్, ఈసీ సభ్యులు రాయం రమేష్, వసంత, అర్ధకుమార్ పాల్గొన్నారు. -
పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: భక్తుల సౌకర్యార్థం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పీఆర్, విద్యుత్, ఆర్అండ్బీ, ప్రణాళిక, రవాణా, పర్యాటక, అగ్నిమాపక శాఖల అధికారులు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ప్రత్యేకంగా కాళేశ్వరం సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ నిర్మాణం, షట్టరింగ్, స్టాంప్డ్ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయని, వీటిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. పేవర్ బ్లాక్స్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పుష్కరాల సందర్భంగా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించాలని, భక్తుల కోసం స్నానాల షవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం చార్ధామ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాల్లో తక్కువ ఆక్సిజన్, తీవ్ర చలి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. యాత్రకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. యాత్ర సమయంలో వెచ్చని దుస్తులు, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 104 హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలి మల్హర్(కాటారం): విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో నాలుగో రోజు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికలను అందజేశారు. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సంక్షేమ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుకు పేదరికం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు కాదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లితండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, ఎంపీడీఓ బాబు, సర్పంచ్ పవిత్ర, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
● వైల్డ్లైఫ్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ ఎస్ఎస్తాడ్వాయి: ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తాడ్వాయి వైల్డ్లైఫ్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ అన్నారు. వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకుని వైల్డ్లైఫ్ అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఉన్న అడవులను సంరక్షించుకోవాలన్నారు. అడవులు సురక్షితంగా ఉంటనే వాతావరణ సమతూల్యత ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ లింగయ్య, బీట్ ఆఫీసర్లు సుభాశ్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తా..
భూపాలపల్లి: ఈరోజు తేదీ, సమయం రాసి పెట్టుకో.. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తానని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు, ఆరోపణలకు పాల్పడుతున్నారన్నారు. ఇంజనీర్లు చెప్పినా.. వినకుండా నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఒక్క ఎకరానికై నా సాగునీరు అందుతుందా? అని ప్రశ్నించారు. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే సమ్మె విరమణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్లు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు కురిమిళ్ళ శ్రీనివాస్, రాజునాయక్, అరుణ్, బౌతు రాజేష్, నాయకులు ఇస్లావత్ దేవన్, చల్లూరి మధు, బీర్తి పృధ్వి, జంపన్న, పైడిపెల్లి రమేష్, దాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
కోచ్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిబిరాలను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయన్నారు. ఆసక్తి గల కోచ్లు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందించాలన్నారు. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు కోచ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న ప్రతీ కోచ్కు రూ.5వేల గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 9618011096, 8125113132 సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు. పది రోజుల పాటు మేడే కార్యక్రమాలుభూపాలపల్లి అర్బన్: మే 1 నుంచి 10వ తేదీ వరకు జిల్లాస్థాయిలో మే డే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారిణి వినోద బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయిలో కార్మిక సంఘాలు, ఉద్యోగి కల్పన మండలి శాఖలు, ఫ్యాక్టరీలు, ఏటీసీ ప్రిన్సిపల్ తదితర సంస్థల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని, అన్ని కార్మిక శాఖలు, ఉద్యోగి కల్పన శాఖలు, ఫ్యాక్టరీలు, ఏటీసీ ప్రిన్సిపాల్స్ సంబంధిత అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాల నివేదికలు ఈ నెల 27 తేదీ లోపు కార్యాలయంలో అందించాలని సూచించారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న విద్యుత్ సౌద ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో యూనియన్ నాయకులు వాల్పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జెన్కో, ట్రాన్స్కో, ఎస్టీపీ ద్వారా సరఫరా అయిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌద ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపురావు, తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఆకస్మిక తనిఖీచిట్యాల: మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య శ్రీ సేవలపై ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ పి. విక్రమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల రికార్డులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా టీం లీడర్ యామంకి అనిల్, ఆరోగ్య మిత్రలు గుర్రపు రాజమొగిలి, స్వప్నదేవి తదితరులు ఉన్నారు. రామప్పలో శిక్షణ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ ఏఎస్వోలు సందర్శించారు. భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
పోషణలోపం లేని సమాజాన్ని నిర్మించాలి
మొగుళ్లపల్లి: పోషణలోపం లేని సమాజాన్ని నిర్మించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి అన్నారు. మండలంలోని ఇప్పలపల్లి అంగన్వాడీ పాఠశాలలో బుధవారం పోషణ పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ అంగన్వాడీ టీచర్ తన పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవడం ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన శరీర రక్షణకు ముఖ్యమైనవని వీటి గురించి సమాజంలో అవగాహన పెంచి, ‘పోషణలోపం లేని సమాజం’ నిర్మించడానికి అందరం కృషి చేయాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మిషన్ కో ఆర్డినటర్ కృష్ణ మాట్లాడుతూ హెల్ప్ లైన్ నంబర్లు, సఖి అందించే సేవలు, ప్రతి అంగన్వాడీలో ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిపల్లి శీరిష, సంక్షేమ శాఖ మహిళ సాధికారత సిబ్బంది అనూష, మమత, సురేష్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● ఈ నెల 17న చిట్యాల మండల కేంద్రానికి చెందిన గుర్రపు పోచమ్మ తన కూతురు ఇంటికి వెళ్తున్న క్రమంలో కుక్క వెనుక నుంచి వచ్చి కరిచింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ● ఈ నెల 9వ తేదీన రేగొండ మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన సరోజన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె కాలిపై కుక్క కరిచింది. ● గత నెల 29న గణపురం మండలకేంద్రానికి చెందిన దామ చేరాలు అనే వ్యక్తి ఇంటి ఎదుట నిలబడి ఉండగా ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి కాలి భాగంలో కరవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ● తాజాగా నిన్న (బుధవారం) మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కృష్ణ ఇంటి నుంచి బయటకు రాగా కుక్క కరవడంతో అతడిని పీహెచ్సీలో చేర్పించి చికిత్స చేయించారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని ఏరియా ఇంజనీర్ మాల ఎర్రన్న అన్నారు. బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలోని జీఎం కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమంతో పాటు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏరియా ఇంజనీర్ మాల ఎర్రన్న మాట్లాడుతూ ప్రకృతి సంపదలను కాపాడడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి జీవన వాతావరణం అందించవచ్చన్నారు. సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పలు హరిత కార్యక్రమాలు చేపడుతోందని, ఉద్యోగులు, ప్రజలు కలిసి చెట్ల నాటకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం 20 సంవత్సరాలుగా జేవీఎస్ చంద్రశేఖర్ (గ్రీన్ వారియర్, రిటైర్డ్ సింగరేణియన్) పర్యావరణంపై విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉద్యోగులు, విద్యార్థులకు విలువైన జ్ఞానం అందిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం చంద్రశేఖర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ) జోతి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోషమల్లు, పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి తదితరులు పాల్గొన్నారు. -
మత్తుపదార్థాలపై అవగాహన కల్పించాలి
ములుగు: మత్తుపదార్థాలతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి శాపంగా మారిన మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యువత, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖలు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గ్రామ, మండల స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ములుగు సామాజిక ఆస్పత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్ కేంద్రం అందుబాటులో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఏఓ సురేశ్కుమార్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి
మొగుళ్లపల్లి: వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మరమ్మతు చేయాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు అందించా లన్నారు. 31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాల్లో వందశాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ స రఫరా ఉండాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ‘వెల్ఫేర్ వీక్‘ సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో ప్రణాళిక ప్ర కారం నిర్వహించాలన్నారు. 23న పీటీఎం, 24న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, 25న విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్ లెర్నింగ్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ సుభాష్చంద్రబోస్, ప్రిన్సిపాల్ శ్యామల, సర్పంచ్ విజయ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కుక్కకాటు కేసులు
భూపాలపల్లి: ఎండలు మండుతుంటే మనుషులకే కాదు.. మూగజీవాలకు కూడా చిర్రెత్తుకొస్తుంది. వేసవి సెగకు రోజురోజుకు జిల్లాలో నమోదవుతున్న కుక్కల దాడులు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వెయ్యికి పైగా కుక్కకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. వేసవి తీవ్రత పెరిగే కొద్దీ ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడ చూసినా శునకాల స్వైరవిహారం.. జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డెక్కితే చాలు.. దాడులకు పాల్పడుతూ కండలు పీకుతున్నాయి. జి ల్లాలోని పలు కూడళ్ల వద్ద కుక్కలు కాపు కాస్తూ వాహనదారులను వెంబడిస్తున్నాయి. దీంతో వా హనదారులు భయాందోళనకు గురై అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడప డితే అక్కడ కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. 4 నెలల్లో 1,222 కేసులు నమోదు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 1,222 కుక్క కాటు కేసులు నమోదు అయినట్లుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతీ నెల పదుల సంఖ్యలో కుక్క కాటుకు గురై ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారు సైతం ఉన్నారు. దాడులకు గల కారణాలివే.. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కుక్కలు తీవ్రమైన హీట్ స్ట్రెస్కు లోనవుతాయి. దీంతో వాటి ప్రవర్తనలో మార్పులు వచ్చి స్వల్ప కారణాలకే ఆగ్రహానికి గురవుతున్నాయి. అంతేకాక ఈ వేసవిలో వీధి కుక్కలకు తాగునీరు, ఆహారం లభించలేదు. దీంతో అసహనానికి గురై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుక్కలే కాకుండా కోతుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులపైనే దాడులు 4 నెలల్లో వెయ్యికి పైగా కేసుల నమోదు నియంత్రించడంలో అధికారులు విఫలం -
కదలని బస్సులు
భూపాలపల్లి: తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ బుధవారం సక్సెస్ అయింది. కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపధ్యంలో మంగళవారం రాత్రి భూపాలపల్లి కార్మికులు డిపో వద్దకు చేరుకున్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కాగా డిపోలోని కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడంతో బస్సుల రాకపోకలు సాగలేదు. బుధవారం ఉదయం డిపో అధికారులు ప్రైవేట్ బస్సుల యజమానులను పిలిపించి బస్సులను నడిపించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అద్దె బస్సుల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. వివిధ కారణాలతో పట్టణంలో నిలిచిన ఉన్న ఆరు అద్దె బస్సుల డ్రైవర్లతో అధికారులు ఫోన్లో మాట్లాడి పలు రూట్లలో నడిపించారు. టికెట్ లేకుండా ఉచితంగా బస్సులను నడిపించినప్పటికీ సమ్మె ప్రభావం కారణంగా ప్రయాణికులు అంతగా రాకపోకలు సాగించలేదు. భూపాలపల్లి బస్డిపోలో ఆర్టీసీ, అద్దె బస్సులు మొత్తం 81 ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీరోజు డిపోకు రూ.21 లక్షల ఆదాయం రానుండగా బుధవారం ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్, సీపీఐ, వివిధ పార్టీలు మద్దతు పలికాయి. సమ్మె సందర్భంగా డిపో ఎ దుట ధర్నా చేసిన వారిలో కార్మిక సంఘాల నాయకులు బుర్రి తిరుపతి, సందీప్, కొమురన్న, ప్రసాద్, రాధాకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెకు టీపీఎస్ మద్దతు మల్హర్(కాటారం): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలనిపిలుపునిచ్చారు. భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ బంద్ సక్సెస్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించిన ప్రయాణికులు అద్దె బస్సులను నడిపించేందుకు అధికారుల యత్నం అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. నిందితులు ఒడిషా రాష్ట్ర మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలను పోలీస్ కమిషనర్ అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
24న జాబ్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అఽధికారి శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయం ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థ పోర్టీ మెడికల్ కంపెనీ ద్వారా కేర్ టేకర్స్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు నెలకు రూ.16,500 నుంచి రూ.22,000 వరకు జీతం, ఉచిత ఆహారం, వసతి, రవాణా సౌకర్యాలు, అదనంగా రూ.50,000 ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 8వ తరగతి నుంచి ఏదైనా విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్లో 50 పోస్టులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల యువత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బయోడేటాతో ఉదయం 11 గంటలకు జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 97010 78288 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ నెల 25వ తేది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హసన్పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సుధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని గురుకుల కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు భూపాలపల్లి రూరల్: కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కృతజ్ఞతలు తెలి పారు. మంళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, ఏర్పాట్లు చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భువనసుందర్, కోకిల లక్ష్మి, పరమేశ్వరి, అప్పాల శీను, ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు మట్టెవాడ సురేష్, వినోద్, విజయభాస్కర్, నాగరాజు, సురేష్, కార్తీక్, రాజు, పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ మద్దతు భూపాలపల్లి రూరల్: ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, నాయకులు మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు ఏటూరునాగారం: ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఏపీఓగా బాధ్యతలను చేపట్టారు. హైదరాబాద్ ప్లేన్ ఏరియా ఐటీడీఏ పరిధిలో పనిచేసిన నాగోవరావును ఏటూరునాగారం ఐటీడీఏకు, ఇక్కడ పనిచేసిన వసంతరావును ఉట్నూరు ఐటీడీఏకు బదిలీ చేశారు. దీంతో నాగోవరావు మంగళవారం విధుల్లో చేరారు. దీంతో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని వివరాలను వెల్లడించారు. కొత్త కోర్సులు ములుగు రూరల్: సమ్మక్క,–సారలమ్మ గిరిజన యూనివర్సిటీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బీఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులు అమలు అవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లు బీటెక్ కంప్యూటర్ సైన్స్, డేటా అనలిస్టు, బీఎస్సీ మ్యాథమెటిక్స్, కంప్యూటరింగ్ కోర్సులను అందించనున్నారు. -
వైకుంఠధామానికి దారేది?
● అరిగోస పడుతున్న ఆత్మీయులు ● పట్టించుకోని అధికారులు, పాలకులుచిట్యాల: చివరి మజిలీలో ఎవరూ ఇబ్బందులు పడవద్దనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించారు. కానీ సరైన దారులు లేక మృతుల బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఏలేటిరామయ్యపల్లిలో.. మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామ శివారు చలివాగు పక్కన గత ప్రభుత్వ హయాంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. కానీ దారి సక్రమంగా లేకపోవడంతో మృతిచెందిన వారిని కనీసం తీసుకపోవడానికి సైతం అనేక అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. వైకుంఠధామానికి సరైన దారి నిర్మాణం చేయాలనే ఆలోచన పాలకులకు, అధికారులకు ఎందుకు రావడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు నిర్మాణం చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు పాలకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. గ్రామంలో వైకుంఠధామానికి సరైన రోడ్డు లేదు. గ్రా మంలో ఎవరైనా మృతిచెందితే తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వ స్తుంది. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలి. – మర్రి నరేష్, ఏలేటిరామయ్యపల్లి -
నిప్పుల కుంపటి
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఉక్కిరిబిక్కిరవుతున్న సింగరేణి కార్మికులుభూపాలపల్లి అర్బన్: సింగరేణి కాలరీస్ భూపాలపల్లి ఏరియాలో ఉష్ణోగ్రతలు నిప్పులకుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం 9గంటల నుంచి మొదలు సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత తగ్గకపోవడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాలులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 9 గంటలు దాటితే చాలు బయట తిరగడం కష్టంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, పరిశ్రమలతో విలసిల్లుతున్న భూపాలపల్లి, తాడిచర్ల ప్రాంతంలో ఎండలు మరింత భగభగమంటున్నాయి. గనులపై మరింత ప్రభావం.. ఉపరితల గనుల్లో బొగ్గును వెలికితీయడానికి నిత్యం టన్నుల కొద్ది పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు. బొగ్గు పొరలపై ఉన్న మట్టి, బండరాళ్లను తొలగించడానికి భారీ పేలుళ్లు జరపాల్సి ఉంటుంది. బొగ్గును వెలికితీయడానికి అవే పేలుడు పదార్థాలను వినియోగిస్తుంటారు. ఫలితంగా కర్బన ఉద్గారాలు, రాతి ఒక్కసారిగా గాలిలో కలుస్తాయి. ఈ దుమ్ము రేణువులు ఉష్ణోగ్రతలను సులభంగా గ్రహించడంతో గాలి వేడెక్కి ఎండ తీవ్రత సాధారణం కంటే అత్యధికం అవుతుంది. గనుల ప్రాంతంలో పెద్దఎత్తున నిల్వచేసే బొగ్గు మరింత వేడెక్కడంతో దాని ప్రభావం వాతావరణంపై పడి ఈ ప్రాంతాన్ని నిప్పులకొలిమిలా మార్చుతుంది. ఉపశమనానికి ప్రత్యేక చర్యలు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను యాజమాన్యం నిలిపివేసే అవకాశం ఉంది. వేసవిలో పెరిగిన ఎండలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకు వడదెబ్బ తగలకుండా అనేక చర్యలు తీసుకుంటుంది. చలువ పందిళ్లు వేయించి స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం వంటి చర్యలు చేపడుతుంది. ప్రతీ 40 మీటర్ల లోతుకు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సింగరేణిలో ఉపరితల గనులు 60–160 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందించడం వంటి చర్యలకు యాజమాన్యం ఉపక్రమిస్తోంది. మరిన్ని సౌకర్యాలు అవసరం యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల కోసం క్షేత్రస్థాయిలో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం 12గంటల నుంచి 4గంటల మధ్య పనివేళల్లో ఉపశమనం కలిగించేలా షిప్టులను సర్దుబాటు చేస్తే మంచిది. గనిదారుల్లో నిరంతరం నీటిని స్ప్రే చేయించడం, భారీ యంత్రాల క్యాబిన్లలో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఓపెన్కాస్టుల్లో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వకుండా కేవలం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. రెస్ట్ షెల్టర్ల సంఖ్య పెంచాలి. ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పా టు చేయాలని, వడదెబ్బ నుంచి కాపాడుకునేలా అవగాహన కల్పించాలని కార్మికులు విన్నవిస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో కేటీకే ఓపెన్కాస్టు ప్రాజెక్ట్–2, 3, తాడిచర్ల ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్లు ఉన్నాయి. మూడు ఓపెన్ కాస్ట్ గనుల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు 3వేల మంది కార్మికులు మూడు షిష్టుల్లో కలిపి విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి, రెండో షిఫ్టులలో విధులకు హాజరయ్యే కార్మికులు ఎక్కువ సమయం ఎండలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఎండల తీవ్రత ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటోంది. ఓపెన్ గనుల్లో బొగ్గు, మట్టి, బండ రాళ్లు, దుమ్ముతో పాటు గని లోతుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గనుల్లో కార్మికులు ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్నారు. భూపాలపల్లి, తాడిచర్లలో ఎండల తీవ్రత 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కపోతఅధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికుల సంక్షేమం రీత్యా పనివేళలు మార్చాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు పనులు నిలిపివేసి మిగిలిన సమయాల్లో పనులు కొనసాగించేలా యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేయాలి. గతంలో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – నల్లవెల్లి సదానందం, ఓపెన్ కాస్ట్ కార్మికుడు, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ -
సొంతూరుకు దామోదర్..
ఎస్ఎస్ తాడ్వాయి : కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ 28 ఏళ్ల తర్వాత మంగళవారం తన స్వగ్రామం కాల్వపల్లిలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చిన దామోదర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు దామోదర్ను కలిసి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. దామోదర్ అజ్ఞాతంలోకి వెళ్లి చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. 28 ఏళ్ల తర్వాత వచ్చిన దామోదర్ను చూసిన కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. దామోదర్ వస్తున్న విషయాన్ని తెలుసుకొని కాల్వపల్లి చుట్టుపక్కల గ్రామాలు నార్లాపూర్, కన్నెపల్లి, మేడారం, ఊరట్టం, కొత్తూరు, వెంగళాపూర్, పడిగాపూర్ గ్రామస్తులు కాల్వపల్లికి భారీగా తరలొచ్చారు. తనకు తెలిసిన ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు, తన చిన్ననాటి స్నేహితులను, తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులను దామోదర్ ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా దామోదర్ను కలిసి ముచ్చటించారు. దామోదర్కు ఘనసన్మానం సాయుధ పోరాటం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దామోదర్ను గ్రామస్తులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. 28 ఏళ్ల అడవి బాట వీడి గ్రామస్తులను కలవడం ఆనందంగా ఉందని దామోదర్ పేర్కొన్నారు. తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేస్తానని తెలిపారు. చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు -
ఆర్టీసీలో సమ్మె సైరన్
● నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులు ● ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిపో ఆర్టీసీ అద్దె హనుమకొండ 100 52 వరంగల్–1 105 41 వరంగల్–2 115 (ఈవీ) 44 జనగామ 83 39 నర్సంపేట 65 35 మహబూబాబాద్ 57 24 పరకాల 63 23 తొర్రూరు 57 43 భూపాలపల్లి 66 24డిమాండ్లు పరిష్కరించాలి..సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – సీహెచ్.రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడుసంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. యూనియన్ రీజియన్ సెక్రటరీ -
సీఎం సభలతో ప్రజాధనం వృథా
భూపాలపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహిస్తున్న సభలతో ప్రజాధనం వృథా కావడమే తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. రేవంత్రెడ్డి ‘యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి’ అని, ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన ఆయన సీఎం పదవికి చేరుకున్నారన్నారు. అందరూ ఆయనలా తొక్కుకుంటూ ఎదగలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందుతుందని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డికి డిపాజిట్ దక్కితే చాలన్నారు. తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విచారణల పేరుతో ఆలస్యం చేసి ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు మేకల సంపత్కుమార్, కళ్లెపు రఘుపతిరావు, జక్కం రవి, బుర్ర సదానందం, వార్డు కౌన్సిలర్ బోగం నరేందర్ పాల్గొన్నారు. రేవంత్రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
పోలీస్స్టేషన్ తనిఖీ
మొగుళ్లపల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం మొగుళ్లపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘వన మహోత్సవం’’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ సంపత్రావు, సీఐ మల్లేష్, ఎస్సై సురేష్ సిబ్బంది ఉన్నారు. -
వనదేవతలకు ప్రత్యేక పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కుటుంబ సమేతంగా అమ్మవార్లను మంగళవారం దర్శించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద ఎస్పీ మొక్కులు చెల్లించి గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ సంప్రదాయంగా దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజారులు ఎస్పీ దంపతులను అమ్మవారి కండువాతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ మధు, రికార్డు అసిస్టెంట్ వీరన్న, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంభూపాలపల్లి అర్బన్: ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు 385 మంది విద్యార్థులకు 332 మంది హాజరుకాగా, ఇంటర్ పరీక్షలకు 611 మంది విద్యార్థులకు గాను 541 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ తనిఖీ చేశారు. 28న విద్యుత్ సౌధ ముట్టడి భూపాలపల్లి అర్బన్: సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యుత్ సౌధ ముట్టడికి సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థల నుంచి ఏళ్ల తరబడి బకాయిలు రావడం లేదన్నారు. ఇప్పటికి రూ.51వేల కోట్లు పేరుకుపోయినట్లు తెలిపారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సింగరేణి అధికారులు విద్యుత్ సంస్థలకు బొగ్గు రవాణా నిలివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన సింగరేణి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు ఆరోపించారు. మహాత్మ బసవేశ్వర మార్గం స్ఫూర్తిదాయకం భూపాలపల్లి రూరల్: సమానత్వం, సామాజిక న్యాయంపై మహాత్మ బసవేశ్వర చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహాత్మ బసవేశ్వర 892వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారా యణరావు ముఖ్యఅతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యతో కలిసి మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిర, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్, బీసీ సంఘాల ప్రతినిధులు కంపాటి రాజయ్య, మాటూరి శ్రీనివాస్, యుగేందర్, మాటూరి మంజుల, శివ దర్శనం, సతీష్ పాల్గొన్నారు. ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషివెంకటాపురం(ఎం): ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో నిర్మిస్తున్న రామాలయానికి సోమవారం మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్మించిన పెద్దమ్మగుడిని సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొమ్మకంటి వంశావతిరమేశ్, మామిడిశెట్టి సుగుణస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు భగవాన్రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీలపై దాడులు ఆపాలని వినతి ములుగు రూరల్: జిల్లాలోని వలస ఆదివాసీల గూడేలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సీపీఎం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గూడేలపై ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ చిట్యాల: చిట్యాల బస్టాండ్ నిర్మాణం పూర్తయి రెండున్నరేళ్లవుతున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి కట్టినా ప్రయాణికులకు ఉపయోగం లేకుండా మారింది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రారంభిస్తే ప్రయాణికులకు ఉపయోగం కలగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చిట్యాల బస్టాండ్ను రూ.25లక్షలతో నిర్మాణం చేపట్టారు. రెండున్నరేళ్ల క్రితం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు ప్రారంభించడం లేదు. బస్టాండ్ చుట్టూ సీసీ రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మండల నాయకులు కోరగా స్పందించి సీసీ రోడ్డు వేయించారు. కానీ ప్రారంభం విషయంలో మాత్రం చొరవచూపడం లేదు. బస్టాండ్ను ప్రారంభిస్తే ప్రయాణికులకు మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. బస్టాండ్ ప్రారంభం కాకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు మందుబాబులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు. వాహనాలు సైతం నిలుపుతున్నారు. చిట్యాల బస్టాండ్ను వెంటనే ప్రారంభించేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలి. మండలకేంద్రానికి వచ్చే బస్సులు బస్టాండ్ వద్ద నుంచి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – అల్లం రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, చిట్యాలగిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నా భర్తకు వేతనం రావడం లేదు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కాంటిజెంట్ వర్కర్గా పనిచేస్తున్న నా భర్త ప్రసాద్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను విధులకు హాజరవుతున్నాను. 2020 నుంచి వేతనం రావడం లేదు. అధికారులు, పీఓలు మారుతున్నా వేతనం రాక ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలి. – ఆలం రామలక్ష్మి, మేడారం, తాడ్వాయివెంకటాపురం(కె) మండలంలోని అలుబాక పంచాయతీ పరిధి ముత్తారం గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ సొసైటీని ఏర్పాటు చేశారని కుర్సం ముత్తయ్య, బాడిష కన్నయ్య, మడ సుజాత, బాడిష స్వప్నలు కలెక్టర్కు విన్నవించారు. ముత్తారంలో సొసైటీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు జమ ఖర్చు చెప్పడం లేదు. పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ను సొసైటీ విషయం ఏది అడిగిన ఇవ్వడం లేదు. సొసైటీ పేరు కూడా చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మూడు మార్లు రూ.4 లక్షల క్యూబిక్మీటర్ల ఇసుక బయటకు రవాణా చేసినప్పటికీ వాటి కమీషన్ తమకు ఇవ్వకుండా అధికారులు, సొసైటీ సభ్యులు మింగి కూర్చుంటున్నారని తెలిపారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సొసైటీ సభ్యులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా పాత సొసైటీని రద్దు చేసి కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని ముత్తారం గ్రామస్తులు కోరారు. ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన పట్టించుకోని అధికారులు.. పాలకులు రూ.లక్షలు వెచ్చించినా నిరుపయోగం -
వినతులు పరిష్కరించండి
ఏటూరునాగారం: గిరివాణి, ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ, కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరివాణి, ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అర్జీదారుల సమస్యలు విని వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో గిరివాణిలో 96 దరఖాస్తులు రాగా ప్రజావాణిలో 26 దరఖాస్తులను బాధితులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్కు చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంకటాపురం(కె) మండలం ఎదిర గ్రామ సమీపంలోని యాకన్నగూడెంలో ప్రభుత్వం నూతనంగా పాఠశాలను ఏర్పాటు చేసింది కానీ ఎలాంటి భవనం నిర్మించలేదని తక్షణమే నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను వెంటనే అందించాలని స్పష్టం చేశారు. వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలు ఏటూరునాగారం మండలం షాపెల్లికి చెందిన మాదారపు లక్ష్మి. ఈమె భర్త ఐదేళ్ల క్రితం మరణించాడు. తన భర్త మీద ఉన్న పింఛన్ తన పేరు మీదకు మార్పించుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయం వెళ్లగా ఆమె ఆధార్కార్డు ఆన్లైన్లో నమోదు చేయగా ఆమె కూడా మరణించినట్లు రికార్డులో ఉండడం గమనార్హం. ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని పలువురు అధి కారులు చెప్పినప్పటికీ దానిని సరిచేయడం లేదు. దీంతో ఆమె కలెక్టర్కు ప్రజావాణిలో విన తి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకుంటుంది. అధికారులకు కలెక్టర్ దివాకర ఆదేశాలు గిరివాణిలో 96, ప్రజావాణి 26 అర్జీల రాక బాధితుల సమస్యలు విని వినతులు స్వీకరించిన కలెక్టర్ -
మండే ఎండ.. ఠండా ఠండా!
● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు ● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
స్వీయ నియంత్రణ తప్పనిసరి
ములుగు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం మండలపరిధిలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా సీట్బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేయటంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. పోలీస్ శాఖ వాహన తనిఖీలు చేసేది కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని అన్నారు. ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సీఐ నరేష్శ్మార్ ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదిముక్తీశ్వరాలయంలోనే పూజలు కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో రూ.200కోట్లతో రాతి నిర్మాణ పనులకు సీఎం రేవంత్రెడ్డి సోమవారం(నేడు) భూమి పూజ చేపట్టనున్నారు. వచ్చే నెల మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతినది అంత్యపుష్కరాలు జరుగనున్నాయి. 1978 నుంచి 82 వరకు జీర్ణోద్ధరణ సమయంలో సిమెంట్తో నిర్మించిన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధాన గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు తొలగించి రాతితో నిర్మాణం చేయనున్నారు. దీంతో ఆలయంలో నిత్య పూజలు, ఒక కిలోమీటర్ దూరంలో అడవిలో ఉన్న ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించడానికి దేవా దాయ శాఖ సర్వంసిద్ధం చేస్తుంది. కాళేశ్వరాలయంలో అధికారుల పరిశీలనకాళేశ్వరం ఆలయ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఐఎస్డబ్ల్యూ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. -
బహిరంగ సభకు తరలిరావాలి
భూపాలపల్లి రూరల్: కాటారం మండలం నస్తురుపల్లిలో నేడు(సోమవారం) నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఆదివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, లోపాలను ప్రజలకు తెలియజేయడం, బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. బహిరంగసభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, దేవన్, దాట్ల శ్రీనివాస్, ఆకుల మహేందర్, రంజిత్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నేటి నుంచి ఓపెన్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెన్త్ పరీక్షలకు 428 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 670 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. భూపాలపల్లి, కాటారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, జంగేడు, భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్, సింగరేణి ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాల, కాటారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. నేటి ప్రజావాణి, ప్రజాదివస్ రద్దు భూపాలపల్లి రూరల్: నేడు (సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి, ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదివస్ను రద్దుచేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భూపాలపల్లి డిపోలో జేఏసీ ఏర్పాటు భూపాలపల్లి అర్బన్: టీజీఎస్ ఆర్టీసీ భూపాలపల్లి డిపోలో కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలోని అన్ని యూనియన్ల ప్రతినిధులు కలిసి నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆర్టీసీ జేఏసీ చీఫ్ అడ్వైజర్గా ఎం.రవీందర్, చైర్మన్గా బుర్రి తిరుపతి, కన్వీనర్గా బండి శ్రీనివాస్, కో–కన్వీనర్గా డి.రాజయ్య, వైస్ చైర్మన్గా వి.రవి, ట్రెజరర్గా బి.సతీష్లను ఎంపిక చేశారు. ఈ నెల 22నుంచి జరిగే ఆర్టీసీ సమ్మె వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అద్దె బస్సుల స్కీం కొనసాగించాలిహన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్స్లో ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు. నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. -
సీఎం సార్.. హామీలు నెరవేర్చరూ..
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందేదెప్పుడుభూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధి కారంలోకి వచ్చిన అనంతరం జిల్లాకు కాంగ్రెస్ పా ర్టీ ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. వీటికి తోడు జిల్లాలో పెండింగ్ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పెండింగ్ సమస్యలు, ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపుపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ఈ ఆస్పత్రిలో వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ జిల్లా ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు లేకపోవడంతో చిన్నచిన్న రోగాలకు సైతం ఎంజీఎం, వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీ దినదినం అభివృద్ధి చెందుతుంది. గత ప్రభు త్వ హయాంలో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. సుమారు లక్షకు పైగా జ నాభా ఉన్న ఈ పట్టణాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ● గత ప్రభుత్వాలు జిల్లాలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 1ను ప్రైవేట్ కాంట్రాక్టరుకు అప్పగించగా, ప్రాజెక్ట్ 2ను సింగరేణి సంస్థకే అప్పగించి పనులు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ● సింగరేణి బొగ్గు, గోదావరి జలాలు, కేటీపీపీ పరిశ్రమ ఉన్న ఈ జిల్లాలో ఇంజనీరింగ్, మైనింగ్ కళాశాల, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వమైన పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 8న గణపురం మండలం చెల్పూరు పరిధిలోని సింగరేణి వేయి క్వార్టర్ల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరాల జల్లులు కురిపించారు. కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోర్డును రద్దు చేసేది లేదని, కారుణ్య నియామకాలను కొనసాగిస్తామని ప్రకటించారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా కారుణ్య నియామకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండగా, డిస్మిస్డ్ కార్మికుల ఊసే లేదు. భూపాలపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేంద్రం కేటాయించిందని, డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు. ఇప్పటి వరకు కనీసం భూసేకరణ పనులు కూడా ప్రారంభం కాలేదు. సాధారణ ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. సింగరేణి సంస్థలో మారు పేర్లను సవరిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బైపాస్ రోడ్డు పనుల ప్రారంభమెప్పుడో సింగరేణిలో కారుణ్య నియామకాలు కలేనా..? 217 మంది డిస్మిస్డ్ కార్మికుల పరిస్థితేంటి నేడు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన జిల్లా కేంద్రం అనంతరం కాటారం రెవెన్యూ డివిజన్ అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. కాటారం, సమీపంలోని నస్తూర్పల్లి, మద్దులపల్లి, చిదినెపల్లి, పోతులవాయి, ఇబ్రహింపల్లి, బయ్యారం గ్రామాలను కలిపి కాటారాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడు తూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు పాల్గొన్నారు. టెమ్రిస్ ఆర్ఎల్సీ సతీశ్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ములుగు రూరల్: అర్హులందరికీ ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని రాయనిగూడెం గ్రామ పంచాయతీలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి, తదితర పథకాలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదాం
ములుగు: రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమిచ్చే ప్రతీ రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతీ ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్సల్లో ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యసేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావులు సైతం రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రశేఖర్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రామప్పలో ఎన్ఎస్జీ అధికారులు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ఎన్ఎస్జీ, ఆక్టోపస్ అధికారులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. రామప్ప గార్డెన్ ఆవరణలో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయికృష్ణ, సీఏ అజిత్, తహసీల్దార్ గిరిబాబు, ఆర్ఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మే మాసంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి
778సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా... 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్లు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. ‘పరిషత్’లో ‘ఆమె’కే ప్రాధాన్యం... ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పరుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరు(థర్డ్జండర్)లు 504 కాగా, సర్వీసు ఓటర్లు 2,141. ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామలు ఎస్సీ మహిళలకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు గాను 38, 39 ఎంపీపీ స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో ‘స్థానిక’ వివరాలు ఇలా... జెడ్పీపీపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలు మొత్తం జిల్లాలు 06ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు.. 7506ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మే మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు. -
ఫొటో ఎగ్జిబిషన్
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ దినోత్సవా న్ని పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏ ర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గిరి బాబు హాజరై ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, సీనియర్ సీఏ అజిత్లు మాట్లాడారు. దేశంలో మూడు వేలకు పైగా కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్నామన్నా రు. ఇందులో 43 యునెస్కో గుర్తించిన ప్రపంచ వా రసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు, వాటి చరిత్ర తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్ను రామప్పలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వారసత్వ కట్టడాలను సంరక్షించడంలో ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రమేశ్, సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజు, కేంద్ర పురావస్తు, దేవాదాయ శాఖ సి బ్బంది, టూరిస్ట్ పోలీసులు, గైడ్స్ పాల్గొన్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవే పనులు అడ్డగింత
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామ శివారు మీదుగా వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను బాధిత రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో భూ పరిహారం చెల్లించలేదని, భూ పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వసంతరావు, చిట్యాల, మొగుళ్లపల్లి ఎస్సైలు పోచంపల్లి సతీష్, ముప్పు సురేష్లు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు దువ్వల సత్యనారాయణ, దువ్వల లక్ష్మీ, బిల్ల సత్యనారాయణరెడ్డి, నర్సయ్య, కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, అమరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21న ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరంభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఈనెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్.శ్యాంసుందర్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కృష్ణకాలనీలోని సీఈఆర్ క్లబ్లో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం జరుగుతుందన్నారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ విశ్వనాథ మహర్షి నేతృత్వంలో నిర్వహించే ఈ శిబిరంలో చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండె దడ, బీపీ, షుగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్యసేవలు అందించనున్నారు. పూర్తి వివరాలకు 9849574706 నంబర్లో సంప్రదించాలన్నారు. ‘దేవాలయ నిర్మాణంపై ఆరోపణలు సరికాదు’ భూపాలపల్లి అర్బన్: కారల్మార్క్స్ కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణంపై కాలనీ ప్రజలు ఆరోపణలు చేయడం సరికాదని బీఎంఎస్ ఫిట్ కార్యదర్శులు పునిత్రావు, రాజ్నాయక్లు అన్నారు. శనివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఎంఎస్ ఇతర అనుబంధ సంఘాలు గుడులు, బడుల నిర్మాణాలకు వ్యతిరేకం కాదన్నారు. దేవాలయ నిర్మాణంపై కేవలం అప్పాని శ్రీనివాస్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మిక కాలనీకి చెందిన స్థలంలో హన్మాన్ దేవా లయ నిర్మాణం చేపట్టవద్దని అన్ని కార్మిక సంఘాల నాయకులు కలిసి జీఎంకు వినతిపత్రాన్ని అందించినట్లు తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీస్స్టేషన్లో ఫి ర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడి నిర్మాణానికి కేటాయించిన రూ.55లక్షల నిధులను దుర్వినియోగం కా కుండా ఉపయోగించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నలుగూరి శ్రీనివాస్, పండాల మల్లేష్, చిట్యాల ప్రవీణ్, భాస్కర్, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు వెంకటాపురం(కె): మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ పర్శిక శ్రీలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ గ్రామాల్లో మీటర్ లేనివారు పీఎం జుగా స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉచిత మీటర్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్దాస్, లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, అసిస్టెంట్ లైన్మెన్ ఫరీద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సన్తూర్పల్లిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతాలు, సభావేదికను సమగ్రంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. హెలిపాడ్ ప్రదేశంలో దుమ్ము ఎగరకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్అండ్బీ ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. -
కోఆప్షన్ దక్కేదెవరికో?
భూపాలపల్లి: జిల్లాలోని ఏకైక భూపాలపల్లి మున్సి పాలిటీలో కోఆప్షన్ సందడి మొదలైంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకోవడంతో నాలు గు కోఆప్షన్ స్థానాలు ఆ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఆ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. పది మందికి పైగా ఆశావహులు.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డు స్థానాలు ఉండగా నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమిస్తారు. అయితే ఇందులో ఇద్దరు మైనార్టీలు (ఒక మహిళ, ఒక పురుషుడు), మిగిలిన రెండింటిలో ఒకరు మాజీ ప్రజాప్రతినిధి, మరొకరు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వారిని నియమిస్తారు. నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండాలనే నిబంధన ఉంది. అంతేకాక మున్సిపాలిటీలో ఓటరుగా ఉండి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. ఈ రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో, ఆయా వర్గాలకు చెందిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో, ఈ పదవులను దక్కించుకుంటే స్థానికంగా పట్టు సాధించవచ్చని ఆశావహులు భావిస్తున్నారు. మైనార్టీ విభాగం నుంచి హఫీజ్, ఫాస్టర్ రాజ్కుమార్, మాజీ ప్రజాప్రతినిధుల విభాగం నుంచి తాటి హైమావతి, శిరుప అనిల్, ముంజాల రవీందర్, సజ్జనపు స్వామి, చల్ల రేణుక, దాట్ల శ్రీనివాస్తో పాటు మరో కొంతమంది కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ కోఆప్షన్ పదవుల భర్తీ కోసం మున్సిపల్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. కాగా శనివారం సాయంత్రం వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ‘సత్తన్న’ మదిలో ఉన్నదెవరో? కోఆప్షన్ సభ్యుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్ణయమే అత్యంత కీలకం. దీంతో ఆశావహులు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కష్టకాలంలో సైతం వెన్నంటి ఉన్నామని, తమకు అవకాశం ఇ వ్వాలని పలువురు ఆశావహులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఈ నెల 20న రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున, సీఎం సభ అనంతరం కోఆప్షన్ సభ్యుల ఎంపికపై ఎ మ్మెల్యే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీలో నాలుగు పదవులు అధికార పార్టీలో నెలకొన్న తీవ్ర పోటీ ఎమ్మెల్యే చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు ఒక్క చాన్స్ ప్లీజ్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన, రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన, ఎమ్మెల్యే సూచనల మేరకు బరిలో నిలవని వారు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. వీరంతా కౌన్సిల్లో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలని తహతహలాడుతున్నారు. ఈ కోఆప్షన్ పదవులను మాజీ కౌన్సిలర్లు ఒక ‘లైఫ్ లైన్’లా భావిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరమైన కొందరు సీనియర్లు కూడా ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. -
హేమాచలుడిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి హరినాధ్ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు రాజశేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్ వారి పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సూర్యచంద్రకళ, అడిషనల్ జడ్జి డి.మధులిక తేజ, ఎస్సై టీవీఆర్ సూరి తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ సమీపంలో కారుకొండా సడాలమ్మ జాతరను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు కొర్నెబెల్లి గణేష్, చింత రమేష్, కొమరం రవి, సర్వేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్న పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ. ఆదివాసీల ఇలవేల్పు జాతరల రక్షణ కోసం కృషి చేయాలన్నారు. క్రీడలు, విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మొదటి బహుమతి రూ. 25,016, ద్వితీయ బహుమతి రూ.15,016, తృతీయ బహుమతి రూ.10,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడే రజిత రాంబాబు, యువజన సంఘాల అధ్యక్షుడు నవీన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం నేడు (శనివారం) ఉదయం 11గంటలకు సందర్శిస్తారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి మాజీ జెడ్పీచైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నడిపల్లి దివాకర్రావు, దాసరి మనోహర్రెడ్డి, మాజీ జెడ్పీచైర్పర్సన్ జ్యోతిలతో పాటు ముఖ్య నేతలు సందర్శిస్తారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 20న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు మేడిగడ్డ సందర్శనకు రానున్న నేపథ్యంలో ముందుగానే బీఆర్ఎస్ బృందం రానుండడంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సింగరేణికి బకాయిలు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కారుణ్య నియామకాల కింద ఇవ్వాల్సిన ఉద్యోగాలను విజిలెన్స్ పేరుతో ఆలస్యం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పెర్క్స్పై ఆదాయ పన్ను మినహాయింపు, కార్మికుల సొంతింటి కల, మారుపేర్ల సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమేనని స్పష్టంచేశారు. విద్యుత్ సంస్థలు తక్షణమే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 28న సీఐటీయూ ఆధ్వర్యంలో ‘చలో విద్యుత్ సౌధ’ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు కంపేటి రాజయ్య శ్రీ కాంత్, బాబురావు, తోట రమేశ్ పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి ములుగు రూరల్: ఆస్పత్రుల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిల్లో విద్యుత్ వైర్లు నాణ్యమైనవి వినియోగించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను నిరంతరం పరిశీలించాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా, సమయోచితంగా స్పందించడం ముఖ్యమన్నారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ను ఉపయోగించకుండా మెట్లమార్గంలో రావాలన్నారు. అనంతరం ప్రమాదాలు జరిగిన సమయంలో తక్షణ చర్యలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.సమ్మేళనానికి సర్వం సిద్ధంములుగు: జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) నిర్వహించనున్న విరాట్ హిందూ మహాసమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు మహాసమ్మేళనం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా సమ్మేళన కార్యక్రమం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందన్నారు. శ్రీ భువనేశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ, ధర్మ జాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ జీ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులు అందజేసిన నవధాన్యాలను తీసుకువచ్చి యాగంలో సమర్పించి భారతమాతతో పాటు హిందూ దేవతామూర్తుల ఆశీర్వాదం పొందాలన్నారు. -
20న ‘రైతు భరోసా’ విడుదల
ఈ నెల 20న నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు.ఈ ఫొటో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి ట్యాప్ల వద్ద ప్రదేశం. ఆస్పత్రికి వస్తే రోగాలు పోతాయని అనుకొని వస్తుంటారు. కానీ కొత్త రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా ధుమ్ముదూళి, బూజుతో నిండిపోయింది. శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో మట్టి పేరుకుపోయింది. మురికి పట్టిన ప్రాంతం నుంచే రోగుల బంధువులు బాటిళ్లలో నీరు తీసుకెళ్తున్నారు. -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈ నెల 20న జరిగే సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్తో కలిసి శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శాసనసభ్యులందరూ పాల్గొంటారని చెప్పారు. రైతులు, మహిళలు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయంవతం చేయాలని కోరారు. బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ వేదిక ఏర్పాట్లు, ప్రాంగణ అభివృద్ధి, లైటింగ్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీఓ వీరస్వామి, విద్యుత్ డీఈ నాగరాజు పాల్గొన్నారు. లైటింగ్ ఏర్పాట్ల పరిశీలన సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి అధికారులను ఆదేశించారు. నస్తూరిపల్లి లైటింగ్ ఏర్పాట్లు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ నాగరాజు, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
భూపాలపల్లి: ట్రాఫిక్ పోలీసులు వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో భూపాలపల్లి ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలను ఎస్పీ పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎండలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ, తరచూ నీరు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
20నుంచి ‘ఓపెన్’ టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్(తెలంగాణఓపెన్స్కూల్.ఓఆర్జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్లో 3,495 మంది.. ఇంటర్లో 7,187 మంది విద్యార్థులు -
ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బూరుగు రవి మాట్లాడుతూ.. తెలంగాణ 2వ పీఆర్సీని శివశంకర్ కమిటీ నుంచి తెప్పించుకొని 51శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 13వేల పైచిలుకు ఉన్న ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఏకమొత్తంలో ఒకే సారి విడుదల చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీ మ్ (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను పరి ష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రేగూరి సుభాకర్రెడ్డి, తిరుపతిరెడ్డి, దిల్షాద్, రామ్మోహన్, ఐలయ్య, మధుసూద న్, శ్రీనివాస్, దశరథరామారావు, సునీల్, షఫి సర్కార్ పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ధర్నా -
సాక్షిప్రతినిధి, వరంగల్ :
..ఇలా కొందరు పోలీసుల వ్యవహారశైలి ఆ శాఖను అబాసుపాలు చేస్తోంది. కొందరు యువ ఎస్సైలు క్రమశిక్షణ గీత దాటి వేటుకు గురవుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సన్ప్రీత్సింగ్.. కట్టుతప్పి అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులకు హెచ్చరికలు చేస్తూ నే ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని మందలించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్లోని ఇన్స్పెక్టర్(ఎస్హెచ్ఓ)లు, ఎస్సైలపైన ఉన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. పలువురిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు తీరు మారడం లేదు. దీనికి కారణం వారికి రాజకీయ అండే కారణమన్న విమర్శలు లేకపోలేదు. వరుస ఘటనలతో కలకలం... క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడటం, సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడాన్ని వరంగల్ కమిషనర్ సీరియస్గా తీసుకుంటున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మిల్స్ కాలనీలో ఎస్సైగా పనిచేస్తున్న సురేష్ను సస్పెండ్ చేసిన సీపీ.. ఆ ఠాణా పరిధిలోని కొన్ని ఘటనలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్పైన చర్చ జరుగుతోంది. ఇదివరకే బచ్చన్నపేట ఎస్సై హమీద్ను పోలీసు హెడ్క్వార్టర్స్కు అటాచ్డ్ చేయగా, తాజాగా ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్ను ఏఆర్కు అటాచ్డ్ చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మరికొందరిపైనా విచారణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరున్నారు? అన్న చర్చ మొదలైంది. సీరియస్గా ‘లేఖల’ పంచాయితీ.. గతేడాది డిసెంబర్లో వరంగల్ పోలీస్ డివిజన్లో ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరిపై త్వరలోనే బదిలీ లేదా సస్పెన్షన్ వేటు పడవచ్చన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధి లోని నలుగురు ఇన్స్పెక్టర్ల తీరుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, కేసులు కట్టడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులు కట్టడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు ఎస్హెచ్ఓలు పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేయించుకునేందుకు ‘లేఖ’లు పొందడం కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. విచారణ అనంతరం తీవ్రతను బట్టి వారిని సస్పెండ్ చేయడమా? వీఆర్కు పంపడమా? లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయడమా? అన్నది త్వరలోనే తేలనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారం, పది రోజుల్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండగా.. సుమారు 10 మందికి పైగా సీఐలు వరంగల్ నగరంలోని ఆరు కీలక ఠాణాలకు లేఖలు పొంది ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ● యువ ఎస్సైల అత్యుత్సాహం.. అడ్డంగా బుక్కవుతున్న వైనం ● అత్యాచారం, వేధింపుల కేసుల్లో వారే.. ● వరుస సంఘటనలతో పోలీసుశాఖలో కలకలం ● పలువురిపై సస్పెన్షన్, బదిలీ వేటు ● ఇన్స్పెక్టర్లపైనా ఆరోపణలు.. విచారణ స్థాయిలో ఫిర్యాదులు ● చర్చనీయాంశంగా కొందరు పోలీసుల తీరు -
దవాఖానాలో దాహార్తి
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటికి కటకట భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తాగునీటి కటకటాలు తప్పడం లేదు. ప్రతి రోజు ఆస్పత్రిలో 500నుంచి 700వరకు ఓపీ, 50నుంచి 100 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనం మూలంగా ఆస్పత్రికి వచ్చే బాలింతలు, గర్భిణులు, పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం కావడంతో దాహార్తిని తట్టుకోలేకపోతున్నారు. ఆస్పత్రిలో తాగునీటి ఇబ్బందులపై శుక్రవారం సాక్షి పరిశీలన చేపట్టింది. రెండు బోర్లు అంతంత మాత్రమే.. ఆస్పత్రిలో ఏడాది కాలంగా రెండు బోర్లు అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. ఆస్పత్రిలో మొత్తం ఐదు బోర్లు ఉండగా అందులో మూడు బోర్లు పనిచేయడం లేదు. వేసవికాలం సమీపిస్తున్నా తాగునీటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందస్తుగా ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన పాపాన పోలేదు. వినియోగంలో ఉన్న రెండు బోర్లతోనే వెళ్లదీస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేయకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలంకారప్రాయంగా ఆర్ఓ ప్లాంట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆర్ఓ ప్లాంట్ అలంకార ప్రాయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, అంటెండెంట్లకు సురక్షితమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్కు సంబందించిన కెమికల్స్, మినరల్స్ కలపకుండానే నేరుగా కలుషితమైన వాటర్ ట్యాంక్ నుంచి ట్యాప్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆస్పతికి స్వచ్ఛంద సంస్థ అందజేసిన వాటర్ ఫ్రిజ్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. తాగునీరు పట్టుకునే ట్యాప్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. ఓపీ పేషెంట్లు నీళ్లు తాగడానికి కనీసం గ్లాసులు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆస్పత్రి అధికారులు ఉన్నారని రోగులు మండిపడు తున్నారు. ఏడాదిగా పనిచేయని మూడు బోర్లు నిరుపయోగంగా ఆర్వో ప్లాంటు ఇబ్బందులు పడుతున్న రోగులు, అటెండెంట్లు దుకాణాల్లో నీరు కొనుగోలు చేస్తున్న పరిస్థితి పట్టించుకోని అధికారులు.. దృష్టిసారించని పాలకులు -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మల్హర్(కాటారం): మహిళల స్వయంకృషితో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్, కుట్లు, అల్లికల ద్వారా లక్షల రూపాయలు అర్జించే అవకాశం ఉంటుందని కాటారం మార్కెట్ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం రైతు వేదికలో ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఆర్డీఓ బాలకృష్ణతో కలిసి గురువారం పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు ఆలోచనతో ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, వడ్డీలేని రుణాలు, పెట్రోల్ పంపులు, టైలరింగ్ ఉపాధి శిక్షణ కేంద్రాలను మహిళలకు కేటాయిస్తున్నారని చెప్పారు. మహిళలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాపారవేత్తలుగా పారిశ్రామిక సంస్థలను నెలకోల్పాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవికుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు ఫరహాన బేగం, సీసీలు రవికుమార్, లక్ష్మి, సారక్క, మాధవి టైలరింగ్ శిక్షకులు సజన, కల్పన పాల్గొన్నారు.కాటారం మార్కెట్ చైర్పర్సన్ తిరుమల -
శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
భూపాలపల్లి పట్టణంలో పేరుకే జీఎస్టీ భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో హోల్సేల్, రిటైల్ వ్యాపారం జీఎస్టీ బిల్లులు లేకుండానే ఎక్కువ శాతం సరుకులు ’జీరో బిల్లు’తో సాగుతోంది. జీరో బిల్లు దందాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈ దందాకు అధికారులు వత్తాసు, అండదండలు ఉండటంతో అడ్డులేకుండా సాగుతోంది. భూపాలపల్లి జిల్లాకేంద్రాన్ని ఆనుకొని చుట్టుపక్కల మండలాల్లో కొన్ని ప్రాంతాలు గిరిజన పల్లెలు కావడంతో జీరో దందాకు కేంద్ర బిందువుగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి స్థానిక వ్యాపారులకు వివిధ రూపాల్లో బిల్లులు లేకుండానే సరుకులు వస్తుండగా, కోట్లాది రూపాయల సరుకులు వినియోగదారులకు, చిన్న చిన్న వ్యాపారులకు యథావిధిగా జీఎస్టీ బిల్లు ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల సరుకులు వేరే రాష్ట్రాలతోపాటు వరంగల్, హైదరాబాద్ తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి రావడం, వాటిని వ్యాపారులు తమ గోదాంలకు తరలించి అక్రమంగా నిల్వ ఉంచడం కొన్నేళ్లుగా షరామామూలేగా జరుగుతోంది. పట్టపగలు, రాత్రి తేడా లేకుండా ఆయా సరుకులను జీరో బిల్లుతోనే ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఐరన్, ఆటోమొబైల్ వస్తువులు, వంట నూనెలు, ఎరువులు, పురుగుల మందులు, పంచదార, బెల్లం, సిమెంట్, ఎలక్ట్రికల్ సామన్లు, బంగారు అభరణాలతో సహా అన్ని రకాల సరుకులంతా జీరో బిల్లులతోనే సాగుతున్నాయి. ఆయా సరుకులన్నీ ప్రతి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు దిగుమతి చేస్తుంటాయి. ఇదంతా పట్టపగలే రోడ్డుపైనే సాగుతున్నా అధికారులకు మాత్రం కనీసం పట్టడం లేదు. జీఎస్టీ బోర్డులకే పరిమితమా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ఆదాయాన్ని అందేలా జీఎస్టీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం జీరో దందాకు బ్రేక్ వేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడటమే. కానీ భూపాలపల్లి, కాటారం వ్యాపారులు మాత్రం జీఎస్టీ బిల్లును కేవలం బోర్డులకే పరిమితం చేశారనే ఆరోపణలు బహిరంగంగా ఉన్నాయి. ఆయా దుకాణాల్లో, బోర్డులో మాత్రం జీఎస్టీ పిన్ నంబరును రాసి వినియోగదారులకు మాత్రం బిల్లులే ఇవ్వడం లేదు. విద్యావంతులు జీఎస్టీ బిల్లు అడిగితే ’మీకే నష్టం.. వద్దండీ’ అని చెబుతున్నారు. దాంతో వ్యాపారే ఇవ్వడం లేదు కదా అని మాకెందుకులే అంటూ బిల్లు లేకుండానే సరుకులను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా ఒకటి రెండు పెద్ద షాపింగ్ మాల్స్లో మాత్రమే జీఎస్టీ బిల్లులు ఇస్తుండగా, మిగిలిన అన్ని దుకాణాల్లో జీరోతోనే కాలం గడిపేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు జీఎస్టీ బిల్లుల రూపంలో నష్టం వాటిల్లుతోంది. జీరో బిల్లు దందాను అరికట్టాల్సిన విజిలెన్స్, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వత్తాసుతోనే బిల్లు లేకుండా దందా సాగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఏళ్లుగా సాగుతున్న జీరో బిల్లు వ్యవహారంపై వాణిజ్య. విజిలెన్స్ అధికారులు అక్రమ వ్యాపారులతో మిలాఖత్ కావడంతోనే స్థానిక వ్యాపారులు అప్రమత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయా శాఖల అధికారులు కొంతమంది అక్రమ వ్యాపారులనే తమ ఏజెంట్లుగా, దళారులుగా పెట్టుకొని మిగిలిన అక్రమ వ్యాపారుల వద్ద నుంచి నెల నెల వసూళ్లు చేసి దండుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వసూళ్ల దందాకు ఆయా శాఖల్లోని కింది స్థాయి అధికారుల పాత్రే కీలకమని తెలుస్తోంది. ఆయా శాఖలకు స్థానికంగా ఉన్న ఓ బడా వ్యాపారి, అధికార పార్టీని అడ్డుపెట్టుకొని దందాకు సహకరించేలా చక్రం తిప్పుతున్నట్లు వ్యాపారులే చెప్పడం గమనార్హం. రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి అక్రమ వ్యాపారానికి అధికారుల వత్తాసు -
బీసీలే ఎక్కువ
● ఉమ్మడి వరంగల్లోని మొత్తం జనాభా 36,88,217లో 18,37,374 మంది వారే..● ఆ తర్వాతి వరుసలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ● చివరి స్థానంలో బీసీ ముస్లిం, మైనారిటీలు ● మొత్తం 12,32,892 ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణ ● తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, కులగణన సర్వేలో వెల్లడి సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జనాభా 36,88,217 మంది అని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో 12,32,892 ఇళ్లు ఉన్నట్లు ఉన్నాయని వెల్లడించింది. జనాభా పరంగా చూసుకుంటే 18,37,374 మంది బీసీలు తొలిస్థానంలో ఉంటే, 1,74,440 మందితో బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. ఇల్లు ఉన్నవారి విషయానికొస్తే ఓసీలు 35.35 శాతంతో తొలిస్థానంలో ఉండగా, 30.60% బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 3,22,361 మంది ఉంటే...అత్యల్పంగా హనుమకొండలో 29,139 మంది ఉన్నారు. ఓసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 89,410 మంది ఉంటే అత్యల్పంగా ములుగులో 20,684 మంది ఉన్నారని వెల్లడించింది. ఇక ఎస్సీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 1,83,984 మంది ఉంటే ములుగు జిల్లాలో అతి తక్కువగా 49,746 మంది ఉన్నారని తెలిపింది. బీసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,50,150 మంది ఉంటే అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,18,254 మంది ఉన్నారని పేర్కొంది. జనాభాలో వరంగల్ జిల్లా ముందు... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల మొత్తం జనాభా 36,88,217 ఉంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉన్నట్టు సర్వే తేల్చింది. ఆ తర్వాత 8,04,515మందితో మహబూబాబాద్, 7,99,448మందితో హనుమకొండ, 5,45,449మందితో జనగామ, 4,07,896మందితో జయశంకర్ భూపాలపల్లిలు ఉండగా, చిట్టచివరగా 2,94,098 జనాభాతో ములుగు జిల్లా ఉంది. -
స్కూల్ ఎదుట ధర్నా
భూపాలపల్లి అర్బన్: మాలాధారణతో బుధవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్ అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ కౌన్సిలర్లు, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. పోలీసులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న ఓంకార్ బుధవారం మాలాధారణతో పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ జాన్సీరాణి అనుమతించలేదు. గురువారం ఉదయం పాఠశాల గేటు ఎదుట ధర్నా చేపట్టిన నాయకులు ప్రిన్సిపాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ధర్నా కొనసాగడంతో విద్యార్థులకు అంతరాయం కలగడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారు వెనక్కి తగ్గకపోవడంతో కొందరు నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ వ్యాఖ్యలు కేవలం విద్యార్థిపై కాకుండా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మల్హర్(కాటారం): ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పర్యటన అనంతరం కాటారం మండలం నస్తురుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అధికారులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నస్తూరుపల్లి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభా స్థలి వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని డీపీఓకు సూచించారు. విద్యుత్, ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్, వైద్యారోగ్యశాఖ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 19, 20 తేదీలలో ఇసుక లారీలకు అనుమతి ఇవ్వొద్దని, మూసివేయాలని ఆయన తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏఓకు సూచించారు. అంతకుముందు కాళేశ్వరం, నస్తూరుపల్లిలో సీఎం పర్యటన హెలి ప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికష్ణ, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
రామప్ప దేవాలయంలో అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్కు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ సందర్శించారు. భారత్ దర్శన్లో భాగంగా వారు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. వారి వెంట కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని డీఆర్డీఓ చంద్రశేఖర్ సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. -
కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు గురువారం మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా నలుగురు కో–ఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. ఈ మేరకు జనరల్ కేటగిరిలో ఒక మహిళ, జనరల్, మైనారిటీ కేటగిరిలో ఒక మహిళ, జనరల్ స్థానాలను కేటాయించారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్ను హైదరాబాద్ ఏడో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్నగర్లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు. ఐటీడీఏ ఏపీఓ డిప్యుటేషన్ రద్దు ● ఉట్నూరుకు వసంతరావు బదిలీ ● ఏటూరునాగారం ఏపీఓగా నాగోవరావు నియామకం ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో డిప్యుటేషన్పై ఏపీఓగా పనిచేస్తున్న వసంతరావు జాదవ్ డిప్యూటేషన్ను ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సబ్యసాచి ఘోష్ రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరులో పనిచేయాల్సిన వసంతరావు ఏటూరునాగారం డిప్యుటేషన్పై వచ్చారు. గత ఏడాదిగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఎట్టకేలకు హైదరాబాద్లో ఏపీఓ జనరల్గా పనిచేస్తున్న నాగోవరావును ఏటూరునాగారం ఏపీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు విధుల్లో చేరనున్నారు. దేవాదుల మోటార్ల పంపింగ్ నిలిపివేత కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ గుట్టగంగారం వద్ద ఉన్న దేవాదులలో నాలుగు మోటార్ల పంపింగ్ను బుధవారం అధికారులు నిలిపి వేశారు. దేవాదుల వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉన్నాయి. అందులో గత కొన్ని రోజుల నుంచి ఎత్తిపోతల వద్ద ఆరు మోటార్లతో పంపింగ్ చేస్తూ నీటిని దిగువలో ఉన్న భీమ్ఘన్పూర్, గొల్ల బుద్ధారం రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసిన అధికారులు బుధవారం ఫేజ్ త్రీలో మూడు, ఫేజ్ టులో ఒక మోటారును ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం పేజ్త్రీలో రెండు మోటార్లతో 583 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాస సంపుటి ఆవిష్కరణ కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జర్నలిజం విభాగ అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి రచించిన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అంశాలపై వ్యాస సంపుటిని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులు, పరిశోధన, రచనా రంగాల్లో చురుగ్గా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. ఈగ్రంథం సమాజ చైతన్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి, ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, రచయిత డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య భూపాలపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక మండల స్థాయి సమావేశం జిల్లాకేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఇన్చార్జ్ ఎంపీడీఓ నాగరాజు అధ్యక్షతన గురువారం జరిగింది. చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలలో సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. వాటిని అధిగమిస్తూ గ్రామాల అభివృద్ధికి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారి జవహర్లాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదికలోని ఐదు అంశాలను ప్రజలకు చేరే విధంగా అధికారులు సర్పంచ్లు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ నూతన వ్యవసాయ విధానాలు అమలుచేసే విధంగా వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. యువత జిల్లాకేంద్రంలో సింగరేణి ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొందాలని, టాస్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అందుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జూనియర్ కళాశాలకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలకు, ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం వంటి నూతన పథకాలను అమలు చేసే విధంగా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, హౌసింగ్ పీడీ లోకిలాల్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రవీందర్, ఎస్సై గీతా రాథోడ్, భూపాలపల్లి మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
ధాన్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు
● జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కిరణ్కుమార్కాళేశ్వరం: ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని, దీనిని పూర్తిగా అడ్డుకునే దిశగా కఠినచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్పోస్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, పౌర సరఫరాలశాఖలు సమన్వయంతో 24 గంటలు నిరంతర పహారా నిర్వహిస్తాయన్నారు. జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడడం, వారికి న్యాయమైన మద్దతు ధర ల భించేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతరాష్ట్ర చెక్పోస్టు ద్వారా వాహనాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని, నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాములు, ఎస్సై తమాషారెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టర్లు సురేందర్రెడ్డి, రాజు, జీపీఓ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
యువత భవిత మనందరి బాధ్యత
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: యువత భవిత మనందరి బాధ్యతని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అలైవ్–అరైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో పో లీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మత్తు ప దార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచులు, మున్సిపల్ కౌ న్సిలర్లకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువతలో సానుకూల మార్పు తీసుకురావడంలో గ్రామ, వార్డుస్థాయి నాయకత్వం కీలకమన్నారు. ప్రజాప్రతినిధులు ముందుండి యువతను సరైన దిశలో నడిపించాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి వివరాలను పోలీసులకు తెలియజేసి సమాజాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీని కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై పోలీసు అధికారులు, సర్పంచ్లు, కౌన్సిలర్లతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
20న కాళేశ్వరానికి సీఎం
కాళేశ్వరం: ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భద్రత, ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 20న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటు చేయనున్నారు. సుమారు 40 ఎకరాల్లో సభాస్థలి, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లోని 20వ పియర్(పిల్లర్) కుంగిపోగా, వంతెన కుంగి పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (ఎన్డీఎస్ఏ) నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. వాటికి మరమ్మతులు చేసి పునరురిస్తామని ఇటీవల సీఎం ఇచ్చిన హామీ మేరకు పర్యటన ఖరారైందని రైతాంగం ఆశిస్తోంది. ఇప్పటికే పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం సైంటిస్టులు బ్యారేజీలో పలమార్లు జియోఫిజికల్, జియోటెక్నికల్తో పాటు పలు రకాల పరీక్షలు చేపట్టారు. ఆ పరీక్షలను సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇరిగేషన్శాఖ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. నస్తూర్పల్లిలో సభ సీఎంతో పాటు ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటన తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సభా వేదిక నిర్వహణను 40 ఎకరాల్లో కాటారం మండలం నస్తూర్పల్లిలో సభా వేదిక, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, హెలిపాడ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలను అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. కాగా, కాళేశ్వరం, కుదురుపల్లిలో సభాస్థలి కోసం పరిశీలనలు చేసినప్పటికీ అనువుగా ఉండే నస్తూర్పల్లిలో ఏర్పాట్లకు అధికారులు సుముఖం తెలిపారు. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగనున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేయండి.. ఈ నెల 20న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను పురస్కరించుకొని కాటారం మండలం ధన్వాడలోని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తన నివాసంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, రవాణా, హెలిపాడ్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. కాటారం మండలం నస్తూర్పల్లిలో సభాస్థలి, పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు ధన్వాడలో అధికారులతో మంత్రి శ్రీధర్బాబు సమీక్ష -
వేతన భారం!
భూపాలపల్లి రూరల్: నిధుల కొరతతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోభారం మోపింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ఇక నుంచి పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను కూడా చెల్లించారు. ఈ నిర్ణయంపై పంచాయతీ పాలకవర్గాలు కలవరపడుతున్నాయి. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు వేతనభారం కానుంది. పాత పద్ధతిలోనే ప్రభుత్వమే నేరుగా తమ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ లేదా ఇతర అంతర్గత వనరుల నుంచే చెల్లించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో మంజూరు కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు మేజర్ పంచాయతీలకు సుమారు రూ.3 లక్షల వరకు నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతోనే పారిశుద్ధ్య పనులు, వేతనాలు చూసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీలకు కష్టకాలం.. జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,026 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరినీ మల్టీపర్పస్ వర్కర్లుగా పరిగణిస్తూ నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. గతంలో ఈ వేతనాల కోసం ప్రత్యేక నిధులు విడుదలయ్యేవి. పంచాయతీ అభివృద్ధి నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు కనీసం మూడు నెలలకొకసారి జీతాలు చెల్లించేవారు. ప్రసుత్తం వేతనాలకు పంచాయతీ నిధులకు ముడి పెట్టడంతో కా ర్మికుల్లో ఆందోళన మొదలైంది. గ్రామాల్లో వీధి దీపాలు, బోరు మోటార్ల మరమ్మతు విద్యుత్ బిల్లుల భారం కూడా పంచాయతీలపైనే పడుతోంది. విద్యుత్ చార్జీలు, వర్కర్ల వేతనాలు చెల్లించగా మిగిలిన నిధులను మాత్రమే అత్యవసర పనులకు వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే నిధులు లేక సర్పంచులు, కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ అదనపు భారం మోయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 నుంచి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు. చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ సర్పంచుల ఒత్తిడి.. చేసిన పనుల బిల్లులు, బకాయిల కోసం మాజీ సర్పంచులు కొత్త పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయించినా బిల్లులు రాలేదని వాపోతున్నారు. కొందరు వాస్తవంగా పనులు చేసినా మరికొందరు అక్రమంగా బిల్లులు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న నిధులను వేతనాలు, కరెంటు బిల్లులకే కేటాయించమనడంతో పాత బకాయిలు ఎలా చెల్లించాలో తెలియక కొత్త పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు పంచాయతీలే చెల్లించుకోవాలని చెబుతున్నారు. వెంటనే జీఓ నంబర్ 51 రద్దు చేయాలి. విద్యార్హతల ప్రకారం కారోబార్లకు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలి. ప్రత్యేక నిధులు కేటాయించి పాత పద్ధతిలోనే వేతనాలు అందించాలి. – బంటు సుదర్శన్, కారోబార్ పంబాపూర్ గతంలోనూ ఇదే పద్ధతిలో పంచాయతీల నుంచే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాం. అయితే రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం పాలకవర్గాలు కొలువుదీరడంతో జనవరి నుంచి పంచాయతీలు వేతనాలు చెల్లిస్తున్నాయి. – శ్రీలత, డీపీఓ కేంద్ర, రాష్ట్ర నిధులు వినియోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని విన్నపం జిల్లాలో 248 జీపీలు, 1,026 పారిశుద్ధ్య కార్మికులు -
పార్టీ పటిష్టతకు పాటుపడాలి
మల్హర్(కాటారం): క్రమశిక్షణతో అంకితభావంతో పార్టీ పటిష్టతకు పాటుపడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఽఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీకి ఎన్నికై న పంతకాని సమ్మయ్య, కుంభం స్వప్నరెడ్డి, అంగజాల అశోక్ మంగళవారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మంత్రి శ్రీధర్బాబును కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ పదవులకు వన్నెతెచ్చేలా నాయకుల పనితనం ఉండాలన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి మరలా వచ్చేలా ప్రజాప్రతినిధులు, పార్టీ పదవులు ఉన్నవారు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నేటి యువత అంబేడ్కర్ ఆశయాలను లోతుగా అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అంబేడ్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహానీయుడని పేర్కొన్నారు. ఆయన ప్రతిభావంతమైన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను సమాజంలో స్థాపించడంలో ఆయన పాత్ర అత్యంత గొప్పదని వివరించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి విలువలను జీవితంలో అనుసరించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశాభివద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలంటే అంబేడ్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, ఆర్ఐ రత్నం, ఆర్ఎస్ఐ ఫిరోజ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పిలుపు
భూపాలపల్లి అర్బన్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు దుండ్ర రాజయ్య తెలిపారు. ఈ మేరకు డిపో ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పీఆర్సీ అమలు, ఉద్యోగ భద్రత కల్పన, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ కార్మికులు శక్తికి మించి పనిచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అధికారుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, యూనియన్ల పునరుద్ధరణ లేకపోవడం వంటి సమస్యలపై పలు మార్లు ప్రభుత్వానికి, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినా స్పష్టమైన హామీలు రాకపోవడంతో జేఏసీ నాయకులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమ్మెలో పూర్తిస్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుర్రి తిరుపతి, రాధాకృష్ణ, బండి శ్రీనివాస్, ఎల్లా గౌడ్, సమ్మయ్య, మధు, ఏకే స్వామి, రంజిత్ గౌడ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.


