ఘనంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ
భూపాలపల్లి అర్బన్ : సీఎం కప్ టార్చ్ ర్యాలీని మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్లు హా జరై టార్చ్ను వెలిగించి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, కాటారం మాజీ ఎంపీపీ సమ్మయ్య, ఎంపీడీఓ సీఐ నరేష్, ఎస్సైలు పాల్గొన్నారు.


