breaking news
Jayashankar District Latest News
-
కాళేశ్వరాలయంలో సందడి
సంక్రాంతి సెలవుల సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి తోడు ముందస్తుగా మేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిధి గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రాకపోకలు జరుగడంతో గ్రామంలో భక్తుల రద్దీ నెలకొంది. – కాళేశ్వరం -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రులు సురేఖ, వాకిటి శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జి. సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
నవ్విపోదురు గాక..
భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ నుంచి భూపాలపల్లి, కాళేశ్వరం వెళ్లేందుకు రెండు వేర్వేరు దారులు ఉన్నాయి. ఇక్కడ మూడు రకాల బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నాయి. అందులో ఒక బోర్డులో భూపాలపల్లి 4 కిలోమీటర్లు, మరో రెండు బోర్డుల్లో 5, 7 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అక్కడి నుంచే కాళేశ్వరం ఒక బోర్డులో 46.. మరో బోర్డులో 47 కిలోమీటర్లుగా రాశారు. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు స్పందించి బోర్డులను సరిచేయాల్సిన అవసరం ఉంది. – భూపాలపల్లి అర్బన్భూపాలపల్లి 4 కిలోమీటర్లుగా సూచిక రాయి భూపాలపల్లి 5 కిలోమీటర్లు బోర్డు -
బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్
మల్హర్: తాడిచర్ల ఓపెన్కాస్ట్–2 ప్రాజెక్ట్ ఏర్పాటుకు మండలంలోని మల్లారం (దుబ్బపేట) కస్తూర్భా సమీపంలోని వ్యవసాయ భూముల్లో జీహెచ్ఐ కంపెనీ బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్ చేస్తుంది. జీహెచ్ఐ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యవసాయ భూమిలో ఇప్పటికే 450 మీటర్ల లోతులో డ్రిలింగ్ చేపట్టారు. మరో 200 నుంచి 300 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించవచ్చని అంటున్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్రావుపల్లిలో, తాడిచర్ల శివారులోని పెద్దతూండ్ల ఆరెవాగు వంతెన సమీపంలో డ్రిల్లింగ్ వేశారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షకు 159 మందికి గాను 113 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షకు 50 మంది విద్యార్థులకు 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడిమంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
పోరాటయోధుడు ఓబన్న
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాటయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి ఇందిర మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ధైర్య సాహసాలు ప్రదర్శించారన్నారు. ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షురాలు దారంగి మంజుల, శివరాత్రి రమేష్, మిర్యాల మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (సోమవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రేగొండ: అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై దివ్య ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన జూపాక రాధమ్మ ఇంటి వద్ద అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
పది విద్యార్థులకు స్నాక్స్
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతూ ప్రత్యేక క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు చిరుతిళ్లు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే నెల 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు 19 రోజులపాటు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో చదివే వారికి రోజుకో రకం స్నాక్స్ అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పిల్లలకు ఆకలి నుంచి ఉపశమనం లభించనుంది. వంద శాతం ఉత్తీర్ణతకు.. మార్చిలో నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యాశాఖ గతేడాది దసరా సెలవులు ముగిసిన అనంతరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. మొదట ఒక పూటతో ప్రారంభించగా.. డిసెంబరు నుంచి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు.. మళ్లీ సాయంత్రం 4.15గంటల నుంచి 5.15గంటల వరకు రోజూ రెండు గంటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందుబాటులో ఉండడం లేదు. మధ్యాహ్న భోజనం తిన్న తరవాత సాయంత్రం ఖాళీ కడుపుతో ప్రత్యేక తరగతులు వినాల్సి వస్తోంది. ఇంటికి వెళ్లే సరికి చీకటి పడి ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. కాలే కడుపుతో ఉంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చెవికెక్కవు. దీన్ని గుర్తించిన విద్యాశాఖ పిల్లల ఆకలి తీర్చడానికి స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. జిల్లాలో 97 పాఠశాలలు, 2,739 మంది విద్యార్థులు సాయంత్రం పూట అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలుజిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు 97 ఉన్నాయి. వాటిలో 2,739 మంది విద్యార్థులు పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. చిరుతిళ్ల కోసం జిల్లాకు ప్రభుత్వం రూ. 3.50లక్షలు మంజూరు చేసే అవకాశం ఉంది. వీటితో రోజూ పెసర్లు, పల్లీలు, బెల్లం, చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బెర్లు, శనగలు, ప కోడి అందించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచే ప్రారంభిస్తే ప్రయోజనం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. -
రాజకీయ పరిస్థితులతో అడుగులు
నాది పేద మధ్యతరగతి కుటుంబం. నేను డిగ్రీ(బీఏ) వరకు చదివాను. నా వయస్సు 28 సంవత్సరాలు. కరోనాకు ముందు హైదరాబాద్లో ట్రావెల్స్ బిజినెస్ చేసి పరిస్థితులు బాగా లేక మహదేవపూర్ మండలంలోని సొంతం గ్రామం అన్నారం చేరాను. గ్రామంలో చిన్న ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్న. ఇంకా ఎన్జీఓలో ఆర్టీఐ, ఎన్హెచ్ఆర్ఎస్లో ప్రజల కోసం పనిచేస్తున్న. గ్రామంలో నెలకొన్న రాజకీయ నాయకుల వైఫల్యాలతో నేను సర్పంచ్గా గెలిచి ఊరును బాగు చేయాలని అనిపించింది. ప్రజల సహకారంతో సర్పంచ్గా గెలిచాను. ఊరులోని బడి, ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మధ్యవర్తిత్వం లేకుండా వారికి దరిచేరే విధంగా శ్రమిస్తాను. మౌలిక వసతులపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తా. – నీర్ల ప్రభాకర్, అన్నారం సర్పంచ్, మహదేవపూర్● -
స్వామి వివేకానంద స్ఫూర్తితో..
అభివృద్ధి చేస్తామంటున్న యువ సర్పంచ్లుఎమ్మెస్సీ పూర్తిచేసి మెడికల్ కోడింగ్లో ఉద్యోగం చేస్తూ ఇటీవల సర్పంచ్గా బరిలో దిగి విజయం సాధించాను. కేవలం 25 సంవత్సరాల వయస్సులో సర్పంచ్గా నాకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజల వెన్నంటే ఉంటా. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరేలా కృషి చేస్తా. యువకులు రాజకీయంలో విజయాలు సాధిస్తారనే నమ్మకంతో బరిలో దిగి విజయం సాదించాను. – ఇసంపెల్లి హారిక, ఎంపేడు సర్పంచ్, టేకుమట్లరెండు దశాబ్ధాలుగా నాన్న సంగి రవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రభావంతోనే బీఎస్సీ నర్సింగ్ చేసిన నేను చిన్న వయసులోనే(23) రాజకీయంలో అడుగుపెట్టాను. సర్పంచ్గా ప్రజలు బాధ్యతను కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. యువతులు సైతం అభివృద్ధి చేస్తారనేలా సేవ చేసి ప్రజలతో శభాష్ అనిపించుకుంటాను. – సంగి అంజలి, దుబ్యాల సర్పంచ్, టేకుమట్ల -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శనివారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలు, బందోబస్తు ఏర్పాట్లు, ప్రొటోకాల్కు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. సీఎం పర్యటన సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో మ్యూజియం, ఆర్టీసీ పార్కింగ్ స్థలాలు, టెంట్ సీటీ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
పనుల ప్రారంభమెప్పుడో..?
● పలు మండలాల్లో మినీ జాతరలు ● సౌకర్యాలు కల్పించాలని భక్తుల వేడుకోలుభూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: జిల్లాలోని మినీ మేడారం జాతరలపై రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, ప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రతీ జాతర సమయంలో నిధులు కేటాయించే ప్రభుత్వం ఈ సారి ఇప్పటివరకు కేటాయించలేదు. చాలా సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమ్మక్క, సారలమ్మ మినీ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ జాతరలకు వేలాది మంది భక్తులు హాజరవుతున్నారు. వీరికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు మాత్రం విఫలమవుతున్నారు. ప్రతీ రెండేళ్లకోకసారి ఎంతో వైభవంగా జరిగే సమ్మక్క–సారలమ్మ మినీ జాతర పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జాతరకు ఇంకా 18 రోజుల సమయమే మిగిలి ఉంది. జాతర జరిగే ప్రాంగణం చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత జాతరలకు నామమాత్రంగా.. గత నాలుగు జాతరలకు నిధులు అంతంత మాత్రమే కేటాయించారు. జాతరకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని చిన్న జాతరల అభివృద్ధికి 2016లో అప్పటి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఏడు సంవత్సరాల క్రితం ప్రతీ జాతర వద్ద మౌలిక వసతులకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయించారు. గతంలో చేసిన పనులకు టెండర్లు దక్కిందుకున్న కాంట్రాక్టర్లు జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. నమ్మక్క, సారలమ్మ గద్దెలకు చేసిన కాంక్రీటు పనులు, సీసీ రోడ్లు, కల్వర్టులు, కరెంట్ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలను నామామత్రంగా చేశారు. ప్రస్తుతం జాతర ప్రాంగణాలు పిచ్చి మొక్కలు, వ్యర్థాలతో నిండిపోయాయి. కనీసం పిచ్చి మొక్కలు తొలగించడానికి కూడా నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించాలి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ స్పందించి ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్న జాతరలో భక్తులకు కావాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు తయారుచేసి నిధులు మంజూరు చేయాలి. మరుగుదొడ్లు, కరంట్, తాగునీరు, స్నానాలు చేసేందుకు బోర్లు, ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మినీ జాతరలు జరిగేవి ఇక్కడే.. భూపాలపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. భూపాలపల్లి మండలంలోని గుర్ర పేట, కమలాపూర్, చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం–చైన్పాక గ్రామాల శివారులోని పూరేడుగుట్ట, మొగుళ్లపల్లి–ముల్కలపల్లి గ్రామాల మధ్య చలివాగు పక్కన, రేగొండ మండలంలోని తిరుమలగిరి–జగ్గయ్యపల్లి గ్రామాల్లో జరుగనుంది. -
ఇసుక అక్రమ డంపులు
మల్హర్: మండలంలో తాడిచర్ల (కాపురం రెవెన్యూ) శివారులోని తాడిచర్ల–పెద్దతూండ్లకు వెళ్లే ప్రధాన రహదారి (పెద్దతూండ్ల ఆరెవాగు) సమీపంలో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారు. పెద్దతూండ్ల ఆరెవాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంపు చేశారు. సుమారు 35 నుంచి 40 ట్రాక్టర్ల మేర ఇసుక డంపులు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ రవికుమార్ను వివరణ కోరగా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వలేదని.. రెవెన్యూ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆర్ఎంఓల నియామకం భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నలుగురు ఆర్ఎంఓలను నియమించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రాజేష్ ఆర్ఎంఓ–1, డాక్టర్ నాగా శశికాంత్ ఆర్ఎంఓ–2, డాక్టర్ మృదుల అరుణ్ ఆర్ఎంఓ–3, డాక్టర్ పవన్కుమార్ ఆర్ఎంఓ–4లను నియమించి వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్ లోయర్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్, లోయర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో ప్రతిభ కాళేశ్వరం: కామారెడ్డి జిల్లాకేంద్రంలో జనవరి 7, 8, 9 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో మహదేవపూర్ గ్రీన్వుడ్ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. సంతోషపు నైసి, వెన్నపురెడ్డి మధుప్రియ రీక్రియేషనల్ మాథమెటికల్ థింకింగ్ విభాగంలో ‘గోల్డెన్ రేషియో’ ప్రాజెక్ట్కు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం చీర్ల శ్రీనివాస్రెడ్డి గైడ్ టీచర్ మొగిలి విద్యార్థులను అభినందించారు. గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలుములుగు రూరల్ : ఆది దేవత గట్టమ్మ తల్లిని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో కొలువైన గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హేమాచలుడి వరపూజకు ఆహ్వానం మంగపేట : మల్లూరు హేమాచల క్షేత్రంలో ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవం (పెళ్లిచూపులు) కార్యక్రమానికి రావాలని ఈఓ రేవెల్లి మహేష్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ప్రతి ఏటా హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూమిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
ఉపాధి హామీని కొనసాగించాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి అర్బన్: ఉపాధి హామీ పథకం పేరు మార్చకుండా యథావిధిగా కొనసాగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్తో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను.. నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హమీలతో పాటు ప్రస్తుతం చేపడుతున్న శంకుస్థాపనల అభివృద్ధి పనులు 2028 సంవత్సరం నాటికి పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగనని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి బైపాస్ రోడ్డుకు డీపీఆర్ టెండర్లు జరుగుతున్నాయని అన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మధు, జంపయ్య, రాంచంద్రయ్య, సాంబమూర్తి, రమేష్, అనిల్, అశోక్, శ్రీలత, రజిత, కిషోర్రెడ్డి పాల్గొన్నారు. -
వామ్మో డేంజర్..
మల్హర్ మండలం కొయ్యూరు నాగులమ్మ సమీపంలో బొగ్గుల వాగు వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన సైడ్ వాల్ను గతంలో లారీ ఢీకొట్టడంతో వాల్ సగభాగం కూలిపోయింది. వంతెన మీదుగా మంథని–కాటారం ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 28న నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీ పెరగనుంది. జిల్లా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనకు సైడ్ వాల్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – మల్హర్ -
చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: సంక్రాంతి సెలవుల సందర్భంగా దొంగతనాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీసు గస్తీని మరింత పటిష్టం చేస్తామన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సొంత ఊర్లకు వెళ్లే ముందు విలువైన వస్తువులు, నగదు, బంగారం లాంటివి ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే వారు ముందస్తుగా స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందిస్తే రాత్రి వేళల్లో నిఘా ఉంచడంతో పాటు పోలీసు బృందాలు గస్తీ చేపడుతాయన్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. -
సీఎం కప్.. వేళాయె..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో విడత క్రీడాపోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో షెడ్యూల్ను ప్రకటించింది. మొదటగా గ్రామ పంచాయతీ స్థాయిలో 17నుంచి క్రీడలు మొదలుపెట్టి రాష్ట్రస్థాయి పోటీలు ఫిబ్రవరి 26న ముగించనుంది. మొదటి విడత అట్టహాసంగా నిర్వహించిన సీఎం కప్ క్రీడలను మరోసారి అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ, క్రీడా సంఘాలు, రాష్ట్రస్థాయి క్రీడా అధికారులతో జూమ్ సమావేశాలు నిర్వహించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్తో పాటు పారా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా టార్చ్ ర్యాలీలు.. క్రీడల సన్నాహాల కోసం టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని జిల్లా క్రీడల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జనవరి 8 నుంచి 17 వరకు గ్రామ, మండల స్థాయిల్లో టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లోని గ్రామాలు, మండలాలను కవర్ చేసేలా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రముఖక్రీడాకారులు, మాజీ అథ్లెట్స్, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిదులు, ప్రభుత్వ అధికారులు, జిల్లా ఒలింపిక్ సంఘాలు, క్రీడా సంఘాలు, యువత, విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. 17 నుంచి మొదలుకానున్న క్రీడలు ఈ నెల 17 నుంచి సీఎం కప్ 2వ విడత క్రీడలను ప్రారంభించనున్నారు. మొదటగా గ్రామ పంచాయతీ స్థాయిలో 17 నుంచి ఈ నెల 22 వరకు ఆరు రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. అనంతరం మండలస్థాయిలో జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు జిల్లాస్థాయి క్రీడలను నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలను ఫిబ్రవరి 19 నుంచి 26వరకు 8 రోజుల పాటు క్రీడలను నిర్వహించనున్నారు. సుమారు 44 క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్ 2వ విడత పోటీలు సుమారు 44 క్రీడాంశాలలో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో తదితర గ్రామీణ స్థాయి క్రీడలతో పాటు ఇతర క్రీడలను సైతం నిర్వహించనున్నారు. పారా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీలను సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలలో క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. మొదటి విడత సీఎం కప్ అందరి భాగస్వామ్యంతో జిల్లాలో విజయవంతం కావడంతో మరోసారి సీఎం కప్ను ఉత్సాహంగా నిర్వహించేందుకు జిల్లా క్రీడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. రెండో విడత సీఎం కప్ పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు సీఎం కప్ పోటీల నిర్వహణ ఉంటుంది. గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నాం. మండల, జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను పంపనున్నాం. సీఎం కప్ పోటీల నిర్వహణలో అందరినీ భాగస్వామ్యం చేసి విజయవంతం చేస్తాం. – సీహెచ్ రఘు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సుమారు 44 క్రీడాంశాలు.. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు గ్రామ పంచాయతీ, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహణ -
గొంతెమ్మ గుట్టపై పురాతన చిత్రకళ
మల్హర్(కాటారం): కాటారం మండలం ప్రతాపగిరి శివారులో ఉన్న గొంతెమ్మ చిన్న గుట్టపై పురాతన చిత్రకళ ఆనవాళ్లను గుర్తించినట్లు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకరెడ్డి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తతంగా పర్యటించి ఆది మానవుల చరిత్రను, సంస్కతిని రికార్డు చేస్తున్న డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, టీం సభ్యులతో కాటారంలో గొంతెమ్మ గుట్టను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్న గుట్ట కుంతి దేవికి అంకితం చేయబడిందని.. అందుకే గొంతెమ్మ గుట్టగా పిలుస్తారని పేర్కొన్నారు. కృష్ణుడు, సుభద్ర, కుంతీదేవి కొంతకాలం ఇక్కడ జీవించారని స్థల పురాణం చెబుతుందన్నారు. 18.62495 అక్షాంశం, 80.01390 రేఖాంశముల మధ్య ఉన్న పడగ రాయి కింద ఆది మానవులు వేసిన పల్లికాయను పోలి ఉన్న గంటు చిత్రం (పెట్రోగ్లిప్) ఉందన్నారు. ఇది పల్లి చేను పీకినప్పటి దశను సూచిస్తుందని చెప్పారు. గుట్టపైకి ఎక్కే క్రమంలో డిస్కవరీ టీం సభ్యులకు మధ్య శిలాయుగానికి చెందిన సూక్ష్మ రాతి పనిముట్లు లభించాయని తెలిపారు. ఈ పనిముట్లను బట్టి ఈ చిత్రం సామాన్య శక పూర్వం 10 నుంచి 5 వేల మధ్య కాలానికి చెందినదై ఉంటుందని ఆయన వెల్లడించారు. పడగ రాయి కింద ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఆలయం ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని షెల్టర్ గానూ, సెంట్రీ పాయింట్ గాను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు. అప్పుడే ఇక్కడ శివలింగమును స్థాపించినట్లు తెలుస్తోందన్నారు. గుడి ముందు ఉన్న పాదాలను కృష్ణుని పాదాలుగా భావిస్తారని అన్నారు. గుడి వెనుక గోడలో మహిషాసుర మర్ధిని శిల్పం, గుడి లోపల పై శిలకు పువ్వు శిల్పం ఉందని చెప్పారు. పువ్వు శిల్పం సౌభాగ్యం, లక్ష్మీదేవికి ప్రతీక అన్నారు. ఈ పల్లికాయ చిత్రమే లక్ష్మీదేవికి ప్రతీకగా భావించి ఈ గొంతెమ్మ గుట్టపై ప్రతి ఏటా లక్ష్మీదేవర కల్యాణం ఘనంగా చేస్తారని వివరించారు. గ్రామస్తులంతా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క లక్ష్మీదేవరతో ఊరేగింపుగా బయలుదేరి గొంతెమ్మ గుట్టకు చేరుకుంటారని చెప్పారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసులు, స్థానిక గ్రామాల వాళ్లు పాల్గొంటారని అన్నారు. ఈ క్రమంలో భక్తులు తమ కోరికలు నెరవేరిన సందర్భంలో పడగ రాయి కింద పాదాల చిత్రాలను వేయించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. గుట్టపై మూడు దశల్లో నిర్మించిన కోట గోడలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొప్పారం రాజు, అడ్లకొండ రాజేష్, వినయ్ గోలి, నాగరాజు, మహేశ్, అనిరుద్, స్థానిక యువకులు ఉన్నారు. వారసత్వ సంపదగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలి డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి -
సహకార ఎన్ని‘కలే’నా..?
సొసైటీ పాలకవర్గ పదవులు నామినేటెడ్ చేసే యోచనలో ప్రభుత్వంభూపాలపల్లి అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఇక నామినేటెడ్ ప్రతిపాదికన ఎన్నుకుంటారనే చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఇటీవల ఆయా పాలకవర్గాలను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ సంఘాలకు ఎన్నికలు జరిగాక సొసైటీ చైర్మన్లు, సభ్యులతో పాలకవర్గం ఏర్పడేది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు డీసీసీబీ చైర్మన్, పాలకవర్గాన్ని ఎన్నుకునేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సహకార సొసైటీల పదవులను నామినేటెడ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలియడంతో నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారు. గ్రామీణ స్థాయిలో డిమాండ్ ఉన్న పదవి కావడంతో సహకార ఎన్నికలు హోరాహోరీగా సాగేవి. కానీ ప్రస్తుతం పదవులను నామినేట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వరంగల్, హైదరాబాద్ దారిపట్టిన నాయకులు తమ పేర్లు నామినేట్ చేయాలని కోరుతున్నారు. కొత్త సొసైటీల కోసం.. జిల్లాలో సహకార సంఘాలను పెంచేందుకు ఇప్పటికే కసరత్తు జరిగింది. జిల్లాలో ప్రస్తుతం 11 సహకార సొసైటీలు ఉన్నాయి. కానీ సహకార పదవులు నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వనున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన రైతులు అఖిల పక్షాల ఆధ్వర్యంలో తమ గ్రామం కేంద్రంగా సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు టేకుమట్ల, కొత్తపల్లిగోరి మండలాల్లో మండలం పేరిట సొసైటీ లేదు. ఇక్కడ సొసైటీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం చేసింది. అధికార పార్టీ నాయకుల మధ్య డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులతో పాటు అన్ని సహకార సంఘాల్లో చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోసం పోటా పోటీ నెలకొన్నది. జిల్లాలో మరికొన్ని గ్రామాలకు సొసైటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో చిగురిస్తున్న ఆశలు జిల్లా నాయకుల మద్దతు కూడగట్టుకునే యత్నంపీఏసీఎస్లను రద్దు చేసిన తరువాత నామినేటెడ్ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్ల నియమాకాలు చేపడుతారని ఊహాగానాలు రావడంతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సహకార సంఘాల పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సహకార ఎన్నికల్లో సైతం సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఎన్నికలు జరిగేవి. -
మొక్కజొన్న సాగుకే మొగ్గు
రేగొండ: యాసంగి సీజన్లో రైతులు మొక్కజొన్న పంట సాగుపై మొగ్గు చూపడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది. నీటి సౌకర్యం ఉన్న రైతులు మొక్కజొన్నపైనే మక్కువ చూపుతున్నారు. రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల వ్యాప్తంగా దాదాపు 5వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అడవి పందుల బెడద ఉన్నప్పటికీ వాటి నుంచి రక్షించుకునేందుకు సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకుని మరీ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు, కూలీల ఖర్చు తక్కువ, స్థిరమైన ఆదాయం రావడంతో రైతులు ఈ పంటలను ఎంచుకుంటున్నారు. కూరగాయల సాగుకు కూలీ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. దీంతో పాటు స్థిరమైన ఆదాయం రాకపోవడంతోనే రైతుల చూపు ఆదాయం వచ్చే పంటలపై మరలుతోంది. ఖరీఫ్ నుంచి రబీలో.. ఒకప్పుడు ఖరీఫ్లో మొక్కజొన్న సాగు చేసేవారు. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు ఇబ్బందిగా మారుతుండటంతో రబీలో సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఈ పంటకు మార్కెట్లో సరైన డిమాండ్ ఉంది. మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ.2,350 ధర పలుకుతోంది. రబీలో దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తుండడంతోనే దీనిపై మక్కువ చూపుతున్నారు. మండల పరిఽధిలో.. రేగొండ మండల పరిధిలోని కనిపర్తి, నాగుర్లపల్లి, లింగాల, రేపాక, తిరుమలగిరి కొత్తపల్లిగోరి మండల పరిధిలో కొత్తపల్లిగోరి, నిజాంపల్లి, జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి తదితర గ్రామాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం మద్దతు ధర రూ.2,350 ఉండగా, రేగొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. రైతులు మార్కెట్కు తరలించకుండా, దళారుల పాలు కాకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్లే ప్రస్తుతం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలం పత్తి సాగులో ఆశించిన దిగుబడులు రాలేదు. దీంతో యాసంగిలో ఐదు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నాను. ఇతర పంటల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. తక్కువ పెట్టుబడితో మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. అధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగుపైన రైతులకు అవగాహన కల్పించాలి. – వన్నాల శివాజీ, రైతు, కొత్తపల్లిగోరి యాసంగిలో పెరిగిన సాగు విస్తీర్ణం ఆసక్తి చూపిస్తున్న రైతులు -
బొమ్మాపూర్ క్వారీ లోడింగ్ నిలిపివేత
కాళేశ్వరం: జిల్లాలోని మహదేవపూర్ మండలంలో ఇసుక క్వారీల్లో అక్రమ లోడింగ్ పేరిట లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా శుక్రవారం బొమ్మాపూర్ క్వారీలో లోడింగ్ను సంబంధిత శాఖ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. వారం రోజులుగా సాక్షి పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించి అంతర్గతంగా నిఘా వర్గాలతో విచారణ జరిపారు. లోడింగ్ పేరిట అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు తేలడంతో పాటు ఫిర్యాదులు రావడంతో క్వారీకి సంబంధించిన అగ్రిమెంట్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. శుక్రవారం మరో రెండు క్వారీల్లో పలుగుల–8, పూస్కుపల్లి క్వారీల్లో లోడింగ్ యథావిధిగా జరుగుతుంది. ఈ విషయంపై టీఎండీసీ పీఓ రామకృష్ణను ఫోన్లో సంప్రదించగా.. తమకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో బొమ్మాపూర్ క్వారీ అగ్రిమెంట్ పూర్తి కాగా, అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ను నిలిపివేసినట్లు తెలిపారు. హన్మకొండ: మీటర్లు మార్చి విద్యుత్ చౌర్యానికి పాల్పడిన టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్ ఉద్యోగి చిల్లా శ్రీరామ్ను భూపాలపల్లి ఎమ్మార్టీ డీఈ సదానందం శుక్రవారం సస్పెండ్ చేశారు. డిసెంబర్ 16న డీపీఈ ఏఏఈ ఎల్.రాజమౌళి హనుమకొండ న్యూ రాయపురాలోని సిల్లా సుజాత ఇంటిని తనిఖీ చేశారు. ఆ సమయంలో మంజూరైన మీటర్కు, అమర్చిన మీటర్కు తేడా ఉన్నట్లు గుర్తించి, వినియోగదారురాలను విచారించారు. దీంతో ఆమె భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పని చేస్తున్న తన కుమారుడు చిల్లా శ్రీరామ్తో ఫోన్లో మాట్లాడారు. అదే ఫోన్ను తనిఖీకి వచ్చిన అధికారికి ఇవ్వగా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఇంట్లో భద్రపర్చిన అసలు మీటరును తీసుకొచ్చి తనిఖీ అధికారికి చిల్లా సుజాత అప్పగించారు. వెంటనే ఈ విషయాన్ని ఆపరేషన్ యాదవనగర్ ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వచ్చి మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకు రూ.1,12,200 జరిమానా విధించారు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పని చేస్తున్న శ్రీరాం మీటర్ మార్చినట్లు తెలిసినా సంబంధిత డీఈ 25 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడేందుకు యత్నించారనే ఆరోపణలున్నాయి. ఈ నెల 9న సాక్షిలో ‘సొంత సంస్థకు కన్నం’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సంబంధిత డీఈని ఎందుకు చర్య తీసుకోలేదని మందలించినట్లు తెలిసింది. దీంతో ఎట్టకేలకు విద్యుత్ చౌర్యానికి కారకుడైన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. యుద్ధప్రాతిపదికన ఆలయ పనులు రేగొండ: కొడవటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై శుక్రవారం కొడవటంచ ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఫిబ్రవరి నెలలో స్వామి వారి పునఃప్రతిష్ట, స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి రానున్నట్లు తెలిపారు. అంతకుముందు బాలాలయంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఆలయ ఛైర్మన్ భిక్షపతి, ఈఓ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పర్యాటకుల జోష్.. గోవిందరావుపేట: మండలంలోని లక్నవరంలో పర్యాటకులు శుక్రవారం సందడి చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు లక్నవరం సరస్సుకు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ప్రకృతి అందాలను చూసి తరించారు. వేలాడే వంతెనపై నడుస్తూ బోటింగ్ పాయింట్కు చేరుకున్నారు. -
వ్యూహాలకు పదును
మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంమున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనున్నందున ఈ ఎన్నికల్లో గెలుపునకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించగా 12న తుది జాబితా వెలువరించనుంది. అనంతరం రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. – భూపాలపల్లి అర్బన్మున్సిపల్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన పార్టీకి సాధారణ ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని పార్టీల నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాల కోసం అధికార పార్టీ సహా ఇతర పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి. వారం రోజులుగా మున్సిపాలిటీలో పెండింగ్ పనులు, నూతన పనులకు నిధులు కేటాయించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ వార్డుల వారీగా బస్తీబాట నిర్వహిస్తోంది. ఖర్చును బట్టి టికెట్ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయగలరనే దాన్ని బట్టి టికెట్ కేటాయింపులకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆశావహులతో పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ వార్డుకు ఎంతమంది పోటీ పడుతున్నారనే విషయంపై స్పష్టత తెస్తున్నట్టు సమాచారం. పోటీ ఎక్కువగా ఉండే వార్డుల్లో గెలుపు కోసం ఎవరు ఎంత ఖర్చు చేయగలరని వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ.20లక్షలు ఖర్చు చేసేవారే పోటీలోకి దిగాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వారి వార్డుల్లో టికెట్ ఆశించే వారిని నొప్పించకుండా సర్దిచెప్పి గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులకు కసరత్తులు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మినహా ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. వార్డుల వారీ రిజర్వేషన్లు సైతం ఖరారు కావడమే ఆలస్యం ఆయా వార్డుల్లో ఉన్న ఓటర్ల సంఖ్య గెలుపోటముల అంచనాలకు అనుగుణంగా పొత్తులుంటాయని, జాతీయ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ప్రభావం అంతగా ఉండదని, ఎన్నికపై ఓటర్లు వ్యక్తుల వ్యక్తిత్వానికే పట్టం కడతారనే ఆలోచనతో గెలుపే లక్ష్యంగా పట్టణంలో పొత్తులు ఉండే అవకాశముందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం ఎన్నికల పొత్తుపెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపనల్లో అధికార పార్టీ బిజీ బస్తీబాటలో బీఆర్ఎస్ పార్టీమున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనతో ఉన్న పలు పార్టీల నాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆశావహుల సంఖ్య ఈ సారి ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపాలిటీపై పట్టున్న బీఆర్ఎస్కు చెందిన నేతలు అధిక శాతం మంది బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పొత్తుల ద్వారా లాభపడాలని సీపీఎం, బీజేపీ యోచిస్తుండగా సీపీఐ నుంచి మరికొంత మంది పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలామంది ఆయా పార్టీల నుంచి ఆశావహులు బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. -
రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్గా రాజ్కుమార్
చిట్యాల: రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్గా చిట్యాల మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజ్కుమార్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శంషాబాద్లో నిర్వహించిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలో రావుల కృష్ణను నియమించారు. తన నియామకానికి కృషిచేసిన వారికి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు. మోడల్ ఉమెన్స్ గ్రామ పంచాయతీగా ఎడపల్లి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఎడపల్లి పంచాయతీ జిల్లాస్థాయిలో మోడల్ ఉమెన్స్ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. సర్పంచ్ మోతే నీలరాణిని మహారాష్ట్రలోని పుణేకు శిక్షణ కోసం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు తీసుకెళ్లారు. 8న గురువారం, 9న శుక్రవారం రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశంలో మహిళా సాధికారత, గ్రామాభివృద్ధి, ఉత్తమ పాలన విధానాలపై విస్తృతంగా జరగనున్న చర్చల్లో పాల్గొంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి 13 మంది ఎంపికయ్యారు. సర్పంచ్ను పలువురు అభినందించారు. రేపు లక్ష తులసి అర్చన కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీరామచంద్రస్వామి ఆలయంలో లక్ష తులసి అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 10న శనివారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. యువత భవిష్యత్ను మార్చేలా సీఎం కప్ రేగొండ: క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో డీవైఎస్ఓ రఘు ఆధ్వర్యంలో క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో క్రీడలపై అవగాహన కల్పించేందుకు సీఎం కప్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దివ్య, ఎంఈఓ రాజు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత, సీఎంఓ రమేష్, ఏఎంఓ విజయ్పాల్ రెడ్డి, సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. బస్సు నడిపించాలని డీఎంకు వినతి కాళేశ్వరం: కాళేశ్వరం వయా మద్దులపల్లి మీదుగా చెన్నూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని మద్దులపల్లి సర్పంచ్ ఎల్పుల సరిత భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఇందుకు గురువారం వినతిపత్రం అందజేశారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వయా మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా మంచిర్యాల జిల్లా చెన్నూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని భూపాలపల్లిలో విన్నవించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు మూడు ట్రిప్పులు బస్సు సర్వీసులు నడపాలని విజ్ఞప్తి చేశారు. డీఎం సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ.. మద్దులపల్లి గ్రామపంచాయతీలో గురువారం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, కార్యదర్శి స్వాతి, వీఏఓ జాడి మొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: గురువారం సమ్మక్క రోజు కావడంతో మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు ఆరగించారు. -
వామ్మో.. సర్పంచ్ గిరి
కాళేశ్వరం: కొత్త సర్పంచ్లు గ్రామపంచాయతీల్లో నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మోస్తూ గ్రామ సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు బిత్తరబోతున్నారు. రెండేళ్లుగా కార్యదర్శులు తన డబ్బులను పెట్టి అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం పనుల కోసం సర్పంచ్లు స్వంతంగా రూ.లక్షలు పెట్టుబడులు పెడుతున్నారు. ఖర్చులు తడిసి మోపెడు.. గ్రామాల్లో రోజువారీ అవసరాలు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో కొంతమంది కొత్త సర్పంచ్లు లక్షల రూపాయలు స్వయంగా పెట్టుబడిగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీధిదీపాల బిల్లులు, నీటి మోటార్లు, చెత్త సేకరించే ట్రాక్టర్ల మరమ్మతులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వంటి ఖర్చులు సర్పంచ్లే భరించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని పలు పంచాయతీల సర్పంచ్లు ఇప్పటికే ఎన్నికల కోసం తెచ్చిన అప్పులు కట్టలేక.. పంచాయతీల్లో నిధుల లేమితో ఇటు మళ్లీ అప్పులు తీసుకురావాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కార్యదర్శులు అంతే.. రెండేళ్లుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు పాలన చేపట్టారు. దీంతో కార్యదర్శులు పూర్తిస్థాయిలో పంచాయతీ బాధ్యతలు తమమీద వేసుకున్నారు. నిధులు లేకపోయినా పనులు నిలిపివేయలేక తమ జేబుల నుంచి ఖర్చులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు. ఫలితంగా వారు అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. నిధులు వస్తే బిల్లులు వచ్చి అప్పులు తీర్చుకుంటామని ఎదురుచూస్తున్నారని తెలిసింది. స్పష్టత కరువు.. నిధులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడం, ఇప్పటికే చేసిన ఖర్చులు ఎలా తిరిగివస్తాయో తెలియక సర్పంచ్లు, కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బకాయిలను విడుదల చేసి గ్రామ పంచాయతీలకు ఊతమివ్వాలని, లేకపోతే గ్రామ పాలన పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని ప్రజాప్రతినిధులు ఆందోళన పడుతున్నారు. 15వ ఆర్థిక సంఘం, ఇతర నిధులు కేంద్రం త్వరితగతిన విడుదల చేయాలి. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వస్తుంది. ట్రాక్టర్లకు మరమ్మతులు, వీధిదీపాలు, నీటిమోటార్లు, పారిశుద్ధ్యంపై ఖర్చులు పెరిగాయి. రెండేళ్ల తరువాత పంచాయతీలకు సర్పంచ్గా ఎన్నికై నిధుల సమీకరణకు కొత్తగా అప్పులు తీసుకుంటున్నాం. నిధుల విడుదల జరిగితే సర్పంచ్లకు ఊరట కలుగుతుంది. గ్రామంలో అభివృధ్ది జరుగుతుంది. – మాట్ల శ్రీనివాస్, సర్పంచ్, టేకుమట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూపు రూ.లక్షల పెట్టుబడులు పెడుతున్న కొత్త సర్పంచ్లు రెండేళ్లుగా కార్యదర్శులు ఖర్చులు పెట్టి అప్పులతో సతమతం కొత్త పంచాయతీలకు తడిసిమోపెడు.. -
సొంత సంస్థకు కన్నం..!
వాతావరణం జిల్లాలో ఉదయం తీవ్ర మంచు ఉంటుంది. మధ్యాహ్నం చల్లని గాలులు వీస్తాయి. రాత్రివేళ చలితో పాటు మంచు కురుస్తుంది.హన్మకొండ: విద్యుత్ చౌర్యానికి పాల్పడకుండా చూడాల్సిన ఓ వ్యక్తి కక్కుర్తి పడి సంస్థ ఆదాయానికి కన్నం వేశాడు. టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్లోని ఎమ్మార్టీ డివిజన్కు చెందిన ఓ ఉద్యోగి తన గృహానికి టెస్టింగ్ మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఎన్పీడీసీఎల్ డీపీఈ విభాగం తనిఖీల్లో సర్వీస్ నంబర్కు మంజూరు చేసిన మీటర్ నంబర్ తేడాగా ఉండడంతో మీటర్ మార్చిన బాగోతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హనుమకొండలోని రాయపురలో నివాసముంటున్నాడు. కరెంట్ బిల్లు తక్కువ వచ్చేందుకు అసలు మీటర్ స్థానంలో టెస్టింగ్ మీటర్ను మారుస్తున్నాడు. డీపీఈ విభాగం అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా రాయపురలోని ఆ ఉద్యోగి ఇంటిలోని మీటర్ను తనిఖీ చేయగా సర్వీస్ నంబర్కు, కేటాయించిన మీటర్ నంబర్ తేడాగా ఉండడం గమనించారు. కూపీలాగితే మీటర్ మార్చినట్లు వెలుగు చూసింది. అతనికి రూ.1.30 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఉద్యోగి ఏడాదికాలంగా మీటర్లు మారుస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అతనిపై టీజీ ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్ సూపరింటెంటెండ్ ఇంజనీర్, ఎమ్మార్టీ డీఈలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టెస్టర్గా పనిచేస్తుండడంతో సులువుగా మీటర్ మార్పు.. సాధారణంగా గృహ విద్యుత్ వినియోగదారులు తమ మీటర్లలో లోపాలుంటే అందులోని వైఫ ల్యాన్ని గుర్తించడానికి రూ.200 ఆపరేషన్ డీఈ పేరుతో ఫీజు చెల్లించి సెక్షన్లో దరఖాస్తు చేసుకుంటాడు. ఈ మీటర్ను పరీక్షించేందుకు ఎమ్మార్టీ విభాగం ల్యాబ్కు పంపిస్తారు. ఇక్కడ టెస్టర్గా విధులు నిర్వహించే ఉద్యోగి ఆ మీటర్కు సాంకేతిక పరీక్షలు నిర్వహించి మీటర్ బాగుందా లేదో తేలుస్తాడు. భూపాలపల్లి ఎమ్మార్టీ డివిజన్లో టెస్టర్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి టెస్టింగ్ కోసం వచ్చిన మీటర్లను తన ఇంటికి తీసుకెళ్లి తన మీటర్ స్థానంలో టెస్టింగ్ మీటర్ను అమరుస్తూ విద్యుత్ వాడుకుంటున్నాడు. రీడింగ్ తీయడానికి కొన్ని రోజుల ముందు యధావిధిగా పాత మీటర్ను అమర్చుతున్నాడు. ఈ మీటర్లో రీడింగ్ తక్కువ నమోదు అవుతుండడంతో బిల్లు కూడా తక్కువగా వస్తుంది. సొంతింటికి టెస్టింగ్ మీటర్ల వినియోగం ఎమ్మార్టీలో పనిచేస్తుండడంతో సులువుగా మీటరు మార్పు బిల్లు తీసేనాటికి సొంత మీటరు అమర్చుతున్న ఉద్యోగి డీపీఈ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమం -
సరిపడా యూరియా సరఫరా
భూపాలపల్లి: రాష్ట్రానికి కేంద్రం నుంచి సరిపడా యూరియా పంపిణీ అవుతుందని, కొంతమంది దళారులు కొరత సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు అన్నారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం భూపాలపల్లికి వచ్చిన సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాంచందర్రావు మాట్లాడారు. పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం, గ్యాస్ సబ్సిడీ తదితర పథకాలన్నీ కేంద్రం ఇస్తున్నవేనని అన్నారు. భూపాలపల్లికి జాతీయ రహదారి మంజూరు చేశామని, ఎఫ్సీఐని పునరుద్ధరించి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కేటీపీపీ, సింగరేణి భూ నిర్వాసితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందలేదని చెప్పారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు సకాలంలో ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. గతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో అవినీతికి ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లాలో సుమారు వంద వార్డు స్థానాలు బీజేపీ కై వసం చేసుకోవడం హర్షనీయమన్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద దేశంలోని అన్ని పట్టణాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఒక్కసారి బీజేపీని ఆదరిస్తే భూపాలపల్లికి భారీగా నిధులు మంజూరు చేస్తామని రాంచందర్రావు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నాయకులు వీరేందర్గౌడ్, నిషిధర్రెడ్డి, పాపయ్య, నారాయణరెడ్డి, యుగేందర్, గౌతమ్రావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులకు ఇబ్బందులు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు -
ప్రథమ స్థానంలో నిలవాలి
భూపాలపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భూపాలపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సకాలంలో ఫొటో క్యాప్చర్ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓలు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించకుంటే రద్దు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణాలకు రుణ సదుపాయం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు లేని లబ్ధిదారులకు లక్ష రూపాయల సహాయం అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల ఖర్చులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిధుల సమస్య ఏమీ లేదని, బిల్లులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తే నిధులు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ప్రగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ డీఈ శ్రీకాంత్, అధికారులు ఉన్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
గురుకులం పిలుస్తోంది..
మొగుళ్లపల్లి: ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. 5 నుంచి 9వ తరగతిలో చేరే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ గురుకుల విద్యాలయాలు ఎంతగానో దోడ్పడుతున్నాయి. ఆంగ్ల మాద్యమంలో బోధిస్తూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన సీటు కేటాయించనున్నారు. జిల్లాలోని కాటారం, భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ గురుకులాల్లో అడ్మిషన్ పొందేందుకు అర్హత పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన సర్టిఫికెట్లు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ లేదా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, కులం, ఆదాయం జిరాక్స్, పాస్ఫొటోతో సమీప మీసేవా కేంద్రంలో సంప్రదించాలి. గ్రామీణ ప్రజల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రజల వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులు. గురుకులాల్లో మెరుగైన విద్యాబోధన ఉంటుంది. గురుకులాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. అన్ని పత్రాలతో మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఎస్.శారద, ఎంజేపీ ప్రిన్సిపాల్, మొగుళ్లపల్లిఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీజీసెట్. సీజీజీ. జీఓవీ. ఇన్ అనే వెబ్సైట్ లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 21వ తేదీ వరకు గడువు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష జిల్లా వ్యాప్తంగా 7 గురుకులాలు -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొర్లవీడులో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఫర్నిచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం హెచ్ఎం అనిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్ బెంచీలు, సైన్స్ లాబరేటరీ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, ఫర్నిచర్ అందించి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తూ పరోక్షంగా విద్యార్థుల ప్రగతికి సహకార అందిస్తున్నారన్నారు. వారి సేవలు మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని కోరారు. ట్రస్ట్ రిసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ లీల సుజిత్ మాట్లాడుతూ భవిష్యత్లో దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థుల కోసం సైకిళ్లు అందజేస్తామన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ భాస్కర్, సర్పంచ్ మందల లావణ్య, సంస్థ ప్రతినిధులు పింగిలి విజయపాల్ రెడ్డి, రమేష్, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సుభాకర్ రెడ్డి, వంశీ, కుమారస్వామి, శంకర్రావు, వాసుదేవ్, నవనీత్ మాలతి, రియాజ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు ఊరట్టం గ్రామ పంచాయతీలో రేపు (9వ తేదీన) తైబజారు ఓపెన్ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొమరం శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఊరట్టం, కొత్తూరు, కన్నెపల్లి గ్రామాల పరిధిలో గల దుకాణాలకు వేలం పాట ఉంటుందని వివరించారు. జీపీలో ఉదయం 10: 30 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ. 50వేల డిపాజిట్ సొమ్మును జీపీ కార్యాలయంలో చెల్లించాలని వివరించారు. -
పన్ను వసూళ్లపై నజర్
భూపాలపల్లి రూరల్: గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివిధ రకాల పన్నులను ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.4,30,11,513 లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.1,05,95,987 (24.64 శాతం) వసూలు చేయగా రూ.3,24,15,526 వసూలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది వందశాతం వసూళ్లు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పన్నులు వసూలైతేనే నిధులు.. గ్రామ పంచాయతీలు స్వయం పోషకాలుగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటాయి. పంచాయతీలు ఇంటిపన్ను, తాగునీటి పన్నుతో పా టు వాణిజ్య దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాయి. ఈ మేరకు ఆయా గ్రామాల్లో కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే గ్రామ అవసరాలకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వ పరంగా ఎస్ఎఫ్సీ ఆర్థిక సంఘం నుంచి నిధులతో పాటు పలు సందర్భాల్లో పన్నుల రూపేణ వచ్చే నిధులు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వందశాతం పన్ను వసూలు చేసిన గ్రామాలకు మాత్రమే ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో పంచాయతీలు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లను కార్యదర్శులు అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 24.64 శాతం వసూలు చేశారు. ఆయా గ్రామాల్లో కార్యదర్శులు ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. వచ్చిన ఆస్తిపన్ను వివరాలను ఈ–వెబ్పైట్లో నమోదు చేస్తున్నారు. ఈ వెబ్సైట్లోని వివరాల ఆధారంగా కలెక్షన్ బ్యాలెన్స్ (డీసీబీ) పత్రాలను ప్రింట్ తీసి ఈఓపీఆర్డీలు కార్యదర్శులకు అందజేస్తారు. అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఈ–పంచాయతీ వెబ్సైట్లో నమోదు చేయడం ద్వారా పన్ను వసూళ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంటింటికీ తిరుగుతున్న కార్యదర్శులు ఇప్పటివరకు 24.64 శాతం మాత్రమే.. జిల్లాలో 248 పంచాయతీలురెండేళ్లుగా 90శాతంపైగా పన్నులు వసూళ్లు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరం కూడా వందశాతం వసూలు లక్ష్యంగా కృషి చేస్తున్నాం. గత నెలరోజులు కార్యదర్శులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించాం. ప్రతీరోజు అధికారులు, కార్యదర్శులతో గ్రూప్ కాల్స్ చేస్తున్నాం. – శ్రీలత, డీపీఓ -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరియా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వి.పి.గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
మందుల కొరత లేకుండా చూసుకోవాలి
మల్హర్: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని జిల్లా వై ద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు. ఈ మే రకు మండలంలోని అన్సాన్పల్లి గ్రామ పంచా యతీ పరిధిలోని పల్లె దవాఖానాను బుధవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రి కార్డులను పరిశీలించి, స్టేట్, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం వివరాలు, ఇమ్యూనైజేషన్ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దవాఖానాలో మందుల నిల్వలను ఎప్పటికప్పడు సరిచూసుకోని తె ప్పించుకోవాలన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సందీప్, డీడీఎం మధుబాబు, డాక్టర్ కె. ప్రత్యూష, ఏఎన్ఎం, ఆశలు పాల్గొన్నారు. మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణానికి చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని దామెరకుంట గ్రామంలో బుధవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో 6.02 ఎకరాలు, మల్లారంలో 17.15, గూడురులో 6.01 ఎకరాలు, జాదరావుపేటలో 5.04 ఎకరాలు మొత్తం దామెరకుంట క్లస్టర్ పరిధిలోని 34.22 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదివి వినిపించారు. అలాగే పలువురి రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ వెంకన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఓ పంక్షన్ హాల్లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు అవగాహనతో పాటు బా ధ్యతాయుత పౌరులుగా వ్యవహారించి, తాము నేర్చుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయాలన్నారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీలు, అనువాంచిన లింక్లు, సోషల్ మీడియా హ్యాకింగ్పై అవగాహన కల్పించారు. ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీఒక్కరూ హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, అధిక వేగం కారణంగా జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, డీటీఓ సంధాన్, సీఐలు, ఎస్సైలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొగుళ్లపల్లి/ చిట్యాల: గ్రంథాలయాల్లో సమయపాలన పాటించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. బుధవారం మొగళ్లపల్లి, చిట్యాల మండలకేంద్రాల్లోని గ్రంథాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రంథాలయం అనేది చాలా విలువైనదని, రోజు గ్రంథాలయాలకు వచ్చే అలవాటు చాలా మందికి ఉంటుందన్నా రు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రంథపాలకురాలు రాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, బుర్ర వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు. -
నిద్ర మత్తులో ‘నిఘా’
● ఇసుక అక్రమ వసూళ్లపై గప్చుప్ ● విజిలెన్స్ బృందాల జాడెక్కడకాళేశ్వరం: జిల్లాలో ఇసుక అక్రమ వసూళ్లపై నిఘా, విజిలెన్స్ బృందాలు నిద్రమత్తులో ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక రీచులలో జరుగుతున్న బహిరంగ అక్రమ దందాపై సంబంధిత శాఖలు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు విజిలెన్స్, నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. కాంట్రాక్టర్ల సిబ్బంది ఒక్కో క్వారీలో రోజుకు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. టీజీఎండీసీ, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వారికో ‘లక్కీ లైన్’ సంబంధిత శాఖల నిఘా, విజిలెన్స్ అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర పట్టణాల్లో నివసిస్తూ కింది స్థాయి సిబ్బందిపై మాత్రమే ఆధారపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వారానికి రెండుసార్లు వస్తుండడంతో.. ఫలితంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఇది లూప్లైన్ కాదు.. ఒక లక్కీ లైన్గా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి అక్రమ ఇసుక వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని పలువురు కోరుతున్నారు. టీజీఎండీసీ అధికారులు, అధికారులు దృష్టి సారిస్తే అక్రమ వసూళ్లు ఆగిపోయే అవకాశం ఉంది. పూస్కుపల్లి క్వారీ నిలిచినట్లు తెలిసింది. మిగితా, పలుగు–8, బొమ్మాపూర్ క్వారీల్లో లోడింగ్ జరిగింది. ఇసుక రీచులలో ఎక్స్ట్రా బకెట్ దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఆదేశాలు జారీచేసిన సమయంలో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా మూడు విడతల్లో విధులు నిర్వర్తించి అక్రమాలకు కట్టడి చేయగలిగాయి. ప్రస్తుతం మహదేవపూర్ మండలంలోని బొమ్మపూర్, పూసుకుపల్లి, పలుగుల–8 ఇసుక క్వారీ రీచులలో పరిస్థితి మారింది. సంబంధిత కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్ల నుంచి ఒక్కో వాహనానికి రూ.2,000 నుంచి రూ.3,000 వరకు లోడింగ్ పేరిట వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవని సమాచారం. -
పట్టింపేది?
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026● దారులన్నీ గుంతలమయం ● 22 రోజుల్లో జాతర.. ● నేటికీ ప్రారంభం కాని పనులు ● పలు జిల్లాల నుంచి రానున్న భక్తులుచిట్యాల: మండలంలోని వెంచరామి శివారులోని పూరేడు గుట్ట వద్ద శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర ప్రతీ రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా జరుగుతుంది. జాతరకు కేవలం 22 రోజుల సమయం మాత్రమే ఉన్నా కనీసం ఇప్పటి వరకు పనులేవీ ప్రారంభం కాలేదు. జాతరకు ప్రతీ యేటా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పనులకు మోక్షం కలగడం లేదు. -
అభ్యంతరాల్లో మచ్చుకు కొన్ని..
● భూపాలపల్లి మున్సిపాలిటీ 22 వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో 2–150/1 నుంచి 2–150/14డీ ఇంటి నంబర్పై 86 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా ఇదే కాలనీలో 20133/1, 2–134/1 ఇంటినంబర్లలో 42 ఓట్లు నమోదు చేశారు. ● రెండేళ్ల క్రితం ఇతర గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిన వారిని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వివిధ వార్డుల్లో నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వేశాలపల్లి శివారులో ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు కేటాయించారు. ఇందులో సుమారు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గృహాల్లో ప్రస్తుతం ఉంటున్న వారి పేర్లు భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్నగర్, కాశీంపల్లి, జంగేడు, కారల్మార్క్స్కాలనీ, కృష్ణానగర్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల ఓటరు జాబితాలో ఉన్నాయి. ● నర్సంపేట మున్సిపాలిటీలో సోమవారం వరకు 19 అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వచ్చాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారి వేర్వేరు వార్డుల్లో వచ్చాయని రెండు, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లాయని మూడున్నాయి. అలాగే, ఓట్లు లేకుండా పోయిన వారు ఒకటి, మృతుల పేర్లున్నాయని నాలుగు... ఇలా అభ్యంతరాలున్నాయి. ● జనగామ మున్సిపాలిటీ పరిధిలో 30 దరఖాస్తులు రాగా.. ఇందులో ఐదో వార్డు, 8వ వార్డులో పక్క వార్డులకు సంబంధించిన అదనపు ఓట్లు కలిశాయన్న ఫిర్యాదులున్నాయి. మిగతా దరఖాస్తులో ఓట్ల మిస్సింగ్, తొలగింపు, చేర్పులు, అడ్రస్ మార్పు తదితర విషయాలకు వచ్చాయని ఇచ్చారు. ● తొర్రూరు మున్సిపాలిటీలో రెండో వార్డులోని ఓటరు మూడవ వార్డులో నమోదయ్యాడు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు అందింది. ములుగు మున్సిపాలిటీలో ఓటరు పేరు సవరణ, రెండు ఓట్ల నుంచి ఒకటి తొలగింపు, ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిన ఓట్లను సవరించాలని మొత్తంగా 31 అభ్యంతరాలు అధికారులకు అందాయి. -
చైనా మాంజాతో పక్షులకు ప్రమాదం
● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ భూపాలపల్లి: సంకాంత్రి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా వాడటం వలన మనషులతో పాటు పక్షులకు సైతం ప్రమాదం వాటిల్లుతుందని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) డాక్టర్ ప్రభాకర్ అన్నారు. మాంజా వాడితే కలిగే నష్టాలను వివరించి.. వాల్పోస్టర్ను మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చైనా, సింథటిక్, గ్లాస్తో తయారు చేసిన మాంజాను జాతీయ హరిత ట్రిబ్యునల్, తెలంగాణ ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఈ మాంజా దారం తగిలి ప్రతీ ఏటా మనుషులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. ఎవరైనా ఈ మాంజా విక్రయించినా, వినియోగించినా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎఫ్డీఓ అప్పలకొండ, ఎఫ్ఆర్ఓ నరేష్, అటవీశాఖ అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
నేడు మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. 9న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9న సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పంతకాని సమ్మయ్య, పూతల సమ్మయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్–8 నుంచి అండర్–20 లోపు బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల జిల్లా అధికారులు జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను మంగళవారం గుర్తించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు పోలీసు, రవాణా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖ అధికారులు రేగొండ మండలం కొప్పుల క్రాస్రోడ్ నుంచి మహదేవ్పూర్ జంక్షన్ వరకు పర్యటించి రోడ్డు ప్రమాదాలు జరిగే 10 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలు, రహదారి లోపాలు, సైన్ బోర్డుల లేమి, మలుపులు, లైటింగ్ సమస్యలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని, అవసరమైన మరమ్మతులు, సైన్ బోర్డుల ఏర్పాటు, స్పీడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఓ మహ్మద్ సంధాని, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఐరాడ్ డీఆర్ఎం లక్ష్మణ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయగా.. 8 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మొగిలి రాజయ్యకు చెందిన గొర్రెల పాకలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వీధి కుక్కలు లోపలికి చొరబడ్డాయి. కరవడంతో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో 50వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు మొగిలి రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పులి కాదు.. అడవి పిల్లి రేగొండ: మండలంలోని మడతపల్లి శివారులోని రైస్ మిల్ వద్ద మంగళవారం పులి తిరుగుతున్నట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. దీంతో అటవీ సెక్షన్ అధికారి ప్రవీణ్ సిబ్బందితో కలిసి రైస్ మిల్లు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పాదముద్రలను పరిశీలించారు. అడవి పిల్లిగా నిర్ధారించారు. ఫోన్లో వీడియో తీసిన మిల్లు కార్మికుడిలో మాట్లాడి వివరాలు సేకరించారు. మిల్లు పక్క నుంచి జంతువు వెళుతుండగా అతి సమీపంలో నుంచి వీడియో తీసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు గీత, రాజేందర్ పాల్గొన్నారు. -
ముసాయిదాపై గుస్సా!
సాక్షిప్రతినిఽధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. ఇందులో 9 మున్సిపాలిటీలు పాతవి కాగా, కొత్తగా ఏర్పడిన ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫిర్యాదులు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వరకు అభ్యంతరాల సంఖ్య 509కి చేరింది. మొదట ఐదో తేదీ వరకే స్వీకరించనున్నట్లు చెప్పిన అధికారులు ఆ తర్వాత ఈ నెల 8 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. దీంతో వార్డుల వారీగా అభ్యంతరాల సంఖ్య పెరుగుతోంది. ఓటర్ల జాబితాలో అంతా గందరగోళం.. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ము సాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న గందరగోళంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పరకాల, స్టేషన్ఘన్పూర్ నుంచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లు తొలగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి పొరుగు గ్రామాలకు మకాం మార్చిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటంపై అభ్యంతరాలున్నాయి. మహబూబాబాద్, జనగామ తది తర మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నివాసం ఉంటున్న వారి ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చాలాచోట్ల చనిపోయిన వారి పేర్లతోపాటు విదేశాలకు వెళ్లిన వారివి కూడా ఉన్నట్లు ఫిర్యాదులుండగా.. ఒకే ఇంటివారి ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండడం, ఒక వార్డు నుంచి మరో వార్డులోకి వెళ్లడంపై అభ్యంతరాలు ఉన్నాయి. పరకాలలో వార్డులు మార్చాలనే ఫిర్యాదులు.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 11 అభ్యంతరాలు వచ్చాయి. అందులో తమ ఓట్లు మరో వార్డులో వచ్చాయని.. వాటిని మార్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా యాదవనగర్ కాలనీలోని ఒకేవాడకు చెందిన వారి ఓట్లు మూడు వార్డుల్లో ఉండటంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆందోళనలో సీతారాంపూర్ గ్రామ వాసులు.. గతంలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డుల పునర్విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందని సీతారాంపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్లో 2,200 మంది ఓటర్లు ఉండగా ఒక్కరిది కూడా అభిప్రాయం తీసుకోకుండా మూడు వార్డులు (6,7,9) విభజించారని..ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో సవరణ చేయాలంటూ అధికారులకు అభ్యంతరం తెలిపారు. ఒకే కాలనీలోని 500 మంది ఓటర్లను మూడు వార్డుల్లో కలిపారు. దీంతో పేరుకు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నా ప్రయోజనం లేదు. సమస్యను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు చూపించుకుంటూ పట్టించుకోవడం లేదు. ఈసారైనా న్యాయం జరుగుతుందన్న ఆశతో మున్సిపల్ అధికారుకు ఫిర్యాదు చేశాం. – ఉడుత చిరంజీవి, సీతారాంపూర్, పరకాల మున్సిపాలిటీ తప్పులపై అధికారులకు ఫిర్యాదుల వెల్లువ జాబితాలో స్థానికేతరులు, చనిపోయిన వారి పేర్లు పదో తేదీ నాటికి లిస్ట్ ఫైనల్ అనుమానమే -
మీ పేరుందా?
భూపాలపల్లి అర్బన్: పురపాలక ఎన్నికల పోరుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారు. పురపాలికలో ఓటర్లు పేర్లు చూసుకునే పనిలో ఉన్నారు. జాబితాలో పలు రకాల తప్పులు నమోదయ్యాయి. ఒక వార్డులోని ఓటర్లు మరో వార్డు జాబితాలోకి, మరికొందరివి రెండు, మూడు వార్డుల్లో నమోదయ్యాయి. మరోవైపు జాబితాలో ఉన్న పేర్లు పోర్టల్లో కనిపించకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఆయా వార్డుల్లో వాటిపై అభ్యంతరాలు తెలిపే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. అభ్యంతరాలుంటే పురపాలిక కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలి. అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తుది జాబితాను ఈనెల 10న ప్రచురిస్తారు. సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో చూసుకొనే విధానం https://tsec.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల పేర్లు సరిచూసుకోవచ్చు. పోర్టల్లో మెనూ ఆప్షన్ ఎంచుకొని డౌన్లోడ్ ఓటరు స్లిప్ బై ఎపిక్ ఐడీని ఎంచుకోవాలి. ఇందులో జిల్లా, పురపాలక, వార్డు, ఎపిక్ నంబరును నమోదుచేస్తే వివరాలు కనిపిస్తాయి. జాబితాలో పేరులేని వారు పురపాలిక కార్యాలయంలో ఈ నెల 10 వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. కొత్త వారికి ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు. సాధారణ ఎన్నికల జాబితానే కీలకమని అధికారులు చెబుతున్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి సోమవారం వరకు 73 ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు అభ్యంతరాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. 20కిపైగా ఓటరు జాబితాలో పేరు కనిపించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్లైన్లో చూసుకునేందుకు అవకాశం అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఈనెల 10న తుది జాబితా -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. సాయంత్రం నుంచి చలి ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తుంది. పూరేడు గుట్ట జాతరలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి. వెంచరామి నుంచి జాతర వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చొరవ తీసుకోవాలి. గతంలో జాతర ఏర్పాట్లకు రూ.30 లక్షల నిధులు కేటాయించారు. శాశ్వత పనులు చేపట్టాలి. రూ.50లక్షల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కోరుతున్నా. – కాసు రమ, వెంచరామి సర్పంచ్ పూరేడు గుట్ట జాతర పనులు రెండు రోజుల్లో ప్రారంభిస్తాం. జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. భక్తులకు లోటుపాట్లు లేకుండా అధికారులతో కలిసి సమష్టిగా పని చేస్తాం. – గీతారెడ్డి, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ -
స్వర్ణకారుల అభివృద్ధికి కృషి
● శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్వర్ణకారుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి తెలిపారు. జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో స్వర్ణకార సంఘం భవనానికి తన నిధుల నుంచి రూ.20లక్షల నిధులు కేటాయిస్తానని తెలిపారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, దొంగ బంగారం పేరుతో స్వర్ణకారులపై వేధింపులను ఆపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. -
జారీ చేసిందెవరు?
రేగొండ: కాటారం మండలానికి చెందిన వ్యక్తి రేగొండ మండలం నుంచి కులం సర్టిఫికెట్ తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి సావిత్రి జిల్లాకేంద్రంలోని ఓ మీసేవ సెంటర్లో సిటిజన్ పోర్టల్ ద్వారా రేగొండ మండలకేంద్రం నుంచి కుల ధ్రువీకరణ పత్రం మంజూరు కోసం డిసెంబర్ 1న దరఖాస్తు చేసుకుంది. రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పత్రాలూ అందజేయకుండానే డిసెంబర్ 2న గాండ్ల–6 (బీసీ–బీ) కుల ధ్రువీకరణ పత్రం మంజూరైంది. ఈ సర్టిఫికెట్తో ఆమె ఇటీవల సర్పంచ్గా పోటీచేసి గెలుపొందింది. దీంతో ప్రత్యర్థి జనవరి 2న సమాచార హక్కు చట్టం ద్వారా కుల ధ్రువీకరణ పత్రం వివరాలను తహసీల్దార్ను కోరగా విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా.. కాటారం మండలానికి చెందిన వ్యక్తికి రేగొండలో కుల ధ్రువీకరణ పత్రం మంజూరైన విషయం వాస్తవేమన్నారు. ఈ విషయమై ఆర్ఐ, ఇద్దరు జీపీఓలకు, జూనియర్ అసిస్టెంట్కు మెమో జారీచేసినట్లు తెలిపారు. తప్పుడు పత్రాలతో సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. నివేదికను కలెక్టర్కు పంపినట్లు తెలిపారు.కాటారం వ్యక్తికి రేగొండలో కులం సర్టిఫికెట్ -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: పేదలకు సొంత గృహం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మున్సిపల్, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3,943 ఇళ్లు మంజూరు కాగా, 765 ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిత్తడి నేలలను గుర్తించాలి.. జిల్లాలో చిత్తడి నేలలను (వెట్ ల్యాండ్స్) గుర్తించి, వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర డేటాను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డితో కలిసి జిల్లా చిత్తడి నేలల జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇరిగేషన్, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. క్రీడాపోటీలకు ఏర్పాట్లు చేయాలి.. సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఫిజికల్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయిలో, అనంతరం మండల, జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 47 దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆధార్ ఆధారిత హాజరు విధానం పాటించాలని సూచించారు. చిత్తడి నేలల వివరాలు సమర్పించాలి సీఎం కప్ క్రీడా పోటీలకు ఏర్పాట్లు కలెక్టర్ రాహుల్ శర్మ -
అక్రమ వసూళ్లకు అడ్డెవరు?
కాళేశ్వరం: ఇసుక మాఫియా అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయడంలో సంబంధిత అధికారులు వెనుకా డుతున్నారు. ఎక్స్ట్రా బకెట్ దందా నిలిచిపోయినా తమ లాభార్జనే ధ్యేయంగా ఇసుక రీచ్లకు వచ్చే లారీ డ్రైవర్ల వద్ద రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికారుల అండతో కాంట్రాక్టర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్టర్లకున్న రాజకీయ పలుకుబడితో వసూళ్లకు రెచ్చిపోతున్నట్లు వినికిడి. మహదేవపూర్ మండలంలో బొమ్మాపూర్, పలుగుల–8, పూస్కుపల్లి మూడు ఇసుక క్వారీల్లో వందలాదిగా తరలివచ్చే లారీల వద్ద కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. బుజ్జగింపు ఎందుకు..? మహదేవపూర్ మండలకేంద్రానికి చెందిన ఓ లారీ ఓనర్ తన వద్ద ఇసుక రీచ్ కాంట్రాక్టర్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళితే సదరు పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని సమాచారం. ఆ తరువాత టీజీఎండీసీ అధికారి ఫిర్యాదుతో పాటు లారీ నిర్వాహకులతో ఫిర్యాదు ఇవ్వకుండా బతిమిలాడినట్లు తెలిసింది. ఫిర్యాదు ఇవ్వకుండా ఇంత బుజ్జగింపులు ఎందుకు చేస్తున్నారో అధికార యంత్రాంగం అర్థఽం చేసుకొని చర్యలకు రంగం సిద్ధం చేయాలని పలువురు లారీడ్రైవర్లు కోరుతున్నారు.ఇసుక రీచ్లకు వచ్చే లారీడ్రైవర్ల వద్ద క్వారీకి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎవరూ లేని చోటనే అడ్డాగా లోడింగ్ పేరిట అక్రమంగా రూ.2వేల నుంచి 3వేల వరకు ఒక్కో లారీకి కాంట్రాక్టర్ల సిబ్బంది వసూలుకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్లు కొత్త ఎత్తుగడతో క్వారీల వద్ద డబ్బులు వసూలు చేయడం లేదని అధికారులకు వీడియో కాల్ చేసి లారీడ్రైవర్లతో మాట్లాడించడం విస్మయానికి గురిచేస్తోంది. ఒకరిద్దరు లారీడ్రైవర్లతో ‘మా వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోలేదు’ అని వీడియో చిత్రీకరించి అధికారులకు చూపిస్తూ తమపైకి ఫిర్యాదు రాకుండా చూసుకుంటున్నారు. దీంతో ఉన్నతాధికారులు నిజమే అని నమ్ముతూ గమ్మునుంటున్నట్లు తెలిసింది. విజిలెన్స్, మైనింగ్ ఉన్నతాధికారులు వస్తున్నారని రీచ్లలో ముందుగానే సమాచారం అందుతుంది. ఆ రోజు ఆ తనిఖీ బృందాలు వెళ్లే వరకు లోడింగ్ నిలిపివేస్తున్నారు. ఎంత రాత్రి వరకు ఉంటే అప్పటి వరకు వారు వెళితే తప్ప లోడింగ్ జరగడం లేదు. దీంతో వారి స్వంత ఖజానాకు పైసలు నిండే వరకు లోడింగ్ ఆగాల్సిందే అన్నట్లు ఉంది. ఇంత నెట్వర్క్ మెయింటెన్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు. ఇదంతా స్థానికంగా ఉండే టీజీఎండీసీ కనుసన్నల్లోనే జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై పీఓ రామకృష్ణను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. డబ్బులు ఇవ్వడం లేదని లారీడ్రైవర్లతో వీడియో కాల్ తనిఖీలకు అధికారులు వస్తే లోడింగ్ నిలిపివేత టీజీఎండీసీ కనుసన్నల్లోనే వ్యవహారం -
ఏజెన్సీల ఇష్టారాజ్యం
భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం ఇష్టారాజ్యంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వారే ఉద్యోగులను ఎంపిక చేసి నియామక పత్రాలను రెండు రోజుల క్రితం అందించినట్లు తెలిసింది. దీంతో అనర్హులు ఉద్యోగాలు పొందగా అర్హులు అన్యాయానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 34 మంది నియామకానికి.. టెక్నికల్, నాన్ టెక్నికల్, పారామెడికల్, ఎలక్ట్రిషన్, ల్యాబ్ అటెండెంట్, అనస్తీషియా, రేడియో గ్రాఫర్ టెక్నీషియన్లకు సంబంధించిన 34 మంది నియామకానికి గత నెల 27వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 30వ తేదీ వరకు అమ్మ సోషల్ సర్వీస్, శ్రీ వినాయక మాన్పవర్ సొల్యూషన్స్, శ్రీ వెంకటేశ్వర ఎస్సీ, ఎస్టీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తులను స్వీకరించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకాలకు సంబంధించిన దరఖాస్తులు సంబంధిత కార్యాలయ అధికారులు స్వీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత ఏజెన్సీలకు జాబితా అందిస్తారు. అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు నియమాక పత్రాన్ని అందిస్తారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నియామకాల్లో నిబంధనలు పాటించలేదు. పరిశీలన లేకుండానే.. 34 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించిన ఏజెన్సీల నిర్వాహకులు పరిశీలనలు చేపట్టకుండానే నియామకాలు ఆదివారం రాత్రి అందించినట్లు తెలిసింది. వచ్చిన పూర్తి దరఖాస్తులను పరిశీలించిన మెరిట్ జాబితాలను పదర్శించిన తరువాత నియామకాలు చేపటాల్సి ఉంటుంది. కలెక్టర్, సంబఽంధిత మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, సూపరిటెండెంట్కు సైతం సమాచారం లేదు. ఆస్పత్రిలో పనిచేసే వారికి కనీస అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 20 మంది ఔట్ సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి అవకాశం కల్పించలేదు. అనుభవం లేని వారికి రాజకీయ బలం, ధన బలం ఉన్నవారికి నియామక పత్రాలు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. విధులు నిర్వర్తిస్తున్న తమకు అవకాశం కల్పించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది సోమవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దరఖాస్తుల స్వీకరణ.. నియామక పత్రాలు అందజేత కలెక్టర్ స్పందిస్తే అర్హులకు న్యాయం -
నేటినుంచి విద్యుత్ ప్రజాబాట
హన్మకొండ : వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి(మంగళవారం)నుంచి ప్రజాబాట ద్వారా వినియోగదారుల ముంగిటికి వెళ్లనుంది. పొలంబాట ద్వారా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు చేరుకుని నేరుగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లోనూ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధానాలు కొనసాగుతుండగానే కొత్తగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. ఆయా సెక్షన్ పరిధిలో ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారులనుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు, నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వీరి సమక్షంలో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకుంటారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. సెక్షన్ స్థాయిల ఏఈల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్.ఈ, డీఈ, ఏడీఈలు అందరూ ఒకేచోట పాల్గొనవద్దని ఆదేశాలున్నాయి. ఒక కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొంటే మరో కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్, మరో కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్గొంటారు. ఇలా సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఉన్నతాధికారులు మూడు సెక్షన్లలో నిర్వహించే ప్రజా బాటలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీరితో పాటు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొనే అవకాశముంది. నేటి (మంగళవారం)నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటన సమస్యల గుర్తింపు, అప్పటికప్పుడు పరిష్కారం ప్రతి సెక్షన్లో వారానికి మూడు రోజులు -
సరిపడా యూరియా నిల్వలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బా బురావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. వదంతులు నమ్మి అవసరానికంటే ఎక్కువగా యూరియా బస్తాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. నిల్వ చేయడం వలన మిగతా రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 3,787 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1893098307ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దు చిట్యాల: వాహనదారులు మద్యం తాగి వాహనం నడపవద్దని జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఎస్సై శ్రావన్కుమార్తో కలిసి వెంకట్రావుపల్లి(సీ) నుంచి విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం డీటీఓ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతీ వాహనదారుడికి లైసెన్స్ తప్పకుండా ఉండాలన్నారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అనంతరం విద్యార్థులు మానవహారం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేవారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సుందర్లాల్, శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. -
10నుంచి టీసీసీ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (టీసీసీ) పరీక్షలు ఈనెల 10వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్ ఆదివారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ.తెలంగాణ వెబ్సైట్లో డౌన్లోడ్ హాల్టికెట్లు చేసుకోవాలని సూచించారు. డ్రాయింగ్ విద్యార్థులు డ్రాయింగ్ సామగ్రిని వెంట తెచ్చుకోవాలని, టైలరింగ్ విద్యార్థులు కుట్టు మిషన్ తీసుకొని పరీక్షా కేంద్రానికి రావాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠఽశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ ఓటరు జాబితా ముసాయిదాపై నేడు(సోమవారం) రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల పట్టణ అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని కోరారు. మల్హర్(కాటారం): కాటారం ట్రైబల్ గురుకులం పాఠశాలకు చెందిన పీ.రమేశ్ అండర్–14 జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 25 నుంచి 27 వరకు మహబూబ్నగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలో వరంగల్ జట్టు తరఫున రమేశ్ పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి.. ఈనెల 05 నుంచి 10వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపియ్యాడు. దీంతో ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జైపాల్, పేట సంఘం ప్రెసిడెంట్ శిరంగి రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాధ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య అభినందించారు. కార్యక్రమంలో బలరాం, కుడిమేత మహేందర్, మంతెన శ్రీనివాస్, మూల వెంకటేష్ పాల్గొన్నారు. వెంకటాపురం(కె): లాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులరైజేషన్(ఎల్టీఆర్) చట్టానికి విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆదివాసీ గ్రామాలలో ఆయన ప్రర్యటించి మాట్లాడారు. మండల కేంద్రంలో గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎల్టీఆర్ చట్టం 1939 లేదా అనుబంధ చట్టాలైన 1/59, 1/70 వంటి పటిష్టమైన చట్టాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికారులు గిరిజనేతరుల భూ క్రయవిక్రయాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్శిక్, అనిల్, నవీన్ పాల్గొన్నారు. -
ఈడబ్ల్యూఎస్పై దుష్ప్రచారం సరికాదు
మల్హర్(కాటారం): రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచా రాలు సరికాదని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. ఓసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈనెల 11న వరంగల్ హనుమకొండలో నిర్వహించే ఓసీల సింహగర్జన సభకు సంబంధించి వివిధ మండలాల ఐకాస ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆదివారం కాటారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్టశక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆరోపించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు కూడా కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనవరి 11న హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించన్ను ఓసీల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చే యాలని కోరారు. అనంతరం బహిరంగ సభకు సంబంధించిన వాల్పోస్టర్లు, ప్రతులు, ఆహ్వాన పత్రికలని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఓసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మందల రాజిరెడ్డి, ఐకాస రాష్ట్ర నాయకులు జనగామ కరుణాకర్రావు, గుడాల శ్రీనివాస్, అనంతుల రమేశ్, వాల యాదగిరిరావు, మహేశ్, రవీందర్రావు, రవిశంకర్రెడ్డి, ఉన్నం అంజయ్య, ఐలినేని నవీన్రావు, శ్రీనివాస్, సరీన్రావు, ఎంఎల్ఎన్ మూర్తి పాల్గొన్నారు.ఓసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు -
అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణ ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ, మంజూరునగర్లో రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్– నాన్ వెజ్ మార్కెట్ బ్యాలెన్స్ పనులతోపాటు ఆడిటోరియం బ్యాలెన్స్ పనులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. కమిషనర్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి రేగొండ: కొడవటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు సూచించారు. ఆదివారం కొడవటంచ ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వరకు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు బాలాలయంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటర్ల జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశా రు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే? మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగ ల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్ల గొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు 11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు ముసాయిదా జాబితామౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభామున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు సంఖ్య జనాభా పరకాల 22 34,318 472 8,262 నర్సంపేట 30 51,086 4,397 7,110 వర్ధన్నపేట 12 13,732 3,980 2,470 జనగామ 30 52,408 1,694 8,335 స్టేషన్ఘన్పూర్ 18 23,483 962 6,663 భూపాలపల్లి 30 57,138 4,464 11,966 మహబూబాబాద్ 36 68,889 14,220 9,709 డోర్నకల్ 15 14,425 3,536 2,866 కేసముద్రం 16 18,548 3,754 2,418 మరిపెడ 15 17,685 7,635 3,062 తొర్రూరు 16 19,100 2,093 3,985 ములుగు 20 16,533 1,844 2,470 మొత్తం 260 3,87,345 49,051 69,316 -
కిక్కిరిసిన మేడారం
భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ సమ్మక్క గద్దె వద్ద భక్తులు..మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుకిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. -
పూలే సేవలు చిరస్మరణీయం
● కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ భూపాలపల్లి అర్బన్: బాలికల కోసం తొలి పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు దిశానిర్దేశం చేసిన సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కొనియాడారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సబ్కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తూ దేశానికి ఉత్తమ పౌరులను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బాలబాలికల్లో ప్రేరణ కలిగించేలా విద్యాబోధన చేయాలని, సమసమాజ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములుగా తీర్చిదిద్దాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో ప్రతీ సమస్యను అధిగమించేలా విద్యార్థులను మలచాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని 18మంది మహిళా ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీఎంఓ సామల రమేష్, ఏఎంఓ పింగిలి విజయపాల్రెడ్డి, ఏఎస్ఓ రామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు మండలాల మహదేవపూర్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ప్రారంభమైంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ హసీనభానో ప్రారంభించారు. ఈ సందర్భంగా కోట రాజబాబు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు పోలీసులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు పవన్కుమార్, సాయిఽశశాంక్, తమాషారెడ్డి, రమేష్, ఉప సర్పంచ్ శ్రీజ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీతోనే సమస్యల పరిష్కారం భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలు ఐఎన్టీయూసీతోనే పరిష్కారమవుతున్నాయని ఆ యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జోగు బుచ్చయ్య. పనునూటి రాజేందర్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో శనివారం బ్రాంచ్ ఇన్చార్జ్ ఉపాధ్యక్షుడు బొడ్డు ఆశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చర్చించి పలు సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మిరెడ్డి, రాజు, రాజేష్ఠాకుర్, రవికిరణ్, శ్రీకాంత్, అశోక్, శ్రీనివాస్, సంతోష్, వెంకటేశ్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డీపీఓను కలిసిన ఆపరేటర్లు మొగుళ్లపల్లి : జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు శనివారం జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతను కలిశారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని సమస్యలు వివరించి వినతిప్రతం అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీపీఓ అన్నారు. డీపీఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, తిరుపతి, పవన్, శ్రీహరి పాల్గొన్నారు. వాగ్దానాలను విస్మరించిన సంఘాలు భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు మోసపూరిత వాగ్దానాలు చేసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేశారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహరావు ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హమీలను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ విఫలమైనట్లు ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య, వివిధ ఏరియాల నాయకులు రమేష్, సారయ్య, శివరెడ్డి, శషి, కిరణ్, సాగర్, అజయ్, నరహరి, బాబురావు, శ్రీనివాస్, ప్రసాద్, కిరణ్లు పాల్గొన్నారు. టైలరింగ్లో ఉచిత శిక్షణ భూపాలపల్లి అర్బన్: హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని సంస్కృతిక విహార్లో ఏర్పాటుచేస్తున్న మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణను ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఇన్చార్జ్ కిశోర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 5లోపు విద్యార్హత, రేషన్కార్డు, ఆధార్, పాన్కార్డు జిరాక్స్లతో సంప్రదించాలన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి విధులకు హాజరయ్యే కార్మికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. శనివారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో రహదారి భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పెరిగినప్పటికీ వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 37 సంవత్సరాలుగా ‘రోడ్ సేఫ్టీ వీక్’ నిర్వహించినప్పటికీ ప్రమాదాలు తగ్గకపోవడంతో భారత ప్రభుత్వం దీనిని జాతీయ రోడ్ భద్రత మాసోత్సవంగా మార్పు చేసిందన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి నెల మొత్తం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాసోత్సవం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం గాయపడిన క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25వేల నగదు ప్రోత్సాహకం అందించడంతో పాటు, చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ఏఎంవీఐలు సుందర్లాల్, శ్రీనివాస్, సింగరేణి అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలుజనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25 వరకు రిహార్సల్స్ రహదారులపై గుంతలను పూడ్చేయాలి ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు కలెక్టర్ రాహుల్ శర్మ -
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
● లారీడ్రైవర్ల వద్ద రూ. 2వేల నుంచి రూ.3వేల వరకు వసూలు ● చోద్యంచూస్తున్న అధికారులుఇసుక క్వారీలో లోడింగ్ కాళేశ్వరం: ప్రభుత్వం నిఘా తీవ్రం చేయడంతో గతేడాది నుంచి ఇసుక క్వారీల్లో ఎక్స్ట్రా బకెట్ దందాకు కాంట్రాక్టర్లు స్వస్తి పలికారు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్వారీల్లో అదనపు బకెట్లు నడిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీరియస్గా హెచ్చరించారు. ఆ సమయంలో క్వారీల వద్ద మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో మూడు షిప్టుల్లో నిఘాను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎక్స్ట్రా బకెట్లు నడపటం లేదు. దీంతో కొత్తగా క్వారీ కాంట్రాక్టర్లు తమకు ఆదాయం సన్నగిల్లిందనే సాకుతో క్వారీలకు వచ్చే లారీడ్రైవర్ల వద్ద ఒక్కో లారీకి లోడింగ్ చార్జీల పేరిట రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతా ఆన్లైన్లోనే.. ఇసుకకు ఆన్లైన్లో రూ.375 ఒక టన్నుకు చెల్లిస్తారు. అందులోనే లోడింగ్ చార్జీలు కూడా ఉంటాయి. ఈ డబ్బులు నేరుగా రాష్ట్ర టీజీఎండీసీ ఖాల్లోకి చేరుతాయి. ఇలా చెల్లించిన మొత్తం నగదును కాంట్రాక్టర్లకు లోడింగ్ చార్జీల కింద ప్రభుత్వం అందిస్తుంది. సకాలంలో ఆ చెల్లింపులు ఆలస్యం కావడంతో లారీ డ్రైవర్ల వద్ద కొత్త నాటకానికి తెరలేపి అక్రమంగా వేలల్లో లోడింగ్ చార్జీల పేరిట వసూలుకు పూనుకుంటున్నారు. ఇలా ఆన్లైన్లో చెల్లించిన మొత్తం, లారీ డైవర్ల వద్ద చెల్లించిన నగదు కాంట్రాక్టర్లకు చేరుతుండడంతో లారీల యజమానులు రెండు రకాలుగా నష్టపోతున్నామని వారం రోజుల కిందట టీజీఎండీ, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అప్పుడు కాస్త ఊరటనిచ్చి రూ.2వేల వరకు తీసుకోవాలని ఆదేశాలు అందజేశారని తెలిసింది. ఈ విషయమై మహదేవపూర్ టీజీఎండీసీ పీఓ రామకృష్ణను ఫోన్ద్వారా సంప్రదించగా.. ఎలాంటి అధిక మొత్తం చార్జీలు తీసుకోవడం లేదని.. తన దృష్టికి రాలేదని తెలిపారు. మేడారం వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి పేర్కొన్నారు.రూ.3వేల వరకు లోడింగ్ పేరిట వసూలు చేస్తుండడంతో అక్రమంగా రూ.లక్షల్లో పక్కదారి పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. 300లారీలకు ఒక రోజుకు రూ.9లక్షల వరకు పక్కదారి పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత మంది ఇస్తుండడం, మరి కొంతమంది ఇవ్వకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. లోకల్ లారీల వద్ద కొంత తక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఎవరైనా అధికారులు తనిఖీలకు వస్తే ముందస్తుగానే తెలుసుకొని లోడింగ్ చార్జీలు నిలిపివేస్తున్నట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా సంబంధిత టీజీఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.సీఎం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూనే కాంట్రాక్టర్లు టీజీఎండీసీ కనుసన్నల్లోనే లోడింగ్ చార్జీల వసూలుకు నడుం బిగించారు. గతంలో ఎక్స్ట్రా బకెట్కు రూ.4వేల నుంచి 6వేల వరకు వసూలు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఒక్క కిలో ఇసుక కూడా అదనంగా తరలిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నిఘా తీవ్రంగా ఉండడంతో అనుమానాలు లేకుండా ముక్కుపిండి మరీ డ్రైవర్ల వద్ద లోడింగ్ పేరిట రూ.2వేల నుంచి 3వేల వరకు దర్జాగా వసూలు చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో మూడు క్వారీల్లో బొమ్మాపూర్, పలుగుల, పూస్కుపల్లి క్వారీల్లో నిత్యం మూడు వందలకు పైగా వరకు లారీలు ఇసుక లోడింగ్ జరుగుతుంది. -
వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ
గోదాదేవి సారెతో ఆలయానికి తరలివచ్చిన భక్తులుమంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారి జీడికంటి మధుసూదనాచార్యులు వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 16 నుంచి కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆలయంలోని గోదాదేవి అమ్మవారికి పూజారి మధుసూదనాచార్యులు వేద మంత్రోశ్చరణ నడుమ సారె సమర్పణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయకమిటీ బాధ్యులు, భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు నూతన పట్టు వస్త్రాలు, వివిధ రకాల పిండి వంటలు, పండ్లతో మంగళవాయిద్యాల నడము ఆలయానికి చేరుకుని సారె సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. ఈనెల 13న గోదాదేవి కల్యాణ మహోత్సవంతో ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయని పూజారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, గౌరవ అధ్యక్షులు దేవకి, కరి వెంకాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్ల కొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి పూసాల సరోజి, భక్తులు మన్నె నాగేశ్వర్రావు, కడియాల సుదర్శన్, శ్రీనివాస్, గుజ్జుల కోటిరెడ్డి పాల్గొన్నారు. -
పట్టణ అభివృద్ధికి సింగరేణి సహకరించాలి
భూపాలపల్లి అర్బన్: పట్టణ అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం సహకరించాలని భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ కోరారు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తన కార్యాలయంలో కమిషనర్, సిబ్బందితో చర్చించారు. కమిషనర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ సింగరేణి నుంచి మున్సిపల్కు రావాల్సిన ఆస్తి పన్నును చెల్లించాలని కోరారు. పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. త్వరలోనే వార్డుల వారీగా అధికారులతో కలిసి పర్యవేక్షణ చేస్తామని జీఎం తెలిపారు.మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ -
ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల సీహెచ్సీల్లో సౌకర్యాలు కల్పించాలని శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కోరారు. శాసన మండలి సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆస్పత్రులను సందర్శించి రోగులు, డాక్టర్లతో మాట్లాడినట్లు తెలిపారు. డాక్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ సౌకర్యాలు లేవన్నారు. పారామెడికల్ సిబ్బందిని నియమించాలని కోరారు. నాణ్యమైన వైద్యసేవలు లేకపోవడంతో ఓపీ సంఖ్య తగ్గిపోయిందన్నారు. పేషెంట్ కేర్, శానిటేషన్ సక్రమంగా లేదని, ల్యాబ్ అప్గ్రేడ్ చేయాలని, 10మంది సీఎంఓ, ఆర్ఎంఓలు ఉండాల్సి ఉండగా ఒక్క ఆర్ఎంఓ మాత్రమే ఉన్నారన్నారు. మెడికల్ కళాశాలలో సరైన తరగతి గదులు, ల్యాబోరేటరీలు లేవని అన్నారు. 30శాతం సౌకర్యాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కరోనా తరువాత అనారోగ్య సమస్యలు అఽధికంగా వస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చాలని అవసరం ఉందని కోరారు.శాసనమండలిలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాట
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. 14వ వార్డు జంగేడులో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో శుక్రవారం బస్తీబాట నిర్వహించారు. బస్తీబాటకు హాజరైన గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కాలనీలు తిరుగుతూ కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై ప్రజలు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, భవిష్యత్లో కూడా భూపాలపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు
ఎస్ఎస్తాడ్వాయి/ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఆర్బీ డీఎస్పీ, ఆపరేషన్ స్మైల్ –12 కార్యక్రమ జిల్లా ఇన్చార్జ్ కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మేడారంలోని హరిత హోటల్లో బాలల పరిరక్షణ జిల్లా అధికారి ఓంకార్ అధ్యక్షతన నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైనర్లను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేడారం జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార వృత్తిదారులు, భిక్షాటన చేసేవారిలో బాలకార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలన్నారు. పిల్లలు చదువుకుంటనే వారి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ మట్లాడుతూ.. బాల్యం అమూల్యమైన దశ అని 14 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ.. బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ మధు, ఎస్సై ఇమ్మాన్యూఝెల్, హరికృష్ణ, సంజీవ, రజిని, విక్రమ్, గీత, చంటి, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ చిత్రాలపై పునఃపరిశీలించాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి స్తంభాలపై చెక్కిన ఆదివాసీ చిత్రాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని తుడుందెబ్బ కమిటీ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు. తుడుందెబ్బ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాతి స్తంభాల చెక్కిన చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులకు నిధులు కేటాయించి, ఆదివాసీల చరిత్రను ప్రపంచానికి తెలిసేలా పనులు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులుగా ఉంటూ ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలను అవలంభిస్తున్నారని, అటువంటి విధానం కలిగిన ఆదివాసీలకు హిందుత్వ మూలాలు అంటగట్టే ప్రయత్నం సరికాదని అభిప్రాయపడ్డారు. ముఖద్వారం మీద స్వస్తిక్ గుర్తు, పగిడిద్దరాజు గద్దెల వద్ద రాతి చిత్రాలపై ఉన్న శంఖు, చక్రాలు, తిరునామాల చిత్రాలను సంస్కృతిలో పెట్టడం ద్వారా ఆదివాసీల చరిత్రను భవిష్యత్ తరానికి తప్పుగా తెలియజేసినట్టేనన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ చిత్రాలపై పునఃరిశీలన చేసి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాల్లో పెద్దమనుషులు, పడిగెలు కుట్టె కళాకారులు, కోయ పురాణం చెప్పే కోయ కళాకారుల ప్రాతినిథ్యం ఉంటుందని.. నిర్మాణంలో వారి భాగస్వామ్యం లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆదివాసీ రాజకీయ జేఏసీ చైర్మన్ వాసం రామకృష్ణ, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, తుడుం దెబ్బ జాతీయ కోకన్వీనర్లు రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు వట్టం కన్నయ్య, పూనెం శ్రీను, పాయం జా నకి, చిట్టిబాబు, జనార్ధన్, జిల్లా అధ్యక్షుడు చందా మహేష్, కార్యదర్శి కాపుల సమ్మయ్య పాల్గొన్నారు.తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య -
కార్మికులను మోసం చేసిన సంఘాలు
భూపాలపల్లి అర్బన్: సమస్యలను పరిష్కరించకుండా సింగరేణి కార్మికులను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు మోసంచేశాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాపాడటంలో టీబీజీకేఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్మికుల నమ్మకాన్ని పొందిన సంఘమే రాబోయే రోజుల్లో బలంగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోతే, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను నమ్మి సింగరేణి కార్మికులు మోసపోయారన్నారు. కార్మికులకు లాభాల వాటా ఇవ్వడంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణిని ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందని, కాంట్రాక్టర్లను సైతం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అప్పజెపుతూ సంస్థను నిండా ముంచుతుందని విమర్శించారు. 2025 డిసెంబర్ 27 నాటికి గుర్తింపు సంఘం కాలం చెల్లిందని, ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం సింగరేణిలో వెంటనే కార్మిక సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తూ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మారుపేర్ల విషయంలో కార్మికులను సైతం మోసంచేసిందని మహిళలను అండర్ గ్రౌండ్లోకి దిగాలని బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. వివిధ సంఘాల నుంచి టీబీజీకేఎస్లో చేరిన నాయకులు బత్తిని సుదర్శన్, అనిల్రెడ్డి, సాంబయ్యతో పాటు మరో 30మంది కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సమ్మయ్య, రత్నం అవినాష్రెడ్డి, మధు, సదానందం, సుంకర్ గోవర్ధన్, నరేందర్, మల్లారెడ్డి, రవి, రాజేందర్, రవీందర్, కుమారస్వామి పాల్గొన్నారు.టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి -
టికెట్ల జారీలో ఆగని అవినీతి!
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే.. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మ్యాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మరోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 శుక్రవారం వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘాలోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలున్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై దేవాలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి ఎక్కడా జరగలేదని, సోషల్మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో కేవలం ప్రసాదాల అమ్మకం ద్వారా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. పూజల అనంతరం భక్తులు సంతోషంగా ఇచ్చే సంభావన తీసుకోవాలి తప్ప పూజారులు డిమాండ్ చేయవద్దని గతంలోనే ఆదేశించినట్లు తెలిపారు. భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్.. -
మధ్యాహ్నమే పీహెచ్సీకి తాళం
కాళేశ్వరం: కొత్తసంవత్సరం పూట పీహెచ్సీలకు ఏమైనా సెలవు ప్రకటించారా.. లేదా ఉద్యోగులు అంతా లీవులో ఉన్నారా అనే అనుమానాలు కాళేశ్వరంలో వెల్లువెత్తాయి. గురువారం మధ్యాహ్నమే పీహెచ్సీకి తాళాలు వేసి వైద్యులు, సిబ్బంది వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ఉండి రోగులకు సేవలందించాల్సిన సిబ్బంది, వైద్యబృందం ఆన్డ్యూటీలో వ్యక్తిగతంగా ఒంటిపూట సెలువు తీసుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం అయినందున ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తాం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం కేటాయించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాకు సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో 46.54లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని విధించిందన్నారు. గడిచిన తొమ్మిది మాసాల్లో 22.94లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టి 69శాతంలో నిలిచామని పేర్కొన్నారు. గతేడాది 37లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయగా.. ఈ ఏడాది అంతకుమించి బొగ్గు ఉత్పత్తి చేపడుతామని తెలిపారు. గడిచిన డిసెంబర్ మాసంలో 65శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. సాధించిన బొగ్గు ఉత్పత్తిలో 2.91లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామన్నారు. ఏరియా అక్టోబర్ మాసం వరకు రూ.440 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఏరియాలో ప్రతీ రోజు సుమారు 9500వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నట్లు చెప్పారు. శీతాకాలం నేపథ్యంలో బొగ్గు డిమాండ్ తగ్గిందని, వర్షాకాలం నేపథ్యంలో ఏరియాలోని ఓపెన్కాస్టు గనుల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులకు అంతరాయం కలిగిందన్నారు. యువ కార్మికుల గైర్హాజరు శాతం అధికంగా ఉంటుందన్నారు. భవిష్యత్లో భూపాలపల్లి ఏరియాలో ఏడాదికి 100లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వెంకటాపూర్ పీవీఎన్ఆర్ ఓపెన్ కాస్టు ఏర్పాటుపై త్వరలోనే ములుగు కలెక్టర్ను కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి–మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని ఈ నిర్మాణం పూర్తయినట్లయితే బొగ్గు రావాణాకు ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. సంస్థకు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. కార్మికులు సద్వినియోగం చేసుకొని విధులకు హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, శ్యాంసుందర్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
భూపాలపల్లి: అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగవ తరగతి సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ అధికారి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వాల్పోస్టర్ ఆవిష్కరణ.. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రోడ్డు భద్రత మాసోత్సవాల వాల్పోస్టర్ను కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీఓ సంధాని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నూతన సంవత్సర క్యాలెండర్ను గురువారం కలెక్టర్ రాహుల్శర్మ ఆవిష్కరించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రవికుమార్, నాయకులు దశరథరామారావు, సురేందర్రెడ్డి, అన్వార్, మురళీధర్, రాజుకుమార్, షఫీ, జ్ఞానేశ్వర్సింగ్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
రహదారి భద్రత నియమాలు పాటించాలి
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రమాదాల భారిన పడకుండా ప్రతీ ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026 వాల్పోస్టర్ను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వలనే జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. ఘనంగా వేడుకలు.. నూతన సంవత్సర వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ కేక్ కట్ చేశారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులందరు ఈ ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, నారాయణ, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ
● సీసీటీ ఆఫీసుకు రావుల శ్రీధరాచారి ● వరంగల్ జాయింట్ కమిషనర్గా టి.శ్రీనివాస్ సాక్షిప్రతినిధి, వరంగల్: వాణిజ్యపన్నులశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్ కమర్షియల్ టాక్స్ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి టింగి చందు అండర్–14 వాలీబాల్ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు ఉత్తరాఖండ్లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి ఎం.రాజేందర్ గురువారం విద్యార్థిని భూపాలపల్లిలో అభినందించారు. తిరుపతిలో జరిగిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ‘ఐ బ్రో కోడింగ్’ ప్రదర్శన చేసిన మాడిగ స్నిగ్ధ, వెలగందుల తణ్మయి, గైడ్ టీచర్ మధు, ‘జీవ వైవిధ్య పరిరక్షణ’ అంశంపై ప్రెజెంటేషన్ చేసిన టీచర్ ప్రభాకర్ రెడ్డి, క్రీడల్లో శిక్షణ అందించిన పీడీ సిరంగి రమేష్లను కూడా సత్కరించారు. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీటీఓ సంధాని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీటీఓ హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ సొంత భద్రత కోసం డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందూ, ఏఎంటీ అమృత, డిపో సిబ్బంది పాల్గొన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులు కాళేశ్వరం: మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పి.గణేష్, ఎం.అక్షిత జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో మెడల్స్ సాధించారు. భూపాలపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 30న కాటారంలో నిర్వహించిన పోటీల్లో అండర్–16 విభాగంలో రెండు కిలోమీటర్ల పరుగులో పాల్గొని సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. నేడు (శుక్రవారం) హైదరాబాద్ జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలను, శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పీడీ పూర్ణిమను హెచ్ఎం జి.శ్రీనివాస్రెడ్డి అభినందించారు. ఆర్డీఓ బాధ్యతల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, డివిజన్లోని తహసీల్దార్లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
నూతన సంవత్సర వేడుకలు
భూపాలపల్లి అర్బన్ : నూతన సంవత్సర వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్శర్మ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మహిళలు వాకిళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి న్యూఇయర్కు స్వాగతం పలికారు. ఇళ్లలో కుటుంబసభ్యులతో కలిసి కేక్లు కట్ చేసుకున్నారు. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థఽనలు నిర్వహించారు. -
రిజర్వేషన్ ఏం వస్తదో..
భూపాలపల్లి అర్బన్: పురపోరు ముంచుకొస్తున్న తరుణంలో జిల్లాకేంద్రంలో అందరి నోటా రిజర్వేషన్ మాటే వినిపిస్తోంది. వార్డులకు ఏం రిజర్వేషన్ వస్తదో అనే ఆలోచనల్లో ఆశావహులు ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ జనరల్కు రిజర్వ్ అవుతుందనే వార్తలు అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. కొంతమంది బీసీ, మళ్లీ ఎస్సీకి రిజర్వేషన్ వచ్చి చైర్మన్ గిరి దక్కే అవకాశం ఉందంటూ జోస్యం చెబుతున్నారు. అన్ని పార్టీలు రిజర్వేషన్ ఏం వచ్చినా అందుకు తగ్గట్లుగానే ముందే ప్రణాళికలు వేసుకుంటున్నారు. పోటీలో నిలవాలని అనుకుంటున్న ఆశావహలు మున్సిపాలిటీకి కట్టే పన్నులను చెల్లించే పనిలో ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తయితే అభ్యర్థుల ఎంపికకు సరిపడే సమయం ఉంటుందా లేదా అనే ఆలోచనలో అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఉన్నారు. రిజర్వేషన్ నామినేషన్కు మధ్య ఎక్కువ రోజుల సమయం ఉండకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. పోటీకి ఆసక్తి.. జిల్లాలో ఒకే ఒక్క మున్సిపాలిటీ భూపాలపల్లి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. జిల్లా కేంద్రం కావడం, వార్డుల సంఖ్య 30 వార్డులు ఉండటంతో చాలామంది ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు మాత్రం అందరూ రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. రిజర్వేషన్ తేలితేనే పోటీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రిజర్వేషన్ వెల్లడించిన తర్వాత నామినేషన్కు మధ్యలో సమయం పెద్దగా ఉండకపోవచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ప్రకారం గురువారం వార్డు ఓటరు తొలి జాబితాను విడుదల చేశారు. 5వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. 10వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రదర్శన అనంతరమే రిజర్వేషన్ వెల్లడించే అవకాశం ఉంది. 10న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తే 11, 12వ తేదీల్లో రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇలా చూస్తే రిజర్వేషన్కు నామినేషన్ల ప్రారంభానికి మధ్యలో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంశమే అన్ని పార్టీలను కలవరపెడుతోంది. జంపింగ్లకు చెక్ పెట్టేలా.. రిజర్వేషన్ల కేటాయింపు నామినేషన్లకు మధ్య తక్కువ సమయం ఉండటం అసంతృప్త నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలకు చెక్పెట్టే విధంగా కలిసి వచ్చింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో వార్డుకు ఇద్దరి కన్నా ఎక్కువ మంది టికెట్ను ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే బీజేపీ, బీఆర్ఎస్, ఇతర పార్టీని ఆశ్రయించే అవకాశం ఉంది. మిగతా పార్టీలు కూడా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని బలపడే ఆలోచనలో ఉన్నాయి. వార్డుకు ఐదారుగురు పేర్లను పరిశీలిస్తున్న పార్టీలు రిజర్వేషన్, నామినేషన్ల మధ్య ఒకటి రెండు రోజులే ఉండే అవకాశంరిజర్వేషన్లకు నామినేషన్లకు మధ్యలో పెద్దగా సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందుజాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపికచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు వార్డుల వారీగా పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల జాబితాను తయారు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బయటకు చెప్పకపోయినా ఇప్పటికే అభ్యర్థులపై క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు కూడా ముందుగానే అభ్యర్థులను ఎంపికచేసే పనిలో ఉన్నాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు
భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందుతాయని, త్వరలో జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మారై మిషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎమ్మారై మిషన్ కొనుగోలు కోసం సీఎస్ఆర్ నిధుల నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు అందించిన చె క్కును బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎమ్మె ల్యే, కలెక్టర్ స్వీకరించారు. అనంతరం వారు మా ట్లాడారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రీజినల్ హెడ్ వెంకటేష్ చల్వర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా అంశంపై కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక రవాణా కూపన్లలో అక్రమాలకు పాల్పడితే ఎంపీడీఓలు కఠి నంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసేవిధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆస్పత్రిలో త్వరలో ఎమ్మారై మిషన్ ఏర్పాటు ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ -
సంక్షేమం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేట్ ఈడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వి ద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపకూడదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రానివ్వొద్దన్నారు. ప్రతీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీటీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలపై శాఖల అధికారులు నివేదికలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని, ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొరికిశాల, భూపాలపల్లి అర్బన్ పాఠశాల ఘటనపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో.. జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్శర్మ, స్నేహశబరీష్, సత్యశారదలు మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అద్దె భవనంలో ఉంటున్న హాస్టళ్లకు బిల్లులు రాకపోవడంతో యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హాస్టళ్లలో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంత్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పోస్ట్మెట్రిక్ హాస్టల్ను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అధికారులు హాస్టళ్లలో పర్యటించాలి మెనూ ప్రకారం భోజనం అందించాలి ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
సన్నాలకే సై
● ఇప్పటికే నార్లు పోసిన అన్నదాతలు● జిల్లాలో 97,570 ఎకరాల్లో సాగు అంచనా భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగిలో సన్నరకం ధాన్యం సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. వర్షాలు సంవృద్ధి కురవడంతో చెరువులు, కుంటల్లో నీరు ఉంది. ప్రభుత్వం కూడా సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుంది. దీంతో ఎక్కువ మంది అన్నదాతలు సన్నాల సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకుని ప్రైవేట్ కంపెనీల విత్తనాల కొనుగోలు చేసి నార్లు పోసుకుకున్నారు. అక్కడక్కడ నార్లు ఎదిగిన చోట నాటు కూడా వేస్తున్నారు. జిల్లాలో 97,570 ఎకరాల్లో సాగు.. జిల్లాలో ఈ యాసంగిలో 97,570 ఎకరాల వరకు వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 22,000 ఎకరాల్లో దొడ్డు రకం, 18,500 వేల ఎకరాల్లో ఆడ మగ రకం సాగు చేస్తున్నారు. 57,070 వేల ఎకరాలకు పైగా సన్నాలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. సాగు నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ దొడ్డురకం ధాన్యం సాగు చేసి మిల్లర్లను బతిమి లాడే బదులు భోజనానికి ఉపయోగించే సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తే కొంతమేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. సన్నరకానికి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉండడంతో ఎగుమతి చేసే అవకాశం ఉంది. మద్ద తు ధర దక్కకపోతే బియ్యంగా మార్చి విక్రయిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతలు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నిండుకుండలా చెరువులు.. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలోని గణపు రం, భీంఘన్పూర్ సరస్సులతో పాటు 840కి పైగా చెరువుల్లో నీరు చేరి చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ ఏడాది యాసంగి సాగుకు నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు.ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో 70 శాతం రైతులు సన్న రకం ధాన్యం సాగుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది నార్లు పోసుకున్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా పంట నాటు వేసుకుంటే ఖర్చులు ఆదా అవుతాయి. – బాబురావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లా ప్రజలకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 2026 సంవత్సరలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే అధికారులు, అనధికారులు బొకేలు, పుష్పగుచ్ఛాలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, పరీక్ష ప్యాడ్స్ను అందించాలని కలెక్టర్ కోరారు. ‘ఆపరేషన్ స్మైల్’ విజయవంతం చేయాలిభూపాలపల్లి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన రెండు టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా హోటళ్లు, దాబాలు, దుకాణాలు, పరిశ్రమలు, ఇటుకబట్టీలు, నిర్మాణ పనులు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైన బాలలు పనిలో ఉన్నట్లు గుర్తిస్తే డయల్ 100, చైల్డ్లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ వీసీలో అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఉన్నారు. అనంతరం ఏఆర్ ఎస్సై రవీందర్, డీసీఆర్బీ ఏఎస్సై సాంబయ్య ఉద్యోగ విరమణ పొందగా వారిని జిల్లా పోలీ స్ కార్యాలయంలో ఎస్పీ సత్కరించారు. శేషజీవితం ప్రశాంతంగా గడపాలని ఆకాక్షించారు.ఓసీ–3లో వేబ్రిడ్జి ప్రారంభం గణపురం: గణపురం మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నూతనంగా నిర్మించిన వేబ్రిడ్జిని భూపాలపల్లి సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వేబ్రిడ్జి నిర్మాణంతో బొగ్గు రవాణా, కొలతల ఖచ్చితత్వం మెరుగు పడుతుందన్నారు. తద్వారా ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శక పెరుగుతుందన్నారు. భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా హరికృష్ణ బదిలీపై వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న రవి హనుమకొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ కాగా ఆయన స్థానంలో నేడు (గురువారం) హరికృష్ణ బాధ్యతలు స్వీకరించే ఆకాశం ఉంది. ముగిసిన నాపాక బ్రహ్మోత్సవాలుచిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక ఆలయంలో మూడు రోజులుగా వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు కార్యక్రమంలో భాగంగా భక్తులు నవధాన్యాలు సమర్పించి మొక్కుల చెల్లించుకున్నారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో డప్పు చప్పుల్లు, యువకుల కేరింతల మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్, అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేశ్చార్యులు, డైరెక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేడారం జాతర చైర్పర్సన్గా ఇర్ప సుకన్య? ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర కమిటీని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. తాడ్వాయికి చెందిన ఇర్ప సుకన్యను జాతర కమిటీ చైర్పర్సన్గా నియమించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జాతర కమిటీలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. చైర్పర్సన్తో పాటు కమిటీ డైరెక్టర్లుగా మహిళలను నియమించనున్నట్లు సమాచారం. -
నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయం
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు కాటారం: ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. మండలకేంద్రంలోని ఎరువుల దుకాణాలు, డీలర్ అవుట్లెట్లను మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫైవ్స్ యాప్ ద్వారా ధృవీకరించారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ పూర్ణిమ, ఏఈఓలు పాల్గొన్నారు. -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి... ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదించింది నీటి కేటాయింపుదేవాదుల 4,66,600 1,95,095 11.30 ఎస్పారెస్పీ 2,29,623 1,57,038 12.88 (బిలో ఎల్ఎండీ) ఎస్సారెస్పీ–2 96,671 83,039 6.82చీఫ్ ఇంజినీరు ములుగు సర్కిల్ పరిధిలో ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలు -
వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
భూపాలపల్లి: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతుందన్నారు. 31వ తేదీ రాత్రి జనవరి 1వ తేదీన జిల్లా కేంద్రం, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్, స్పీడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీసుశాఖ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు. రోడ్లపై కేక్ కటింగ్లు చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్లు నిర్వహించడం చట్టప్రకారం నేరమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
పర్సనల్ మేనేజర్కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: ఏరియా పర్సనల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్యాంసుందర్ను మంగళవారం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు సన్మానించారు. జీఎం కార్యాలయంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ లైసన్ అధికారి భూక్య మోహన్, బ్రాంచ్ కార్యదర్శి హేమనాయక్, నాయకులు సికిందర్సింగ్, రాములు, శ్రీనివాస్, రవికుమార్, శోభన్, బలరాం, రమేష్, శ్రీను పాల్గొన్నారు. ఎస్టీ లైజన్ అధికారిగా భూక్య మోహన్ ఏరియా సింగరేణి ఎస్టీ లైజన్ అధికారిగా భూక్య మోహన్ను నియామకమయ్యారు. జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రావు ద్వారా నియామక పత్రాన్ని అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి ముందుంటానని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఏరియా అఽధికారులతో మాట్లాడుతానన్నారు. -
కల్యాణం కమనీయం
హాజరైన భక్తులుచిట్యాల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలోని నైన్పాక గ్రామం నాపాక ఆలయంలో మంగళవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ సీతారామలక్ష్మణ స్వామి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఉదయమే అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు. మహిళలు, పిల్లలు కోలాటాలు, భజన ప్రదనర్శలతో పాటు కూచిపూడి నాట్యం చేయడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విజేతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్, ప్రధాన అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేష్ చార్యులు, రాకేష్ పాల్గొన్నారు. దర్శించుకున్న పలువురు ప్రముఖులు మాజీ ఎమ్మెలే గండ్ర వెంకటరమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, డీసీఓ వాల్యూనాయక్, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ఆర్ఐ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ తదితరులు దర్శనం చేసుకున్నారు. కల్యాణాన్ని తిలకించారు. కోలాటం వేస్తున్న మహిళలు ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు -
అంగడి అంగడి..
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో సంత నిర్మాణం కోసం పదేళ్ల క్రితం చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. పాలకులు మారినా సంత నిర్మాణం మాత్రం కావడం లేదు. శాశ్వత స్థలం కేటాయించి సంతలో సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం.. భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకాల గ్రౌండ్లో ప్రతీ గురువారం వారాంతపు సంత సాగుతోంది. పట్టణ ప్రజలతో పాటు పరిసర, సమీప గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తారు. కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, మాసాలాలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సంతలో సరైన స్థలం, వసతులు లేక రోడ్లపైన వ్యాపారాలు నిర్వహించడంతో అటు అమ్మకందారులు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపల్ అఽధికారులు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు, కొనుగోలుదారులకు కనీసం తాగునీటి సౌకర్యం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. మహిళల ఇబ్బందులు చెప్పుకోలేకుండా ఉన్నాయి. గంప చిట్టి పేరుతో వ్యాపారుల నుంచి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. రోడ్లపైనే అమ్మకాలు.. పట్టణంలో దాదాపు 30వేల కుటుంబాలు, సమీప గ్రామాల ప్రజలు ఈ వారాంతపు సంతపైనే ఆధారపడి ఉంటారు. ప్రతీ వారం జరిగే ఈ సంతలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. సంతలో అమ్మకందారులకు సరైన వసతులు లేకపోవడంతో రోడ్లపైనే విక్రయాలు జరపడంతో రోడ్లన్నీ జనంతో నిండిపోతున్నాయి. అంబేడ్కర్ సెంటర్ నుంచి సుభాష్కాలనీ వైపు కేటీకే 1వ గని, ఓసీపీ–2లకు బొగ్గు, ఇసుక లారీలు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తుంది. భయపెడుతున్న పశువులు సంతలో పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కూరగాయలను తినడమే కాకుండా వ్యాపారులు, కొనుగోలుదారులను పొడుస్తున్నారు. వెనకాల నుంచి వచ్చి చేతిలో సంచులను నోటితో లాగి అందులో ఉన్నవాటిని సైతం తింటున్నాయి. పశువులు సంత లోపలకి రాకుండా చూడాల్సిన మున్సిపల్ సిబ్బంది అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగడిలో ప్రతీ వారం లక్షల్లో వ్యాపారం నడుస్తోంది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. గ్రామాల్లో జరిగే అంగడి కూడా ఇంత అధ్వానంగా ఉండదు. అధికారులు స్పందించి వినియోగారులకు, అమ్మకందారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. సంతకు రావాలంటేనే భయమేస్తోంది. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తోంది. సంతలో పశువులు, మేకలు తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. – మద్దెల విజయ్, భూపాలపల్లి కొనుగోలు, అమ్మకందారులకు ఇక్కట్లు పట్టించుకోని మున్సిపల్ అధికారులు -
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
ఫోన్ ఇన్లో మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ చల్లా మధుసూదన్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే పలు రకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియో, సైనసైటిస్ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్లో ప్రజల సమస్యలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న: చలి తీవ్రతకు ఎటువంటి జాగ్రతలు పాటించాలి (అజయ్, సాదన్రెడ్డి, కాటారం) డీఎంహెచ్ఓ: చలి తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు నూలు, ఉన్ని దుస్తువులను ధరించాలి. చెవులు, ముక్కు నుంచి చల్లటి గాలి శరీరంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. వేడివేడి భోజనం తినాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ప్రశ్న: చిన్న పిల్లలు ఎటువంటి జాగ్రతలు పాటించాలి (దేవేందర్రావు, రేగొండ)డీఎంహెచ్ఓ: ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లల చేతులకు గ్లౌజులు, మాస్కులు, స్వెటర్లు వేయాలి. వేడి అన్నం తినిపించారు. వేడి నీరు తాగే విధంగా చూసుకోవాలి. ఆస్తమా లాంటివి ఉన్నట్లయితే నెబులైజర్ వినియోగించాలి. ప్రశ్న: చిట్యాల సీహెచ్సీలో వైద్యులను నియమించాలి. ప్రతీ వారం స్పెషలిస్టులతో పరీక్షలు చేయించాలి (బుర్ర వెంకటేష్, బుర్ర తిరుపతి, చిట్యాల)డీఎంహెచ్ఓ: చిట్యాల మండల కేంద్రంలోని సీహెచ్సీలో డాక్టర్ల నియమాకంపై కలెక్టర్, డీసీహెచ్ఎస్లు దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు డాక్టర్లను నియమించారు. ప్రశ్న: రోజుల తరబడి పిల్లలకు దగ్గు, జలుబు తగ్గడం లేదు. (పసన్నకుమారి, టేకుమట్ల)డీఎంహెచ్ఓ: శీతాకాలం నేపథ్యంలో వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆస్తమా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు నెబులైజర్ వినియోగించాలి. వెచ్చదనంగా ఉండే దుస్తులను వేయాలి. ప్రశ్న: గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి (అంబాల కిరణ్, టేకుమట్ల)డీఎంహెచ్ఓ: చలిని తట్టుకునేందుకు గర్భిణులు కొంత మంది పొద్దంతా ఎండలోనే ఉంటారు కానీ అలా ఉండొద్దు. ఉదయం 9గంటలలోపు మాత్రమే ఎండలో ఉండాలి. దీంతో డీ విటమిన్ వస్తుంది. ఉదయం 10గంటల తరువాత, సాయంత్రం ఐదు గంటలలోపు మాత్రమే ప్రయాణాలు చేసుకోవాలి. లూజుగా ఉండే దుస్తువులను ధరించాలి. చలితో జ్వరం, జలుబు బారిన పడే ప్రమాదం ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఎంహెచ్ఓ డాక్టర్ చల్లా మధుసూదన్ప్రశ్న: ఆస్తమా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి (వెంకటేష్, కొడవటంచ)డీఎంహెచ్ఓ: నూలు, ఉన్ని ఉన్న దుస్తువులు ధరించాలి. చలి ఉండే సమయంలో గదిలో నుంచి బయటకు రావద్దు. ముక్కు, చెవుల నుంచి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. వేడి అన్నం తినాలి. వ్యాధి తీవ్రతను బట్టి నెబులైజర్ వినియోగించుకోవాలి. ఉదయం 10గంటల తరువాతనే బయటకి రావాలి. చల్లటి గాలిలో పడుకోకూడదు. బీపీ ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. -
సా..గుతున్న చిన్న కాళేశ్వరం పనులు..
కాటారం సబ్ డివిజన్లోని పంట పొలాలకు సాగునీరు అందించాలనే సదుద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నేటికీ పూర్తి కావడం లేదు. రూ.499 కోట్ల వ్యయంతో 2008 సెప్టెంబరు 19న ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.370 కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 4.5 టీఎంసీల నీటిని తరలించి 45,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పటికీ భూసేకరణలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. -
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
భూపాలపల్లి రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని 56మంది నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కారం చూపడం అధికారుల బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డ్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. సమృద్ధిగా యురియా నిల్వలు జిల్లాలో సమృద్ధిగా యురియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్ఫోర్స్ టీములు, డివిజన్ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతీరోజు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని సూచించారు. ప్రతీ స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభ, ముగింపు నిల్వలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో సహకార శాఖ ద్వారా 10 కేంద్రాలున్నాయని, అదనంగా 22 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా సమస్య ఉంటే 78930 98307 కంట్రోల్ రూం నంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాల్యానాయక్ పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లా లక్ష్యం టీబీ రహిత జిల్లా లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మెషిన్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానిత టీబీ కేసులను స్క్రీనింగ్ చేసేందుకు జిల్లాకు అల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే మెషిన్ మంజూరు చేశారని తెలిపారు. ఈ ఎక్స్రే మెషిన్ ప్రధాన ఉద్దేశం జిల్లాలో గ్రామస్థాయిలోనే అనుమానిత టీబీ గ్రస్తులకు ఎక్స్రే పరీక్షలు నిర్వహించడం ద్వారా టీబీ వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, క్షయ వ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ దేవేందర్, డాక్టర్ రాజేష్, డీపీఓ చిరంజీవి, టీబీ సూపర్వైజర్ శ్రీకాంత్, రేడియోగ్రాఫర్ సుధాకర్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
నాపాక బ్రహ్మోత్సవాలు షురూ
చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక ఆలయంలో బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేశ్చార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, హోమం చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య దంపతులతో పాటు మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు నక్క భాస్కర్ ( నైన్పాక), బుర్ర చంద్రకళ(గిద్దెముత్తారం), కాసు రమ–కుమార్( వెంచరామి), కాసం మాధవి–రాజిరెడ్డి (అందుకుతండా), పాశం పుష్పలత– కుమార్ (వరికోల్పల్లి ) నైన్పాక మాజీ ఎంపీటీసీ కట్టెకోళ్ల రమేశ్తో పాటు పలు గ్రామాలకు చెందిన దంపతులు పాల్గొన్నారు. నేడు ఉత్తర ద్వార దర్శనం.. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలు, భజన ప్రదర్శనలతో పాటు కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. నేడు ఉత్తర ద్వార దర్శనం భక్తుల కోలాటాలు, కూచిపూడి భరతనాట్యం -
తొలిదశల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్..
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్ధేశంతో జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనం నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో రూ.196 కోట్లతో అక్టోబర్ 10న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు నేటికీ భూమి చదును దశలోనే ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి గతేడాది జూలై 25న శంకుస్థాపన చేశారు. 60 గుంటల్లో పరిశ్రమలు, 37.69 ఎకరాల్లో 197 ప్లాట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. -
వైద్యసేవల్లో భేష్
జీజీహెచ్లో మెరుగునపడిన సదుపాయాలుభూపాలపల్లి: జిల్లాలో వైద్యరంగంలో మెరుగైన సేవలు అందుతుండగా పలు రంగాల్లో మాత్రం అభివృద్ధి పనులు, సేవలు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తుండగా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ పార్కు భూమి చదును దశలోనే ఉంది. మెరుగైన వైద్య సేవలు.. మెడికల్ కళాశాల అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి. మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.20 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. 340 బెడ్లకు సరిపడా అదనపు గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పేషెంట్లకు అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు ఈ ఏడాది జనవరి 27న వెంటిలేటర్ సౌకర్యాన్ని కల్పించారు. రూ.3.40 కోట్లతో సీటీ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఇటీవలే ప్రారంభించారు. ఇటీవల ఎన్సీడీ స్కానింగ్ సెంటర్, ట్రాన్స్జెండర్ క్లినిక్, సెంట్రల్ డ్రగ్ స్టోర్లను ప్రారంభించారు. నిర్మాణంలో మెడికల్ కళాశాల భవనం చురుకుగా సాగుతున్న సమీకృత కోర్టు భవనాల పనులు నత్తనడకన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తి -
అమ్మానాన్నా.. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
చకచకా కోర్టు పనులు..
జిల్లాకేంద్రంలో సమీకృత కోర్టు సముదాయ భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కోర్టులు నాలుగేళ్లుగా అద్డె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలు ఇరుకుగా ఉండటం, కనీస సౌకర్యాలు లేక కోర్టు ఉద్యోగులు, అడ్వకేట్లు, కోర్టులను ఆశ్రయించే వారు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.37 కోట్లతో నిర్మించనున్న సమీకృత కోర్టు భవనాల నిర్మాణ పనులకు గత నెల 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్సింగ్ శంకుస్థాపన చేశారు. నూతన సంవత్సరంలో భవనం అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మాణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. -
అడవుల రక్షణ అందరి బాధ్యత
● కాటారం ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వాతి కాటారం: అడువులను రక్షించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని కాటారం ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వాతి అన్నారు. కాటారం మండలం ఆదివారంపేట, గుమ్మాళ్లపల్లి, ఒడిపిలవంచ గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవి సంరక్షణ, జంతు సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ అడవికి ముప్పు మానవాళికి ముప్పు అన్నారు. అడవుల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఒడేటి రంజిత్కుమార్, భక్తు శరత్కుమార్, నరివెద్ది మాధవి, డిప్యూటీ రేంజర్ సురేందర్, ఎఫ్బీఓ రాజేందర్ పాల్గొన్నారు. -
మేడారంలో ఎస్పీ పర్యటన
ఏటూరునాగారం: నేడు ఆదివారం కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యల్లో భాగంగా ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం మేడారం పర్యటించారు. గద్దెలకు భక్తులు చేరుకునే మార్గాలు, దర్శనం అనంతరం బయటకు వెళ్లే ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే వాహనాలను మళ్లించాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గద్దెల వద్ద జరుగుతున్న సాలారం పనులు పరిశీలించారు. కోళ్ల షాపులకు దరఖాస్తుల ఆహ్వానం ఏటూరునాగారం: మేడారం మహా జాతరలో కోళ్ల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు గిరిజనులు, గిరిజన మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి ఐటీడీఏ ఏటూరునాగారం, మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఉచితంగా దరఖాస్తులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులను జనవరి 15వ తేదీ సాయంత్రం 5గంటలోపు సమర్పించాలని సూచించారు. ఒక్కో షాపునకు రూ.16వేలు ఐటీడీఏ ఏటూరునాగారం పేరుతో డీడీ తీయాలని వెల్లడించారు. షాపు పెట్టాలనుకునే దుకాణం దారుడు షాపు ఎక్కడ నిర్వహిస్తున్నాడనే లొకేషన్, ఆధార్కార్డు, ప్లాట్ యజమాని వివరాలను విధిగా దరఖాస్తు ఫారంతో జత చేసి ఇవ్వాలని సూచించారు. అనంతరం అర్హులైన వారికి జనవరి 22వ తేదీలోపు దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్, ప్రొసిడింగ్స్ అందజేస్తామని వివరించారు. -
మేడారానికి బస్సు సర్వీసులు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో భూపాలపల్లి నుంచి మేడారానికి ముందస్తుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ రోజు ఉదయం 8గంటలకు, 9గంటలకు, సాయంత్రం 4గంటలకు, 5గంటలకు రాత్రి 10గంటలకు భూపాలపల్లి నుంచి మేడారానికి సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో మేడారం నుంచి ఉదయం 10:40గంటలకు, 11:40గంటలకు సాయంత్రం 6:45 గంటలకు రాత్రి 7:45గంటలకు బస్సులు ఉంటాయన్నారు. భూపాలపల్లి నుంచి గణపురం, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరమైతే అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామన్నారు. హరేకృష్ణ రథోత్సవం భూపాలపల్లి అర్బన్: బంజారాహిల్స్ గోల్డ్న్ టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో హరినామ నగర సంకీర్తన రథోత్సవం నిర్వహించారు. స్థానిక హన్మాన్ దేవాలయం నుంచి జయశంకర్ సెంటర్ వరకు సంకీర్తన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ రథయాత్రను ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి జెండాఊపి ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కృష్ణగీతాలు, డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేపట్టారు. శ్రీవారి నామస్మరణం, హరేకృష్ణ కీర్తనలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామప్పలో భక్తుల సందడి వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు వివరించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య... భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు తాజా మాజీ వార్డు కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి(49) హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో తన ఇంటికి బైక్పై వెళ్తున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న జిల్లా పోలీసులు నాలుగు రోజుల్లోనే ఏడుగురు నిందితులను, తదనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. 9మందికి జీవిత ఖైదు... 2021 జూన్ 19న కాటారం మండలం గంగారం గ్రామంలో భూ తగాదా విషయంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో 9 మంది నిందితులకు ఈ నెల 23వ తేదీన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులోని నిందితులు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాదిలో కోర్టు వెలువరించిన తీర్పుల్లో ఇదే అతి పెద్దది. సైబర్ కేసులు 87 నమోదు.. జిల్లాలో ఈ ఏడాదిలో ఈ నెల 26వ తేదీ వరకు సైబర్ నేరాలు జరిగినట్లుగా 537 మంది ఫిర్యాదు చేశారు. అందులో 87 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. నమోదైన కేసులకు సంబంధించిన బాధితులకు రూ. 9.54 లక్షలను పోలీసులు తిరిగి ఇప్పించినట్లు తెలిసింది. మహిళలపై తగ్గిన హత్య, లైంగిక దాడులు ● గతేడాదికంటే తగ్గిన రోడ్డు ప్రమాదాలు ● జిల్లాలో పెరిగిన చోరీలు ● సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య ● జిల్లా ప్రజలకు తప్పని సైబర్ మోసాలు ప్రమాదాలు, మరణాలు.. 2023 2024 2025 రోడ్డు ప్రమాదాలు 196 223 217 మరణాలు 90 74 79 గాయాలు 95 124 213జిల్లాలో గతేడాదితో పోలిస్తే చోరీల సంఖ్య పెరగగా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస, హత్యలు, లైంగిక దాడులు కొంతమేరకు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా కొంత మేరకు తగ్గగా, గంజాయి కేసులు గతంలో మాదిరిగానే నమోదయ్యాయి. పోలీసులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది సైబర్ నేరాల బారిన పడ్డారు. ఈ ఏడాదిలో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – భూపాలపల్లిచోరీ కేసులుకేసులు 2023 2024 2025 చోరీ కేసులు 86 108 118 ఛేదించిన కేసులు 30 36 56 చోరీ సొత్తు(రూ.) 1,58,44,603 77,75,945 1,20,49,700 రికవరీ సొత్తు(రూ.) 22,72,880 24,85,400 31,87,595మహిళలపై దాడుల కేసులు... 2023 2024 2025 వరకట్న వేధింపులు, గృహహింస 121 145 117 మహిళలపై హత్యలు 1 6 4 లైంగిక దాడులు 14 18 10 వరకట్న హత్యలు 1 0 1గంజాయి కేసుల వివరాలు.. 2023 2024 2025 నమోదైన కేసులు 12 23 23 పట్టుబడిన గంజాయి విలువ(రూ.లక్షలు) 2,97,300 45,98,900 33,00,000 అరెస్ట్ అయిన వారు 30 78 64చోరీ సొత్తు రికవరీ అంతంతే.. జిల్లాలో ఈ ఏడాది 118 చోరీ కేసులు నమోదు కాగా చోరీ సొత్తు అంతంత మాత్రంగానే రికవరీ అయింది. గతంతో పోలిస్తే చోరీ కేసులను ఛేదించిన సంఖ్య ఈ ఏడాది పెరిగింది. -
వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్ను శనివారం జిల్లాకేంద్రంలో ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు. జనవరి 3నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని శంషాబాద్లో నిర్వహించనున్నట్లు వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ తెలిపారు. మహాసభకు జిల్లా నుంచి విద్యార్థులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవితేజ, సిరి, శశ్వంత్, వరుణ్ పాల్గొన్నారు. -
నేర నియంత్రణలో చురుగ్గా పనిచేయాలి
● ఎస్పీ సంకీర్త్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నేర నియంత్రణలో పోలీస్ అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవారీ సమీక్షలో భాగంగా జిల్లాలో నేర నియంత్రణ, శాంతి–భద్రతల పరిరక్షణ, ప్రజలకు అందించిన సేవల విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది కనబరిచిన పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో నాణ్యమైన, బాధ్యతాయుతమైన దర్యాప్తు జరగడం వల్లనే బాధితులకు న్యాయం చేకూరుతుందన్నారు. నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడేలా అధికారులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే సంవత్సరంలో కూడా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, జాప్యం లేకుండా విచారణ పూర్తి చేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి సొత్తు రికవరీ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసింగ్ను కఠినంగా అమలు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీ సంపత్రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, జిల్లాలోని ఎస్సైలు పాల్గొన్నారు. -
రేపు సాక్షి ఫోన్ ఇన్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటున్నా ఉదయం, సాయంత్రం చలి ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలతో పాటు సాధారణ పౌరులు దగ్గు, జలుబుతో పాటు జ్వరం బారిన పడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స వివరాలు తెలుసుకునేందుకు నేరుగా జిల్లా వైద్యారోగ్యాశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ కు ఫోన్ చేసే అవకాశాన్ని ‘సాక్షి’ కల్పిస్తోంది. ప్రజలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి సందేహాలను తీర్చుకోవడమే కాక సలహాలు తీసుకోవచ్చు. తేది 29–12–2025 (సోమవారం) సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి 4గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 94403 25816 -
హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్ జనరల్
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
భూపాలపల్లి రూరల్: సర్పంచ్లు నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. మహిళా సర్పంచ్లు ఇందిరాగాంధీ స్ఫూర్తితో గ్రామపాలన చేయాలన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పుష్పగార్డెన్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డుసభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ల విధులు, ఆదాయ వనరులు సమకూర్చుకొనుట, పంచాయతీల ఏర్పాటు విధానం, పాలనా విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి పంచాయతీలే వేదికలని అన్నారు. వంద శాతం సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించాలని తెలిపారు. గ్రామాల్లో సోలార్ సెట్లను ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని సూచించారు. సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే తమకు తెలపాలని చెప్పారు. మహిళా శక్తిని మించి ఏదీలేదని, మహిళా సర్పంచ్లు ఉక్కు మహిళ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా పాలన అందించి ప్రజల మెప్పు పొందాలన్నారు. ప్రతీ నెల నిబంధనల ప్రకారం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధికారులతో, ప్రజలతో సఖ్యతగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యులను సన్మానించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 146 మంది లబ్ధిదారులకు రూ.1,46,16,936 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, భూపాలపల్లి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టయ్య, శ్రీదేవి, పార్టీ రాష్ట్ర నాయకులు రాంనర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, నాయకులు అప్పం కిషన్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్ల శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు
భూపాలపల్లి అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్(పార్టీ కార్యాలయం)లో జిల్లా నాయకులతో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్రలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల మన్నన పొందుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. పట్టణంలోని వివిధ కాలనీలలో పార్టీ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సోత్కు ప్రవీణ్కుమార్, సతీష్, సుగుణ, శ్రీకాంత్, జోసెఫ్, సుధాకర్రెడ్డి, జోగేష్, సింహాద్రి, లావణ్య, కృష్ణ, రాజు, అస్లాం, రమేష్చారి పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటుకు నేడు (శనివారం) జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, అబ్జర్వర్లు సతీష్, గజేంద్ర హాజరవుతారని చెప్పారు. భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కట్ట రాంచంద్రమూర్తి ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం జిల్లా కమిటీ ఎన్నికల అధికారి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పడగాల అయిలయ్య, ఉపాధ్యక్షులుగా గడ్డం పోషయ్య, ఠాకూరు విక్రమ్సింగ్, కట్ల రమణారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా అడప రాజయ్య, కోశాధికారిగా జరుపుల ధన్సింగ్నాయక్, సహాయ కార్యదర్శులుగా కొండబత్తుల రాజేందర్, పి.నారాయణరెడ్డి, మార్త వెంకటరమణ, లక్ష్మణ్రావు, కార్యదర్శులుగా రామారావు, మహేందర్రెడ్డి, రామునాయక్ నియామకమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించారు. ములుగు రూరల్: మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ 2 డిపో మేనేజర్ రవిచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ బస్స్టేషన్ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపిస్తామని వివరించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. మేడారం తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం బస్సులు గద్దెల వరకు వెళ్తున్నాయని వివరించారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా గ్రానెట్తో ఫ్లోర్ నిర్మాణం పనులు చేపట్టారు. జాతర సమయంలో భక్తులు బంగారం(బెల్లం), కొబ్బరి, నీళ్లతో జారీ పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రానెట్పై గ్రౌటింగ్ చేయించే పనులను మొదలు పెట్టారు. దీనివల్ల కాలుకు గ్రిప్ లభించి కిందపడకుండా ఉంటారు. వృద్ధులు, చిన్నారులకు సైతం ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ సారి మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జాతరలో భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలైన ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్నానఘట్టాల రోడ్డు, చిలకలగుట్ట ప్రాంతంలో ప్లాస్టిక్తో కూడిన మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతరలో మొత్తం 1,020 మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
మేడారంలో ఈ–కానుక
ఏటూరునాగారం: మేడారంలో గతంలో భక్తులు హుండీల్లో నగదు వేసేవారు. కంప్యూటర్ యుగానికి అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ– కానుకల సర్వీసులను మొదలు పెట్టారు. గతంలో కేవలం జాతర సమయంలో ఎక్కువగా ఈ –కానుకులు చెల్లించేది. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో డిజిటల్ పేమెంట్లను కానుకల రూపంలో అమ్మవారికి చెల్లించే విధంగా ఈ–కానుక స్కానర్లను ఏర్పాటు చేశారు. దీంతో పలువురు భక్తులు కానుకలు హుండీలో వేస్తుండగా మరికొందరు నగదు రహితంగా డిజిటల్ పేమెంట్లు చేసి అమ్మవారికి కానుకలు చెల్లిస్తున్నారు. -
యూరియా ఆన్లైన్..
జిల్లా వివరాలు..కాటారం: అన్నదాతకు యూరియా కష్టాలు తప్పనున్నాయి. పంట సాగు సమయంలో ఎరువుల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలు, విక్రయ కేంద్రాల ఎదుట సమయం వృథా చేసుకొని నిరీక్షించాల్సిన అవసరం ఇక లేదు. పంటలకు అవసరమయ్యే ఎరువులను ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాసంగి సీజన్ నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మొదటగా ఫర్టిలైజర్ దుకాణాల నుంచి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సాగు విస్తీర్ణంతో సరఫరా.. రైతులు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఎకరానికి మూడు బస్తాలు ఇచ్చేలా ప్రణాళికలు రూ పొందించారు. వీటిలో ఒక ఎకరం నుంచి రెండు ఎ కరాల్లో సాగుచేసే వారికి రెండు దఫాల్లో ఎరువులను సరఫరా చేయనున్నారు. 5నుంచి 20 ఎకరా ల్లో సాగుచేసే వారికి మూడు దఫాల్లో, 20 ఎకరాల పైన సాగుచేసే వారికి నాలుగు దఫాలుగా ఎరువులు అందించనున్నారు. అవసరం ఉన్న రైతులు విడతల వారీగా యాప్లో బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడికి లాగిన్ తెలి పిన వెంటనే కావాల్సిన ఎరువులు ఇచ్చేలా ఏర్పా ట్లు చేశారు. ప్లేస్టోర్ ద్వారా ఈ ప్రత్యేక యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.. ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ యాప్తో ఎరువుల నిల్వ ఎక్కడెంత ఉందో ఇట్టే తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. రైతులు సమీపంలోని ఇతర షాపుల్లో ఉన్న యూరియా నిల్వలను కూడా తెలు సుకోవచ్చు. రైతులు అవసరమైన యూరియా బస్తాలను తమకు అనుకూలమైన డీలర్ వద్ద ముందే బుక్ చేసుకునే వీలుంటుంది. బుక్ చేసుకున్న తర్వా త నిరీక్షణ లేకుండా యూరియా పొందవచ్చు. అన్ని వర్గాల రైతులకు వెసులుబాటు.. ఎరువుల బుకింగ్ కోసం తయారుచేసిన ప్రత్యేక యాప్ ద్వారా ప్రతీ రైతుకు యూరియా కష్టాలు తప్పనున్నాయి. కౌలు, పోడు పట్టాలు పొందిన రైతులకు సైతం సేవలు అందేలా సర్కారు యాప్ను రూపొందించింది. కౌలు రైతులు భూ యజమాని ఆధార్ ధృవీకరణతో యూరియా బుక్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ యాప్పై జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సైతం యాప్ వినియోగం, బుకింగ్ చేసుకునే విధానంపై శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు వివరించారు. ఏఓలు, ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించేలా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.యాసంగి సాగు విస్తీర్ణం అంచనా (ఎకరాల్లో..) వరి 98,000మొక్కజొన్న 30,000పెసర 150ఇతర పంటలు 300 రైతులకు తప్పనున్న కష్టాలు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశంజిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా 2.27 లక్షల మేర భూమిలో సాగు జరుగుతోంది. 341 ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా.. 1,19,784 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గడిచిన ఖరీఫ్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి ఎరువుల దుకాణాలు, స్టాక్ పాయింట్ల వద్ద క్యూ లైన్లు కట్టి నిరీక్షించారు. యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో రైతులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం ఈ యాప్నకు శ్రీకారం చుట్టింది. ఈ యాసంగి సీజన్ నుంచే యాప్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో వచ్చే నెల 11న నిర్వహించనున్న ఆదివాసీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. మేడారంలో అమ్మవార్ల గద్దెల వద్ద సమ్మేళనం కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు ఆదివాసీ తెగల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీలు, ఆదివాసీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చందా మ హేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుం దెబ్బ ప్రచార కార్యదర్శి మలకం సమ్మయ్య, తాడ్వాయి మండల అధ్యక్షుడు చందా నవీన్, మండల ప్రధాన కార్యదర్శి తాటి సురేష్, మండల ఉపాధ్యక్షుడు చర్ప జునేష్, పిట్టల నగేష్ పాల్గొన్నారు.తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్ -
గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్రెడ్డి, బత్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, రఘునాథధపల్లి మండలం ఖిలాషాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వారా ఆదర్శంగా నిలిచి దేశ విదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూసం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 202
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
కనులవిందుగా పంబారట్టు
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ కాటారం: కాటారం మండలకేంద్రంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబారట్టు కార్యక్రమం కనులవిందుగా కొనసాగింది. శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఎక్కించి ఆలయం నుంచి గారెపల్లి చౌరస్తా మీదుగా పురవీధుల గుండా తిప్పుతూ అత్యంత వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా భక్తులు మొక్కులు సమర్పించారు. అయ్యప్ప మాలాధారణ స్వాములు, భక్తిపాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరి నదిలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు బచ్చు అశోక్గుప్తా, ఆలయ అర్చకులు గుండూరి భానుప్రసాద్శర్మ, జీవీ శాస్త్రి, ఆలయ కమిటీ బాధ్యులు పీచర రామకృష్ణారావు, మద్ది నవీన్, అయిత వెంకన్న, పెండ్యాల రంజిత్కుమార్, జక్కు మొగిలి, పసుల రాంచంద్రం, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, ముస్కమల్ల సత్యం, మాలాధారణ స్వాములు పాల్గొన్నారు. -
ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీనెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. భూపాలపల్లి రూరల్: నేడు (శుక్రవారం) మెదక్ జిల్లాలో జరిగే కేవల్ కిషన్ ముదిరాజ్ జాతర పోస్టర్ను ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన ఇలాంటి మహనీయుడిని స్మరించుకోవడం సమాజంలోని ప్రతీ ఒక్కరి కర్తవ్యం అన్నారు. భవిష్యత్ తరాలకు వీరి చరిత్ర తెలియజేయాలన్నారు. జాతరకు ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ నాయకులు చాడ కృష్ణస్వామి, వేముల రాజమౌళి, చిలకలపాణి, కొలిపాక మల్లయ్య, బోయిని సాంబయ్య, వెంగళ ఆంజనేయులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణం మంజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అయ్యప్పస్వాములకు మహా అన్న ప్రసాదం(బిక్ష) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.–పద్మ దంపతులు ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలిసి బిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు అయ్యప్ప స్వాములతో పాటు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాటారం: దామెరకుంట మానేరుపై వంతెన నిర్మాణంతో పాటు పలు రోడ్ల నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో గురువారం కాంగ్రెస్ శ్రేణులు మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్లు, కాటారం నుంచి సబ్స్టేషన్పల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్లు, సుబ్బయ్యపల్లి నుంచి ప్రతాపగిరి వరకు రూ.3.50కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్బాబు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మంథని నియోజకవర్గంతో పాటు కాటారం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మంత్రి శ్రీధర్బాబు ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, యూత్ మండల అధ్యక్షుడు చిటూరి మహేశ్గౌడ్ పాల్గొన్నారు. టేకుమట్ల: మండలంలోని రామకిష్టాపూర్(టి) శివారు ఆర్అండ్బీ రోడ్డు నుంచి అంకుషాపూర్కు వెళ్లే దారి కంకర తేలడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల క్రితం రోడ్డు మరమ్మతుకు రూ.10లక్షల నిధులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో నిత్యం దారిగుండా పంట పొలాలకు వెళ్లే రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
ధాన్యం సేకరణ 62.36 శాతమే!
సాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఽఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మె.టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు... వానాకాలం సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగయినట్లు అధి కారులు ప్రకటించారు. ఈ మేరకు 10,39,815 మె.టన్నులు ధాన్యం రైతులనుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగుబడిపై అకాలవర్షాల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ’కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లోనుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. మోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరియా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నేలకొరగడంతో చేను కోయడానికే మిషన్ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నకం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు ఉమ్మడి జిల్లా రైతుకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మె.టన్నులే కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మె.టన్నుల్లో) -
వాహనాలు కనిపించట్లే..
మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి–పర్లపల్లి బీటి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో రోడ్డు వెంట ప్రయాణించే ప్రయాణికులు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా గుంతలను పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – మొగుళ్లపల్లిమొగుళ్లపల్లి మండల కేంద్రం నుంచి బంగ్లాపల్లి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా భారీగా చెట్లు ఉన్నాయి. బంగ్లాపల్లి, వేములపల్లి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట భయపడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని కోరుతున్నారు. – మొగుళ్లపల్లిగోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సులో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. మూడు రోజులు క్రిస్మస్ సెలవులు రావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో లక్నవరం జలాశయం కిటకిటలాడింది. -
‘కాళేశ్వరం’ బస్టాండ్ నిర్మాణంపై రగడ
కాళేశ్వరం: కాళేశ్వరంలో బస్టాండ్ నిర్మాణంపై రగడ జరుగుతోంది. రెవెన్యూ, అటవీశాఖ మధ్య సమన్వయం లోపించినట్లు కనిపిస్తోంది. ప్రజా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసింది. అప్పటి నుంచి అటవీశాఖ తమ ఫారెస్టు భూమి అంటూ అడ్డు తగులుతోంది. మంత్రి చొరవతో.. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్భాబు ప్రత్యేక దృష్టితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో బస్టాండ్ నిర్మాణానికి రూ.3.96కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూలైలో గోదావరి నదికి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో బస్టాండ్ త్వరితగతిన నిర్మాణం జరగాలని ఆలోచన చేస్తున్నారు. అత్యాధునిక హంగులతో నిర్మాణం చేయాలని, అవసరమైతే డిపో నిర్మాణం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. కొదిపాటి స్థలంతో.. ప్రస్తుతం కాళేశ్వరంలో బస్టాండ్ చిన్నపాటి స్థలంలో ఉంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు ఇతర చోట స్థలం కావాలని రెవెన్యూ అధికారులకు విన్నపించారు. దీంతో రెవెన్యూ అధికారులు కాళేశ్వరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలోని 129 సర్వేనంబర్లో 4.24 ఎకరాల స్థలం ఆర్టీసీకి అప్పగించారు. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఆర్టీసీ డీఎం ఇందు, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ సమాయత్తం అవుతున్నారు. మట్టిపరీక్షలు చేపట్టడానికి బుధవారం ఆర్టీసీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి తరలివచ్చారు. అటవీశాఖ రేంజర్ రవికుమార్, ఫారెస్టు సెక్షన్ అధికారి ఆనంద్, మమత సిబ్బందితో వచ్చి తమ శాఖ భూమి అంటూ అడ్డుకున్నారు. తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ వారితో వాదించినా ససేమిరా అన్నారు. ఇరు శాఖలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు మట్టి పరీక్షలు సేకరించారు. నిర్మాణంపై నీలినీడలు.. బస్టాండ్ సమీపంలోని సాకి కుంటలో బస్టాండ్ నిర్మాణం జరుపాలని పలువురు తెరపైకి తీసుకువస్తున్నారు. గతంలో ఆ కుంటలో పోలీస్స్టేషన్ నిర్మాణం జరుగాల్సి ఉండగా సీడబ్ల్యూసీ అధికారులు అడ్డుచెప్పడంతో మరోచోట నిర్మాణం జరిగింది. మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ తీసుకొని అటవీ, రెవెన్యూశాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎఫ్ఎస్ఓ ఆనంద్ను సంప్రదించగా.. అటవీశాఖ భూమి కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆర్టీసీ డీఎం ఇందును సంప్రదించగా.. తమకు ఎవరూ అడ్డుతగలలేదని.. మట్టి పరీక్షలు చేపట్టామని తెలిపారు. రూ.3.96కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం అటవీ, రెవెన్యూశాఖల సమన్వయలోపం ఎట్టకేలకు మట్టి పరీక్షలు చేసిన ఆర్టీసీ అధికారులు -
అంగన్వాడీలకు మరుగుదొడ్లు
మద్దులపల్లి పంచాయతీ భవనంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ కాళేశ్వరం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఒంటికి, రెంటికి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చిన్నారులకు ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో నిర్మాణాలను చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. స్వచ్ఛభారత్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం నిధులను వినియోగించాలని ఆదేశించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.52 వేలు వెచ్చించనున్నారు. ఇందులో కేంద్రం వాటా 70 శాతం (రూ.36,600), రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ.15,600) నిధులను సమకూర్చనున్నారు. దీంతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. స్కూల్ కాంప్లెక్సుల్లో నిర్వహించే కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్, ఐసీడీఎస్ ద్వారా ఇతర చోట్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారుల ద్వారా తెలిసింది. అందరికీ ఇబ్బందే.. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చిన్నారులు ఆరు బయటకు వెళ్తున్నారు. కేంద్రాలకు వచ్చిన గర్భిణులు, బాలింతలు, టీచర్లు, ఆయాలు కూడా ఒంటికి, రెంటికి వెళ్లాలంటే అవస్థలు తప్పడంలేదు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధుల ద్వారా నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో అన్ని కేంద్రాల్లో అందరికీ ఇబ్బందులు తప్పనున్నాయి.మండలాలు 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు భూపాలపల్లి, మహదేవపూర్ అంగన్వాడీ కేంద్రాలు 644 పక్కా భవనాలు 186 అద్దె భవనాలు 244 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నవి 214 టీచర్లు 604 టీచర్ల ఖాళీలు 40 ఆయాలు 524 ఆయాల ఖాళీలు 120 చిన్నారులు 22,079 మూడేళ్లలోపు పిల్లలు 11,973 మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 9,691 గర్భిణులు 2,591 బాలింతలు 1,696గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఎంపీడీఓకు దరఖాస్తు చేయాలి. పలానా అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు అవసరమని తీర్మానం చేయాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వచ్చిన ప్రతిపాదనలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు. వాటిని కలెక్టరుకు పంపిస్తే పరిశీలించి మంజూరు చేస్తారు. పనులను ప్రతీ దశలో ఫొటో తీసి పంపాల్సి ఉంటుంది. వాటిని ఎంపీడీఓలు తనిఖీచేసి కలెక్టర్కు పంపితే నిధులు విడుదల చేస్తారు. ఈ విషయమై డీడబ్ల్యూఓ మల్లీశ్వరిని ఫోన్ద్వారా సంప్రదించగా.. డీఆర్డీఏ ద్వారా స్కూల్ కాంప్లెక్సుల్లో నిర్వహించే అంగన్వాడీలకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరయ్యాయి. ఐసీడీఎస్ ద్వారా 150 వరకు కేంద్రాలను గుర్తించాం. 64 మరుగుదొడ్లకు మంజూరు చేశారని, 47కు మంజూరు రావాల్సి ఉందన్నారు. నిధులు మంజూరుచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటికి, రెంటికి తప్పనున్న ఇబ్బందులు తీరనున్న అంగన్వాడీల కష్టాలు -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
భూపాలపల్లి అర్బన్: పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండల పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను సమగ్రంగా పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజ లు పోలీస్స్టేషన్కు వచ్చినప్పుడు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు, త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల విశ్వాసాన్ని పంపొందించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని గ్రీన్వుడ్ పాఠశాల విద్యార్థులు హన్మకొండలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్ –14 ఖోఖో బాలుర, బాలికల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో కే.ప్రశాంత్, బాలికల విభాగంలో వి.అక్షర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందని, ఈనెల 29, 30, 31న వికారాబాద్లోని తాండూర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. హెచ్ఎం చీర్ల శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కాళేశ్వరం: ఈనెల 28న రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు అలీంఖాన్, రాజశేఖర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీబీఎల్ఏ (తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మంథనిలోని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకార సౌజన్యంతో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, డిగ్రీ విద్యార్థినులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందన్నారు. మాతా సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర, నేటి సమాజానికి అన్వయింపుశ్రీ అనే అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.25వేలు, మూడో బహుమతి రూ.15వేలు, ప్రోత్సాహక బహుమతులు రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9492883648, 9491595813, 8466975572 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి రూరల్/మొగుళ్లపల్లి: జిల్లాలోని పలువురు న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల అశోక్రెడ్డి, మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన మోరే శశికిరణ్రెడ్డిలను తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియామకమయ్యారు. రాబోయే మూడు సంవత్సరాల పాటు తెలంగాణ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించనున్నారు. తమ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ములుగు రూరల్: మేడారం జాతర సందర్భంగా ఆది దేవత గట్టమ్మ వద్ద భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధి కారులు బుధవారం వేలం పాటలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వే లం పాటలకు వ్యాపారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలం పాటల్లో కొబ్బరికాయ దుకాణం రూ.12.80లక్షలు, పసుపు–కుంకుమ రూ.4.20 లక్షలుగా పాట నిర్ణయించినట్లు తెలి పారు. అనిల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
దర్శనాలు నిలిపివేత.. ఆరుబయట పూజలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు మే డారానికి భారీగా తరలివచ్చారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పున:ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పూజారులు దర్శనాల నిలిపివేత ప్రకటించిన విషయం తెలిసిందే. సమాచారం అందని భక్తులు వంద సంఖ్యలో మేడారా నికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను గద్దెల వద్దకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు బయటనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని పక్కనే ఉన్న చెట్టు వద్ద పసుపు, కుంకుమ, ఒండిబి య్యం సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వా త మధ్యాహ్నం 2 గంటల సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. దీంతో భక్తులు సమ్మక్క– సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి, పోలీసులు భక్తులను గద్దెల ప్రాంగణంలో రాకుండా చర్యలు తీసుకున్నారు. -
పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
కాటారం: నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ఏవీఎస్ ఫంక్షన్హాల్లో బుధవారం కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉపసర్పంచ్లకు అభినందన, సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో అవినీతి రహిత పాలన అందించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం విలాసాగర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పూసాల శశికాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజ బాబు, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, చీమల సందీప్, వేమునూరి ప్రభాకర్రెడ్డి, చిటూరి మహేశ్గౌడ్, పంతకాని సమ్మయ్య, ఆంగోతు సుగుణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు కాళేశ్వరం: మహాదేవపూర్ మండల కేంద్రంలోని నాగేంద్రగిరి శ్రీఆనంద ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల సమక్షంలో స్వామివారికి అభిషేకం చేసి, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి, రైతాంగానికి మంచి దిగుబడులు లభించి, రాష్ట్రం వ్యవసాయంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ప్రార్ధించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత వేగం పెరగాలని, పరిశ్రమలు, ఐటీ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
నిర్వహణలేని ‘వనాలు’
భూపాలపల్లి రూరల్: వృక్ష సంపదను పెంచి గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలకు ప్రయోజనం ఉందా.. లేదనేది పక్కన బెడితే నిధులు మాత్రం రూ.లక్షలు ఖర్చయ్యాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటులో భాగంగా అధికారులు హడావుడిగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటించారు. కొన్నిచోట్ల ఆదరబాదరగా స్థలాలను గుర్తించిన అధికారులు.. నామమాత్రంగా మొక్కలు నాటించి మమ అనిపించారు. ఒక్కో బృహత్ ప్రకృతివనంలో దాదాపు 3వేల నుంచి 30 వేలలోపు మొక్కలు నాటినట్లు లెక్కలు చూపించి రూ. 2.26 కోట్లు ఖర్చు చేశారు. అయితే ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన స్థలాలు చౌడు, గుట్ట నేలలు కావడంతో నాటిన మొక్కలు చాలా వరకు పెరగడం లేదు. గ్రామాలకు దూరంగా ఏ ర్పాటు చేయడంతో తదితర మండలాల్లో నాటిన మొక్కలు కనిపించకపోగా.. బోర్డులు, గేట్లను ఎత్తు కు పోయారు, పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. 11 మండలాల్లో ఏర్పాటు జిల్లాలోని 11 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ప్రతీ మండలానికి బృహత్ వనాన్ని కేటాయించారు. తర్వాత వాటి సంఖ్యను 5కు పెంచారు. జిల్లాలో మొత్తం 55 బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. 5 ఎకరాల పరిధిలో వనాలు పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా ఏర్పా టు చేసి, కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను తినేస్తున్నాయి.బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నేరేడు, చింత, సీతాఫలం, మారేడు, తంగేడు, కానుగ, టీకోమా, నిమ్మ, గుల్మహార్, జామ, మామిడి, బేరు, వెదురు, పనస వంటి మొక్కలతో పాటు భారీ వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటారు. అయితే ప్రస్తుతం అక్కడక్కడ జామ ఇతర మొక్కలు తప్ప ఇతర మొక్కలు కనిపించడం లేదు. బృహత్ వనాలను సంరక్షించేందుకు వానాకాలం మినహా మిగతా రోజుల్లో ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పట్టడానికి ఇద్దరు కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయినా ఆశించిన ఫలితంలేదు. బోర్డులు, గేట్లను ఎత్తుకెళ్లిన వైనం రూ.లక్షల్లో ప్రజాధనం వృథా జిల్లాలో 55 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు -
క్రీడలతో మానసికోల్లాసం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం పెరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సింగరేణి వర్క్ పిపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో రీజియన్ స్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు కేవలం ఆనందం మాత్రమే కాదని, మన ఆరోగ్యానికి, పట్టుదలకు దారితీసే మంచి మార్గమన్నారు. క్రీడల ప్రాముఖ్యతను మనస్ఫూర్తిగా గ్రహించి, పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలన్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యువ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి కోల్ ఇండియా స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది శ్యాంసుందర్, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, జనరల్ కెప్టెన్ మల్లేశ్, భూపాలపల్లి అథ్లెటిక్ కెప్టెన్ బానోత్ రమేష్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎం రాజేశ్వర్రెడ్డి రీజియన్ స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం -
సాగు విస్తీర్ణం అంచనా..(ఎకరాల్లో..)
వరి 98,000 మొక్కజొన్న 30,000 పెసర 150ఇతర పంటలు 300● నారుమళ్లు సిద్ధంచేసిన రైతులు ● పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు కాటారం: పంట సాగు పెట్టుబడి కోసం రైతులకు ప్రతీ సీజన్లో ప్రభుత్వం ద్వారా అందుతున్న సాయం ఈ సీజన్లో ఇప్పటికీ అందలేదు. యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. రైతులు ఇటీవల వానాకాలం పంట సాగు పూర్తిచేసి ధాన్యం విక్రయిస్తున్నారు. మరో పక్క యాసంగి కోసం పొలాలు చదును చేసి నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో రైతులకు దుక్కి దున్ని, పొలాలు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడం కోసం కొంత డబ్బు అవసరం పడుతుంది. దీంతో రైతులు ప్రభుత్వం ద్వారా అందే రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2.70లక్షల ఎకరాల భూమి.. జిల్లాలో 2.70 లక్షల ఎకరాల పైచిలుకు వ్యవసాయ సాగు భూములు ఉండగా 1,13 లక్షల మంది రైతులు ఉన్నారు. వానాకాలం సీజన్లో సుమారు 2.40 లక్షల ఎకరాల భూమిలో పత్తి, వరి, ఇతరత్రా పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్లో పత్తి సాగు ఉండకపోగా కేవలం 1.28 లక్షల భూమిలో వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు సాగు జరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన వర్షాకాలంలో అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టాన్ని చవిచూశారు. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం సైతం అందలేదు. ఈ యాసంగి సీజన్లో సకాలంలో పంటలు సాగు చేసుకుందామంటే సాగుకు పెట్టుబడి కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏటా పెరుగుతున్న ఖర్చులు.. ఏటా పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు సాగుచేయాలనే తపనతో రైతులు వివిధ కంపెనీల మాయమాటలు నమ్మి రైతులు అధికంగా విత్తనాల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు. ఒక్క ఎకరాకు విత్తనాల కోసమే రూ.5వేల నుంచి రూ6.వేల వరకు చెల్లిస్తున్నారు. ఇక దుక్కులు దున్నడం, రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు నివారణ మందులు, నాటుకు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు వస్తోంది. పెట్టుబడి సాయం సకాలంలో చేతికి అందితే వాటికి కొంత కలుపుకొని పంట సాగులో ముందుకు వెళ్లవచ్చని రైతులు ఆశపడుతున్నారు.రైతులకు పెట్టబడిలో సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.6వేలు పెట్టుబడి సహాయం అందిస్తూ వచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7500 పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్పు చేసి ఎకరాకు రూ.6వేల చొప్పున అందిస్తూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పెరిగిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడితో రూ.6వేలు రైతులకు ఎటూ సరిపోవడం లేదు. -
మరింత లాభాల్లోకి తీసుకురావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థను అధికారులు, కార్మికులు నిరంతరం శ్రమించి మరింత లాభాల్లోకి తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులకు సకాలంలో వేతనాలు అందిస్తూ వారి ఆరోగ్యం, సంక్షేమ పట్ల ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల బోనస్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళాలతో పాటు స్కిల్డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కార్మికుడు 8గంటల పాటు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సంస్థపైన ఉందన్నారు. పట్టణంలో మున్సిపాలిటీతో కలిసి కోతులు, కుక్కల బెదడను నివారించాలని కోరారు. సీఎస్ఆర్ నిధులతో ఈ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఏరియాలో 100లక్షల టన్నుల టార్గెట్ భవిష్యత్కాలంలో ఏరియాలో 100లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తాడిచెర్ల ఓసీ–2, వెంకటాపూర్ పీవీఎన్ఆర్ ప్రాజెక్ట్, భూపాలపల్లిలో ఓసీపీ–1 కింది భాగంలో అండర్గ్రౌండ్ ఏర్పాటు, ఓసీపీ–2 విస్తీర్ణతతో ఏరియాకు మరో వంద సంవత్సరాల భవిష్యత్త్ ఉందన్నారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితో ఇప్పటికి విద్యుత్ ఉత్పత్తి చేపడుతుందని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కుడా సింగరేణి విస్తరించిందన్నారు. కర్ణాటకలో త్వరలో బంగారం, కాపర్ వెలికితీతకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీఎం కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జీఎం రాజేశ్వర్రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జీఎం సింగరేణి పతాకావిష్కరణ చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి వారు వేదికపై కేక్ కట్ చేశారు. అనంతరం ఉత్తమ అధికారులు, కార్మికులకు బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏరియా సేవ అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్రెడ్డి, అధికారులు కవీంద్ర, జోతి, రవికుమార్, నజీర్, ఎర్రన్న, శ్యాంసుందర్, ప్రాతినిధ్య సంఘాల నాయకులు మధుకర్రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
జయశంకర్ భూపాలపల్లి
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శం7భూపాలపల్లి రూరల్: ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మంజూరునగర్లోని కల్వరి చర్చిలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్కట్చేసి వేడుకలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి మల్లీశ్వరి, పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్, పాస్టర్లు పాల్గొన్నారు. -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందన్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు... 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి... మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు(2011 ప్రకారం)పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
జిమ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సీఈఆర్ కబ్ల్లో ఏర్పాటు చేసిన నూతన జిమ్ సెంటర్ను కార్మికులు, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను మంగళవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు వేసినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ అభివృద్ధికి మూలాధారమని తెలిపారు. శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, పని సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే ఆధునిక వసతులతో జిమ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉద్యోగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవ అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి, అధికారులు కవీంద్ర, జోతి, ఎర్రన్న, రవికుమార్, శ్యాంసుందర్, రమేశ్, మధుకర్రెడ్డి పాల్గొన్నారు.ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
మేడారం..ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదిమంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, ప్రతీ దరఖాస్తుకు సరైన న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. వెంకటస్వామి సేవలు మరువలేనివి.. ప్రముఖ నాయకుడు, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని ఎస్పీ సంకీర్త్ అన్నారు. వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వెంకటస్వామి తన జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితం చేశారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
గణితంపై భయం వీడాలి
● ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల కాటారం: విద్యార్థులు గణితం పట్ల భయం వీడి ఆసక్తి పెంచుకోవాలని కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సూచించారు. మండలకేంద్రంలోని ఆదర్శ హైస్కూల్, గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాల, కేజీబీవీ పాఠశాలల్లో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదర్శ హైస్కూల్లో మ్యాథమెటికల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థినులు గణితశాస్త్రంకు సంబంధించిన ప్రాజెక్టులు, నమూనాలు, ఆకృతులు తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ దశ నుంచే విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హైస్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్రావు, కరస్పాండెంట్ కార్తీక్రావు, కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, గురుకులం ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిల్లర్లు కోత విధిస్తే ఊరుకునేది లేదు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి మిల్లర్లు అడ్డగోలుగా కోత విధిస్తే ఊరుకునేది లేదని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండలం దామెరకుంట, మల్లారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను సోమవారం చైర్పర్సన్ పరిశీలించారు. ధాన్యం నిల్వ, కొనుగోలు ప్రక్రియ, రవాణాపై ఆరా తీశారు. చైర్పర్సన్ వెంట మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్రెడ్డి, దేవదాసు, మహేశ్, సురేందర్ పాల్గొన్నారు. -
లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఆహార వ్యాపార నిర్వాహకులకు ఈ నెల 24వ తేదీన లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆహార వ్యాపార నిర్యాహకులు తప్పని సరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లైసెన్స్ గడువు ముగిసిన వారు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లోని రూం నంబర్ ఎఫ్–19లో సంప్రదించాలన్నారు. వివరాల కోసం జిల్లా ఆహార భద్రత అధికారి 70327 16925, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ 99858 20544 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మొగుళ్లపల్లి: మండలంలోని మెట్టుపల్లికి చెందిన మర్రి శ్రీనివాస్(38) సికింద్రాబాద్ రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. వారం క్రితం విధి నిర్వహణలో ఉండగా పోల్ నుంచి కిందపడిపోయారు. దీంతో సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వైద్యులు కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలు ఐదుగురికి అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రత్నకుమారి, కూతురు సంహిత, కుమారుడు గీతాన్ ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సంజీవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఏరియా అధికారులు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో జీఎం రాజేశ్వర్రెడ్డి, అధికారులు మౌనం పాటించారు. 2007లో సింగరేణిలో జరిగిన ఇంటర్నల్ క్లరికల్ పరీక్షల్లో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై పలు విభాగాల్లో పనిచేసి సూపరింటెండెంట్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందడం తీరనిలోటన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన్న, రవికుమార్, రాజేశ్వర్, శ్యాంసుందర్, ప్రదీప్, క్రాంతికుమార్, శ్రావణ్కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ఏకపక్షంగా చేశారంటూ 8 మంది వార్డుసభ్యులు సోమవారం ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. 12 మంది వార్డు సభ్యులకు గాను కేవలం సర్పంచ్ చాట్ల విజయతో పాటు నలుగురు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి అర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరంగా మారందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొమవారం నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి సమ్మారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత సమావేశాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి, నాయకులు రాజేందర్, శ్రీధర్, రమేశ్, రఫీపాషా, రమాదేవి, రామయ్య పాల్గొన్నారు. -
మోరంచ మళ్లీ ఉప్పొంగితే..
భూపాలపల్లి: భారీ వర్షాలు కురిసి వాగులు ఉప్పొంగి, చెరువు కట్టలు తెగినప్పడు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. 2023 జూలై 27న భూపాలపల్లి మండలంలోని మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లిలో 280 ఇళ్లు నీట మునిగాయి. గ్రామానికి చెందిన నలుగురు వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ నేపథ్యంలో మరోమారు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం మోరంచపల్లి గ్రామంతో పాటు, మోరంచవాగులో మాక్ డ్రిల్ నిర్వహించాయి. వాగులు ఉప్పొంగినప్పుడు పశువులు, మనుషులు నీటిలో కొట్టుకుపోతే, ఎలా కాపాడాలో కళ్లకు కట్టినట్లుగా డ్రిల్ నిర్వహించారు. అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించారు. వరద ప్రభావిత కాలనీలను ఎలా తరలించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎస్పీ సంకీర్త్, అధికారులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలి
భూపాలపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం జిల్లాలోని తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. మీ డబ్బు.. మీ హక్కు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ‘మీ డబ్బు.. మీ హక్కు’ అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 4న గుజరాత్లోని గాంధీనగర్లో జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందన్నారు. బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేపట్టారని తెలిపారు. పర్యాటక బ్రోచర్ ఆవిష్కరణ.. జిల్లాకేంద్రంలో ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ పర్యాటక బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల సమాచారంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకశాఖ 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ చేయడానికి ప్రోత్సాహకుల నుంచి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శా ఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తుందన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా మూడు ఫొటోలు, 60 సెకండ్ల వీడియో 100 పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా గూగుల్ ఫామ్లో పర్యాటక వెబ్సైట్కు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
రామాలయంలో పారాయణం
కాళేశ్వరం: ధనుర్మాసం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో ఆలయ అర్చకులు ఆరుట్ల రామాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురం చొప్పున పారాయణం పఠిస్తున్నారు. ఆదివారం శ్రీసీత సమేత రామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమం భూపాలపల్లి అర్బన్: జిల్లా యువజన సర్వీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో నిర్వహించినట్లు డీవైఎస్ఓ చిర్ర రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు సండేస్ ఆన్ బైస్కిల్ అనే కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రఘు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కోట్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది శివసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక కాటారం: మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన నిఖిల్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్లో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్ అండర్ 18 పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు తరఫున నిఖిల్ అత్యంత ప్రతిభ కనబర్చాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. గురుకులం విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఖోఖో అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అద్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి కుమార్, ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం, పీడీ మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 24న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు భూపాలపల్లి అర్బన్: జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పసుల లక్ష్మణ్, పక్కల రాజబాబు ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్హర్ మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్సాహమున్న మహిళలు, పురుషులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 85 కేజీలోపు బరువు ఉండాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్కార్డుతో పాటు కబడ్డీ కిట్ను వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఈ నెల 26నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 86393 46695, 90106 77080 ఫోన్నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఆవిర్భావ దినోత్సవం రద్దు అన్యాయం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిధుల కొరత నెపంతో ఈ నెల 23న ఏరియా స్థాయిలో జరగాల్సిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని యాజమాన్యం రద్దుచేయడం అన్యాయమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వేలబోయిన సుజేందర్ తీవ్రంగా ఖండించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు తక్కువ బడ్జెట్ మంజూరు చేసిందన్నారు. దీనిపై కార్మికులు చాలా ఆగ్రహంగా ఉన్నారని.. కార్మికులు కష్టపడి లాభాలు తెస్తుంటే, తమ పండుగ లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జరపకుండా నిధుల కోత విధించడం సరైనది కాదన్నారు. రాజకీయ నాయకుల మెప్పుల కోసం సింగరేణి నిధులను దుబారా చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పెద్ద మొత్తంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను నిధుల కొరతతో ఎలా నిర్వహిస్తారో వేచి చూడాలన్నారు. సింగరేణి యాజమాన్యం, కార్మికుల శ్రేయస్సు కోసం వెచ్చించాల్సిన నిధులను ప్రభుత్వ అవసరాలకు, మంత్రుల మెప్పుకోసం, ఫుట్బాల్ ఆటల కోసం వెచ్చిస్తుందన్నారు. సింగరేణి కార్మికుల ఆత్మగౌరవ పండుగలాంటి ఆవిర్భావ దినోత్సవాన్ని నిధుల కొరతతో నిర్వహించలేమని చెప్పడం సింగరేణి అస్తిత్వానికి ఆటంకంగా ఉందని యాజమాన్య వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి, నూతన బొగ్గు గనుల, భూనిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సింగరేణి నిధులను యాజమాన్యం తన ఇష్టానుసారంగా మళ్లించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే సింగరేణి ఆవిర్భావ వేడుకలను గతంలో మాదిరిగా ఘనంగా నిర్వహించడం కోసం తగినన్ని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి యాజమాన్యం సింగరేణి నిధులను దుబారా చేయడం మానుకొని, కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, అల్లం శ్రీనివాస్, భాస్కర్, శ్రీరాములు, రాజు, సాగర్, కొత్తూరు మల్లేష్ పాల్గొన్నారు. -
ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర
భూపాలపల్లి రూరల్: పేదల ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతధంగా కొనసాగించాలని, పథకాల నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్కాలనీలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఉపాధిహమీ పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా -
పంచాయతీ పట్టని ఓటర్లు!
ఓటుకు దూరంగా 2.93 లక్షల మందిఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలు : 1,682● 21.17 లక్షల మందికి ఓటేసింది 18.25 లక్షల మంది ● 87 శాతానికే పరిమితమైన ఓట్లు.. మూడు విడతల్లోనూ ఇదే పరిస్థితి ● పోలింగ్ శాతం తగ్గడంపై సర్వత్రా చర్చ.. ఇదే అంశంపై ఉన్నతాధికారుల ఆరాఓటేయని వారి శాతం : 13.82పోలింగ్ శాతం : 86.182,92,63821,17,18818,24,580మొత్తం ఓటర్లుపోలైన ఓట్లుసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 89 నుంచి 94 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని అధికారులు సైతం భావించారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించడంతోపాటు.. ఓటు సద్వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 21,17,188 మంది ఓటర్లు ఉండగా 18,24,580 (86.18 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామలో ఎక్కువగా నమోదు.. ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఓటు శాతం 87.07 దాటలేదు. 2,92,608 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జనగామలో ఓటింగ్ ఎక్కువగా నమోదైంది. మొదటి విడతలో అత్యధికంగా జనగామ జిల్లాలో 87.39 శాతం, రెండో విడతలో 88.52 శాతం కాగా, మూడో విడతలో 88.48 శాతంగా నమోదైంది. మూడో విడతలో మహబూబాబాద్లో 88.52 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలాల వారీగా చూస్తే కూడా 8 మండలాలు మినహా ఏ మండలంలోనూ 90 శాతాన్ని మించి ఓటుహక్కు వినియోగించుకోలేదు. 1,682 గ్రామ పంచాయతీల పరిధిలో 21,17,580 మంది ఓటర్లకు 18,24,580 మంది (86.18 శాతం) ఓట్లు వేయగా.. 2,92,638 (13.82 శాతం) మంది ఓటుకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఓట్ల శాతం ఎందుకు తగ్గినట్లు..? పోలింగ్ శాతం తగ్గడంపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కాకుండా.. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో మరిన్ని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలింగ్ బూత్స్థాయి అధికారులు (పీబీఎల్ఓలు) డివిజన్, జోనల్ ఇన్చార్జ్లు, రూట్ ఆఫీసర్ల వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. ఓట్ల శాతం తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి పేర్లను కొన్ని తొలగించలేదని ప్రాథమికంగా గమనించినట్లు చెబుతున్నారు. మృతుల పేర్లు జాబితాలో కొనసాగడంతోపాటు స్థానికేతరుల పేర్లను తొలగించకపోవడం వల్ల పోలింగ్ శాతంగా తగ్గినట్లు భావిస్తున్నామని, వాటన్నింటిపై కసరత్తు చేస్తున్నామని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏయే జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది.. అందుకు కారణాలు ఏమిటన్న విషయాలతో పాటు తక్షణమే తొలగించాల్సిన ఓటర్ల జాబితాను కూడా ఈ మేరకు జిల్లాల వారీగా సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి పంపేందుకు ఓ నివేదికను అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. -
కల్వర్టు నిర్మించాలి
మల్హర్: మండలంలోని కొండపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుంభంపల్లి గ్రామం నుంచి మానేరు సమీపంలో పొలాలకు, శ్మశానవాటికకు వెళ్లడానికి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారిలో ఒర్రె మాటు నిత్యం నీళ్లు ఉండటంతో రైతులు అటుగా పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతిమయాత్ర కార్యక్రమాలకు, పొలం పనులకు వెళ్లడానికి వర్షాకాలం సీజన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కుంభంపల్లి మాటుపై కల్వర్టు నిర్మించి, రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సర్పంచ్లకు సవాళ్లు
మూడేళ్లుగా పంచాయతీలకు రాని నిధులు భూపాలపల్లి: కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు గ్రామాల్లో సమస్యల పరిష్కారం సవాల్గా నిలువనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల్లో గెలుపొందేందుకు కొందరు సొంత మేనిఫెస్టోలు రూపొందించుకొని హామీలు గుప్పించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో ఇచ్చిన హామీలు మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. గ్రామాల్లో సమస్యలు విలయతాండవం.. జిల్లాలోని గ్రామాల్లో సమస్యలు విలయతాండవం ఆడుతున్నాయి. గత పాలకవర్గాలు 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 1వ తేదీ వరకు అధికారంలో ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వాల నుంచి నిధులు సక్రమంగా రాకపోయినప్పటికీ సర్పంచ్లు చేసేదిలేక వీధి దీపాలు, తాగునీటి బోర్ల మరమ్మతులు చేయించారు. వివిధ పథకాల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు ఆ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్లంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడేళ్లుగా 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. జిల్లాకు ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున మూడేళ్లలో రావాల్సిన రూ.45 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఫండ్స్ లేని కారణంగా జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లు మూలన పడి ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీధి దీపాలు, తాగునీటి బోర్ల విద్యుత్ బిల్లులు భారీ మొత్తంలో పేరుకుపోయి ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సైడ్ కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోయి ఉంది. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్త సర్పంచ్లపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. సొంత మేనిఫెస్టో, హామీల అమలు ఎలా..? జిల్లాలోని 12 మండలాల్లో 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన వారు నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన వారిలో పలువురు సర్పంచ్, వార్డుసభ్యులు ఎన్నికల సమయంలో గెలుపు కోసం సొంత మేనిఫెస్టోలు రూపొందించుకొని హామీలు గుప్పించారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీర్చడం, వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, కుల సంఘాలకు భవనాల నిర్మాణం, దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని హామీలు గుప్పించారు. కొందరైతే ఏకంగా పింఛన్లు మంజూరు చేయిస్తామని, పంట పొలాలకు రహదారులు ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపు కోసం వారి పరిధిలో సాధ్యం కాని హామీలను సైతం ఇచ్చారు. నిధులు లేక ఇప్పటికే సమస్యల వలయంలో ఉన్న గ్రామాల్లో కొత్త సర్పంచ్లు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారోననే చర్చ గ్రామాల్లో నెలకొంది. మూలనపడిన చెత్త ట్రాక్టర్లు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం పెండింగ్లో భారీగా విద్యుత్ బిల్లులు చిన్నచిన్న అభివృద్ధి పనులకు సైతం నిధులు కరువు నేడు కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం -
నైతిక విలువలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: నైతిక విలువలు పాటించి రాజీమార్గంలో సాగాలని, వివాదాలకు తావులేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోదరాభావంతో కలిసి మెలిసి జీవించినప్పుడు వివాదాలు తలెత్తవని, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. పంతాలకు పోయి కేసుల పాలై పోలీస్స్టేషన్ల, కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదని, మనశ్శాంతి, డబ్బు, సమయాన్ని కోల్పోవలసి వస్తుందని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగే లోక్ అదాలత్లో కేసుల్లోని ఇరువర్గాల వారి అంగీకారంతో కేసులను కొట్టివేసినట్లు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, డీఎస్పీ సంపత్రావు, బార్ అసోసియేషన్ సభ్యులు మహేందర్, శ్రవణ్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, సీఐ నరేష్, ఎస్ఐలు సాంబమూర్తి, సుధాకర్, న్యాయవాదులు, కాక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజీమార్గంలో పయనించి కేసులు పరిష్కారం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్బాబు -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది. పీఏసీఎస్లకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం భూపాలపల్లి రూరల్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార పరపతి సంఘాలు రద్దయిన నేపథ్యంలో పాలకవర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, చిట్యాల సొసైటీలకు స్పెషల్ ఆఫీసర్గా రిజిస్ట్రార్ రాజు, గణపురం, చెల్పూర్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎల్లయ్య, జంగేడు, తాడిచర్లకు సీనియర్ ఇన్స్పెక్టర్ రిలీఫ్, రేగొండ, మొగుళ్లపల్లి సొసైటీలకు స్పెషల్ ఆఫీసర్గా డిప్యూటీ రిజిస్ట్రార్ శైలజను నియమించినట్లు తెలిపారు. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్ పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
వైభవోపేతంగా కల్యాణ మహోత్సవం
భూపాలపల్లి అర్బన్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీకోదండ రామాలయంలో శనివారం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదోక్త విధానాలు, ఆగమ శాస్తోక్త్ర నియమాలను అనుసరించి మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణలు, సంప్రదాయ ఆచారాలతో ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి దివ్య దర్శనం చేసుకొని, కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి అపార కృపాశీస్సులను పొందారు. భక్తుల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ దేవస్థానానికి చెందిన అర్చక స్వాములు, వేద పండితులు, సిబ్బంది సమన్వయంతో శాస్తోక్త్రంగా కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించారు. ఈ కల్యాణోత్సవంలో జిల్లా ప్రధాన నాయమూర్తి రమేష్బాబు, జడ్జిలు నాగరాజు, దిలీప్కుమార్, అఖిల, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఇతర శా ఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నామమాత్రంగానే..
కాటారం: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచే దిశగా సాంకేతిక పద్ధతిలో విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ బోధన పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన డిజిటల్ బోధనకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన ఇన్ఫాస్ట్రక్చర్ లేకపోవడంతో ఏఐ బోధన అమలు కష్టతరంగా మారింది. ఏఐ బోధనకు ప్రత్యేకంగా ల్యాబ్తో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సి ఉంటుంది. పాఠశాలల్లో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు నామమాత్రంగా డిజిటల్ బోధనను ముందుకుసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ బోధన అమలుకు నోచుకోవడం లేదు. అందుబాటులో లేని సౌకర్యాలు.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏఐ ద్వారా విద్యాబోధన చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటగా జిల్లాలోని ఆరు పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఇందులో భూపాలపల్లి మండలం గుర్రంపేట, కమలాపూర్, కాటారం మండలం చింతకాని, దేవరాంపల్లి, మహదేవపూర్ మండలం అంబట్పల్లి, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో వసతులు లేకపోవడంతో ఏఐ తరగతుల నిర్వహణ కష్టతరంగా మారింది. డిజిటల్ ఆధారిత బోధనలో కంప్యూటర్లు కీలకం అయినప్పటికీ ఏ పాఠశాలలోనూ కంప్యూటర్లు అమర్చలేదు. ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు జరగలేదు. దీంతో సమీపంలోని హైస్కూల్లో కంప్యూటర్లను వినియోగిస్తూ విద్యార్థులకు ఏఐ బోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్ సౌకర్యం సైతం లేకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద ఉన్న మోబైల్స్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో ఏఐ బోధన అంతంత మాత్రంగానే కొనసాగుతున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ బోధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కృతిమ మేథస్సు (ఏఐ) విద్యా బోధన పద్ధతిని ప్రవేశపెట్టింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈ విధానం ద్వారా బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతుల నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేసి వారానికి రెండు రోజుల పాటు తెలుగు, మరో రెండు రోజుల పాటు గణితం బోధించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యాబోధన చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధించాలి. విద్యార్థి పాఠాలను అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది ఏఐ గుర్తిస్తుంది. విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థం కానట్లయితే సరళమైన మార్గంలో ఏఐ బోధన చేస్తుంది. ఇలా ప్రతీ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను లెక్కకట్టనుంది. అనంతరం విద్యార్థులపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలన్నది ఏఐ విద్యాబోధన ముఖ్య ఉద్దేశం. ఏఐ బోధన సక్రమంగా జరిగేలా.. జిల్లాలోని ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పలు పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – రాజేందర్, డీఈఓముందుకుసాగని ఏఐ బోధన పూర్తిస్థాయిలో అందుబాటులో లేని మౌలిక వసతులు హైస్కూల్కు సంబంధించిన కంప్యూటర్లతో ల్యాబ్ నిర్వహణ ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు జిల్లాలో ఆరు పాఠశాలల్లో నిర్వహణప్రాథమిక పాఠశాలలు 317 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ఉన్నత పాఠశాలలు 69 విద్యార్థుల సంఖ్య 19,788మరో 30 పాఠశాలల ప్రతిపాదన.. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు పాఠశాలలతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు కలిగిన మరో 30 పాఠశాలల్లో ఏఐ బోధన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రతిపాదిత పాఠశాలల్లో సైతం ఇన్ఫాస్ట్రక్చర్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన అనంతరం ఏఐ బోధన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. -
ప్రమాదాల నివారణకు ప్రణాళికలు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పోలీస్, రవాణా, ఆర్టీసీ, వైద్య, విద్యా, సంక్షేమ శాఖలు, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, మున్సిపల్, పంచాయతీరాజ్శాఖల అధికారులతో నిర్వహించిన రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాలకు కారణాలు గుర్తించి వాటి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన ఇంజనీరింగ్ మార్పులు చేపట్టాలని, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రహదారి భద్రతా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోటీలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో గుర్తించిన 10 బ్లాక్ స్పాట్లను పోలీస్, రవాణా, రహదారుల అధికారులు పరిశీలించి ఇంటర్ వెన్షన్స్ తయారు చేయాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2026 జనవరిలో చేపట్టనున్న రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణకు శాఖల వారీగా కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నరేష్కుమార్, ఆర్టీఓ సంధాని, ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్అండ్బీ ఈఈ రమేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, జాతీయ రహదారుల డీఈ కిరణ్, ఐఆర్డీ డీఆర్ఎం లక్ష్మణ్, అన్ని శాఖల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నియంత్రించడమే లక్ష్యంగా జనవరి మాసంలో నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై శనివారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, శాంతి భద్రతల ఏడీజీ మహేష్ భగవత్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోరంచపల్లిలో మాక్డ్రిల్ వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై ఈ నెల 22న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మోరంచపల్లిలో నిర్వహించనున్న మాక్డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటనలో తెలిపారు. మాక్డ్రిల్లో వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు, పారిశ్రామిక ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధానాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, మున్సిపల్, పరిశ్రమల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. -
నవగ్రహాల వద్ద శనిపూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన నవగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నవగ్రహాల వద్ద పూజలు చేసిన అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తజనం సందడి నెలకొంది. లారీల అడ్డగింత మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్ లారీలను డేంజర్ జోన్ నిర్వాసితులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. డేంజర్ జోన్ ఎస్సీ కాలనీ ఇంటి సమీపంలో ఓపెన్ కాస్ట్ మట్టి పోస్తుండటంతో వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నామని అన్నారు. రెండు రోజుల్లో అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని మైన్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ మూర్తి హామీ ఇచ్చారు. నేడు జాతీయ లోక్ అదాలత్ భూపాలపల్లి అర్బన్: నేడు(ఆదివారం) జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గంలో కేసులను తొలగించుకునేందుకు లోక్ అదాలత్ చక్కటి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీసులు, న్యాయవాదులు సహకరించి క్షక్షిదారులు అఽధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని సూచించారు. ధనుర్మాసం ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత ఆలయంలో ప్రతీ సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ తెలిపారు. అందులో భాగంగా స్వామి వారిన ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలన్నారు. చెక్ డ్యాం పరిశీలన మల్హర్: జిల్లా సరిహద్దులోని వల్లెకుంట–పెద్దపల్లి జిల్లా మంథని అడవి సోమన్పల్లి మానేరుపై నిర్మించిన డ్యామేజ్ అయిన చెక్డ్యాంను స్టేట్ ఫొరెన్సిక్ టీమ్, క్లూస్ టీం సభ్యులు శనివారం పరిశీలించారు. ఈనెల 17న చెక్ డ్యాం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు కొయ్యూరు స్టేషన్లో ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టగా శనివారం ఈ ఘటనపై చెక్ డ్యాం డ్యామేజీ అయిన ప్రదేశాన్ని ఫొరెన్సిక్, క్లూస్ టీం సభ్యులు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి నమూనాలు సేకరించారు. సదరు నివేదిక ఆధారంగా చెక్ డ్యాం కూలిపోయిందా.. కూల్చేశారో తెలియనుంది. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్, ఎస్సై–2 రజన్కుమార్, మహదేవపూర్ ఎస్సై పవన్ ఉన్నారు. -
రూ.203 కోట్ల నిధులు మంజూరు
కాటారం: మంథని నియోజకవర్గంలోని మంథని–ఆరెంద మానేరు మీదుగా దామెరకుంట వరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్ల నిధులు విడుదలైనట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మండలం ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 కిలోమీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుంచి బ్రిడ్జి వరకు మరో వైపు దామెరకుంట రోడ్డు వరకు 9.530 కిలో మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంథనితో పాటు ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాకు, మహారాష్ట్ర, కాళేశ్వరం దేవాలయానికి ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా ప్రజలకు రవాణా భారం తగ్గించేందుకు బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం ద్వారా మంథని, పెద్దపల్లి జిల్లా నుంచి కాళేశ్వరం వెళ్లడానికి 25 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మానేరుపై బ్రిడ్జి నిర్మాణం పట్ల ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేయడంతో పాటు మంత్రి శ్రీధర్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు కొత్త కోర్టుల ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో నేడు(శనివారం) రెండు నూతన కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్ వర్చ్యువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవారపు రాజేశ్వర్రావు, జస్టిస్ బిఆర్ మధుసూదన్రావు వర్చ్యువల్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్ను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రావణ్రావు, విష్ణువర్ధన్రావు, శివకుమార్, రమేష్నాయక్, రాకేష్, వెంకటస్వామి, దివ్య పాల్గొన్నారు. మల్హర్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగో మహాసభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొయ్యూరు సెంటర్లోని కొమురం భీం విగ్రహ వద్ద కరపత్రాలను శుక్రవారం పీక కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మహాసభకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్యల రాష్ట్ర కార్యదర్శి బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు గడ్డం సమ్మక్క, దళిత నాయకురాలు మేకల కళ, బీసీ మహిళా నాయకురాలు నర్సక్క పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 80 వసంతాల అభ్యుదయోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్తో కలిసి కార్యాలయంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండెం మధుసూదన్, కూచనపల్లి రవీందర్ మాట్లాడుతూ ఈ నెల 21న హైదరాబాద్లో విద్యా సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుకుమార్, రాజు, వేణుగోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టేకుమట్ల: గ్రూప్ త్రీ ఫలితాల్లో మండలంలోని రామకృష్ణపూర్ (టి)గ్రామానికి చెందిన కూలీ కొడుకు బొంపెల్లి బాలకృష్ణ మంచి ర్యాంకు సాధించి గురుకుల విద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. మండలంలోని రామకృష్ణపూర్ (టి) గ్రామానికి చెందిన బొంపెల్లి గోవిందం–విమల దంపతులది రెక్కడితేగానీ డొక్కాడని కుటుంబం. నిత్యం కూలి పని చేసుకుంటూ కుమారుడు బాలకృష్ణను ఉన్నత చదువులు చదివించారు. బాలకృష్ణ చదువులో కష్టపడుతూ సివిల్స్ కోసం సన్నద్ధమయ్యాడు. సివిల్స్ రాకపోవడంతో గ్రూప్ వన్, టూ, త్రీకి సన్నద్ధమయ్యాడు. గ్రూప్ త్రీలో 1,061 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు. -
సింగరేణి సంస్థ నిర్వీర్యానికి కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్ సంస్థను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను జెక్కోకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాడిచర్ల బొగ్గు బ్లాక్ను ఈ విధంగానే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణికి జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఇప్పుడు మణుగూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనే ప్రయత్నాలు చేపడుతోందన్నారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, పండ్రాల మల్లయ్య, స్వామి, రమేష్, శంకర్, నారాయణ, రాజు, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ -
కంకర వేశారు.. తారు మరిచారు
రేగొండ: మండలంలోని రేపాక గ్రామంలో బస్టాండ్ నుంచి గ్రామ శివారు వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై ప్రతీ రోజు రైతులు, వాహనదారులు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. నూతన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గ్రామంలో సుమారుగా మూడు కిలోమీటర్ల వరకు సంవత్సరం క్రితం కంకర వేశారు. కంకర వేసి దానిపై తారు వేయకపోవడంతో వాహనదారులకు, రైతులకు తిప్పలు తప్పడం లేదు. కంకర ఉండడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు అదుపు తప్పి పడిపోయి ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ దారి గుండా అధిక సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో దుమ్ము లేచి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
22న విపత్తుల నిర్వహణపై మాక్డ్రిల్
భూపాలపల్లి అర్బన్: ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 22వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాల్లో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్నివేళలా సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని తెలిపారు. గత వర్షాకాలం జిల్లాలో కురిసిన వర్షాలకు సంభవించిన వరదలు వల్ల తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. అప్రమత్తత, ముందస్తు ప్రణాళికలు, విపత్తుల అంచన, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల సమన్వయ చర్యలు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతో నష్టాలు లేకుండా వరదలను ఎదుర్కొన్నామని వివరించారు. మున్ముందు నష్టాలు కలుగకుండా సన్నద్ధంగా ఉంటామన్నారు. ప్రజ లకు విపత్తుల సమయంలో రక్షణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అదనపు ఎస్పీ నరేష్, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, ఫైర్ అధికారి శ్రీనివాస్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఎండోమెంట్ అధికారులు సమష్టిగా పనిచేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం హనుమకొండ కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భక్తుల కోణంలో చర్చించి వారికి అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డార్మెటరీ నిర్మాణానికి గతంలోనే ఆమోదం.. మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) గతంలో ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు జరిగి నిధులు మంజూరు లేకపోవడంతో నిలిచిపోయింది. మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయించాలి. గతంలో ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ, నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐమస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాలని కోరుతున్నారు. భక్తుల డిమాండ్లు ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి. ● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ● మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతుండగా భక్తులకు సరిపోయే విధంగా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. ● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాలు నిర్మించాలి. ● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి. ● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి, ఆర్కియాలజి శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునీకరించాలి. ● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ది పరిచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మల్లన్న భక్తుల్లో ఉంది. ● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందుల కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లెటింగ్ టవర్స్, భద్రతపరంగా మరో 50 సీసీ టీటీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ వాహనాలను ఉంచడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వెంటనే మరోచోటకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు. నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్న కలెక్టర్ అభివృద్ధిపై దృష్టిసారించాలంటున్న భక్తులు -
నేడు శ్రీలక్ష్మినరసింహస్వామి కల్యాణం
భూపాలపల్లి అర్బన్: ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట) ఆధ్వర్యంలో నేడు(శనివారం) జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలోని శ్రీసీతారామాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మినరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉత్సవ విగ్రహాల రథంతో పట్టణంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అధికారులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. మంజూర్నగర్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా కలెక్టర్ రాహుల్శర్మ కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా జిల్లాకు రథం రావడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, ఏఓ మురళీధర్, అధికారులు పాల్గొన్నారు.


