breaking news
Jayashankar District News
-
నషాముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, మద్యపానం, ఇతర వ్యసనాలతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని అన్నారు. వ్యసనాల నిర్మూలన కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని వ్యసన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, జిల్లా సమాచార అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, డీఎంహెచ్ఓ మధుసూదన్, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి ఇందిరా, సుకీర్తి పాల్గొన్నారు. -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలి పలిమెల: జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలోని గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలం కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు పెరిగితే దోమల బెడద తీవ్రంగా పెరిగి, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను దోమల కాటు నుంచి రక్షించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు ఐతే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు దారకొండ సూర్య శంకర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఓవర్లోడ్ లారీలను నియంత్రించాలి భూపాలపల్లి రూరల్: మహదేవపూర్ మండలం పల్గుల గ్రామంలో అనుమతిలేని ఇసుక లారీలు ఓవర్ లోడ్తో వెళ్తున్నాయని.. వాటిని నియంత్రించి చర్యలు తీసుకోవాలని పలుగుల వార్డు సభ్యులు రాగం వెంకటమ్మ, కొట్టె రాజయ్య, జిల్ల్లా సంతోష్, నిట్టురి రమేష్, నిట్టురి రమాదేవి సోమవారం డీపీఓ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. అక్రమంగా ఇళ్ల మధ్యనుంచి వెళ్తున్నాయని దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో మోసాలు భూపాలపల్లి అర్బన్: ఇటీవల కొంతమంది మోసగాళ్లు తమను ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులుగా పరిచయం చేసుకుంటూ దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆహార తనిఖి అధికారి వరుణ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లేదా వారి సిబ్బంది ఎవరూ వ్యాపార సంస్థల యజమానులకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ చేయరని స్పష్టం చేశారు. ఎవరైనా తమను ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులమని చెప్పి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు లేదా ఇతర వివరాలు కోరితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రూ.50 వేల ఆర్థిక సాయం మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ రేణిగుంట్ల చందర్ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని మండలంలోని ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది చందర్ కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. అనంతరం చందర్ కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగళి విజయపాల్రెడ్డి, ఉపాధ్యాయులు వెంకన్న, కుమారస్వామి, ప్రవీణ్, అనిల్, రాజు, శ్రీకళ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చంద్రమౌళి పాల్గొన్నారు. -
ఓట్ల చోరీ కోసమే ‘సర్’
హనుమకొండ హంటర్రోడ్లోని డికన్వెన్షన్హాల్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. – హన్మకొండ చౌరస్తా● అప్రజాస్వామ్యంగా అధికారంలో రావాలని బీజేపీ చూస్తోంది ● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ● బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు ● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి అర్బన్: వర్షాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. వర్షాలు, వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, వైద్య, విద్యుత్, పంచాయతీ రాజ్, మున్సిపల్, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. వైద్య శాఖ అధికారులు అవసరమైన ఔషధాలు, అత్యవసర వైద్యసేవలను సిద్ధంగా ఉంచాలని, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల నివారణ, దోమల వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చెరువుల పరిరక్షణ, బలహీన ప్రాంతాల పరిశీలన, రక్షణ చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వర్షాలు, వరదల సమయంలో పశువులను ఎత్తైన ప్రాంతాల్లో ఉంచాలని, రైతులు పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాన్ని సంప్రదిస్తూ ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంతకుమారి, కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా..
మడికొండలోని ఓ కన్వెన్షన్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. – హన్మకొండ● కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం ● ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
మృత్యువుకు హైవే..
భూపాలపల్లి: జిల్లా పరిధిలో హైవేపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను వణికేలా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట పచ్చని సంపారాల్లో ఈ ప్రమాదాలు చీకట్లు నింపుతున్నాయి. బొగ్గు, ఇసుక లారీలు అధిక లోడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారానికి రెండు, మూడు ఆక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు, రవాణాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా విధి నిర్వహణలో ఉన్న రవాణాశాఖ జిల్లా అధికారే హైవేపై లారీ ఢీకొని దుర్మరణం పాలవ్వడం ఇక్కడి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటన జిల్లా ప్రజలను కలచివేసింది. ఎన్హెచ్పై నిత్యం ప్రమాదాలే.. జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామ సరిహద్దు నుంచి కాటారం మండలం నస్తూర్పల్లి వరకు ఎన్హెచ్ 353సీ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి అక్కడక్కడ మాత్రమే మరమ్మతుకు నోచుకుంది. అయినప్పటికీ ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలపై పలువురు పోలీసు అధికారులు పరిశీలన చేయగా, అందులో నూటికి 90 శాతం ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే చోటుచేసుకున్నట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల క్రితం ఇలాగే నిత్యం ప్రమాదాలు జరగడంతో అప్పటి ఎస్పీ ఆర్.భాస్కరన్ జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించారు. ఎన్హెచ్పై స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదనే నిబంధనలు ఉండటంతో కొద్ది రోజులకే వాటిని తొలగించారు. దీంతో బైక్, కార్లు, లారీలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. ఇందుకు తోడు రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనం నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బొగ్గు, ఇసుక లారీలతోనే ఎక్కువగా.. జిల్లాలో బొగ్గు, ఇసుక రవాణా చేసే లారీలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లిలో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సుమారు 800 టిప్పర్లు, లారీలు వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుంటాయి. అంతేకాక కాళేశ్వరం గోదావరి నది నుంచి ప్రతీరోజు వందలాది ఇసుక లారీలు జిల్లా మీదుగా హనుమకొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఆయా లారీల మూలంగానే ఎక్కువగా, భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధిక లోడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రాత్రివేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేసినా.. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా ఎన్హెచ్ అధికారులు గుర్తించారు. ఇందులో అక్కడక్కడ బ్లాక్ స్పాట్ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెద్దగా కనిపించేలా ఏమీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే వాహనదారులు జంకాల్సి వస్తుంది. రోడ్డు ప్రమాదాలుమరణాలుతీవ్ర గాయాలైనవారు3721919622310316812413090807495202420252026 జిల్లాలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు లారీల వేగానికి బ్రేకులు వేసేదెన్నడో? డ్రంకెన్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణం డీటీఓ మృతితో ఉలిక్కిపడ్డ ప్రజలు బ్లాక్ స్పాట్స్ ఇవే.. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గణపురం మండలం గాంధీనగర్, మోరంచపల్లి భూపాలపల్లి పట్టణం అంబేడ్కర్ చౌరస్తా, కమలాపూర్ క్రాస్రోడ్ కాటారం మండలం మేడిపల్లి, నస్తూర్పల్లి మహదేవపూర్ మండలం కుదురుపల్లి డీటీఓ మృతితో జిల్లాలో విషాదం.. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో లారీ ఢీకొట్టగా జిల్లా రవాణాశాఖాధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో.. మల్హర్ (కాటారం): లారీడ్రైవర్ నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో వెనుక ఉన్న క్లీనర్ లారీ కింద పడి మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాటారం ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్కు చెందిన సతీష్ కుమార్ (35) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. జూన్ 21 ఆదివారం రాత్రి మండలంలోని నస్తూర్పల్లి వద్ద డాంబర్ ప్లాంట్లో అన్లోడ్ చేసేందుకు వెళ్లారు. డ్రైవర్ లారీని రివర్స్ చేస్తూ వెనుక చూడమని చెప్పడంతో సతీష్ కుమార్ వెనుక నిలబడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా రివర్స్ చేయడంతో లారీ ఢీకొని సతీష్ కిందపడ్డాడు. దీంతో వెనుక టైర్లు రెండు కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో కాళ్లు పూర్తిగా నలిగి తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు 100కు సమాచారం ఇవ్వడంతో సతీష్ను భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య స్వప్న ఫిర్యాధు మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కంకణాల రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. విషాదఛాయలు కొత్తపల్లిగోరిలో ఇద్దరు మృతి(మే 30 వరకు) -
డ్రోన్ టెక్నాలజీతో కొత్త అవకాశాలు
● జీఎం రాజేశ్వర్ రెడ్డి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం నిర్వహించిన డ్రోన్ టెక్నీషియన్ కోర్సు శిక్షణ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు, గనులు, వ్యవసాయం, భద్రత, సర్వేలు, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరుగుతోందన్నారు. భవిష్యత్లో డ్రోన్ టెక్నీషియన్లకు మంచి డిమాండ్ ఉండబోతుందని, శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను విస్తరించడమే సింగరేణి సంస్థ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (క్వాలిటీ) కృష్ణ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్సుందర్, విటిసి మేనేజర్ నజీర్, అసిస్టెంట్ మేనేజర్ మహేశ్, ట్రైనర్ సందీప్ పాల్గొన్నారు. ప్రమాదానికి సింగరేణికి సంబంధం లేదు రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి (డీటీఓ) మృతి చెందిన ఘటన పట్ల సింగరేణి యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన వాహనానికి సింగరేణి కార్యకలాపాలు, బొగ్గు రవాణా వ్యవస్థతో సంబంధం లేదన్నారు. సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలు, పాటిస్తుందన్నారు. -
అత్యాధునిక సాంకేతికతతో బొగ్గు రవాణా పర్యవేక్షణ
● బొగ్గు కుంభకోణంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు ● సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ దశను అత్యంత పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నామని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) వెంకన్న జాదవ్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించిన ఆయన ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి ఓసీ–2 ఉపరితల గనిలోని లోడింగ్ బంకర్ను పరిశీలించి అక్కడి కార్యకలాపాలను సమీక్షించారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో సింగరేణి బొగ్గు చోరీకి గురవుతోందని, బొగ్గు అదృశ్యమవుతోందని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. గనుల్లో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతీ టన్ను బొగ్గుకు సంబంధించిన సమాచారం సాప్ కోల్నెట్ వంటి ఆన్లైన్ వ్యవస్థల్లో నమోదు అవుతుందన్నారు. సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, 15 శాతం రోడ్డు, ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓసీ–2 ప్రాజెక్టు అధికారి శ్యామ్సుందర్, డీజీఎం (క్వాలిటీ) కృష్ణప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోషమల్లు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలోని పోలీసు అధికారులు పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. -
సాగుపై నీలినీడలు
● తీవ్ర ప్రభావం చూపనున్న ‘ఎల్నినో’ ● ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమంటున్న వ్యవసాయశాఖ ● వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలుభూపాలపల్లి: వానాకాలం సాగు సీజన్పై ‘ఎల్నినో’ ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు, వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని, పంటల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూపులు.. జిల్లాలోని 12 మండలాల్లో ఈ వానాకాలం సీజన్లో పత్తి, వరి, పెసరు తదితర పంటలు 2,16,734 ఎకరాలు, మొక్కజొన్న 280 ఎకరాలు, మిర్చి సుమారు 25వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. రైతులు సైతం ఈ మేరకే పంటల సాగు చేపట్టాలని భావించి ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని సుమారు 50వేల ఎకరాల్లో వారం రోజుల క్రితమే ఇప్పటికే రైతులు పత్తి గింజలు నాటారు. మబ్బులు ఉరుమడం, వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ జిల్లా కేంద్రంలో మినహా ఎక్కడ వర్షాపాతం నమోదు కాలేదు. ఉష్ణోగ్రత కారణంగా పత్తి గింజలు మొలకెత్తకపోగా మాడిపోయాయి. వరి, మిర్చి సాగు చేసే రైతులైతే ప్రస్తుత పరిస్థితులను చేసి ఆందోళన చెందుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో తెలంగాణలో ఎల్నినో ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ఈ ప్రభావం ఈ నెలలోనే కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినోతో ఎలాంటి నష్టం.. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ వ్యవస్థలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. దీని ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురియక, సుదీర్ఘ పొడి వాతావరణం (వర్షాభావ పరిస్థితులు) ఏర్పడుతుంది. జూన్ నెలలో సాధారణ వర్షాలు కురిసినప్పటికీ.. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా భూగర్భ జలాలు రీఛార్జ్ కావు. తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఒకే రకమైన పంటలపై ఆధారపడితే దిగుబడులు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. సన్నరకాలే మేలు.. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరిసాగులో సన్నరకాలే మేలని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. వానాకాలం సాగుకు అనువైన, తెగుళ్లను తట్టుకునే సన్న వరి రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ సోనా, కునారం వరి 2, రాజేంద్రనగర్ వరి 4 లాంటి రకాలు వాలిపోకుండా, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉంటాయని, ఈ రకాలు వానాకాలంతో పాటు యాసంగికి కూడా అనుకూలమని వెల్లడించారు. స్వల్పకాలిక వంగడాలు వేయాలి ఫసిఫిక్ మహా సముద్రంలో వేడి గాలుల వల్ల ఏర్పడేదే ఎల్నినో. దీని వలన దేశంలోని కొన్ని రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులకు గురి కానున్నాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీని ఎఫెక్ట్ జిల్లాలో ఈ నెలలో కూడా ఏర్పడింది. ఈ వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు స్వల్పకాలిక వరి వంగడాలను సాగు చేయాలి. పప్పు దినుసుల పంటలు, అపరాలు వేసుకుంటే రైతులకు ఇబ్బందులు తలెత్తవు. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి మిర్చి 25,000పెసరు 110పత్తి 1,06,560మొక్కజొన్న 280ప్రత్యామ్నాయ పంటలే శ్రీరామరక్ష.. సంప్రదాయ పంటల కంటే తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను ఎంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి ఏకై క పరిష్కారమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని అంటున్నారు. అంతేకాక ఒకే పంటపై ఆధారపడకుండా విధిగా పంట మార్పిడి (క్రాప్ రొటేషన్) చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై 15 లోపు తగినంత వర్షపాతం నమోదు కాని పక్షంలో 125 రోజుల కంటే తక్కువ కాలపరిమితి గల స్వల్పకాలిక వరి రకాలను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ‘ప్రసాదాల విక్రయంలో నిర్లక్ష్యం’ మంగపేట : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదాలను విక్రయించడంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెసా మొబిలైజర్ తాటి విజయ్బాబు ఆదివారం ఒక్క ప్రకటనలో ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయంలో విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు లభించకపోవడంతో భక్తుల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయ సిబ్బందితో పాటు మల్టీపర్పస్ సిబ్బందితో కలిసి 15 మంది ఉన్నా నెలనెలా వేతనాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారనే తప్ప ప్రసాదాల తయారీ, విక్రయాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో పూజ సామగ్రితో పాటు హోటళ్లు, బొమ్మల షాపులకు వేలంపాట నిర్వహించిన అధికారులు గతంలో మాదిరిగా లడ్డు, పులిహోర విక్రయాలకు వేలం పాట పెడితే ఆలయానికి ఎంతో ఆదాయం వచ్చేదని వెల్లడించారు. అధికారులు ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాటానికి మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ మల్హర్(కాటారం): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. కాటారం పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైందని, ఉద్యమకారులకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ కరుణాకర్ రావు, అంజయ్య, కుమార్ యాదవ్, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, శ్రీనివాస్, రాజయ్య, రవీందర్, మాధవి, రచన, సృజన, కృష్ణవేణి, భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. వ్యవసాయ పనుల్లో రైతన్న నిమగ్నం మహాముత్తారం: రెండు రోజుల క్రితం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని బోర్లగూడెం, మీనాజీపేట, కనుకునూర్, సింగారం, గండికామారం గ్రామాల్లోని రైతులు బోరుబావుల కింద నారుమడులు తయారు చేసి వరినారు కోసం మొలక అలుకుతున్నారు. అదే విధంగా మరి కొన్ని గ్రామాల్లో రైతులు మొదటి దఫా వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టడానికి చెల్లల్లో దుక్కులు దున్ని సాగుబాటు చేసుకున్నారు. రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆయా గ్రామాల్లోని రైతులు తమతమ పత్తి చేన్లలో కూలీలతో పత్తి విత్తనాలు వేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోనే కాకుండా ఈ సీజన్లో ఇంతవరకు భారీ వర్షం కురవడకపోవడంతో అన్నదాతలు సాగు పనులు ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● సీఐ కరుణాకర్ రావు రేగొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కరుణాకర్ రావు సూచించారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఎస్సై సాయి త్రిలోక్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సెకండ్ ఎస్సై హేమ, సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, ఉప సర్పంచ్ ఆకుతోట తిరుపతి పాల్గొన్నారు. -
రామప్ప అద్భుతం
లక్నవరంలో సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): రామప్ప దేవా లయం అద్భుత కట్టడమని సెంట్ర ల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ రాకేష్ గోయల్ కొనియాడారు. మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమా శంకర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించారు. గోవిందరావుపేట: లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సె ల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ స భ్యులు, యువత ఉత్సాహంగా గడిపా రు. సరస్సులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు -
పూర్తయిన ఇల్లు.. జాడలేని బిల్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. నిర్మాణాలకు అనుగుణంగా ఖాతాల్లోకే డబ్బులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులు గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుదశ చెల్లింపు (రూపాయల్లో) పునాది పూర్తి 1,00,000 లెంటెల్ స్థాయి 1,50,000 స్లాబ్ పూర్తి 1,50,000 ఇల్లు పూర్తి 1,00,000 మొత్తం 5,00,000జిల్లా నియోజకవర్గాలు మంజూరు పూర్తి హనుమకొండ 2 8,000 2,400 వరంగల్ 3 9,000 1,760 జనగామ 2 5,600 1,860 మహబూబాబాద్ 2 10,148 2,750 ములుగు 1 5,100 1,165 జేఎస్ భూపాలపల్లి 1 4,152 565 11 42,000 10,500 -
అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని.. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో యోగా ఫర్ హెల్ది ఏజింగ్ అనే ఇతివృత్తంతో జిల్లా స్థాయి యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఏఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగా ఆసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవడుతుందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, ఆరోగ్య, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి తోడ్పడుతుందని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న, పెద్దల వరకు ప్రతీ ఒక్కరు సాధన చేయాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండటమే మహాభాగ్యమని మనిషికి బలమైన పునాది ఆరోగ్యమని అని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేష్ కుమార్ మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. వయోభేదం లేకుండా అన్ని వయస్సుల వారు యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం యోగా గురువు కుమార్ యోగా ఆసనాలు, ప్రాణాయామాలను చేయిస్తూ, ప్రతీ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రాఘవేంద్రరావు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: కార్యక్రమంలో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు, యోగా గురువు కుమార్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ జగదీష్ ఖన్నా, డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ సదానందం, డాక్టర్ అజయ్, ఆయుష్ వైద్యులు, యోగా గురువులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని ప్రాకార దేవతామూర్తుల విగ్రహాల ను తమిళ శిల్పులు తొలగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన 50కిపైగా విగ్రహా లను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 23న హైదరాబాద్లో టెండర్లు పూర్తి కానున్నట్లు సమాచారం. అనంతరం ఆలయాల కూల్చివేతలు ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే రాతితో కట్టడాల నమూనా చిత్రాలను కమిషనర్ హనుమంతరావు విడుదల చేసిన విషయం తెలిసిందే. -
మెడికల్ బోర్డు నిర్వహించాలి
● తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పించాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించి కేటీకే–5వ గనిలో ఆవరణలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నా.. ఈలోగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు ఏ రోజు నిర్వహిస్తామని ప్రకటించాలని లేకుంటే జూలై 20 నుంచే గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఒక సారి కూడా మెడికల్ బోర్డు నిర్వహించలేదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళుర్పించారు. బస్టాండ్ సమీపంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు సారయ్య, రియాజ్ అహ్మద్, చెన్నూరు మాబోడ జనార్దన్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలి
● యూరియాను నేరుగా రైతులకు అందించాలి ● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని, యాప్ ద్వారా కాకుండా రైతులకు నేరుగా యూరియా అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందించాలన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ద్వంద వైఖరిని మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ‘సర్’పై అవగాహన.. ‘సర్’(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోవు రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాత్మక అడుగులు, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. -
‘నీట్’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● రెండు కేంద్రాల్లో 388 మంది అభ్యర్థులు ● భద్రత, పర్యవేక్షణపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిభూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం) నిర్వహించనున్న నీట్ పరీక్షకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కంట్రోల్ రూం, పరీక్షహాళ్లు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ వ్యవస్థలు, బయోమెట్రిక్ పరికరాల పనితీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 388 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 168 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, జనరేటర్ బ్యాకప్ వంటి సదుపాయాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రతా పరంగా ప్రతీ కేంద్రం వద్ద తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్తో పాటు నలుగురు పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థినుల తనిఖీల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లలో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్, అంబులెన్స్, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నీట్ పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా యంత్రాంగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటరు జాబితాలో పేర్లను సరి చూసుకోవాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లాలోని అర్హులైన పౌరులందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం మన జిల్లాలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరుగుతుందని, బూతు స్థాయి అధికారులు ప్రతీ ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ఓటర్ల వివరాలు పూరించిన తర్వాత ప్రతిని బూతు స్థాయి అధికారికి అందించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తదితర కార్యక్రమాల అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు అబ్బాస్, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమగ్ర నివేదికలు తయారు చేయాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమంపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య శాఖలతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, వార్డు సభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కార స్థితి, పెండింగ్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. వచ్చే వారంలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణకు జిల్లాకు రానున్న నేపథ్యంలో, అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్లో కొనాల్సిందే!
భూపాలపల్లి అర్బన్: పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలను స్కూల్లోనే కొనుగోలు చేయాలని జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కండీషన్ పెడుతున్నాయి. లేదంటే యాజమాన్యం చెప్పిన దుకాణాల వద్దే కొనుగోలు చేయాలని నిబంధన పెడుతున్నారు. మార్కెట్లో తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక ధరలకు విక్రయించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఫీజులతో పాటు పుస్తకాల భారం.. జిల్లాలో 75 వరకు ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం స్కూళ్లు మాత్రమే నిబంధనలకు లోబడి నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పూర్తిగా వ్యాపార ధోరణి అవలంభిస్తున్నాయి. విద్యార్థుల ఫీజులు మొదలుకొని, పుస్తకాలు, యూనిఫాం, రవాణా, టర్మ్ ఫీజుల పేరిట అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ మాత్రం సౌకర్యాలు లేని పాఠశాలల్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజు కంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు కాకుండా నోట్ బుక్స్, ఆయా పాఠశాలల వర్క్ బుక్స్ పేరిట రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవే పుస్తకాలు దుకాణాల్లో కొనుగోలు చేస్తే రూ.వెయ్యికి మించదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ బయట పుస్తకాలు కొనుగోలు చేస్తే వాటిని స్కూల్ యాజమాన్యాలు అనుమతించడం లేదు. చాలా స్కూళ్లల్లో పుస్తకాలు, యూనిఫాలంను వారే విక్రయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం పుస్తకాలు, యూనిఫాంలతో వేల రూపాయల వసూళ్లు తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారం భూపాలపల్లిలో ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదుల వెల్లువ జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాల ధరలు మండిపోతున్నాయి. నర్సరీకి రూ.3,049, ఎల్కేజీకి రూ.4,029, యూకేజీకి రూ.5,249, ఒకటవ తరగతికి రూ.6,164, రెండో తరగతికి రూ.6,574, మూడో తరగతికి రూ.6,029, నాలుగో తరగతికి రూ.6,631, ఐదో తరగతికి రూ.6,796లకు పాఠ్య పుస్తకాలు, డైరీ, నోట్ పుస్తకాలు అమ్ముతున్నారు. ఎందుకు ఇంత ధరలు అని తల్ల్దిండ్రులు ప్రశ్నిస్తే ఇష్టమైతేనే కొనుక్కోండి లేదంటే ఒక్క రూపాయికు కూడా తగ్గేది లేదని బదులిస్తున్నారు. -
నాన్నే నాకు స్ఫూర్తి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేవరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫా దర్స్డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే.. ప్రజలతో మమేకమై.. మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా యూనిఫామ్ సర్వీస్లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్ఎన్పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా. సమయం కేటాయించేవారు.. నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదంసాక్షితో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
శాంతియుత జీవితం గడపాలి
● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుత జీవితాన్ని గడపాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. కోర్టుల్లో సంవత్సరాల తరబడి కొనసాగే కేసులను రాజీమార్గం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకొని కేసుల నుంచి బయటపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏపీపీ ప్రదీప్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.అక్షయ, సీఐలు, ఎస్ఐలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. జడ్జి అఖిల పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి వివిధ యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ శివకుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, న్యాయవాదులు ప్రియాంక, రత్నం కిరణ్, మొయినుద్దీన్, అశోక్రెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డెమో శ్రీదేవి ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కిరణ్, యోదా, మేధ, స్మార్ట్ కేర్, శ్రీ వెంకటేశ్వర, ప్రధాన్ ఆస్పత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అవసరమైన అనుమతులు, సర్టిఫికెట్లు, ధరల పట్టికలు తదితర అంశాలను పరిశీలించారు. అన్ని ఆస్పత్రుల్లోనూ దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయుష్ వైద్యులు, నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి అనడం హాస్యాస్పదం కాళేశ్వరం: కాళేశ్వరాలయం టెండర్లు పూర్తికాలేదని అప్పుడే అవినీతి అని పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ‘యాత్రను అడ్డుకోవడం సరికాదు’ భూపాలపల్లి అర్బన్: బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ఓపెన్ కాస్టు సందర్శనకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని అవినీతి ప్రభుత్వం నుంచి కాపాడాలని కోరారు. సింగరేణి కార్మికుల భద్రతను రక్షించేందుకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఎంపికకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. జిల్లాలోని నాలుగు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతికి 41 సీట్లు, 5వ తరగతికి 43 సీట్లు కలిపి మొత్తం 84 సీట్ల భర్తీ కోసం లక్కీ డ్రా చేపట్టారు. ఈ ప్రవేశాల కోసం 141 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అర్హత పొందిన 135 మంది విద్యార్థుల పేర్లతో డ్రా నిర్వహించారు. ఇందులో 84 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఈ సందర్భంగా అధికారులు పారదర్శకంగా లక్కీ డ్రా ప్రక్రియను నిర్వహించి, ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, రెసిడెన్షియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కలెక్టర్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ యంత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. త్వరలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యంత్రం ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయని, ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంఆర్ఐ యంత్రం అందుబాటులోకి రావడంతో జిల్లాలోనే అధునాతన వైద్యసేవలు ప్రజలకు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
గిరిజనగూడేల్లో సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంకేతిక యగంలోనూ ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్ ఆధారిత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అటవీ, గిరిజన గూడేలకు సోలార్ విద్యుత్ అందనుంది. రూ.17.03 కోట్లతో అమలు.. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్లో గిరిజన, గొత్తికోయ గూడాలున్నాయి. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్ విద్యుత్ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో రూ.17.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జీఓ ఆర్టీ నంబర్ 5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. సిద్ధమైన డీపీఆర్లు.. త్వరలో టెండర్లు, పనులు.. ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడాల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీగూడెంలో సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ నిల్వ కోసం బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కూడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్ సరఫరా అందించనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీరెడ్కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా విద్యుత్ అందుబాటులోకి రావడంతో గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్య, ఆరోగ్యం, సమాచార సదుపాయాల వినియోగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. గొత్తికోయగూడేలకు మహర్దశ 85 నివాస ప్రాంతాలు, 2,020 ఇళ్లకు సౌకర్యం... రూ.17.03 కోట్లు విడుదల.. ‘టీజీ రెడ్కో’ సౌజన్యంతో ఏర్పాట్లు సర్వే, డీపీఆర్లు సిద్ధం చేసిన అధికారులు... టెండర్ల దశలో ‘సోలార్’పనులు దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు -
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
● డీఈఓ రాజేందర్ మహాముత్తారం: ప్రభుత్వ బడుల్లోనే అన్ని సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహాముత్తారం మండలకేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధన అందిస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాంబశివరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వర్ష బీభత్సం
● జిల్లాకేంద్రంలో 2 గంటల పాటు ఎడతెరపి లేని వాన ● ఈదురుగాలులతో కూలిన విద్యుత్ స్తంభాలుభూపాలపల్లి: వరుణ దేవుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయమంతా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలులతో సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, భారీ ఈదురుగాలులు రావడంతో పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ప్రాంతాల్లో రాత్రి వరకు మరమ్మతు పనులు చేపట్టారు. -
పదేళ్ల క్రితం పనులు ప్రారంభం
టేకుమట్ల: టేకుమట్ల–పెద్దపల్లి జిల్లా ఓడేడ్ ముత్తారం గ్రామాల మధ్య 2016 సంవత్సరంలో అంతర్ర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి రూ.48 కోట్ల నిధులతో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. 2021 వరకు పనులు సాగాయి. ఫిల్లర్లు వేసి గడర్లు పెట్టి మధ్యలోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. ఓడేడ్, గర్మిళ్లపల్లి గ్రామస్తులు మానేరు వాగులో తాత్కాలిక మట్టి రోడ్డును నిర్మించి రవాణా సాగిస్తున్నారు. వర్షాలు ప్రారంభమైతే తాత్కాలిక మట్టి రోడ్డు ధ్వంసం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. టేకుమట్ల నుంచి ఓడేడ్ మీదుగా పెద్దపల్లి, గోదావరిఖనికి ప్రయాణించేవారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మీదుగా ప్రయాణిస్తున్నారు. దానివల్ల సుమారు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం అదనంగా చేయాల్సి వస్తుంది. వర్షాకాలం అయిపోయిక గ్రామస్తులు మళ్లీ రోడ్డు ఏర్పాటుచేసుకుని ప్రతి సంవత్సరం రవాణా సాగిస్తున్నారు. ఈ వానాకాలంలోనూ ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు. -
వాగు దాటేదెలా?
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 202 ● వానొస్తే ప్రజలకు తిప్పలే.. ● మహాముత్తారంలో పరిస్థితి మరీ అధ్వానంభూపాలపల్లి అర్బన్: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వెరసి జిల్లాలో వంతెనల నిర్మాణాలు సంవత్సరాలుగా సా..గుతూనే ఉన్నాయి. నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజల రవాణా కష్టాలు ఈ వానాకాలంలోనూ మళ్లీ మొదటికొచ్చేలా ఉన్నాయి. వానాకాలం సీజన్ కావడం శుక్రవారం జిల్లాకేంద్రంలో భారీ వర్షం కురవడంతో మళ్లీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వాగులు దాటాల్సిందేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే జిల్లా ప్రజల్లో వణుకు మొదలవుతోంది. భారీ వర్షాలు కురిస్తే మహాముత్తారం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. నిలిచిపోయిన వంతెన నిర్మాణాలు పూర్తయితే భూపాలపల్లి, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మహాముత్తారం మండలాల్లో ప్రజలకు రవాణా కష్టాలు తప్పే అవకాశం ఉంది. లేదంటే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, గర్భిణులు, ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అసంపూర్తిగా వంతెనల నిర్మాణాలు ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం చిట్యాల: చిట్యాల–భూపాలపల్లి మండలాల మధ్య నైన్పాక శివారు మోరంచవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2022లో రూ.7కోట్ల నిధులతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనచ ఏశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టుపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. వర్షాలు కురిస్తే మోరంచ ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలుగనుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భూపాలపల్లి, మల్హర్, చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రజలకు సౌకర్యావంతంగా ఉంటుంది. -
త్వరలోనే ఎంఆర్ఐ స్కాన్ సేవలు
భూపాలపల్లి: జయశంకర్, ములుగు జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య రక్షణకు మరో ముందడుగు పడింది. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నెల రోజుల్లోగా ఈ సేవలను రోగులకు అందించేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు సేవలు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందించిన సుమారు రూ.10 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని జిల్లా ఆస్పత్రిలో విజయవంతంగా బిగించారు. వేలాది రూపాయల ఖరీదైన ఈ స్కాన్ సేవలు ఇకపై స్థానిక పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందనున్నాయి. ఈ స్కాన్ యంత్రం సేవలు అందుబాటులోకి వస్తే కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులకే కాకుండా పొరుగునే ఉన్న ములుగు జిల్లా ప్రజలకు కూడా ఎంతో లబ్ధి చేకూరనుంది. అంతేకాక సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పరిధిలోని మారుమూల గ్రామాల రోగులు సైతం ఇకపై కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పొందనున్నారు. గతంలో రహదారి ప్రమాదాలు, ఏదైనా అనారోగ్యానికి గురైతే వరంగల్, హైదరబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎంఆర్ఐ స్కాన్ యంత్రం ఇక్కడ అందుబాటులోకి వస్తే దూరభారం తగ్గడమే కాక సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. టెక్నీషియన్లకు పూర్తి కావస్తున్న శిక్షణ.. మిషన్ నిర్వహణ కోసం కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డీఎంఎఫ్టీ నిధుల నుంచి ఇద్దరు నిపుణులైన టెక్నీషియన్లను నియమించారు. ప్రస్తుతం వీరికి సంబంధిత కంపెనీ ఇంజనీర్ల ద్వారా యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్.. రానున్న 20 రోజుల్లోనే అన్ని పనులను పూర్తి చేసి ఈ యంత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. వారం రోజులకో మారు ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షలు నిర్వహించడంతో పాటు మిషన్ బిగింపు పనులను వేగిరం చేశారు. వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభం..? భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక ఎంఆర్ఐ యంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్ విధానంలో (ఆన్లైన్ ద్వారా) ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులను కూడా ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే భూపాలపల్లి వైద్య రంగంలో ఇదొక చరిత్రగా నిలువనుంది. నెల రోజుల్లోనే ప్రారంభానికి సిద్ధం.. రూ.10కోట్లతో అత్యాధునిక యంత్రం ఏర్పాటు భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రజలకూ వరం -
కేజీబీవీ పాఠశాల తనిఖీ
మల్హర్(కాటారం): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని శానిటేషన్, టాయిలెట్లు, స్టోర్రూం, తాగునీరు, గదుల్లోని వెంటిలేషన్, కార్యాలయ రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న 80 సీట్లకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని ప్రిన్స్పాల్కు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మార్క శ్రీధర్బాబు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నైరుతి ప్రాకారం నుంచి తొలగింపు ప్రక్రియ షురూ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నైరుతిలో ఉన్న విజయగణపతి ఆలయం నుంచి దక్షిణ గోపురం వరకు ఉన్న ప్రాకారం విగ్రహాలను తమిళ శిల్పి రవీంద్రన్ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ, గుమ్మడికాయలు కొట్టి తొలగింపును ప్రారంభించగా.. ప్రాకారంపై ఉన్న విగ్రహాలను తొలిగించారు. బుధవారం శృంగేరి పీఠం శిష్యులు విశేష పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులకు ప్రాణపత్రిష్ఠ చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలగింపును దేవాదాయశాఖ గురువారం నుంచి ప్రారంభించింది. పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది. వైన్షాపులో అగ్ని ప్రమాదం చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామంలో ఓ వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. రెండు షెటర్లలో మద్యం విక్రయాలు నిర్వహిస్తుండగా బుధవారం రాత్రి షాపులను మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం షెటర్ లోపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పొగలు, మంటలు వస్తున్నాయని ఇంటి యజమాని తెలుపడంతో హూటహూటిన నిర్వాహకులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపుచేశారు. దీంతో అప్పటికే రూమ్లో ఉన్న మద్యం సీసాలు పగిలిపోయాయి. సమయానికి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిదని గ్రామస్తులు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరువెంకటాపురం(కె): అక్రమ అరెస్టులతో ఆది వాసీల భూ ఉద్యమాన్ని ఆపలేరని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నర్సింహమూర్తి అన్నారు. ఏటూరునాగారంలోని భూ పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలకు అండగా వెళ్తున్న ఆది వాసీ నాయకులను పోలీసులు గురువారం హౌస్ అరెస్టు చేయటం సరికాదన్నారు. పలువురు ఇరువర్గాల మధ్య ఘర్షణ పేరుతో ప్రజలను తప్పదోవ పట్టించేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు గిరిజనుల గిరిజనేతరుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు. -
బోసిపోయిన కాళేశ్వరం
నిత్యం శివనామస్మరణ, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయం ప్రస్తుతం బోసిపోయింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కావడంతో భక్తుల సందడి తగ్గింది. నిన్నటి వరకు వేలాది మందితో కళకళలాడిన ఆలయ పరిసరాలు గురువారం నిర్మానుష్యంగా మారి నిశ్శబ్దాన్ని తలపించాయి. అడవిలోని ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి భక్తులకు దేవాదాయశాఖ దర్శనాలకు వీలు కల్పించింది. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాలనుంచి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – కాళేశ్వరం భక్తులు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారిన కాళేశ్వరాలయం జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయం ప్రస్తుతం జీర్ణోద్ధరణ, తొలగింపు కార్యక్రమాలతో దేవస్థానంలో పూజలు నిలిపివేశారు. భక్తుల దర్శనాల కోసం బాలాలయం ఏర్పాటుచేశారు. ఆదిముక్తీశ్వరాలయం బాలాలయానికి మార్చబడిందని బోర్డు ఏర్పాటు చేశారు. ఇది గమనించని భక్తులు బాలాలయం ఎక్కడ అంటూ స్థానికులను అడుగుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు దారి తెలియక తికమక పడుతున్నారు. రూట్మ్యాప్ లాంటి ప్లెక్సీబోర్డు, విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. బాలాలయంలో పూజలు, ప్రసాదాల కోసం బోర్డులు ఏర్పాటు కాలేదు. దుకాణదారులకు నీడ కరువు.. ప్రతీ ఏడాది సుమారు రూ.కోటి ఆదాయం వచ్చే దుకాణదారులకు నిలువ నీడ కరువైంది. బాలాలయం వద్ద ప్లాట్పారం ఏర్పాటు చేశారు. అక్కడే సామగ్రి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షానికి తడిసే అవకాశం ఉందని ఈఓను కలిస్తే.. మీరే రేకులు వేయించకోవాలని హితవు పలికినట్లు తెలిసింది. దీంతో దుకాణాల నిర్వహణకు నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. వారి పరిస్ధితిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. శని, కాలసర్ప పూజలు ఎక్కడ.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి నిత్యం మంగళవారం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకొని పూజలు చేయడంతో ఆలయానికి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పూజల నిర్వహణ ఎక్కడ చేస్తారని దేవాదాయశాఖ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో భక్తులు కలవరపడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటిస్తుండడంతో భక్తులకు పాలుపోవడం లేదు. బుధవారం బాలాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేశారు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు ఆయా బస్టాండ్ పాంతాలు, రద్దీ ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద భక్తులకు, ప్రజలకు తెలిసేలా ఆలయాన్ని మార్చబడిందని, పూజల వివరాలు సూచిక బోర్డులు పెట్టాలని భక్తజనం కోరుతున్నారు. బాలాలయం వద్ద దర్శనాలు సూచిక బోర్డులు లేక ఇబ్బందులు అయోమయంలో సుదూర ప్రాంత భక్తులు దుకాణదారులకు ప్లాట్ ఫారమే దిక్కు -
సన్నాలకే ప్రాధాన్యం
1,09,854 ఎకరాల్లో సాగు అంచనాభూపాపపల్లి రూరల్: కొన్ని రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. సన్న వడ్లను సాగు చేయాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. వానాకాలం సీజన్లో సన్నరకం వడ్ల సాగుకు అనుకూలం. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రెండేళ్లనుంచి సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు సన్న ధాన్యం సాగుకు మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉద్యానపంటలు కలిపి 2.24 లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగవుతాయని, అందులో వరి సన్నాలను పూర్తిస్థాయిలో 1,09,854 ఎకరాల్లో సాగుచేసే విధంగా అధికారులు అంచనా రూపొందించారు. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అంతకుముందు గతంలో సన్నాలు 30వేల ఎకరాలకు మించి సాగుచేసిన దాఖలాలు లేవు. సన్నాల సాగుకు, దొడ్డు రకం సాగుకు పంటకాలం స్వల్ప తేడా ఉండటంతో రైతులు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. దొడ్డు రకం కంటే దిగుబడి తక్కువ వచ్చినా బోనస్ ఇస్తుండటంతో కలిసిరానుంది. అవగాహన కార్యక్రమాలు.. ఈ ఏడాది ప్రతీ రైతు సన్నాలనే పండించాలని కోరుతూ.. ఇటీవల నిర్వహించిన 99 రోజుల ప్రగతి–ప్రణాళికలో భాగంగా రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సన్నాలపై అవగాహన కల్పించారు. అధికారులు సూచిస్తున్న సన్నాల రకాలు.. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు, శాస్త్రవేత్తలు రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో 8 రకాల సన్నాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు ఖరీప్ సాగుకు అంచనా మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు తెలుపుతున్నారు. పెద్ద వానలు కురిసిన తర్వాత నార్లు పోసుకోవాలని సూచిస్తున్నారు.విత్తనాలు పంటకాలం (రోజులు)బీపీటీ, 5204 సాంబమసూరి 140–150 ఆర్ఎన్ఆర్ 15048 120–125 కేఎన్ఎం 1638 120–125 జై శ్రీరాం 130–135 హెచ్ఎంటీసోనా 135–145 వరంగల్ 962 125–130 వరంగల్ 44 140–145 జగిత్యాల 1798 120–125 -
పర్యావరణ పరిరక్షణలో అటవీశాఖ కీలకం
భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం హైదరాబాద్లోని గుర్రంగూడలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీఎఫ్ భవనాన్ని ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, సీసీఎఫ్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ జిల్లాలో సీసీఎఫ్ నూతన భవనం ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ వన మహోత్సవ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సీసీఎఫ్ భవన నిర్మాణం జిల్లా అటవీ సంపద రక్షణకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
రూ.వంద కోట్లు దోచుకునేందుకు కుట్ర
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న ఎమ్మెల్యే ఆలయ పునర్నిర్మాణం పేరుతో వంద కోట్లు దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. గురువారం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక అధికారిని పంపించి తూతూమంత్రంగా మీటింగ్ పెట్టి సుమారుగా రూ.198 కోట్ల టెండర్ పిలిచారని, అంటే దాదాపు వంద కోట్ల మింగడానికే పునర్నిర్మాణం కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని సీఎం చెబుతున్నారని.. రూ. 198కోట్ల ఎలా తీసుకువస్తాడో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలన్నారు. ఆలయాన్ని కూలగొట్టే ముందు విధి విధానాలను చెప్పాలన్నారు. అంతకంటే ముందు భూపాలపల్లి కలెక్టర్ ఖాతాలో వంద కోట్లు జమ చేస్తేనే నమ్ముతామన్నారు. లేదంటే కూల్చివేతలను అడ్డుకుంటామని తెలిపారు. ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ ఆలయాలపై ఆధారపడి జీవించే బ్రాహ్మణ పురోహితులు అడ్డుకోవడానికి ముందుకు వస్తారని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్పార్టీ నాయకులు ఉన్నారు. -
ప్రమాదమని తెలిసినా..
మహాముత్తారం మండలం మారుమూల ప్రాంతమైన కనుకునూర్ గ్రామానికి భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం మాత్రమే నడుపుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితిలో కొంతమంది మండలకేంద్రానికి రావాలంటే 15కిలోమీటర్లు కాలినడకన పెగడపల్లికి వస్తున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో మండలకేంద్రానికి చేరుకుంటున్నారు. గురువారం కాటారం మండలకేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిన గ్రామస్తులు తిరుగు ప్రయాణంలో బస్సు లేకపోవడంతో ఓ ప్రైవేట్ వాహనంలో పైన వెనుక బాగంలో నిల్చొని ప్రయాణం చేశారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. – మహాముత్తారం -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
చిట్యాల: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరా లకు చేరుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చల్లగరిగ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులు, మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా విద్యార్థులు పాఠశాలకు రావాలని చెప్పారు. విద్యతో పాటు క్రీడలలో రాణించి అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. విద్యార్థులలో పఠనాశక్తి పెంపొందించేందుకు లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, తహసీల్దార్ వ సంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, ఎంఈఓ కొడెపాక రఘుపతి, సర్పంచ్ జంపయ్య పాల్గొన్నారు.విద్యార్థులతో మాట్లాడుతున్న రాహుల్ శర్మ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్ కలెక్టర్ రాహుల్ శర్మ -
జాడలేని చినుకు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్, కన్నాయుగూడెంలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలలో లోటు, వెంకటాపురం(కె)లో భారీలోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లా కురవాల్సింది కురిసింది లోటు (శాతం) హనుమకొండ 77.1 15.6 80.0 వరంగల్ 81.0 35.9 56.0 ములుగు 94.7 62.1 34.0 మహబూబాబాద్ 79.6 31.6 60.0 జయశంకర్ భూపాలపల్లి 84.3 40.7 52.0 జనగామ 70.7 32.8 54.0 -
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మహాముత్తారం: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు డీలర్లు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు అన్నారు. బుధవారం బోర్లగూడెం రైతువేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఫర్టిలైజర్ షాప్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహదేవపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనూష, వ్యవసాయ విస్తరణ అధికారులు శివకృష్ణ, శశివర్దన్ పాల్గొన్నారు. ఎరువుల దుకాణం తనిఖీ.. మండలంలో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం బోర్లగూడెం గ్రామంలోని మూక్లోత్ మేగ్య సమ్మయ్య ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీపాల్ తనిఖీ చేశారు. లైసెన్స్, ఈ పాస్ బిల్బుక్స్, స్టాక్రిజిస్టర్, ఇన్వాయిస్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు యూరియూ క్రయవిక్రయాలు జరుపరాదని ఆదేశాలిచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి బాబురావు -
బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దు
భూపాలపల్లి అర్బన్: బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని సీసీఎస్ సీఐ రమేష్ సూచించారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ పోలీసులు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్టీయూ) అధికారులు, ఇతర శాఖల సిబ్బంది సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, మెకానిక్ షాపులు, స్క్రాప్ దుకాణాలు, బేకరీలు, ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. బాల కార్మికులను నియమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికుల సమాచారం తెలిసిన వారు వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు. -
రేపు సమావేశం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ఈ నెల 19న నిర్వహించనున్న ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏరియా సింగరేణి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాద నివారణ చర్యలు, కార్మికులకు అందిస్తున్న భద్రతా పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు, అత్యవసర స్పందన వ్యవస్థలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యసాధనకు అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, వివిధ గనులు, విభాగాల అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కై లాపూర్ పాఠశాల పునఃప్రారంభం చిట్యాల: మండలంలోని కై లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థు కొరతతో గతేడాది మూతబడింది. గ్రామస్తుల చొరవతో బుధవారం పునఃప్రారంభమైంది. గ్రామంలో పాఠశాల మూతపడడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గమనించిన గ్రామస్తులు తిరిగి పాఠశాల తెరుచుకునే విధంగా సర్పంచ్ కొడారి ఓదేలు, ఉపాధ్యాయుడు దశరథం, గ్రామస్తులు పలు చర్యలు చేపట్టారు. దీంతో పాఠశాలకు 20 మంది విద్యార్థులు హాజరైనట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్ పల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ డిమాండ్ చేశారు. బుధవారం డీఈఓ రాజేందర్కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, టీచర్ క్వాలిఫికేషన్ నోటీస్ బోర్డు లో పెట్టాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్, టై బెల్టు అమ్మకాలు చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్న పాఠశాలలను వెంటనే సీజ్చేయాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత టేకుమట్ల: సుబ్బక్కపల్లి చలివాగు నుంచి మంగళవారం రాత్రి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్లు రాసమల్ల మల్లయ్య, సుంకరి రాజు, ఆనందపు రాజేందర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
రేగొండ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రూపకల్పన పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని ఆర్టీఓ హరికృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఓల సూపర్వైజర్లకు ఓటరు జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితాను ఇంటింటి సర్వే చేసి పకడ్బందీగా రూపొందించాలని తెలిపారు. జాబితా సవరణలో నిర్లక్ష్యం చేసిన బీఎల్ఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల తహసీల్దార్లు శ్వేత, హేమ, డిప్యూటీ తహసీల్దార్లు అబ్దుల్ రజాక్, శ్రీలత, ఆర్ఐలు పాల్గొన్నారు. ఆర్డీఓ హరికృష్ణ -
ఫీజుల మోత..
భూపాలపల్లి అర్బన్: వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాఠశాలల్లో నిబంధనలు పాటించకుండా, బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను చేరవేయటంతో పాటు కొన్ని యజమాన్యాలు ఆ బస్సుల ఫిట్నెస్ను, సంరక్షకుల నియామకాన్ని పట్టించుకోవటంలేదు. వారు చెప్పిన చోటే నోట్ పుస్తకాలు, యూనిఫాంలు బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. అర్హత లేనివారితో విద్యాబోధన చేయిస్తున్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా కనీసం ప్రయోగశాల, గ్రంఽథాలయం, ఆటస్థలాలు లేని పాఠశాలలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. 75 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లాలో 75 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రాథమిక, హైస్కూల్ స్థాయిల్లో నడుస్తున్నాయి. సుమారు 15వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థులకు ఫీజు సగటున రూ.25వేలు, పదోతరగతి విద్యార్థులకు రూ.50 వేలు తీసుకుంటున్నారు. వీటితో పాటు పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులను కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలనే నిబంధనలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో అవే పుస్తకాలు రూ.10 నుంచి 15శాతం తగ్గింపు ధరతో దొరుకుతున్నాయి. ఈ అమ్మకాల విషయంలో కూడా పాఠశాల యాజమాన్యాలు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయి. పుస్తకాలు, నోటు బుక్కులతో పాటు పెన్ను నుంచి పెన్సిల్ వరకు బ్యాడ్జి నుంచి స్కూల్ డ్రెస్సు, షూస్ కూడా పాఠశాలలోనే కొనుగోలు చేయాలి. వీటన్నింటితోపాటు పాఠశాల గుర్తింపు కార్డుకు ప్రత్యేక రుసుంతో అమ్మకాలు సాగిస్తున్నారు. పుస్తకాలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.3వేల నుంచి 8వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల్లో వసతులకు సరిపడా తరగతి గదులు ఉండాలి భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉండాలి విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు బోధన చేయాలి. తరగతి గదుల్లో అవసరమైనంత వెలుతురు ఉండాలి. పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యం కల్పించాలి. పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీసు బోర్డుపై అతికించటం, ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయటం, ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ కోసం అనుమతి తీసుకోవటం, ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తీసుకోవటం, తదితర వసతులు ఉండాలి. ప్రైవేట్ పాఠశాలల్లో వసూళ్లు భయపెడుతున్న ఫీజులు, సామగ్రి ఖర్చు పుస్తకాలు, యూనిఫాం విక్రయాలకు సొంత కౌంటర్లు -
అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం
అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు.. సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు హనుమకొండమహబూబాబాద్ములుగువరంగల్భూపాలపల్లిజనగామభౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం భూపాలపల్లి: నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎరువులు, విత్తనాల విక్రయాలు, మ్యాపింగ్, రైతు రిజిస్ట్రీ తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 38 రైతు వేదికల ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు 15 రైతు వేదికల మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన 23 రైతు వేదికల మ్యాపింగ్ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విక్రయాలు ప్రారంభించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే షాపుల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. విక్రయ కేంద్రాల వద్ద పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, ప్రతి విక్రయ కేంద్రంలో మండల స్థాయి అధికారి మరియు పోలీసు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో ప్రస్తుత నమోదు కేవలం 66.77 శాతం మాత్రమే కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన శాతాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఏఓ బాబురావు, సహకార శాఖ అధికారి వాలియా నాయక్, ఏడీఏలు రమేష్, శ్రీపాల్, ఏఓలు పాల్గొన్నారు. టీం వర్క్తో జిల్లా ప్రగతి పథం.. ఒక టీమ్ వర్క్గా పనిచేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి జూన్ 16వ తేదీతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, డీపీఆర్ఓ శీలం శ్రీనివాస్, ఏఓ శ్రీనివాసులు, డీటీ షఫీ సర్కార్, జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్ రాహుల్ శర్మకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
సాగుకు సమాయత్తం
భూపాలపల్లి రూరల్: జిల్లా రైతులు వానాకాలం సాగు పనుల్లో బిజీబిజీగా మారిపోయారు. జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి సాగువైపు రైతులు ముందస్తుగానే అడుగులు వేస్తున్నారు. పత్తి సాగుచేసే రైతులు ఇప్పటికే పొలాల్లోని పాత పత్తి కట్టెలను పీకి, కాల్చివేసి భూమిని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వర్షాలు పడిన ప్రాంతాల్లోని నల్లరేగడి భూముల్లో పత్తి విత్తనాలు కూడా వేస్తున్నారు. 1,06,560 ఎకరాల్లో పత్తి సాగు అంచనా.. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1,06,560ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ విస్తీర్ణానికి గాను దాదాపు 2.80 లక్షల పత్తివిత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు లెక్కగట్టారు. రైతులకు కొరత లేకుండా జిల్లాలోని విత్తన దుకాణాల వ్యాపారులు ముందస్తుగానే హైబ్రీడ్ పత్తి విత్తనాల ను సిద్ధం చేసి ఉంచారు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులు కురవడంతో తడిని ఉపయోగించుకుని కల్టివేటర్లతో భూమిని మెత్తగా దు న్నుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్, గుర్రంపేట, టేకుమట్ల, చిట్యాల, రేగొండ మండలాల్లోని మెజారిటీ గ్రామా ల రైతులు వేసవి దుక్కులను దున్నుకుని విత్తనాలు వేసేందుకు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి తర్వాతే వరి వైపు చూపు రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మట్టి పదునయ్యే వర్షాలు పడగానే పత్తి విత్తనాలు విత్తేందుకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జూన్ చివరి నాటికి పత్తి విత్తుకునే పనులను పూర్తిగా ముగించుకోవాలని రైతులు భావిస్తున్నారు. ఆ తర్వాతే వరి సాగువైపు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి నారుమళ్ల కోసం భూములను సిద్ధం చేసుకోగా, కొన్నిచోట్ల వరినార్లు కూడా పోసి వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అనుకూలమైన వర్షాలు పడితే ఈ ఏడాది వానాకాలం సీజన్ జిల్లాలో లాభసాటిగా సాగుతుందని రైతాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రామాల్లో సాగుపనులు మహాముత్తారం: నాలుగు రోజుల క్రితం మహాముత్తారం మండలంలో ఓ మోస్తారు వర్షం పడింది. దీంతో మండలంలోని కనుకునూర్, బోర్లగూడెం, యామన్పల్లి, నల్లగుంటమీనాజీపేట, మహాముత్తారం తదితర గ్రామాల్లోని రైతులు సాగుపనుల్లో మునిగిపోయారు. బుధవారం వివిధ గ్రామాల్లో రైతులు చేలల్లో అచ్చుకొట్టడంతో పాటు పత్తి విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు దున్నుకునే పనిలో రైతులు నిమగ్నం వర్షాలు కురిస్తే విత్తుకునేందుకు సన్నద్ధం ఎరువులు, విత్తనాలు కొనుగోలు -
పల్స్పోలియోను విజయవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: జిల్లాలో పల్స్ పోలియో, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలను అన్ని శాఖల అధి కారుల సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. సోమవా రం సోమవారం పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నిర్మూలన, డయేరియా నివారణ, పొగాకు వినియోగం మానేయడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించడం తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టబోయే ప్రతిష్టాత్మక ఆరోగ్య కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 28న పల్స్పోలియో నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 34,728 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. అలాగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జూలై 13 సందర్భంగా 1–19 సంవత్సరాలు వయస్సు ఉన్న 70,773 మందిని గుర్తించి నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డీఓ హరికృష్ణ, డీపీఓ శ్రీలత, ఇంటర్ మీడియట్ అధికారి వెంకన్న, మున్సిపల్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 66 దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజలు అందించిన దరఖాస్తులు జాప్యం చేయకుండా స త్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిన ప్రతీ దరఖాస్తును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పరిష్కారంలో ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.కన్నయ్యలాల్ సూచించారు. సోమవారం న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుళ్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. సివిల్ కేసుల్లో రాజీ కుదిరిన వారికి చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి అందజేయబడుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
బాలాలయం ముస్తాబు!
● శ్రీ ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాట్లు ముమ్మరం ● రేపు పునరుద్ధరణ, తొలగింపు ప్రక్రియ షురూకాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేఽశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈనెల (రేపు) 17న బుధవారం ఉదయం 8.15 గంటలకు కళాప్రకర్షణ క్రతువుతో శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంచే విశేష పూజలతో ఆరంభం కానుంది. రూ.198కోట్ల వ్యయంతో ఆలయ పునరుద్ధరణ, ఆలయాల తొలిగింపు కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుత దేవస్థానానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద అభిషేక పూజలు నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న షెడ్డులో బాలాలయాలు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అందులోనే ఉత్సవ మూర్తులు శ్రీశుభానందముక్తీఽశ్వరులు, సరస్వతీ అమ్మవార్లను ఆసీనులు చేసి భక్తుల దర్శనాలు చేయడానికి వీలు కల్పించనున్నారు. దుకాణాలు నిర్వహించడానికి ప్లాట్ఫారం సిద్ధం చేశారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రెండు కంటెయినర్లలో కార్యాలయం, టికెట్ విక్రయాలు, ప్రసాద విక్రయాలు జరపనున్నారని తెలిసింది. ఇంకా కాలసర్ప, శని పూజలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిసింది. మంగళవారం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు స్థానికుల అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం. 17న జరుగనున్న పూజా క్రతువు విషయంలో దేవాదాయశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. భక్తులు, స్థానికులు ఆ శాఖ ప్రకటన కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. -
తెరుచుకున్న మూత బడి
రేగొండ: ఒకప్పుడు వి ద్యార్థులతో కళకళలాడిన పాఠశాల విద్యార్థుల కొరతతో మూతపడింది. రెండేళ్ల తర్వాత పాలకవర్గం, గ్రామస్తుల చొరవతో మళ్లీ తెరుచుకుంది. కొత్తపల్లిగోరి మండలంలోని రామగుండాలపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 14 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా విద్యాఽశాఖాధికారి రాజేందర్, సర్పంచ్ ఏడెల్లి మోహన్రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. అనంతరం దాతలు అందజేసిన బ్యాగులు, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. -
తొలిరోజు అంతంతే!
● జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం ● 16వేలకు 1,845 మంది హాజరు ● చిట్యాలలో ఒకేఒక్క విద్యార్థిని.. భూపాలపల్లి అర్బన్: ఎండల తీవ్రత, సుధీర్ఘ వేసవి సెలవులు అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను ముస్తాబు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగ తం పలికారు. జిల్లాలో మొత్తం 16వేల మందికి మొదటిరోజు 1,845 మంది (12శాతం) విద్యార్థులు హాజరయ్యారు. పలు పాఠశాలలను డీఈఓ రాజేందర్, ఎంఈ ఓలు సందర్శించి పాఠ్య, నోట్ పుస్తకాలు అందించా రు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండుగ వాతావరణంలో పాఠశాలను పునఃప్రారంభించారు. అమావాస్య ఎఫెక్ట్..పండుగ వాతావరణంలో.. -
అమ్మ పేరుతో మొక్క నాటండి
● డీఈఓ రాజేందర్ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ (ఎన్జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఏక్ పెడ్ మా కే నామ్’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యతాభావం పెంపొందుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్రెడ్డి, సీఎంఓ రమేష్, ప్లానింగ్ ఆఫీసర్ రాజగోపాల్, ఏఎస్ఓ రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, ప్రశాంత్లు పాల్గొన్నారు. -
స్వల్పకాలికమే ముద్దు!
భూపాలపల్లి రూరల్: వాతావరణంలో మార్పుల కారణంగా స్వల్ప కాలిక పంటలను సాగు చేయాలని, తొందరపడి పంటలు సాగు చేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. రైతులు పప్పులు, మినుములు, పెసర తదితర పంటలతో పాటు వరిలో స్వల్పకాలిక పంటలను సాగుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలోని రైతులు డీఏఓకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రశ్న: వరిలో ఏ రకాల వంగడాలు వేస్తే బాగుంటుంది. – మార్క అజయ్, కొత్తపల్లి, (ఎస్ఎం) భూపాలపల్లి జవాబు: ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సంవృద్ధిగా పడే అవకాశం లేదని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. రైతులు వీలైతే పప్పులు, చిరు ధాన్యాలు, 120 నుంచి 125 రోజుల్లో కోతకు వచ్చే 1618, జీఎల్, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా, కేఎన్ఎం జగిత్యాల లాంటి స్వల్ప కాలిక పంటలను సాగు చేయాలి. ప్ర: ప్రస్తుత పరిస్థితులకు ఏఏ పంటలు సాగు చేయాలి? – కుమారస్వామి, గణపురం జ: పంటల మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పటికీ ఒకే రకమైన పంటలు సాగు చేస్తే భూమిలో సారం పెరగదు. ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉంది. ఉలువలు, కందులు, పెసర, మినుములు, బొబ్బెర్లు లాంటి పంటలు సాగు చేస్తే దిగుబడితో పాటు భూమి సారవంతమవుతోంది. ప్ర: పత్తిలో ఎలాంటి విత్తనాలు వేస్తే బాగుంటుంది. ఎప్పుడు విత్తాలి? –బొబ్బిల్ల రాజు, తాడిచెర్ల జ: గత అనుభవాలను బట్టి మార్కెట్లో ఉన్న నాణ్యమైన పత్తి విత్తనాలను ఎంచుకోవాలి. సరైన వర్షాలు కురువలేదు.. కాబట్టి పత్తి విత్తనాలు ఇప్పుడే విత్తవద్దు. మట్టి 70 నుంచి 80 శాతం తడిచిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. లేదంటే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్ర: జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉంచాలి. – నూకల ప్రకాశ్రెడ్డి, మోరంచపల్లి భూపాలపల్లి, జ: గతంలో భూపాలపల్లి, గణపురం మండలాల నుంచి ఎరువులు తీసుకునే విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడు యాప్లో నమోదు చేసుకుంటే భూపాలపల్లి ఒక్కటే వస్తుంది. మోరంచపల్లి రైతులకు భూపాలపల్లి దూరం అవుతుందని ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారులతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఆగ్రో గ్రోమోర్లో కూడా అందుబాటులో ఉండేవిధంగా చూస్తాం. ప్ర: సన్నాలు అన్నింటికీ బోనస్ వర్తిస్తుందా? – తిప్పారపు సురేందర్, మొగుళ్లపల్లి జ: సన్నాలకు ప్రభుత్వం అందించే బోనస్ వర్తిస్తుంది. ఈఏడాది 120 నుంచి 125 రోజుల్లో చేతికి వచ్చే విత్తనాలను సాగు చేసుకోవాలి. నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. రైతులకు ఉపయోగంగా ఉంటుంది. లేదంటే పంటమార్పిడి చేసి చిరు ధాన్యాలను పండించండి. ప్ర: నకిలీ విత్తనాలను అరికట్టాలి. – బుర్ర వెంకటేశ్గౌడ్, చిట్యాల జ: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, వివిధ శాఖల ఆధ్వర్యలో టాస్క్పోర్స్ టీం ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటాం. అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్ర: గతేడాది ఎరువులకు ఇబ్చందులు పడ్డాం. – గుర్రం రాజయ్య, చిట్యాల జ: ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. గతేడాది అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల సాగు మేరకు ఎరువులు మీ మండల పరిధిలో అందుబాటులో ఉంటాయి. ఇబ్బందులు రాకుండా చూస్తాం. ప్ర: వర్షాలు తక్కువ అంటున్నారు. పత్తి, వరి ఏఏ రకాలు ఎంచుకోవాలి. – ర్యాగం రవి, చిట్యాల జ: సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. అందుకే ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు. పత్తి, బోదెల పద్ధతి సాంద్రత విధానంలో సాగు చేస్తే మంచిది. వరిలో స్వల్పకాలిక రకాలను వెదజల్లే పద్ధతిలో జూలై 15వ తేదీ వరకు సాగు చేసుకోవచ్చు. తొందరపడి పంటలు సాగు చేయొద్దు ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం లైసెన్స్డ్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి రైతులకు జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచనలు ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూన్య స్పందన -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జాలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయమే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను కలిసిన ఎస్ఈ రమేశ్ భూపాలపల్లి రూరల్: పదోన్నతిపై జిల్లాకు వచ్చిన భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేశ్ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. నిజా మాబాద్ డివిజనల్ ఇంజనీర్, (టెక్నికల్)గా ఉన్న రమేశ్ పదోన్నతిపై ఎస్ఈగా భూపాలపల్లికి వచ్చారు. ఎస్ఈ వెంట భూపాలపల్లి డివిజ నల్ ఇంజనీర్ పాపిరెడ్డి ఉన్నారు. బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి వెంకన్న ఆదేశించారు. ఈ మేరకు పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఫిట్నెస్ చేయని బస్సులకు జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో నిబంధనలు పాటించాలని, వేగంగా వెళ్లకుండా నియంత్రణతో నడపాలని డ్రైవర్లకు సూచించారు. లైసెన్స్ కలిగిన డ్రైవర్లు మాత్రమే బస్సులను నడపాలని ఆదేశించారు. భద్రకాళి దేవాలయంలో ప్రతిష్ఠాపనోత్సవ పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కేయూ ఫిజిక్స్ విభాగం బీఓఎస్గా నరేందర్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం బోర్డు ఆఫ్స్డడీస్ చైర్మన్గా ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్కు వీసీ కె.ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు అందించారు. -
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం
విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. చిన్నబోయినపల్లి పాఠశాల 1–8 వరకు ఉందని, దానిని 10 వరకు పెంచితే డ్రాపౌట్స్ లేకుండా నివారించవచ్చు. ఆశయం గ్రంథాలయం పేరుతో అక్కడ 2 వేల పుస్తకాలను యూపీఎస్సీ, గ్రూప్స్, డీఎస్సీ, ఎస్సై, పీసీలకు కావాల్సిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాం. దాంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. పాఠశాలను మ రింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. –దూపాటి సతీశ్, ఆశయ గ్రంథాలయ నిర్వాహకుడు, కానిస్టేబుల్, చిన్నబోయినపల్లి -
బడికి రెడీ
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026● నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● ఇంకా సిద్ధం కాని వెల్కమ్ కిట్లు ● పూర్తికాని పాఠశాలల అభివృద్ధి పనులుజిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 281 4370భూపాలపల్లి అర్బన్: వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాల్సిన సమయంలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన పాఠశాల వెల్కమ్ కిట్లు ఇంకా జిల్లాకు చేరకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల కొరత వెంటాడుతోంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రీపైమరీ విద్య జిల్లాలో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ టీచర్లు, ఆయాల నియామకం చేపట్టలేదు. నూతనంగా మరో 41 పాఠశాల్లో ప్రీప్రైమరీ ప్రారంభించేందుకు టీచర్ల, ఆయాలను నియమించాల్సి ఉండగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీంతో చిన్నారుల బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూత పడుతున్న ప్రాథమిక పాఠశాలలు జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం వరకు జిల్లా వ్యాప్తంగా 317 ప్రాథమిక, 44 ప్రాథమికోన్నత, 69 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గడిచిన 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కొన్ని, విద్యార్థులు లేరని మరికొన్ని మొత్తంగా 36 ప్రాథమిక పాఠశాలను అధికారులు మూసి ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై ఇతర పాఠశాలలకు పంపించారు. ఈ విద్యా సంవత్సరం మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారో లేదో అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యి నుంచి రెండు వేల వరకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని అభివృద్ధి పనులు జిల్లాలోని 265 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదు. 947 రకాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ముందే రూ.12.41 కోట్ల నిధులు కేటాయించింది. 683 పనులు పూర్తి చేశారు. 72 రకాల పనులు నేటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇంకా 192 పనులు కొనసాగుతున్నాయి. తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాల, విద్యుత్ కల్పన వంటి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలల్లో నిర్మాణ సామగ్రి ఇంకా ప్రాంగణంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 32కోట్లతో చేపట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమం కింద 149 పాఠశాలల్లో ప్రారంభించిన పనులు కూడా అనేక చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి. తరగతి గదుల అభివృద్ధి, ప్రహరీ, విద్యుత్ సదుపాయాల పనులకు నిధుల కొరతతో పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో వసతులు అందడం లేదు. ప్రణాళిక లేకపోవడంతో.. పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలంటే పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి, వెల్కమ్ కిట్లను పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలోనూ సమస్యలు విద్యార్థులకు తోడుగా బడికి వస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలుఅభివృద్ధి పనులు మంజూరైన పాఠశాలలు 265 ఎంపిక చేసిన పనులు 947 మంజూరైన నిధులు రూ.12.41కోట్లు పూర్తి చేసిన పనులు 683 పనులు కొనసాగుతున్నవి 192 ఇంకా ప్రారంభంకాని పనులు 72ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో.. మా తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. నేను మెదక్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్కు వెళ్లి యూనివర్సిటీలో చదువుకున్నాను. మేం చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం ప్రోత్సహించే వాళ్లు. అప్పట్లో పాఠశాలల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్య ప్రాధాన్యతను వివరించేవాళ్లు. ఇబ్బందులు ఎదురైతే ఉపాధ్యాయులు ప్రోత్సహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. – అశోక్కుమార్, అదనపు కలెక్టర్ -
రక్తదానం మరొకరికి ప్రాణదానం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి అర్బన్: రక్తదానంతో మరొకరికి ప్రాణదానం కలుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఐటీ మాస్టర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్తం ప్రాణాధారంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో ఎలాంటి హాని ఉండదని, నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినవారిగా నిలుస్తారని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ కార్యాలయం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వేముల శంకర్తో పాటు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్ సభ్యులు, యువకులు, రక్తదాతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 330 యూనిట్ల రక్తం సేకరణ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 330 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సేకరించిన రక్తాన్ని ఎంజీఎం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన కొలుగూరి సంజీవరావు 67వ సారి ఈ శిబిరంలో రక్తదానం చేశారు. -
వెదజల్లుతున్న దుర్వాసన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ప్రసాదశాల నుంచి వచ్చే డ్రెయినేజీ పైప్లైన్ జామ్ కావడంతో మురుగు నీరు బయటకు పొంగిపొర్లి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగిన సరస్వతినది అంత్య పుష్కరాల అనంతరం ఈ సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. పుష్కరాలు ముగిసి 14 రోజులుగా మురుగు నీరు బయటకు రోడ్డుమీద పారుతూ దుర్గంధం వెదజల్లుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానికులకు, సమీపంలోని ఇళ్లకు తీవ్ర దుర్వాసనతో ముక్కుపుటాలు అదిలిపోతున్నట్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు స్థానికులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి?
ఏటూరునాగారం: ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్గా టీవీఆర్ దామోదరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈయన గతంలో స్థానిక ఐటీడీఏలో పనిచేస్తూ ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న దామోదరస్వామికి ఉద్యోగోన్నతి రావడంతో ఏటూరునాగారంలో ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో మరో రెండు రోజుల్లో ఏటూరునాగారం ఏపీఓగా ఆయన బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రవి ములుగు రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన తోకల రవిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2004 నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. -
‘ప్రైవేట్’కు పంపొద్దని తీర్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో చిన్నబోయినపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారుల కుటుంబాలు ఉంటాయి. వారి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం, ఇతర ప్రైవేట్ పాఠశాలలకు పంపేవారు. అయితే ప్రభుత్వ బడి ఉన్న తర్వాత ప్రైవేట్ పాఠశాలల కు ఎందుకు పంపాలని గ్రామ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున, హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్థానిక గ్రామస్తులు దూపటి సతీశ్లు కలిసి గ్రామాన్ని ఏకం చేశారు. ఇక నుంచి గ్రామంలోని చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దని గ్రామసభలో ప్రజలంతా గతనెల 31న తీర్మానం చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ సైతం చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తీర్మానించారు. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, షాపెల్లి, హనుమాన్ నగర్ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి బడికి రావడం, తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వంటి ఏర్పాట్లు కూడా చేశారు. డీఎన్టీ పాఠశాలలో ఆదర్శ గ్రంథాలయాన్ని కానిస్టేబుల్ సతీశ్, మరికొంత మంది యువకులు కలిసి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ విషయం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుకు తెలిసి ఇటీవల సర్పంచ్ నాగార్జున, సతీశ్ను జిల్లా కేంద్రంలో సైతం సన్మానించారు. ఆ గ్రంథాలయం ఏర్పాటు విషయాన్ని కలెక్టర్కు వివరించగా ఆసక్తికనబర్చిన వెంటనే చిన్నబోయినపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో ఉన్న 2 వేల పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వెంటనే జిల్లాలోని ఎంఈఓలు సైతం ఇలాంటి ఆదర్శ గ్రంథాలయాలను ప్రతీ పాఠశాలలో ఏర్పాటు చేయాలని అక్కడి నుంచే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా పాఠశాల హెచ్ఎం కవితతో పాటు మరో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ పాఠశాలకు కేటాయించడం విశేషం. ఒకే రోజు 138 మందికి అడ్మిషన్లు చిన్నబోయినపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్కు వేరే గ్రామాలకు వెళ్లకుండా కలెక్టర్, ప్రభుత్వంతో మాట్లాడి అదే గ్రామంలోనే ప్రీప్రైమరీ స్కూల్ను గ్రామస్తులు మంజూరు చేయించుకున్నారు. ఈ క్రమంలో 138 మంది విద్యార్థులు మే 31న ఒకే రోజు పాఠశాలలో నూతనంగా అడ్మిషన్లను పొందారు. ఇలా వారం తరబడి అడ్మిషన్ల కోసం తిరిగిన ఉపాధ్యాయులకు సాధ్యం కానిది.. ఒకే రోజు గ్రామస్తులంతా కలిసి చేశారు. ఒకేరోజు 138 మంది డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలలో ఆడ్మిషన్లు పొందడంతో రాష్ట్రంలో మొదటి సారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఆ విద్యార్థులకు స్థానిక సర్పంచ్ నాగార్జున సొంత ఖర్చుతో బ్యాగులు, స్టడీ మెటీరియల్ను అందజేశారు. గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలకే పెద్దపీట రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన చిన్నబోయిపల్లి పాఠశాల జిల్లా వ్యాప్తంగా ఆదర్శ గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ సూచనలు ఒకే రోజు 138 అడ్మిషన్లు -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
● గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి ● బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావుహన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు. నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులను బడిలో చేర్పించడమే లక్ష్యం
గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాం. ప్రతీ విద్యార్థి చిన్నబోయినపల్లి డీఎన్టీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. ఇందుకు కలెక్టర్ ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ట్రావెలింగ్ అలవెన్సులు రానున్నాయి. సర్కారు బడిని మరింత బలోపేతం చేస్తాం. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని మంత్రి సీతక్క, కలెక్టర్ సహదేవరావుకు విన్నవించాం. వారు కూడా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామన్నారు. – నల్లబోయిన నాగార్జున, చిన్నబోయినపల్లి సర్పంచ్ -
కనుకునూర్లో భారీ వర్షం
మహాముత్తారం: మండలంలోని రెడ్డిపల్లి కనుకునూర్లో ఆదివారం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రెడ్డిపల్లి కనుకునూర్ మధ్య కరెంటు వైర్లపై పెద్ద వృక్షం పడింది. రెండు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెడ్డిపల్లి గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది చెట్టును తొలిగించారు. కంకరవేశారు.. బీటీ మరిచారు మహాముత్తారం: మండలంలోని పర్లపల్లి నుంచి లింగాపూర్ వెళ్లే రోడ్డు సుమారు కిలో మీటరు వరకు ఎనిమిది సంవత్సరాల క్రితం అధికారులు కంకరపోసి వదిలేశారు. అప్పటినుంచి పర్లపల్లి గ్రామస్తులు రోడ్డుగుండా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర తేలి భారీగుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని లాడ్జిల్లో సీసీఎస్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అతిథుల రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు, బస చేస్తున్న వ్యక్తుల వివరాలను సీసీఎస్ సీఐ రమేష్ పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి అతిథి ఆధార్ వివరాలు, రాకపోకల సమయాలు, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అవగాహన కల్పించినా కాల్చేస్తున్నారు మహాముత్తారం: రైతులు పంటలు పండించిన అనంతరం వాటిని పొలంలో కలియ దున్నాలి కానీ కాల్చవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. కానీ మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతులు వరికొయ్యలను కాల్చుతూ సారవంతమైన భూమిలోని క్రిమి కీటకాలను చంపేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వరికొయ్యలను కాల్వడం వలన భూమిలోని క్రిమి కీటకాలు చనిపోవడమే కాకుండా భూమిపొర వేడికి సారవంతాన్ని కోల్పోయి పంటదిగుబడి తగ్గుతుందని ఎవరైనా రైతులు కొయ్యకాళ్లను కాలబెడితే నష్టాన్ని బట్టి 5వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు రైతులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ గ్రామాల్లోని రైతులు మాత్రం కొయ్యకాళ్లను తగలబెడుతున్నారు. ఎంజీఎంలో డిప్యుటేషన్పై నర్సింగ్ సిబ్బంది కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలో 478 మంది నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు 161 మంది ఇన్పేషంట్లకు సేవలందించడం సమస్యగా మారింది. రెండు వార్డులకు కలిపి ఒక నర్సింగ్ ఆఫీసర్తో సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈక్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని నర్సింగ్ ఆఫీసర్లను డిప్యుటేషన్పై ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. అలాగే, నర్సింగ్ స్కూల్కు చెందిన వందలాది మంది విద్యార్థినులను కూడా నర్సింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్లుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల సమస్య తీరాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొత్తవారు జాయిన్ అయితేనే నర్సింగ్ సేవలు సజావుగా అందుతాయి. ఇప్పటికే ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టు భర్తీ కాకపోవడం, నర్సింగ్ సిబ్బంది జాయిన్ కాకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. -
శనిత్రయోదశి.. భక్తులు కిక్కిరిసి
కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. దీంతో నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలు 435, కాలసర్పదోష పూజలు 175, స్వామివారి గర్భగుడిలో అభిషేకాలు 126, ఇతర పూజలు, ప్రసాదాలపై రూ. 4,59,200 ఆదాయం సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి. దీంతో గోదావరి తీరం, ఆలయంలో భక్తులు కిక్కిరిశారు. -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
తెరుచుకున్న మూత‘బడి’
● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం ● పది మంది విద్యార్థుల చేరిక ఎస్ఎస్తాడ్వాయి: ఒకప్పుడు విద్యార్థుల సందడితో కళకళలాడిన పాఠశాల.. విద్యార్థులు లేక మూతపడింది. పదేళ్ల తర్వాత తలుపులు తెరుచుకుంది. మండల పరిధిలోని కన్నెపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 10 మందిని ప్రభుత్వ పాఠశాలలో శనివారం చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, సర్పంచ్ కొమరం శైలజ, ఎంఈఓ గడ్డి శ్రీనివాసులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే సమాజ ప్రగతికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ను తమ సొంత ఖర్చులతో అందజేస్తామని కల్యాణి ప్రకటించారు. మంత్రి సీతక్క చొరవతో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సరితను కన్నెపల్లి పాఠశాలకు డిప్యూటేషన్పై నియమించినట్లు తెలిపారు. సర్పంచ్ శైలజ మాట్లాడుతూ పాఠశాలను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం విద్యాసాగర్, ఉప సర్పంచ్ రంజిత్, ఉపాధ్యాయురాలు సరిత పాల్గొన్నారు. పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థల పరిశీలన మంగపేట: మండల కేంద్రంలోని దొంగల ఒర్రె వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ నిర్మాణ ప్రదేశాన్ని ఆర్కిటెక్చర్ నవీన్ (డిజైనింగ్ ప్రైవేటు ఏజెన్సీ) బృందం శనివారం పరిశీలించింది. మండల కేంద్రంలోని పొదుమూరు వద్ద గోదావరి ఒడ్డున 2015లో నిర్మించిన పుష్కరఘాట్ గోదావరి వరదలకు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు మండలంలోని మంగపేట, చుంచుపల్లి రెండు ప్రాంతాల్లో పుష్కరఘాట్లను నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించింది. మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నిర్మాణంలో ఉన్న కరకట్ట వద్ద 62 మీటర్లతో పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. గతంలో నిర్మించిన పుష్కరఘాట్ 170 మీటర్లు ఉందని, ప్రస్తుత పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి కింద నుంచి ఒడ్డుపై వరకు 17 మీటర్ల ఎత్తు ఉండటంతో కనీసం 100 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని.. అందుకు మంజూరైన నిధులు సరిపోవని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. -
పోడు భూములకు పట్టాలివ్వాలి
● ఏఐకేఎంఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజువెంకటాపురం(ఎం): పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏఐకేఎంఎస్ డివిజన్ ప్రథమ మహాసభకు బొమ్మెడ సాంబయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో 40 సంవత్సరాలకు పైగా పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకోకుండా ఆపేసి సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని పెట్టిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పోడుభూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి, ములుగు డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు యాకూబ్రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరికీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ములుగు మండలంలోని కోయగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బోయిని రాజయ్య ఇటీవల మరణించగా పీఆర్టీయూ సంక్షేమనిధి నుంచి మృతుని కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును శ్రీపాల్రెడ్డి అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచినందుకు డీఈఓ సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్సీతో కలిసి పీఆర్టీయూ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీరంగం, సంఘం నాయకులు దేవులపల్లి సత్యనారాయణ, కాసర్ల రమేశ్, కాటం మల్లారెడ్డి, సూర్యనారాయణ, చెరుకుల ధర్మయ్య, ప్రభావతి, పెండ్యాల సలేంద్రం, ప్రమీల, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
రేపు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
భూపాలపల్లి రూరల్: వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబురావుతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువులు, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు. అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు తేదీ : 15న (సోమవారం) సమయం : ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్ 89777 45518 -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. -
ఈదురుగాలులతో వర్షం
మొగుళ్లపల్లి: మండలంలోని రంగాపురం గ్రామంతో పాటు శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రంగాపురం గ్రామంలోని పలువురి ఇంటి పై కప్పులు లేచిపోయాయి. రంగాపురం–మొగుళ్లపల్లి ప్రధాన రోడ్డులో చెట్లు నేలకొరిగాయి. దాంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు మినహా అన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్లను రోడ్డుపై నుంచి తొలగించడంతో వాహనాలు వెళ్లిపోయాయి. -
జాడలేని స్పెషల్ కిట్లు
భూపాలపల్లి అర్బన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక కిట్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజునే విద్యార్థుల చేతికి కిట్లు అందేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు మూడు నెలల క్రితమే వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు పాఠశాలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జిల్లాలోని 394 ప్రభుత్వ పాఠశాలల్లో 16వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వేలాది మంది విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్టులు తదితర సామగ్రిని కిట్ రూపంలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా కిట్ల సరఫరా పూర్తికాకపోవడంతో విద్యార్థులు పాత బ్యాగులు, పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వం కిట్లు అందిస్తుందనే నమ్మకంతో చాలామంది తల్లిదండ్రులు కొత్త బ్యాగులు, నోట్బుక్స్, బూట్లు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు కిట్లు రాకపోవడంతో అవసరమైన వస్తువులను సొంతంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచేందుకు ఉచిత కిట్లు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి అంశాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రచారం చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కిట్లు అందకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రతీ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు అందించేవారు. ఈ ఏడాది నూతన కిట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వం యూనిఫాంపై దృష్టి పెట్టలేదు. దీంతో ఈ ఏడాది యూనిఫాంలు సైతం ఆలస్యంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్ కిట్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ కిట్లు ఎప్పుడు వస్తాయి? విద్యార్థుల చేతికి ఎప్పుడు చేరతాయి? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే కిట్ల పంపిణీ చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అవసరమైన సామగ్రి అందితేనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ప్రోత్సాహానికి నిజమైన అర్థం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 1,6752,0871,4011,1681,6421,7311,6381,9911,6781,9791వ తరగతి5410987632జిల్లాలో పాఠశాలల సంఖ్యప్రాథమిక 281ప్రాథమికోన్నత 43ఉన్నత 70 ఎల్లుండి నుంచి పాఠశాలలు ప్రారంభం పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలువిద్యార్థులకు అందించే స్పెషల్ కిట్ల గురించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే విద్యార్థులకు అందిస్తాం. విద్యార్థుల సంఖ్య వివరాలను ప్రభుత్వం తీసుకుంది. విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు మండల కేంద్రాలు, పాఠశాలలకు పంపించాం. – రాజేందర్, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి -
మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి
మల్హర్(కాటారం): అడవుల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కాళేశ్వరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కాటారం అటవీ రేంజ్ పరిధిలో ప్లాంటేషన్ పనులను సీసీఎఫ్ పరిశీలించారు. మొక్కల నాణ్యత, పెంపక విధానాలను నిశితంగా పరిశీలించారు. రాబోయే ప్లాంటేషన్లో నాటబోయే మొక్కల రకాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం దామెరకుంట బీట్ను సందర్శించి కంపార్ట్మెంట్ నంబర్ 154లోని 10 హెక్టార్లలో ఏర్పాటుచేసిన ఎస్ఎంఎస్ ప్లాటేషన్ను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, మహదేవపూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సందీప్, కాటారం ఎఫ్ఆర్ఓ స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు. సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ -
పట్టాల పంపిణీతో శాశ్వత హక్కులు
ములుగు రూరల్: రాంచంద్రాపురం భూములకు పట్టాల పంపిణీ ద్వారా భావితరాలకు శాశ్వత భూ హక్కులు కల్పిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వేగంగా పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం రైతు వేదికలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో మల్లంపల్లి, రాంచంద్రాపురం, గుర్తూర్తండా, భూపాల్నగర్, శివతండా, కొడిశలకుంట, ముద్దునూరుతండా ప్రజల నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాంచంద్రాపురం గ్రామ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు పాల్గొన్నారు. -
ఆకలికి చెక్ !
విద్యారణ్యపురి: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అర్దాకలితో ఉండాల్సిన అవసరం లేదిక. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో హనుమకొండలోని ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాల, హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలను తొలుత ఎంపిక చేశారు. వీరికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఫీడ్బ్యాక్.. హనుమకొండలోని ఆ మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం అప్పగించిన ఓసొసైటీ బుధవారం తమ సిబ్బందితో బుధవారం బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చి అందించింది. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు పూరీ కుర్మా, రాగి ఇడ్లీ, చట్నీ వడ్డించారు. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఆకళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, ప్రభుత్వ పింగిళి కళాశాలలో ఆకళాశాల ప్రిన్సిపాల్ కవిత పర్యవేక్షణలో ఆసొసైటీకి సంబంధించిన సిబ్బంది బ్రేక్ఫాస్ట్ అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం హనుమకొండ జిల్లాలోని మూడు కాలేజీల్లో అమలుకు నిర్ణయం బ్రేక్ఫాస్ట్ అందించి ఫీడ్ బ్యాక్ తీసుకున్న సిబ్బంది ఈనెల 15 నుంచి అమలు! హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులు 706 మంది ఉండగా.. మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు 422 మంది అడ్మిషన్లు పొందారు. ఈప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం సెకండియర్లో 326 మంది ఉండగా మొదటి సంవత్సరంలో 150 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో సెకండియర్లో 588 మంది విద్యార్థులు ఉండగా.. ఫస్ట్ ఇయర్లో 400 మంది ప్రవేశాలు పొందారు. ఈసంఖ్య మరింత పెరగనుంది. -
కాళేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.48.25 లక్షలు
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలను విప్పి నగదు లెక్కించగా రూ.48,25,170 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గ్రంధసిరి సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్రెడ్డి, శ్రీధర్రావు, పద్మ, శ్యామసుందర్, కాటం సత్తయ్య, దుర్గయ్య పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ టేకుమట్ల: మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామానికి చెందిన ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్త రవిని విద్యుత్షాక్తో హత్య చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. గ్రామస్తులు కలిసిరావాలి చిట్యాల: డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులంతా కలిసి రావాలని చల్లగరిగ సర్పంచ్ సిరిపిల్లి జంపయ్య అన్నారు. శుక్రవారం సర్పంచ్ జంపయ్య అధ్యక్షతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం జరిగింది. గ్రామంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వాడరాదని తీర్మానం చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ వాడినా, వికయ్రించానా గ్రామ పంచాయతీకి సమాచారం అందిస్తే రూ.5వేల16 నగదు, బహుమతి అందజేస్తామన్నారు. సమాచారం అందించిన వారిపేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండెకారి స్వప్న, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మహాముత్తారం: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామంలోని ముక్కెర వెంకటస్వామి ఇంటిపై విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. ఈదురుగాలులు వచ్చినప్పుడు ఒక దానికి ఒకటి తగిలి మిరుగులు రావడంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్శాఖ అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇప్పటికై నా విద్యుత్శాఖ అధికారులు స్పందించి తీగలను సరిచేయాలని కోరుతున్నారు. -
20న జాతీయ లోక్అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్దఎత్తున కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ సూచించారు. శుక్రవారం పోలీసు అధికారులు, న్యాయవాదులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి లోక్ అదాలత్ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు. కేసుల పరిష్కారంలో రాజీమార్గాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకుంటే సమయం, ధనం ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో రాజీద్వారా పరిష్కారం పొందిన వారికి చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, అదనపు ఎస్పీ ఎ.నరేష్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. బంగారు భవితను కాపాడాలి పరిశ్రమలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి బంగారు భవితను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం కోర్టుహాల్లో పోలీసు అధికారులతో చర్చించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పారా లీగల్ వాలంటీర్లు, కార్మిక శాఖ, రెవెన్యూశాఖ అధికారుల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, ిసీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. -
బీఎంఎస్ రాజీలేని పోరాటం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, బొగ్గు పరిశ్రమల రక్షణ కోసం బీఎంఎస్ రాజీలేని పోరాటాలు చేస్తోందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–8వ గనిలో శుక్రవారం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా ‘బీఎంఎస్ కార్మిక భరోసా’ పేరుతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధి విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేటీకే–8వ గని ఫిట్ కార్యదర్శి అడపా రాజు, బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్, నాయకులు మల్లేష్ శంకర్, నారాయణ, శీలం రాజు, మల్లేష్, శ్రవణ్, కనకయ్య, ప్రవీణ్, శ్రీనివాస్లు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ -
విచారణ జరిపించాలి
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో జరుగుతున్న రూ.వేలకోట్ల అవినీతి అక్రమాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సింగరేణిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. తెలంగాణకు సింగరేణి అమూల్యమైన సంపద అని, 137 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో లాభాలు, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సంస్థ ప్రస్తుతం జీతాల చెల్లింపుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో టెండర్ల వ్యవస్థలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి కొందరికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మైనస్కు వెళ్లిన ఓబీ టెండర్లు ప్రస్తుతం అదనపు ధరలకు కేటాయిస్తున్నారని, దీనివల్ల సింగరేణికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. బొగ్గు నిల్వల్లో భారీ వ్యత్యాసాలు.. బొగ్గు నిల్వల లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రికల్ టన్నుల బొగ్గు లేదని, 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. మూతపడిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ వద్ద 1.81లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్స్ప్లోజివ్స్ కొనుగోళ్లలో మార్కెట్ ధర రూ.37వేలు ఉంటే అధిక ధరలు రూ.44వేలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని ఆరోపించారు. డీజిల్ కొనుగోళ్లను ప్రభుత్వ సంస్థలనుంచి కాకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించడం ద్వారా అదనపు ఆర్థికభారం మోపుతున్నారని విమర్శించారు. వీటన్నింటిలో నిజాలు తేలాలంటే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పెద్ది సుదర్శన్రెడ్డి, నాయకులు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–2 సందర్శించేందుకు వెళ్లిన హరీశ్రావు, నాయకులను అనుమతి లేదని సింగరేణి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఉన్నతాధికారులను అనుమతి తీసుకుని రావాలని చెప్పడంతో బీఆర్ఎస్నాయకులు అక్కడినుంచి వెనక్కి వచ్చారు. రెండున్నరేళ్లలో సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ టెండర్లలో కొందరికే లబ్ధి చేకూరేలా నూతన నిబంధనలు సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు -
వేలం ఆదాయం రూ.8.10 లక్షలు
మంగపేట : మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వహణపై గురువారం నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ.8.10 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జ్, కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 2026 మే 15 నుంచి 2027 జూన్ 25 వరకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాలకు 2 షాపులు, 2 క్యాంటీన్లు, 2 బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం పాటలను వరంగల్ నాగమయ్య దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటయ్య సమక్షంలో గురువారం నిర్వహించారు. వేలం పాట లో 15 మంది పాల్గొనగా కొబ్బరి కాయలు, పూజా సామగ్రి విక్రయాల షాపు నంబర్ నంబర్ 1 నర్సింహారావు రూ 2,25,000, షాపు నంబర్ నంబర్ 2 ఎం.అనురాధ రూ.2,25,000, హోటల్, కూల్డ్రింక్స్ షాపు నంబర్ 1 శివయ్య రూ.1,10,000, షాప్ నంబర్ 2ను సతీష్ రూ.1,10,000కు పాట పాడి దక్కించుకున్నారు. అలాగే బొమ్మలు, గాజుల షాపు నంబర్ 1 గోవర్ధన్ రూ.70వేలకు, షాప్ నంబర్ 2 వెంకటేశ్వర్లు రూ.70వేలలకు దక్కించుకున్నారు. -
మార్కెట్లోకి ‘మా శక్తి’ ఉత్పత్తులు
ములుగు: జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఇకపై మా శక్తి బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ములుగు కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి మా శక్తి బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్త కళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు మా శక్తి బ్రాండ్ను రూపొందించినట్లు తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరగడంతో పాటు మార్కెట్లో విశ్వసనీయత, గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి డిజిటల్ వేదికల ద్వారా విక్రయాలకు అవకాశం కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. అలాగే మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడుతుందని వివరించారు. మేడారం, లక్నవరం, బొగత జలపాతం, రామప్ప వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అదనపు డీఆర్డీఓ గొట్టె శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, అధికారులు పాల్గొన్నారు. వైద్యసేవల్లో ఆదర్శంగా నిలవాలి రాష్ట్రంలోనే ములుగు జిల్లా వైద్యసేవల్లో ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో వైద్య సేవల విస్తరణ, వర్షాకాల ఆరోగ్య సన్నద్ధతపై గురువారం మంత్రి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ గోపాల్రావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
జీసీసీ సేవలు మరింత విస్తరించాలి
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజలకు జీసీసీ సేవలను మరింత విస్తరింపజేయాలని, జీసీసీ పెట్రోల్ బంక్లను నడిపించాలని, చిన్న అటవీ ఉత్పత్తులను సేకరణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ జీసీసీ డివిజనల్ మేనేజర్, సొసైటీ మేనేజర్లు, అకౌంటెంట్లతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, గృహ అవసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న అటవీ ఉత్పత్తుల కింద సొసైటీల వారీగా లక్ష్యాలు పెట్టుకొని వాటి దిశగా వెళ్లాలన్నారు. అలాగే గ్యాస్ గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లు, జీసీసీ ఫిల్లింగ్ స్టేషన్ల పనితీరు మరింత మెరుగు పడాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని గృహ అవసరాల డిపోల పనితీరు, డిపోల వారీగా గత సంవత్సరం లాభాల వివరాలను తెలుసుకున్నారు. గిరిజనులకు అవగాహన కల్పిస్తూ అటవీ ఉత్పత్తుల సేకరణ మరింత పెంచాలన్నారు. బంక్లలో తాగునీరు, సీ్త్ర, పురుషులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైటింగ్, జనరేటర్, అగ్నిమాపక పరికరాలు, ప్రకటనలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేసి పెట్రోల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఓటీపీతోనే గ్యాస్ సరఫరా గ్యాస్ వినియోగదారులకు ఓటీపీతోనే గ్యాస్ సిలండర్లను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ మేనేజర్ వాణి, ములుగు, వెంకటాపురం(కె), నర్సంపేట సొసైటీల మేనేజర్లు దేవ్, బాలాజీ, విజయలక్ష్మీ పాల్గొన్నారు. పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
కేసుల పురోగతిపై సమీక్ష
చిట్యాల: స్థానిక పోలీస్స్టేషన్ను అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో అమలవుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ పనితీరుపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ పోచంపల్లి సతీష్ స్టేషన్ పరిధిలో సీసీటీఎన్ఎస్ ద్వారా జరుగుతున్న ఆన్లైన్ సేవల పురోగతిని, కేసుల నమోదు విధానాన్ని అడిషనల్ ఎస్పీ కంప్యూటర్ స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా వివరించారు. స్టేషన్లో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల రికార్డులను అడిషనల్ ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన టెక్ టీం రైటర్లకు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అన్ని కేసుల ఫైళ్లను, నిర్దేశించిన లక్ష్య సమయం లోపు పూర్తిచేసి ఆలస్యం లేకుండా పోర్టల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రికార్డులను ఎల్లప్పుడూ పారదర్శకంగా, అప్డేట్గా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో చిట్యాల పోలీస్ స్టేషన్ టెక్ టీం రైటర్స్ ఎ.మమత, జి.నాగమణి, లాల్సింగ్ పాల్గొన్నారు. -
నేడు సింగరేణి పరిరక్షణ సదస్సు
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) భూపాలపల్లి ఏరియాలో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్కు రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. సదస్సును జయపద్రం చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో కార్మికులను ఇబ్బందులు గురి చేస్తుంటే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితెల సమ్మయ్య, సదానందం, అవినాష్రెడ్డి, మధు, రాజేందర్, మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతీ గురువారం విచారణభూపాలపల్లి అర్బన్: జిల్లాలో 18 ఏళ్లలోపు బాల నేరస్తులకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు తొలి సారి జిల్లాలో ఏర్పాటు చేసి జువైనైల్ జస్టిస్ బోర్డు ప్రతీ గురువారం కేసుల విచారణ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, న్యాయమూర్తి జి.అఖిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన జిల్లా సెషన్స్ ఇన్చార్జ్ జడ్జి ఎస్వీపీ సూర్య చంద్రకళ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. బాలల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమన్నారు. -
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
మహాముత్తారం: రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులను ఆదేశించారు. గురువారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భుభారతి పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా, ఎలక్షన్ వర్కపెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశ్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. వాహనాల తనిఖీ మహాముత్తారం: మండలంలోని యామన్పల్లి ప్రధాన రహదారి వద్ద మహాముత్తారం ఎస్సై రమేష్ గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనపత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై పరకాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తేజావత్ రజిత, భూక్య లక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అంబులెన్స్లో పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. డీఎస్బీ ఎస్సై బదిలీగోదావరిఖని: కాళేశ్వరం జోన్పరిధిలోని ములుగు జిల్లా డీఎస్బీ ఎస్ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్రావును సీసీఎస్ రామగుండానికి బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నేరాల నియంత్రణలో రాజీపడొద్దుములుగు రూరల్: నేరాల నియంత్రణలో రాజీపడొద్దని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు గురువారం ములుగు జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నేలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీ చేపట్టి గంజాయి రవాణాను అడ్డుకోవాలన్నారు. యువత గంజాయి వినియోగానికి అలవాటుపడుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. పోలీస్స్టేషన్లలో పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని వెల్లడించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు పాల్గొన్నారు. -
ఆక్యుప్రెషర్ పార్కు నిరుపయోగం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, నడక వ్యాయామం కోసం సుమారు రూ.36.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆక్యుప్రెషర్ పార్కు ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఎంతో ఆశయంతో నిర్మించిన ఈ పార్కు మూడేళ్లుగా ప్రజలకు అందుబాటులో లేక పాడుబడిపోతోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ప్రైవేట్ వెంచర్లో గ్రీన్ బడ్జెట్లో నిర్మించిన ఈ పార్కులో ఆక్యుప్రెషర్ ట్రాక్, పచ్చదనం, వ్యాయామ, విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రారంభ రోజుల్లో కొంతమంది ప్రజలు వినియోగించినప్పటికీ, అనంతరం సరైన నిర్వహణ లేకపోవడంతో పార్క్ క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం పార్క్ ప్రవేశ ద్వారం వద్దనే పాడుబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోపల కలుపు మొక్కలు పెరిగిపోవడం, పరికరాలు దెబ్బతినడం, శుభ్రత లేకపోవడం వల్ల ప్రజలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పార్కులోని కొంతభాగం దెబ్బతింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్క్ ప్రజలకు ఉపయోగపడకుండా ఉండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. లక్షల రూపాయలతో నిర్మించిన ఆస్తిని సంరక్షించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. పార్క్ను వెంటనే పునరుద్ధరించి, దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేపట్టి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి ఉపయోగపడే ఇటువంటి వనరులు నిర్లక్ష్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.పక్కన పడేసిన వ్యాయామ పరికరాలు రూ.36.50 లక్షల ప్రజాధనం వృథా నిర్వహణ లేక శిథిలావస్థకు.. -
భారం అధికం
మద్దతు కొంచెం..భూపాలపల్లి రూరల్: వానాకాలం సీజన్కు ముందే జిల్లాలోని రైతు నెత్తిన పిడుగుపడింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగి పంట అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కేంద్రం కాస్త ఊరటనిచ్చేలా 14 పంటలకు కనీస మద్దతుధర పెంచింది. ఈ పెంపు చాలా తక్కువగా ఉండడంతో చాలామంది రైతులు పెదవి విరిచారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను 50 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.400 వరకు పెంచేసింది. మద్దతు ధర పెంపు క్వింటాలుకు రూ.72 నుంచి రూ.622 మాత్రమే. ఎకరాకు లెక్కేస్తే రైతుకు వచ్చే అదనపు ఆదాయం కన్నా ఎరువులకే అయ్యే అదనపు ఖర్చు రెట్టింపు అవుతోంది. రూ.కోట్లలో అదనపు భారం జిల్లా వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఈ సీజన్లో రైతులపై అదనంగా రూ.కోట్లలో ఎరువుల భారం పడుతుంది. ఎంఎస్పీ పెంపుతో వచ్చే అదనపు ఆదాయం పెరిగినప్పటికీ డీజిల్ లీటరు రూ.3, కూలీ రోజుకు రూ.100 పెరగడంతో ఆ మిగులు కూడా కరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి క్వింటాలుకు రూ.72 పెంచి ఎరువు బస్తాకు రూ.400 పెంచితే ఎలా బతకాలి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట చేతికి వచ్చాక తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 3–4 కేజీలు కోత పెడుతున్నారని పేర్కొంటున్నారు. ● వరి సాగుచేసే రైతులు సాధారణంగా ఎకరాకు 10:26:26 రెండు బస్తాలు, యూరియా రెండు బస్తాలు వాడతారు. 10:26:26పై బస్తాకు రూ.300 చొప్పున రూ.600 పెరిగింది. ● పత్తి సాగుచేసే రైతులు ఎకరాకు 12:32:16 రెండు బస్తాలు, 20:20:0:13 ఒక బస్తా, యూరియా రెండు బస్తాలు వాడతారు. 12:32:16పై బస్తాకు రూ.400 చొప్పున రూ.800 భారం పడుతుంది. 20:20:0:13పై రూ.150 కలిపి మొత్తం రూ.950 భారం పడుతుంది. ● మొక్కజొన్న సాగుచేసే రైతులు సాధారణంగా 14:35:14 ఒక బస్తా. యూరియా రెండు బస్తాలు వాడుతారు. వీరిపై రూ.350 అదనపు భారం పడుతుంది. ● సోయాబీన్ రైతులు పంటకు 12:32:16 ఒక బస్తా, డీఏపీ ఒక బస్తా వినియోగిస్తారు. 12:32:16పై రూ.400 పెరిగినందున ఆ భారం రైతుపై పడుతుంది.వరి 1,09,054 పత్తి 1,06,560మిర్చి 25,000 పెసర 110బొబ్బెర 90ఎరువు పాత ధర కొత్త ధర పెంపు 10:26:26 1850 1,975 125 12:32:16 1,475 1,875 400 14:35:14 1,500 1,850 350 20:20:0:13 1,500 1,800 300 డీఏపీ 1,350 1,350 మార్పులేదు 28:28:0 1,500 1,800 300 పొటాష్ 1,850 1,975 125 సూపర్ 615 775 160పంట పాత ధర కొత్త ధర పెంపు వరి(సాధారణ) 2,369 2,441 72 వరి(గ్రేడ్–ఏ) 2,389 2,461 72 మొక్కజొన్న 2,329 2,401 72 పత్తి(మధ్యశ్రేణి) 7,710 8,267 557 పత్తి(దీర్ఘశ్రేణి) 8,110 8,667 557 సోయాబీన్ 4,892 5,284 392 కంది 7,550 8,415 865 రూ.150నుంచి రూ.400 వరకు పెంపు ఎంఎస్పీ పెంపు నామమాత్రమే. -
లింగ నిర్ధారణ అరికట్టేందుకు చర్యలు
భూపాలపల్లి: గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో పీసీ పీఎన్డీటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు అమలుపై వైద్య, పోలీసు, ఐఎంఏ, మారి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యసంస్థలు నమోదు ప్రక్రియను పూర్తిచేసి చట్టపరమైన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ కిరణ్, మారి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సదానందం, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, డెమో శ్రీదేవి పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు.. జిల్లాలో బల్క్ భూములు, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి రెవెన్యూ అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు బల్క్ భూముల సర్వే జరుగుతుందని తెలిపారు. సర్వేలో వేగం పెంచి నివేదికలు అందజేయాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, భూపాలపల్లి కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన అధికారులు.. బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన జిల్లా రవాణ శాఖ అధికారి మహమ్మద్ సంధాని, క్వాలిటీ కంట్రోల్ ఈఈ బసవప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి సునీల్ కుమార్ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహించిన కాలంలో అధికారులు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
ఆర్డర్లు నిల్.. తయారీ క్లోజ్
ఏటూరునాగారం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు పట్టింపులేనితనంతో ఆర్డర్లు రాక.. ఉత్పత్తి నిలిచిపోయిందని గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే మిషనరీ తుప్పుపడుతున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు ఐటీడీఏ పరిధిలోని అప్పటి ప్రభుత్వం ట్రైకార్ ద్వారా గిరిజన మహిళా సంఘాలకు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రూ. 39 లక్షల బడ్జెట్ను కేటాయించింది. దీంతో ఏటూరునాగారంలో 2022–23లో ఐటీడీఏ కార్యాలయానికి కూతవేటు దూరంలోని క్రాస్రోడ్డులో స్వయంకృషి జాయింట్ లయబిలిటీ గ్రూపు పేరుతో పది మంది సభ్యులు కలిసి న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలుత ఆరు నెలలకు సరిపడా ఇండెంట్లు రావడంతో న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారు చేసి పంపిణీ చేశారు. ఆపై ఆర్డర్లు రాకపోవడంతో పరిశ్రమ మూతపడింది. ఆ తర్వాత 2025 నవంబర్లో ఐటీడీఏ నుంచి ఆర్డర్స్ ఇవ్వడంతో ఉత్పత్తులను తయారు చేసి అందజేశారు. అనంతరం మళ్లీ అర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తి చేయలేమని నష్టం వస్తుందని దానిని సభ్యులు మూసివేశారు. పరిశ్రమకు తాళాలు వేసి ఉండడంతో చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. 10శాతం నగదు.. 50శాతం సబ్సిడీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రైకార్ ద్వారా ప్రభుత్వం రూ. 39 లక్షలు వెచ్చించగా అందులో 10 శాతం నగదును వాటా దారులైన మహిళలు చెల్లించారు. ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ రూపంలో బ్యాంకులో జమ చేసింది. మిగతా 30 శాతం నిధులు బ్యాంకు రుణంగా అందజేసింది. దీంతో పరిశ్రమను నెలకొల్పిన మహిళలు పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, రాగులు, పల్లీలను కలిపి డ్రైమిక్స్ పౌడర్ను తయారు చేసి ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు గతంలో అందజేశారు. విద్యార్థులకు అందని పౌష్టికాహారం పరిశ్రమ మూసివేయడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా పోయింది. ఈ విషయంపై గతంలో ‘సాక్షి’ పలుమార్లు కథనాలు రాయగా అప్పటి పీఓ చిత్రామిశ్రా పరిశ్రమకు డిమాండ్ ఆర్డన్ను అందజేసి తెరిపించారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పరిశ్రమ నడిపి ఉత్పత్తి చేసి జీసీసీ ద్వారా విద్యాసంస్థలకు సరఫరా చేశారు. కానీ ఆ తర్వాత మార్చి నుంచి మూసివేశారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోను సంప్రదించగా దానిని పరిశీలించి తెరిపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సంవత్సరం ఉత్పత్తి వ్యాపారం 2023 1,600(కిలోలు) రూ.25.6లక్షలు 2025 1,000(కిలోలు) రూ.16లక్షలు ఆదరణ లేక మూతపడిన న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ తయారీ కేంద్రం పట్టించుకోని ఐటీడీఏ అధికారులు తుప్పుపడుతున్న యంత్రాలు -
వచ్చే ఏడాది ఖరీఫ్కు సాగునీరు
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్కు సాగునీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక హెలికాప్టర్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్లో బ్యారేజీ దిగువకు వెళ్లారు. పుణేకు చెందిన సైంటిస్టులు, ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యారేజీ ఎగువన యాగశాల వద్ద ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా కల్నల్ పరిక్షీత్ మెహ్రా బ్యారేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోల ఆధారంగా వివరించారు. రాత్రిపగలు పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ల ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్లనే కుంగినట్లు తెలిపారు. కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలతో పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్–ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిప్లేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపా రు. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్ప ష్టం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఆర్డీఓ రవీందర్, ఇరిగేషన్ ఎస్ఈ దస్తగిరి, ఈఈ రమేష్, కన్సల్టెంట్ ఈఈ యాదగిరి, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ సురేందర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్కుమార్ పాల్గొన్నారు. గంటపాటు మేడిగడ్డ బ్యారేజీలో పర్యటన.. పరిశోధనల తనిఖీ మూడు బ్యారేజీల్లోని పరీక్షల వివరాలు వెల్లడి -
యువత మత్తుకు బానిసకావద్దు
ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో గంజాయి కేసుల్లో శిక్షపడిన వారితో వృక్ష రూపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమేనని తెలిపారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ముందుకు సాగాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ బాగుంటుందని వెల్లడించారు. గంజాయి అమ్మకాలపై సమాచారం అందించిన వారికి రూ. 5,116 నగదు బహుమతి అందిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ స్వామి, ఎస్సైలు ఉపేందర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.‘ప్రైవేట్’ అక్రమాలపై చర్యలు తీసుకోవాలిభూపాలపల్లి అర్బన్: జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపడం ఆందోళనకరమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వ సూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమైతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కన్నెపల్లి ఇసుక క్వారీలో అక్రమంగా టీజీఎండీసీ సిబ్బంది లారీలో ఇసుక లోడింగ్ చేయడానికి రూ.3వేలు డిమాండ్ చేశారని లారీ యజమాని లింగంపల్లి రామారావు టీజీఎండీసీ ఎండీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లారీలోడు కోసం ఆన్లైన్లో అన్ని రుసుములు చెల్లించామని, ఇసుక రీచ్ వద్ద లోడింగ్ చార్జీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎండీని కోరినట్లు చెప్పారు. నేడు కిసాన్ మేళా.. సాంకేతిక సదస్సు ములుగు రూరల్: ఖరీఫ్ సీజన్ను పురస్కరించుకొని జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న కిసాన్ మేళా, సాంకేతిక సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హజరై విజ యవంతం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేశ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోవిందరావుపేట మండలం పీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్న కిసాన్ మేళా నేడు(గురువారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాగు మేలకువలను రైతులకు అందించనున్నట్లు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ములుగు: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ములుగులోని రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధంపై అవగాహన కల్పించినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారి అరుణాదేవి తెలిపారు. రోజువారీ జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను స్వీకరించడం, ఎస్డబ్ల్యూఎం నిబంధనలు, సుస్థిర అభివృద్ధికి సీఎస్ఆర్ అమలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కోసం సాంకేతికతలను స్వీకరించడం గురించి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. సౌరశక్తి, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, గ్రీన్ మోడలింగ్ టెక్నాలజీస్ వంటి సహజ వనరుల పరిరక్షణపై ఇంటరాక్టివ్ సెషన్ సైతం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్తో కలిసి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. -
తొలకరికే.. తొందరొద్దు
భూపాలపల్లి రూరల్: వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం జిల్లాపై పడుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్నీఓతో రుతుపవనాలు గతితప్పే అవకాశం ఉండటంతో రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకుంటే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. 2.16 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో వానాకాలం సాగు అంచనా.. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల మంది రైతులు ఉండగా.. వానాకాలంలో 2.16 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 1,09,854 ఎకరాలు, పత్తి 1,06,560, కంది 110, పెసర 90, బొబ్బెర 120 ఎకరాలు అదనంగా ఉద్యాన పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. ఎల్నినో ప్రభావం.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో ఎల్నినో ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఓ మోస్తరు, జూన్ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై ఇటీవల అవగాహన కల్పించింది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు బృందాలుగా పర్యటించారు. ఎల్నినో పరిస్థితులను వివరించి పంటల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు పంటల మార్పిడి అవసరం అంటున్న శాస్త్రవేత్తలు జిల్లాలో రైతులు ఎక్కువగా వరి, పత్తి, మిర్చి పంటలు పండిస్తున్నారు. వీటికి ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడటంతో వాటి అవశేశాలు భూమిలోపల ఉండి భూమిలో సారాన్ని లేకుండా చేస్తుంటాయి. దీంతో పంటలకు చీడపీడల బెడద ఎక్కువవుతుంది. రైతులు పంటల మార్పిడి చేస్తే భూమిలో సారం పెరిగి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. వర్షాలకు ఎల్నినో ముప్పు రుతుపవనాలు గతి తప్పే అవకాశం సాగులో మార్పులు అవసరమంటున్న వ్యవసాయ అధికారులు వానాకాలంలో తొలకరి జల్లులు కురవగానే విత్తనాలు వేయడం రైతులకు ఆలవాటు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు తొలివాన అనంతరం పెద్ద విరామం రావొచ్చు. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిస్తేనే విత్తనం వేయాలి. లేదంటే మొలకలు ఎండిపోయి పెట్టుబడులు వృథా అవుతాయి. నీటి నిల్వలు తక్కువగా ఉండొచ్చు. ఈసారి వరి తదితరాల పంటలకంటే తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. -
విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలి
భూపాలపల్లి అర్బన్: పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం) కింద విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించే లక్ష్యంతో జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించారు. కమ్యూనిటీ మొబైలైజింగ్ అధికారి సామల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారం అందించడం ద్వారా హాజరు శాతం పెరగడంతో పాటు డ్రాప్అవుట్లు తగ్గుతాయని, విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించగలరన్నారు. శిక్షణలో రిసోర్స్ పర్సన్లు మధ్యాహ్న భోజనం తయారీ విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలు, రాగి మాల్ట్ తయారీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాల్గొన్న వారితో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేయించి ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ విజయపాల్రెడ్డి, రాజ గోపాల్, కుసుమ కృష్ణమోహన్, చల్ల కిషన్రెడ్డి, షిరీ న్, శశికళ, శారద, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు
కాళేశ్వరం: వాతావరణ శాఖ సూచన మేరకు ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని, రైతులకు వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం మహాదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ హసీనాభాను అధ్యక్షతన జరిగిన గ్రామసభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు వివరించినట్లు తెలిపారు. వాతావరణశాఖ సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. అధికంగా యూరియా వినియోగించకుండా నానో యూరియా వినియోగించేలా రైతులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు సవరణ జూన్ 15 నుంచి జరుగుతుందని, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జరిగిందని ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో జరుగుతుందన్నారు. ప్రతీ ఇంటికి బూతు స్తాయి అధికారులు వస్తారని ఓటర్లు వివరాలను ఇవ్వాలని తెలిపారు. ఓటరు జాబితాలో సలహాలు సూచనలు, అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్కు లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజ బాబు, ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీపాల్, సీడీపీఓ రాధిక, పీఆర్ డీఈ సాయిలు, వైద్యాధికారి సుష్మిత, అటవీశాఖ ఎఫీడీ ఓ రవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటరు సవరణకు సహకరించాలి కలెక్టర్ రాహుల్శర్మ -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారయాణరావు అన్నా రు. బుధవారం జంగేడుహనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో 2, 15వ వార్డుల సంయుక్త వార్డు నిర్శహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం వార్డు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గణపురం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం గణపురం, చెల్పూరు, బస్వరాజుపల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు బస్వరాజుపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పెట్రో, గ్యాస్ ధరలు తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్కుమార్, మోటపలుకుల రమేష్లు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడంతో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ఇంధన, గ్యాస్ ధరలను తగ్గించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు కుడుదల వెంకటేష్, నూకల చంద్రమౌళి, వేముల శ్రీకాంత్, గనగళ్ల జోగేష్, గోలి లావణ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆందోళన -
కార్మికులను బెదిరించడం సిగ్గుచేటు
● టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి భూపాలపల్లి అర్బన్: టీబీజీకేఎస్ గేట్ మీటింగ్లకు హాజరవుతున్న కార్మికులను, గులాబీ కండువాలు ధరించిన వారిని గుర్తింపు సంఘాల నాయకులు బెదిరించడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి విమర్శించారు. ఏరియాలోని కేటీకే–5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కేటీకే–5 గనిలో వాటర్ ప్లాంట్ను వెంటనే మరమ్మతులు చేసి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, మ్యాన్రైడింగ్ సమస్యను పరిష్కరించి కార్మికుల కోసం షెడ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించే వారిని బెదిరించడం తగదన్నారు. టీబీజీకేఎస్ కార్మికులకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెడికల్ బోర్డుల ద్వారా వేలాది వారసత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ బోర్డులను నిర్వహించకపోవడంతో కార్మిక కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. సింగరేణి బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, సరఫరా గణాంకాల విషయంలో యాజమాన్యం పొంతనలేని లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. బొగ్గు నిల్వలు, లాభాలు, అప్పుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణికి ప్రభుత్వం బకాయి ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, నాయకులు, మధు, అవినాష్రెడ్డి, మహేందర్, కార్మికులు పాల్గొన్నారు. -
నాణ్యమైన దర్యాప్తుతోనే బాధితులకు న్యాయం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్భూపాలపల్లి: నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేయాలన్నారు. సీసీటీఎన్ఎస్ 2.0లో ప్రతీ కేసును సకాలంలో నమోదు చేసి వివరాలను అప్డేట్ చేయాలని, వ్యవస్థలోని అన్ని ఫీచర్లను వినియోగించి పారదర్శకత పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించాలని, గంజాయి రవాణా, మట్కా, జూదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను విస్తరించి పర్యవేక్షించాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఖర్చు పెరుగుతోంది..
జిల్లా కేంద్రంలో ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాను. డ్రైవర్గా పని చేస్తూనే మా ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్లో చదివిస్తున్నా. చదువుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం వరకు డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు రోజువారీ ఖర్చులు నిత్యావసరాలు, ఇంటి అద్దె పోనూ రూపాయి కూడా మిగలడం లేదు. మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. – తిక్క రాజు, హన్మాన్నగర్, భూపాలపల్లి జూన్ వచ్చిందంటే చాలు రెండువైపులా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒకవైపు పిల్లల చదువులపై, మరోవైపు పంట పెట్టుబడులు, ఇలా రెండు వైపులా ఒకేసారి ఒకే నెలలో ఖర్చు పెట్టాల్సి రావడంతో భారంపడుతోంది. రైతు భరోసా డబ్బులు త్వరగా ఇవ్వాలి. – కె.శ్రావణ్రెడ్డి, చింతలపల్లి, మహాముత్తారం -
ఈవీఎం గోదాం తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లాకేంద్రంలోని ఈవీఎం, వీవీ పాట్ గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీపాట్ యంత్రాల భద్రతను పరిశీలించారు. గోదాంలో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, అగ్నిమాపక పరికరాలు, డబుల్ లాక్ సిస్టమ్ అంశాలను కలెక్టర్ పరిశీలించారు. యంత్రాల నిర్వహణ రికార్డులు, స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బందికి ప్రశంసపత్రాలు
భూపాలపల్లి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంలో ప్రతీ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాదృక్పథంతో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. గణపురం పోలీస్స్టేషన్ తనిఖీ గణపురం: గణపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ అశోక్ ఉన్నారు. -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
మోహన్నాయక్పై ఇక్కడా ఆరా!
సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు–భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజనీర్ఇన్చీఫ్ జె.మోహన్నాయక్ అక్రమాస్తులపై సోదాలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. మంగళవారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్తోపాటు బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారి కావడంతో ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన లావాదేవీలపై అందిన ఫిర్యాదులపైనా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడం స్థానిక కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎవరీ మోహన్ నాయక్..? జె. మోహన్ నాయక్ తెలంగాణ ఆర్అండ్బీ శాఖలో అత్యంత కీలకమైన ‘ఇంజనీర్–ఇన్–చీఫ్ (స్టేట్ రోడ్స్)’ హోదాలో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్డీసీ) మేనేజింగ్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపడుతున్న అనేక రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు, డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు, అభివృద్ధి పనులు స్టేట్ రోడ్స్ విభాగం ఆధ్వర్యంలో సాగుతున్నాయి. వరంగల్–ములుగు, వరంగల్–నర్సంపేట, వరంగల్–మహబూబాబాద్ తదితర ప్రధాన రహదారి పనుల పర్యవేక్షణలో ఆయన కార్యాలయానికి కీలక పాత్ర ఉంది. ఈఎన్సీ పదోన్నతికంటే ముందు ఉమ్మడి వరంగల్ ఎస్ఈగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. దీంతో మోహన్ నాయక్ పేరు ఉమ్మడి వరంగల్లోని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ వర్గాలకు సుపరిచితం. తాజాగా రూ. 6 లక్షల వసూలు.. కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే.. గ్రేటర్ వరంగల్ను కలుపుకునే ఉండే ఓ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఓ ఎర్త్వర్క్ (తారు వేసే ముందు)(మట్టి పనికి) సంబంధించిన వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కాంట్రాక్టర్కు భారీగా లాభం జరిగేలా అంచనాలు పెంచినట్లు తెలుసుకున్న సదరు ఈఎన్సీ హైదరాబాద్ నుంచి వచ్చి ఆగమేఘాల మీద ఆ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కాంట్రాక్టర్నుంచి కిందిస్థాయి అధికారుల సమక్షంలోనే రూ.6 లక్షలు తీసుకోవడంపై ఇప్పుడు ఆర్అండ్బీ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల నుంచి పనుల బిల్లులు, అనుమతులు, కాలపరిమితి పొడిగింపుల పేరుతో వసూళ్లు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది. అర్హత లేని కాంట్రాక్టర్కు భారీ పనులా? వరంగల్లో ఎస్ఈగా పనిచేసిన కాలంలో ఉన్న పరిచయాలతో అర్హత ప్రమాణాలు పూర్తిగా లేని ఓ కాంట్రాక్టర్కు సుమారు రూ.60 కోట్ల విలువైన రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు ఏడాది కింద అప్పగించారన్న ఫిర్యాదులున్నాయి. ఆ రూ.60 కోట్ల పనికి టెండర్ అయిన సమయంలో అంతే విలువ గల పనులకు రెండేళ్లు కాలపరిమితి ఇచ్చి.. సదరు కాంట్రాక్టర్కు మాత్రం మూడేళ్లు ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదమైంది. అంతేకాకుండా పనుల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక అనుమతులతో గడువు పెంచి పనులు కొనసాగించేందుకు అవకాశం కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించిన పాత రికార్డులు, టెండర్ పత్రాలను కూడా విచారణ సంస్థలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇంజనీరింగ్ అధికారులకు కీలక పోస్టింగులు, బదిలీలు, పనుల కేటాయింపుల్లో మోహన్నాయక్ ప్రభావం చూపారనే ప్రచారం ఆ శాఖలో సాగుతోంది. దీంతో ఏసీబీ దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఆ వర్గాల్లో నెలకొంది. చర్చనీయాంశంగా ఆర్అండ్బీ ఈఎన్సీపై ఏసీబీ దాడులు ఉమ్మడి వరంగల్లో రోడ్ల విస్తరణ, నిర్మాణ టెండర్లనుంచి ఎర్త్వర్క్ల వరకు ఆరోపణల జాబితా తాజాగా రూ.6 లక్షలు వసూలు? కిందిస్థాయి అధికారుల్లో చర్చ ఉమ్మడి వరంగల్లో నాలుగేళ్లు ఎస్ఈగా సేవలు అర్హత లేకున్నా కొందరు కాంట్రాక్టర్లకు పనులు.. రూ.60కోట్ల ఓ టెండర్పైనా ఆరా ఏసీబీ దాడులతో ఆర్అండ్బీ వర్గాల్లో కలకలం -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు సురక్షితం
రేగొండ: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు సురక్షితమని, తగిన పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టించాలని, శిశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, మండల వైద్యాధికారిణి హిమబిందు, ఆశకార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.సింగరేణిని కాపాడేందుకు ఏకం కావాలి భూపాలపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని, కార్మిక లోకం ఏకమై సింగరేణిని కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఏరియాలోని కేటీకే–1వ గనిలో నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు పెరగడం వల్ల సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ నెల 12న మాజీ మంత్రి హరీశ్రావు భూపాలపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అధికారుల తనిఖీ మల్హర్(కాటారం): కాటారం మండల పరిధిలోని ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విక్రయ కేంద్రాలపై మంగళవారం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. లక్ష్మీగణపతి ట్రేడర్స్, శ్రీ రాజరాజేశ్వర అగ్రిమాల్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల్లోని రికార్డులు, పత్తి విత్తనాల నిల్వలు (స్టాక్స్), వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు, డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను విక్రయించాలన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
తుదిదశకు ఇన్వెస్టిగేషన్
● ఈనెల 20కల్లా పూర్తి చేయడానికి ప్రణాళికలు ● నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటిి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో పాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్కు నేడు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రానున్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పనులు సుమారు 70శాతం వరకు పూర్తయి.. తుది దశకు చేరినట్లు ఇంజనీర్లు చెపుతున్నారు. కాంక్రీట్ నిర్మాణాలపై సమగ్ర నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఎన్డీటీ) పరీక్షలు పూర్తి చేశారు. బరాజ్, వంతెనల వద్ద కాంక్రీట్ నిర్మాణంలో పగుళ్లు, ఖాళీలు, బలహీన ప్రాంతాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఎన్డీటీ పరీక్షలు చేశారు. అదే సమయంలో రాఫ్ట్ కింద ఉన్న భూగర్భ అసాధారణ పరిస్థితులను గుర్తించి మ్యాపింగ్ చేయడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) సర్వేలు జరుగుతున్నాయి. జీపీఆర్ పరికరం ద్వారా రేడియో తరంగాలను భూమి లేదా కాంక్రీట్లోకి పంపుతుంది. లోపలి పొరలు, ఖాళీలు, పగుళ్లు, ఇనుప రాడ్ల నుంచి తరంగాలు తిరిగి వస్తాయి. ఆ ప్రతి ధ్వనులను విశ్లేషించి లోపలి నిర్మాణం ఎలా ఉందో తెలుస్తుంది. 20 మెగాహెర్ట్ ్జ వరకు తక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఈ సర్వేలు జరుపుతున్నారు. అధునాతన జీపీఆర్ వ్యవస్థలు ఇండియాలోనే చాలా అరుదుగా అందుబాటులో ఉన్నాయని ఇంజనీర్లు అంటున్నారు. నిర్మాణానికి ముందు చేపట్టిన అధ్యయనాల సమాచారాన్ని ధృవీకరించేందుకు వ్యూహాత్మకంగా బోర్హోల్ పరిశోధనలు నిర్వహించారు. తాజాగా వేసిన బోర్హోల్ పరీక్షల ఫలితాలు నిర్మాణానికి ముందు చేసిన పరిశోధనలతో అనుగుణంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. భూగర్భ పరిస్థితులపై మరింత స్పష్టత కోసం 80 మీటర్ల లోతు వరకు అదనపు బోర్హోల్ డ్రిల్లింగ్ చేపట్టి, బెడ్ రాక్ స్థాయిలు, అడుగుభాగన భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేస్తున్నారు. పునరుద్ధరణ రూపకల్పనకు అవసరమైన నమ్మకమైన డేటా సేకరణ కోసం భూగర్భ మట్టి దృఢత్వం, సాంద్రత, భరించే సామర్థాఽన్ని తెలుసుకోవడానికి ప్రమాణికంగా స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్టులు (ఎస్పీటీ) చేస్తున్నారు. నీటి పారగమ్యత (పర్మియబిలిటీ) పరీక్షలు నిర్వహించారు. గోదావరి నది ఒడ్డున గరిష్ట వరద మట్టం (ఎంఎఫ్ఎల్) వరకు తాజా టోపోగ్రాఫికల్, సర్వే వివరాలను సేకరించారు. ఇవి మెరుగైన హైడ్రాలిక్ మోడలింగ్ అధ్యయనాలకు ఉపయోగపడనున్నాయని తెలిసింది.45 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో కూడా పని గంటలను పొడిగిస్తూ ప్రాజెక్టు బృందాలు పనులను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేశారు. హైడ్రాలిక్ మోడలింగ్ పూర్తి చేయడానికి వినియోగించనున్నారు. తుది పునరుద్ధరణ డిజైన్ల అమలుకు ముందు ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ పరిశీలించి ఆమోదించనున్నాయి. -
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
● డీఆర్ఓ వసంతకుమారి భూపాలపల్లి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ వసంతకుమారి సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం డీఆర్ఓ మాట్లాడుతూ.. ప్రజావాణి అప్టికేషన్లు పెండింగ్లో ఉంచవద్దని అధికారులకు సూచించారు. 14న సైక్లింగ్ పోటీలుములుగు/ములుగు రూరల్: ఈ నెల 14న ములుగు జిల్లాకేంద్రంలో అస్మిత ఖేలో ఇండియా బాలికల సిటీ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్తో పాటు మెడల్స్ అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతీఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తామన్నారు. -
సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పాఠశాలలను బలోపేతం చేయాలి
● జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని విద్యావనరుల కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి లింగాల కుమారస్వామి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చంద్రమౌళి, సీఆర్పీలు రాములు, శ్రీనివాస్, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, మహేష్, కొమురెల్లి, రమేష్ పాల్గొన్నారు. -
నిధులున్నా.. అనుమతుల్లేవ్!
కాళేశ్వరంలో పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ చిక్కులుఅభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులు లేక నిధులు మూలుగుతున్నాయి. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వంతెన వరకు జాతీయ రహదారి 353(సీ)రోడ్డుకు అటవీశాఖ పలు కారణాలతో కొర్రీలు పెడుతూ వస్తోంది. దీంతో నేటికీ రోడ్డుకు మోక్షం కలుగలేదు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.96 కోట్ల నిధులు మంజూరు చేసి ఏడాదిన్నర కావస్తున్నా రెవెన్యూ వర్సెస్ అటవీశాఖ మధ్యన స్థలం పంచాయితీ ఎటూ తేలడం లేదు. రూ.22కోట్ల వ్యయంతో పలుగుల టు కుంట్ల వరకు రోడ్డు నిర్మాణం కోసం మార్చిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేసినా అటవీశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో పనులు సాగడం లేదు. – కాళేశ్వరంప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా.. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వంతెన వరకు జాతీయ రహదారి 353(సీ) పనులకు నాలుగేళ్ల కిందట రూ.163 కోట్ల వ్యయంతో కేంద్ర నిధులతో రామగుండంలో వర్సువల్గా పీఎం నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 14 కిలోమీటర్లలో 1,700 వరకు చెట్లు కోల్పోతుంది. కేంద్రం ఏజెన్సీ పర్యటించి ఎంత మేరకు రోడ్డు విస్తరణలో చెట్లు కోల్పోతున్నది అంచనా వేసింది. అటవీమార్గంలో కల్వర్టు వద్ద జంతువులు రోడ్డు క్రాస్ చేయడానికి నిర్మాణాలు చేయాలని సూచించారు. కేంద్రం పరిశీలనలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పట్లో అనుమతులు వచ్చేలా లేవని సమాచారం. రూ.163కోట్లు మంజూరైనా రోడ్డు పనులు మొదలు కాకుండా జాప్యం జరుగుతుంది. దీంతో వచ్చే ఏడాది కాళేశ్వరంలో జరిగే గోదావరి పుష్కరాల వరకు కూడా రోడ్డు నిర్మాణం అయ్యేలా కనిపించడం లేదు. రెవెన్యూ.. ఫారెస్టు పంచాయితీ కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ స్థలం చిన్నగా ఉండడంతో పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు వినియోగించే తాత్కాలిక బస్టాండ్ స్థఽలంలో రెవెన్యూశాఖ 4.34 ఎకరాలను ఆర్టీసీకి కేటాయించింది. రూ.3.96 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. పనులు మొదలు పెట్టే సమయంలో అటవీశాఖ అధికారులు అడ్డుకొని తమ రిజర్వు ఫారెస్టు భూమి అని నిలిపివేశారు. దీంతో ఆ రెండు శాఖల మధ్య పంచాయితీ ఎటూ తేలడం లేదు. మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకు వెళ్లినా ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలిసింది. ఉన్నతాధికారులు స్పందిస్తే వచ్చే గోదావరి పుష్కరాల వరకు బస్టాండ్ భక్తులకు అందుబాటులోకి రానుంది. 8 కిలోమీటర్ల రోడ్డుకు.. మద్దులపల్లి క్రాస్రోడ్డు నుంచి కుంట్లం గ్రామం వరకు 8 కిలోమీటర్ల రోడ్డుకు అటవీశాఖ మెలిక పెట్టిందని తెలిసింది. ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డుకు ప్రస్తుతం ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. కానీ రోడ్డు విస్తరణకు అటవీశాఖ అడ్డంకి చెప్పడంతో మంత్రి శ్రీధర్బాబు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ప్రస్తుతం కలెక్టర్, డీఎఫ్ఓల పరిశీలనలో ఉంది. కానీ వర్షాకాలం సీజన్ కావడంతో పలుగుల, కుంట్లం గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవని విమర్శలు ఉన్నాయి. ఎన్హెచ్ అనుమతులకు పంపాం..మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు 14 కిలోమీటర్ల అడవిలో రోడ్డు నిర్మాణానికి మా తరఫున పెండింగ్ లేదు. కేంద్రానికి ఆన్లైన్లో పంపాం. కేంద్రం ఏజెన్సీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. ఆర్టీసీకి ఎక్కడా మా ఫారెస్టు తరఫున స్థలం కేటాయించలేదు. రెవెన్యూ పత్రం తీసుకువచ్చారు. కానీ తమ ఫారెస్టు నుంచి అనుమతులు లేవు. పలుగుల రోడ్డుకు త్వరలో అనుమతులతో పనులు ప్రారంభం కానున్నాయి. – సందీప్రెడ్డి, ఎఫ్డీఓ, మహదేవపూర్ ఎన్హెచ్, బస్టాండ్, రోడ్డు అభివృద్ధి పనులకు బ్రేక్ పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు -
జయశంకర్ భూపాలపల్లి
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 20267కొండెక్కిన చేపల ధరలుమృగశిర కార్తె నాడు చేపలు తినాలనే సాంప్రదాయాన్ని పాటించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉదయం నుంచే చెరువులు, చేపల మార్కెట్ వద్ద క్యూ కట్టారు. జిల్లాలోనే అతిపెద్ద చెరువైన గణపురం మండలకేంద్రంలోని గణపసముద్రం చెరువుతో పాటు, మండలంలోని పలు కుంటలు, చెరువుల నుంచి మండలకేంద్రానికి సోమవారం చేపలను తీసుకొచ్చి పెద్దఎత్తున విక్రయించారు. సాధారణంగా తెల్లచేపలు రవ్వులు, బొచ్చ కిలో రూ.200 ఉండగా.. సోమవారం కిలో రూ.300పైన విక్రయించారు. కొర్రమీను చేపలు సాధారణంగా రూ.300 ధర ఉంటే.. మృగశిర సందర్భంగా రూ.400 నుంచి 500 వరకు విక్రయించారు. – గణపురం -
ఐటీడీఏలో వినతుల స్వీకరణ
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో 27 మంది గిరిజనుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజన సహకార సంస్థ మహదేవ్పూర్లోని గ్యాస్ గోదాంలో డెలవరీ బాయ్స్గా పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారిని నియమించాలని గిరిజన ప్రాథమిక సహకార సంస్థ డైరెక్టర్లు బుచ్చయ్య, పోచయ్య తెలిపారు. మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గిరిజనుడు 2008–09 నుంచి ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదని, దానికి కోసం నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ములుగు గ్రామంలో సంధ్యారాణి ఎంబీఏ కంప్యూటర్ పూర్తి చేసి ఉన్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన గిరిజనులు రుణం కావాలని విన్నవించారు. కార్యక్రమంలో ఎస్డీసీ ప్రతాప్, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
స్టేషన్ ఘన్పూర్లో నేడు డిప్యూటీ సీఎం పర్యటన
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలుగణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. మృగశిర కార్తె వచ్చె.. వర్షం తెచ్చె.. కాళేశ్వరం: ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం రాత్రి మహదేవపూర్, కాళేశ్వరంలో గంటన్నరపాటు వర్షం కురిసింది. మృగశిర కార్తె సందర్భంగా కురిసిన ఈ వర్షాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా 46–47 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా కురిసిన వర్షంతో మండల వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఖరీఫ్ సీజన్లో మొదటి వర్షం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కానున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు భూపాలపల్లి అర్బన్: ఘన వ్యర్థాల నిర్వహణపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, స్వచ్ఛ భారత్ మిషన్కు చెందిన 60మంది కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీపీసీబీ నోడల్ అధికారి శ్రీకాంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, తడి–పొడి చెత్త వేరుచేసే విధానం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. చెత్త రహిత గ్రామాలు, పట్టణాల నిర్మాణంలో కార్మికుల పాత్ర, పరిశుభ్రత ప్రమాణాల అమలుపై జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కో–ఆర్డినేటర్ వెంకటేష్ సూచనలు చేశారు. మున్సిపల్ పరిధిని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హేమాచలక్షేత్రంలో 11న బహిరంగ వేలంమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వాహణ హక్కులు పొందేందుకు ఈనెల 11న దేవాదాయఽ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణాధికారి వీరస్వామి సోమవారం తెలిపారు. 2026 మే 15 నుంచి 2027 జూన్ 25 వరకు సంవత్సరం పాటు కొబ్బరి కాయలు, పూజసామగ్రి విక్రయాలు జరుపుకునేందుకు 2 షాపులు, క్యాంటీన్లు 2, బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు హేమాచల క్షేత్రంలోని కల్యాణ మండపంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు కొబ్బరికాయలు, పూజ సామగ్రి ఒక్కో షాపునకు రూ.50,000, బొమ్మలు, గాజులు, క్యాంటీన్లు ఒక్కో షాపునకు రూ.25,000 చొప్పున దరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. -
అడ్మిషన్ల పెంపే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బి.బాలునాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు సదానందం, అనిల్కుమార్, రాజు, నరేష్ గొల్లబుద్దారం, చికెన్పల్లి, పంబాపూర్, అజాంనగర్, నందిగామ, దీక్షకుంట, లంబాడీతండా, పలు గ్రామాల్లో పర్యటించి విద్యార్థులు, తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా కళాశాలలో అందుబాటులో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఏసీఈసీ గ్రూపులు తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయ వసతి, స్కాలర్షిప్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. సైన్స్ విద్యార్థులకు ఆధునిక ప్రయోగశాలలతో పాటు ప్రత్యేక ఐఐటీ–జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వ పర్యవేక్షణలో అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి, నీట్, ఈఎంసెట్ పరీక్షలకు పూర్తి ఫీజు రాయితీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు పాస్ సదుపాయం, విశాలమైన భవనాలు, అనుభవజ్ఞులైన ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన విద్యాబోధన కళాశాల ప్రత్యేకతలని వివరించారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం -
అధికారులకు క్షేత్రస్థాయి అవగాహన కీలకం
భూపాలపల్లి: ప్రతి అధికారికి క్షేత్ర స్థాయి అవగాహన అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. 2025 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల శిక్షణలో భాగంగా ‘తెలంగాణ దర్శన్’ కార్యక్రమం కింద ఆరుగురు ట్రెయినీ ఐఏఎస్ అధికారులు ఆదివారం, సోమవారం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాండవులగుట్ట (రేగొండ మండలం), కేటీపీపీ(చెల్పూర్), సింగరేణి ఓపెన్కాస్ట్, భూగర్భ గనులను సందర్శించారు. రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం, సోమవారం శిక్షణా ఐఏఎస్ అధికారులు ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించిన పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలను అధికారుల బృందాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లాలో పర్యటించిన వారిలో ట్రెయినీ ఐఏఎస్లు ఇట్టబోయిన సాయి శివాణి, సచిన్ బసవరాజ్, ఎన్ శ్రీకాంత్రెడ్డి, పోతరాజు హరిప్రసాద్, పరాస్ కుమార్, సురేష్ పామూరి ఉన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రామసభలే వేదిక మల్హర్: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు గ్రామసభలు సమర్థవంతమైన వేదికగా నిలుస్తాయని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం మల్హర్ మండలం రుద్రారం గ్రామంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ గ్రామసభలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల సేద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ, సురక్షిత తాగునీటి నిర్వహణ తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వివరించారు. అందిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా వెంటనే పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ క్రాంతికుమార్, సీడీపీఓ రాధిక, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
జిల్లాకేంద్రాన్ని అభివృద్ధి చేయరా?
భూపాలపల్లి: జిల్లా కేంద్రమైన భూపాలపల్లిని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రి అస్తవ్యస్తంగా మారిందని, పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నా కనీస సౌకర్యాలు కల్పించే నాథుడే కరువయ్యాడన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అటకెక్కాయని, కార్మికుల వారసులు ప్రైవేట్ ఉద్యోగాలు, కూలీనాలీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు పోలీసులు దాసోహం అయ్యారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్కు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాలకే పరిమితం అయ్యాయన్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సెగ్గెం సిద్ధు, పిల్లలమర్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్వానంగా జిల్లా ఆస్పత్రి అటకెక్కిన సింగరేణి వారసత్వ ఉద్యోగాలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
భారీగా ఎస్సైల బదిలీలు
భూపాలపల్లి: జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్బీ ఎస్సైగా పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ను కాటారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న జె.మహేష్ను కాటారం ఎస్సై 2గా, మహాముత్తారం ఎస్సై పి.మహేందర్కుమార్ను కొయ్యూరుకు, వీఆర్లో ఉన్న ఎ.కల్యాణ్ను కొయ్యూరు ఎస్సై 2, భూపాలపల్లి ఎస్సై 2 జి.రమేష్ను మహాముత్తారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న సాయి శశాంక్ను పలిమెల ఎస్హెచ్ఓ, భూపాలపల్లి ఎస్సై 1 మచ్చ సాంబమూర్తిని మహదేవపూర్ ఎస్హెచ్ఓగా, పలిమెల ఎస్సై జె.రమేష్ను మహదేవపూర్ ఎస్సై 2, మహదేవపూర్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్న కె.పవన్కుమార్ను భూపాలపల్లి ఎస్సై 1, కొయ్యూరు ఎస్హెచ్ఓగా ఉన్న వి.నరేష్ను డీఎస్బీకి, వేకెన్నీ రిజర్వ్లో ఉన్న వి.రజన్కుమార్ను చిట్యాల ఎస్సై 2గా, ఆర్.అశోక్, ఎ.శ్రీనివాస్లను డీఎస్బీకి, ఈ.సురేష్ను డీసీఆర్బీ, చిట్యాల ఎస్సై 2గా పని చేస్తున్న ఎండీ షాఖాన్ను వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. 15 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ -
గుట్కా జోరు
భూపాలపల్లి అర్బన్: నిషేధిత గుట్కా వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రభుత్వం గుట్కా విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినప్పటికీ ఇక్కడి కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా నల్లబజారులో దందాను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తూ స్థానిక కిరాణషాపులు, పాన్ డబ్బాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు అప్పుడప్పుడు నామమాత్రపు దాడులు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ అక్రమవ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదు. అధికారుల లీలలు, మాఫియా నెట్వర్క్ కారణంగా జిల్లాలో యువత గుట్కా వ్యసనానికి బానిసవుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటుంది. ఎక్కడా తగ్గలే.. జిల్లాకేంద్రంతో పాటు కాటారం, మహదేవపూర్, మల్హర్, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపు రం, రేగొండ తదితర మండలాల్లో గుట్కా విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి గ్రామీణ ప్రాంతాల కిరాణా షాపుల వరకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు సులభంగా లభిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా విక్రయాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి జిల్లాలో విక్రయమవుతున్న గుట్కా ఉత్పత్తులలో ఎక్కువ భాగం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా రహస్యంగా జిల్లాకు చేరుతున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం భూపాలపల్లి సీసీఎస్ పోలీసులు ట్రాన్స్పోర్ట్ వాహనంలో వచ్చిన ఆరు నిషేధిత గుట్కా సంచులను పట్టుకున్నారు. సాధారణ సరుకుల మధ్య గుట్కా కార్టన్లను దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ వాహనాలు, చిన్న సరుకు రవాణా వాహనాలను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. అక్రమ రవాణాదారులు తనిఖీలను తప్పించుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని, రాత్రి వేళల్లో ఎక్కువగా సరఫరాలు జరుగుతున్నాయని తెలిసింది. జిల్లా కేంద్రంతో పాటు కాటారం, మహదేవపూర్లకు చేరిన తర్వాత చిన్న వ్యాపారుల ద్వారా గ్రామాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటి క్యాన్సర్, దంత సమస్యలు.. గుట్కా వినియోగం కారణంగా యువతలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్, దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలకు గుట్కా ప్రధాన కారణంగా మారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు సులభంగా గుట్కాకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ ధరలో లభించడం, సులభంగా అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుట్కా వినియోగం పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఈ వ్యసనం ప్రతికూల ప్రభావం చూపుతోందని అంటున్నారు. నిషేధం కాగితాలకే పరిమితమా..? ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం మానవ ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్ధాల తయారీ నిల్వ పంపిణీ, విక్రయాలు నిషేధించింది. గుట్కా విక్రయాలపై ప్రభుత్వం పలుమార్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటి అమలు విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆహార భద్రత శాఖ, పోలీస్ శాఖ, ఇతరశాఖల అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అక్రమ వ్యాపారం కొనసాగుతుండటం పర్యవేక్షణలో లోపాలను సూచిస్తోంది. జిల్లాలో గుట్కా అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి ట్రాన్స్పోర్ట్ కేంద్రాలు, గోదాములు, హోల్సేల్ వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి గుట్కా సరఫరా దందాలో ఉన్న ప్రధాన నిర్వాహకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం విధించిన నిషేధం అధికారులు సమర్థవంతంగా అమలుచేయాలి నిషేధం అమలు కావాలంటే సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెరగాలి నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక దాడులు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుట్కా విక్రయాలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలి నిషేధం ఉన్నా బహిరంగంగానే వ్యాపారం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నుంచి భారీగా దిగుమతి అధికారుల నామమాత్రపు దాడులు యువత భవిత బుగ్గిపాలు -
గుట్కా, పొగాకు ఆరోగ్యానికి హానికరం
గుట్కా, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే నికోటిన్ కారణంగా వ్యసనం పెరిగి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నోటిలో పుండ్లు, తెల్లటి మచ్చలు, నోరు తెరవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. యువత గుట్కా, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. – డాక్టర్ వెంకటరత్నం, ప్రొఫెసర్ ఈఎన్టీ, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి -
ఫిట్నెస్పై కదలట్లే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బస్సులు, వ్యాన్లలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థుల ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్ చేయించుకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 33.43 శాతం బస్సులు ఇంకా సామర్థ్య పరీక్షల నిర్ధారణ (ఫిట్నెస్) సర్టిఫికెట్లు పొందలేదు. సోమవారం (జూన్ 1) నాటికి 820 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నాయి. ఫిట్నెస్ నత్తనడకపై సాక్షి కథనం.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ నత్తనడకన నడుస్తోందని ‘సాక్షి’ వారం కిందటే కథనం రూపంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. వారిలో పెద్ద కదలిక లేకపోవడం, ఇటు స్కూల్ యాజమాన్యాలు కూడా మాములుగా తీసుకోవడంతో వారం రోజుల్లో 125 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేశారు. ఇంకా 693 బస్సులకు బీమా, పర్మిట్లు, కాలుష్య ధ్రువపత్రాలు సైతం నవీకరించకపోయినా అధికారులు కఠిన చర్యలకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, చర్యలు ఇంకెప్పుడు..? హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం విద్యార్థుల రవాణాకు బస్సులు, వ్యాన్లు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణా శాఖ, పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. కానీ పాఠశాలలు తెరుచుకునే సమయం దగ్గరపడుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరగలేదని తెలుస్తోంది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో మొత్తం 2,079 స్కూల్ బస్సులు, వ్యాన్లు ఉంటే.. శనివారం నాటికి 1,386 వాహనాలకే సామర్థ్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. 693 బస్సులకు ఇంకా ఫిట్నెస్ నిర్వహించలేదు. హనుమకొండ జిల్లాలో 348, వరంగల్లో 172, మహబూబాబాద్లో 43, జనగామలో 75, జేఎస్ భూపాలపల్లిలో 28, ములుగులో 27 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది తనిఖీల్లో అరిగిపోయిన టైర్లు, పని చేయని ఎమర్జెన్సీ డోర్లు, గడువు ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విస్టర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడం, జీపీఎస్ పరికరాలు పనిచేయకపోవడం, స్పీడ్ గవర్నర్లు లేకపోవడం వంటి ప్రధాన లోపాలను గుర్తించి సరిచేశారు. ఈసారి 693 బస్సులు ఇంకా ఫిట్నెస్కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ తోపాటు డ్రైవర్ తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. క్లీనర్తోపాటు మిగతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు. – నాగలక్ష్మి, ఎంవీఐ, హనుమకొండ గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారుకొన్ని పాఠశాలల నిర్వాహకులు ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇక్కడ తనిఖీలు ఎక్కువ జరగవని, ఎవరూ పట్టించుకోరని నడుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే అధికారులు తనిఖీలు నిర్వహించాలి. – నద్దునూరి నాగరాజు, పేరెంట్ సీరియస్గా తీసుకోని స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులు ఉమ్మడి జిల్లాలో 2,079 స్కూల్ బస్సులకు 1,386కే సామర్థ్య పరీక్షలు వారంలో 125 బస్సులకే ఫిట్నెస్.. ఇంకా ఫిట్నెస్ లేనివి 33.43 శాతం వారంలో తెరుచుకోనున్న స్కూళ్లు.. తనిఖీలు, చర్యలపై మీనమేషాలుఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా... స్కూల్ బస్సులు : 2,079 ఫిట్నెస్ చేసినవి : 1,386 చేయించుకోనివి : 693 -
పూజల నిర్వహణ ఎక్కడ?
● 17న కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభం ● షాపింగ్ కాంప్లెక్సు నిర్వాహకుల ఆందోళన కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులకు ఈనెల 17న ముహూర్తం ఖరారు కావడంతో భక్తులు, ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం దేవస్థానానికి రూ.198కోట్ల వ్యయంతో రాతి నిర్మాణం పనులు చేపడుతుండగా, ప్రస్తుత గర్భాలయంతో పాటు పలు ఉప ఆలయాల తొలిగింపు ప్రక్రియ జరుగనుంది. దీంతో గర్భాలయంలోని జోడు లింగాలకు తమిళనాడులోని శిల్పులు కొలతలు తీసుకున్నారు. వాటిని యధాస్థితిలో ఉంచి నిర్మాణ సమయంలో ప్రమాదం లేకుండా పైన కప్పులాగా నిర్మించనున్నారు. అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం ఏర్పాటు కానుందని తెలిసింది. అక్కడే పూజలు నిర్వహణ జరుగుతుందని తెలిసింది. కానీ శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు ప్రతీ మంగళవారం నిర్వహిస్తారు. శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహిస్తుంటారు. ఆలయ పునరుద్ధరణ నేపథ్యంలో పూజలు ఎక్కడ నిర్వహిస్తారనేది భక్తులు, స్థానికుల్లో ఆందోళనలు కలుగుతున్నాయి. కాలసర్ప, శనిపూజలు వీఐపీఘాటులో ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భక్తులు నేరుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి అక్కడే పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలా కాకుండా ఆదిముక్తీశ్వరాలయం వద్ద శని, కాలసర్ప నివారణ పూజలు చేసే వీలు కల్పిస్తారా అనేది ఈ నెల 10వ తేదీ వరకు దేవాదాయశాఖ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. కాళేశ్వరం దేవస్థానం పరిధిలోని షాపింగ్ కాంప్లెక్సు తొలగించనున్న కారణంగా ఆయా షాపుల సముదాయాల్లో వివిధ దుకాణాలు, బొమ్మలు, మనియార్, పూలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి, హోటళ్లు నిర్వహణకు ప్రతియేటా రూ.కోటికి పైగా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద దుకాణాలు ఎలా కేటాయిస్తారో అని ఎదురు చూస్తున్నారు. వీఐపీ ఘాటు వద్ద శని, కాలసర్ప పూజలు ఏర్పాటు చేస్తే దుకాణాల నిర్వహణ రెండు చోట్ల ఏర్పాటు చేసే వీలున్నట్లు సమాచారం. దీంతో దుకాణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. పునరుద్ధరణతో ఏమైనా కాల వ్యవధి పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
భూ తగాదాతో వ్యక్తిపై కత్తితో దాడి
చిట్యాల: భూ తగాదాల విషయంలో ఒకరిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఎండీ.రాజ్మహ్మద్కు అదే గ్రామానికి చెందిన చిగురు నరేష్కు మధ్య గతంలో భూతగాదాల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం గ్రామ శివారులో ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన నరేష్ కత్తితో రాజ్మహ్మద్పై దాడిచేయడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన గ్రామస్తులు రాజ్మహ్మద్ను సివిల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు అఫ్జల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. కేయూ బాటనీ విభాగం అధిపతిగా మమత కేయూ క్యాంపస్: కేయూ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్వర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఒకరికి అవకాశం? యూనివర్సిటీలోని బాటనీ విభాగంలో ఒక్కరు రెగ్యులర్ ఫ్రొఫెసర్, ఐదుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్నే బాటనీ విభాగం అధిపతిగా నియమిస్తారా అనేది యూనివర్సిటీలో చర్చనీయాంశమైంది. సీనియారిటీని పరిగణనలోనికి తీసుకొని విభాగం అధిపతిగా ఒక కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను నియమించాలని వీసీ, రిజిస్ట్రార్ను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోరినట్లు సమాచారం. నేటి నుంచి కేయూ దూరవిద్య పీజీ సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ ఎంఏ, ఎంకామ్, హెచ్ఆర్ఎం, జేఎంసీ, ఎమ్మెస్సీ కోర్సుల (2023–24 బ్యాచ్) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 2,354 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. హేమాచల క్షేత్రంలో కోలాహలంమంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. -
నేడు మృగశిర కార్తె..
ఏటూరునాగారం: నేటి మృగశిర కార్తెకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సంప్రదాయకంగా రుతుపవన వర్షాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె రోజు చేపలను తింటే అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజలు భావిస్తుంటారు. అందుకని మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపలు పట్టి విక్రయించడానికి వలలు సిద్ధం చేసుకున్నారు. నేడు(సోమవారం) ఉదయం నుంచే చేపలు అమ్మడానికి ఏటూరునాగారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ వద్దకు చేపలను తరలించడంతో పాటు ఓడవాడ, రామన్నగూడెం, రాంనగర్, జెడ్పీహెచ్ఎస్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా చేపల విక్రయదారులు ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
గ్యాస్ ‘బండ’ మోత
కనెక్షన్ల వివరాలు భూపాలపల్లి: సామాన్యుడి వంటగదిలో మరోమారు ‘గ్యాస్’ మంటలు రేగాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సతమతం అవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారాల వడ్డన వదిలింది. గృహావసరాలకు వినియోగించే(డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను ఆదివారం నుంచే రూ.29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో వినియోగదారులు ఒక్కసారిగా బిత్తెరపోయారు. మూడు నెలల్లోనే రెండోసారి.. మూడు నెలల క్రితం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 మేర పెంచి షాక్ ఇచ్చింది. ఆ భారం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు మరోమారు రూ.29 పెంచింది. తాజా పెంపుతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.1,013కు చేరుకుంది. సిలిండర్ ధర రూ.వేయి దాటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ప్రజలపై భారం.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు ప్రభావం జిల్లాపై తీవ్రంగా పడనుంది. జిల్లాలో హెచ్పీ, భారత్, ఇండేన్ గ్యాస్ కంపెనీలకు చెందిన డొమెస్టిక్ కనెక్షన్లు మొత్తం 1,31,426 ఉన్నాయి. ఆదివారం పెరిగిన రూ.29 ధరతో పోల్చి చూస్తే.. జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై నెలకు ఏకంగా రూ.38,11,354 అదనపు భారం పడనుంది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు గ్యాస్ బిల్లు కూడా పెరగడంతో నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతుందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – నునావత్ విజయ, గృహిణి, మహాముత్తారం హెచ్పీ 49,345ఇండేన్ 43,106భారత్ 38,975మొత్తం 1,31,426 మళ్లీ పెరిగిన సిలిండర్ ధర రూ.29 పెంపుతో రూ.1,013 జిల్లా ప్రజలపై నెలకు రూ.38,11,354 భారం -
అంబర్, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
భూపాలపల్లి: జిల్లాకేంద్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను సీసీఎస్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లికి చెందిన యూసఫ్ వద్ద నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించి రూ. 1.92 లక్షల విలువైన అంబర్తో పాటు వివిధ రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ వెల్లడించారు. -
నకిలీ భయం
పత్తిసాగుపై నిషేధిత బీటీ 3 నీడ భూపాలపల్లి: వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే తరుణంలో అక్రమార్కులు మళ్లీ కోరలు చాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిషేధించిన బీటీ–3 (హెచ్టీబీటీ–హెర్బిసైడ్ టొలరెంట్ బీటీ) పత్తి విత్తనాలు, ప్రాణాంతక గ్లైఫోసెట్ గడ్డిమందు మార్కెట్లోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించనున్నాయి. గతేడాది నూజివీడు లింకులు బహిర్గతం.. గతేడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాల్లో నిషేధిత బీటీ–3 విత్తనాలు, గ్లైఫోసెట్ గడ్డిమందు భారీస్థాయిలో పట్టుబడటం సంచలనం సృష్టించింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ దందాను పోలీసు అధికారులు ఛేదించారు. మహాముత్తారం మండలంలోని మీనాజిపేటలో 250 గ్రాముల బీటీ పత్తి విత్తనాలు దొరికాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరాతీయగా తీగ లాగితే డొంకంతా కదిలింది. కాటారం మండలంలో గ్లైఫోసెట్ దొరకగా, మల్హర్ మండలం రుద్రారంలో ఏకంగా 2 క్వింటాళ్ల బీటీ 3 పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి ఫర్టిలైజర్ షాపుల యజమానులతో కలిసి నూజివీడు నుంచి బీటీ 3 విత్తనాలను ట్రాన్స్పోర్ట్లో వేసి పంపినట్లు తేలింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులపై కేసులు నమోదైనప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జిల్లాలోని వందలాది మంది అమాయక రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశారు. చివరకు మొలకలు రాక, పంట దెబ్బతిని, తాము కొన్నది నకిలీ విత్తనాలు అని తెలుసుకునే సరికి పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అడ్డుకట్ట పడేనా.. గతేడాది కాటారం డివిజన్లో ఈ అక్రమ దందా బహిర్గతం అయినప్పటికీ భూపాలపల్లి డివిజన్లో సైతం ప్రతీ ఏటా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఏడాదైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విక్రయాలకు అడ్డుకట్ట పడేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. బీటీ 3తో తీవ్ర నష్టం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బీటీ 2 విత్తనాలు కేవలం పురుగులను మాత్రమే తట్టుకుంటాయి. బీటీ–3 (హెచ్టీబీటీ) విత్తన జన్యువును ఎలా మారుస్తారంటే.. పొలంలో గడ్డి మొలవకుండా కొట్టే గ్లైఫోసెట్ అనే శక్తివంతమైన కెమికల్ను కూడా ఈ పత్తి మొక్క తట్టుకోగలదు. గ్లైఫోసెట్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అంతేకాక పర్యావరణం సైతం తీవ్రంగా దెబ్బతింటుంది. మానవ మనుగడకే ప్రమాదకరం అయినందున కేంద్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అవగాహన సదస్సులు ఏవి? గతేడాది తరహాలో జిల్లాలోని రైతులు మోసపోయారు. ఈసారి మోసపోకుండా ఉండేందుకు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మండల, జిల్లాస్థాయి అధికారులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గతేడాది వెలుగుచూసిన నూజివీడు లింకులు ఈ ఏడాదైనా అడ్డుకట్ట పడేనా? తనిఖీల కోసం టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. నీట్ నిర్వహణ, ధాన్యం కొలుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ఆంశాలపై శనివారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో భద్రత, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ప్రశ్నపత్రాల సురక్షిత రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెల 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మహిళా సంఘాల సభకు జిల్లాల నుంచి మహిళలను సురక్షితంగా తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లా నుంచి వెళ్లే మహిళా సంఘాల సభ్యులకు రవాణా, తాగునీరు, ఆహారం, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
అభివృద్ధి జపం.. చెట్టు కింద సభ
గ్రామ పంచాయతీల బలోపేతమే తమ లక్ష్యమని.. గ్రామాల అభివృద్ధే ముఖ్యమని పాలకులు రోజూ చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. చిట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లిలో గ్రామ పంచాయతీకి స్థలంతో పాటు భవనం లేకపోవడంతో శనివారం మండల అధికారులు పోచమ్మతల్లి దేవాలయం చెట్టు నీడన గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన గ్రామసభ.. సొంత భవనం లేక చెట్టునీడన సాగడం స్థానిక స్వపరిపాలన దయనీయ స్థితికి అద్దం పడుతోంది. అధికారులు గ్రామపంచాయతీకి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలని సర్పంచ్ కొడారి అశోక్ కోరారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తహసీల్దార్ వసంతరావు తెలిపారు. – చిట్యాల -
మండుటెండలో ఉపాధి కష్టం
భానుడు భగ్గుమంటున్నా ఉపాధి హామీ పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కూలీలకు కనీసం గుక్కెడు తాగునీరు, కాసేపు సేదదీరేందుకు టెంట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మహాముత్తారం మండలంలోని మహాముత్తారం, పెగడపల్లి, బోర్లగూడెం గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. శనివారం పెగడపల్లి గోరుకల కుంటలో పూడికతీత పనులు చేపడుతున్న ఉపాధిహామీ కూలీలకు తాగునీరు, నీడకోసం టెంట్, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీ కిట్టు సౌకర్యాలేవీ కల్పించలేదు. ఎండతీవ్రతను తట్టుకునేందుకు అక్కడే ఉన్న చెట్టునీడన కూలీలు సేదదీరారు. – మహాముత్తారం -
కుర్చీలో సర్పంచ్.. క్షేత్రంలో కూలీ
రాజకీయాల్లో చిన్న పదవి దక్కినా చాలు.. రంగులు మార్చే నాయకులు, కార్లలో తిరిగే ప్రజాప్రతినిధులు ఉన్న రోజులివి.. ఒక ఊరికి సర్పంచ్ అంటే ఆ గ్రామ పథమ పౌరురాలు. రూ.కోట్ల నిధులు, గ్రామాన్ని శాసించే అధికారం చేతిలో ఉంటాయి. కానీ ఇవేమీ మహాముత్తారం మండలం పెగడపల్లి సర్పంచ్ కొర్ర వినోదను మార్చలేదు. 2019 ఒకసారి, 2025లో మరోసారి రెండుసార్లు సర్పంచ్ అయినా బతుకుదెరువు కోసం మండు టెండలో ఉపాధి హామీ పనులకు కూలీలతో కలిసి వెళ్తోంది. సర్పంచ్ పదవి కేవలం ప్రజలకు సేవచేసే మార్గంగానే భావించిన ఆమె నిప్పులు కురుస్తున్న ఎర్రటి ఎండలో సైతం కుటుంబ జీవనం కోసం ఉపాధి పనులకు వెళ్తోంది. – మహాముత్తారం -
19న కిసాన్ మేళా
భూపాలపల్లి రూరల్: ఈ నెల 19న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్మేళా ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను చర్చించనున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కిసాన్ మేళాను విజయవంతం చేయాలని కోరారు. ఆదిముక్తీశ్వరాలయంలో దర్శనాలు? కాళేశ్వరం: ఈ నెల 17న కాళేశ్వరం దేవస్థానంలో శంగేరి పీఠం శిష్య బృందం ఆధ్వర్యంలో కళాపకర్షణ క్రతువు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా కొత్త రాతి నిర్మాణాలు, పాత దేవాలయాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలకు అంతరాయం కలగనున్నందున భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేందుకు దేవాదాయ శాఖ అడవి ప్రాంతంలో ఉన్న ఆది ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులు అక్కడే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలయంలో ఒకే పాన వట్టంపై ఉన్న జోడు లింగాలకు (శివుడు, యముడు) ప్రమాదం లేకుండా పై కప్పు నిర్మిస్తున్నారు. దర్శనాల ఏర్పాట్లు, సమయాలు ఇతర వివరాలపై దేవస్థానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రేగొండ: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండలంలోని కనిపర్తి గ్రామ శివారులో శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్లు కౌటం ప్రశాంత్, పున్నం రమేష్, కుర్రే కిరణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోదావరిలో తగ్గుతున్న నీటిమట్టం కన్నాయిగూడెం: గోదావరిలో నీరు తగ్గుముఖం పడుతుండడంతో సమ్మక్కసాగర్ బ్యారేజీ ఎగువన బండలు తేలి బయట కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీటిని సమ్మక్కసాగర్ గేట్లు ఎత్తి నీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదులుతుండడంతో బ్యారేజీ ఎగువన నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో గోదావరిలో ఉన్న బండరాళ్లు బయట పడ్డాయి. బ్యారేజీ నిర్మాణం సమయంలో నీటిని మళ్లించి నిర్మాణాలు చేయాలని గోదావరికి అడ్డుగా కాఫర్ డ్యామ్ను బండరాళ్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో పాటు గోదావరిలోకి భారీగా వరదలు వచ్చి చేరడంతో అక్కడే ఉండిపోయింది. దీంతో నీరు తగ్గడంతో గోదావరి పొడవున బండరాళ్లు రోడ్డుమాదిరిగా కనిపిస్తున్నాయి. కాజీపేట మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్పర, రాయ్పూర్, దుర్గ్, వాడ్స, చాంద్ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయ్చూర్, మంత్రాలయం రోడ్డు, గుంతకల్, గూటి, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెలహంకలో హాల్టింగ్ కల్పించారు. -
రామప్ప ఆలయంలో ట్రెయినీ ఐఏఎస్లు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం ట్రెయినీ కలెక్టర్లు సాయి శివాని, సచిన్ బసవరాజ్, నీలటూరు శ్రీకాంత్ రెడ్డి, పోతరాజు హరిప్రసాద్, పారస్ కుమార్, పామూరి సురేశ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో వారిని ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం అధికారి సూర్యకిరణ్, గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. వారి వెంట తహసీల్దార్ గిరిబాబు, ఆర్ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, పురావస్తు శాఖ సిబ్బంది ఉన్నారు. రామప్ప ఆలయాన్ని జపాన్కు చెందిన నాకాలిబోర్, షిగా దంపతులు సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
లైసెన్సులు రద్దు చేస్తాం..
బీటీ 3 విత్తనాలు, గ్లైఫోసెట్ మందులు విక్రయించే ఫర్టిలైజర్ షాపుల లైసెన్సులు రద్దు చేస్తాం. పీడీ యాక్ట్లు నమోదు చేయిస్తాం. రైతులు రసీదులు లేకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవద్దు. లూజు విత్తనాల జోలికి పోవద్దు. పత్తిసాగులో బీటీ 2 విత్తనాలను మాత్రమే వాడండి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, నకిలీ ఎరువులు, పర్యావరణాన్ని దెబ్బతీసే గ్లైఫోసెట్ వంటి మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంలను మండలానికి ఒకటి ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. – సిరిశెట్టి సంకీర్త్, ఎస్పీ -
రేగొండలో పలు షాపుల తనిఖీ
రేగొండ: మండలకేంద్రంలోని పలు షాపులను తహసీల్దార్ శ్వేత, ఎస్సై సుధాకర్, ఏఓ వాసుదేవారెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్వేత మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తన డీలర్లు విధిగా స్టాక్ వివరాలు, ధరల పట్టిక రోజు వారిగా నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలను లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచి కొనుగోలు చేసి రశీదు పొంది రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. -
మహిళా సాధికారతే ధ్యేయం
భూపాలపల్లి రూరల్: మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం భూపాలపల్లి మండలం గుర్రంపేట రెవెన్యూ పరిధిలోని గుర్రంపేట, రామ్ నాయక్ తండా, పెద్దాపూర్, బావుసింగ్పల్లి, సుబ్బక్కపల్లి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి గుర్రంపేటలో ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ రాహుల్ శర్మ, ఐడీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నాలుగు రోజులలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో లక్షకు పైగా పెన్షన్లు అందించామని, రాబోయే రోజుల్లో మరో రెండు నుంచి మూడు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రామ్నాయక్ తండా పేరు మార్పు అంశంపై గ్రామసభ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అమలుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రజాదర్బార్లో దరఖాస్తుల స్వీకరణ -
మాదక ద్రవ్యాలతో ముప్పు
భూపాలపల్లి అర్బన్: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత ప్రాణాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని సీసీఎస్ ఎస్సై రమేష్ తెలిపారు. సీసీఎస్, షీ టీంల ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలో వేర్వేరుగా మెడికల్ కళాశాల, ఐటీ మాస్టర్స్ కంప్యూటర్స్, ఆర్టీసీ బస్టాండ్లలో మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో సీసీఎస్ ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. ఉద్యోగాలు, విద్య వివాహాల పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికల ద్వారా వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దన్నారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారంం తెలిసిన, ఆడ పిల్లలకు ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను సమాచారం అందించాలని సూచించారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
కీలక పోస్టులు ఖాళీ
ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రస్తుతం పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలక పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడంతో గిరిజనుల సంక్షేమం కుంటుపడుతోంది. దీనిపై పాలకులు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఖాళీలు ఏం ఉన్నాయంటే.. ఏటూరునాగారం ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న నాగోరావు గతనెల 31న పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. ఐటీడీఏ పరిపాలన అధికారిగా పనిచేసే రాంబాబు గతేడాది డిప్యూటేషన్పై భద్రాచలం ఐటీడీఏకు వెళ్లారు. అప్పుడు ఎస్ఓగా రాజ్కుమార్కు ఏఓ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజ్కుమార్ బదిలీపై ఉట్నూరు వెళ్లడంతో ఏఓ పోస్టు ఖాళీగా ఉంది. భద్రాచలంలో పనిచేస్తున్న ఏఓ రాంబాబు డిప్యూటేషన్ రద్దు చేసి ఐటీడీఏకు తిరిగి రప్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. ఎస్ఓ రాజ్కుమార్ బదిలీ కావడంతో ఎస్ఓ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాయంలో పనిచేస్తున్న డీటీ(డిప్యూటీ తహశీల్దార్) కిశోర్ను కన్నాయిగూడెం తహశీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపించారు. కన్నాయిగూడెంలో రెగ్యులర్ డీటీ వచ్చినప్పటికీ ఐటీడీఏ నుంచి వెళ్లిన డీటీ డిప్యూటేషన్ను రద్దు చేయకపోవడంతో ఐటీడీఏలో ఎస్డీసీ కార్యాలయంలో డీటీ పోస్టు ఖాళీగా ఉంది. ఇలా అనేక కీలక పోస్టుల్లోని అధికారులు బదిలీలు, డిప్యూటేషన్లలో ఉండడంతో కార్యాలయం పనితీరు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ఐటీడీఏ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏలో ఇన్చార్జ్ అధికారులు డిప్యుటేషన్లో కొందరు.. బదిలీలో మరికొందరు.. పట్టించుకోని పాలకులు, అధికారులు -
ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ‘జీరో హార్మ్’ లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. కేటీకే ఓసీ 2 ప్రాజెక్ట్లో శనివారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తతతో విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్సుందర్, ఏరియా రక్షణాధికారి మాటూరి రవీందర్, ఆఫీషియేటింగ్ ఏరియా ఇంజనీర్ వాల్మీకి కృష్ణయ్య, మేనేజర్ బోయిన రామాకాంత్, సంక్షేమ అధికారి సాధన్, రక్షణ అధికారి శివకుమార్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అప్పుడే.. బాగుండె!
నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలుకాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకర్ 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. నేడు మూతబడిన కార్డియో థొరాసిక్ యూనిట్.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ యూనిట్లో గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థొరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు. -
నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైతులను మోసంచేసే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీఎస్ టీం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీ చేసిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలోని ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాఖల సమన్వయం కీలకం.. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
చదువుకు కొదవలేదు..
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026రూపాయి ఖర్చులేదు.. సర్కారు బడి.. పిలుస్తోంది ఈ రోజుల్లో చదువు అనగానే కార్పొరేట్ పాఠశాలల చుట్టూ తిరగడం, రూ.వేలల్లో ఫీజు కట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. ఫీజులు ఎక్కువగా ఉంటేనే చదువు బాగా వస్తుందనేది భ్రమ మాత్రమే. మన కళ్ల ముందు మన ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రమూ తీసిపోకుండా అన్నీ వసతులతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మన పిల్లలను మన ప్రభుత్వ బడిలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. – భూపాలపల్లి అర్బన్ అర్హత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు కఠినమైన డీఎస్సీ, టెట్ పరీక్షలు రాసి అత్యుత్తమ నైపుణ్యంతో ఎంపికై న విద్యావంతులు. వీరు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని బోధించే అవకాశం ఉంటుంది. మారుతున్న బోధన, అభ్యాసన విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించారు. ముందుగానే ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించి 6 నుంచి 10వ తర గతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆధునిక వసతులు డిజిటల్ క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, అత్యాధునిక సైన్స్ ప్రయోగశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిశోధనల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. జాతీయ, సైన్స్ పరిశోధన అంశాలు ప్రదర్శించేందుకు ఇన్స్ఫైర్ అవార్డుల పథకంలో పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తున్నారు. ఇది కాకుండా పాఠశాల తరఫున వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు విద్యాశాఖ ప్రోత్సహిస్తోంది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పేద విద్యార్థులు రోజూ బడికి వచ్చేలా తీసుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే బాధ తప్పింది. ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారం అందించే అవకాశాలు ఉన్నాయి. రెండు జతల యూనిఫాం.. 1 నుంచి 8 వతరగతి విద్యార్థులకు యేటా రెండు జతల యూనిఫాంలను విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. పాఠశాల ఇంటికి మూడు కిలోమీటర్ల పైన దూరం ఉండి రవాణా సౌకర్యం లేకపోతే 6, 7, 8వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.250 చొప్పున ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విశాలమైన క్రీడా మైదానాలు ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు విశాలమైన మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా పరికరాలు ఉండటంతో విద్యార్థులకు క్రీడల్లో నైపుణ్యం సాధిస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ చూపితే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన విద్యార్థులకు అన్నీ ఉచితమే మధ్యాహ్న భోజనం, యూనిఫాం, విశాలమైన ఆటస్థలాలు -
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి
● ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మభూపాలపల్లి రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాకేంద్రంలోని మైసమ్మ ఆలయం, ప్రధాన రహదారి వద్ద పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, వర్షపాతం పెరగడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి భూపాలపల్లి అర్బన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రతి వ్యక్తి తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సృజన కుమారి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అధికారులు ఏర్పాట్లు చేయాలి
● నేటి ప్రజాదర్బార్కు మంత్రి సీతక్క ● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: నేడు(శనివారం) భూపాలపల్లి మండలంగుర్రంపేటలో జరుగనున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గుర్రంపేట గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) నిర్వహించనున్న ప్రజాదర్బార్ కార్యక్రమ ఏర్పాట్ల్లపై శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తుదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు, ఇతర అంశాలకు సంబంధించి మరొక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ములుగు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు వారి వారి సమస్యల దరఖాస్తులు లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫెరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన డీటీఓ.. జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ)గా వెంకన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ సుందర్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘చల్వాయి’కి రాష్ట్రస్థాయి గుర్తింపు
గోవిందరావుపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మండలంలోని చల్వాయి గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు లభించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చల్వాయి గ్రామ పంచాయతీ చేపట్టిన తడి–పొడి చెత్త సేకరణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ హిత కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు, గ్రామ సుందరీకరణ పనులను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాధసుదర్శన్ మాట్లాడుతూ చల్వాయి గ్రామాన్ని పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారం, పంచాయతీ సిబ్బంది కృషి, ప్రజాప్రతినిధుల సమష్టి ప్రయత్నాల ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు. ఈ గుర్తింపు గ్రామాభివృద్ధికి మరింత ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్నగర్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రతిభ చాటేందుకు ఉత్తమ వేదిక
● ఎంపీ డాక్టర్ కడియం కావ్య ● అంతర్జిల్లా బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభంభూపాలపల్లి అర్బన్: ప్రతిభను చాటుకునేందుకు క్రీడలు ఉత్తమ వేదిక అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 11వ యూత్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించిన ఎంపీ బాస్కెట్బాల్ గోల్ వేసి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, బాస్కెట్బాల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, జెన్కో సీఈ ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, క్రీడా అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
భద్రతకు అత్యంత ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఏరియాలోని కేటీకే–1 గనిలో గురువారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, పనిస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సింగరేణి నిర్దేశించుకున్న జీరో హార్మ్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అప్రమత్తతతో విధులు నిర్వహించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ మాటూరి రవీందర్, ఏరియా ఇంజనీర్ రాజారావు, కేటీకే–1వ గని మేనేజర్ ప్రవీణ్ విక్రమ్, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి -
పారదర్శకంగా రవాణా ప్రక్రియ
మల్హర్(కాటారం): ధాన్యం రవాణా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోకుమార్ అన్నారు. గురువారం కాటారంలోని ఏఎంసీ గోదాం, రుద్ర కాటన్ మిల్లు, మీనాక్షి జిన్నింగ్ మిల్లును అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం దిగుమతి సమయంలో ఆలస్యం జరగకుండా సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత ఇన్చార్జ్లను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం, నిల్వలు చేపట్టాలన్నారు. గోదాంలలో సరైన వసతులు కల్పించడం, తగిన భద్రతా చర్యలు తీసుకోవడం, ధాన్యం నాణ్యతను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం రాములు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
ఇందిరమ్మ ఇల్లు తొలగించారు!
● పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం మల్హర్(కాటారం): గతంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ తాజా గ్రామసభలో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలో తన పేరు తొలగించారని శ్రీనివాస్గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో కాటారం మండలం ఉండ్రాతుపల్లి గ్రామపంచాయతీ గ్రామసభలో గందరగోళం నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. గత జాబితాలో ఇందిరమ్మ ఇల్లు ఉండి ఇప్పుడు తొలగించారని శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామసభలోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు శ్రీనివాస్ను అడ్డుకుని ప్రమాదం జరగకుండా కాపాడారు. మంత్రి శ్రీధర్బాబు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆయిల్పామ్ తోట దగ్ధం మొగుళ్లపల్లి: అగ్ని ప్రమాదంలో ఏడెకరాల ఆయిల్పామ్ తోట దగ్ధమైన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన రైతు పోలినేని లింగారావుకు చెందిన ఆయిల్పామ్ తోటకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. గాలికి మంటలు వ్యాపించి ఏడెకరాలకు విస్తరించింది. మంటలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో తోటతో పాటు మామిడి చెట్లు, వ్యవసాయ క్షేత్రంలోని డ్రిప్ పైప్లైన్స్ ఇతర వ్యవసాయ పనిముట్లు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని రైతు లింగారావు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.7లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. వేగవంతం చేయాలి చిట్యాల: సాదాబైనామాను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సాదాబైనామాలో భూముల వివరాలు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల భూసమస్యలను ఆలస్యం కాకుండా సిబ్బంది విచారణ చేసి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల తహసీల్దార్లు వసంతరావు, సునీత, స్వరూపరాణి, చిట్యాల డిప్యూటీ తహసీల్దార్ అనిల్, ఆర్ఐ రాజేందర్ పాల్గొన్నారు. భర్త వేధింపులతో ఆత్మహత్య గణపురం: భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలకేంద్రానికి చెందిన కోలెపాక శంకర్(47) అదే గ్రామానికి చెందిన సొంత అక్క కూతురైన కావ్యశ్రీ(34)ని 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. శంకర్ రోజు మద్యం తాగి పేకాట ఆడుతూ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన కావ్యశ్రీ గురువారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఐటీడీఏలో ఇంటర్కమ్ లింక్ఫోన్స్ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో ఇంటర్కమ్ లింక్ఫోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు లింక్ టెలిఫోన్స్ ఉపయోగపడుతాయి.


