Jayashankar District Latest News
-
విత్తనాలు కొనుగోలు చేయాలి
కాళేశ్వరం: రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాడి బాబురావు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం బొమ్మపూర్ రైతువేదికలో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్తో కలిసి విత్తనాల డీలర్లు, రైతులకు డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు ఎంపిక చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేబుల్ చూసి విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పారు. ఏడీఏ శ్రీపాల్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా ఆ సీడ్ ప్యాకెట్ బిల్లు సీజన్ అయిపోయేంత వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని చెప్పారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని సూచించారు. వరి కొయ్యలను కాల్చకుండా పర్యావరణాన్ని రక్షించాలని చెప్పారు. -
అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నిన్న(గురువారం) జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలు నమోదైందని తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు సూచనల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలన్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను తీసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన భూపాలపల్లి అర్బన్: పాలిసెట్ అడ్మిషన్ల కోసం ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ఈ పరిశీలనకు అధికారులుగా శ్రీధర్, దేవేందర్, శ్రీనివాస్, రాజకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు మల్హర్(కాటారం): కాళేశ్వరం వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడి ఆరుగురికి గాయాలైన ఘటన కాటారం మండలం బస్వాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఆరుగురు కారులో శుక్రవారం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలకు వెళ్లారు. పుష్కర స్నానాలు చేసి దర్శనం అనంతరం హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. కాటారం మండలం బస్వాపూర్ క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓటరు జాబితా సవరణ వేగవంతం భూపాలపల్లి రూరల్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్శర్మ, భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, ఆర్ఐలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ పాల్గొన్నారు. గాలివానతో కూలిన టెంట్లు పలిమెల(కాళేశ్వరం): మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులకోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి. -
రైస్ మిల్లు తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం తనిఖీ చేశారు. మిల్లులో వడ్ల నిల్వ, ప్రాసెసింగ్ విధానం, రోజుకు ఎంత మేర వడ్లు స్వీకరిస్తున్నారనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ వడ్లను పారదర్శకంగా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యాలకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను స్థానిక పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రోజువారీ వడ్ల కొనుగోలు, ఎగుమతులపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సీఐ నరేష్ కుమార్ ఉన్నారు. -
మూడో విడతకు మోక్షమెప్పుడో?
ములుగు: యాసంగి సీజన్ పంటలు చేతికి వచ్చినా పెట్టుబడి సాయం (రైతు భరోసా) పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించలేకపోవడం పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యమైనప్పటికీ రెండు విడతల్లో రెండు ఎకరాల వరకు మాత్రమే అందించడంతో మూడో విడతకు మోక్షమెప్పుడు లభిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత సాయం డబ్బులను మార్చి 23న, రెండో విడత సాయాన్ని ఏప్రిల్ 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నెల రోజులు దాటినా మూడో విడత సాయానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ప్రభుత్వం ప్రకటించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు విడతల్లో అందిన సాయం ఇలా.. ములుగు జిల్లాలో 88,138 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.106,08 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, రెండు విడతల్లో కలిపి 81,096 మంది రైతులకు రూ.66.56 కోట్లను జమ చేసింది. ఇంకా 7,042 మంది రైతులకు రూ.39.52 కోట్లను జమ చేయాల్సి ఉంది. ప్రతీ రైతుకు రెండెకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఐదెకరాల వరకైనా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రైతులు భావించినప్పటికీ రెండెకరాల వరకు మాత్రమే పరిమితం చేయడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఖరీఫ్ పంటలకు.. రైతు భరోసాపై అయోమయం వానాకాలం పంటల సాగును జిల్లాలో రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మరో 10 రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలను సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి పంటకే పెట్టుబడి సాయాన్ని రెండెకరాలకు పరిమితం చేయడంతో వానాకాలం పంట(ఖరీఫ్ సీజన్)కు అందే రైతు భరోసాపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని కటాఫ్ ప్రకటించి ప్రతీ రైతుకు పెట్టుబడి సాయాన్ని సమాయానికి అందించాలని రైతులు కోరుతున్నారు. యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని పెట్టుబడి సాయం రెండు విడతల్లో ఇప్పటి వరకు అందింది రెండు ఎకరాలకే.. మూడో విడత రైతు భరోసాపై ఇప్పటికీ ఖరారు కాని షెడ్యూల్మండలం రైతులు పెట్టుబడి సాయం (రూ.కోట్లలో) ఏటూరునాగారం 6,785 5.43 గోవిందరావుపేట 6,346 5.49 కన్నాయిగూడెం 4,828 3.74 మంగపేట 10,121 9.57 ఎస్ఎస్తాడ్వాయి 7,557 6.85 వెంకటాపురం(కె) 8,014 6.39 వాజేడు 8,624 6.65 మల్లంపల్లి 5,676 4.41 ములుగు 11,952 9.09 వెంకటాపురం(ఎం) 11,193 8.94 -
డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు రవి కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు శుక్రవారం బైటాయించారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసిల్టింగ్ పేరుతో గోదావరి నది గర్భాన్ని ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో నది పర్యావరణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పేరుతో డిసిల్టింగ్ విధానం ప్రవేశపెట్టి ప్రభుత్వం సర్వే చేపట్టిందని వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లేవని కోర్టు నిలుపుదల చేసినా ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ మండలాల్లో అధికారులు సర్వే చేయటం విడ్డూరంగా ఉందన్నారు. డిసిల్టింగ్ విధానాన్ని రద్దు చేయకపోతే పార్టీలు, ప్రజా సంఘాలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, నాయకులు రత్నం రాజేందర్, దావూద్, చిట్టిబాబు, గ్యానం వాసు, కుమ్మరి శ్రీను, చిట్టెం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఏటూరునాగారం: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఏపీఓ కొమురం నాగోరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులు, ఫొటో గ్రాఫర్లు, ప్లెక్సీలు ముద్రించేవారు, బ్యాండ్మేళం, క్యాటరింగ్ నిర్వహకులతో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడితేనే బాలల భవిష్యత్కు భరోసా లభిస్తుందన్నారు. ఏజెన్సీలో వందశాతం బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తద్వారా అందరూ కలిసికట్టుగా ములుగును బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కొమురం నాగోరావు అన్నారు. అనంతరం డీడబ్ల్యూఓ ఈసంపెల్లి ప్రేమలత మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వహకులకు తెలిసి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలోనే వారిని కట్టడి చేసి వయస్సు నిండని అమ్మాయిలకు వివాహం చేస్తే జరిగే నష్టాలపై వివరించాలని సూచించారు. వివాహాలతో సామాజిక, ఆరోగ్య, కుటుంబ పరమైన దుష్ప్రభావాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుందన్నారు. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలని అలా కాకుండా తక్కువ వయస్సు ఉన్నవారికి వివాహం చేస్తే పోక్సో కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. అలాగే రెండేళ్ల జైలుతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని వివరించారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి హాజరైన వారికి అందజేశారు. ఈ కార్మక్రమంలో వెంకటాపురం సీడీపీఓ ముత్తమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఓంకార్, హరికృష్ణ, సర్పంచ్లు, వీసీపీసీ కన్వీనర్లు, టీచర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, సుమన్, జ్యోతి, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగోరావు -
కొనుగోళ్లలో వేగం పెంచాలి
భూపాలపల్లి: అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మక్కల కొనుగోలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. అదే స్ఫూర్తితో ధాన్యం కొనుగోళ్లలో సైతం వేగం పెంచాలని సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కాంటా జరిపిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ కచ్చితంగా చేయాలన్నారు. ఐరిస్ పద్ధతిని తొలగించి ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ట్రక్ షీట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రోజు కచ్చితంగా 8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
మల్హర్(కాటారం): కల్లాలో ఆరబోసిన ప్రతీ ధాన్యం గింజను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని కాటారం మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఇబ్బందులు జరుగుతాయని.. తడిసిన ధానాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన పడొద్దని.. ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
కొనండి మహాప్రభో..
భూపాలపల్లి: కష్టనష్టాలను ఓర్చుకొని ఆరుగాలం పండించిన వరిధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లావ్యాప్తంగా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. హమాలీలు, లారీల కొరత కారణంగా పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను నేటికీ కాంటా వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ముందుచూపు లేమి కారణంగానే.. జిల్లాలోని 12 మండలాల్లో వానాకాలం సీజన్లో వరి, మిర్చి, పత్తి పంటలను సాగు చేయగా అకాల వర్షాల మూలంగా మిర్చి, పత్తి పంటల నుంచి అంతగా దిగుబడి రాలేదు. దీంతో ఈ యాసంగిలో సుమారు 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు దిగుబడి చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజుల తరబడి వేచిచూస్తున్నా కొనే నాఽథుడే కరువయ్యాడు. గతంలో తేమ పేరిట జాప్యం చేయగా ఇప్పుడు హమాలీలు, లారీల కొరతతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదు. వడ్లను విక్రయించేందుకు ఒక్కో రైతు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల అధికారుల ముందు చూపు లేమి కా రణంగానే ఈ పరిస్థితి ఎదురైనట్లుగా తెలుస్తోంది. వర్షం వస్తే ధాన్యం నీటిపాలే.. జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం ఈ నెల 28వ తేదీ వరకు 99,138 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రాగా 61,698 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారుల లెక్కలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గడిచిన రెండు రోజులు ఓ వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే మరోవైపు ఈదురుగాలులు వీస్తూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్షం కురిస్తే కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దవుతాయని, కొనే నాఽథుడే కరువవుతాడని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి భయపడి రైతులు ధాన్యం బస్తాలపై కవర్లు కప్పుకొని వెళ్తుండగా మరికొందరు రైతులు రాత్రి 12 గంటల వరకు కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంటున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పినా.. ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శించవద్దని ఓవైపు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్రాబు, మరోవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొనుగోళ్లలో వేగం పెరగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం జిల్లాలో ఈదురుగాలులు, వర్ష సూచనలు ఆందోళనలో అన్నదాతలు హమాలీ, లారీల కొరత పేరిట జాప్యం -
గాలివాన బీభత్సం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో గురువారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. సింగరేణి ఏరియా వర్క్షాపు, కేటీకే 5వ గని సమీపంతో పాటు పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాలతో పాటు సింగరేణి గనుల నివాస గృహాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ తగిలి ఒక మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇండ్లపై కప్పు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ శాఖ, సింగరేణి, మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్ లైన్లను మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. -
భవన నిర్మాణానికి భూమి పూజ
మల్హర్: వల్లెకుంట గ్రామ సమైక్య భవన నిర్మాణానికి గురువారం రాష్ట్ర ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి భూమి పూజ చేశారు. రూ.10లక్షలతో నిర్మించే భవనాన్ని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మ రజిత, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు. కుమారుడి ఫొటోకు పుష్కర స్నానం భూపాలపల్లి అర్బన్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బేతాళగడ్డ గ్రామానికి చెందిన గంగిశెట్టి పద్మావతి, తన కుమార్తె ఝాన్సీతో కలిసి సరస్వతి ఘాట్కు విచ్చేసి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన తన కుమారుడు గంగిశెట్టి మహేష్ ఫొటోకు పవిత్ర స్నానం ఆచరించారు. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురైన ఆమెను చూసిన భక్తులు సైతం చలించిపోయారు. రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్ రాజు పూజలు వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) శశిధర్ రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం)ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, భద్రు ఉన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు కృషి ఏటూరునాగారం: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీడబ్ల్యూఓ ప్రేమలత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నేడు(శుక్రవారం) ఐటీడీఏలో అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాలకు చెందిన వివాహాలు నిర్వహించే పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్హౌజ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళం నిర్వాహకులకు బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో బక్రీద్ చిట్యాల: బక్రీద్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొరు అలాయి బలాయి తీసుకున్నారు. భూపాలపల్లి, గణపురం మండలాల్లో ప్రార్థనల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. -
ఇంచెంచెర్వుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
పొలాల్లో చెలరేగుతున్న మంటలు కాలిపోయిన వడ్ల కుప్పలువెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలను తగలబెట్టగా గ్రామ పరిసరాల్లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. వ్యవసాయ భూములను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆగే తిరుపతి, రాజు, కామ సదానందం, అశోక్కు చెందిన ఐదెకరాల్లోని వరి పంట పూర్తిగా దగ్ధంకాగా, మూడు బోర్ మోటార్లు, పైపులు, వందల సంఖ్యలో వరిగడ్డి కట్టలు మంటల్లో కాలిపోయాయి.. పంట వ్యర్థాలను కాల్చితే చర్యలు పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్థాలకు నిప్పు పెట్టి జరిగే ప్రమాదాలకు కారణమైన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చల్లా రాజు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయ న విలేకరులతో మాట్లాడారు. పంట వ్యర్ధాలను కా ల్చడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా విద్యుత్ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదెకరాల్లోని వరిపంట దగ్ధం కాలిపోయిన మూడు బోరుమోటార్లు, పైపులు, వరిగడ్డి -
నో డ్రగ్స్–సేవ్ లైఫ్
మత్తు పదార్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జెడ్పీహెచ్ఎస్ గోరంట్ల పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో ఫ్లెక్సీ పట్టుకుని గురువారం అవగాహన కల్పించారు. శ్రీనో డ్రగ్స్–సేవ్ లైఫ్శ్రీ అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ భక్తుల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు సేవించడంతో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏర్పడుతాయని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. – భూపాలపల్లి అర్బన్ -
రైతుల పరిస్థితి ఆగం
భూపాలపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం ఉందని.. రైతుల సమస్య గాలికి వదిలేసి ప్రభుత్వం గాలిలో సంచిరిస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతి కాక, ఎగుమతి అయిన ధాన్యం దిగుమతి కాక రైతులు అరిగోస పడుతుంటే ముఖ్యమంత్రి గాలిలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే అధ్వాన పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రెండు మూడు రోజులో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర రైతుల గోస చూడటానికి వచ్చినట్టు లేదని, బీజేపీ ప్రచారానికి వచ్చినట్టు హంగు ఆర్బాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ గండ్ర హరీశ్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జన్దాన్, కౌన్సిలర్లు, నాయకులు మోతె రాజు, నూనె రాజు, సతీష్ పాల్గొన్నారు. బీజేపీది ప్రచార యాత్ర మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
ఇక రెండో విడత
జూన్ 2న ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ ప్రారంభంశుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026భూపాలపల్లి: సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ఆశపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం త్వరలోనే మరో తీపికబురు అందించనుంది. ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను వచ్చేనెల 2వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. తొలి విడతలో అవకాశం రాని అర్హులకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, మంథని నియోజకవర్గంలోని కాటారం, మల్హర్, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల పరిధిలోని గ్రామాలకు మొత్తం 4,231 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల సొంత స్థలాల్లో పునాదుల దశ నుంచి స్లాబ్ పూర్తయ్యే వరకు మొత్తం నాలుగు విడతల్లో రూ.5లక్షల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసేలా నిబంధనలు విధించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరై చాలాకాలం అవుతున్నా, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 527 మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలామందికి మొదటి, రెండో విడత బిల్లులు రాకపోవడంతో పునాదుల దశలోనే పనులు ఆగిపోయాయి. మరికొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్లు, మేసీ్త్రలకు పనులు అప్పగించినా, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల వారు కూడా నిర్మాణాలను నిలిపివేశారు. దీనికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విస్తీర్ణానికి సర్కారు నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారాయి. పరిమితిని మరింత పెంచి, ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెండవ విడతలోనైనా నిబంధనలను సడలించాలని, బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తిన భూక్రయవిక్రయదారులు కొనసాగుతున్న మొదటి విడత నిర్మాణాలు మంజూరైనవి 4,231 గ్రౌండింగ్ అయినవి 542 ప్రారంభించినవి 539 బేస్మెంట్ స్థాయి 985 స్లాబ్ స్థాయి 466 స్లాబ్ పూర్తయినవి 1,172 నిర్మాణం పూర్తయినవి 527ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి నేడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు, నిబంధనల మేరకు రెండో విడతను సజావుగా నిర్వహిస్తాం. – శ్రీకాంత్, డీఈ, హౌజింగ్ మే నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష -
చివరి గింజ వరకూ కొంటాం..
సాక్షి, పెద్దపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేసి వాహనాలను పూర్తిగా ధాన్యం రవాణాకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, ఎఫ్సీఐ కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైందన్నారు.డిసెంబర్ 2023 తర్వాత కనీస మద్దతు ధర విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ రైతులకు ఇప్పటివరకు అదనంగా రూ.16,479 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాల కారణంగా కేవలం 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, ఆ ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తరుగుతీస్తే కఠిన చర్యలు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే అదనపు గోదాములు అద్దెకు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా రైతుల నుంచి ఒక్క కేజీ ధాన్యం తరుగు తీసినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మిల్లర్లతో రైతులకు పరిహారం ఇప్పిస్తామని హెచ్చరించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లాలో స్టోరేజీ ప్లేస్ తక్కువగా ఉన్నందున, పెద్దపల్లిలో 50వేల మెట్రిక్టన్నుల ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. 65 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం.. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యాసంగి సీజన్లో లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 185 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి పెద్దపల్లిలో 20 వేల మెట్రిక్ టన్నులు, వరంగల్లో 20 వేల మెట్రిక్ టన్నులు, హనుమకొండలో 10 వేల మెట్రిక్ టన్నులు మిల్లింగ్ కోసం పౌరసరఫరాల శాఖ అలాట్మెంట్ చేసిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో హర్వెస్టింగ్ కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా జరుగుతుందని, చాలా మండలాలో ఇంకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి, ధర్మవరం వరకు అటవీ అనుమతులు లేవనే కారణంతో రహదారి పనులను నిలిపి వేశారని వెంటనే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ మండల కార్యదర్శి పెనుమల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వాహనాలు వెళ్లలేని విధంగా రోడ్డు గుంతలమయంగా మారిందని ఆరోపించారు. రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయలేదని వెంటనే అటవీ అనుమతులు వచ్చేలా చేసి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్న విషయం తెలుసున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నాను భగ్నం చేశారు. రోడ్డుపై బైటాయించిన వారిని అక్కడిని నుంచి పక్కకు లాక్కెల్లారు. బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, సాంబమూర్తి, బుల్లేశ్వరరావు, స్వరూప, జానకి రమణ, ఆదినారాయణ, సుమాంజలి, బెనిని, సాంబశివరావు, తిరిపతి రావు, లోహ మూర్తి తదితరులు ఉన్నారు. -
రెండు రోజుల గడువు ఇస్తున్నాం..
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందర్రావు, ఈటల రాజేందర్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కేంద్రాల్లోనే ఉందన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్, మహిపాల్రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే.. బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఈటల రాజేందర్ చెల్పూరు, కాటారంలో పర్యటన -
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి
వెంకటాపురం(కె): మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని ఎంపీడీఓ జుమ్మిలాల్ అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి వారోత్సవాలు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిలో ముందుండాలని అన్నారు. రుణం పొందిన మహిళలు సక్రమంగా చెల్లిస్తే రూ.10లక్షల వరకు రుణాలు పొందవచ్చని తెలిపారు. రుణం పొందిన మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల భీమా సౌకర్యం ఉంటుందని అన్నారు. మహిళా శక్తి సంఘాలకు పెరటి కోళ్ల పెంపకం, గొర్రె పెంపకం రుణాలు అందిసాతమని తెలిపారు. మండలంలో గ్రామాఖ్య భవనాలు 31 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి, ఏపీఓ భవాని, ఏపిఎం అప్పారావు, సీసీ శంకరమ్మ, సర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మీ, సిబ్బంది స్వప్న, సతీష్, గ్రామ సమాఖ్య వీఓఏలు, ప్రజాతినిధులు పాల్గొన్నారు. ఎంపీడీఓ జుమ్మిలాల్ -
ఎండలపై అప్రమత్తం..
కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలుఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్వాజేడు: వేసవిలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రతరం కావడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉపాధి పనులను చేస్తున్న కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆశ కార్యకర్తలు కూలీలు పని చేస్తున్న చోటుకు వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అదే విధంగా ఇంటింటికీ తిరిగితూ ఎండకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను తెలియజేస్తూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఎండలతో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వైద్యశాలకు వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు ఉపాధిహామీ పథకం పనులను చేస్తున్న కూలీలకు సర్పంచ్లు, దాతలు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్లు మజ్జిగ ప్యాకెట్లను వారికి అందిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమయితేనే ఎండ సమయంలో బయటకు వెళ్లాలని తెలుపుతున్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్లు మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు -
ధాన్యంలో కోతలు సరికాదు
చిట్యాల/భూపాలపల్లి రూరల్: రైతుల పండించిన ధాన్యంపై మిల్లు యాజమానులు అక్రమంగా కోతలు విధిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎం కొత్తపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం వారు పరిశీలించి, మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూడాలని, ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లలకు లారీలలో తరలించాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు.వ జిల్లాలో ఇప్పటికే 90శాతం మక్కల కొనుగోలు పూర్తయిందని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ కాంటా అయిన ధాన్యాన్ని రైతులు తమ సొంత వాహనాల్లో మిల్లులకు తరలించుకోవచ్చని రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు అవకతవకలు పాల్పడితే సస్పెండ్ చేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ ఆశోక్కుమార్, డీసీఓ వాల్యానాయక్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఆర్ఐ రాజేందర్, మండల నాయకులు చిలుకల రాయకోంరు, అల్లకోండ కుమార్, గుర్రపు తిరుపతిగౌడ్, బుర్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాంటావేసి త్వరగా మిల్లులకు తరలించాలి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్శర్మ -
బుకింగ్ చేయాల్సిందే..
భూపాలపల్లి రూరల్: సాధారణ యూరియాకు బదులు నానోయూరియాను వాడాలని వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు యూరియా కావాల్సిన రైతులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు యూరియాను కేటాయించాలని ఆ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఖరీఫ్ సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన వ్యవసాయశాఖ అందులో ఎరువులకు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ఖరీ్ఫ్లో 2,16,734 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, మరో 20వేల ఎకరాలు ఉద్యాన పంటలు ఉంటాయని పేర్కొంది. ఈ సాగు విస్తీర్ణానికి సరిపడా యూరియాను కూడా అంచనా వేసింది. అయితే ఖరీఫ్ సీజనులో నెలవారీ కోటాలను కూడా ఖరారు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 5,479 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయి. నెల వారీగా ఎంత మొత్తంలో యూరియా అవసరం ఉంటుందనే అంశాన్ని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా జూలైలో వినియోగం ఎక్కువగా ఉంటుంది. వరి సాగు చేసే రైతులు ఈ సమయంలో యూరియాను ఎక్కువగా వాడుతారు. జూన్లో 4,200 మెట్రిక్ టన్నులు, జూలైలో 5,101 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 5,225 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ 6,135 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని లెక్కగట్టారు. రైతులు యూరియా కొనుగోలు చేయాలంటే మొబైల్ యాప్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. సాగుచేఉసిన పంట విస్తీర్ణం, ఆ విస్తీర్ణానికి సరిపడా నిర్ణీత మొత్తంలో మాత్రమే యూరియా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈ యాప్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే కొందరు రైతుల పేరుతో యూరియా యాప్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు గతంలో వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఈసారి అలా జరగకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంటల సాగుకు సరిపడా యూరియా సరఫరా కాక గత వానాకాలం, యాసంగి లో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వ్యవసాయశాఖ ముందు జాగ్రత్తలు చేపట్టింది. మరోవైపు యూరియా ఎరువుకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాకు ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. నానో యూరియా వాడకంతో వృథాను అరి కట్టవచ్చని రైతులకు వ్యవసాయ శాఖ వివరిస్తోంది. ఈ ఖరీఫ్ నానో యూరియాను వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్కు కావాల్సింది 37 వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి ప్రతిపాదించిన వ్యవసాయశాఖ ప్రస్తుతం జిల్లాలో 5,479 మెట్రిక్ టన్నుల నిల్వలు సెప్టెంబర్లో అత్యధిక డిమాండ్ నానో యూరియాపై నజర్ -
ప్రమాదకరంగా రోడ్డు
మల్హర్: మండలంలోని అన్సాన్పల్లి–భూపాలపల్లి మండలంలోని కాసీంపల్లి శివారులోని అంతర్గత రోడ్డు ప్రమాదకరంగా ఉంది. దీంతో వాహనదారులు భయంభయంగా ప్రయాణం చేస్తూ రోడ్డును దాటితే చాలు అనే పరిస్థితి నెలకొంది. 2023 జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామల మధ్యగల బీటీ ఒక చోటు పూర్తిగా కొట్టుకపోయింది. వరద నీరు ప్రవహించడంతో అలాగే మరి కొన్ని చోట్ల బీటీ కింద ఉన్న మట్టి కొట్టుక పోయి రోడ్డు ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు లేవు.. ఈ రోడ్డు గుండా మండలంలోని అన్సాపల్లి గ్రామస్తులు భూపాలపల్లి జంగేడు, కాసీంపల్లి గ్రామం మీదుగా భూపాలపల్లికి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. రైతులు గ్రామ శివారులోని తమ పొలాలకు వ్యవసాయ పనులకు సైతం వెళ్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదకరంగా మారి రెండు సంవత్సరం గడుస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వర్షకాలం సీజన్లో ఇబ్బందులు మరింత ఎక్కువ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భయాందోళనలో వాహనదారులు పట్టించుకోని అధికారులు -
ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు అవాస్తవం
ఏటూరునాగారం: జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ఆరోపణలు అవాస్తవం అని కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న అన్నారు. ఏటూరునాగారం మండలం రోహిర్ గ్రామపంచాయతీ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, సర్పంచ్లు కావిరి అర్జున్, దేవులపల్లి విజయ్ కుమార్ తదితరులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో, కొంత ప్రాంతాల్లో లారీల కొరత కారణంగా రవాణాలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ ధాన్యం తరలింపునకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ చిన్న సమస్యలను ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సరికాదన్నారు. శంకరాజుపల్లి సర్పంచ్ దేవులపల్లి విజయికుమార్, జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొడగొర్ల పోచయ్య, యూత్ జిల్లా ఉప అధ్యక్షుడు సర్వ అక్షిత్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ దొంగిరి మధుబాబు, గజ్జల అంకుల్, నర్సయ్య, శేఖర్, ఇనుగుల హరీష్, దుర్గయ్య, గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న -
పుణ్యప్రదం.. పుష్కర స్నానం
జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు కొనసాగుతున్నాయి. ఏడో రోజు బుధవారం సుమారు 25 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్కు చెందిన శ్రీదత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి, తెలుగు రాష్ట్రాల మహామండలేశ్వర్ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహరాజ్, మహామండలేశ్వర్ ఈట సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ త్రివేణి సంగమం వద్ద వైభవంగా గంగా హారతి నిర్వహించారు. సాయంత్రం దేవాదాయ శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – కాళేశ్వరంపుష్కరఘాట్లో స్నానాలు చేస్తున్న భక్తులు -
యూనిఫామ్ ఊసేది?
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్ వైజ్గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్ బండిల్స్ రాగానే ఆయా పాఠశాలల హెచ్ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్ యూనిఫామ్కు క్లాత్ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్ కూడా చేరుకోలేదు. ఈసారి టెస్కోకు ఇచ్చారా? లేదా? రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటివరకు క్లాత్ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్ యూనిఫామ్ అందించడం సాధ్యం కాకపోవచ్చని పలువురు హెచ్ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్ యూనిఫామ్ అందించాల్సి ఉంటుంది. 24 వస్తువుల కిట్ ఎవరికి? మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్ పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా? ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులుజిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యజిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69ప్రాథమికోన్నత పాఠశాలలు 44ప్రాథమిక పాఠశాలలు 319విద్యార్థుల సంఖ్య 24వేలు -
పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి
ములుగు రూరల్: ఉపాధిహామి పని ప్రదేశాలలో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ నాయకుడు పోరిక గోవింద్నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని జాకారంలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను సర్పంచ్ దాసరి సమత–రమేష్తో కలిసి మాట్లాడారు. ఉపాధి హామి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంవిఫలమయిందని అన్నారు. నీడ, మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందుబాటులో లేవని అన్నారు. ఉపాధిహామి కూలీలలకు సకాలంలో డబ్బులను చెల్లించాలని అన్నారు. కూలీలకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు గోవింద్నాయక్ -
చిలుక జోస్యం...
పలిమెల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది అంత్యపుస్కారల్లో బస్టాండ్ సమీపంలో పలువురు చిలుక జోష్యం చెబుతూ ఉపాధి పొందుతున్నారు. భక్తులు చిలుక జోష్యం చెప్పించుకుంటూ వారి జాతకాలు అడిగి తెలుసుకుంటున్నారు.కాళేశ్వరం: అంత్య పుష్కరాల్లో దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు, సిబ్బంది అంతా వాకీటాకీతో కమ్యూనికేషన్ చేస్తున్నారు. కాళేశ్వరం దేవస్థానంలో సెల్ టవర్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయకపోవడంతో త్వరగా స్పందించడానికి ఎనిమిది వరకు వాకీటాకీలకు వినియోగిస్తున్నారు. కమిషనర్ స్థాయి నుంచి అర్చకుని వరకు వినియోగిస్తున్నారు.కూలుతున్న టెంట్లు పలిమెల (కాళేశ్వరం ): కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుస్కారాల కోసం ప్రధాన ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఓ టెంటు గాలికి ఒక వైపు ఊడిపోయి ప్రమాదకరంగా మారింది. కాగా టెంటు నిర్వాహకులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. పెరిగిన గిరాకీ మహాముత్తారం: సరస్వతి పుష్కరఘాట్వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు బుధవారం ఎక్కువసంఖ్యలో రావడంతో గోదావరి నదివద్దసందండి నెలకొంది. గోదావరివద్ద ఏర్పాటు చేసిన వివిద దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో దుకాణదారులకు గిరాకీ పెరగడంతో సంతోషం వ్యక్తంచేశారు.మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కరాల్లో భాగంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చిన వాహనాలు నిలుపుట కోసం అధికారులు పలు ప్రాంతాల్లో వాహనపార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీ పార్కింగ్ స్థలంతోపాటు సరస్వతీ ఘాటువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండాయి. దీంతో పోలీసులు వచ్చి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ నియంత్రించారు. -
సన్మానం
కాళేశ్వరం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకా జానం పల్లె గ్రామానికి చెందిన గండ్రకోట సంపత్ 14 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం మహదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామానికి తన అత్తమామలను కలవడానికి వచ్చిన సందర్భంగా రాపల్లి కోట యాదవ సంఘం బాధ్యులు సంపత్–స్రవంతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడు పంచక మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు కాటమెన రాజయ్య, సర్పంచ్ కల్లా గట్టయ్య, సంఘం నాయకులు, బంధుమిత్రులు గ్రామస్తులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను స్మరించుకుంటూ ఈ నెల 31న 26వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సామ మోహన్రెడ్డి, రైతు కూలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బల సాంబయ్యలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సీపీఐఎంఎల్, ప్రజా ప్రతిఘటన పార్టీ ఆధ్వర్యంలో కమాండర్లు సమ్మన్న, శనిగరపు రంజిత్ల వర్ధంతి సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 31న భూపాలపల్లిలో నిర్వహించనున్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాండూరి కుమారస్వామి, ఐఎఫ్టీయూ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ పావురాల భిక్షపతి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వాజేడు: ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయాలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దెకు ఇవ్వడంకోసం నాలుగు గదులను నిర్మించినట్లు తెలిపారు. 29లోగా టెండర్ షెడ్యూల్ తీసుకొని 30లోగా సాయంత్రం 5 గంటలలోగా టెండర్ సమర్పించాలని తెలిపారు. 31 తారీకున డ్రా తీసి గదులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. టెండర్ ఫారం రూ.2000, దరఖాస్తు సొమ్ము రూ.5000 డీడీ తియ్యాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వెంకటాపురం(కె): మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, చిట్టెం సాయి, బాలసాని వేణు, తదితరులు ఉన్నారు. చిట్యాల: మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలకు మాజీ సర్పంచ్ పోలవేన పోశాలు, మాజీ ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మీ సంజీవయ్య బుధవారం మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
పంట వ్యర్థాలను తగులబెట్టొద్దు
రేగొండ: వానకాలం సీజన్ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని మండల వ్యవసాయాధికారి వాసుదేవరెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో విలేకరుల సమావేశంంలో ఆయన మాట్లాడుతూ.. పంట అవశేషాలను తగలబెట్టడం వలన గాలి కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. వేసవి కాలంలో మంటలు వేగంగా వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం ఉందని హెచ్చరించారు. పంట వ్యర్థాలను తగలబెడితే రూ.2500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. మహాముత్తారం: రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని మండల వ్యవసాయ అధికారి అనుష అన్నారు. మంగళవారం మండలంలోని వజినేపల్లి గ్రామంలో రైతులు కాల్చిన వరిపొలాలను పరిశీలించారు. అనంతరం ఏఓ మాట్లాడుతూ.. పంట కొతల అనంతరం అవశేషాలైనటువంటి వరికొయ్యలు పత్తికట్టె, మిరపకట్టె వంటి వాటిని కాల్చవద్దని రైతులకు సూచించారు. వాటికి కాల్చడం ద్వారా భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోయి భూసారం దెబ్బతింటుందన్నారు. -
గాలివాన బీభత్సం
● తడిసిన ధాన్యం ● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు చిట్యాల/రేగొండ/టేకుమట్ల: జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాల్లో వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఓ రైతుకు చెందిన వరిధాన్యం తడిసిపోయింది. చిట్యాల మండల కేంద్రంతో పాటు గుంటూరుపల్లి, నైన్పాక, తిరుమాలాపూర్ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు చెట్లు రోడ్లపై కూలిపోయాయి. హైస్కూల్లో ప్రహరీపై భారీ వృక్షం కూలింది. పోలీస్స్టేషన్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలి పోయి భవనాలపై పడ్డాయి. ఏఆర్పల్లిలో కుమారస్వామికి చెందిన ఇల్లు వెనుకభాగం కూలిపోయింది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గుండా స్వామి ఇంటి రేకులు గాలికి లేచిపోయాయి. చిట్యాల సివిల్ ఆస్పత్రి నేమ్ బోర్డు పడిపోయింది. రేగొండ మండలం లింగాల గ్రామంలో రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొడవటంచలోని కోడెపాక రాజయ్య ఇంటి ముందు చెట్టు విరిగిపడింది. గూడెపల్లి గ్రామానికి చెందిన గుండె నారాయణ, గుండె రవి ఇంటిపై చెట్టు విరిగి పడడంతో రేకులతో పాటు గోడలు ధ్వంసమయ్యాయి. టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన బిల్లకంటి కోటేశ్వర్రావు ఇంటిరేకులు ఎగిరి పడ్డాయి. చిట్యాల: పాఠశాలలో కూలిపోయిన భారీ వృక్షంరేగొండ: ధ్వంసమైన రేకుల ఇల్లుచిట్యాల: మార్కెట్లో తడిసిన ధాన్యంటేకుమట్ల: కిందపడ్డ ఇంటిపైకప్పు -
పొక్లెయినర్ను అడ్డుకున్న ఉపాధి కూలీలు
భూపాలపల్లి రూరల్: మండలంలోని వజినపల్లి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలించేందుకు వచ్చిన పొక్లెయినర్ను ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. గ్రామంలోని స్థానిక చెరువులో కొంతకాలంగా జేసీబీతో గుంతలు తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. ఉపాధి కూలీలు ఏకమై మంగళవారం జేసీబీ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా జేసీబీ యజమాని కూలీలతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయమై కూలీ లు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి మట్టి తీయడానికి అనుమతులు లేవని తెలపడంతో జేసీబీ వెనుదిరిగిపోయినట్లు కూలీలు తెలిపారు. వరికొయ్యలను కాల్చొద్దు భూపాలపల్లి రూరల్: జిల్లాలోని రైతులు ఎవరు కూడా వరి కొయ్యలతో పాటు వివిధ పంటల వ్యర్ధాలను కాల్చవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొయ్యలను కాల్చడం వల్ల భారీ పరిమాణంలో విషపూరిత వాయువులైన కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్ సల్ఫర్ ఆకై ్సడ్లు గాలిలో కలిసిపోయి దట్టమైన పొగమంచును ఏర్పరుస్తాయన్నారు. నేలను సారవంతంగా ఉంచే వానపాములు, మేలుచేసే బ్యాక్టీరియా మిత్ర పురుగులు, సూక్ష్మజీవులను, శిలీంధ్రాలను నాశనం చేస్తుందని వివరించారు. పంట పొలాలను కాల్చొద్దు కాళేశ్వరం: పంట అవశేషాలను, పొలాలను కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు. మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరంలో జరిగిన పంట పొలాల అగ్ని ప్రమాద ఘటనలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నరేష్ కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దేవాదుల ఎత్తిపోతల వద్ద సిల్ట్ తొలగింపు కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం సమీపంలో గల గోదావరిపై ఉన్న దేవా దుల ఎత్తిపోతల వద్ద సిల్ట్ తొలగించే పనులు అధికారులు మంగళవారం మొదలుపెట్టారు. ప్రతీ సంవత్సరం మే నెల చివరి వారంలో ప్రారంభించి పోర్బే గదులతో పాటు, కాల్వలో ఉన్న సిల్ట్ను తొలగించి శుభ్రం చేస్తారు. దీంతో నీరు కాల్వ ద్వారా పోర్బే నుంచి నీరు మోటర్ల వద్దకు చేరుతుంది. ఇలా చేరడంతో పంపింగ్ చేయడానికి సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పిడుగుపాటుకు రైతు మృతి రేగొండ: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన రేగొండ మండలం లింగాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పారపు రాజు (34) పొలంలో ఉన్న పశువులను తీసుకురావడానికి వెళ్తుండగా సా యంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో పొలంలో ఉన్న రాజు పై పిడుగు పడి చనిపోయాడు. రాజుకు భార్య పావని, కూతురు, కుమారుడు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, తోటి రైతులు కోరుతున్నారు. తాటిచెట్టుపై పిడుగు మొగుళ్లపల్లి:వేములపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టు పై పిడుగుపడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రాణదాతలు పైలట్లుములుగు రూరల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే ప్రాణదాతలు అంబులెన్స్ పైలట్లని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ పైలెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ధాన్యం కొనేవరకూ పోరాటం
ఆత్మకూరు: చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని బీజేపీ ప్రజాప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలు పరిష్కరిస్తామని, కుల్కచర్ల నుంచి నీరుకుళ్ల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల రాజేందర్, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేశారని, ధాన్యం కొనుగోళ్లను కూడా ఎత్తేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రోజులుగా వడ్ల కుప్పల మీదే నిద్రిస్తున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి బుకాయించుడు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అప్పుల కుప్పలు, ఆత్మహత్యలు మిగిలాయని, కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, పరకాల ఇన్చార్జ్ కాళీప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్రెడ్డి, రావు పద్మ, డాక్టర్ విజయ్చందర్రెడ్డి, దశమంతరెడ్డి పాల్గొన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు రఘునందన్రావు, ఈటల -
బాల్యవివాహాలను అరికట్టాలి
మల్హర్: బాల్య వివాహాల అరికట్టాలని సఖీ కేంద్రం కేస్ వర్కర్ సరిత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలికల జీవితాలను అర్ధాంతరంగా నిలిపివేసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. చిన్న వయస్సులో వివాహం జరగడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడంతో పాటు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ అనే పోస్టర్లు ఆవిష్కరించి ఆ నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 1098 (చైల్డ్ హెల్ప్లైన్), 181 (మహిళా హెల్ప్లైన్), 14567 వంటి అత్యవసర సేవా నంబర్ల గురించి వివరించారు. అనంతరం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జయప్రద, అరుణ,లక్ష్మీ, బాలమ్మ, బాలికలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మహాముత్తారం: ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళవారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో అంగన్వాడీ సూపర్వైజర్ నిహరిక ఆధ్వర్యంలో బాల్యవివాహం బతుకు ఆగం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహల వల్ల బాలికల విద్యా,ఆరోగ్యం భవిష్యత్పై కలిగే ప్రతికూల ప్రభావల గురించి సర్పంచ్ కొండగోర్ల బాపు వివరించారు. నాగరాణి, సఖీసెంటర్ అడ్మిన్ గాయిత్రి, ఏఏఐ కుమారస్వామి, డీహెచ్ఈబ్ల్యూ అకౌంటెంట్ సురేష్, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టేకుమట్ల: బాల్య వివాహాల నిర్మూలకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై అమూల్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో బాల్య వివాహం–బతుకు ఆగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల భవిష్యత్లో శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. చైల్డ్ లైన్ ప్రతినిధి కళావతి, సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, సూపర్వైజర్ సరోజన, డీసీపీయూ సోషల్ వర్కర్ కుమార్ పాల్గొన్నారు. మొగుళ్లపల్లి: మండలంలోని పిడిసిల్ల గ్రామంలో బాల్య వివాహం–బతుకు ఆగం అనే కార్యక్రమంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో సర్పంచ్ నైనాకంటి మమత సమక్షంలో కిశోర బాలికలకు, మహిళలకు గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహల నిర్మూళనకు సంబంధిచిన పోస్టర్ ఆవిష్కరించారు. అంగన్వాడీ టీచర్ శ్యామల చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి చరణ్, సఖి కౌన్సిలర్ మాధవి, మమతతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కులను పరిరక్షించాలి
భూపాలపల్లి రూరల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్నేహ బాలల హక్కుల సదస్సు, మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. డీఆర్డీఓ బాలకృష్ణ, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం చిట్యాల: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, సర్పంచ్ మటిక సుజాత రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పంచాయతీ కార్యదర్శి సునంద పాల్గొన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యం మొగుళ్లపల్లి: మహిళాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అ న్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో నూ తనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్కు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలేనని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మల్లీశ్వరి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మీడియాపాయింట్ వద్దనే ఉద్యోగుల తిష్ట!
కాళేశ్వరం: కాళేశ్వరంలో జరిగే అంత్య పుష్కరాలకు వచ్చిన వివిధ శాఖలకు చెందిన కొంత మంది ఉద్యోగులు ఈఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మిడియా పాయింట్లోనే తిష్టవేసి సాయంత్రం వ రకు సేదదీరుతున్నారు. మీడియాపాయింట్లో రెండు ఏసీలు విశాలమైనగది ఉండడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఉద్యోగులు తిష్ట వేసి వారి విధులు మరిచిపోయి అక్కడే సాయంత్రం వరకు ఉండడం గమనార్హం. వారిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవానికి విద్యుత్ వైరు సరిచేస్తుండగా అక్కడే పని చేస్తున్న బాపు అనే కూలీకి విద్యుత్షాక్ తగలడంతో మంగళవారం కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మరో కూలీ కర్రతో కొట్టడంతో ప్రమాదం తప్పింది. కొంత సేపు తరువాత బాపు స్పృహా నుంచి తేరుకున్నాడు. క్షేమంగా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేస్తున్న క్రమంలో మహదేవపూర్ మండలంలోని అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య సూచించారు. గత 13 సంవత్సరాల నుంచి పింఛన్ రాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మనోవేదనకు గురయ్యారని, ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రకటించడంతో వీరికి భరోసా, మనోధైర్యాన్ని కల్పించినట్లు అయిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బెల్లి లలితకు నివాళి మల్హర్: మండలంలోని కొయ్యూరులో సోమవారం బెల్లి లలిత వర్ధంతిని ప్రజా సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట మాటతో సబ్బండ వర్గాలను, కులాలను, చైతన్యం చేస్తూ తెలంగాణ పల్లెల్లో ఉద్యమ జ్వాలను రగిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేవి భూమయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగామ జనార్ధన్. కుల ప్రజా సంఘాల జిల్లా కో కన్వీనర్ అయితే బాపు, మండల కో కన్వీనర్ గడ్డం లచ్చన్న, బోయిని రాజన్న, యాదండ్ల గట్టయ్య, వేల్పుల నారాయణ, యాట్ల శంకర్, సదానందం, తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత రేగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమాని జైపాల్రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
టిఫిన్స్.. కొనలేం తినలేం!
భూపాలపల్లి అర్బన్: అసలే ఉరుకులు పరుగుల జీవితం. ఒక్కోసారి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) కాకపోతే చిరు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు వెళ్లి తింటుంటారు. మొన్నటి వరకు ప్లేట్ పూరీ, ఇడ్లీ, వడ, దోశకు రూ.30 నుంచి రూ.40వరకు ఉండగా.. వాటి ధరలు అమాంతం పెంచారు. ఏకంగా రూ.50 నుంచి రూ.70వరకు పెంచడంతో సామాన్యులు తినలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సక్రమంగా రాకపోవడం.. ఇటీవల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచడంతో చిరువ్యాపారులకు గుదిబండగా మారింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్దపెద్ద బిర్యానీ సెంటర్లు కూడా కట్టెల పొయ్యినే వినియోగిస్తున్నారు. అటు టిఫిన్స్. ఇటు మీల్స్ సెక్షన్లో ఒకేసారి రేట్లు పెంచారు. ఇది సామాన్య, మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లకు గుదిబండగా మారింది. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, గప్చుప్ బండ్లు, చిన్నచిన్న హోటళ్లు, బిర్యానీ సెంటర్లు కమర్షియల్ సిలిండర్ల పైనే ఆధారపడుతుంటారు. సాయంత్రం, మధ్యాహ్నం వేళ రోడ్లపై టిఫిన్స్ విక్రయిస్తుంటారు. ఇది సామన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిలిండర్ల ధర పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్స్ ధర పెంచారు. ఒక హోటల్కు నెలకు 4–5 వాణిజ్య సిలిండర్లు అవసరం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సిలిండర్ల ధర పెంచడంతో రూ.5వేల నుంచి రూ.6వేల భారం పడుతోందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు ఇంటి అద్దెలు, సిబ్బంది వేతనాలు, నిత్యావసర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం సరిగా సాగడం లేదని, జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చిన్న హోటల్కు వెళ్లి పూరీ, దోశగాని తింటే రూ.30నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కు పెరిగింది. ఈ ధర దాదాపు అన్నంతో కూడిన భోజనం వస్తుంది. అలా ఒక్కసారిగా రేట్లు పెంచడంతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. సామాన్య కుటుంబాలకు ఇది భారంగా మారింది. హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిని వాడటంతో ఖర్చు అధికంగా అవుతుందని, దీంతో విధిలేని పరిస్థితుల్లో రేట్లు పెంచామని చెబుతున్నప్పటికీ అంతిమభారం కష్టమర్లపైనే పడుతోంది. సామాన్యులు తినలేని పరిస్థితి భారీగా పెరిగిన సిలిండర్ రేట్ హోటల్ యజమానులపైనా ఆర్థిక భారంఇడ్లీ రూ.50 వడ రూ.50 మసాల దోశ రూ.70 రవ్వ దోశ రూ.80 పూరీ రూ.60జిల్లాకేంద్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అప్పటివరకు ఇంట్లో టిఫిన్ చేయకపోవడంతో అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఓ హోటల్కు వెళ్లి దోశ ఆర్డర్ ఇచ్చాడు. దానికి హోటల్ నిర్వాహకుడు రూ.70 బిల్లు వేశాడు. దీంతో అవాక్కయిన సదరు ఉపాధ్యాయుడు.. ఒక్క దోశకే ఇంతనా..? అని ప్రశ్నించగా.. ధరలు పెరిగాయని, సిలిండర్ల కొరత ఉందని, అందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకుడు జవాబిచ్చాడు. -
రోడ్డు నిర్మాణం పూర్తయ్యేనా?
టేకుమట్ల: శిథిలమైన వెల్లంపల్లి–ఎంపేడు ప్రధాన రోడ్డుతో ఎంపేడు, వెల్లంపల్లి రైతులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో గత సంవత్సరం రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రూ.3కోట్ల నిధులను కే టాయించారు. వెల్లంపల్లి, ఎంపేడు రైతులు ఇక నుంచి రవాణా కష్టాలు తప్పినట్టేనని ఆనందం వ్య క్తం చేశారు. శంకుస్థాపన చేసిన సుమారు ఆరు నెల ల అనంతరం కాంట్రాక్టర్ మొరంతో చదును చేసి కంకర పోశాడు. అనంతరం రోలర్తో చదును చేసి పత్తాలేకుండా పోయాడు. పనులు ప్రారంభమైన కొంత సమయానికి మళ్లీ నిలిచిపోవడంతో రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకరతో కష్టాలు.. వెల్లంపల్లి–ఎంపేడు, కుందనపల్లి గ్రామాల రైతుల పొలాలు ఎక్కువగా ఈ రోడ్డు వెంటే వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు పొడవునా కాంట్రాక్టర్ కంకరపోసి వదిలేయడంతో కాడెడ్లు, రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండంతో ఇప్పట్లో బీటీ రోడ్డు నిర్మాణం లేనట్లేనా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి బీటీ రోడ్డు నిర్మానానికి కృషి చేయాని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నిలిచిన ఎంపేడు–వెల్లంపల్లి రోడ్డు నిర్మాణం కంకర పోసి వదిలేసిన కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
ఇద్దరిపై కేసు నమోదు
రేగొండ: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఫిర్యాదుదారు, అతడి మిత్రులపై వాట్సాప్ గ్రూపులో గుర్రాల సుమన్ రెడ్డి అనే వ్యక్తి అసత్య ప్రచారాన్ని పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి విచారించగా కొలెపాక భిక్షపతి సూచన మేరకు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపాడు. సోషల్ మీడియాలో శాంతిభద్రతాలకు విఘాతం కలిగించే విధంగా పోస్ట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. సన్మానం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్ణణ కేంద్రంలోని ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్గా నూతనంగా ఎన్నికై న నాగపూరి సమ్మయ్యను మంగళవారం పట్టణ కేంద్రంలో ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉప అధ్యక్షులు బేతిల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. పరామర్శ చిట్యాల: మండల కేంద్రానికి చెందిన గంగాధరి రాజు కొంత కాలంగా కేన్సర్తో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి రాజును పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ భూపాలపల్లి రూరల్: మండలంలోని గుర్రంపేట గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్ కోడూరి రమేశ్ మంగళవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, ఉప సర్పంచ్ దామెరుప్పల సుధాకర్, వార్డ్ మెంబర్ దామెరుప్పల సుమలత, ఇతర వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కాటారంలో.. మల్హర్(కాటారం): కాటారం మండలంలోని గుండ్రాత్ పల్లి 8వ వార్డు సభ్యుడు జనగాం రవీనా సురేష్ కుమారుడు నిహాన్స్ జన్మదినం పురస్కరించుకొని గుండ్రాత్ పల్లి, గంగాపురి, మల్లారం గ్రామాల్లో పని చేస్తున్న ఉపాధికూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ సెలవోజు తిరుపతి, మాజీ సర్పంచ్ ప్రవళిక ప్రభాకర్, శంకరయ్య, మల్లన్న తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సంత వెలవెల వెంకటాపురం(కె): రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా మండల కేంద్రంలో వారాంతపు సంత వెలవెలపోయింది. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో ప్రతీ వారం సంత నిర్వహణకు అధిక సంఖ్యలో జనం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వచ్చేవారు. నేటి వారాంతపు సంతకు వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు లేక వ్యాపారాలు జరగలేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. మండలకేంద్రంలో 46 డిగ్రీల ఎండ నమోదు కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. -
బాల్య వివాహాలు చట్టవిరుద్ధం
కాళేశ్వరం: బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని ఏఎస్పీ నరేష్కుమార్ అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం కాళేశ్వరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్కుమార్ మాట్లాడుతూ బాలికలకు విద్య, ఆరోగ్య, సురక్షితమైన భవిష్యత్ను కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. చట్ట ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం జరగాలని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించేలా రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్ఐ తమాషా రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్, భరోసా ఎస్ఐ స్వప్న కుమారి, సీడీపీఓ, అంగన్న్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఏఎస్పీ నరేష్కుమార్ -
కాళేశ్వర దేవస్థానం చైర్మన్ను తొలగించాలి
మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కర పుణ్యస్నానానికి వచ్చిన భక్తులు గోదావరిలో పూజలు నిర్వహించారు. కొంతమంది మహిళలకు గోదావరిలో స్నానమాచరించిన అనంతరం దేవుడి పూనకాలు వచ్చాయి. దీంతో స్నానానికి వచ్చన మరికొంతమంది మహిళలు తమ ఆరోగ్యంతోపాటు కుటుంబసమస్యలు సంతానంకోసం దేవతలను సంతు అడుగుతు దేవతలను ప్రసన్నం చేసుకున్నారు.కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మను వెంటనే పదవి నుంచి తొలగించి, మహిళా వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం కాళేశ్వరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చిన మహిళా భక్తులను చైర్మన్ అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల్లో దేవస్థానం ఈఓ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్, లింగమల్ల సదవాలిరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి మల్హర్(కాటారం): మహిళా లోకం అసహ్యించుకునే విధంగా కాలేశ్వరం ఆలయ చైర్మన్ మోహన్శర్మ ప్రవర్తన ఉందని ఆయన వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని కాటారం డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ స్పందించి, మహిళలపై దురుసుగా ప్రవర్తించిన చైర్మన్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ -
జేఎల్ఎంలకు పదోన్నతి కలేనా..?
హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. జూనియర్ లైన్మెన్ల చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్కోలో కల్పించకుండా జూనియర్ లైన్మన్లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అన్నీ ఖాళీలే.. టీజీ ట్రాన్స్కోలో జేఎల్ఎం పోస్టులు 1119 ఉన్నా యి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదో న్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు. వయస్సు మీరుతున్నా.. జూనియర్ లైన్మన్ పోస్టులు నియమించే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్మెంట్ సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలాది జేఎల్ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలామంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీరుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్ఆర్డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్మన్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎల్ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా జేఎల్ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్రాన్స్కో యాజమాన్యం తీరుపై విమర్శలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా కనికరం చూపని మేనేజ్మెంట్ -
రూ.5.60 కోట్లతో జియో ట్యూబ్స్
ఏటూరునాగారం: మండల పరిధిలోని రామన్నగూడెంలోని పుష్కరఘాట్కు అనుకొని 800 మీటర్ల మేర కరకట్ట మట్టి గోదావరి వరదలతో ఒర్లిపోయింది. రివిట్మెంట్కు వేసిన రాళ్లు సైతం కొట్టుకుపోయి గోదావరిలో కలిశాయి. గోదావరి కరకట్ట ఆనుకొని ఉన్న ఒడ్డు మొత్తం ఒర్లిపోతుండడంతో కరకట్ట ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మంజూరైన జియో ట్యూబ్స్ పనులు పుష్కరఘాట్ నుంచి 800 మీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురైన ప్రాంతం ఉంది. ముందుగా ప్రమాద స్థాయిలో కోతకు గురై ఉన్న ప్రాంతంలో 150 మీటర్ల మేర తొలి దశగా జియోట్యూబ్స్ పనులను రూ. 65 లక్షలతో చేపట్టారు. ఇప్పటి వరకు 125 మీటర్ల వరకు పూర్తి అయ్యింది. ఇంకా 25 మీటర్ల కోసం ఇసుక ఫిల్లింగ్ పనులు చేపడుతున్నారు. అదే విధంగా మళ్లీ ఇక్కడి నుంచి 650 మీటర్ల దూరంలో ఉన్న పుష్కరఘాట్ వరకు కూడా ఈ జియో ట్యూబ్స్ను వేస్తూ కరకట్టను మరింత పటిష్టపర్చాలని ఇరిగేషన్శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భారీ నీటి పారుదలశాఖ అధికారులు నుంచి 650 మీటర్ల పుష్కరఘాట్ వరకు ఉన్న కరకట్ట ఒర్లిపోకుండా జియోట్యూబ్స్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.5.60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఇంజనీరింగ్ చీఫ్కు పంపించారు. పుష్కరాల కోసం.. వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో కరకట్టను పటిష్టపర్చనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పలు దఫాల వరదలకు కరకట్ట మట్టి కొట్టుకపోవడంతోపాటు ఘాట్లోని మెట్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ ఏడాది వచ్చే గోదావరి వరదకు కరకట్ట మట్టి, మెట్లు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇక్కడ కూడా ట్యూబ్స్ను అమర్చాలని డిసెంబర్లో సర్వే చేపట్టారు. పనులపై వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో గోదావరిలో ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసి ఇసుక ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. ఇసుకను నింపిన తర్వాత టెక్స్టైల్ క్లాత్ వేసి ఆ తర్వాత జియోట్యూబ్స్ను వాటిపై అమర్చి అందులో ఇసుక, నీటిని నింపి ఎటు కదలకుండా కరకట్టకు రక్షణ ఇచ్చే విధంగా అమర్చనున్నారు. గోదావరి ఇప్పటి వరకు పూర్తి అయిన 125 మీటర్లు, ఇప్పుడు పనులు జరుగుతున్న 25 మీటర్లతో పాటు 650 మీటర్లు అదనంగా జియోట్యూబ్స్కు నిధులు మంజూరు అయితే అస్సాంకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా ఈ పనులను పూర్తి చేయించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పుష్కరఘాట్ను ఆనుకుని 850 మీటర్లు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు వచ్చే ఏడాది పుష్కరాల కోసం ముందస్తుగా చర్యలు భారీ నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో పనులు -
ఎండతీవ్రతకు 400 గబ్బిలాలు మృతి!
కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ గ్రామంలో చింత చెట్లపై ఏళ్లుగా నివాసం ఏర్పచుకున్న గబ్బిలాలు వారం రోజులుగా వీస్తున్న వడగాలులతో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. కోర్టు ప్రాంగణం, అటవీశాఖ విశ్రాంతి భవనం వెనుక ఉన్న చింతచెట్లపై గబ్బిలాల మరణమృదంగం మోగింది.గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లోని సరిహద్దులో 46 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని ప్రదేశం, నీరు లభించక సుమారుగా 400పైగా గబ్బిలాలు మృతిచెంది నేలపై పడ్డాయి. మరికొన్ని గబ్బిలాలు చెట్టుపైనే మృతి చెంది వేళాడుతూ దర్శనమిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చూసేవారంతా అయ్యోపాపం అంటున్నారు. -
ఆటోలకు భలే గిరాకీ.. ఉపాధి పొందుతున్న డ్రైవర్లు
టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వస్తున్న భక్తులతో ఆటోలకు భలే గిరాకీ లభిస్తుంది. బస్టాండ్ నుంచి సరస్వతీ పుష్కరఘాట్ వరకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.20–25 చార్జీలు తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకంతో ఆటోలకు గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న డ్రైవర్లకు అంత్య పుష్కరాలు ఆసరగా నిలిచాయి. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు కొనసాగే పుష్కరాల్లో ఆటోడ్రైవర్లు ఆనందంగా ఉంటున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్కు వస్తున్న భక్తులతో ఆటోలను నడుపుకుంటూ డ బ్బులు సంపాదించుకుంటున్నాం. ఇన్ని రోజులు గిరాకీలు లేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బస్టాండ్ నుంచి సరస్వతీ ఘా ట్కు ఆటోలు నడపుతూ బిజీ బి జీగా ఉన్నాం. – రాజు ఆటో డ్రైవర్, కాళేశ్వరం -
చెట్టును ఢీకొన్న కారు
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు మల్హర్(కాటారం): ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం నుంచి ధర్మసాగర్ వైపు కారు వెళ్తుంది. ఈ క్రమంలో గుమ్మళ్లపల్లి శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది, ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్(22) మృతిచెందగా.. శశివరణ్, రాజుకుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని వృద్ధుడు.. గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొక్కల ఐలయ్య (75) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన బొక్కల ఐలయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం తెల్లవారుజామున కాలినడకన జాతీయ రహదారిపైకి వెళ్లాడు. పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఐలయ్యను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. మేడారం దర్శనానికి వెళ్లి వస్తూ.. ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వెళొస్తూ కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో కారులోని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. నార్లాపూర్ ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాలకు గ్రామానికి చెందిన మచ్చిక సాయికుమార్ ఈ నెల 24న సమ్మక్క– సారలమ్మల దర్శనానికి మేడారానికి వచ్చారు. మొక్కుల అనంతరం తిరుగు ప్రయాణంలో మేడారం– తాడ్వాయి మార్గ మధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో మచ్చిక సాయికుమార్(25)కు తీవ్ర గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పరిస్ధితి విషమించి మృతి చెందాడు. -
పుష్కరాల్లో ఫైరింజన్లు, గ్రామాల్లో మంటలు
టేకుమట్ల(కాళేశ్వరం): పుష్కరాలలో విపత్తులు సంభవించినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెె త్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆల యం వద్ద, ప్రధాన ఘాట్, సరస్వతీ ఘాట్ వద్ద ఫైరింజన్లను ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలోని ప్రతీ మండలంలో రోజుకో అగ్ని ప్రమాదం సంభవిస్తుండడంతో ఆ యా మండలాల ప్ర జలు ఫైరింజన్కు కా ల్ చేస్తే కాళేశ్వరంలో ఉన్నామంటున్నారు. ఇప్పటి వరకు టేకుమట్ల, చి ట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి, గణపురం, భూ పాలపల్లి మండలాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో రై తులు లక్షల్లో నష్టపోయారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించక పోవడంతో ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఉంది. -
‘తీగలవాగు’కు మోక్షం కలిగేనా?
మల్హర్: చిన్ననీటి వనరులను రక్షించాలనే ఉద్దేశంతో 1975లో మండలంలోని ఉమ్మడి పెదతూండ్ల గ్రామ పంచాయతీ సమీపంలోని తీగలవాగుకు అడ్డంగా ఆనకట్టను రూ.13 లక్షలతో నిర్మించారు. కానీ 1978లో ఆనకట్టకు గండిపడడంతో ప్రాజెక్టులో నీరు నిలువలేదు. 1986లో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపానపోలేదు. సుమారు 20 ఏళ్ల అనంతరం 2002లో రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికీ అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే జలయజ్ఞం కార్యక్రమం చేపట్టడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఎన్నికల ప్ర చారంలో భాగంగా దివగంత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి స్థానిక నాయకులు ప్రస్తావన తీసుకొచ్చారు. తదనంతరం అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి శ్రీధర్బాబు చొరవతో 2006లో ప్రాజెక్టు అధునీకరణకు రూ.3.74కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు 456 జీఓను జారీ చేశారు. దీంతో టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనుల నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో రెండు నెలల కాలంలోనే కురిసిన భారీ వర్షానికి మరోసారి ఆనకట్టకు భారీ గండి పడింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే గండి పడటంతో తమ తప్పును సమర్థించుకునేందుకు అధికారులు తప్పంతా కాంట్రాక్టర్పై నెట్టా రు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పని తీరు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆ శాఖ అధి కా రులపై ఉందనే విషయాన్ని మరిచిపోవడాన్ని రైతులు తీవ్రంగా విమర్శించారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు తీగల వాగును అనుసంధానం చేస్తే మరమ్మతు పనులు జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈప్రాజెక్టు పూర్తయి తే దీనికింద 1029 ఎకరాల భూమి సాగులో వస్తుంది. ముంపు బాధితులకు పరిహారం ప్రాజెక్టుకు గండి పడటంతో ప్రాజెక్టు కింద భూములు నష్టపోయిన ముంపు రైతులకు పరిహారం అందించారు. ప్రాజెక్టు కింద సమూరు 71మంది రై తు ల వద్ద నుంచి అధికారులు 84 ఎకరాల పై చిలుకు భూములను సేకరించి, పరిహారం అందించారు. ఏళ్ల నుంచి నిరుపయోగంగా ప్రాజెక్టు వైఎస్సార్ ఆశయానికి తూట్లు ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు వస్తే మాకు బాధలు తొలగిపోతాయి. సాగు చే స్తే వాన వస్తదో రాదో అని ప్రతి సంవత్సరం భయపడుతున్నాం. తీగల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాకు కావల్సినన్ని నీళ్లుంటాయి. – మోహన్నాయక్, రైతు, అడ్వాలపల్లిఏళ్లుగా తీగులవాగు ప్రా జెక్టు నిరుపయోగం ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తియి అందుబాటులోకి వ స్తే నీళ్లు మంచిగా వస్తాయి. రెండు, మూడు పంట లైన పండిస్తాం. కష్టపడటానికి సిద్ధంగా ఉంటాం. – కిషన్నాయక్, రైతు, అడ్వాలపల్లి, మల్హర్ -
గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. రోడ్డెక్కి రైతుల నిరసన మల్హర్(కాటారం): ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. ఽమండలంలోని కాటారం ప్రధాన రోడ్డుపై ధాన్యం బస్తాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాటారం–మంథని ప్రధాన రహదారిపై గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 30 రోజులు గడిస్తున్నా లారీలు రావడం లేదని కారణంతో ధాన్యం సేకరణ జరగడం లేదని వాపోయారు. అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు వదులుకోని ధాన్యం అమ్ముకోవడానికి కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల పిల్లల కోసం వర్కర్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 రోజులుగా ఉచితంగా నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. కృష్ణకాలనీలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఓర్పు వంటి మంచి లక్షణాలు పెంపొందుతాయన్నారు. సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం కార్మికుల పిల్లల కోసం వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్రెడ్డి, సీఎంఏఓఐ ప్రతినిధి నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, జనరల్ క్యాప్టెన్ మేడ మల్లేశ్ పాల్గొన్నారు. భక్తులకు మజ్జిగ పంపిణీ వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పకు తరలివస్తున్న భక్తులకు సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శించే భక్తులకు విజయవాడ పట్టణానికి చెందిన కోనేటి ఏడుకొండలు – దుర్గశ్రీలక్ష్మి దంపతులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవిలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా మజ్జిగ కొంతమేర ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది సంతోష్, దామోదర్, రత్న కుమారి, టూరిస్ట్ గైడ్ విజయ్ కుమార్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, అరుణ్, పురావస్తు శాఖ, గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది సేవలు
భూపాలపల్లి అర్బన్ : కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి దేవస్థానం లో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భూపాలపల్లి సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది భక్తులకు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. భక్తులకు మార్గనిర్దేశం చేయడం, క్యూలైన్ల నిర్వహణ, ఘాట్ల వద్ద భద్రతా సూచనలు ఇవ్వడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాల నిర్వహణలో వారి సేవాభావాన్ని భక్తులు, అధికారులు అభినందించారు. -
సన్మానం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సర్పంచ్ ఎల్పుల సరిత ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘ నంగా సన్మానించారు. సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేసి మంచి మార్కులు సాధించి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కూలీలకు మజ్జిగ పంపిణీ రేగొండ : కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ కాడవేన సరిత యుగంధర్ సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. పరిహారం చెల్లించాలి మహాముత్తారం : చిన్నకాళేశ్వరం కాల్వ ని ర్మాణం పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నూతన మార్కెట్ విలువను అ మలు చేసి రైతులకు పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ ముల మార్కెట్ విలువను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం ఈనెల 28న నూతన మార్కెట్ విలువ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో గతంలో సర్వే చేసిన భూములకు నూతన మార్కెట్ విలువను అమలుచేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా వారోత్సవాలు మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ స్థాని కంగా అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన పోషకాహార పదార్థాలను ఎలా విని యోగించుకోవాలో మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆహార వైవిధ్యం, ఆ రోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. సూపర్వైజర్ శివరాణి, పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా భూపాలపల్లి అర్బన్ : భూపాలపల్లి ఆర్టీసీ డి పో ఎదుట సోమవారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తాము బతికుండగా నే రావాల్సిన బకాయిలు, పెన్షన్ అందించా లని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు సమ్మిరెడ్డి, సదయ్య మాట్లాడుతూ పీఆర్సీ–2017 బకా యిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ మొత్తాలను వెంటనే చెల్లించాలని కోరారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీఎంకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి భూపాలపల్లి రూరల్: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మదర్ థెరిసా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కొమురయ్య హాజరై మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, మున్సిపల్ వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెప్మా డీఎంసీ రాజేశ్వరి, సీఓ నిర్మల ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎల్అండ్టీ’ అగ్నిప్రమాదంపై ఫిర్యాదు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామశివారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెస్ట్ హౌస్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గెస్ట్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు, ఫర్నిచర్తో పాటు పలువురి సిబ్బంది సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయని ఆ సంస్థ గెస్ట్హౌస్ ఇన్చార్జ్ తపాస్ కుమార్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.48కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాద స్థలం పరిశీలన మహదేవపూర్ మండలం అంబటిపల్లిలోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఎల్అండ్టీ గెస్ట్ హౌస్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
అర్ధాకలిలో పోలీసులు ?
చిట్యాల(కాళేశ్వరం) : ఈ నెల 21 నుంచి పుష్కరాలలో విధులకు హాజరైన పోలీసులు అర్ధాకలితో తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. ఐదు రోజులుగా బందోబస్తులో భాగంగా పగలు రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చే స్తున్న పోలీసులకు అకలి మంటలు తప్పడం లేదు. విధుల్లో పోలీస్ సిబ్బందికి క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నారు. ఉడికి ఉడకని టిఫిన్, భోజనాలు, నీళ్ల చారు, రుచి లేని కూరలతో తినలేక పోలీసులు కడుపు మార్చుకుంటున్నట్లు సమాచారం. దీంతో విధి లేక నగదు చెల్లింపులతో ఇతర హోటళ్లును అశ్రయిస్తు ఆకలి తీర్చుకుంటున్నట్లు తెలిసింది. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను కే టాయించిన ప్రజా సంక్షేమం కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఉన్నతాధికారులు స్పందించి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి నాణ్యమైన భోజనాలతో పాటు చల్లని తాగునీరు అందించాలని కోరుతున్నారు. సేవా సంస్థ మహిళలపై ఆగ్రహం కాళేశ్వరం: పుష్కరాలలో ఐదో రోజు పలువురు సేవా సంస్థ మహిళలపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సోమవారం నిరసన తెలిపారు. ఈ క్రమంలో సేవాసంస్థ మహిళలు మాట్లాడుతూ గర్భగుడి వద్ద సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను చైర్మన్ మోహన్శర్మ అమర్యాదగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారని మహిళలు నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఆలయంతో పాటు ఈఓ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఈ విషయమై ట్రస్టుబోర్డు చైర్మన్ మోహన్శర్మను సంప్రదించగా సేవకు వచ్చిన మహిళలు భక్తులకు ఆటంకం కల్పిస్తు గర్భగుడిలో అభిషేకాలు చేస్తుండగా బయటికి రావాలని చెప్పినా ఎంతకీ ఆ మహిళలు వినలేదని, సేవా కార్యక్రమాలు చేయాల్సిన మహిళలు గర్భగుడిలోనే ఉంటున్నారని తెలిపారు. సుమారు 200 మంది వరకు గర్భ గుడిలో ఒకరి తరువాత ఒకరు గంటల తరబడి అభిషేకాలు చేస్తూ, భక్తుల దర్శనాలకు ఆటంకం కల్పించారని తెలిపారు. ఎవరినీ అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. భక్తులకు ఆటంకం కలుగడంతో వారిని బయటికి రావాలని కోపంతో చెప్పానని తెలిపారు. -
ఇప్పపువ్వు లడ్డూ @ రూ.100
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఇప్పపువ్వు లడ్డూలు విక్రయిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన గిరిజన ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి ఒక బాక్స్లో పెట్టి రూ.100 చొప్పున ఐటీడీఏకు వచ్చి వెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ మహిళా సంఘం సభ్యులు ఇప్ప పువ్వును సేకరించి వాటితో స్వచ్ఛమైన బెల్లంతో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలతో అనేక పోషకాలు అందుతాయని వివరిస్తూ విక్రయిస్తున్నారు. దీంతో పలువురు లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 5 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మల్హర్: అనుమతులు లేకుండా తాడిచర్ల మానేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సోమవారం కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిచర్ల మానేరు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లోడ్ చేసుకొని తరలిస్తుండగా తాడిచర్ల సెంటర్లో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై–2 రజన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా పాలకవర్గం కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజు, ప్రాఽథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, జిల్లా సెక్టోరియల్ అధికారులు సీఎంఓ రమేష్, ఏఎంఓ విజయ్పాల్రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య, సీఆర్పీ సహదేవ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎగ్జిబిషన్ అదుర్స్
కాళేశ్వరం : పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తులు, ఈ వినోద కార్యక్రమాలు పిల్లలకు ఆనందాన్ని పంచడమే కాకుండా, పుష్కరాల సందడిని మరింత ఆహ్లాదకరంగా మా రుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చిన్నారుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు వినోదాన్ని కూడా అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో సమతుల్యమైన ఆహారం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి రూరల్: ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించి బాల్యాన్ని బలోపేతం చేయడం అంగన్వాడీ కేంద్రాల లక్ష్యమని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ‘సే నో టు జంక్ ఫుడ్’ నినాదంతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫుడ్స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. వంటకాల తయారీ విధానం, పోషక ప్రయోజనాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన, సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందన్నారు. మార్కెట్లో లభించే జంక్ ఫుడ్ను చిన్నపిల్లలకు ఇవ్వకుండా, స్థానికంగా అందుబాటులో ఉన్న తాజా కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు వంటి పోషకాహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందించాలి జిల్లాలోని నాలుగు బ్లాక్లలో 31 ఆది సేవాకేంద్రాలు ఉన్న గ్రామాల్లో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. గిరిజన కుటుంబంలో ప్రతీ ఒక్కరికి సికిల్ సెల్ ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీహరి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి భూపాలపల్లి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 40 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సమయపాలనతో కూడిన సేవలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని, ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు వెంటనే ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తును తప్పనిసరిగా ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. దరఖాస్తుదారుడికి తప్పకుండా రశీదు అందజేయాలన్నారు. దీని ద్వారా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించినా, కాలయాపన చేసినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సంక్షిప్త సమాచారం
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలి రేగొండ : కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధా న్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని ఎస్సై దాసరి సుధాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నాణ్యత ప్రమాణా లను పాటించాలన్నారు. అలాగే కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడేపాకలోని మిల్లును సందర్శించారు. హమాలీల సంఖ్యను పెంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు. దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి చిట్యాల : ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్సై పోచంపల్లి సతీశ్ మిల్లు యాజమానులను కోరారు. సోమవారం మండలంలోని పలు రైస్ మిల్లులను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని లారీ, ట్రాక్టర్లలో తీసుకొస్తున్న తీరును చూసి రైస్ మిల్లుల యాజమానులతో మాట్లాడి దిగుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ భవానాన్ని అప్పగించాలి చిట్యాల: ఐదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసిన ఎస్సీ కమ్యూనిటీ భవానాన్ని మండల అంబేడ్కర్ యువజన సంఘానికి అప్పగించాలని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శశివర్ధన్కు సోమవారం వినతిపత్రం అందించారు. కలెక్టర్ స్పందించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ను అంబేడ్కర్ సంఘానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
భూముల విలువ పెంపు
నాలుగేళ్ల తర్వాత పెంచుతున్న ప్రభుత్వం ● కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాంతాల వారీగా పెంపు ● ప్రాంతాన్ని బట్టి 50 శాతం నుంచి 100 శాతం పెరిగే అవకాశం ● త్వరలో కొత్త చార్జీలు అమలయ్యే అవకాశంభూపాలపల్లి అర్బన్: జిల్లాలో భూముల విలువ భారీగా పెరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూములకు ఉన్న ధర, ప్రభుత్వ విలువకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భూముల విలువ పెంచాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగా జిల్లాలో కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాంతాల వారీగా ఉన్న భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని ఆయాచోట్ల ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎంత ధరలు ఉన్నాయి, ఎంత పెంచితే బాగుంటుందనే దానిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో 30 నుంచి 50 శాతం వరకు.. ప్రభుత్వం 2022 జనవరిలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాంతాన్ని బట్టి గతంలో 30శాతం నుంచి 50శాతం వరకు పెంచింది. అప్పట్లో పెంచిన భూ విలువలను అదే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం భూ విలువ పెంపుపై పది రోజులుగా కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు పెంచేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఫైనల్ ప్రభుత్వం భూముల విలువను మరో రెండు రోజుల్లో ఫైనల్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల విలువ పెంపునకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. దాన్ని రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు పంపారు. వారు పంపినా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ధరల ఆధారంగా భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి పెంచిన ధరలు రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 28 లేదా జూన్ 1వ తేదీ నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో భారీగా పెరిగే అవకాశాలు జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్, పుల్లూరిరామయ్యపల్లి, కుందురుపల్లి తదితర ప్రాంతాల్లో కమర్షియల్, నాన్ కమర్షియల్కు సంబంధించిన భూముల విలువలు ప్రస్తుతం గజం రూ.2100 ఉంటే, దానిని రూ.3500కు పెంచే అవకాశం ఉంది. కాటారం, గణపురం మండలాల్లో సైతం భూముల ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ సైతం జిల్లా కేంద్రంతో సమానంగా భూముల ధరలు పెరుగుతున్నట్లు తెలిసింది. 50శాతం నుంచి 100శాతం వరకు.. ప్రభుత్వం ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం 50 శాతం నుంచి 100 శాతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 50 శాతంలోపే పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికంగా భూముల విలువ పెంచినా రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల కొనుగోళ్ల సామర్థ్యం మందగిస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా జిల్లాకేంద్రంతో మండలకేంద్రాల్లో భూముల విలువలు బహిరంగ మార్కెట్లో ఎంత మేరకు పెరిగాయన్న వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. జిల్లాకేంద్రంతో పలు మండలాల్లో ప్రధాన ప్రాంతాల్లో మాత్రం 100 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పెంబర్తి టు వరంగల్
విద్యారణ్యపురి: నాలుగేళ్ల క్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించగా.. అప్పట్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు కాలేదు. దీంతో ఆతర్వాత మహబూబాబాద్, ములుగులోని ఈ రెండు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలను అదే పేర్లతో కాజీపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఐదేళ్ల లా కోర్సు నడుస్తున్న భవనంలోకి మార్చారు. రెండేళ్లపాటు అరకొర వసతులతో కళాశాలలను కొనసాగించగా.. గతేడాది తమకు వసతులు సరిపోవట్లేదని బీసీ గురుకుల లా విద్యార్థులు ఆందోళన చేశారు. చివరికి మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట కార్యదర్శి సైదులు ఆదేశాలతో జనగామ జిల్లాలోని పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు 2025 డిసెంబర్ 22న షిఫ్ట్ చేశారు. మళ్లీ వరంగల్కే మార్చాలని డిమాండ్ కళాశాలలను మళ్లీ వరంగల్కే మార్చాలనే డిమాండ్ వ్యక్తం కావడంతో గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి ఈఏడాది మార్చిలో ఆయా మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను వరంగల్ రంగశాయిపేటలోని నాయిడు పెట్రోల్ బంక్ సమీపంలోని అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. వివిధ కారణాలతో షిఫ్టింగ్కు కొంత ఆలస్యమై చివరికి సోమవారం పెంబర్తి నుంచి వరంగల్కు మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు షిఫ్టింగ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఆరెండు కళాశాలలు కలిపి డిగ్రీ సెకండియర్, ఫైనల్ ఇయర్లో 215 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ షురూ.. వరంగల్ రంగశాయిపేటలోని అద్దె భవనంలోనికి మార్చిన మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలల్లో (2026–27) విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు, దరఖాస్తులు చేసుకోవాలని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి సోమవారం తెలిపారు. బీఏ హెచ్ఈపీ, బీకాం (సీఏ), బీఎస్సీ బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నేరుగా పొందవచ్చని, పూర్తి వివరాలకు 98666 10429, 96768 17038 సంప్రదింవచ్చని సూచించారు. బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు షిఫ్టింగ్ మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించిన గురుకుల డిగ్రీ కళాశాల వరంగల్లోని రంగశాయిపేట అద్దె భవనంలోకి.. -
జేసీబీకి పుష్కరస్నానం
మహాముత్తారం : సరస్వ తి అంత్యపుష్కరాలు సో మవారం ఐదో రోజు భ క్తులు పుష్కరస్నానం ఆచరించారు. కుటుంబ స భ్యులతో వచ్చిన ఓ బా లుడు తమవెంట తీసుకొచ్చిన ఆటవస్తువు (జేసీబీ)కి సైతం పుష్కరస్నానం చేయించాడు. శివయ్యకు భక్తుల మొక్కులు చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శివయ్య విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి చేరుకుని ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయం ముందు ఉన్న శివయ్య విగ్రహానికి పూజలు చేస్తున్నారు. కాళేశ్వర గాంధీ మహాముత్తారం: కాళేశ్వ రం పుష్కరాల్లో సరస్వతి పుష్కరఘట్ వద్ద ఒకరు గాంధీ వేషధారణతో మెట్లపై భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తులు గాంధీతో సెల్ఫీలు దిగుతూ డ బ్బులు ఇవ్వడానికి పోటీపడ్డారు. భద్రాచలానికి చెందిన మధు జాతరలు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో గాంధీ వేషధారణ వృత్తిగా మార్చుకొని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది చిల్లర లేవని వెళ్లిపోవడాన్ని గమనించి క్యూఆర్కోడ్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. చిలుక జోష్యం మహాముత్తారం : సరస్వతి అంత్య పుష్కరా ల్లో భాగంగా పరిసర ప్రాంతాలతో పాటు పట్టణాల నుంచి వ చ్చిన వారు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన చిలుక పంచాంగం జ్యోతిష్యుడు చిలుక పంచాంగం చెబుతామంటూ పుష్కర ఘాట్ వద్ద కూర్చొని జాతకం చూస్తామంటూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు. కుర్రో.. కుర్రు టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న అంత్య పుష్కరాల సందర్భంగా సరస్వతీ ఘాట్ వద్ద ఓ కోయ ప్రత్యేక వేషధారణలో కుర్రో, కుర్రు కొండ దేవర అంటూ భిక్షాటన చేశాడు. నడిరోడ్డుపై నిల్చుని ఎండలో భక్తులకు చేయి చాపడంతో భక్తులు సైతం అతనికి కానుకలు అందించారు. -
కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి
భూపాలపల్లి రూరల్: ఆదివాసీల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొర్ర రాంబాబు ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన కొమురం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. బాస్కెట్బాల్ పోటీల ఏర్పాట్ల పరిశీలన పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో జూన్లో నిర్వహించనున్న బాస్కెట్బాల్ రాష్ట్రస్థాయి పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరై కేక్ కట్చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, స్థానిక కౌన్సిలర్లు, సింగరేణి ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు, నాయకులు పాల్గొన్నారు విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
రోడ్డు పనులను వేగవంతం చేయాలి
మొగుళ్లపలి: రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని అకినపల్లి నుంచి అంతడుపుల గ్రామానికి జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డు ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివా రం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వ యంభు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. హేమాచలక్షేత్రం ఆలయ పరిసరాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో పాటు సహజసిద్ధమైన జలపాతాలు ఉండటంతో మండు వేసవిలో భక్తులకు చల్లని ఆహ్లాదాన్ని పంచుతోంది. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. భక్తులకు స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరిస్తున్న పూజారి, ప్రత్యేక అలంకరణలో స్వామి -
రాజయ్య ఆశయ సాధనకు కృషి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ భూపాలపల్లి అర్బన్: రాజయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన కంపేటి రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. రాజయ్య జీవితం అసలైన కమ్యూనిస్టు ఉద్యమానికి నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలు తరతరాలకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు. అనంతరం రాజయ్య పేరుతో పర్మినెంట్ కార్మికుల కోసం ఒక కార్యాలయం, కాంట్రాక్ట్ కార్మికుల కోసం మరో కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో రాజయ్య స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మాణానికి కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య కుటుంబ సభ్యులు లక్ష్మి, నాగరాజు, స్వాతి, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రాజయ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వరి కొయ్యలు కాల్చొద్దు..
● సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు పెరిగే అవకాశముంది. ● ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవడంతో ఎరువుల వాడకం తగ్గుతుంది. ● మొక్కలకు 2 శాతం నత్రజని (యూరియా), 4 శాతం ఫాస్పరస్ అదనంగా అందుతుంది. ● నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది.మొగుళ్లపల్లి: గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. పశువులు ఎక్కువగా ఉండడంతో గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వ చేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. మిషన్ హార్వెస్టింగ్ చేసే సమయంలో వరిపైరును పైకి కోయడంతో కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొంత గడ్డిని కోసి తీసుకొచ్చుకుని మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతో పాటు గడ్డిని కూడా కాల్చివేస్తున్నారు. కోల్పోతున్న భూసారం వరి కొయ్యలను కల్చడంతో అధిక నష్టాలు వచ్చే అవకాశముందని, వరికొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ వంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగుబడి తక్కువగా వస్తుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు, వానపాములు, జీవరాసులు చనిపోతాయి. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని అధికారులు తెలుపుతున్నారు. కలియ దున్నితే ఎరువుగా తయారీ.. అవగాహన కల్పిస్తున్న అధికారులు -
న్యాయం చేయాలని ఆందోళన
శాయంపేట : మండలంలోని కొత్తగుట్ట సింగారం గ్రామానికి చెందిన కుక్కల సారయ్య (75) గ్రామ శివారులోని పున్నం మల్లారెడ్డి ఆయిల్పాం తోటలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు, బందువులు గూడెప్పాడ్–పరకాల రహదారిపై ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాహనాలు బారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారుతో మాట్లాడారు. ఫిర్యాదు ఇస్తే బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సీఐ సుధాకర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు సారయ్య మృతదేహానికి పరకాల సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి భార్య కుక్కల మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రికార్డుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని హనుమాన్ దేవాలయంతోపాటు భూపాలపల్లి మండలంలోని కొంపల్లి, ఫుల్లురామయ్యపల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాలలోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి సంబంధించి సోషల్ ఆడిట్లో భాగంగా దేవాదాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆదివారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాలు, రికార్డులను పరిశీలించారు. ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. పుజారులు ఆలయాల్లోని సమస్యలను అధికారి వరలక్ష్మికి వివరించారు. ఈ తనిఖీల్లో దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సుల కోసం నిరీక్షణ
భూపాలపల్లి అర్బన్: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వెళ్లే భక్తులు భూపాలపల్లి బస్టాండ్లో ఆదివారం ఇబ్బందులు పడ్డారు. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి బస్టాండ్లోనే వేచి ఉన్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు అసౌకర్యానికి గురయ్యారు. పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ భూపాలపల్లి బస్టాండ్ వద్ద మాత్రం అవసరానికి తగ్గట్టుగా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. -
మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర ఎండలు ఉండే పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45.7 డిగ్రీలు నమోదయ్యాయన్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, నిమ్మరసం తరచూ తీసుకోవాలని సూచించారు. వారోత్సవాలు విజయవంతం చేస్తాం.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. మహిళా వారోత్సవాలపై ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం.. రానున్న పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్రస్థాయి అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
కాళేశ్వరం: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఆదివారం భక్తుల రద్దీ పెరగడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎస్పీ నిరంతరం భక్తుల రద్దీ పర్యవేక్షిస్తూ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తూ భక్తుల రాకపోకలను సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయడంతో పాటు ఆలయంలో భక్తులు క్యూలైన్ విధానంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్లు, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన రహదా రుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు ని ర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులు పోలీస్శాఖ సూ చనలు పాటిస్తూ సహకరించాలని ఎస్పీ కోరారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
జోరుగా తునికాకు సేకరణ
భూపాలపల్లి: అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు ఎంతగానో ఆసరాగా నిలిచే తుని కాకు(బీడీ ఆకు) సేకరణ సీజన్ ప్రారంభమైంది. కాళేశ్వరం సర్కిల్ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని 7 డివిజన్లలో ప్రస్తుతం ఆకు సేకరణ జోరుగా సాగుతోంది. పెరిగిన యూనిట్లు.. లక్ష్య సాధనపై సందిగ్ధం కాళేశ్వరం సర్కిల్ పరిధిలో ఈ ఏడాది మొత్తం 47 యూనిట్లలో ఆకు సేకరణ కోసం జనవరి 23 నుంచి మార్చి 7 వరకు ఐదుసార్లు టెండర్లు పిలిచారు. అందులో 41 యూనిట్లకు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోగా, మిగతా 6 యూనిట్లకు ఎవరూ ముందుకు రాలేదు. టెండర్లు ఖరారైన 41 యూనిట్లలో ఈ ఏడాది 40,600 స్టాండర్డ్ బ్యాగుల(ఎస్బీ) తునికాకు సేకరణను అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 47 యూనిట్లకు గాను 37 యూనిట్లు అమ్ముడుపోగా, 32,900 ఎస్బీల లక్ష్యానికి కేవలం 20,537 బ్యాగులు మాత్రమే సేకరించగలిగారు. ఈ 2025 ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు లేకపోవడంతో అడవుల్లో ఆకు దిగుబడి తక్కువగా ఉందని, ఉన్నచోట సైతం నాణ్యమైన ఆకులు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆశించిన మేరకు కూలీ గిట్టుబాటు అయ్యే అవకాశం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వానాకాలం పెట్టుబడికి ఆసరా.. అటవీ గ్రామాల్లో వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత వేసవి కాలంలో చాలామంది తునికాకు సేకరణకు వెళ్తారు. ప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆకు సేకరణను ఈ ప్రాంత ప్రజలు తమ రెండవ పంటగా భావిస్తారు. ఈ ఏడాది స్టాండర్డ్ బ్యాగు(ఎస్బీ)కు ప్రభుత్వం రూ.3,400 ధర నిర్ణయించడంతో కూలీ గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. దీంతో అటవీ గ్రామాలకు చెందినవారు ఎక్కువగా ఆకు సేకరణపై దృష్టి సారించారు. తునికాకు విక్రయించి, వానాకాలం పంటల పెట్టుబడికి అవసరమైన డబ్బులను సమకూర్చుకోనున్నారు. ఏజెన్సీలో నెలరోజుల పాటు ఉపాధి కాళేశ్వరం సర్కిల్లో సాగుతున్న పనులు 41 యూనిట్లలో 40,600 స్టాండర్డ్ బ్యాగ్స్ లక్ష్యంజిల్లా యూనిట్లు అమ్ముడు లక్ష్యం పోయినవి (ఎస్బీ) భూపాలపల్లి 19 15 17,600 ములుగు 24 23 19,100 పెద్దపల్లి 4 3 3,200 -
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రశాంతం
కేయూ క్యాంపస్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–26 ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ట్రైసిటీలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 4,075 మంది అభ్యర్థులగాను 2,762 మంది (67.78 శాతం) హాజరయ్యారు. 1,313 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండో సెషన్ను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. రెండో సెషన్లో 2,749 మంది అభ్యర్థులు(67.49 శాతం) హాజరుకాగా 1,326 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల తనిఖీ.. హనుమకొండలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ములుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్ ఎల్బీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూపీఎస్సీ సెంట్రల్ ఇన్స్పెక్షన్ అధికారి శుభం గౌడ్, రాష్ట్రస్థాయి అబ్జర్వర్ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, రూట్ అధికారులు, తహసీల్దారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. నిమిషం ఆలస్యంతో పరీక్ష కోల్పోయిన ఆరుగురు మొదటి సెషన్కు 67.78 శాతం.. రెండో సెషన్లో 67.49 శాతం అభ్యర్థులు హాజరు -
పచ్చి రొట్టతో భూసారం పెంపు
మల్హర్: పచ్చి రొట్టతో భూసారం పెరుగుందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయితీపై 50 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మండలంలోని కొయ్యూరు ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వరి, మిరప పంటలు వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తొలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకుంటే భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫిలతో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఒక బస్తా (30 కిలోల) జీలుగ విత్తనాలు రూ.2452.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందుబాటులో జీలుగ విత్తనాలు చిట్యాల: వానాకాలం సీజన్లో రైతుల కోసం 50శాతం రాయితీలో పచ్చిరొట్ట(జీలుగ) విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగ విత్తనాలు మండల కేంద్రంతో పాటు, మండలంలోని గిద్దెముత్తారం ఆగ్రోస్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.పారిశుద్ధ్య కార్మికుడిగా సర్పంచ్ మహాముత్తారం: గామాల్లో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులతో తొలగిస్తారు. కాని సర్పంచ్ స్వయంగా మురికి కాల్వలోని చెత్తను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గండికామారం గ్రామ సర్పంచ్ సత్యం ఆదివారం గ్రామంలో చింతలపల్లె నుంచి గొల్లబుద్దారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన మురికి కాల్వ చెత్తా చెదారంతో నిండిపోయి మురికి నీరు రోడ్డుపై ప్రవహించేదాన్ని గమనించాడు. వెంటనే మురికి కాల్వలోని చెత్తా, ప్లాస్టీక్ కవర్లు ఆయనే తొలగించి పారిశుద్ధ్య కార్మికుడిగా మారాడు. భూపాలపల్లి రూరల్: ప్రతీ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్ మెడల అభిలాష్ గౌడ్ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోటీఆర్ఎస్ పార్టీ గద్దెలు నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు కోరారు. జిల్లా ఇన్చార్జ్ నరేష్ నేత, నియోజకవర్గ అబ్జర్వర్ అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు వినోద్,నాయకులు గోవర్దన్, చుక్క రాజు, విగ్నేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. మంగపేట: మండలంలోని చెరుపల్లి, బాలన్నగూడెం తదితర గ్రామాల్లో ఆదివాసీ గిరిజన మత్స్య సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పట్టి నాలుగు రోజుల నుంచి చెరువుల వద్దనే కేజి రూ.150కి విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో గోదావరి చేపలు కేజీ రూ.300 వందలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చేపలు రూ.200 వందలకు విక్రయిస్తున్నారు. కాగా, తాజా పట్టిన చేపలను కేజీ రూ.150కి విక్రయిస్తుంటడంతో స్థానిక ప్రజలు చెరువల వద్దకు వెళ్లి ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన బాల్య నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15వేలు నగదును అందజేశారు. వార్డు సభ్యుడు కొండాయి చిన్ని, చంద్రబాబు, తాడూరి రఘు, మోహన్, శ్రీను, పృద్విరాజ్, హరిబాబు, శ్రీనివాస్, వెంకటస్వామి, మొగిళి పాల్గొన్నారు. 6వ వార్డులో.. మండలంలోని 6వ వార్డుకు చెందిన మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మాదరి రామయ్య తల్లి లక్ష్మీ ఇటీవల మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు నాయకులతో కలిసి పరామర్శించారు. -
ఎనిమిదేళ్లుగా పైపులైన్ లీకేజీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన నీలారపు రాజయ్య అనే రైతు భూమిలో 8 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పైపులైను వాటర్ లీకేజీ అవుతున్నాయి. దీంతో సాగుకు యోగ్యంగా లేక పొలం బీడుబారి బంజేరుగా మారింది. పైపులైన్కు మరమ్మతులు చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను ఎన్నిసార్లు కోరిన ఇప్పటికి కనికరించడం లేదని రైతు వాపోతున్నాడు. కాగా, పైపులైన్ లీకేజీ కారణంగా గ్రామ ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని రైతు ఆరోపిస్తున్నారు. అధికారులు దురుసుగా మాట్లాడి వెళ్లిపోతున్నారని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
భూపాలపల్లి అర్బన్: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరానికి భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య శిబిరాలను భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గోపాల్ రావు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు చికిత్స పొందుతున్న ఇన్పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, అత్యవసర సేవల పరిస్థితిపై వివరాలు సేకరించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధుల నిర్వహణను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పుష్కరాల కాలంలో భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్టాండ్లోనే బస్సులు
టేకుమట్ల (కాళేశ్వరం): సరస్వతి అంత్య పుష్కరాలకు వేసవి ఎండ ఎఫెక్ట్ తాకినట్టు కనిపిస్తుంది. 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో అంత్య పుష్కరాలకు వెళ్లేందుకు భక్తులు విముఖత చూపుతున్నారు. అధికారుల అంచనాలకు అనుకూలమైన భక్తులు రాలేకపోతున్నరనడానికి బస్టాండ్లోని పుష్కర ఘాటుకు వెళ్లే బస్సులే నిదర్శనం. వివిధ ప్రాంతాల నుంచి బస్టాండ్కు చేరుకున్న భక్తులను బస్టాండ్ నుంచి ఉత్తర ఘాటు వరకు తీసుకెళ్లెందుకు ఉచిత ప్రైవేట్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడి బస్సులు అక్కడే ఉండడంతో పుష్కరాలకు వచ్చే భక్తుల తాకిడి అంతంత మాత్రమేనని తెలుస్తుంది. -
వసతుల కల్పన భేష్..
పుష్కరాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులుచిట్యాల(కాశేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కల్పించిన వసతులు సంతృప్తిగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో బస్టాండ్కు చేరుకోగానే బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. సరస్వతీ ఘాట్ ఆరంభం నుండి గోదావరి నీటి ప్రాంతం వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం భక్తులకు ఎండ తీవ్రత కలుగకుండా నీడ కోసం పాండాలు ఏర్పాటు చేయడంతో పాటు, వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు స్ప్రీంకర్ల చిరుజల్లులతో చల్లని గాలి వస్తుంది. ప్రత్యేకాకర్షణగా బాహుబలి సెట్టింగ్.. సరస్వతీ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్ పుష్కరాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. బాహుబలి సెట్టింగ్కు ముందు భాగంలో డయాస్లో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అదే డయాస్ నుండి పుష్కర ప్రధాన అర్చకులు గోదావరికి హారతి అందించడం వంటి ఘట్టాలకు భక్తులు పులకరించిపోతున్నారు. పుష్కర స్నానం అనంతరం ఆలయ దర్శనానికి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.శివయ్య సేవ కోసం వచ్చాం...దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెళ్తాం. అందులో భాగంగానే కాళేశ్వరంలో నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు కొరుట్ల నుంచి 50మంది భక్తులం శివయ్య సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా సేవ కోసం వచ్చిన తమకు ఆలయ సిబ్బంది అందించిన సహకారం బాగుంది. – లక్ష్మీ, సేవకురాలు, కోరుట్లఏర్పాట్లు బాగున్నాయి..అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం వేసిన టెంట్లు, స్ప్రింకర్లు, అన్నదానం, కూలర్లు, తదితర సదుపాయాలు కల్పించారు. అలాగే బస్టాండ్ నుండి పుష్కర ఘాట్ వరకు బస్సు సౌకర్యం చాలా సౌకర్యంగా ఉంది. ఘాట్కు చేరుకునేందుకు ఎండలో నడవడం తప్పింది. – సత్యనారాయణ, భక్తుడు, చంద్రాపూర్ -
108తో అత్యవసర సేవలు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా 326మందికి 108 అంబులెన్స్ సేవల ద్వారా తరలించినట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. రోగులకు అంబులెన్స్లోనే ప్రీ–హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తూ సమీప ఆస్పత్రులకు సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నారని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు తీవ్రమైన ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అరటి తోట దగ్ధం టేకుమట్ల: పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో చెలరేగిన మంటలు అంటుకుని అరటి తోట దగ్ధమైన ఘటన మండలంలోని పంగిడిపల్లిలో చోటుచేసుకుంది. బాధిత రైతు పారిపెల్లి మహేందర్ కథనం ప్రకారం.. తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో అరటితోట సాగు చేశాడు. రెండు రోజుల్లో అరటి గెలలను కోసేందుకు సిద్ధమయ్యాడు. ఈ తరుణంలో పరిసర ప్రాంత రైతులు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పుతో మంటలు చెలరేగి అరటి తోట మొత్తం దగ్ధమైంది. అరటి తోటపై పెట్టుకున్న ఆశలు అగ్ని రూపంలో ఆవిరయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా దగ్ధమైందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పామాయిల్ తోట దగ్ధం భూపాలపల్లి రూరల్: అగ్ని ప్రమాదంలో పామాయిల్తోట దగ్ధమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గొర్లవీడు గ్రామానికి చెందిన చెలిమెల రాజయ్యకు చెందిన సుమారు రెండెకరాల పామాయిల్, సుబాబు తోట అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటర్ వైర్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత చిట్యాల: అనుమతులు లేకుండా మండలంలోని కాల్వపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు అంబాల రాంబాబు, బొందుగుల కుమార్, నాగవత్ రవీందర్, సుధీర్, బోయిని ప్రసాద్, ఆకుల రవిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు చిట్యాల: కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన చిట్యాల మండలంలోని జడలపేట గ్రామ శివారులోని గాంధీనగర్లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని జడలపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు మేరుగు రాజయ్య వృత్తిలో భాగంగా రోజులాగే తాటిచెట్లు ఎక్కి తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. -
సమస్యలు పరిష్కరించాలి
మహాముత్తారం: తమ సమస్యలను పరిష్కరించాలని మండలకేంద్రంలోని మండల సమైక్య కార్యాలయం వద్ద శనివారం మండల వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో వీఓఏ జేఏసీ మండల అధ్యక్షుడు సకినాల మల్లేశ్, గౌరవ అధ్యక్షుడు జాడి వెంకటయ్య, ప్రధానకార్యదర్శి అంతటి రవి, ఉపాధ్యక్షుడు తొట్ల రాజేష్, వీఓఏలు పోరిక అకిల, ఐర్నేని సుభాషిణి, పారుపల్లి పోషయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: ప్రగతి ప్రశాంతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని పరిసరాలు, కాలనీల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి శనివారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి కాలం నేపథ్యంలో కార్మికులు ఎండలో సైతం విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి మజ్జిగ ప్యాకెట్లు అందించినట్లు సొసైటీ ఆర్గనైజర్ రావులు అనిల్కుమార్ తెలిపారు. మల్హర్: ఐదేళ్లు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సీనియర్ ఉపాధ్యాయుడు కుమారస్వామి అన్నారు. శనివారం మండంలోని తాడిచర్ల జిల్లాపరిషత్ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు కుమరస్వామి ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న మౌళిక వసతులు, పదిలో సాధించిన ఉత్తమ ఫలితాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలో వేల రూపాయాల ఫీజులు నష్టపోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ములుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు వరిపంట వేసుకోవద్దని తెలిపిందని పేర్కొన్నారు. దొడ్డు రకం పంటలను సాగుచేస్తే ధాన్యాన్ని కొనమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసం రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. పరామర్శ ములుగు: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వడదెబ్బతో మృతిచెందిన సాంబయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.4లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, రమేష్రెడ్డి, చంద్రమౌళి, వెంకన్న, సాగర్, ఓదేలు, కుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్లబండ్ల ఆకర్షణ..
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పుష్కర క్షేత్రానికి చేరుకునేందుకు భక్తులను ఎడ్లబండ్లలో తరలిస్తూ పలువురు రైతులు, బండి యజమానులు ఉపాధి పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులను ఎడ్లబండ్లలో తీసుకెళ్తూ గ్రామీణ జీవనశైలిని ప్రతిబింభిస్తున్నారు. ఆధునిక వాహనాల మధ్య సంప్రదాయ ఎడ్లబండ్ల ప్రయాణం భక్తులను ఆకట్టుకుంటోంది. ఎడ్లబండ్ల ద్వారా రవాణా సేవలు అందిస్తూ కొంతమంది కుటుంబాలు రోజువారీ ఆదాయం పొందుతున్నాయి. పార్కింగ్ పాయింట్ల నుంచి గోదావరి వరకు ఒక్కరికీ రూ.50 చొప్పున చార్జీలు తీసుకుంటున్నారు. -
ఎండు కొబ్బరి చిప్పలతో ఉపాధి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద భక్తులు సమర్పించిన కొబ్బరికాయలను సేకరించి ఎండబెట్టడం ద్వారా పలువురు ఉపాధి పొందుతున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా భారీగా పేరుకుపోయిన కొబ్బరికాయలను స్థానికులు వేరు చేసి, చిప్పలు, కొబ్బరి ముక్కలను ఎండబెట్టి వ్యాపార అవసరాలకు సిద్ధం చేస్తున్నారు. ఎండిన కొబ్బరి ముక్కలను నూనె తయారీ, పశువుల మేత, ఇతర పరిశ్రమలలో వినియోగిస్తుండగా, చిప్పలను ఇంధనం, హస్తకళల తయారీలో ఉపయోగిస్తున్నారు. కొ బ్బరికాయల వ్యర్థాలను వినియోగంలోకి తీ సుకురావడం వల్ల పరిశుభ్రతకు తోడ్పాటు అందడ మే కాకుండా పలువురికి ఆదాయ వనరుగా మా రిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
మంటల్లో పంటలు, ప్రాణాలు
భూపాలపల్లి: పంట వ్యర్థాలను కాల్చొద్దు. మట్టిలోని పోషకాలు దెబ్బతింటాయని, అగ్ని ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లుతుందని అధికారులు ఎంత చెబుతున్నా రైతులు వినడం లేదు. పలువురు రైతులు వరి, మొక్కజొన్న కొయ్యలకు నిప్పంటించడం మూలంగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. నిన్న ఇద్దరు రైతులు సైతం మృత్యువాత పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న, వరి వ్యర్థాల కాల్చివేత.. జిల్లాలోని 12 మండలాల్లో యాసంగిలో వరి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగుచేశారు. యంత్రాలు, కూలీల సహాయంతో పంటలను కోసిన అనంతరం కొయ్యలు, మొక్కజొన్న చొప్ప లాంటి వ్యర్ధాలను వాస్తవానికి భూమిలోనే కలిపి దున్నించాలి. తద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. కొయ్యలు భూమిలో ఉంటే దుక్కి దున్నే సమయంలో ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో పలువురు రైతులు వాటికి నిప్పంటిస్తున్నారు. ప్రస్తుతం వేడిగాలులు వీస్తుండటంతో ఆ మంటలు ఒక పొలం నుంచి మరొకరి పొలంలోకి వ్యాపించి మొక్కజొన్న, అరటి, వరి పంటలు పూర్తిగా దగ్ధమవుతున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు నష్టపోతున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు.. ● ఈ నెల 22న టేకుమట్ల–పంగిడిపల్లి గ్రామాల మధ్య ఓ రైతు పంట వ్యర్ధాలను కాల్చే క్రమంలో ప్రధాన రహదారిపై ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ దగ్ధమైంది. అంతేకాక సుమారు 15 ఎకరాల్లో మంటలు చెలరేగడంతో శ్రీపాల్రెడ్డికి చెందిన మోటర్ పైపులు కాలిపోయి మోటర్ బావిలోనే పడిపోయింది. ● ఇదే రోజున కుందనపల్లిలో సైతం ఆరు ఎకరాలకు చెందిన పశుగ్రాసం, డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయి. రామకిష్టాపూర్(టి) గ్రామంలో దుద్దెటి కొమురయ్యకు చెందిన 18 క్వింటాల మిర్చి కాలి బూడిదయింది. ● ఇదే రోజున రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో మంటలు చెలరేగి పలువురు రైతుల మోటర్లు, పైపులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు కష్టపడితే గాని మంటలు చల్లారలేదు. ● ఈ నెల 21వ తేదీన టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లిలో సుమారు 40 ఎకరాల్లో మంటలు వ్యాపించి పలువురు రైతులకు చెందిన మోటర్లు, పైపులు, టార్పాలిన్లు, వరిధాన్యం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ● ఇదే రోజున మొగుళ్లపల్లి మండలంలోని గుడిపహడ్ శివారు పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో గుడిపహడ్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతుల వరిగ్రాసంతో పాటు పైపులు తదితర సామగ్రి కాలిపోయాయి. ఈ సంఘటనలన్నీ కూడా పంట వ్యర్ధాలను కాల్చడం మూలంగానే సంభవించినట్లుగా తెలుస్తోంది. భార్యాభర్తల మృతి.. పంట వ్యర్థాలను కాల్చి చల్లార్చే క్రమంలో శనివారం రేగొండ మండలం రేపాకలపల్లికి చెందిన చాగర్ల చంద్రమౌళి(62) మంటల్లో పడి అక్కడికక్కడే చనిపోగా, అతని భార్య భాగ్యమ్మ(55) ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. పంట వ్యర్థాలను కాల్చుతున్న రైతులు మంటలు చెలరేగి ధాన్యం బూడిదపాలు నాలుగు రోజులుగా వరుస ఘటనలు తాజాగా మంటల్లో పడి భర్త, ఊపిరాడక భార్య మృతి -
జాబ్మేళాలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగులు జాబ్మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా జాబ్మేళాలో ఎంపికై న 43 మంది యువతీ యువకులకు శనివారం కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడం ఆనందదాయకమని తెలిపారు. యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జాబ్మేళాలు మంచి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం సీఎం కప్ క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు. నేటి విద్యార్థులు రేపటి ప్రతిభావంతమైన క్రీడాకారులుగా ఎదిగి జిల్లా, రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లీన్ డే కార్యక్రమంలో భాగంగా కోటగుళ్ల పరిసరాలను పరిశుభ్రం చేసిన క్రీడాకారులు, ఆర్కియాలజీ డైరెక్టర్ బుజ్జి, సెక్యూరిటీ రాజు, సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రవీందర్లను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రఘు, సిబ్బంది సాగర్, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి ● ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డిభూపాలపల్లి అర్బన్: ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం ఏరియాలోని ఏరియా వర్క్షాప్, ఏరియా ఆస్పత్రి, జీఎం కార్యాలయ ఉద్యోగులకు మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సమయపాలన పాటిస్తూ పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్క్షాప్, హాస్పిటల్, జీఎం కార్యాలయ ఉద్యోగులు బొగ్గు ఉత్పత్తికి పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ సంస్థ లక్ష్యాల సాధనకు తోడ్పడాలని కోరారు. సింగరేణిలో ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సమష్టి కృషితో నాణ్యత, ఉత్పాదకత పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం కవీంద్ర, ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, రవీందర్, మారుతి, యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
దగ్ధమైన మొక్కజొన్న పరిశీలన
మొగుళ్లపల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో వనపర్తి మొండయ్య, కదుర్ల కొమురయ్య, మేకల రాజ్ కుమార్, నైనాకంటి కృష్ణారెడ్డి చెందిన సుమారు 100 క్వింటాళ్ల మొక్కజొన్నలు శనివారం దగ్ధమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎల్లారెడ్డిపల్లికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట అవశేషాలు, వరి కొయ్యలకు నిర్లక్ష్యంగా నిప్పంటించరాదని సూచించారు. వేసవి కాలంలో చిన్న అజాగ్రత్త కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని, రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటలను కాపాడుకోవాలని తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ సునీత, సంబంధిత శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
జయశంకర్ భూపాలపల్లి
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 20267● తమ్ముళ్లను పెంచి ప్రయోజకులను చేసిన అన్నలు.. ● అన్నను చదివించిన తమ్ముడు.. ● నేడు జాతీయ బ్రదర్స్ డే అన్నంటే నాన్నంత పెద్దరికం.. తమ్ముడంటే కొడుకంతటి అనురాగం.. బాల్యంలో ఇల్లంతా గోల చేసే అన్నాదమ్ముళ్లు..పెరిగి పెద్దయ్యాక బాధ్యతల భారం తమపై వేసుకుంటారు. తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలనే అన్న తపన..అన్న భారం తగ్గించాలనే తమ్ముడి తాపత్రయం..అలాంటి వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో మంది కనిపించారు. నేడు జాతీయ బ్రదర్స్ డే సందర్భంగా అలాంటివారిపై ప్రత్యేక కథనాలు.. -
చెరువు మరమ్మతు చేపట్టాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మండల కేంద్రంలోని తాడ్వాయి గ్రామపంచాయతీ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న కాంబోజు చెరువు మరమ్మతులు వెంటనే చేపట్టాలని గ్రామ రైతులు శనివారం చెరువు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువు మరమ్మతులకు నోచుకోక పోవడంతో నీరు వృథాగా వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీరుపైనే ఆధారపడి సాగు చేస్తున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో వరి, మిర్చి తదితర పంటలకు సాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. చెరువు మరమ్మతులు చేపడితే వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. చెరువు తూము, మత్తడి పూర్తిగా దెబ్బతిని లీకేజీలు ఏర్పడటంతో సాగునీరు నిరంతరం వృథాగా పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే రానున్న వర్షాకాలంలో చెరువులో నీరు నిల్వ ఉండే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రత్యేక నిధులు కేటాయించి తూము, మత్తడి మరమ్మతులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. -
పిట్టల్లా రాలుతున్నారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ దంచికొడుతున్నాయి. భానుడు మండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబా బాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. పెరుగుతున్న వడదెబ్బ కేసులు.. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా బుధవారం నలుగురు, గురువారం 9, శుక్రవారం 11 మంది, శని వారం ఒక్క రోజే 22మంది మృతి చెందారు. మొత్తంగా వారం రోజుల్లో 60 మందికిపైగా చని పోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, షుగర్, బీపీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రోడ్లు వెలవెల.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అంతంతే ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ద్విచక్రవాహనదారులు ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణిస్తుండగా.. చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగకు డిమాండ్ పెరిగింది. కాగా, ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు, తాగునీటి సౌకర్యం తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, ఓఆర్ఎస్, తాగునీ లేదని కూలీలు చెబుతున్నారు. మరో నాలుగు రోజులు.. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల్లో 60 మందికిపైగా మృత్యువాతములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రుని పేటకు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. పూరేడుపల్లిలోని తన పంట పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కాజీపేటకు చెందిన వి.వెంకటేశ్ (26) ఎండదెబ్బకు గురై రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం కుప్పకూలి చనిపోయాడు. కిరాణం నుంచి సామాను తెస్తానని ఇంటి నుంచి బయలుదేరి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందాడు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆకుదారివాడకు చెందిన దుర్గం సమ్మక్క (50) పశువులకు పచ్చిగడ్డి కోసం శుక్రవారం పొలం వద్దకు వెళ్లింది. పచ్చిగడ్డి ఇంటికి తీసుకొచ్చే సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పచ్చిగడ్డి మోపు దింపిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది. 45 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ఎండలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు రైతులు, కూలీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా రహదారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘటనలు -
దుకాణాల్లో గిరాకీ అంతంతే..
చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు స్వీట్ హౌజ్ దుకాణాలు, హోటల్లు , టెస్కో క్లాత్ స్టాళ్ల యాజమానులు నాలుగు రోజుల క్రితం ముందే చేరుకుని ఏర్పాటు చేసుకున్నారు. పుష్కరాలకు అధికంగా భక్తులు వస్తారని స్వీట్ కొంటారనే ఆశతో స్వీట్ల యాజమానులు రూ.లక్షల పెట్టుబడి పెట్టారు. అలాగే కలెక్టర్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత మూలంగా భక్తులు అంతంత మాత్రమే వస్తున్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులు స్వీట్లు కోనడం లేదు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన హోటల్లలో గిరాకీ లేక యాజమానులు అవస్థలు పడుతున్నారు. అలాగే టేస్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బట్టల దుకాణానికి ఎవరు రావడం లేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఆర్టీసీ బస్సులో బస్టాండ్కు వచ్చి గోదావరికి చేరుకుని అక్కడ పుణ్యస్నానాలు అచరించిన అనంతరం నేరుగా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. దీంతో వివిధ షాపుల యాజమానులు గిరాకీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరంలో వెలవెలబోతున్న షాపులు ఆందోళనలో వ్యాపారులు -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
కేయూ క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో నేడు (ఆదివారం) జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2026కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుందని తెలిపారు. మొదటిసెషన్ ఉదయం 9–30నుంచి 11–30గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 4–30గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తంగా పది సెంటర్లు ఏర్పాటు చేశామని, 4,075మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. నిమిషం నిబంధన.. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ధేశించిన సమయానికి అర్ధగంట ముందే కేంద్రాల గేట్ల మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోనికి అనుమతి ఉండబోదని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకేంద్రాలకు మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. కేంద్రాలవద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట యూపీఎస్సీ కేంద్ర తనిఖీ అధికారి శుభంగాద్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, రూట్ అధికారి భావ్సింగ్ ఉన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీలో రెండు సెంటర్లు, కాజీపేట ఫాతిమానగర్లోని సేయింట్ గాబ్రియల్ హైస్కూల్, హంటర్రోడ్డులోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డెపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ కళాశాల, హనుమకొండ అశోక్ జంక్షన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పది పరీక్ష కేంద్రాలు.. 4,075 మంది అభ్యర్థులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : సీపీవరంగల్ క్రైం: ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. సెంటర్లనుంచి 500మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎన్ఎస్ చట్టాన్ని అనుసరించి గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల ఇష్టారాజ్యం
టేకుమట్ల: మండలంలోని రాఘవరెడ్డి పేట శివారు చలి వాగు, కలికోట శివారు మానేరు నుంచి ఇసుకను జిల్లాలోని పలు మండలాలకు గృహ నిర్మాణ అవసరాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఎండలు తీవ్రతరం కావడంతో ఉదయం సాయంత్రం మాత్రమే ఇసుకను కూలీలు లోడింగ్ చేస్తున్నారు. దాంతో ఇసుక ట్రాక్టర్లు ఎక్కువ ట్రిప్పులను తరలించేందుకు ట్రాక్టర్ డ్రైవర్లు వాహనాల వేగాన్ని పెంచి అధిక వేగంతో ప్రయాణిస్తున్నారు. దీంతో రోడ్డుపై ఇతర వాహనదారులు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల మితిమీరిన వేగానికి ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే ఇసుక ట్రాక్టర్లు అధిక లోడ్తో వెళ్తున్నాయని తెలుపుతున్నారు. అధిక లోటుతో వెళ్లడం వల్ల రోడ్డుపై ఇసుక అక్కడక్కడ పోవడం ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని వాపోతున్నా రు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్ల అధికలోడుతోపాటు అధిక వేగాన్ని నియంత్రించాలని మండల ప్రజలు కోరుతున్నారు. అధిక వేగంతో వెళ్తున్న డ్రైవర్లు పట్టించుకోని అధికారులు ఆందోళనలో ప్రజలు -
పుష్కరాల్లో పిండ ప్రదానాలు ప్రత్యేకం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాల సందర్భంగా అపార భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. సరస్వతి పుష్కరాల పుణ్యకాలంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు చేయడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ ప్రాంతమంతా వేద మంత్రోచ్ఛారణలు, గోవింద నామస్మరణలు, హరినామ సంకీర్తనలతో మారుమోగుతూ భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పితృకార్యాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. పుష్కర సమయంలో పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పండితులు 500పైగా తరలివచ్చారు. పండితులు పితృకార్యాలు చేయడంతో పాటు పుష్కర స్ధానాలు చేసిన వారికి గోదావరి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో వారికి కొంత మేర ఉపాధి దొరుకుంతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం విసృత ఏర్పాట్లు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక షెడ్లు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
పకడ్బందీగా ఇళ్ల గణన
భూపాలపల్లి: జనగణన సర్వేలో భాగంగా జరుగుతున్న ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జనగణన, బల్క్ ల్యాండ్ ఇష్యూస్, సాదా బైనామా, భూభారతి, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే చోట ఉండి సర్వే చేయడం కాకుండా కచ్చిత సమాచారం సేకరణకు ప్రతి ఇల్లు క్షుణ్ణంగా సర్వే చేయాలని ఆదేశించారు. 33 కాలాలతో కూడిన సర్వేలో కొన్ని చోట్ల తప్పులు దొర్లితే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు లాగిన్ ఓపెన్ చేసి, డాటాను ఫొటోలు తీసుకుని తిరిగి తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ విలువల సవరణ చేపట్టాలి.. భూముల మార్కెట్ విలువల సవరణను సమగ్రంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి భూముల మార్కెట్ విలువల సవరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడీఓసీ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పాల్గొన్నారు. రిజర్వాయర్ నిర్మించాలి మహాముత్తారం: దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా బోర్లగూడెంలో రెండు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని కుల ప్రజాసంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వాయర్ ఏర్పాటు చేసి మండలంలోని రైతులకు సాగునీరు అందించాలన్నారు. రిజర్వాయర్ ఏర్పాటుకోసం రూ.2వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి పరామర్శ రేగొండ: మండలంలోని రేపాకపల్లి గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందాడు. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, నాంసాని రాంబాబు, తదితరులు ఉన్నారు. కాళేశ్వరంలో నలుగురి అరెస్ట్ కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తుల టార్గెట్గా లక్బై చాయిస్ అనే జూదం ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఎస్సై జి.తమాషారెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. పుష్కర ఘాట్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి స్ట్రైకర్లతో ‘లక్ బై చాయిస్’ జూదం ఆడుతూ కనిపించారు. పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు కురాకుల వెంకటేష్, మల్లబోయిన శివ, అంబి పోశాలు, కురాకుల సదానందం వద్ద మూడు ఆరెంజ్ రంగు ప్లేయింగ్ స్ట్రైకర్లు, రూ.2,730 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. జూదం ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిశుభ్రంగా డార్మెటరీ హాల్ చిట్యాల(కాళేశ్వరం): అంత్య పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం డార్మెటరీ (వెయిటింగ్) హాల్ ఏర్పాటు చేశారు. కానీ అపరిశుభ్రంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో పడుకునేందుకు వచ్చే భక్తులు చెత్తాచెదారంలోనే ఉంటున్నారు. రాత్రివేళలో గాలి వస్తుండడంతో దుమ్ము, ధూళి పడుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలి
భూపాలపల్లి అర్బన్: భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని భూపాలపల్లి, ములుగు జిల్లాల ఆహార తనిఖీ అధికారులు వరుణ్రెడ్డి, ధర్మేంద్ర అన్నారు. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లలో ఆహార భద్రత ప్రమాణాలపై వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాల్ నిర్వాహకులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగం, భద్రతా ప్రమాణాలపై సూచనలు చేశారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందించడం స్టాల్ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, వడ్డనలో పాటించాల్సిన నిబంధనలు, చేతుల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి వినియోగం తదితర అంశాలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. అలాగే కిరాణం షాపుల్లో కుల్డ్రింక్ బాటిళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శాంపిల్స్ సేకరణ సిబ్బంది నరేష్, ల్యాబ్ టెక్నీషియన్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిప్పుల కొలిమి
భూపాలపల్లి: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమి, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మినహా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. రెడ్ అలర్ట్ జారీ.. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్అలర్ట్ జారీచేసింది. ఈ నెల 21వ తేదీన అత్యధికంగా 46.4 ఉష్ణోగ్రత నమోదు కాగా, శుక్రవారం 45.9 నమోదైనట్లు వెల్లడించింది. నేడు(శనివారం) 45.6, ఆదివారం 44.6 నమోదు కానున్నట్లు ప్రకటించింది. శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో రెండు రోజుల పాటు సైతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనిపించని జనం.. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు సాధారణ ఉష్ణోగ్రత ఉంటుంది. 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అధిక ఉష్ణోగ్రతతో పాటు తీవ్ర వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వస్తున్నారు. వ్యవసాయ, ఇతర కూలీలు అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయినప్పటికీ వడదెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే ఐదుగురి మృతి.. కూలీ పనులకు వెళ్లినవారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురై ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. ● ఏప్రిల్ 30వ తేదీన టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంగి సుజాత కూలీ పనికి వెళ్లి వచ్చి వడదెబ్బకు గురై మృతి చెందింది. ● ఈ నెల 18న మల్హర్ మండలం తాడిచర్లకు చెందిన తిక్క రమ(54) వడదెబ్బకు గురై హనుమకొండలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ● ఈ నెల 21వ తేదీన ఒకేరోజు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన దూడపాక పోచయ్య, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకు చెందిన నాంపల్లి సక్కమ్మ, రేగొండ మండలం బాగిర్ధిపేటకు చెందిన యాకుబ్పాషా వడదెబ్బకు గురై మృతిచెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడుగురి మృతి నేడు కూడా రెడ్అలర్ట్ జారీ ఎండ వేడి, వడగాలులతో జంకుతున్న జనం మూడు వారాల్లో ఐదుగురు వడదెబ్బతో మృతి రానున్న మూడు రోజులు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీచేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రజలు ఎండదెబ్బ నుంచి తమను తాము రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే ఇండ్ల నుంచి బయటకు రావాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తాగునీరు సమృద్ధిగా తీసుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా గుడ్డతో కప్పుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏదేని అస్వస్థతకు గురైతే తక్షణమే వైద్యచికిత్స తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అస్వస్థత అనిపించిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చర్యలు
● మంత్రి శ్రీధర్బాబు కాళేశ్వరం: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులకు సూచించారు. శుక్రవారం కాళేశ్వరంలోని మెగా విశ్రాంతి భవనంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంచేసి తక్షణ చెల్లింపులు జరిగేలా ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓ పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం ఆర్డీఓ రవీందర్, కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుమల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు పాల్గొన్నారు. -
పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వినియోగించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో వేయాలని సూచించారు. పుష్కర ఘాట్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతీ ఒక్కరి బాధ్యత పేర్కొన్నారు. పరిశుభ్రతను కాపాడడంలో భక్తులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పుష్కరాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. సరస్వతి నవరత్నమాల హారతి ప్రత్యక్ష ప్రసారం ప్రతీ రోజు కాశి పండితులతో నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారం పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రతీ రోజు రాత్రి 7.30 గంటల నుంచి దేశ, విదేశాల్లో నివసిస్తున్న భక్తులు వీక్షించడానికి వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాత్రి 7.30 గంటల నుంచి నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతి కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితుల ద్వారా ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది (ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతులు) ప్రత్యేక హారతులను కాశీ పండితులు ఇస్తున్నట్లు వివరించారు. పారిశుద్ధ్యంపై దృష్టి సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో నిరంతరం శుభ్రత నిర్వహణ జరుగుతోంది. నదిలో వేస్తున్న వ్యర్థాలను సైతం జల్లెడపట్టి తొలగిస్తూ పరిశుభ్రతను కాపాడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ పరిశుభ్రం చేస్తున్నారు. శుభ్రత నిర్వహణలో లోపాలు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మొత్తం 18 మంది ప్రత్యేక అధికారులు, సుమారు 300మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరాన్ని 5 జోన్లుగా విభజించి, ప్రతీ జోన్కు జోనల్ అధికారులను నియమించారు. జోనల్ అధికారులు, సూపర్వైజర్లు, పర్యవేక్షక సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నదీ తీర ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద భక్తులు వ్యర్థాలు వేయడానికి ప్రత్యేక ఆకర్షణగా హృదయాకారంలో ఇనుప డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. కంకరతో పాదాచారులకు ఇబ్బంది.. మెయిన్ ఘాట్ నుంచి వీఐపీఘాట్కు వెళ్లే దారిలో కంకరతో రోడ్డు నిర్మించారు. వాహనాలు భారీగా నడపడంతో కంకర తేలింది. ఈంతో ఆ దారిలో వెళ్లే పాదాచారులు నడవలేకపోతున్నారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
పంట పొలాల్లో చెలరేగిన మంటలు
రేగొండ: పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు చెలరేగి సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించిన ఘటన మండలంలోని రేపాకపల్లి శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. ఆ మంటలకు వడగాల్పులు తోడవడంతో సుమారు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురు రైతులకు చెందిన మోగార్ తీగలు, పైపులు, డ్రిప్ పైపులు కాలిపోయాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వలన భూసారం తగ్గడంతో పాటు, ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రమాదానికి ఎవరైతే కారణమవుతారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్నీరే మిగిల్చిన పంటలు టేకుమట్ల: ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చి విక్రయించే సమయానికి ప్రమాదవశాత్తు అగ్గిపాలైన ఘటన టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ (టీ)లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధిత రైతు దుద్దేటి కొమురయ్య కథనం ప్రకారం.. తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరం మిర్చి పంటను సాగు చేయగా సుమారు 18 క్వింటాల మిర్చి కుప్ప పోసి విక్రయించేందుకు సిద్ధం చేశాడు. గురువారం అర్ధరాత్రి చేలరేగిన మంటలకు పంట కాలిపోయింది. అగ్నిప్రమాదంలో సుమారు మూడు లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. అలాగే మండలంలోని కుందనపల్లిలో పంట వ్యర్థాలను కాల్చేక్రమంలో ఇతర రైతుల పంట పొలాలకు వ్యాపించి పశుగ్రాసం, వ్యవసాయ మోగార్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. -
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో ప్రతీ ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని, జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశాన్ని లీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించగా సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్పాస్ట్ పథకం అమలు చేయబోతున్నమన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి భద్రత కల్పిస్తామని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విస్తరిస్తామని, దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందిస్తామన్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆలయ అభివృద్ధికి 22 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం చెల్లించామన్నారు. జిల్లాకు అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలోనే ములుగు నియోజకవర్గానికి అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, జిల్లాలో నూతనంగా 38 వేల పైచిలుకు పెన్షన్లను జూన్ 2న అందించనున్నట్లు తెలిపారు. అనంతరం సీ్త్ర నిధి ద్వారా 112 మహిళా సంఘాలకు రూ.2.25 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 175 మహిళా సంఘాలకు రూ.16.15 కోట్లు, ములుగు మున్సిపాలిటీ మెప్మా ద్వారా 25 సంఘాలకు రూ.2.2 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, డీఆర్డీఏ, రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీతక్క పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
కాంగ్రెస్ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు జిల్లాల చైర్మన్లు వీరే.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్గా ఆరూరి సాంబయ్య, వరంగల్ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్, జనగామకు చేపూరి వినోద్, మహబూబాబాద్కు తిప్పర్తి శ్రీధర్, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిలను నియమించారు. జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో?నన్న చర్చ మొదలైంది. పత్తి మిల్లు తనిఖీ మల్హర్(కాటారం): కాటారంలోని మీనాక్షి పత్తి మిల్లు, రుద్రార జిన్నింగ్ మిల్లును కాటారం ఆర్డీఓ రవీందర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మిల్లులోని రికార్డులను పరిశీలించి, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీష్ పాల్గొన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు భూపాలపల్లి రూరల్: దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 22 జయంతి వేడుకలు శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఇందిర, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వైస్చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు గణపురం: గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని కంచి కామకోటి 70వ పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం సందర్శించారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో కేటీపీపీకి వచ్చారు. కేటీపీపీ సీఈ, ఆలయ చైర్మన్ శ్రీ ప్రకాశ్ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జగద్గురులకు సీఈ దంపతులు, ఆలయ అర్చకులు, ప్రాజెక్టు అధికారులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి కంచి పీఠాధిపతి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. జగద్గురు ఆలయానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న ఉద్యోగుల కుటుంబాలు పెద్దఎత్తున స్వామి వారి దర్శనానికి తరలి వచ్చాయి. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను సూచించారు. అధికారులతో ఎమ్మెల్యే సత్యనారాయణరావు శుక్రవారం జిల్లాకేంద్రంలో సమీక్ష నిర్వహించారు. రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, హమాలీలు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు -
అంత్య పుష్కరాలు ఆరంభం
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కరశోభ వెల్లివిరిసింది. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సరస్వతినది అంత్యపుష్కరాలు ఆరంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలిపుష్కరస్నానం ఆచరించారు. తొలిరోజు ఎండ తీవ్రతతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. – భూపాలపల్లి/ కాళేశ్వరం తొలి పుష్కరస్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఎండతో తొలిరోజు భక్తుల పుష్కరస్నానాలు అంతంతే.. -
పంట పొలాల్లో చెలరేగిన మంటలు
టేకుమట్ల: పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు చెలరేగి సుమారు 40 ఎకరాల్లో మంటలు వ్యాపించిన సంఘటన మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. ఆ పంటలకు వడగాల్పులు తోడవడంతో సుమారు 40 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన ఎల్కటి పైడికి చెందిన మోటార్, పైపులు, గాజ రాజేందర్కు చెందిన విద్యుత్ వైరు, ఎల్కటి కుమార్కు చెందిన టార్ఫాలిన్ పరదాలు, గజ్జి రాజయ్యకు చెందిన రెండెకరాల వరి పంటతో పాటు, మొక్కజొన్న, వరిగడ్డి పూర్తిగా దగ్దమైనట్లు తెలిపారు. కాగా అగ్ని ప్రమాదంలో సుమారు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో కలిసి మంటలను ఆర్పివేశారు. అరటి తోట దగ్ధం.. చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామ శివారులో సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అరటి తోట కాలిపోయింది. పక్కనే ఉన్న టేకుచెట్లకు మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన సిరిపురం కుమారస్వామి నాలుగున్నర ఎకరాల్లో అరటి తోట సాగు చేస్తున్నాడు. ఈక్రమలో పంట చేలో ఉన్న విద్యుత్ తీగలు గాలికి తాకడంతో మిరుగులు ఆకులపై పడి మంటలు చెలరేగాయి. గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అరటి తోటతోపాటు పక్కనే ఉన్న ఆకుల సమ్మయ్యకు చెందిన టేకుచెట్లు కాలిపోయాయి. పంట చేతికందే సమయంలో దాదాపు రూ.8 లక్షల విలువైన అరటి తోట కాలిపోవడం, అలాగే రూ.రెండు లక్షల విలువ గల టేకుదుంగలు కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వెంకట్రావుపల్లి (సీ) గ్రామానికి చెందిన బాలవేణి వేణుకు చెందిన ఎకరన్నర మిరప తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పంట చేనులో ఉన్న 40 పైపులు, విద్యుత్ మోటారు కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు. సుమారు 1.5లక్షల నష్టం వాటిల్లిందన్నారు. గుడిపహాడ్ శివారులో.. మొగుళ్లపల్లి: మండలంలోని గుడిపహాడ్ శివారులోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు గురువారం మంటలు అంటుకున్నాయి. గాలికి మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో పంటపొలాల్లో ఉన్న పశుగ్రాసంతోపాటు వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేయడానికి రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అగ్ని మాపక వాహనానికి సమాచారం అందించినా.. వాహనం అందుబాటులో రాలేదు. వల్ల పొలాల్లో విపరీతమైన పొగ కమ్ముకుంది. స్థానికులు ఎంతో శ్రమించి మంటలు గ్రామాల్లోకి రాకుండా అదుపుచేశారు. పంట వ్యర్థాలు కాల్చే క్రమంలో ప్రమాదం టేకుమట్లలో 40 ఎకరాల్లో వ్యాపించిన వైనం పలు గ్రామాల్లో కాలిపోయిన వ్యవసాయ పనిముట్లు అగ్నికి ఆహుతి అయిన అరటి, మిర్చి తోటలు -
పుష్కరాలు ప్రారంభమైనా పనులు పూర్తి కాలే..
చిట్యాల: కాళేశ్వరంలో పన్నెండు రోజులపాటు జరిగే పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం అనేక పనులు చేపట్టారు. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గురువారం పుష్కరాలు ప్రారంభమైనప్పటికీ ఎండ తీవ్రతతో భక్తులు తక్కువగానే వచ్చారు. దీంతో సౌకర్యాలకు ఇబ్బంది కలగలేదు. కానీ, జనం ఎక్కువ వచ్చిఉండే ఇప్పటికీ కొనసాగుతున్న పనులతో ఇబ్బందిపడేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గురువారం సైతం స్టాల్ వద్ద పనులు కొనసాగుతున్నాయి. అలాగే మండుటెండలో సిబ్బంది విద్యుత్ పనులు చేశారు. స్టాల్వద్ద పుష్కరాలకు షటిల్ సర్వీసులు భూపాలపల్లి అర్బన్: మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు అధికారులు షటిల్ సర్వీసులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ పుష్కర ఘాట్ వరకు భక్తులను తరలిస్తున్నారు. జిల్లాలో వివిధ మండలాల ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. మొదటి రోజు భక్తులు అంతంత మాత్రమే రావడంతో కొద్దిమంది భక్తులను సైతం తరలించారు. -
కార్పొరేట్లో ఉచితవిద్య
భూపాలపల్లి అర్బన్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం. ఇంటర్ విద్య కోసం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో చేరాలని అందరికీ ఉంటుంది. ఇలాంటి వారి కలసాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘కార్పొరేట్ విద్య’ పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతిలో ప్రతిభ చాటిన వారు ఈ పథకం ద్వారా ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. భర్తీపై అధికారుల దృష్టి కార్పొరేట్ కళాశాల విద్యా పథకం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న వారికి ఓ వరం. రెండేళ్ల పాటు విద్యార్థులయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన లోపం, తగినంత ప్రచారం లేకపోవడంతో ఈ పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈ విద్యా సంవత్సరం కేటాయించిన సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరికే అవకాశం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలతోపాటు దివ్యాంగ విద్యార్థులు ఈ పథకంతో లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించింది. 2026– 27 విద్యా సంవత్సరానికి ఇంటర్లో చేరేందుకు ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాసంస్థల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అర్హతలు ఇలా.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ, ఎయిడెడ్, బెస్ట్ అవైలబుల్, నవోదయ పాఠశాలల్లో చదివి ఉండాలి. జీపీఏ 7.0 ఆపై సాధించిన వారు అర్హులు. దరఖాస్తు విధానం విద్యార్థులు జూన్ 5వ తేదీ వరకు http:// telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి పాస్ మెమో, కులం, ఆదాయం (రూ.2లక్షల లోపు ఉండాలి) ధ్రువీకరణ పత్రాలు మీ సేవా ద్వారా పొందినవి, బ్యాంకు పాస్బుక్, ఆధార్కార్డు నంబర్, రేషన్కార్డు నంబర్, పాస్పోర్టు సైజ్ఫొటోలు, ప్రభుత్వ షెడ్యూల్డ్ కులం వసతి గృహాల విద్యార్థులు(3) సంవత్సరాల బోనోఫైడ్ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి. ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో మూడు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. కార్పొరేట్ కళాశాల విద్యా పథకంతో పేద విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేయొచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య వసతులు వినియోగించుకోవాలి. – ఇందిర, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో టెన్త్ పూర్తి చేసుకున్నవారికి అవకాశం వచ్చే నెల 5 వరకు ప్రవేశాలకు గడువు -
చదువుకు పేదరికం అడ్డుకాదు
ఎస్ఎస్తాడ్వాయి : చదువుకు పేదరికం అడ్డుకాదని తాడ్వాయి ఎస్సై కొయ్యడ జగదీశ్ అన్నారు. కల్లు గీతకార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గండు సదయ్య, కార్యదర్శి తిర్రి సంపత్ సమక్షంలో బుధవారం పదో తరగతి, ఇంటర్లో మెరిట్ సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై జగదీశ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవి, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు పులి నర్సయ్య హాజరయ్యారు. కాటాపూర్, నార్లపూర్, వెంగ్లాపూర్, తాడ్వాయి గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులను సన్మానించి మెమోంటోలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ఎస్సై జగదీశ్ను శాలువాతో సన్మానించారు. రంగు సత్యనారాయణ, పాలకుర్తి బాబు, నర్సయ్య, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గోదాంలోకి ధాన్యం దిగుమతి
చిట్యాల : మండల కేంద్రంలోని పీఏసీఏస్ ఆధ్వర్యంలో 500 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే గోదాం నిరుపయోగంగా ఉంది. దీంతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో ‘నిరుపయోగంగా పీఏసీఏస్ గోదాం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించి న జిల్లా అధికారులు ఎట్టకేలకు గోదాంలోకి రైతులు పండించిన ధాన్యాన్ని దిగుమతి చేసేందుకు అ నుమతించారు. చిట్యాల, మొగుళ్లపల్లికి చెందిన రై తులు తమ వాహనాల్లో ధాన్యాన్ని తీసుకువచ్చి క్యూ లో పెట్టారు. అనంతరం సంబంధిత అధికారులు హమాలీలతో దిగుమతి చేయిస్తున్నారు. కాగా సాక్షి కథనానికి స్పందించిన అధికారులకు, సాక్షికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని రైతులు వేడుకున్నారు. -
మేడారంలో నార్కొటిక్స్ తనిఖీలు
ఎస్ఎస్ తాడ్వాయి : మండలంలోని మేడారంలో బుధవారం నార్లాపూర్ ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు నార్కొటిక్స్ తనిఖీ చేపట్టారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు స్నిఫర్ డాగ్తో విస్తృత తనిఖీ నిర్వహించారు. షాపులు, గోదాముల్లోని ప్రతి మూలన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. అనుమానిత సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు. -
మహిళా బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్ : పార్లమెంట్లో మహిళ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని టీపీసీసీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంగోత్ సుగుణ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా బిల్లును పార్లమెంట్లో పాస్చేయాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాగా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపల్ చైర్మన్ చంద్రకళ, మండల మహిళ అధ్యక్షురాలు గుంటోజు పావనినిరంజన్, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లెల స్వాతి, గుగ్గిల్ల దివ్య, గజ్జెల సుస్మిత, కోఆప్షన్ సభ్యులు అసియా, సుజాత, రాధిక, తదితరులు ఉన్నారు. -
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
చిట్యాల : మండలంలోని కై లాపూర్లో ఉపాధి హామీ కూలీలకు బుధవారం సర్పంచ్ కోడారి ఓదెలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి అజీరా బేగం, ఉప సర్పంచ్ చింతల లక్ష్మీసదానందం, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, మేట్ రాజు, కూలీలు పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు మల్హర్ (కాటారం) : కాళేశ్వరంలో నేటి నుంచి ప్రారంభం కానున్న సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నస్తురుపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సర్ పంతకాని తిరుమల తెలిపారు. సరస్వతి అంత్యపుష్కరాలలో పుణ్యస్నానం ఆచరిస్తే పాప పరిహారం కలుగుతుందని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. పుష్కరాల కాలమంతా ప్రతిరోజూ భక్తులకు చల్లని మినరల్ వాటర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విరమణ తప్పనిసరి భూపాలపల్లి రూరల్ : ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి అని జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ అన్నారు. జంగేడు పీఏసీఎస్లో స్టాఫ్ అసిస్టెంట్గా పనిచేసిన ఎం. భిక్షపతి పదవి విరమణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాక్స్ చైర్మన్ మేకల సంపత్, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భిక్షపతి దంపతులను శాలువాతో సత్కరించారు. అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, బ్యాంకు మేనేజర్ జీవన్, డైరెక్టర్స్ పోషయ్య, పులి వేణుగోపాల్, రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి రేగొండ : వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని రూపిరెడ్డిపల్లిలో వీఓఏల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. వీఓఏలకు పని భారం తగ్గించి, కనీస వేతనం అమలు చేయాలన్నారు. వీఓఏలు ఐక్యంగా ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు. డ్రెయినేజీల్లో పూడికతీత గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం గ్రామంలో డ్రెయినేజీలో మట్టి కూరుకుపోవడంతో సీతారాం నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సిబ్బందితో పూడికతీత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వానాకాలంలో దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. పరామర్శ ములుగు రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రోజు సత్యంచారి బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను నాలుగో వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని నిరంజన్ పరామర్శించారు. అనంతరం సత్యం మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. వ్యక్తి ఆత్మహత్య కన్నాయిగూడెం : భార్య చనిపోయిందన్న బెంగతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామ పరిధిలో గల గొత్తికోయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. గొత్తికోయగూడెనికి చెందిన మడవి జోగయ్య (45), భార్య గతేడాది పురుగుల మందు తాగి చనిపోయింది. అనంతరం భార్య లేదనే ఆలోచనతో కలత చెందిన భర్త జోగయ్య మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగయ్య కొడుకు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వేధిస్తున్న కూలీల కొరత
రేగొండ : రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వానాకాలం సీజన్లో మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. రేగొండ మండలంలోని పొనగండ్ల, రేపాక, కనిపర్తి, గూడెపల్లి, దుంపిల్లపల్లి, భాగిర్థిపేట, తిరుమలగిరి, రంగయ్యపల్లి, కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, కొత్తపల్లి, నిజాంపల్లి తదితర గ్రామాల్లో మిరప పంటను సాగు చేశారు. మండల వ్యాప్తంగా మిరపకాయలు ఒకేసారి కోతకు రావడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. వాతావరణంలో మార్పులకు ఈ ఏడాది మిరప పంటలో తెగుళ్లు, నల్లి బెడద తీవ్రంగా ఉంది. దీంతో మిరపలో తాలు శాతం పెరిగింది. ఏరిన మిరప కాయలను ఎండబెట్టిన తరువాత తాలు కాయాలు ఏరటానికి సైతం కూలీల అవసరం ఉంది. దీంతో మిరప కాయలు ఏరడంతో పాటు తాలు కాయలు వేరు చేసేందుకు కూలీల అవసరం ఉంది. ఇతర మండలాల నుంచి కూలీలు.. గ్రామాల్లో కూలీలు దొరక్క పోవడంతో శాయంపేట, ఆత్మకూరు, మల్లంపల్లి మండలాల నుంచి ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లలో కూలీలను తీసుకు వస్తున్నారు. రోజు కూలీ రూ.350తో పాటు ఆటో కిరాయి, మేసీ్త్ర మాములును కలుపుకుని దూరాన్ని బట్టి రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తున్నారు. క్వింటా ఎండు మిర్చి ఏరడానికి పది మంది పైగా కూలీలు అవసరం అవుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం, ఎస్సారెస్పీ కాల్వలకు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తుండటంతో మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. డీబీఎం–38 కాల్వ ద్వారా సాగునీరు రావడంతో చాలా గ్రామాల్లో యాసంగి వరినాట్లు ముమ్మరంగా వేశారు. అలాగే మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. దీంతో కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. అధిక ఖర్చుపై రైతుల ఆవేదన ఇతర మండలాల నుంచి మిరప కోతలకు కూలీలు -
భక్తులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
● దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ కాళేశ్వరం : కాళేశ్వరంలో నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజులపాటు కొనసాగే శ్రీసరస్వతి అంత్య పుష్కరాలుశ్రీ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి సరస్వతి ఘాట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న గోదావరి తీరం, మ్యూజియం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో జరిగే ఈ పుష్కర స్నానాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. అంత్య పుష్కరాల మొదటి రోజైన నేడు కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వచ్చి పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరించి ఈ వేడుకలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారని తెలిపారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు వసతి, తాగునీరు, ఘాట్ల వద్ద రక్షణ చర్యలతోపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతీ రోజు సాయంత్రం కాశీ పండితులచే సరస్వతి నది హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. -
అటవీశాఖ అధికారుల విచారణ
మహాముత్తారం : మండలంలోని నిమ్మగూడెం, యత్నారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన జంతువును కాల్చివేశారు. ఈ సంఘటనపై ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ జోగేందర్తోపాటు ఎఫ్డీఓ సందీప్రెడ్డి బుధవారం సంఘటన స్థలానికి చేరుకొని మహాముత్తారం పశు వైద్యాధికారి భరత్తో కలిసి కాల్చివేసిన జంతువు కళేబారం నమూనాను సేకరించి ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. నిర్ధారణ అనంతరం తదుపరి విచారణ చేయనున్నట్లు చెప్పారు. ఈ ఘటన ఆధారంగా యత్నారం గ్రామంలో కొంతమంది అనుమానితులను ప్రశ్నించగా గ్రామానికి చెందిన కోడి మాంతయ్య ఇంట్లో ఉచ్చుకు వినియోగించే విద్యుత్ తీగలు దొరికినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన పుల్యాల నగేష్, రాజు, కాసిపేట కృష్టస్వామితో వెళ్లినట్లు మంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్చిన జంతువు అటవీ జంతువా లేక గ్రామాల్లో తిరిగే జంతువా అని చెప్పలేమని తెలిపారు. నివేదిక తర్వాతనే నిర్ధారణ చేస్తామని ఎఫ్డీఓ వివరించారు. -
ఆగని అక్రమ వసూళ్లు
టేకుమట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు ఆయా కొనుగోలు కేంద్రాల్లోని ఇన్చార్జ్లకు వరంగా మారుతోంది. ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తుండడంతో కాంటా కాకపోవడఽంతో పాటు, గోదాములు లేక హమాలీల కొరతతో రైతులకు నరకప్రాయంగా మారింది. ఉదయం 8 గంటలకే తట్టుకోలేని ఎండలో కొనుగోలు కేంద్రాలకు చేరుకుని కాంటాల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో ఆన్లైన్ కావాలన్నా, కాంటాలు కావాలంటే రైతులు తప్పని సరిగా కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లకు ముడుపులు చెల్లించాల్సిందే. కాదంటే మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో పాటు, రైతులు ఉండాల్సిందే. మండలంలోని రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, ఎంపేడు, కుందనపల్లి, వెంకట్రావుపల్లి, రామకిష్టాపూర్(వి), గర్మిళ్లపల్లి, పంగిడిపల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. అందరికీ వాటాలున్నాయా..? మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు సెంటర్ ఇన్చార్జీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై స్థాయి అధికారులకు సైతం వాటాలు ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే వసూళ్ల దందా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై అధి కారులు పెదవి విప్పకపోవడంతో వాటాల వారీగా రైతులను పీల్చుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా డబ్బులు వసూళ్లను నిలిపివేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు. రైతుల కష్టాలను ఆసరా చేసుకుంటున్న సెంటర్ ఇన్చార్జ్లు కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా వసూళ్ల పర్వం పట్టించుకోని అధికారులు -
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
మహాముత్తారం : లారీల ఆలస్యంతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు బుధవారం మండలంలోని బోర్లగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో కులసంఘాల జేఏసీ కన్వీనర్ అజ్మీరా పూల్సింగ్, రైతులు ఠాకూర్ లక్ష్మణ్, వెంకట్రాజం, బానోత్ దేవుసింగ్, ఠాకూర్ రవి, మొగిలి రమేష్, సూరెడ్డి నర్సింహరెడ్డి, పొనగంటి రాములు, శ్రీధర్, సింగనవేని తిరుపతి, లావుడ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వజినేపల్లి, కోనంపేట, యామన్పల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆరోపించారు. రోజుల తరబడి కలాల్లో వడ్లు ఉండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీల్లో తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బోర్లగూడెం సర్పంచ్ అజ్మీరా ధరమ్సింగ్, పోలారం సర్పంచ్ అంబాల రాజబాపు, మహాముత్తారం మాజీ ఎంపీటీసీ శ్రీపతి సురేష్, నాయకులు గంట కొండాల్ రెడ్డి, జంగిడి శ్రీనివాస్, అరుణ, వేణుగోపాల్రెడ్డి, రమేష్, శంకర్ తొ పాటు తదితరులు ఉన్నారు. -
కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
భూపాలపల్లి అర్బన్ : ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో నిర్వహిస్తున్న ఇండియా మైన్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎండబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభల్లో భూపాలపల్లి ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఆసిఫ్ పాషా, కరీముల్లా, అహ్మద్ఖాన్, శ్రీనివాస్, శ్రీనివాస్ హాజరయ్యారు. మహాసభలో గని కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, సింగరేణి భవిష్యత్, ప్రైవేటీకరణ, లేబర్ కోడ్స్ వ్యతిరేక పోరాటాలు, కార్మిక సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వారు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. -
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు. మరీ ఒక సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు? ఎలా భర్తీ చేస్తారు. జీఓలో వయోపరిమితి కాలాన్ని మరో ఏడాది పెంచడంతో పాటు జాబ్ క్యాలెండర్ను వెంటనే అమలు చేస్తే మరింత ఆనందం. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. – శ్రీరామోజు సురేందర్, నిరుద్యోగి, మహబూబాబాద్ -
గణపురంలో హెరిటేజ్ వాక్, మాక్ పార్లమెంట్
గణపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం గణపురం మండలకేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అనంతరం జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రం చౌరస్తా నుంచి కోటగుళ్ల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో గణపురం ఉప్పసర్పంచ్ ఓరుగంటి కృష్ణ, ఆర్కియాలజీ డైరెక్టర్ బుజ్జీ, సీనియర్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు మాడిశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు కాళేశ్వరం : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారం, అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ఈ కంట్రోల్ రూమ్కు 90306 32608 నంబర్ కేటాయించినట్లు తెలిపారు. భక్తులు ఏవైనా సమస్యలు, సూచనలు లేదా సహాయం అవసరమైతే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. కొనసాగుతున్న మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు భూపాలపల్లి అర్బన్: ఏరియాలో సింగరేణి గనుల్లో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేటీకే 1వ గనిలో బుధవారం మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏరియా ఎస్ఓ టు జీఎం ఎస్.కవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతోపాటు భద్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఖర్చులను తగ్గిస్తూ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు జోతి, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, శ్యాంసుందర్, ప్రవీణ్విక్రమ్, కిశోర్, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు నజీర్, తదితరులు పాల్గొన్నారు. పూసుకుపండ్లకు భలే డిమాండ్ ఏటూరునాగారం: అభయారణ్యంలో సహజసిద్ధంగా లభించే పూసుకుపండ్లలో సీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అలాంటి పండ్లు మండల కేంద్రంలో గొత్తికోయలు బుధవారం కిలో రూ.20ల చొప్పున విక్రయించారు. వాటిని ఏటూరునాగారం ప్రాంత ప్రజలే కాకుండా వరంగల్ నుంచి వచ్చిన వారు సైతం విరివిగా కొనుగోలు చేశారు. ఇలాంటి పండ్లను పట్టణ ప్రాంతాల ప్రజలు చూసి ఉండరు. కేవలం 30 నిమిషాల్లోనే పండ్లను విక్రయించినట్లు గొత్తికోయ గిరిజనులు తెలిపారు. మేలైన వరి వంగడాలను విత్తుకోవాలి ఏటూరునాగారం: మేలైన వరి వంగడాలను విత్తుకోవాలని వరంగల్ శాస్త్రవేత్తలు శేషు, మధు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వరిసాగు పద్ధతులపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన మేలైన వరి రకాలైన కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 1508, సాంబమసూరి, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 118 వేసుకోవడం వల్ల పురుగులు, తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయన్నారు. రైతులు తమ పొలంలో పండించిన రకాలను జాగ్రత్తలు పాటించి విత్తనాలుగా రెండు, మూడు సంవత్సరాల వరకు విత్తనంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. అలాగే విత్తనాల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. వరిసాగు పద్ధతుల్లో మెలకువలు పాటించాలన్నారు. పంట మార్పిడి, సేంద్రియ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. వరి పంట వేసుకునే ముందు ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట పంటలను వేసుకొని పూత దశలో భూమిలో కలియదున్నాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఆత్మ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ యూనివర్సిటీ నుంచి విడుదలైన మేలైన వరి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. -
పుష్కరాల్లో పటిష్ట భద్రత
మాట్లాడుతున్న ఎస్పీ సంకీర్త్ హాజరైన పోలీస్ అధికారులు, సిబ్బంది కాళేశ్వరం : నేటి నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున భక్తులకు అసౌకర్యం కలుగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లపై వివరించారు. ముందుగా ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల వద్ద భద్రత, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్ భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, పరిశీలించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. పుష్కరాల్లో తప్పిపోయిన వారి సహాయక కేంద్రాలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇతర అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పుష్కరాల విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీఎస్ టీమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖకు సహకరించి సూచనలు పాటిస్తూ పుష్కరాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ సంకీర్త్ కోరారు. ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్ -
సాగుకు సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. నేల స్వభావం ఆధా రంగా అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ సూచి స్తోంది. జిల్లా రైతులు అధిక శాతం వర్షాధార పంటలపై ఆధారపడుతుండగా.. ఏటా వానాకాలంలో వరి, పత్తి, కంది, యాసంగిలో బోరుబావుల కింద వరి, వేరుశనగతోపాటు మొక్కజొన్న సాగుకు ప్రా ధాన్యం ఇస్తారు. ఈ ఏడాది వానాకాలంలో సాగు కానున్న పంట వివరాలు, అవసరమైన ఎరువులు, విత్తనాలతో సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు పర్యవేక్షణలో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు సిద్ధం చేశారు. ఎక్కువ మంది రైతులు పత్తి, వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి నివేదించారు. సాగుపై అధికారులు అంచనా.. జిల్లాలో 2,16,734 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా.. 10,500 మెట్రిక్ టన్నుల యూరియా, 5,544 టన్నుల డీఏపీ, 5,544టన్నుల కాంప్లెక్స్ ఎరువులతోపాటు 2,772 టన్నుల పొటా ష్ అవసరమని అధికారులు అంచనాలు వేశారు. వరి, పత్తి సాగుకు సరిపోయేవిధంగా, అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. మెదటగా జీలుగ, జనుము విత్తనాలు సిద్ధం చేశారు. రైతులు తొలకరి వర్షాలకోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కువ మంది రైతులు రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తేందుకు ఆసక్తి కనబరుస్తారు. గత రెండు సంవత్సరాలుగా అకాల వర్షాలు, గులాబీ తెగులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి పత్తి, మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆయా పంటల సాగుకే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదేవిధంగా వరి సాగుకు సైతం ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులకు అవగాహన సదస్సులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాగు, పంటల మార్పడి, అధిక దిగుబడి, ఎరువుల వాడకం తదితర అంశాలపై రైతులకు వివరిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. జిల్లాలో రైతులు వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటాం. పచ్చరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే కొనుగోలు చేయాలి. విత్తనాల కొనుగోలు బిల్లులు పంటలు చేతికొచ్చే వరకు రైతులు దాచిపెట్టాలి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి పంట గతేడాది ఈఏడాది అంచనా వరి 95,653 1,09,854 పత్తి 98,280 1,06,560 కందులు 38 120 పెసర 78 110 బబ్బెర్లు 45 90 మొత్తం 1,94,094 2,16,734 ఎరువులు 24,360 మెట్రిక్ టన్నులు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉండేలా వ్యవసాయాధికారుల చర్యలు -
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
చిట్యాల/గణపురం/భూపాలపల్లి రూరల్: ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ సందర్బంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్తో కలిసి చిట్యాల మండలంలోని కై లాపూర్ శివారులోని మహావీర్, శ్రీవెంకటేశ్వర రైస్ మిల్లు, గణపురం మండలంలోని లక్ష్మీగణపతి రైస్మిల్లు, వెంకటేశ్వర ఇండస్ట్రీస్, భూపాలపల్లి మండలం గొర్లవేడులోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలని అసల్యం ఎందుకు జరుగుతుందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించొద్దన్నారు. దీనిపై జిల్లా అధికారుల పర్యవేక్షణ పెంచాలన్నారు. వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని దిగుమతిని వేగవంతం చేయాలని మిల్లర్ల యాజమానులకు సూచించారు. ధాన్యం కొనుగోలులో గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు దోపిడీకి గురయ్యారని అది ఇప్పుడు పునరావృతం కాకుండ చూడాలన్నారు. ప్రతి ధాన్యం గింజ కాంటా అయ్యే వరకు రైతుల వెంట ఉంటామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఏం రాములు, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్ వసంతరావు, ఆర్ఐ రాజేందర్, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, తిరుపతి ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి లక్ష్యం నెరవేరాలంటే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది..ఇంకా జాప్యం చేయొద్దు. –మనుబోతుల మల్లయ్య, ఎంఎస్సీ, బీఈడీ, నెక్కొండ -
ఉద్యమకారుల కమిటీకి కాలపరిమితి విధించాలి
దామెర : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేశవరావు కమిటీకి కాలపరిమితి విధించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా, కాలపరిమితి విధించి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఉద్యమ సమయంలో కేసులు లేకున్నా వారుచేసిన పోరాటం ప్రతిబంభించే ఫొటోలు, పేపర్ క్లిప్పింగులు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరి న్యాయం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు పొలెపాక ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి గోవిందు అశోక్, ఉద్యమకారులు దామెర కుమారస్వామి, కిన్నెర రమేశ్, ఇటికాల బాబురావు, కుంటమల్ల రాజు, మన్నెం ఇంద్రారెడ్డి, విజేందర్రెడ్డి, ఓయూ విద్యార్థి మాలతితో పాటు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రేగొండ: ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం కొడవటంచలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు -
రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లుగా నిర్దేశించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ వెల్లడించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావులో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా విస్తృత స్థాయిలో రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు బీమా, ఉపాధి హామీ పథకం తదిత ర నిధులు నిలుపుదల చేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులను ఆపకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని సూచించారు. పంట రుణాలు బాకీ ఉన్న రైతుల జాబితా ఇస్తే అవగాహన కల్పించి రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్సాయి, నాబార్డ్ డీడీఎం టీసీ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీఆర్డీఓ బాలకృష్ణ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, మెప్మా పీడీ రాజేశ్వరి పాల్గొన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు చిట్యాల/గణపురం: ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం చిట్యాల మండలం కై లాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహా రైస్మిల్లు, గణపురం మండలకేంద్రంలోని జానికరామ్ రైస్ మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మిల్లు యాజమానులు వరి ధాన్యంలో తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లు యాజమానులు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని ఎక్కువగా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఏం రాములు, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి కలెక్టర్ రాహుల్ శర్మ -
కూలీలకు హాజరు కష్టాలు
టేకుమట్ల: ప్రభుత్వాలు పల్లెల్లో వలసలను నివారించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. గత సంవత్సరం వరకు ఉపాధి కూలీల హాజరు నమోదును మ్యానువల్గా ఉండగా ఉపాధిలో అవకతవకలు జరుగుతున్నాయనే కారణంతో ప్రభుత్వాలు ఉపాధి పథకాన్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ నమోదు చేశాయి. ఉపాధి కూలీల హాజరు నుంచి చేయాల్సిన పనులు, పని ప్రదేశం, పని దినములు వంటి అంశాలన్ని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దాంతో ఉపాధి హామీ పథకం మొత్తం ఆన్లైన్లో నిక్షిప్తం అవుతోంది. ఉపాధి కూలీలకు తిప్పలు గతంలో ఉపాధి కూలీలు నేరుగా పని ప్రదేశానికి చేరుకుని పని చేసి తిరిగి ఇంటికి వచ్చే వారు. కూలీలు పని చేస్తున్న సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ హాజరును నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం ఉపాధి కూలీలు పనికి వెళ్లే ముందు ఎన్ఆర్ఈజీఏ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్లో తప్పని సరిగా క్యాప్చర్ మస్టర్ రోల్లో ఉదయం, మధ్యాహ్నం హాజరు నమోదు చేయాలి. హాజరు నమోదు ప్రక్రియలో ఐరిస్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంది కూలీల కళ్లు నమోదు కాకపోవడంతో వెనుతిరిగి వెళ్తున్నారు. మరికొంత మంది కూలీలకు ఈ కేవైసీ చేయడంతో హాజరు నమోదుకు సమస్య లేకుండా పోతుంది. మరికొంత మంది కూలీలకు ఆధార్ అప్డేట్ చేసినా క్యాప్చర్ మస్టర్ రోల్లో హాజరు అనుమతించకపోవడంతో పని ప్రదేశానికి వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. ఇప్పటి వరకు మండలంలోని 25 గ్రామాలలో ఐరిష్ సమస్యతో ఎంతో మంది కూలీలు ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. ఇప్పటికై నా అధికారులు ఐరిష్ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని చూపిస్తే మరెంతో మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని పలువురు కోరుతున్నారు. మస్టర్లో పేరున్నా ఐరిస్ రాని వైనం ఖాళీగా ఉంటున్న ఉపాధిహామీ కూలీలు -
గుడుంబా పట్టివేత
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తీగల రమ అక్రమంగా 10లీటర్ల గుడుంబాను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పోలీసులు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తీగల రమ గుడుంబాను పట్టుకుని అమ్ముకునేందుకు వెళ్తుతుండగా పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకుని ఆమైపె కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఎవరైనా గుడుంబా అమ్మినా, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య గణపురం: మండలకేంద్రానికి చెందిన జక్కు వినయ్ (25) ఆరోగ్యం సహకరించడం లేదని మనస్తాపానికి గురై పరుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన జక్కున వినయ్ కొంత కాలంగా కిడ్నీల సంబంధిత వ్యాధితో ఎన్ని ఆస్పత్రులకు పోయిన నయం కావడం లేదు. దీంతో మనస్థాపంతో సోమవారం రాత్రి పరుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి జక్కు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 11 వార్డులోని నివాసం ఉంటున్న ఆగమ్మ (85) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారంలో అనారోగ్య కారణంగా 65 సంవత్సరాల గుర్తు తెలియని యాచకుడు ఈనెల 18న మృతి చెందినట్లు నార్లాపూర్పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం ఫ్రిజర్లో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి బంధువులు, రక్త సంబంఽధీకులుగానీ మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్కు రావాలన్నారు. యాచకుడి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 87126 30132 నంబర్ను సంప్రదించాలన్నారు. -
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
● టీజీఏ అధ్యక్షుడు, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఖిలా వరంగల్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలు వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల రాష్ట్ర టీజీఏ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, ఉద్యమ నాయకులు అచ్చవిద్యాసాగర్, జేఏసీ కన్వీనర్ దిడ్డి నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ కరీమాబాద్లోని చట్లోళ్ల గడ్డ వద్ద వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్లి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేశవరావును చైర్మన్గా నియమించడం అధికార పార్టీకి వత్తాసు పలకడమేనన్నారు. అర్హత కలిగిన ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నప్పటికీ కేశవరావునే నియమించడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఉద్యమకారుకిచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నార్లగిరి రమేశ్, నహీం, నర్సింగం, సాంబయ్య, రమేశ్, అబ్దుల్పాషా, శంకేసి లింగమూర్తి, రాజశేఖర్, ఎల్లయ్య, దిండిగాల సోమేశ్వర్, పరదేశి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
రేగొండ: పోగొట్టుకున్న సెల్ఫోన్ను గుర్తించి బాధితుడికి ఎస్సై సుధాకర్ మంగళవారం అందజేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన రాజు పరకాలకు వెళ్తుండగా ఫోన్ ఎక్కడో పడేసుకున్నాడు. ఈమేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు వివరాలు నమోదు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ గుర్తించి బాధితుడికి అందించారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని, ఈ పోర్టల్ ద్వారా ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్సై సూచించారు. -
మహిళలు, బాలికల రక్షణకే షీటీంలు
దామెర : మహిళలు, బాలిక రక్షణకే షీటీంలు పని చేస్తున్నట్లు షీటీం ఎస్సై స్వాతి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్నేహ సమ్మర్ క్యాలెండర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. పోకిరీల వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను షీటీంలకు తెలుపాలన్నారు. అదే విధంగా ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియాలో చేస్తున్న స్నేహంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేశ్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. షీటీం ఎస్సై స్వాతి -
పటిష్ట బందోబస్తు
భూపాలపల్లి: మూడు రాష్ట్రాల సరిహద్దులోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు ముందస్తు ఏర్పా ట్లు చేశాం. గతంలో జరిగిన పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వన్ వే ఏర్పాటు చేశాం. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఏఐ డ్రోన్ను సైతం వినియోగించబోతున్నాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా, వారి భద్రతే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. అంత్య పుష్కరాల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఎస్పీ సాక్షికి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పుష్కరాల సందర్భంగా ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వాడుతాం. ఏఐ డ్రోన్ను వినియోగించి కాళేశ్వరం పోలీస్స్టేషన్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యవేక్షిస్తాం. వాహనాలు, భక్తుల సంఖ్యను సైతం ఏఐ డ్రోన్ లెక్కిస్తుంది. తద్వారా భక్తుల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యను ముందుగానే గమనించి పరిష్కరించవచ్చు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న సీసీ కెమరాలు కాకుండా మరో 150 కెమెరాలను బిగించాం. కమాండ్ కంట్రోల్ రూంను కాళేశ్వరం ఠాణాలో ఏర్పాటు చేశాం. పుష్కర ఘాట్, దేవాలయ పరిసరాల్లో మరో మూడు డ్రోన్లతో నిత్య పర్యవేక్షణ ఉంటుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు వన్ వే ఏర్పాటు చేశాం. పెద్దపల్లి జిల్లా మంథని తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్ నుంచి అన్నారం, మద్దులపల్లి మీదుగా, హనుమకొండ, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు కాటారం మండలం బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా గంగారం ఎక్స్రోడ్, అన్నారం మీదుగా కాళేశ్వరానికి చేరుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మీదుగా కాటారం చేరుకున్నాక హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్కు సమస్య తలెత్తకుండా కాళేశ్వరానికి మూడు వైపులా సుమారు 250 ఎకరాల్లో 23 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఎన్ని వాహనాలు వచ్చినా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. పుష్కరాల సందర్భంగా సుమారు వేయి మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. నాతో పాటు అదనపు ఎస్పీ, 12మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మందికి పైగా ఎస్సైలు, మరో 900 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అంచనాకు మించి భక్తుల సంఖ్య పెరిగితే పోలీసు సిబ్బందిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏఐ డ్రోన్తో పర్యవేక్షిస్తాం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేశాం వన్ వేకు వాహనదారులు సహకరించాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్యాబోధనతో పాటు కార్పొరేట్ స్థాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతీ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదు అందిస్తున్నామన్నారు. బాలికల ఆత్మరక్షణకోసం కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్రెడ్డి, సర్పంచ్ చాట్ల విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ -
సింగరేణి సంరక్షణే టీబీజీకేఎస్ లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మిక హక్కులను రక్షిస్తూ సంస్థను సంరక్షించడమే తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీబీజీకేఎస్) లక్ష్యమని ఆ సంఘం వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని కాకతీయ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిస్థితి దయనీయంగా మారిందని, సంస్థ ప్రైవేటీకరణ అంచున ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో సింగరేణి అప్పుల ఊబిలోకి వెళ్లిందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మండ సంపత్, లక్ష్మణ్, రాకేష్ రెడ్డి, అనిల్, సాంబయ్య, కిషన్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ములుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావును ఆయన కలిశారు. జిల్లాలో రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మచైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా నాయకులు ఓరుగంటి అనిల్, మట్టెవాడ తిరుపతి, మాదారపు రాజు పాల్గొన్నారు.తవ్వకాల్లో బయటపడిన రాళ్ల పరిశీలనములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం తవ్వకాల్లో బయటపడిన రాళ్లను మంగళవారం పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ ఎస్ఎస్ రంగాచార్యులు, డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయానికి సంబంధించిన రాళ్లుగా అనుమానించారు. రాళ్ల కొలతలను తీసుకుని శాసీ్త్రయ పద్ధతిలో ఆధారాలు సేకరించారు. శిల్పం, గుడి ఆనవాళ్లు, గుడి ఆకారం బయటపడలేదని, గుడికి సంబంధించిన ఇటుకలు సైతం కనిపించలేదని తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి పురావస్తు శాఖకు అందించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ షురూ ● అన్ని సబ్జెక్టులు కలిపి 88,512 జవాబుపత్రాలు విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించారు. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు (అధ్యాపకులు) 49 మంది వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాకు హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంగా ఉంది. అన్ని సబ్జెక్టులు కలిపి ఈ క్యాంపునకు 88,512 జవాబుపత్రాలు కేటాయించారు. మొదటిదశలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబుపత్రాలు మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పేపర్ 2 జవాబు పత్రాల వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ ఎ.గోపాల్, ఏసీఓ జనరల్–1 శ్రీనివాస్రావు తెలిపారు.రెండో దశలో ఫిజిక్స్, ఎకనామిక్స్, బాటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల పేపర్–1, పేపర్–2 పరీక్షల జవాబు పత్రాల వాల్యుయేషన్ ఈనెల 24 నుంచి నిర్వహించనున్నారు. -
ఎండలోనే ప్రయాణికులు
కన్నాయిగూడెం: మండలంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం ఎండలోనే నిరీక్షిస్తున్నారు. మండలం నుంచి వందల వాహనాలు, వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే జిల్లా కేంద్రం నుంచి పలిమెల, మహదేవపూర్, మహాముత్తారం, కాళేశ్వరం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఏటూరునాగారం, ములుగు, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు రవాణా సాగిస్తుంటారు. కానీ మండలంలో ఇప్పటి వరకూ బస్టాండ్, బస్ సెల్టర్లు లేక ప్రధాన రహదారి వెంట ఉన్న ఎండలో ఉండి బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించాల్సిన పరిస్థితి. అలాగే తాగు నీరు, నీడా లేక ఎండలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బస్ షెల్టర్ లేకపోవడంతో బస్సుల కోసం చూస్తున్న ప్రయాణికులు ఎండకు తట్టుకోలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై న అధికారులు మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించాలిన స్థానికులు కోరుతున్నారు. బస్షెల్టర్ లేక అవస్థలు పట్టించుకోని అధికారులు బస్ షెల్టర్ లేక మండలంలోని ప్రయాణికులు గంటల కొద్ది ఎండల్లోనే నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో, లక్ష్మీపురం వద్ద బస్ షెల్టర్లు నిర్మించాలి. అలాగే తాగు నీరు ఇతర సౌకర్యాలు కల్పించాలి. – రాజుకుమార్, యువకుడు, బుట్టాయిగూడెం -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని 5 ,6వ వార్డులలోని లోఓల్టేజీ సమస్యను స్థానికులు మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్ గుగ్గిల్ల దివ్య దృష్టికి తీసుకవెళ్లారు. వారు స్పందించి ములుగు ట్రాన్స్కో ఎస్ఈ భిక్షపతి దృష్టికి సమస్యను తీసుకవెళ్లగా ఎస్ఈ వెంటనే స్పందించి లోఓల్టేజీ సమస్యను తీర్చేందుకు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రవి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఏటూరునాగారం: మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మంగళవారం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఆధ్వర్యంలో జన జాతీయ గరిమ్ ఉత్సవ్ 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఓ లెనిన్ వత్సల్ టొప్పో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హెల్త్ స్క్రీనింగ్, యాక్టివిటీ క్యాంప్, షీటీమ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొక్కలను నాటారు. మొక్కలను ప్రతిఒక్కరూ నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ నాగోరావు, జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ డాక్టర్ జగదీశ్, స్టాటిస్టికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్కుమార్, సీహెచ్సీ సూపరింటెండెంట్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల ఆలస్యంపై కలెక్టర్ ఫైర్
కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల పనుల్లో భాగంగా మ్యూజియం నిర్మాణ పనులు పూర్తికాకపోవడంపై కలెక్టర్ రాహుల్శర్మ అధికారులపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ, మ్యూజియం తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, మిగిలిన పనులను బుధవారం వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. మ్యూజియం పనులు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం చేయాలన్నారు. పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంత కుమారి, డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్డీఓ రవీందర్, దేవస్థానం ఈఓ మహేష్, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సరస్వతి ఘాట్, గోదావరి నది ఒడ్డు, టెంట్ సిటీ పరిశీలన -
మల్లూరుగుట్టపై మంటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై మంటలను నివారించేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గుట్టపై తరచుగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. అడవిలో కార్చిచ్చు సుమారు 30 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న మల్లూరు గుట్టలపై వందల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. గుట్టచుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో మండు వేసవిలో సైతం తోగుల్లో ఊటనీరు, సహజసిద్ధమైన జలదారలు ఉండటంతో వివిధ రకాల వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వేసవి కాలంలో కార్చిచ్చు, పోడు నరికే వారు అడవికి వచ్చి నిప్పు పెట్టడంతో అడవి తరచుగా దగ్ధమవుతోంది. దీంతో అడవి తగలబడటంతో పాటు కొన్ని వన్యప్రాణులు సైతం వేడికి తాళలేక సమీప గ్రామాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అటవీశాఖ అధికారులు తమకేమీ సంబంధం లేదనే విధంగా వ్యవహరించడం గమనార్హం. మూడు రోజులుగా.. మూడు రోజుల నుంచి మల్లూరులోని హేమాచల క్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు వెంట ఉన్న అటవి ప్రాంతం దగ్ధం అవుతోంది. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు మంటలను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఇటీవల ఇదే ప్రాంతంలో రిజర్వు పారెస్టు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రెంచ్ను పూడ్చి రోడ్డు పనులకు గుట్టను తవ్వి టిప్పర్లతో మొరం తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టించుకోని అధికారులు దగ్ధమవుతున్న విలువైన అటవీ సంపద -
పోస్టర్ ఆవిష్కరణ
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్ను తహసీల్దార్ సునీత మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంద సాంబయ్య, డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి మహాముత్తారం: రాష్ట్రంలో సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల స్థలంలో పాటు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని లంబాడిహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో మూడవస్థానం కలిగిన లంబాడ జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడే తమ ఇంటి ఇలవేల్పు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్లో చేరిక మహాముత్తారం: మండల కేంద్రానికి చెందిన సినియర్ బీఆర్ఎస్ నాయకుడు రామచంద్రం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొంగొర్ల బాపు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాటి లచ్చయ్యగౌడ్ ఉన్నారు. ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలోని జీడివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. మంగపేటకు చెందిన సోడి సమ్మక్క అనే మహిళ శుభకార్యానికి ఏటూరునాగారం వచ్చి మంగపేట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో టీఎంటీ పర్వతాల రాజ్కుమార్, పైలెట్ భరత్ సహాయంతో బాధితురాలిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగపేట: మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ఇసుక లారీల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు జరుగకుండా ఉండే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. జిల్లా సరిహద్దు నుంచి కమలాపురం వరకు సుమారు 22 కిలోమీటర్ల దూరం వరకు 11 గ్రాపంచాయతీల పరిధిలోని గ్రామాల మద్య నుంచి ప్రధాన రహాదారి ఉంది. రోడ్డుపై నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు అతి వేగంగా ఒకదాని వెంట మరోటి రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా గ్రామాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’
వెంకటాపురం(కె): ఆదివాసీలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహామూర్తి, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గిరిజనేతరులను ఏజెన్సీ నుంచి పంపించాలని కోరుతూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిపై బైటాయించి ఽఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నర్సింహామూర్తి, సాయిలు మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన రాంబాబుపై దాడి చేసిన గిరిజనేతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎంపీడీఓ జుమ్మిలాల్, తహసీల్దార్ వేణుగోపాల్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుంజా మహేష్, పూనెం ప్రతాప్, నాగరాజు, వాసం నారాయణ, బాబు, శివ, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
మొగుళ్లపల్లి: మండలంలోని ఇస్సిపేట సర్పంచ్ యార ముకుందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బత్తిని శ్రీధర్ గౌడ్, లక్కమారి కాపు సంఘం గ్రామ అధ్యక్షుడు పెంతల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోజంతా ఎండలో పనిచేయకుండా ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసి సాధారణ జీవనం గడుపుతున్న కూలీలకు ఉపాధిహామీ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఎండ తీవ్రత బాగా ఉన్నందున కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మాధవి, ఈసీ రాము, టీఏ శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి సునీల్, సీనియర్ మేట్ అజయ్ పాల్గొన్నారు.ఎస్ఎస్తాడ్వాయి: మేడారం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు సర్పంచ్ పిరీళ్ల భారతి మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్యం దెబ్బతిన్నకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలు ఉదయమే పనులు పూర్తి చేసుకుని ఉదయం 9గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలకుంట వనిత, పంచాయతీ కార్యదర్శి శరత్ ఉన్నారు. -
సింగరేణి అభివృద్ధికి సమష్టి కృషి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం కేటీకే 5వ గనిలో నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్యం, విద్య, భద్రత అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ భూగర్భ గనుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి -
ఆలయంపై అధికారుల చిన్నచూపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంపై మండల రెవెన్యూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని తుడుందెబ్బ మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో ఆదివాసీ నాయకులతో కలిసి మాట్లాడారు. మండల రెవెన్యూ అధి కారులకు సమ్మక్క సారలమ్మ ఆలయంపై, ఆదివాసీ ఆచార వ్యవహారాలపై భక్తి శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. జాతరపై అవగాహన లేని అధికారులను నియమించడం వల్ల జాతర నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు. మేడారంలో ఆదివాసీలకు సంబంధించిన భూముల విషయంలో తరతరాలకు నివసిస్తున్న వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు జనార్దన్, సిద్దబోయిన రవి, అర్జున్ కోరం ప్రేమ్, యాదగిరి, యాలం రాంబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఉపాధ్యాయులనే నియమించాలి
మహాముత్తారం: ఇన్చార్జ్ ఎంఈఓగా మండలంలో స్థానికంగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకే కేటాయించాలని మండల ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు రామగిరి రాజు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో విలేకర్ల సమావేవంలో ఆయన మాట్లాడుతూ మండలంలో సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికి వారిని నియమించకుండా విద్యాశాఖ అధికారులు స్థానికేతరులను నియమించారని ఆరోపించారు. ఇప్పటికై నా మండలంలో పలు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టిని పరిగణంలోకి తీసుకొని స్థానికులకు కేటాయించాలని అధికారులను కోరారు. ఏఐఏవైఎస్ మండల అధ్యక్షుడు రామగిరి రాజు, ప్రజాసంఘాల నాయకులు పీక కిరణ్, పుల్యాల సురేశ్, చిర్ర మల్లేశ్ పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: క్రీడలు యువతలో మానసికోల్లాసాన్ని పెంపొందించడంతోపాటు శారీరక దృఢత్వాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భగా హనుమాన్ దేవాలయం నుంచి అంబేడ్కర్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు హాజరై మాట్లాడారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వం పెంపొందుతాయన్నారు. యువత ప్రతీ రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ యువత ప్రతిభను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అంబేడ్కర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ క్యాంపు ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. రైతులకు కోతలు లేకుండా కొనుగోళ్లు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి రఘు పాల్గొన్నారు. -
పుష్కరాలకు కాళేశ్వరం ముస్తాబు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు కాళేశ్వరాలయంతో పాటు పరిసరాలు ముస్తాబవుతున్నాయి. సోమవారం రాత్రి కాళేశ్వరం ఆలయ ప్రధాన ఆలయంతో పాటు శ్రీశుభానందదేవి, సరస్వతీఅమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రకారాలకు రంగరంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. దీంతో ఆలయం జిగేల్మంటుంది. ఏర్పాట్లు ఇలా.. కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్లు, షామియానాలు, చలువ పందిర్లు వేశారు. ప్రసాద కౌంటర్లకు క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. మెట్ల మార్గం నుంచి తోరణాలు ఏర్పాటు చేశారు. వంద గదుల వద్ద భారీ డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరడానికి శ్రీరాజరాజేశ్వర వసతి గృహం వద్ద షామియానాలు వేశారు. ఆలయం, ఘాటు వద్ద ఏర్పాటు చేశారు. గ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్.. 12 రోజుల పాటు నిరంతర విద్యుత్ ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ ఎస్ఈ భిక్షపతి తెలిపారు. పుష్కరాల కోసం ప్రత్యేకంగా 490 స్తంభాలు 16 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్ వేశామని తెలిపారు. 12 ట్రాన్స్ఫర్మర్లు, 23 పార్కింగ్ ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డీఈ నాగరాజు, ఏడీఈ రమేష్ తదితరులు ఉన్నారు. -
వైద్యసేవలు
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026అంత్య పుష్కరాలకుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యసేవలు అందించేందుకు ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 12రోజుల పాటు వైద్యశిబిరాలు, మెడికల్ క్యాంపులో వైద్యసేవలు అందించేందుకు సిబ్బందిని కూడా కేటాయించారు. భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి స్పెషలిస్టు వైద్యులను కేటాయించారు. 10క్యాంపులు.. కాళేశ్వరంలో 11రోజుల పాటు మూడు షిఫ్టులో 10 మెడికల్ క్యాంపులు, రెండు తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటుచేయనున్నారు. ముక్తీశ్వర ఆలయ సమీపం, పాత ఈఓ కార్యాలయం, టెంట్ సిటీ, పార్కింగ్–1, పార్కింగ్–2, తాత్కాలిక బస్టాండ్, హరిత హోటల్, పాత బస్టాండ్, గోదావరి మెయిన్ ఘాట్, సరస్వతి ఘాట్ సమీపాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పీహెచ్సీలో 20 పడకలు, సరస్వతి ఘాట్ వద్ద మరో 20 పడకలు కలిగిన తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేయనున్నారు. ఒక్క వైద్యశిబిరంలో ఒక డాక్టర్(ఎంఎల్హెచ్పీ), హెల్త్ సూపర్వైజర్, ఇద్దరు చొప్పున ఏఎన్ఎం, ఆశకార్యకర్తలను నియమించారు. ముందుగా వైద్యశిబిరంలో మాత్రలు అందజేయనున్నారు. అక్కడ తగ్గకపోతే తాత్కాలిక వైద్యశాల తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అత్యవసరమైతే మహదేవపూర్లోని సీహెచ్సీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు తాత్కాలిక ఆస్పత్రులు కాళేశ్వరంలోని పీహెచ్సీ, సరస్వతి ఘాట్ల వద్ద తాత్కాలికంగా 20 పడకల చొప్పున ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు సిద్ధంచేశారు. ఆక్సిజన్, పల్స్మీటర్, ఈసీజీ సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, వైద్యాధికారులు ఇద్దరు, ల్యాబ్టెక్నీషియన్, పార్మసిస్టు, స్టాఫ్నర్సులను నియమించనున్నారు. ప్రతీ మెడికల్ క్యాంపు వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మరో ఐదు బైక్ అంబులెన్స్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పీహెచ్సీలకు ఇబ్బంది కలగకుండా.. కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11 రోజుల పాటు ఇబ్బందులు కలగకుండా వైద్యాధికారుల, సిబ్బంది కేటాయింపులు చేశారు. ఆర్బీఎస్కే, పల్లె దవాఖానాలు, పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఒక్కొక్కరిని, సిబ్బందిని కూడా అదేవిధంగా ఎక్కువ మంది ఉన్న సిబ్బందిని కాళేశ్వరం విధులకు పంపించే విధంగా ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ఓ పర్యవేక్షణ.. కాళేశ్వరంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ పర్యవేక్షించనున్నారు. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి వారు అందిస్తున్న సేవలు, ఇబ్బందులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. మరో ఇద్దరు ఇతర జిల్లాల డీఎంహెచ్ఓలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు మానిటరింగ్ టీమ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేయనున్నారు. కాళేశ్వరంలో 10 వైద్యశిబిరాలు 10 పడకలతో 2 మెడికల్ క్యాంపులు 30 మంది డాక్టర్లు.. 420 మంది వైద్యసిబ్బంది ప్రత్యేకంగా రెండు టీమ్ల ఏర్పాటు -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
ఇబ్బందులు కలగకుండా సేవలు..
పుష్కరస్నానానికి వచ్చే భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేశారు. వేసవికాలం కావడంలో ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, ఇబ్బందులు ఎదురైనట్లయితే వెంటనే వైద్యశిబిరాలకు రావాలి. ఎండలో తిరగకుండా ఉండాలి. మధ్యాహ్న సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది. ప్రతీ రోజు ఒక్కో క్యాంపులో రెండు వేల ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం. – డాక్టర్ మధుసూదన్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలోఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాలు సంస్థ, వ్యవసాయ, రవాణా, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రవాణా, మిల్లింగ్ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పుష్కర విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సరస్వతి అంత్య పుష్కరాల విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పుష్కర విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. 12 రోజులు చాలా ప్రధానమన్నారు. విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, తగు చర్యలు నిమిత్తం ఆయా శాఖలకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు స్వామీజీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా చర్యలు కాళేశ్వరం: భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అధికారులతో కలిసి ఆయన పుష్కరాల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ భక్తుల సౌకర్యార్థం గోదావరి నదిలో క్వయర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. భక్తులు సమాచారం తెలుసుకునేలా తగిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ముఖ్య మైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ అధికారులు పాల్గొన్నారు.


