breaking news
Jayashankar District Latest News
-
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతాపప్పు ధాన్యాల సాగు లాభదాయకం -
బాలలు హక్కులను తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: బాలలు హక్కులను తెలుసుకొని వాటిని సాధించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్ నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపతిముర్మును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. బాలికలు నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. సమాజంలో పాతుకుపోయిన దురాచారా లను అధిగమించి ముందుకు సాగాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్రావు, ఎస్ఓ ఈశ్వరి, న్యాయవాదులు పాల్గొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్ -
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఒక బలమైన సాధనమన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఈ చట్టాన్ని అమలు చేయడంతో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అధికారులు కృషిచేయాలని సూచించారు. అనంతరం అఽధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, రవికుమార్, రాజేశ్వర్, ఎర్ర న్న, మారుతి, ప్రదీప్, కార్తీక్, రాజు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చర్యలు
● మార్కెట్ చైర్పర్సన్ పంతకాని తిరుమలకాటారం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఏఎంసీ ఆవరణలో పత్తి విక్రయాల్లో రైతులు పాటించాల్సిన సూచనలు తెలియజేస్తూ ముద్రించిన పోస్టర్ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తిరుమల మాట్లాడుతూ ఈ నెల చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పత్తి విక్రయాలకు సంబంధించి పలు సూచనలు పాటించాలని తెలిపారు. రైతులు విక్రయానికి ముందు కపాస్ కిసాన్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలని దీని ద్వారా తమ ఇష్టమైన మిల్లుకు పత్తి విక్రయించడానికి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. రైతులు తాము వినియోగించే ఖాతాకు ఆధార్లింకు చేసుకోవాలని సూచించారు. పత్తికి మద్దతు ధర క్వింటాల్కు రూ.8110 ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ కార్యాలయంలో ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్లో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి లా షరీఫ్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్, ఆత్మకూరు కుమార్యాదవ్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వంట వండేదెట్ల..?
● మధ్యాహ్న భోజన నిర్వాహకుల అవస్థలు ● నిలిచిన బిల్లులు.. పెరిగిన ధరలు ● అప్పులు చేసి నెట్టుకొస్తున్న ఏజెన్సీలు కాటారం: నెల నెలా సక్రమంగా బిల్లులు అందకపోవడం.. నిత్యావసర సరుకులు, కోడిగుడ్ల ధరలు పెరగడంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పెరిగిన కూరగాయలు, గుడ్లు, పప్పు దినుసులు, వంట చెరుకు, గ్యాస్ ధరలతో తమపై అధిక మొత్తంలో ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నాలుగు నెలలుగా నిలిచిన బిల్లులు.. జిల్లాలో 12 మండలాల్లో మొత్తం 432 పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ఒక పాఠశాలకు నెలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక్కో నెలకు సంబంధించి సుమారు రూ.46 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగు నెలలకు సంబంధించి కోటి 84లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బిల్లులు అందలేదని నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఏజెన్సీల మహిళలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. బిల్లులు నెలవారీగా రాకపోవడం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టతరంగా మారుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సన్నబియ్యం పౌరపరఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తుండగా.. ఇతర సామగ్రి నిర్వాహకులు సమకూర్చుకుంటున్నారు. భోజనంలో ఆకుకూరలు, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు కుకింగ్ చార్జీల కింద ఒక్కొక్కరికి రూ.6.29 చెల్లిస్తారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.8.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కోడిగుడ్డుకు రూ.6 చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ.7 ఉండగా దోసకాయలు, ఆలుగడ్డ, బీరకాయ, దొండకాయతో పాటు ఆకుకూర ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయల ధర చూసినా కిలోకు రూ.60 కంటే తక్కువగా లేదు. కోడిగుడ్డుకు రూ.1 అదనంగా చెల్లించి విద్యార్థులకు పెట్టాల్సి వస్తుందని.. అధిక ధరలు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. ధరలు పెరుగుతున్నప్పుడు అందుకు అనుగుణంగా బిల్లులు పెంచడం లేదని అంటున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో భోజన పథకం నిర్వహణ మరింత భారం అవుతుంది. బిల్లులు అందేలా చూస్తాం.. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్లో లేకుండా అందేలా చూస్తాం. నిధులు మంజూరు కాగానే సంబంధిత ఏజెన్సీల ఖాతాల్లో జమఅయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం అందేలా చూస్తున్నాం. – రాజేందర్, డీఈఓప్రభుత్వ పాఠశాలలు 432 విద్యార్థులు 19,788 వంట నిర్వాహకులు 510 వంట ఏజెన్సీలు 415 -
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాలసర్ప, శని పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ భూపాలపల్లి అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, దిశ ములుగు ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీహెచ్సీ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, ఆస్పత్రి ఆర్ఎంఓలు డాక్టర్ దివ్య, డాక్టర్ రాజేష్, దిశ క్లస్టర్ మేనేజర్ జ్యోతి, మారి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం హాజరై వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, మారి సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. టిప్పర్ యజమానుల సమ్మె భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్లకు రవాణా చార్జీలు పెంచాలని కోరుతూ.. టిప్పర్ యాజమానులు సమ్మె చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం కోల్ ట్రాన్స్ఫోర్ట్ టిప్పర్ ఓనర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీ–2,3, తాడిచర్ల ఓపెన్ కాస్టుల వద్ద టిప్పర్లను అడ్డుకొని డ్రైవర్లకు గులాబీ పువ్వు అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రవీందర్ మాట్లాడుతూ.. భూపాలపల్లి నుంచి కేటీపీపీ, ఉప్పల్ బొగ్గు రవాణాకు పాత ధరలు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. నూతనంగా ప్రతి టన్నుకు రూ.110, 120, 300 పెంచాలని కోరారు. దీనిపై పది రోజుల క్రితమే కోల్ ట్రాన్స్పోర్టర్లకు సమ్మె నోటీసు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రభాకర్, మహేందర్, రాకేష్, నర్సయ్య, లక్ష్మయ్య, రాములు, శ్రీరాములు, నర్సింహరెడ్డి, అశోక్, తిరుపతి పాల్గొన్నారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని జర్మనీకి చెందిన డానియల్, వోలివా, సారియా కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇంగ్లండ్కు చెందిన జొనాతన్ డేవిస్ సందర్శించగా రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ ఆయనకు వివరించారు. -
ఇంకా మహదేవపూర్ కేంద్రంగానే..
పలిమెల: పలిమెల మండలం ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా మండలంలోని ప్రజలకు మాత్రం మెరుగైన పాలన ఇంకా అందడం లేదు. నేటికీ మండల కేంద్రంలో ఒక పోలీస్స్టేషన్ మినహా ఏ ఇతర కార్యాలయాలు లేవు. చిన్న మండలాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతో మహదేవపూర్ మండలంలో ఉన్న పలిమెలను ఎనిమిది గ్రామపంచాయతీలతో కలిపి మండలంగా చేశారు. మండల ఏర్పాటు తొలి రోజుల్లో సంతోషించిన ప్రజలు సేవలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి కలెక్టర్ ప్రత్యేక చొరవ.. అక్టోబర్ 11, 2016లో పలిమెల మండలం ఏర్పాటైంది. అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి ప్రత్యేక చొరవతో మండల కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండేలా మండల కార్యాలయాల సమీకృత భవనాన్ని నిర్మించారు. కానీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవనే కారణంగా చూపి అధికారులు మహదేవపూర్లోనే తిష్ట వేస్తున్నారు. తనిఖీలు ఉంటేనే.. కలెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, మంత్రుల, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మండల పర్యటనకు వస్తే తప్పా అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో అసలు మండలానికి చెందిన అధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్పా ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదని ప్రజలు బాహాటంగా అనుకుంటున్నారు. ఏం కావాలన్నా మహదేవపూర్కు.. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు(సర్టిఫికెట్లు), వ్యవసాయ శాఖ సేవలు, మండల పరిషత్కు సంబంధించిన సేవలు, తదితర సేవలకు ప్రజలు పాత మండల కేంద్రమైన మహదేవపూర్కు పరుగులు పెట్టాల్సిందే. ముకునూరు నుంచి మహదేవపూర్ వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణించాలి. తీరా అక్కడికి వెళ్లాక అధికారులు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ కావాలంటే రూ.50లతో అయ్యే పనికి చార్జీలతో కలిపి రూ.500 కావాల్సిందే. అదే కార్యాలయాలు ఇక్కడే కొనసాగితే సులభంగా పనులు అవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చుట్టుపు చూపుగా వచ్చిపోతున్న అధికారులు మెరుగైన పాలన అందని దుస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
నల్లమచ్చలు అధికం
మద్దులపల్లిలో మూడెకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తం రూ.లక్ష వరకు పెట్టుబడికి ఖర్చు అయింది. కానీ తీవ్ర వర్షాలతో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. పత్తి నల్లబడింది. పత్తి కాయలు మురిగి పోతున్నాయి. మొక్కకు 30 నుంచి 40 కాయల వరకు పాడయ్యాయి. తెల్లదోమ, పచ్చ దోమ సోకింది. పూత, కాయంతా రాలిపోతోంది. చీడపీడల అదుపు కోసం మందులు పిచికారీ చేద్దామన్నా వానలతో చేయలేదు. ఈ సీజన్లో పెట్టబడులు రావడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – బియ్యని శ్రీకాంత్, మద్దులపల్లి -
పత్తిరైతు పరేషాన్!
అధిక వర్షాలతో పంట నష్టంకాళేశ్వరం: పత్తి రైతు ఈ సారి పరేషాన్లో పడ్డాడు. రోజుల తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా తిన్నదని రైతులు వాపోతున్నారు. ముందుగా కాసిన కాయలన్నీ నల్లబడిపోయాయి. విచ్చుకున్న పత్తి తడిసి అందులో మొలకలు వస్తున్నాయి. వానలకు చీడ పీడలు, తెగుళ్ల ఉధృతి బాగా పెరిగింది. తెల్లదోమ, పచ్చ దోమ దాడి పెరిగిపోయింది. దీంతో మలిదశ పూత, కాతంతా రాలిపోతోంది. తెగుళ్లతో ఆకులపై నల్లని మచ్చలు, ఎర్రబారి చెట్టు కుంగిపోతోంది. మరో రెండునెలలు పచ్చగా ఉండాల్సిన చేలు పండుటాకులతో వెలవెలబోతున్నాయి. ఆకురాల్చి మొక్కలన్నీ మోడులవుతున్నాయి. రైతులు నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు. అన్నారం టు కాళేశ్వరం వరకు గోదావరి ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లో వరదనీరు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఎడతెరిపి లేని వర్షాలతో తమను నిండా ముంచాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గనున్న దిగుబడి.. ఈ ఏడాది జిల్లాలో 98,780 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడ పీడల కారణంగా దిగుబడులు సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. మొదటి కాసిన కాయలన్నీ నల్లబడ్డాయి. విచ్చుకున్న పత్తి బూజుపట్టి రంగు మారింది. మొదట్లో కాసిన కాయలే పెద్దగా ఉండి బరువు తగ్గుతాయని రైతులు అంటున్నారు. ఆకులు, ఆ కాయలన్నీ నల్లబడి నేలరాలడంతో పాటు దోమ పోటుతో రెండో దశ పూత, కాత నిలవడం లేదు. తెగుళ్లతో రెండునెలల ముందుగానే చేలన్నీ ఎండిపోతున్నాయి. పత్తిలో సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అలాంటిది నా లుగైదు క్వింటాళ్లు రావడమే కష్టమని రైతులు అంటున్నారు. పెట్టుబడులకు అప్పులు చేసి ఖర్చు చేశామని దిగుబడులు రాకపోతే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. నల్లబారి రాలిపోతున్న పూత, కాత విజృంభిస్తున్న తెగుళ్లు దిగుబడులపై ప్రభావం ఆందోళనలో రైతాంగంపత్తి ఆరుతడి పంట అడపాదడపా వర్షాలు కురిస్తే పత్తిచేలు ఆరోగ్యంగా ఎదిగి, ఆశించిన దిగు బడిని వస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారం వరకు ప్రస్తుతం వర్షాలు దంచి భూమిలో అధిక తేమతో పత్తి పంటకు వేరుకుళ్లు, పారవిల్డ్ లాంటి తెగులు సోకి వేరు వ్యవస్థ దెబ్బతిని ఎదుగుదల నిలిచిపోయింది. బురదమయంగా ఉన్న చేలల్లో సూక్ష్మదాతు లోపం కనిపిస్తోంది. మెగ్నీ షియం, జింకు, బోరాన్ లోపం వల్ల పంట దెబ్బతింటోంది. రైతులు వర్షం భయంతో ఎరువులు వేయడం లేదు. పురుగు మందులు పిచికారి చేయలేకపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వంట చేతికొచ్చే సమయంలో దెబ్బతింటుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. -
మానసిక ఆరోగ్యం ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు భూపాలపల్లి అర్బన్: శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్బాబు తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్ఎంఆర్డీఎస్లోని దివ్యాంగ బాలలతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్, ఇతర వ్యసనాలకు అలవాటు పడినవారు, నేరాలకు పాల్పడే వారిలో చాలా మందికి మానసిక ఆరోగ్యం సరిగా ఉండదన్నారు. శరీరంపై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. హియరింగ్, ఎయిడ్స్, హెల్త్ క్యాంపు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, హెచ్ఎంఆర్డీఎస్ సంస్థ నిర్వాహకులు రజిత, రాజయ్య, న్యాయవాదులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘ది హైపోతీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేదస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు సాధించడం గర్వంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో నిట్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాపక నాగరాజు, ములుగు జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని డీడీ జనార్దన్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో హెడ్ మాస్టర్, సబ్జెక్టు పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. 2013 సంవత్సరంలో అప్గ్రేడ్ అయిన ఏయూపీఎస్ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయాలన్నారు. -
దిగుబడి కష్టమే..
నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేఽశాను. రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చు అయింది. తీవ్ర వర్షాలతో దిగుబడి కష్టంగా మారింది. వేరు చక్కగా ఎదిగే సమయంలో అధిక వర్షాలతో రోగాలు అంటుకున్నాయి. పత్తి చేలు ఎర్రబడి ఎండిపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే మాయదారి రోగం మొత్తం పాకింది. పత్తి మొక్కలు ఆకురాలి మోడులై కనిపిస్తున్నాయి. రెండోసారి వచ్చే పూత, కాతను దక్కించుకుందామంటే చీడపీడలు ముసురు కున్నాయి. ఇప్పటికే ఎరువులు వేశాం. మందులు కొట్టాం. ప్రతీసారి కంటే ఈ ఏడు ఎక్కువ పెట్టుబడి అయింది. దిగుబడులు చేతికొచ్చే సమయంలో వర్షాలు దెబ్బకొట్టాయి. – సల్పాల కుమార్, టేకుమట్ల (రామకృష్ణపూర్ టి) -
నిర్దేశిత వ్యవధిలో సమాచారం అందించాలి
భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘సమాచార హక్కు చట్టం–2005’ వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్డీసీ రమేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి విద్యార్థులు చేసే పనిలో నిబద్ధతగా ఉంటూ, నైపుణ్యం పెంపొందించుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అధునాతన సాంకేతిక కేంద్రం (ఏటీసీ)ను కలెక్టర్ రాహుల్శర్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్లు, పరికరాలను పరిశీలించి వాటి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినందున వాటిని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పక కళాశాలకు హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూమ్లానాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు... వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్లు పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణలు, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్లు, జనగామ, మహబూబాబాద్లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తఽథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేష్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవిందర్రావు, పిన్నింటి అనిల్రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణలతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు)ల మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాథలతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. భూపాలపల్లి రూరల్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం ఈ నెల 13న సోమవారం జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీపడేవారు దరఖాస్తులను జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా సమర్పించాలని ఆయన సూచించారు. తాను దరఖాస్తులు స్వీకరిస్తానన్నారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహులనుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
ఇసుక క్వారీ తనిఖీ
మల్హర్: మండలంలోని మల్లారంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ కేంద్రాన్ని పెద్దపల్లి టీజీఎండీసీ పీఓ రాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక లోడింగ్, వేబ్రిడ్జి, వేబిల్లులను పరిశీలించారు. క్వారీ టార్గెట్ ఇప్పటి వరకు పంపిన ఇసుక వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేబ్రిడ్జి వద్ద లారీలు ఎక్కువ సమయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. లారీల సీరియల్ ప్రకారమే లోడింగ్ జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులకు, టీజీఎండీసీ సిబ్బందిదేనని ఆయన వెల్లడించారు. -
గిరిజనులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి
ఎస్ఎస్తాడ్వాయి: గిరిజనులు వందశాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మేడారంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా షెడ్యూల్డ్ తెగల హోదా అనుభవిస్తున్న బంజారాలను తొలగించే వరకు దీర్ఘకాలిక ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. 1976లో రాజ్యాంగానికి విరుద్ధంగా గుర్తించబడిన లంబాడీ తెగ విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, రాజకీయ రంగాలలో అత్యధికంగా రిజర్వేషన్లు అనుభవిస్తుందని తెలిపారు. దీంతో ఆదిమ లక్షణాలున్న తొమ్మిది తెగలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమ్మక్క– సారలమ్మ జాతర అభివృద్ధి ముసుగులో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుందని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మక్క– సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ లోగోలో లంబాడీల భాషా పదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 19న ఆదిలాబాద్లో అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వట్టం ఉపేందర్, వైస్ చైర్మన్ రవి, జేఏసీ బాధ్యులు వాసం రామకృష్ణ, నరసింహమూర్తి, రాంచందర్, మడి సాయిబాబు, రవి, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుందెబ్బ నాయకులు కబ్బాక శ్రావణ్ కుమార్, చింత కృష్ణ, వట్టం జనార్ధన్, చందా మహేశ్ పాల్గొన్నారు. -
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
గణపురం: గ్రామాలలో పోషణ లోపంతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసు సూచించారు. మండలంలోని బుర్రకాయల గూడెం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి గురువారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చిన ఆమెకు చిన్నారులు పూలతో స్వాగతం చెప్పగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని.. వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషక ఆహారాన్ని అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం, కిషోర బాలికలకు అందిస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిషోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నట్లు అధికారులు తెలపగా.. సంతృప్తి వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం పోషణ మాసంలో భాగంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. గర్భిణులు ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి భూపాలపల్లి: పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధనకు రైతులకు అవగాహన కల్పించాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధి సూచికలపై వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఏ, పశు సంవర్థక శాఖల అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశంలో పా ల్గొని వివిధ రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పౌసమి బసు మాట్లాడుతూ.. వైద్య, విద్యా రంగాల్లో గుణాత్మక మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి రేగొండ: ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే దృక్పథంతో వైద్యులు పని చేయాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. గురువారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు, ఉప వైద్యాధికారులు శ్రీదేవి, ఉమాదేవి పాల్గొన్నారు. నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు బుర్రకాయల గూడెంలో అంగన్వాడీ కేంద్రం పరిశీలన -
లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం
కాళేశ్వరం: కార్తీక మాసం సందర్భంగా ఈనెల 21 నుంచి నవంబర్ 19 వరకు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో లక్షపత్రి పూజలకు రూ.8వేలు చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు తీసుకోవాలని ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక రోజు ఐదు పూజలు మాత్రమే చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 90004 80931, 97046 39706 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. గణపురం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ ఫణీందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు నామినేషన్ల ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టేకుమట్ల: ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని డీఎస్పీ సంపత్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించేలా కృషిచేయాలని, నామినేషన్ సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్ ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పాలకుల మెడలు వంచి విజయం సాధించినట్లు కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల పార్వతి, లలిత, మినుగు నగేష్, ప్రభాకర్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. టేకుమట్ల: మండలకేంద్రంలోని 108 అంబులెన్స్ను గురువారం జిల్లా అధికారి రాజునాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, మందుల స్టాక్తో పాటు, వాహన కండీషన్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవల కోసం మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులు, అత్యవసర సేవల కోసం వచ్చే కాల్స్కు సకాలంలో స్పందించి అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ హరిప్రసాద్, పైలట్లు సదయ్య, షరిపొద్దీన్, రవీందర్ ఉన్నారు. రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావుతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ సమయంలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లిగోరి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
పొగాకు వాడకం ప్రమాదం
ములుగు: పొగాకు తాగిన వారితో పాటు పక్కన ఉండి పీల్చేవారికి అంతే ప్రమాదమని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ గోపాల్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత పొగాకు వాడకాన్ని విడిచిపెట్టేలా 60రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. పొగాకులోని నికోటిన్ పదార్ధం దూమపానానికి బానిసలుగా మారుస్తుందని తెలిపారు. పొగాకు తాగడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్కుమార్, ప్రవీణ్రెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సాంబయ్య, సీహెచ్ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
అదనపు ఉపాధ్యాయుడిని ఇస్తాం..
గణపురం మండలం బుర్రకాయల గూడెం పాఠశాలకు విద్యార్థుల సంఖ్యకు అణగుణంగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం బుర్రకాయల గూడెం అంగన్వాడీకేంద్రాన్ని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసుతో సందర్శించిన క్రమంలో గ్రామస్తులు తమ పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉన్నారని.. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గిందని కలెక్టర్ అన్నారు. త్వరలో మరో ఉపాధ్యాయుడిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. -
10నుంచి 17..
రోజుకుజిల్లాలో తగ్గని జ్వరపీడితులుఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులుభూపాలపల్లి అర్బన్: వర్షాకాలం సీజన్ ముగింపు దశకు వచ్చినప్పటికీ జిల్లాలో జ్వరపీడితులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తుగా వైద్యశిబిరాలు ఏర్పాటుచేయడం, ఇంటింటా జ్వర సర్వే చేయడంతో ఇరవై రోజులుగా జ్వరాలు గతంకంటే తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికీ ప్రతిరోజు 10నుంచి 17 మంది జ్వరపీడితులు నమోదవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పదుల సంఖ్యలో జ్వరపీడితులు వైద్యసేవలు పొందుతున్నారు. సెప్టెంబర్ నుంచే తగ్గుముఖం జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. అయినప్పటికీ ముందస్తుగా తెలుసుకొని సకాలంలో నయం చేసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆగస్టు మాసంలో 821 జ్వరం కేసులు నమోదు కాగా, సెప్టెంబర్ మాసంలో 540 కేసులు నమోదు కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 300 మంది వరకు అడ్మిట్ అయ్యారు. ఈ నెలలో రోజుకు 10 నుంచి 17 కేసుల వరకు నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 42 డెంగీ కేసులు నమోదు.. జిల్లాలో గతేడాది 60 వరకు డెంగీ, 12 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 42 డెంగీ, 10 మలేరియా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే డెంగీ, మలేరియా కేసుల నమోదు సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ప్రజల్లో సైతం అవగాహన పెరగడంతో దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్రామాల్లో డెంగీ, మలేరియా కేసులు నమోదైన వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో వ్యాధులు ఇతరులకు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బందిని కలుపుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.చిట్యాల సివిల్ ఆస్పత్రిలో వారం రోజుల్లో 756మంది రోగులు ఓపీ చూపించుకున్నారు. వీరిలో 138మంది జ్వరపీడితులు అడ్మిట్ అయి చికిత్స పొందారు. గురువారం 77మంది ఓపీ చూపించుకోగా.. 15మంది జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గ్రామాల్లోనీ ఆర్ఎంపీల వద్ద కూడా పదుల సంఖ్యలో జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. మాది జడలపేట గ్రామంలోని గాంధీనగర్. జ్వరంతో 108లో గురువారం ఉదయం చిట్యాల సివిల్ ఆస్పత్రికి వచ్చాను. పరీక్షించిన వైద్యుల్ అడ్మిట్ చేసుకుని మంచి వైద్యసేవలు అందిస్తున్నారు. – బొట్ల రాధ, గాంధీనగర్, జడలపేట కొనసాగుతున్న హెల్త్ క్యాంపులు జీజీహెచ్కు గతంకంటే తగ్గిన ఓపీ చలితో పెరిగే ప్రమాదంజిల్లాలో గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. శీతా కాలం ప్రారంభంతో తగు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ జ్వరాలు వచ్చిన వెంటనే ఎపిడమిక్ టీమ్ వెళ్లి క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ చల్ల మధుసూదన్, డీఎంహెచ్ఓఅక్టోబర్ మాసంలో వాతావరణ మార్పులు సంభవిస్తాయి. వర్షకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే కాలం. శీతాకాలం ప్రారంభంలో జరుగుతున్న మార్పుల వలన చిన్న పిల్లలు, వృద్ధులు జ్వరాలు, జలుబుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. -
ఇప్పటికిక ఇంతే..!
జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించే వారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. నోటిఫికేషన్ను రద్దు చేసిన కారణంగా ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఊరించి, ఉసూరుమనిపించి.. మొత్తంగా 12 నామినేషన్లు.. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒకటి దాఖలైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటివారం తర్వాతే... ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
టెట్ గుబులు
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలిరెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలన్న సుప్రీంకోర్టుభూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై రిట్ పిటిషన్ వేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2012, 2017, 2024లో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో టెట్ను అమలు చేసింది. విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలి.. టెట్ మార్గదర్శకాలు తమకు వర్తించవని, సుప్రీం కోర్టు తీర్పు రూల్స్ విరుద్ధమని విద్యా హక్కు చట్టం రాకముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొందరు నిరుద్యోగులే ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తున్నారని, అలాంటిది 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తి కొనసాగుతున్న వారు టెట్ ఎలా పాస్ అవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని, పదోన్నతులు పొందే వారికి టెట్ అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరుతున్నారు. విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలంటున్నారు. అయితే చట్ట సవరణ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండగా, అనేక రాష్ట్రాలు సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలి. స్టే ఆర్డర్ తీసుకువస్తే బాగుంటుంది. – మందల రవీందర్రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడుజిల్లాలో 430 పాఠశాలలు, 1,940 మంది టీ చర్లు ఉన్నారు. ఇందులో టెట్ ఉత్తీర్ణత లేని వా రు 800 మందికిపైగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) ప్రకారం 1 నుంచి 8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 2014 నవంబర్ 12న పైస్థాయి పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా రాష్ట్రాల్లో టెట్ ఉత్తీర్ణత కాకుండా పదోన్నతులు ఇస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో టెట్ తప్పనిసరి అంటూ కోర్టు పేర్కొంది. రానున్న రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ లేదంటే సర్వీస్ నుంచి తొలగింపు ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు జిల్లాలో 1,940 మంది టీచర్లు -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వరంగల్లోని బీవీ శ్యామల రత్నం పారా మెడికల్ చారిటీ ఆధ్వర్యంలో ఉచిత పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎంపీహెచ్ఏ (ఎం), డీఎంఎల్టీ, డీఓఏ, డీఆర్జీఏ, డీఎంఎస్ఓటీలో ఇంటర్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్యే, ఈఎస్ఐ, ఆయుష్లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు పొందుటకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 9059729000, 9849473179 నంబర్లను సంప్రదించాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఐ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్కిశోర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఈదాడికి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్దన్, లావణ్య, రజిత, సంధ్య, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు. కాటారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ఖరే తెలిపారు. బుధవారం కాటారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల వివరాలు, సిబ్బంది హాజరు, పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై స్థానిక పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం:వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపులో భాగంగా మహాదేవపూర్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బయాలజీ ఉపాధ్యాయుడు బి.ప్రభాకర్రెడ్డి, తిరుపతిరెడ్డిలు మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ జంతువు పర్యావరణ పరిరక్షణలో భాగమేనన్నారు. వాటి సహజ ఆవాసాలను సంరక్షించాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు వివరించారు. గెలుపొందిన విద్యార్థులకు హెచ్ఎం అనిల్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజిక్స్ టీచర్ రాజిరెడ్డి, ఉపాధ్యాయులు రాజయ్య, అనిల్, సమ్మయ్య, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీని వాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాటారం: మహాముత్తారం మండలకేంద్రంలోని అత్యవసర సేవల 108 అంబులెన్స్ను బుధవారం జిల్లా మేనేజర్ రాజునాయక్ తనిఖీ చేశారు. 108 వాహనంలోని రికార్డులు, మెడికల్ స్టాక్, వాహనం కండీషన్ చెక్ చేశారు. అత్యవసర సేవల కోసం వాహనంలో మందులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అత్యవసర సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కాల్ అందుకోగానే ప్రమాద స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందించి దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. -
తిలా పాపం.. తలా పిడికెడు!
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సాసాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. వివాదమైనప్పుడే స్పందన.. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం విచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలురైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. -
కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు
భూపాలపల్లి: పత్తిని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆదేశించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26లో జిల్లాలో 98,260 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, 11,79,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ మాసం తర్వాత పత్తి దిగుబడి ప్రారంభమవుతుందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో అధికంగా విక్రయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో రేటు పలికితే వెంటనే సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు భూపాలపల్లి, కాటారం, చిట్యాల మార్కెట్ పరిధిలో మొత్తం 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి తేమ శాతం 8 శాతం ఉన్నప్పుడు కనీస మద్దతు ధర రూ. 8,110 గా ఉందన్నారు. రైతులకు స్లాట్ బుకింగ్ తప్పనిసరని అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
కార్మికుల సమస్యలు పట్టవా?
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు సింగరేణి అధికారులకు పట్టవా? అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య ఆరోపించారు. ఏరియాలోని రామప్ప కాలనీలో రెండు నెలల నుంచి పేరుకుపోయిన చెత్త కుప్పులను కాలనీవాసులతో పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ నెలల తరబడి కాలనీలో చెత్త కుండీల్లో కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని మండిపడ్డారు. చెత్త కుళ్లిపోవడంతో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామన్నారు. తక్షణమే పేరుకుపోయిన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లించి, దోమల మందు పిచికారీ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కాలనీ వాసులు మహేందర్, రాజు, రమేశ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజయ్య -
మొదటి విడతకు సిద్ధం
భూపాలపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉండగా, నేడు తీర్పు వెలువడనున్న క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు. మొదటి దఫాలో 6 మండలాల్లో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం రెండు విడతల్లోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి విడతలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి మినహా గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 6 జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నేడు (గురువారం) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం జెడ్పీటీసీలకు 6, ఎంపీటీసీలకు 19 మంది రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ నియమించారు. నామినేషన్ల స్వీకరణ ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించనుండగా ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ 6 జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలు నేడు నోటిఫికేషన్, అనంతరం నామినేషన్ల స్వీకరణ మండలం ఎంపీటీసీ పోలింగ్ ఓటర్లు స్థానాలు కేంద్రాలుగణపురం 10 58 33,235 రేగొండ 11 63 33,973 కొత్తపల్లి గోరి 6 33 16,446 చిట్యాల 12 59 30,698 టేకుమట్ల 9 44 22,248 మొగుళ్లపల్లి 10 56 30,353 -
ఫారెస్ట్ చెక్పోస్టు పునరుద్ధరణ
కాటారం: కాటారం మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్పోస్టును మంగళవారం నుంచి పునరుద్ధరించారు. కొంతకాలంగా చెక్పోస్టు నిర్వహణలో లేకపోవడంతో అక్రమ కలప రవాణా, ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చాయి. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్పోస్టు నిర్వహణపై దృష్టిసారించి తిరిగి ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్రెడ్డి చెక్పోస్టును ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్పోస్టు ద్వారా ఇసుక లారీల నుంచి సెస్ ఫీజు వసూలు చేయనున్నట్లు సీసీఎఫ్ తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ సందీప్, మహదేవపూర్ రేంజర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలిచిట్యాల: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లేష్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్తండాలో కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మినా, కొత్త వ్యక్తులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. డయల్ 100, షీ టీమ్స్, సీసీ టీవీ కెమెరాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాలుగు బృందాలుగా ఏర్పడి 110 ఇళ్లను తనిఖీ చేయగా ఎనిమిది వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. 350 లీటర్ల గుడంబా పానకం ధ్వంసం చేశారు. పది లీటర్ల గుడుంబాను సీజ్చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, మొగుళ్లపల్లి ఎస్సైలు శ్రావన్కుమార్, అశోక్కుమార్, హేమలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కొమురం భీంకు ఘన నివాళి డీడీకి సన్మానంభూపాలపల్లి రూరల్: కొమురం భీం 85 వర్ధంతిని మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కొమురం భీం అడవి బిడ్డల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి నిజాం పాలకులకు సింహస్వప్నం అయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, నాయకులు కుడుమేత సరస్వతి, ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుపాల్గొన్నారు .తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో..తెలంగాణ ఆదివాసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమురం భీం పోరాట చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దేవేందర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ డీడీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన దబ్బగట్ల జనార్దన్ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్స్ సన్మానించారు. గతంలో పనిచేసిన డీడీ పోచం బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జనార్దన్ విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఓ సారయ్య, ఏసీఎంఓ కోడి రవీందర్, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, వజ్జ నారాయణ, చుంచు కొమ్మాలు పాల్గొన్నారు. -
రామాయణం మార్గదర్శక గ్రంఽథం
భూపాలపల్లి: మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ప్రతీ మనిషి జీవితానికి మార్గదర్శక గ్రంథం అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పర్గత్ దివస్ను పురస్కరించుకొని వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, కర్తవ్యమార్గాలు నేటి సమాజానికి ప్రేరణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదేని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ -
ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్లో హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించి రేట్ చార్ట్ నిర్దేశించు అంశంపై ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్, ఫ్లెక్సీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చులను పర్యవేక్షించడానికి రేట్ చార్ట్ రూపొందించినట్లు తెలిపారు. ఈ రేట్ చార్ట్ ప్రకారం, ప్రతీ ప్రచార సామగ్రి, ఫ్లెక్సీ, పోస్టర్, ప్రచార వాహనాల అద్దె, ప్రకటనలు, ఇతర ప్రచార ఖర్చులు స్థానిక రేట్ల ఆధారంగా అభ్యర్థులు ఖర్చులో జమచేయబడతాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తగు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలి పారు. ఈ సమావేశంలో ఆడిట్ అధికారి మానస, డీపీఓ శ్రీలత, డీపీఆర్ఓ శ్రీనివాస్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగాలి
కాటారం: స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా లోటుపాట్లు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాటారం మండలకేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూంలు, ఓట్లు లెక్కింపు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్, స్ట్రాంగ్ రూంల భద్రత, సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు గదుల్లో విద్యుత్ సౌకర్యం, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీఓలు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధృవీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపు, మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచేలా చూసుకోవాలన్నారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరీ నోడల్ ఆఫీసర్గా ఉంటారని తెలిపారు. అనంతరం ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ల్యాబ్లో ఏర్పాటు చేసిన పరికరాలు అమర్చకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరికరాల ఏర్పాటు విషయం తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల కలెక్టర్ ప్రిన్సిపాల్ భిక్షపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడి విద్యార్థులకు సాంకేతిక విద్య సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు ఉన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
కాటారం: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఆర్జిదారులకు నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ఆదేశించారు. మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. భూ భారతి సదస్సుల్లో భాగంగా వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి నోటీసులు జారీచేశారని తహసీల్దార్ శ్రీనివాస్ ద్వారా ఆరా తీశారు. త్వరితగతిన నోటీసులు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
ఏమవుతుందో ఏమో..!
సాక్షిప్రతినిధి, వరంగల్: షెడ్యూల్ వచ్చే దాకా ఒక టెన్షన్.. తేదీలు ప్రకటించాక రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై మరో టెన్షన్. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తేలే సమయం రానే వచ్చింది. బుధవారం వెలువడే హైకోర్టు తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. అన్ని వర్గాల్లోనూ అనుకూలమా? ప్రతికూలమా? అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల జీఓను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి వంగా గోపాల్రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. తీర్పు వెలువడిన తర్వాతే ముందుకు... 2024 ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు, జూలైలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటన్నింటితోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో కుల గణన చేపట్టింది. బీసీ డెడికేషన్ కమిటీ వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులు రూపొందించి సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఆ ప్రక్రియలు పూర్తయ్యాక సెప్టెంబర్ నెలాఖరులో జీఓ 9 తీసుకొచ్చి వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి, ఏకకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. తీర్పుకు ముందే ఊహాగానాలు.. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీలు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలకు రిజర్వేషన్ల గెజిట్ ఇప్పటికే విడుదలైంది. 778 ఎంపీటీసీ, 1,708 సర్పంచ్ స్థానాలు, 15 వేల పైచిలుకు వార్డులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ సమయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో జోరందుకుంటున్న ఊహాగానాలు పల్లెల్లో గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయని, ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఇప్పుడు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు స్థానాలు తగ్గి జనరల్కు పెరుగనున్నాయని.. రకరకాల ప్రచారానికి తోడు మారుతున్న రాజకీయ సమీకరణలతో పరిస్థితులు హాట్హాట్గా కనిపిస్తున్నాయి. ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై నేడే జడ్జిమెంట్ వేచి చూసే ధోరణిలో ప్రధాన పార్టీల నేతలు, ఆశావహులు అనుకూలమా? ప్రతి కూలమా? తేలాకే ఎన్నికల బరిలోకి రేపటి నుంచే మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు -
ఇందిరమ్మకు ఉపాధి తోడు
ఈజీఎస్తో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయంకాటారం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూలీల కొరత నివారించి నిర్మాణ పనులు సజావుగా సాగేలా తగు చర్యలు తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేయగా ఉపాధిహామీ అధికారులు గ్రామీణ స్థాయిలో అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారు జాబ్కార్డు కలిగి ఉంటే 90 రోజులు పనిదినాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణాలకు కూలీల కొరత లేకుండా సదరు లబ్ధిదారు పని చేసుకొని కూలి పొందవచ్చు. దీంతో నిర్మాణ పనులు త్వరితగతిన కొనసాగడంతో పాటు లబ్ధిదారు ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. 90 రోజుల పనిదినాలు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి ఉపాధిహామీలో జాబ్కార్డు ఉన్న లబ్ధిదారులకు బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ లెవల్ వరకు 50రోజుల పని దినాలు కల్పించనున్నారు. 90 రోజుల పనిదినాలకు సదరు లబ్ధిదారుకు రూ.27,630 చెల్లించనున్నారు. దీంతో సొంతింటి నిర్మాణానికి కూలీ పని చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. జిల్లాలో 94 ఇళ్ల గుర్తింపు.. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద ఇప్పటివరకు 94 ఇళ్లను గుర్తించినట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ స్థాయి, గోడల నిర్మాణం, స్లాబ్ లెవల్ వరకు జరిగిన ఇళ్లను ఎంపిక చేశారు. ఇందులో 72 ఇళ్లకు ఎస్టిమేట్ ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో ఉన్న ఇళ్ల లబ్ధిదారు ఈజీఎస్ పనులకు వెళ్లకుండా ఇంటి నిర్మాణ పనులకు రోజూ మస్టర్ వేసి కూలీ చెల్లించనున్నారు. జిల్లాలో ఇళ్ల గుర్తింపు జరిగినప్పటికీ స్థానిక ఎన్నికల కోడ్ ప్రభావం వల్ల మంజూరు ప్రక్రియ ఇంకా మొదలవలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉపాధిహామీ పథకాన్ని వినియోగించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి గుర్తించాం. ఎంపిక చేసిన ఇళ్లకు ఎస్టిమేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. స్థానిక ఎన్నికల కారణంగా ఇంకా మంజూరు పత్రాలు ఇవ్వలేదు. – బాలకృష్ణ, డీఆర్డీఓ 90 రోజులు పనిదినాలు కల్పించేలా చర్యలు నిర్మాణ పనుల వేగవంతానికి సర్కారు కసరత్తు -
బాకీ కార్డుతో కాంగ్రెస్కు భయం
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీల బాకీ కార్డుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి 660 రోజులు పూర్తయిందన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. హమీలను గుర్తు చేయాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ధోకా చేస్తే భూపాలపల్లి కుగ్రామం నుంచి నేడు జిల్లా స్థాయికి ఎలా అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిందని గుర్తు చేశారు. కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని ప్రజలు మండిపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో తమకు ప్రశ్నించే హక్కు ఉందని.. దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, నాయకులు సిద్దు, జనార్దన్, రాజు, రవికుమార్, అశోక్ పాల్గొన్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: ఎన్నికల ప్రారంభం నుంచి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీఓలు, నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ఏర్పాటు.. తదితర అన్ని కార్యక్రమాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
డేంజర్ రోడ్డు
గణపురం: గాంధీనగర్ నుంచి గణపురం మండలకేంద్రంతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి వరకు పరకాల–ములుగు ప్రధాన రహదారి డేంజర్గా మారింది. గాంధీనగర్ నుంచి వెల్తుర్లపల్లి వరకు సుమారు 9 కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారి పెద్ద గుంతలతో నిండిపోయింది. రహదారి వెంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. భారీ వాహనాలతో పాటు కార్లు, ఆటోలలో వెళ్లే ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రూ.1.10కోట్ల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జక్కం దుర్గారాణి కుటుంబసభ్యులకు ఎస్బీఐ అధికారులు సోమవారం రూ.1.10కోట్ల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఎస్బీఐకి సింగరేణి కంపెనీతో జరిగిన ఒప్పంద ప్రకారం సింగరేణిలో పనిచేసే రెగ్యులర్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే బ్యాంక్ రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బులు మరణించిన వారి కుటుంబీకులకు అందజేయనున్నట్లు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గణేశ్యాం, ఆర్ఎం నాగవెంకట సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కూతురు అభినవకు చెక్కును అందజేశామన్నారు. ఈ ఇన్సూరెన్స్ అవకాశం సింగరేణి కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు ఎస్బీఐకి సాలరీ ఖాతాను మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్ రామస్వామి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలనలో అన్నీ మోసాలే..
భూపాలపల్లి రూరల్: స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ దుష్ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ధోకా కార్డును సోమవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు. 317 జీఓను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని.. 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.ధోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్ర -
స్థానిక పోరుపై ఫోకస్
భూపాలపల్లి: బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఎలా ఉన్నా గ్రామాల్లో మాత్రం రాజకీయ వేడి రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఓ వైపు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే చర్చ సాగుతున్న తరుణంలోనే మరోవైపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూనే, ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల కోసం పరిశీలన.. జిల్లాలో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ, 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కోసం ఆశావాహులంతా వేచి చూస్తున్నారు. కోర్టు తీర్పు రాకముందే జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నాయి. పార్టీల నేతలు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ ఇతర పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను ప్రధాన పార్టీలు ఇప్పటికే సేకరించాయి. ఒక్కో స్థానానికి సుమారు పది మంది టికెట్ ఆశిస్తుండగా నలుగురు, ఐదుగురు పేర్లను ఫైనల్ చేసి మళ్లీ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని గ్రామస్తుల అభిప్రాయాలు అంతర్గతంగా తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. వేడెక్కిన రాజకీయం.. గ్రామాల్లో స్థానిక ఎన్నికల వేడి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు వివిధ కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇరు పార్టీల నాయకులు నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరిట కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకులు సోమవారం ‘బీఆర్ఎస్ డోకా కార్డు’ను విడుదల చేశారు. దీంతో ‘స్థానిక’ రాజకీయం మరింత వేడెక్కింది. ఆ ఐదు మండలాలపైనే దృష్టి.. జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జెడ్పీ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు కేటాయించినందున ఆ రిజర్వేషన్ ఉన్న ఐదు మండలాలపైనే దృష్టి సారించాయి. జిల్లాలోని గణపురం, కొత్తపల్లి గోరి మండలాల జెడ్పీటీసీ స్థానాలు బీసీ మహిళ, చిట్యాల, భూపాలపల్లి, మహదేవపూర్ బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో ఆయా మండలాల్లో దీటైన, గెలుపొందే అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇద్దరు, ముగ్గురు మద్దతిస్తే అక్కడ ఎంపీపీ.. జిల్లాలోని 109 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 12 మండలాలకు ఎంపీపీలు ఉండనున్నారు. 9 మండలాల్లో 8, 9కి పైగా ఎంపీటీసీ స్థానాలు ఉండగా మూడు మండలాల్లో మాత్రం అతి తక్కువ స్థానాలు ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లో ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీలు మద్దతిస్తే ఎంపీపీ స్థానాన్ని చేజిక్కించుకోవచ్చు. కొత్తపల్లి గోరి, మల్హర్ మండలాల్లో ఆరు చొప్పున స్థానాలు ఉండగా ముగ్గురి మద్దతు, పలిమెల మండలంలో కేవలం ఇద్దరు గెలుపొందిన ఎంపీటీసీలు మద్దతిస్తే ఎంపీపీ కుర్చీని కై వసం చేసుకోవచ్చు. దీంతో ఇక్కడి పీఠాలను దక్కించుకునేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అన్వేషిస్తున్నాయి. జెడ్పీ పీఠం కోసం ఆ మండలాలపై దృష్టి గ్రామాల్లో నెలకొన్న రాజకీయ వేడి కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ‘కార్డు’ పంచాయితీ -
హుండీ ఆదాయం రూ.71,902
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.71,902 వచ్చినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం ఎండోమెంట్ రెవెన్యూ డివిజన్ ఇన్స్పెక్టర్ నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాకృష్ణ, మురళీకృష్ణ, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎన్నికల విధులను సవరించాలిభూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులలో జరిగిన లోపాలను సవరించి విధులు కేటాయించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.అశోక్, ఎ.తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్లకు ఆర్ఓ, ఏఆర్ఓ, పీఓ, ఏపీఓలుగా, సీనియర్లకు ఓపీఓలుగా కేటాయించినట్లు ఆరోపించారు. ఎన్నికల విధులలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం పదవీ విరమణ పొందే వారికి, దివ్యాంగులకు, దీర్ఘకాల అనారోగ్యం కల వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు.23 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువుకాళేశ్వరం: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుకునే వారికి 2025–2026 సంవత్సరానికి గాను అడ్మిషన్ షెడ్యూలు అపరాధ రుసుంతో ఈనెల 23వరకు అడ్మిషన్ చేసుకోవడానికి గడువు ఉందని కోఆర్డినేటర్ ప్రభాకర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ నంబర్లు 75699 75383, 63008 54065లో సంప్రదించాలని పేర్కొన్నారు.తాడిచర్లలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మల్హర్: స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం తాడిచర్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేశ్, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.9న బహిరంగ వేలంరేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులోని శ్రీ బుగులోని వెంటేశ్వరస్వామి దేవస్థానం నందు నవంబర్ 3 నుంచి జరిగే జాతర సందర్భంగా కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర ప్రసాదం అమ్ముకునేందుకు లైసెన్స్ హక్కు కోసం ఈ నెల 9న తిరుమలగిరిలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత దరావత్తు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
మల్హర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సిబ్బందికి సూచించారు. మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ మధుసూదన్ సందర్శించారు. ఆస్పత్రిలోని మందుల వివరాలు, రికార్డులను పరిశీలించి, సిబ్బంది వివరాలపై ఆరాతీశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ప్రభుత్వం వైద్యం పట్ల నమ్మకం కల్పించాలని వివరించారు. సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఎం నల్ల మధుబాబు, డాక్టర్ వినయ్భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి మధుసూదన్ -
ఆరు గ్యారంటీలను మర్చిపోయిన కాంగ్రెస్
టేకుమట్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మర్చిపోయిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మండలకేంద్రంతో పాటు, మండలంలోని రామకిష్టాపూర్(టి)లో ఆరు గ్యారెంటీల బాకీ కార్డును ఇంటింటికీ అందించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అబద్దాలను చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వాటిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల స్నేహలత నరేష్, వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, నల్లబెల్లి రవీందర్, ఆది రఘు, నిమ్మల స్వామి, వెంకటేశ్వర్రెడ్డి, పొన్నం చంద్రయ్య, ఆకునూరి తిరుపతి, అప్జల్, గువ్వాడి లక్ష్మన్, ఎలవేని భాగ్య పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే..!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్లోడ్ అధికంగా ఉంది. ఇందుకనుగుణంగా పార్ట్టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్గా నియామకాలు చేపట్టారు. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్లోడ్కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలకమండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వారిని నియమ నిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లనుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండటంతో పాటుగా పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణానికి ఓకే.. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్లూ ఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలకమండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలకమండలి సమావేశంలో ఆమోదం -
విద్యాశాఖలో నూతన విధానం
● అకడమిక్ క్యాలెండర్ల పంపిణీకి శ్రీకారం ● జీఓ జారీచేసిన పాఠశాల విద్యాశాఖ ● స్కూళ్లు, ఆఫీసుల్లో ప్రదర్శనకు చర్యలు ● కార్యక్రమాల అమలులో పారదర్శకత..భూపాలపల్లి అర్బన్: జిల్లాల్లోని పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీకి పాఠశాల విద్యాశాఖ నూతన శ్రీకారం చుట్టింది. విద్యాసంవత్సరానికి అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ ద్వారా బోధన, పరీక్షలు, సెలవులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది. విద్యాశాఖ ప్రతీ సంవత్సరం విధివిధానాల ప్రకారం క్యాలెండర్ విడుదల చేస్తూ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కలెక్టరేట్, డీఈఓ తదితర కార్యాలయాలు, ఆయా పాఠశాలల్లో క్యాలెండర్లను ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ గత నెల 27న ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమాల పటిష్ట అమలుకు.. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో అకడమిక్ క్యాలెండర్ పేరిట మార్గ సూచిని విడుదల చేస్తున్నా పాఠశాలల్లో దీనిని అమలు చేయడంలో మాత్రం లోపాలు తలెత్తుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు మినహా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ విడుదల చేస్తున్న అకడమిక్ క్యాలెండర్ నిర్వహణపై సరైన అవగాహన ఉండడం లేదని భావించింది. దీంతో అకడమిక్ క్యాలెండర్ను పోస్టర్ రూపంలో అన్ని పాఠశాలల్లో ప్రదర్శించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్యాలెండర్లో ఉండే సమాచారం జిల్లాలో 414 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 22వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటన్నింటిలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్ క్యాలెండర్లను పంపిణీ చేసి ప్రదర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏ నెలలో ఏయే పరీక్షలు నిర్వహించాలి. సిలబస్ పూర్తిచేసే సమయం, పాఠశాల సముదాయ సమావేశాలు, ప్రదర్శన పోటీలు, క్రీడలు, గ్రంథాలయాల నిర్వహణ తదితర వివరాలు అన్నీ ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ప్రధాన కార్యకలాపాలను అంశాల వారీగా రూపొందించి ఉండడంతో తదనుగుణంగా అకడమిక్ క్యాలెండర్ను ప్రయోజనాత్మకంగా అమలుచేసే ఆస్కారం ఉంటుంది. పారదర్శకత లోపించకుండా ఉంటుంది. విద్యా విషయక ప్రయోజనాలెన్నో.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ ద్వారా విద్యాపరమైన ప్రయోజనాలు పూర్తిస్థాయి ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. క్యాలెండర్ల ప్రదర్శన ద్వారా విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కొనసాగే బడిబాట నిర్వహణ తేదీలు మొదలుకొని సెలవు దినాలు, నెల వారీ పరీక్షలు, పూర్తి చేయాల్సిన సిలబస్, ప్రాధాన్యత కలిగిన దినోత్సవాలు, తల్లిదండ్రుల సమావేశాలు, వివిధ రకాల పండుగ సెలవులు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇవన్నీ నెలవారీగా అమలు చేయడం, తద్వారా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా సరళతరం అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తంజేస్తున్నారు. పకడ్బందీ అమలుకు అవకాశం.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్ల పంపిణీ నిర్ణయం సముచితమైంది. ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరుతుంది. ప్రింటెడ్ అకడమిక్ క్యాలెండర్లను ఆయా పాఠశాలల్లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుంది. ఉపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే కార్యక్రమాల గురించి అవగాహన కలుగుతుంది. – పెండెం మధుసూదన్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రాథమిక పాఠశాలలు 301 ప్రాథమికోన్నత పాఠశాలలు 44 ఉన్నత పాఠశాలలు 69 మొత్తం విద్యార్థులు 22,723 -
నేటి ప్రజాదివస్ రద్దు
భూపాలపల్లి: ఎస్పీ కార్యాలయంలో నేడు (సోమవారం)నిర్వహించే ప్రజా దివస్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాను. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుల నిమిత్తం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజాదివస్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.హామీలను నెరవేర్చాలిరేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఆదివారం మండలంలోని కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాలలో ఇంటింటికి పంచారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్, భద్రయ్య, రాజు, అర్ఙున్, సుధాకర్, అంకూస్ పాల్గొన్నారు.కారు బోల్తాచిట్యాల: భూపాలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తుండగా అదుపుతప్పి కారు బోల్లా పడిన ఘటన మండలకేంద్రంలోని క్రోసూరుపల్లి గ్రామశివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ కురిమిళ్ల మహేష్ పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. క్రోసూరుపల్లి గ్రామశివారులో గల ప్రధాన రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు.పిడుగు పాటుతో ఎద్దు మృతికాటారం(మహాముత్తారం): పిడుగుపాటుతో ఎద్దు మృతి చెందిన ఘటన మహాముత్తారం మండలం బోర్లగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. జంగెపల్లి వెంకటరాజయ్య అనే రైతుకు చెందిన ఎద్దు ఇంటి సమీపంలోని పొలంలో మేత మేస్తుంది. వర్షం కురుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎద్దుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని బాధిత రైతు వెంకటరాజయ్య తెలిపారు. ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని వెంకటరాజయ్య కోరారు.విద్యుదాఘాతంతో..కాటారం: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలోని ఇబ్రహీంపల్లిలో చోటుచేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగుల రాజయ్య అనే రైతుకు చెందిన గేదె మేత కోసం గ్రామ పరిసర ప్రాంతానికి వెళ్లగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.50 వేల వరకు ఉంటుందని గేదె ఇచ్చే పాలతో ఉపాధి పొందుతున్నట్లు బాధిత రైతు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం విద్యుత్శాఖ ద్వారా పరిహారం అందించి ఆదుకోవాలని రాజయ్య వేడుకున్నారు.యువతి అదృశ్యంటేకుమట్ల: యువతి అదృశ్యమైన ఘటన మండలంలోని రామకిష్టాపూర్(వి)లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం ఉదయం టైలర్ షాపునకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేకపోవడంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కుమారస్వామి తెలిపారు. -
స్పాట్ సెల్లింగ్
స్లాట్ బుకింగ్.. హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కా పాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ‘కా పాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం. చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కా పాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగుజిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547 హనుమకొండ 74,849 మహబూబాబాద్ 85,480 ములుగు 20,593 భూపాలపల్లి 98,260 జనగామ 1,26,119పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కా పాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. -
డీఎస్పీ నవీన్కు ఘన సన్మానం
వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన దానం నవీన్ ఇటీవల వెల్లడించిన గ్రూప్–1లో ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ మేరకు అదివారం మండల కేంద్రంలో నవీన్ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన నవీన్ కలెక్టర్ కావాలనే లక్ష్యంతో తన మేనమామ సమ్మయ్య సహకారంతో చదివి డీఎస్పీగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నవీన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, నాయకులు రాజు, రాజేష్, వెంకటేశ్, తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు. -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
అనుమతులు వచ్చేశాయి..
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన తాడిచర్ల–భూపాలపల్లి రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి ఫేజ్–2 అనుమతులు రావడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాటారం మీదుగా భూపాలపల్లి.. మండల కేంద్రం తాడిచర్ల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. తమ ప్రాంతం నుంచి పెద్దతూండ్ల మీదుగా అటవీ ప్రాంతం గుండా రహదారి నిర్మిస్తే ఎంతో సమయంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లే వారు కూడా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఏడాది క్రితం తాడిచర్ల–ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో దూరభారం తగ్గింది. 2017 సంవత్సరంలో ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. మిగతా రోడ్డు నిర్మాణం కోసం అటవీ అనుమతులు రాకపోవడంతో అక్కడికే నిర్మాణాన్ని నిలిపివేశారు. రూ.4.67 కోట్ల చెల్లింపు.. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీ శాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు చెల్లించడంతో ఫారెస్ట్ నుంచి ఫేజ్–2 అనుమతులు వచ్చాయి. ఫారెస్ట్ అధికారులు త్వరలోనే చెట్లను తొలగించనున్నారు. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అధికారులు రూ.15 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. తగ్గనున్న దూరభారం.. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూర భారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగు పడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. విద్య, వైద్యానికి చేరువవుతాం.. కిషన్రావుపల్లి ఫారెస్ట్లో రోడ్డు నిర్మిస్తే విద్యార్థులకు ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి ఆస్పత్రులకు వెళ్లడానికి అనువుగా ఉంటుంది. ప్రయాణ భారం తగ్గుతుంది. – బోడ్డు తిరుపతి, పెద్దతూండ్ల, మల్హర్ కిషన్రావుపల్లి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ లైన్ క్లియర్ పూర్తయిన టెండర్ ప్రక్రియ త్వరలోనే పనులు ప్రారంభం తగ్గనున్న దూర భారం -
కోటిన్నర ప్రాపర్టీ పట్టు!
● కూపన్ కొనుగోలుకు ఉవ్విళ్లూరుతున్న జనం ● సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన వైనంకాళేశ్వరం: ఐదు వేల ఒక రూపాయితో కూపన్ కొనుగోలు చేసి.. లక్కీడ్రాలో మొదటి బహుమతి వరిస్తే కోటిన్నర ప్రాపర్టీ స్వంతం చేసుకొనే అదృష్టం లభిస్తుందని వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టింగ్లు వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద 66 గజాల ప్లాటుకు రూ.500 కూపన్ పెట్టి విక్రయాలు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. అది మరువక ముందే మళ్లీ కాళేశ్వరంలో అలాంటి ప్రాపర్టీ విక్రయ సేల్కు భవన యజమాని కొత్తగా ఆలోచన చేశాడు. కాళేశ్వరంలోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ను యజమాని శ్రీనివాస్రెడ్డి ఇటీవల విక్రయానికి పెట్టాడు. కానీ సరైన ధర, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లక్కీడ్రాను ఏర్పాటు చేసి అందరూ కూపన్లు కోనేలా ప్లాన్ చేస్తున్నాడు. రూ.5,001తో లక్కీ డ్రా కూపన్ తీసుకొని కోటిన్నర విలువగల ప్రాపర్టీని పట్టు అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. మొత్తం లక్కీ డ్రా కూపన్లు 2,500 వరకు విక్రయించడానికి సిద్ధమయ్యాడు. మొదటి బహుమతి కోటిన్నర ప్రాపర్టీ, రెండవ బహుమతి రెండు తులాల బంగారం, మూడో బహుమతి కిలో వెండి అందజేస్తామని కూపన్లలో పేర్కొంటున్నాడు. ఈ లక్కీడ్రా జనవరి 14న తీయనున్నారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూపన్లు తీసుకోవడానికి ఆరా తీస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాతో పాటు మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
వ్యూహాలకు పదును..
‘స్థానిక’ ఎన్నికలకు పావులు కదుపుతున్న అగ్రనేతలుసాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లా ప్రజాపరిషత్లతో పాటు ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గస్థాయి సమావేశాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆదివారం నుంచి కార్యాచరణ అమలు చేయనుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్తో సంప్రదింపులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీ సందేశం పంపింది. ఇక వామపక్షాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఆదివారంనుంచి నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానంనుంచి నాలుగు నుంచి ఐదు పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదించనున్నారు. స్థానిక అభ్యర్థులకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజాదరణ, కార్యకర్తల మద్దతు ప్రాధాన్యాంశాలు కానున్నాయని, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం సూచనల మేరకు పారదర్శకంగా ఉంటుందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలు కీలకమైనందున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ముందుగానే నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు జెడ్పీలపై గురి... కాంగ్రెస్, బీఆర్ఎస్... ఈ రెండు పార్టీలు ఆరు జిల్లా ప్రజాపరిషత్ స్థానాలపై గురిపెట్టాయి. బీజేపీ సైతం గట్టీ పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి హనుమకొండ జెడ్పీ ఎస్సీ మహిళ, వరంగల్ ఎస్టీ జనరల్, ములుగు ఎస్టీ మహిళ, జనగామ ఎస్సీ మహిళ, మహబూబాబాద్ జనరల్, భూపాలపల్లి బీసీ జనరల్కు రిజర్వు చేశారు. వాస్తవానికి హనుమకొండ, వరంగల్, జనగామలు జనరల్కు వస్తాయని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు ఉండటంతో ఆశావహుల అంచనాలు దెబ్బతినగా.. ఈ ఆరింటిని ఎలా కై వసం చేసుకోవాలి? అన్న వ్యూహంలో ప్రధాన పార్టీల నాయకత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 75 జెడ్పీటీసీ స్థానాలు.. 75 ఎంపీపీ పదవులను దక్కించుకోవడం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 778 ఎంపీటీసీలు, 1,705 సర్పంచ్ పోస్టులకు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకోవడం పెద్ద టాస్క్గా మారింది. కాగా ఈ నెల 8న రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై విచారణ, తీర్పు ఉండగా.. ఆ మరుసటి రోజైన 9వ తేదీనుంచి మొదటి విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రధాన పార్టీలు పావులు కదుపుతుండగా.. పల్లెల్లో ‘స్థానిక’ ఎన్నికల సందడి రోజు రోజుకూ జోరందుకుంటోంది. ప్రధాన రాజకీయపార్టీల్లో సాగుతున్న కసరత్తు ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నేటినుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు బీఆర్ఎస్, బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు గెలుపు గుర్రాల వేటలో మూడు ప్రధాన పార్టీలు.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ -
– ఎస్ఎస్తాడ్వాయి
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
బడుల నిర్వహణకు కష్టాలు
కాటారం: సర్కారు బడుల నిర్వహణకు నిధుల కొర త నెలకొంది. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ పాఠశాలల ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలల్లో అవసరమయ్యే చాక్పీస్లు, స్టేషనరీ సామగ్రి, చిన్న, చిన్న మరమ్మతుల కోసం ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు మాత్రం 50 శాతం నిధులు మంజూరయ్యాయి. మిగితా పాఠశాలల్లో నిధుల లేమి నెలకొనడంతో నిర్వహణ భారంగా మారిపోయింది. ఏటా రెండు పర్యాయాలు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఇప్పటివరకు నిధులు అందించలేదు. ఇటీవల ప్రభుత్వం పాఠశాల గ్రాంట్స్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు పాఠశాలల ఖాతాల్లో జమకాలేదు. జిల్లాలో 430 పాఠశాలలు.. జిల్లాలో 317 ప్రాథమిక, 44 ప్రాథమికోన్నత, 69 ఉన్నత పాఠశాలలో కలుపుకొని 430 పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 19,788 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరవుతాయి. గతేడాది సకాలంలో నిధులు మంజూరైనప్పటికీ ఈ ఏడాది మాత్రం నిధులు జమకావడంతో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో తాగునీరు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగలు, గదుల మరమ్మతు, ప్రయోగశాల సామగ్రి కొనుగోలు, తదితర నిర్వహణ హెచ్ఎంలకు కష్టతరంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. 1నుంచి 30మంది వరకు విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలకు రూ.10వేలు, 31నుంచి 100లోపు పాఠశాలలకు రూ.25వేలు, 101 నుంచి 250మంది వరకు రూ.50వేలు, 251 నుంచి 1000 వరకు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలకు రూ.75వేల చొప్పున ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటితే ఆ పాఠశాలలకు రూ.లక్ష వరకు నిధులు వస్తాయి. క్రీడలపై నిర్లక్ష్యం.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించే నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుండటంతో క్రీడలపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో పాఠశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాఠశాలల్లో పాత క్రీడా సామగ్రితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. నిధులు జమ చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులు విడుదల అయ్యాయి. పాఠశాలల ఖాతాల్లో జమ చేస్తున్నాం. త్వరలోనే అన్ని పాఠశాలలకు నిధులు చేరుతాయి. పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారిఆర్థిక కష్టాల్లో సర్కారు స్కూళ్లు నాలుగు నెలలుగా అందని నిధులు ఇబ్బందులు పడుతున్న హెచ్ఎంలు -
అధికారులు సూచనలు ఇవ్వాలి
నాలుగెకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేశాను. ప్రభుత్వం గతేడాది వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోంది. గతనెల నుంచి వానలు అధికంగా ఉన్నాయి. దీంతో వరి పంటకు తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు పొలాలను పరిశీలించి తగు సూచనలు, సలహలు ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. – కంది కుమార్, రైతు, కొత్తపల్లి (ఎస్ఎం), భూపాలపల్లితెగుళ్ల నివారణకు చర్యలుపంటలు పొట్టదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జిల్లాలో సన్నధాన్యం ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం అక్కడ పంటకు వివిధ తెగుళ్లు సోకుతున్నట్లు సమాచారం. రైతులు ఆందోళన పడాల్సిన అవపరం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించి పంటలకు కాపాడుకోవాలి. – బాబురావు, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ శాఖ అధికారి -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రైతులకు రెండు రూ.లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం రేవంత్రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మిల్కూరి అయిలయ్య, నాయకులు పాల్గొన్నారు. -
జాతిపితకు ఘన నివాళి
భూపాలపల్లి అర్బన్: భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమానికి అదనపు ఎస్పీ నరేష్కుమార్ హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ రత్నం, ఆర్ఎస్ఐ, డీపీఓ పాల్గొన్నారు. -
ఉత్పత్తి పెంచేందుకు కొత్త ఆవిష్కరణలు
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి భూపాలపల్లి అర్బన్: రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచేందుకు కొత్త ఆవిష్కరణ తీసుకురానున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఈ మేరకు ఏరియాలోని కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్ల భవిష్యత్పై కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 100 మిలియన్ టన్నులు, భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ దిశగా ఏరియాలో సంస్థలో చేపట్టాల్సిన కొత్త ఆవిష్కరణల కోసం తీసుకోవాల్సిన చొరవపై చర్చించారు. రానున్న ఐదు సంవత్సరాలకు ప్రణాళికలు, వ్యూహ రచనలు, నష్టాలు తగ్గించుట, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలన్నారు. పెండింగ్ పనుల పరిశీలనలు, ఖర్చులు తగ్గించడం, మంచి ప్రణాళికలను అనుసరించడం తదుపరి అంశాలపై అన్ని గనులు, డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం కవీంద్ర, సివిల్ ఏజీఎం రవికుమార్, వివిధ గనుల పీఓలు, మేనేజర్లు శ్యాంసుందర్, భిక్షమయ్య, రవీందర్ పాల్గొన్నారు. -
సన్నాలకు సై..
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● జిల్లాలో 1,04,194 ఎకరాల్లో వరి సాగు ● బోనస్ ప్రకటించడమే కారణం.. ● గత సీజన్నుంచే వర్తింపుభూపాపపల్లి రూరల్: ప్రభుత్వం మద్దతు ధరతో పాటు గతేడాది నుంచి సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు సన్న ధాన్యం సాగుకు మొగ్గు చూపారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా ఉద్యాన పంటలు కలిపి 2.24 లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి 1,15,653 ఎకరాల్లో సాగు చేశారు. అందులో 1,04,194 ఎకరాలు సన్న ధాన్యం సాగుచేయగా 11,459 ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగుచేశారు. అంతకుముందు ఏడాది సన్నాలు 30వేల ఎకరాలకు మించి సాగు చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన ఇంత పెద్దమొత్తంలో సన్నాలు సాగుచేయడానికి కారణం ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడమే. రైతులకు అదనపు ఆదాయం.. జిల్లాలో గతేడాది యాసంగి సీజన్లో 87,650 ఎకరాల్లో సన్నాలు సాగుచేయగా 23 వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు రూ.2310 మద్దతు ధరకు కొనుగోలు చేశారు. అదనంగా ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1,04,194 ఎకరాల్లో సన్నధాన్యం సాగుచేశారు. సుమారుగా ఎకరాకు 25 క్వింటాల్కు పైగా దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. తెగుళ్ల బారిన సన్నాలు.. జిల్లాలో సన్నాలకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్గితెగులు, పచ్చదోమ, తెగులు సోకుతున్నాయి. దీంతో దిగుబడిపై ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంట పొట్టదశకు వచ్చింది. ఈ దశలో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
రామప్ప శిల్పకళాసంపద అద్భుతం
● ఆలయాన్ని సందర్శించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డివెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దసరా సంబురం
● జమ్మికి పూజలు, పాలపిట్ట దర్శనం ● రావణుడి ప్రతిమలు దహనం ● భారీగా హాజరైన జనంభూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో జమ్మిచెట్టు వద్ద పూజలు, రావణ వధ కార్యక్రమాలు చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. దుర్గామాత ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహన పూజలు చేపట్టారు. జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీ క్రీడామైదానంలో గురువారం రాత్రి మున్సిపాలిటీ, సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణాసుర వధ కార్యక్రమాన్ని తిలకించడానికి వేలాది మంది తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ టీం సభ్యులు చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. చుట్టు గ్రామాలు, పట్టణంలోని పలు కాలనీల్లో నుంచి కుటుంబసభ్యులతో కలిసి సింగరేణి క్రీడామైదానానికి అధిక సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. భూపాలపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రజల మౌలిక సదుసాయాల కల్పన కోసం అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదిక ప్రాంతంలో సీఐ నరేష్కుమార్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటుచేసిన రావణాసుర వధకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు నిప్పు అంటించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విజయదశమి వేడుకలను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయ వాహనాలను వినియోగించే సిబ్బందితో కలిసి కలెక్టర్ పూజలో పాల్గొన్నారు. -
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం అనుబంధ దేవాలయాల్లోని శ్రీశుభా నందదేవి, శ్రీమహాసరస్వతీ అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజుల పాటు వైభవంగా జరిగాయి. అమ్మవార్లు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం అమ్మవార్లు రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చా రు. భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. శమీ పూజ.. విజయదశమి(దసరా) సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీరామాలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గోదావరి నది వద్దకు మంగళవాయిద్యాలతో కాలినడక తీసుకెళ్లారు. ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ శమీ పూజ ఘనంగా నిర్వహించారు. అక్కడ శమీ(జమ్మిచెట్టు) ఆకులు తీసుకొని ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, అర్చకులు బైకుంఠపాండా, పవన్శర్మ, శ్రావణ్శర్మ, రామాచార్యులు, రిటైర్డు అర్చకులు లక్ష్మీనారాయణశర్మ, కృష్షమూర్తిశర్మ, భక్తులు పాల్గొన్నారు. -
సనాతన ధర్మమే శాశ్వతం
● మూలాలు మర్చిపోతే భవిష్యత్ ఉండదు ● ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భగవద్గీత ప్రచారకుడు శ్రీ రాధా మనోహర్దాస్ స్వామీజీ ములుగు: భారతీయ మూలాలను మర్చిపోతే భవిష్యత్ ఉండదని, యుగాలు మారినా సనాతన ధర్మమే శాశ్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకులు శ్రీ రాధా మనోహర్దాస్ స్వామీజీ అన్నారు. జిల్లా కేంద్రంలో విజయదశమిని పురస్కరించుకొని ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన రాధామనోహర్ స్వామీజీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం, తప్పుపై ఒప్పు విజయం సాధించిందన్నారు. సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ, విజయదశమి లాంటి పండుగలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం యువత పాటుపడాలని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేవారిని వదిలేదిలేదన్నారు. ప్రతీ ఒక్కరూ శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్మాత్మిక, సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా నిర్వహించిన రావణాసురవధ ఆకట్టుకుందని, పండుగపూట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాదిమంది కుటుంబాలను ఒకేచోట చేర్చి పండుగ జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మంచి కోసం చేసే ప్రతీ పనిలో తాను పాలుపంచుకుంటానని వెల్లడించారు. అనంతరం శ్రీ రాధామనోహర్ దాస్ స్వామీజీ, సీనియర్ సివిల్ జడ్జితోపాటు పలువురు ప్రముఖులు రావణసుర ప్రతిమకు నిప్పంటించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకర్షించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కన్నోజు సునీల్, చెలుమల్ల రాజేందర్, సుంకరి రవీందర్, గంగిశెట్టి శ్రీనివాస్, పెట్టెం రాజు, ఇమ్మడి రమేష్, వాంకుడోతు జ్యోతి, కర్ర రాజేందర్ రెడ్డి, కొత్తపల్లి బాబురావు, కొమరవెళ్లి హరినాథ్, గండ్రకోట రవీందర్, సానికొమ్ము వినీత్ రెడ్డి, తోకల నందన్, పెట్టెం రాజేందర్, ఎలగందుల మోహన్, రుద్రోజు ఆనందాచారి, రాము, సిరికొండ వెంకన్న పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
గోవిందరావుపేట: కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని, రిజర్వేషన్ తనకు అనుకూలం కాకున్నా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పైడాకుల అశోక్ హాజరై మాట్లాడుతూ.. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రిజర్వేషన్ తనకు అనుకూలంగా రాకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసరి సుదాకర్, జెట్టి సోమయ్య, కణతల నాగేందర్, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. పలువురిపై కేసు నమోదు గోవిందరావుపేట: మండలంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురువారం దసరా, రావణసుర వధ ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ తెలిపారు. పండుగ శాంతియుతంగా జరగడానికి ముందస్తుగానే మద్యం, మాంసం దుకాణ యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి దుకాణాలను మూసివేయించామని తెలిపారు. నిబంధనలను ఉల్లఘించి బెల్ట్ షాప్లు నడిపిన నలుగురిపై కేసులు నమో దు చేసినట్టు పేర్కొన్నారు. పస్రాలోని రావణ వధ వద్ద మద్యం మత్తులో వీధుల్లోకి వచ్చి పోలీసులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గాంధీ విగ్రహానికి కార్మికుల వినతి ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా కార్మికులు .. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి బొడ్రాయి ప్రాంతంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ మాట్లాడుతూ.. గాంధీ అహింసా సిద్ధాంతం మేరకు శాంతియుతంగా 22రోజులుగా సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని కోరారు. ఓ పక్క గత ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక కుటుంబం గడవక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వేతనాలను తగ్గిస్తూ జీఓ 64ను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. అర్హులైన అందరికీ టైం స్కేల్ ప్రకారం అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చిటమట రమేష్, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, సత్యం, సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిర, సుమలత, సాంబయ్య, శివకృష్ణ, సత్యం పాల్గొన్నారు. వీరన్న సన్నిధిలో భక్తుల సందడి కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. వాహనాలు బారులుదీరి కనిపించాయి. -
ఒకరిపై కేసు నమోదు
భూపాలపల్లి అర్బన్: ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి ఇంటికి గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన బి లక్ష్మయ్య వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న రాజిరెడ్డిని బయటికి పిలిచారు. బయటికి రాగానే లక్ష్మయ్య చేతిలో ఉన్న కర్రతో రాజిరెడ్డిపై దాడి చేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి కాటారం: మండల కేంద్రానికి సమీపంలో సబ్ స్టేషన్పల్లిలో సెప్టెంబర్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాటారం సబ్స్టేషన్పల్లికి చెందిన మాచెర్ల మల్లేశ్(60) గత నెల 29న ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. గాయాలైపాలైన మల్లేశ్ను చికిత్స నిమిత్తం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలవడంతో వైద్యులు రెఫర్ చేయగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉత్సవాలకు సిద్ధం
భూపాలపల్లి అర్బన్: తొమ్మిది రోజుల పాటు దేవీశరన్నవరాత్రులు నిర్వహించి పదో రోజు దసరా పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ పండుగ శోభ సంతరించుకున్నాయి. విజయదశమి రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అలంకరణలో పూజించనున్నారు. నేడు ఆయుధ పూజ.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు (గురువారం) ఆయుధపూజ నిర్వహించుకోనున్నారు. రైతులు వ్యవసాయ పనిముట్లు, వాహనదారులు తమ వాహనాలకు, పోలీసులు ఆయుధాలకు ఇలా ఎవరికివారు తమ వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలకు పూజలు చేయనున్నారు. శమీ పూజ.. విజయదశమి రోజు శమీ దర్శనం కోసం జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. అగ్నిని శమింపజేయడానికి ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం. అటువంటి శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకును తీసుకువచ్చి పెద్ద వారికి ఇచ్చి వారికి చేసి ఆశీర్వాదం పాదాభినందనం తీసుకుంటారు. పాల పిట్ట దర్శనం ప్రత్యేకం దసరా పండుగ రోజు సాయంత్రం పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రె పిట్టను చూస్తే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. ఇందుకోసం శమీపూజ అనంతరం కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలోకి పోయి పాలపిట్టను దర్శించుకుంటారు. అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ, సింగరేణి, దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సుమారు 40 ఫీట్ల పొడవైన రావణాసుర బొమ్మను ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం ప్రముఖ గాయకులు, మిమిక్రీ ఆర్టిస్టులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ముఖ్య అతిఽథులుగా కలెక్టర్ రాహుల్శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ఖరే, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి అధికారులు పరిశీలించారు. కేటీకే 5వ గనిలో జమ్మి పూజలు విజయదశమి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని ఆవరణలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే ఉన్నటువంటి జమ్మి చెట్టుకు పూజలు చేసి చెట్టు ఆకును పంచిపెడుతారు. పట్టణంలో ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని జమ్మి ఆకులను పంచుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటారు. సందడిగా మారిన పల్లె, పట్నం జిల్లా వ్యాప్తంగా రావణాసుర దహన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అది నేటికీ కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
ఘనంగా మహా పూర్ణాహుతి
మహిషాసుర మర్దినిగా అమ్మవార్ల దర్శనం కాళేశ్వరం: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆల య అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు 10వ రోజు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఆలయ అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఆలయంలో విశేష అభిషేక పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. ఘనంగా మహా పూర్ణాహుతి.. శీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం మహర్నవమిని పురస్కరించుకొని ఆలయ యాగశాలలో మహా పూర్ణాహుతి హోమం కార్యక్రమం ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ–శృతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈఓ మహేష్, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం గందెసిరి మధుసూదన్–రమాదేవి దంపతులు భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వారిని ఈఓ మహేష్ శాలువాతో సన్మానించారు.శ్రీశుభానందదేవి అమ్మవారు, శ్రీసరస్వతి అమ్మవారు -
మంత్రి ప్రత్యేక పూజలు
కాటారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలకేంద్రంతో పాటు ఎర్రగుంటపల్లి, ధన్వాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాల వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చనలు చేసి అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. విజయదశమి శుభాకాంక్షలు భూపాలపల్లి రూరల్: జిల్లా ప్రజలకు కలెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం, ఆరోగ్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని కోరుకున్నారు. 54 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ బొగ్గు గనులలో సెప్టెంబర్ నెలలో 54 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాలోని గనుల్లో 3.17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 1.71 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించినట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్లో ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలగడంతో ఉత్పత్తి వెనుకబడిపోయినట్లు కనిపిస్తుందని తెలిపారు. అక్టోబర్ నెలలో 4.23 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ను విధించినట్లు చెప్పారు. బొగ్గు ఉత్పత్తికి సింగరేణి కార్మికులు సహకరించాలని కోరారు. ఉద్యోగులందరూ రక్షణ సూత్రాలు పాటించాలని, రక్షణ విషయంలో యాజమాన్యం రాజీపడేది లేదన్నారు. కోడిపందేల స్థావరంపై దాడి కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలం కోనంపేట శివారులో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై బుధవారం ఎస్సై–2 మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడి జరిపినట్లు ఎస్సై–2 మహేశ్ తెలిపారు. ఘటనా స్థలంలో కోడిపందేలు ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13,300 నగదు స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. మహాముత్తారానికి చెందిన రవి, రాజేందర్, రాజేశ్, నిఖిల్, రవి, రమేశ్, శ్రీకాంత్, నాగారం గ్రామానికి చెందిన పక్రుద్దీన్, రమేశ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్కుమార్ తెలిపారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. ప్రజలు దసరా పండుగ ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్కు చెందిన పర్యాటకుడు నికోలస్ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం నికోలస్ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్ ప్రశసించారు. నర్సింగాపూర్కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు. కన్నాయిగూడెం: గోదావరి వరదతో నీట మునిగి దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారి మహేశ్ అధికారులతో కలిసి పరిశీలించారు. బుధవారం మండల పరిధిలోని గూర్రేవుల, సింగారం, బుట్టాయిగూడెం, చింతగూడెంతో పాటు ఇతర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించినట్లు తెలిపారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!
గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
కాళేశ్వరం దేవస్థానం ఏసీ స్థాయి పెంపు?
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) స్థాయి హోదాను దేవాదాయశాఖ పెంచుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు పూర్తిచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం 6ఏ ఆలయంగా ఉన్న దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓ విధులు నిర్వర్తిస్తున్నారు. 2027 జూలైలో జరుగు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఏసీ(అసిస్టెంట్ కమిషనర్)స్థాయి పెంచుతున్నారని తెలిసింది. దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మరింత మంది ఉద్యోగులు, అర్చకుల అవసరం ఉండనుంది. ఆలయ వార్షికాదాయం రూ.6కోట్లకు చేరింది. మే నెలలో జరిగిన సరస్వతినది పుష్కరాల సమయంలోనే ఏసీ స్థాయి పెంపుపైన చర్చకు వచ్చింది. మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అభివృద్ధి కోసం స్థాయి పెంచుతున్నారని తెలిసింది. రెండు నెలల కిందటనే ఆలయ ఆదాయ, వ్యయాలు, డిపాజిట్లు, ఇతర వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపారు. 2016లో అప్పటి సీఎం కేసీఆర్, రూ.25కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన సరస్వతి నది పుష్కరాల్లో రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉత్తర్వులు రానున్నట్లు సమచారం. -
ఎంతవుతదో..
ఎన్నికల ఖర్చుపై ఆశావహుల టెన్షన్ భూపాలపల్లి అర్బన్: ఇన్నాళ్లు నోటిఫికేషన్.. రిజర్వేషన్ కోసం ఆతృతగా ఎదురుచూసిన అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల ఖర్చును ఊహించుకుంటూ బరిలో నిలవాలంటే భయపడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయాలను ఆశావహులు ఖర్చు ఎంతవుతుందో అని మదనపడుతున్నారు. పోటీ చేద్దాం అనుకున్నా ఖర్చులు భయపెడుతున్నాయి. రూ.20లక్షల వరకు.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారుకావటంతో పాటు, సోమవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రిజర్వేషన్లు ఖరారుకావటంతో రిజర్వేషన్ కలిసివచ్చిన వారు ఉత్సాహంగా ఉండగా, మరికొందరు నిరాశకు గురయ్యారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని తెలిసి, అప్పటి నుంచే ఆశావహ అభ్యర్థులు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. వర్గాల వారీగా గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాలవారీగా ఓటర్లు తక్కువగా ఉన్నా, గెలుపోటములను స్వల్ప ఓట్లే నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రతి ఓటు విలువైనదే. దీంతో ఖర్చు కూడా గ్రామపంచాయతీల్లో రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేజర్ గ్రామపంచాయతీల్లో ఇది ఇంకాస్త ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. మండల హెడ్క్వార్టర్లుగా ఉన్న పంచాయతీల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయని పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థులు అనుకుంటున్నారు. దావత్లతో మొదలు ఆశావహులకు ఖర్చుల మోత దసరా దావతులతో మొదలైంది. గ్రామంలో కొద్దిగా పట్టున్న చిన్న స్థాయి నాయకులకు, కులసంఘాల పెద్దలకు రోజు ఆశావహులు చాలా మంది దావత్లు మొదలు పెట్టారు. పనిలో పనిగా తాము పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మనసులో మాట చెప్పి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పనిలో పనిగా గ్రామాల్లోని యువ ఓటర్లకు పార్టీల పేరుతో ఓట్ల గాలాలు వేస్తున్నారు. దసరా పండుగకు గ్రామాలకు వచ్చిన వారితో మాటముచ్చట కలిపి మంచి చెడులపై తెలుసుకుంటున్నారు. మొదటి ఖర్చులే తడిసిపోతున్నాయని ఇక బరిలోకి దిగితే ఏమాత్రం ఖర్చు అవుతుందో అని అభ్యర్థులు డబ్బులు పోగేసే పనిలో ఉన్నారు. అభ్యర్థులే భరించాలి.. జిల్లాలో అధికార పార్టీతో పాటు, ప్రతిపక్షాలది కూడా ఏమంత గొప్పగా లేదు. తమ పార్టీ మద్దతు ఉన్నా కూడా ఖర్చులను అభ్యర్థులే సొంతగా భరించాలని పార్టీల నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు కాబట్టి గెలవాలంటే ఎంతో కొంత మీరే ఎన్నికల ఖర్చులు భరించాలని విపక్ష పార్టీల మద్దతు పొందే ఆశావహులకు పార్టీ నాయకులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. అధికార పార్టీలో కూడా ఇదే తీరు కనిపిస్తుంది. పెరిగిన ఖర్చులో పార్టీ ఇచ్చే ఫండ్ ఏమాత్రం సరిపోయేలా లేదు. గ్రామాల్లో దసరా దావత్లు షురూ.. యువకులను ఆకర్షించే పనిలో నాయకులు -
జూకల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు
చిట్యాల: మండలంలోని జూకల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు రాంరెడ్డి, కిష్టయ్య, సంతోష్ , మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
దసరా పండుగ అంటేనే చుక్క, ముక్కకు పెట్టింది పేరు. అలాంటి దసరా పండుగ గాంధీ జయంతి రోజు వస్తుండటంతో మందుబాబులకు తిప్పలు వచ్చిపడింది. కానీ ఆ లోటును పూర్తి చేయడానికి బెల్టుషాపుల నిర్వాహకులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం రోజు మద్యం దుకాణాలు బంద్ ఉండటం బెల్టుషాపు నిర్వాహకులకు కలిసి వచ్చింది. రెండు రోజుల ముందుగానే బెల్టుషాపుల నిర్వాహకులు స్థానికంగా ఉండే వైన్స్ల నుంచి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. సాధారణంగా బెల్టు దుకాణాల్లో బీర్లతో పాటు తక్కువ ధర కలిగిన మద్యం అందుబాటులో ఉంటుంది కానీ దసరా సందర్బంగా నిర్వాహకులు అన్ని రకాల మద్యాన్ని బెల్టుషాపుల్లో అందుబాటులో ఉంచేలా కొనుగోలు చేస్తున్నారు. కాటారం: దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. పండుగలు వస్తే చాలు గ్రామాల్లో గుడుంబా ఏరులై పారుతోంది. దసరా పండుగ కోసం పలు పల్లెల్లో గుడుంబా తయారీదారులు పెద్దఎత్తున గుడుంబా తయారుచేసి రవాణా, విక్రయానికి సిద్ధం చేశారు. పండుగకు పది రోజుల ముందు నుంచే గుడుంబా తయారీకి అవసరమయ్యే పటిక, బెల్లం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని నాటుసారా తయారీకి పూనుకున్నారు. తయారీకి ప్రత్యామ్నాయంగా యూరియా, చక్కర, ఇతర ముడిపదార్థాలు స్థానికంగా లభిస్తుండటంతో గుడుంబా తయారీ మరింత సులభమైంది. దీంతో లీటర్ల కొద్ది గుడుంబాను తయారుచేసి దసరా పండుగకు విక్రయాలు సాగిస్తున్నారు. ఓ పక్క ఎకై ్సజ్ అధికారులు తమ దాడులతో బెంబేలెత్తిస్తున్నప్పటికీ తయారీదారులు ఏ మాత్రం జంకకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. దసరాకు భలే గిరాకీ.. పల్లెల్లో సాధారణ రోజుల్లోనే గుడుంబాకు, బెల్టుషాపుల్లో మద్యానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దసరా, సంక్రాంతి లాంటి పండుగలు వస్తే విక్రయాలు మరింత ఎక్కువగా సాగుతుంటాయి. దీని కి తోడు వైన్స్షాపులు బంద్ ఉంటుండటంతో బెల్టుషాపుల్లో మద్యం, గుడుంబా విక్రయాలు జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగకు పల్లెలకు మద్యం, గుడుంబా కిక్కు నెలకొననుంది. నిత్యం దాడులు..మారని తీరు.. గుడుంబా నియంత్రణపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ అంత మొత్తంలో ఫలితం దక్కడం లేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నిత్యం మూకుమ్మడిగా దాడులు నిర్వహించి వేలాది లీటర్ల బెల్లం పానకం, గుడుంబా ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ తయారీ మాత్రం ఆగడం లేదు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రూట్ వాచ్లు, పెట్రోలింగ్ చేపడుతున్నప్పటికీ తయారీదారులు అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి సరఫరా చేపడుతున్నారు. ఏడు నెలల కాలంలో జిల్లాలో గుడుంబా తయారీదారులు, విక్రయదారులపై వందలాది కేసులు నమోదయినప్పటికీ ఏ మాత్రం మార్పు రావడం లేదు. జిల్లాలో గుడుంబా తయారీ, రవాణాను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. దసరాకు గుడుంబా తయారీ ఎక్కువగా ఉంటుందని భావించి భూపాలపల్లి, కాటారం ఎకై ్సజ్ పరిధిలోని అధికారులు, సిబ్బంది, డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్ టీంను అప్రమత్తం చేస్తూ గుడుంబా స్థావరాలపై నిత్యం దాడులు చేపడుతున్నాం. గాంధీ జయంతి రోజు మద్యం విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్జిల్లాలో అధికంగా అటవీ గ్రామాల్లోనే గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది. పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తయారీదారులకు గుడుంబా తయారీ సులభతరం అవుతుంది. అటవీ ప్రాంతంలో తయారీదారులు రోజుకో అడ్డా మారుస్తూ పెద్దఎత్తున గుడుంబా తయారు చేసి రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమెల, మహదేవపూర్ మండలాలతో పాటు భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాలు, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, మండలాల్లోని అధికంగా గుడుంబా తయారు చేస్తున్నారు. గతంలో ఇళ్ల పరిసర ప్రాంతాల్లో తయారు చేసేవారు, కానీ ఎకై ్సజ్ అధికారుల దాడులు అధికమవడంతో గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలు, పొలాలు, చేలు, వాగులు, వంకల సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా తయారీకి పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయంలో తయారీ సామగ్రిని తరలించి పగలు, రాత్రి తేడా లేకుండా పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేస్తున్నారు. తయారు చేసిన గుడుంబాను మరో చోటుకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఆర్డర్లపై గ్రామాల్లోని విక్రేతలకు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. బెల్టు దుకాణాలకు సైతం భారీగా మద్యం గాంధీ జయంతి కావడంతో ముందస్తుగా కొనుగోలు పెద్ద ఎత్తున రవాణా, విక్రయాలు -
పొరపాటుకు తావివ్వొద్దు
భూపాలపల్లి: చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నోడ ల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు స జావుగా నిర్వహించుటలో అధికారుల విధులు చాలా కీలకమన్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై పటిష్టమైన నిఘా ఉంచాలని చెప్పారు. చెక్పోస్టులలో వాహనాలను నిశిత పరిశీలన చేయాలని ఆ దేశించారు. మ్యాన్పవర్, బ్యాలెట్ బాక్సులు, ట్రా న్స్పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్లైన్ అండ్ కంప్లయింట్స్ రెడ్రెస్సల్, వెబ్కాస్టింగ్ తదితర విభాగాలపై నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ శ్రీలత, అన్ని విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. పార్టీలు సహకరించాలి.. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల్లో పాటించాల్సిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూం కోసం భవన పరిశీలన.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ ఏర్పాటు కోసం కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల భవనాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ ఉన్నారు. యాస్పిరేషన్ పారా మీటర్లు పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పలిమెల, మహాముత్తారం మండలాల యాస్పిరేషన్ పారామీటర్లు నమోదుపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సీపీఓ బాబూరావు, డీఆర్డీఓ బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు వెన్నెముక లాంటివారని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు మాస్టర్ ట్రెయినర్లతో ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, ఓటర్ల సౌకర్యాలు, బ్యాలెట్ బాక్సులు, ఓటరు స్లిప్పులు, అభ్యర్థుల గుర్తులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తదితర అంశాలను తెలియజేశారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులే కీలకం కలెక్టర్ రాహుల్ శర్మ -
పండుగ పూట.. రైతు తండ్లాట
యూరియా కోసం రైతులకు పండుగ పూట కూడా తండ్లాట తప్పడం లేదు. మహదేవపూర్ పీఏసీఎస్కు 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న మహదేవపూర్, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల మంగళవారం ఉదయం పీఏసీఎస్ ఎదుట బారులుదీరారు. భారీగా రావడంతో అధికారులు పోలీస్ పహారా నడుమ పంపిణీ చేశారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నప్పటికీ రైతులందరికీ యూరియా అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తచేస్తూ వెనుదిరిగారు. గ్రామాల్లోనే పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవని వాపోయారు. – కాళేశ్వరం -
సింహ వాహనంపై ఊరేగింపు
కాళేశ్వరం: శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని ఆలయ ప్రాకారం మాడవీధుల గుండా సింహ వాహనంపై ఊరేగింపు సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో పూజ తంతును నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్ రవి, సిబ్బంది దూది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మోగిన ‘లోకల్’ ఎన్నికల నగారా
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలుజెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్లు 1,708గెలుపు గుర్రాల వేటలో పార్టీలు.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధిష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం త్వరలోనే ఇన్చార్జ్లను నియమించనున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడత పోలింగ్, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఇందుకోసం 15,258 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 రోజులపాటు ఎన్నికల కోడ్ షెడ్యూల్తో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్పోస్టుల ఏర్పాటుకు పోలీసు కమిషనర్, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల వివరాలు ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉమ్మడి వరంగల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సంర్పంచ్లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534తొలి, రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలువిడత నామినేషన్లు చివరి తేదీ పరిశీలన ఉపసంహరణ ఎన్నికలు ఓట్ల లెక్కింపు 1 అక్టోబర్ 9 అక్టోబర్ 11 అక్టోబర్ 12 అక్టోబర్ 15 అక్టోబర్ 23 నవంబర్ 11 2 అక్టోబర్ 13 అక్టోబర్ 15 అక్టోబర్ 16 అక్టోబర్ 19 అక్టోబర్ 27 నవంబర్ 11 1 అక్టోబర్ 17 అక్టోబర్ 19 అక్టోబర్ 20 అక్టోబర్ 23 అక్టోబర్ 31 అక్టోబర్ 31 2 అక్టోబర్ 21 అక్టోబర్ 23 అక్టోబర్ 24 అక్టోబర్ 27 నవంబర్ 4 నవంబర్ 4 3 అక్టోబర్ 25 అక్టోబర్ 27 అక్టోబర్ 28 అక్టోబర్ 31 నవంబర్ 8 నవంబర్ 8 -
అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
భూపాలపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్ని కల అధికారి రాణి కుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ ఐడీఓసీలో నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికే నోడల్ అధికారులను నియమించామన్నారు. గోడలపై రాజకీయ వ్రాతలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని, నియమావళి ఉల్లంఘన జరిగితే తగి న చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలను కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆడబిడ్డల ఆరాధన పండుగగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. దసరా పండుగ శక్తి ఆరాధనకు సంకేతమని, ఈ రెండు పండుగలు ప్రజలందరికీ ఆనందం, సౌఖ్యం, ఐకమత్యం కలిగించాలని ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల పాటు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో దిగ్విజయంగా జరుపుకున్నారని పేర్కొన్నారు. భూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది, అధికారులను సమకూర్పు, బ్యాలెట్ బ్యాక్స్లు, ఎన్నికల సిబ్బంది రవాణా, ఓటింగ్ సామగ్రి, ఎంసీసీ, ఖర్చుల వివరాలు, మానిటరింగ్ టీమ్, మీడియా కమ్యూనికేషన్లతో వివిధ విభాగాలకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. పలిమెల: గోదావరికి వస్తున్న భారీ వరద కారణంగా మండలంలోని పంకెన, సర్వాయిపేట, పలిమెల గ్రామాల్లో సుమారు 30 ఎకరాల వరకు పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ముగింపు దశకు వచ్చినప్పటికీ వర్షాలు, వరదలతో పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోయారు. తమను వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాటారం: రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సాగుకు సరిపడా యూరియా అందిస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సోమవారం యూరియా పంపిణీని పర్యవేక్షించారు. యూరియా పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని రైతులకు ఇబ్బందులు కల్గనివ్వవద్దని డీఏఓ పీఏసీఎస్ అధికారులు, ఆగ్రోస్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. డీఏఓ వెంట ఏఓ పూర్ణిమ, ఏఈఓలు, సిబ్బంది ఉన్నారు. కాళేశ్వరం: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాజకీయ పార్టీల నాయకులు, దేశ నేతల విగ్రహాలను కనిపించకుండా పంచాయతీ అఽధికారులు వస్త్రాలు తొడిగారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమాలు పాటించి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి ఎన్.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
డిప్యూటీ కలెక్టర్గా గండ్ర నవీన్రెడ్డి
భూపాలపల్లి అర్బన్: డిప్యూటీ కలెక్టర్గా గండ్ర నవీన్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ రాహుల్శర్మను కలిసి జాయినింగ్ పత్రం సమర్పించి పూలబొకే అందజేశారు. విధుల్లో చేరిన నవీన్ రెడ్డిని కలెక్టర్ రాహుల్శర్మ అభినందించారు. ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేడర్లో డిప్యూటీ కలెక్టర్గా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని.. బాధ్యతలను సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఉద్యోగ సాధనలో ప్రోత్సహించిన తల్లితండ్రులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా నాగవైష్ణవి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా గడ్డం నాగవైష్ణవి నియమితులయ్యారు. ఈ మేరకు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. -
శ్రీ సరస్వతీదేవిగా అమ్మవార్లు దర్శనం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీసరస్వతి, శ్రీఽశుభానందదేవి(పార్వతి) అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మూలనక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతీదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. సోమవారం ఆలయ అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో సరస్వతిమాత ఆలయంలో విశేష అభిషేక పూజలు చేశారు. అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అనంతరం సరస్వతిమాత ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరస్వీకారాలు నిర్వహించి పలకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, మాజీ డైరెక్టర్ అశోక్, అర్చకులు రామాచార్యులు, శరత్చంద్రశర్మ, రామకృష్ణశర్మ, పవన్శర్మ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. నేడు అమ్మవారి వాహన సేవ.. శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు సింహావాహనంపై అమ్మవారి వాహన సేవ (ఊరేగింపు) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈఓ కోరారు. -
పూల పరిమళం
భూపాలపల్లి అర్బన్: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయే చందమామ’ అంటూ తీరొక్క పూలతో తెలంగాణ పల్లె వాకిట్ల సాగిన బతుకమ్మ సంబురాలు సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగిన సద్దుల బతుకమ్మతో ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు వైభవంగా కొనసాగింది. సోమవారం జిల్లావ్యాప్తంగా మహిళలు, యువతులు, విద్యార్ధినులు ఉదయం నుంచే పూల సేకరణలో నిమగ్నమయ్యారు. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు, యువతులు, చిన్నారులు అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు. అక్కడ బతుకమ్మలను ఉంచి ‘రామ రామ రామ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడారు. ఆటలు ఆడారు. కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. కష్టాలు తొలగిపోవాలంటూ గౌరమ్మను వేడుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని జనవనరుల్లో బతుకమ్మను జారవిడిచి ‘పోయిరా గౌరమ్మ.. పోయి రావమ్మా..’ అని ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం వాయినాలు ఇచ్చుకున్నారు. పట్టణంలో ఘనంగా.. భూపాలపల్లి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాత కూరగాయాల అంగడి మైదానాలు, హనుమాన్ దేవాలయం, సంతోషిమాత, రామాలయం, అయ్యప్ప ఆలయాల వద్ద బతుకమ్మ వేడుకులకు మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పలు బతుకమ్మ ఆట స్థలాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రాంగణాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిఽధిలోని మహిళలు బతుకమ్మ పండుగను ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడిన అనంతరం పట్టణ శివారులోని పాత ఎర్ర చెరువులో నిమజ్జనం చేశారు. ఊరూవాడ వేడుక ఉట్టిపడిన సంస్కృతి, సంప్రదాయం గౌరీ దేవికి ఘనంగా వీడ్కోలు వాయినాలు ఇచ్చుకున్న మహిళలు ముగిసిన పూలపండుగ -
గ్రూప్–2కు పలువురి ఎంపిక
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్–2 ఎంపిక జాబితాలో పలువురు జిల్లా నుంచి ఎంపికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి కాశీంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్కుమార్ సచివాలయంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా, సెగ్గంపల్లి గ్రామానికి చెందిన గజ్జె ప్రవళిక గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. భూపాలపల్లి మండలం చికెన్ పల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు సురేష్ ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. చిట్యాల మండలం బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామారావు ఎంపీఓగా నియమితులయ్యారు. కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి.. చిట్యాల: మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రమ–భీంరావు దంపతుల కుమారుడు రామారావు పదవ తరగతి ములుగులో, ఇంటర్ ఎస్ఆర్ హనుమకొండ, బీటెక్ హనుమకొండలో చదువుకున్నారు. ఆరేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ గ్రూప్–2 కోసం కష్టపడి చదువుకున్నాడు. గతేడాది గ్రూప్–2 పోటీ పరీక్షలు రాశారు. ఆదివారం ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలలో మల్టీజోన్ –1లో ఎంపీఓగా ఉద్యోగం లభించింది. రామారావు గ్రూప్–2కు ఎంపికై ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొక్కవోని దీక్షతో.. భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం చికెన్పల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు సురేష్ చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగాడు. తన ఎనిమిదో ఏట తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి కమల అన్నీ తానై సురేష్ను చదివించింది. తినడానికి తిండి లేని రాత్రులు గడపడంతో పాటు తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్లి సురేష్ విద్యాభ్యాసం చేశాడు. హనుమకొండలో ఇంటర్, బీటెక్ పూర్తిచేశాడు. 2020లో తల్లి కమల కేన్సర్తో మృతిచెందింది. సురేష్ తన స్నేహితుల సహాయంతో హైదరాబాద్లో గ్రూప్–1 కోచింగ్ తీసుకుని 2024లో గ్రూప్–1 పరీక్ష రాశాడు. 572 ర్యాంకు సాధించి ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. -
నేడు సద్దుల బతుకమ్మ జరుపుకోండి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం(నేడు) సద్దుల బతుమ్మను ప్రాంతీయ ఆచారంగా మహిళలు జరుపుకోవాలని కాళేశ్వరం దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ, అర్చకులు వెల్ధి శరత్చంద్రశర్మ ఆదివారం తెలిపారు. అమావాస్య నుంచి 9వ రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని, సప్తమితో కూడిన అష్టమి ఒకే రోజు రావడంతో సందిగ్ధం నెలకొందన్నారు. సందేహం లేకుండా ప్రాంతీయ ఆచారంగా సద్దుల బతుకమ్మ వేడుకలను 29న (నేడు) సోమవారం జరుపుకోవాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు జరుపుకుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఘనంగా భగత్సింగ్ జయంతి భూపాలపల్లి రూరల్: భగత్ సింగ్ 118వ జయంతిని పురష్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయస్సులోనే ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు భగత్సింగ్ అన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ 3న సెలవు ఇవ్వాలి భూపాలపల్లి అర్బన్: దసరా పండుగ రోజున గాంధీ జయంతి అవుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకు అక్టోబర్ 3వ తేదీన సెలవు ప్రకటించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ యాజమన్యాన్ని కోరారు. ఈ మేరకు ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ, గాంధీ జయంతిని గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమైక్యత, సమగ్రత కోసం దసరా పండుగ సెలవుదినాన్ని మార్చాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సుజేందర్, మల్లేష్, శ్రీనివాస్, సదానందం, శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, సాగర్, సదానందం, స్వామి, మొగిలి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక మల్హర్: జటాధార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జెట్ ఇన్నోవేటివ్ రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. మల్హర్ మండలం తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు వనపర్తి కుమారస్వామి, భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం డీఎన్టీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జయ ఎంపికయ్యారు. నేడు (సోమవారం) సికింద్రాబాద్లో హరిహర కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానోత్సవం చేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు వారిని అభినందించారు. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించి, దినదినాభివృద్ధి పొందేలా దీవించాలని అమ్మవారిని ఎమ్మెల్యే ప్రార్థించారు. -
జీఎస్టీ తగ్గింపు పేదలకు వరం
● ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతి ప్రజలకు వరమని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం తీసుకున్న చర్యలను వివరిస్తూ పలువురికి తగ్గింపు ధరల కరపత్రాలను చూపుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపునకు తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 370 వస్తువులపై జీఎస్టీ తగ్గించిందని వివరించారు. జీఎస్టీ తగ్గింపుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీరా సీతారాంనాయక్, కృష్ణవేణి, రమేష్, వెంకట్, రాజానాయక్, సురేందర్, సిరికొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. -
సద్దులకు సిద్ధం..
భూపాలపల్లి అర్బన్: సద్దుల బతుకమ్మను సోమ, మంగళవారాల్లో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలకు అసౌకర్యం కలగకుండా జిల్లావ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ జరుపుకునే ప్రాంగణాలు, ఆలయ ప్రాంగణాలు ముస్తాబు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధితో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంగణాలు సిద్ధం చేశారు. జలాశయాల వద్ద, దేవాలయాల్లో, పలు కూడళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మలను నీటిలో వదిలే సమయంలో ఇబ్బందులు చోటు చేసుకోకుండా బృందాలను జలాశయాల వద్ద ఉంచనున్నారు. పోలీస్ యంత్రాంగం ఇప్పటికే బందోబస్తుపై దృష్టి సారించింది. బతుకమ్మ జరుపుకునే ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సందడి షురూ.. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు.. వైభవంగా బతుకమ్మ పండగను జరుపుకునేందుకు పూలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కొత్త బట్టల కొనుగోళ్లతో సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని గ్రామాల నుంచి కొందరు పూలను సేకరించి తీసుకొచ్చి పట్టణంలో విక్రయిస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో ఆటపాటలు భూపాలపల్లి పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను కనుల పండువగా జరుపుకునేందుకు ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో రంగురంగుల విద్యుత్ అలంకరణలతో ప్రాంగణాలు ముస్తాబు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో పెద్దఎత్తున వేడుకలను నిర్వహించేందుకు అంబేడ్కర్ స్టేడియం, వారాంతపు సంత, హనుమాన్, అయ్యప్ప, రామాలయాల్లో వేదికలు ముస్తాబు చేస్తున్నారు. పూలకు భలే గిరాకీ చివరి రోజైన సద్దుల బతుకమ్మ కోసం అందంగా బతుకమ్మలు పేర్చేందుకు ఆడపడుచులు పూల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆదివారం గ్రామాల నుంచి కొందరు తంగేడు, గునుగు, టేకు, బంతి పూలను జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోకి తీసుకువచ్చి విక్రయిస్తుండగా ధరలు కూడా ఎక్కువగానే చెబుతున్నారు. తంగేడు పూల కట్టను సైజును బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. గునుగు పూల కట్ట రూ.20 నుంచి రూ.30 వరకు, ఇక బంతి పూలను ప్రాంతాన్ని బట్టి రూ.80నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. ఇతర రకాల పూలకు కూడా బాగానే గిరాకీ ఉంది. ముస్తాబవుతున్న బతుకమ్మ ప్రాంగణాలు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పర్యవేక్షణరెండు రోజుల సద్దుల బతుకమ్మ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బతుకమ్మ పండగపై తీవ్ర అయోమయం నెలకొంది. నేడు(సోమవారం), మంగళవారం నిర్వహించుకోవాలని పండితులు రెండు రకాల తేదీలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన నిర్వహించాలని సర్క్యూలర్ జారీ చేసింది. బతుకమ్మను ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా తొమ్మిదో రోజున జరుపుకుంటారని అందులో భాగంగానే అధిక శాతం గ్రామాల్లో నేడు(సోమవారం) జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బతుకమ్మలను పేర్చుకునేందుకు పూలను కొనుగోలు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం నిర్వహించుకోనున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
● టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ కాటారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ అన్నారు. కాటారం మండలకేంద్రంలో ఆదివారం టీఆర్టీఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్టీయూ రాష్ట్ర బాధ్యుడు హట్కర్ రమేశ్నాయక్, మండల అధ్యక్షుడు రేపాల వేణుగోపాల్, పీర్ల మోహన్రావు, కోటేశ్వర్, సబిత, వెంకటేశ్, కృపాకర్ తదితరులు టీఆర్టీఎఫ్ సభ్యత్వం తీసుకున్నారు. నూతనంగా చేరిన వారికి రాష్ట్ర అద్యక్షుడు కటకం రమేశ్, మెంబర్షిప్ రాష్ట్ర కన్వీనర్ సుంకేసుల ప్రభాకర్రావు మాట్లాడుతూ టీఆర్టీఎఫ్ సిద్ధాంతం భావజాలం సామాజిక కోణంతో ముడిపడి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్, కార్యదర్శి రవీందర్, కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, రఘుకుమార్, ఆజ్మీర అనిల్, రాజునాయక్, పరంసింగ్ పాల్గొన్నారు. -
ప్రజల భద్రత కోసమే కార్డన్సెర్చ్
● డీఎస్పీ సూర్యనారాయణ మల్హర్: ప్రజల భద్రత కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మండలంలోని కొయ్యూరు గ్రామంలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 20 టీజీఎస్పీ కానిస్టేబుళ్లతో కలిసి ఇళ్లలో తనిఖీలు చేశారు. నంబర్ ప్లేట్లేని 7 వాహనాలు, వాహన పత్రాలు సరిగా లేని 25 వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గుడుంబా, గంజాయి వంటి చెడు వ్యసనాలు, సీసీ కెమెరాలు, డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ దసరా పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేష్, రాజన్, కాటారం ఎస్సై శ్రీనివాస్, మానస, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీమహా చండీదేవిగా అమ్మవార్ల దర్శనం
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025కాళేశ్వరం: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి (పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు ఏడో రోజు శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శమిచ్చారు. ఆదివారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మంత్రపుష్పం పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో రద్దీ నెలకొంది. నేడు మూలనక్షత్రం.. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా (నేడు) సోమవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతి, శ్రీశుభానందదేవి అమ్మవారు ఎనిమిదో రోజు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శ్రీసరస్వతి అమ్మవారుశ్రీశుభానందదేవి అమ్మవారు -
శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవార్లు
శ్రీశుభానందదేవి అమ్మవారుశ్రీసరస్వతి అమ్మవారు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి మంత్రపుష్పం పూ జా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాంకేతిక కేంద్రాలతో ఉపాధి అవకాశాలు
భూపాలపల్లి అర్బన్: యువతకు నైపుణ్యంతో పాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశామని, దీంతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో రూ.43 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏటీసీ కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. ఏటీసీ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు పరిశ్రమలతో పాటు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అ వసరం ఉందని స్పష్టంచేశారు. ఏటీసీ కేంద్రానికి రూ.43 కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్య మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో భూపాలపల్లి, కాటారంలో ఐటిసి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ జామ్లనాయక్, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ రాజేంద్రప్రసాద్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి, ఉపాధి కల్పన అధికారి శ్యా మల, విద్యుత్శాఖ ఎస్ఈ మల్చూర్నాయక్, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు, పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి
కాటారం: గ్రామీణ ప్రాంతంలోని యువతకు సాంకేతిక రంగాల్లో శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు కృషి చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండలకేంద్రంలో ఐటీఐ అనుసంధానంగా ఏర్పా టు చేసిన ఏటీసీ కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబుతో కలిసి తిరుమల శని వారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య రంగాల్లో శిక్షణ కల్పించి తక్కువ సమయంలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్బాబు ముందుకెళ్తున్నారని తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఉన్నత విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఏటీసీ లాంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ఘనత మంత్రి శ్రీధర్బాబుకే దక్కుతుందన్నారు. యువకులు ఏటీసీ ద్వారా అందుతున్న కోర్సులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భిక్షపతి, మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, ట్రాన్స్కో ఏఈ ఉపేందర్, మాజీ ఎంపీటీసీ జాడి మహేశ్వరి, ఆంగోతు సుగుణ, నాయకులు చీమల రాజు, ఐటీఐ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల -
ప్రధాన రహదారిపై మొరాయించిన లారీ
కాటారం: కాటారం మండలం ధన్వాడ సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం లారీ మొరాయించింది. కాటారం నుంచి తాడిచర్ల వైపుగా బొగ్గు లోడ్ కోసం వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఇంజిన్ ఫెయిల్ అయి రోడ్డుపై నిలిచిపోయింది. రహదారి నిర్మాణంలో ఉండటంతో పాటు ఇరుకుగా ఉన్న కల్వర్టు వద్ద లారీ నిలిచిపోవడంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. భూపాలపల్లి నుంచి మంథని వైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలు మండలంలోని బస్వాపూర్ మీదుగా కొయ్యూర్ గుండా రాకపోకలు సాగించాయి. పోలీసులు లారీని జేసీబీ సహాయంతో తొలిగించి రాకపోకలను పునరుద్ధరించారు. -
స్థానిక రిజర్వేషన్లు ఖరారు
భూపాలపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తూ మిగిలిన ఎస్సీ, ఎస్టీ, జనరల్, మహిళ స్థానాలకు గతంలో మాదిరిగానే కేటాయించారు. జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్కే.. రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు విడుదల చేయగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పీఠం బీసీ జనరల్కు కేటాయించారు. గత ఎన్నికల్లో ఎస్సీ మహిళకు కేటాయించగా బీసీలకు రిజర్వేషన్లు పెంచిన దృష్ట్యా ఈసారి బీసీ జనరల్కు దక్కింది. దీంతో ఈ దఫా ఎన్నికల్లో చైర్మన్ పీఠానికి పోటీ ఎక్కువగా నెలకొనే అవకాశం ఉంది. రిజర్వేషన్ విషయం తెలుసుకున్న పలువురు బీసీల్లోని ప్రముఖులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుంటున్నారు. అర్ధరాత్రి రిజర్వేషన్ల వెల్లడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం వెల్లడించాలని రాష్ట్రస్థాయి అధికారులు ముందస్తుగానే సూచించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను శుక్రవారమే పూర్తి చేసుకున్న అధికారులు అధికారికంగా శనివారం మధ్యాహ్నం వరకే వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం అధికారులు శనివారం మధ్యాహ్నం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించలేకపోయారు. మండలం ఎంపీపీ జెడ్పీటీసీ పలిమెల ఎస్సీ ఎస్సీ మహదేవపూర్ బీసీ బీసీ మహాముత్తారం ఎస్టీ ఎస్టీ కాటారం జనరల్(మహిళ) జనరల్ మల్హర్ ఎస్సీ(మహిళ) ఎస్సీ భూపాలపల్లి బీసీ బీసీ గణపురం బీసీ బీసీ(మహిళ) కొత్తపల్లిగోరి బీసీ(మహిళ) బీసీ(మహిళ) రేగొండ జనరల్ జనరల్ చిట్యాల బీసీ బీసీ మొగుళ్లపల్లి జనరల్ జనరల్(మహిళ) టేకుమట్ల ఎస్సీ ఎస్సీ(మహిళ)మండలం జీపీలు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ భూపాలపల్లి 26 4 5 10 7 చిట్యాల 26 5 3 10 8 గణపురం 17 3 1 7 6 కాటారం 24 8 2 10 4 కొత్తపల్లిగోరి 16 3 1 6 6 మహదేవపూర్ 18 4 2 8 4 మల్హర్ 15 3 2 6 4 మొగుళ్లపల్లి 26 6 0 11 9 మహాముత్తారం 24 4 8 6 6 పలిమెల 8 1 3 2 2 రేగొండ 23 4 1 10 8 టేకుమట్ల 25 6 0 11 8 మొత్తం 248 51 28 97 72 జిల్లాలో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ.. 109 ఎంపీటీసీ, 248 సర్పంచ్, 2,102 వార్డు స్థానాలు జెడ్పీ చైర్మన్ బీసీ జనరల్కు కేటాయింపు అర్ధరాత్రి వెల్లడించిన అధికారులు మండలం ఎంపీటీసీ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్థానాలు భూపాలపల్లి 11 2 2 5 2 చిట్యాల 12 2 1 5 4 గణపురం 10 2 1 4 3 కాటారం 11 4 1 5 1 కొత్తపల్లిగోరి 6 1 0 3 2 మహదేవపూర్ 9 2 1 4 2 మల్హర్ 7 2 1 3 1 మొగుళ్లపల్లి 10 2 0 4 4 మహాముత్తారం 8 1 3 2 2 పలిమెల 5 0 2 1 2 రేగొండ 11 2 0 5 4 టేకుమట్ల 9 2 0 4 3 -
పండుగ సందడి..
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణం రెండు మూడు రోజుల నుంచి రద్దీగా మారిపోయింది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. పండుగకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేందుకు పట్టణవాసులు, సమీప గ్రామాల ప్రజలు దుకాణాలకు రావడంతో భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి శనివారం కిక్కిరిసిపోయింది. పిల్లలు హాస్టల్, కళాశాలల నుంచి సొంతూళ్లకు చేరుకోవడంతో పట్టణంతో పాటు గ్రామాల్లో పండుగ వాతావరణ నెలకొంది. దుకాణాలు కిటకిట.. పండుగ సందర్భంగా పిల్లలు, పెద్దలకు నూతన దు స్తులు, మహిళలు, బాలికల ఇతర వస్తువులు, ఆభరణాల కోసం కంగన్హాల్, బంగారం, బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నూతన వైరెటీలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి కుంటుంబ సమేతంగా దుకాణాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన ధరలు గతేడాది దసరా పండుగతో పోల్చుకుంటే ఈ ఏడాది సూమారు 10 నుంచి 20 శాతం ధరలు ప్రతి వస్తువుపైన పెరిగాయి. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పండుగ నేపథ్యంలో తప్పదు కాబట్టి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలు చేయక తప్పడం లేదంటున్నారు. రద్దీగా ఆర్టీసీ బస్సులు హనుమకొండ, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివాసిస్తున్న జిల్లావాసులు దసరా పండుగకు ఇంటికి చేరుకుంటున్న సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కవ మంది ప్రయాణించడం ద్వారా బస్సులు, బస్టాండ్లు జనాలతో రద్దీగా మారిపోయాయి. విద్యాసంస్థలకు వారం రోజుల క్రితం సెలవులు ఇవ్వడంతో అప్పటి నుంచి విద్యార్థులు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కొందరు బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. భారీగా మేకల దిగుమతి దసరా పండుగ రోజు మాంసం విక్రయాలు చేసేందుకు పట్టణంలో ముందస్తుగా వ్యాపారులు భారీగా మేకలను దిగుమతులు చేశారు. కొత్తగా మాంసం దుకాణాలు వెలిశాయి. ముగ్గురు నలుగురు కలిసి సొంతంగా ఒక్కో మేకను కొనుగోలు చేసుకుంటున్నారు. మేకల ధరలు కూడా పెరిగిపోయాయి. గాజులు కొనుగోలు చేస్తున్న మహిళలు భూపాలపల్లి పట్టణంలో దుస్తుల కొనుగోలు సొంతూళ్లకు చేరిన పిల్లలు కొనుగోళ్లతో బట్టల షాపుల్లో కిటకిట దసరా కోసం భారీగా మేకల దిగుమతి సందడిగా మారిన భూపాలపల్లి పట్టణం అధిక ధరలతో బెంబేలెత్తుతున్న జనాలు -
యూరియా కోసం రైతుల ఆందోళన
కాటారం: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంలో యూరియా ఉన్నప్పటికీ పంపిణీలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం కాటారం మండలకేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. పీఏసీఎస్ గోదాం ఎదుట కాటారం–మంథని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి గోదాం ఎదుట పడిగాపులు కాస్తున్నా యూరియా పంపిణీ ప్రారంభించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, మంత్రి శ్రీధర్బాబు సొంత మండలంలో రైతులు యూరియా కోసం తంటాలు పడుతున్నారని విమర్శించారు. ఎస్సై శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. యూరియా పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. యూరియా సరిపడా పంపిణీ చేస్తాం.. కాటారం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని.. సాగుకు సరిపడా యూరియా సరఫరా అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, రేగులగూడెం, దామెరకుంట రైతువేదికల్లో యూరియా పంపిణీని డీఏఓ శనివారం పరిశీలించారు. యూరియా కోసం వచ్చిన రైతుల పట్టాపుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లను పరిశీలించి టోకెన్లు అందజేయించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. యూరియా నిల్వలపై ఆరా తీశారు. డీఏఓ వెంట ఏఓ పూర్ణిమ, ఏఈఓలు ఉన్నారు. -
ఓపెన్కాస్ట్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2 గనిని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్నజాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్కాస్టులో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాలన్నారు. జీ–5 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. అధిక ప్రమాణాలతో బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. జీ–11 గ్రేడ్ బొగ్గును రామగుండం ప్రాంతానికి రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, పీఓ శ్యాంసుందర్, రక్షణ అధికారి నజీర్ పాల్గొన్నారు. కాటారం: అమలుకు నోచుకోని హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల జాతీయ అద్యక్షుడు, బీజేపీ నాయకుడు గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. కాటారం మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మంత్రి శ్రీధర్బాబు మంథని ప్రాంత అభివృద్ధిని మరిచిపోయారని విమర్శించారు. శ్రీనివాస్ వెంట బీజేపీ నాయకులు చల్ల నారాయణరెడ్డి, దుర్గం తిరుపతి, తదితరులు ఉన్నారు. ఘనంగా ఫ్యామిలీ డే వేడుకలు భూపాలపల్లి అర్బన్: సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకొని ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఫ్యామిలీ డే వేడుకలను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలోని సుభాష్ కాలనీ సింగరేణి ఫంక్షన్హాల్లో సేవా సమితి మహిళలతో నిర్వహించిన ఈ ఫ్యామిలీ డే బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిలుగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. మహిళలు, సేవా సభ్యులు రంగురంగుల బతుకమ్మలు అలంకరించుకొని వచ్చి ఆటపాటలతో ఆడి పాడారు. ఫ్యామిలీ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన సేవా సభ్యులకు బహుమతులు అందజేశారు. ఉత్తమంగా బతుకమ్మలను అలంకరించిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి, సీఎంఓఐఏ ప్రతినిధి నజీర్, సేవా కార్యదర్శి రుబీన, సేవా సభ్యులు పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు ములుగు: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఇటీవల ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ సరెండర్ పాలసీలో భాగంగా తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికీ రూ.25 వేల చొప్పున వచ్చిన నగదు రివార్డును శనివారం ఎస్పీ తన కార్యాలయంలో వారికి అందజేశారు. గత మే నెలలో లొంగిపోయిన మడవి మంగ్లీ, మడకం కమలేష్, మడకం భీమేలకు నగదు రివార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు డీడీ, వైద్య చికిత్స, పునరావాస సాయం అందుతుందన్నారు. లొంగిపోయిన వారు సమాజంలో స్థిరపడేందుకు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందన్నారు. -
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం తరఫున సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే పత్తి ధర అధికంగా ఉండడం, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు చేయడంతో గతేడాది పెద్దగా రైతులు కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపలేదు. చాలాచోట్ల తేమ శాతం సాకుగా చూపి మోసంచేసిన ఘటనలు కూడా అక్కడక్కడ జరగడం రైతులను కొంత నష్టపరిచింది. జిల్లాలో 98,680 ఎకరాల్లో పత్తి సాగు జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి 1 చిట్యాల 2 మంథని నియోజకవర్గంలో కాటారంలో 2 జిన్నింగ్ మిల్లులు ఉండగా అన్నింటిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 98,680ఎకరాల్లో పత్తి సాగు చేయగా 9లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా పత్తి దిగుబడిపై కొంత ప్రభావం చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.8,110గా ధరను నిర్ణయించింది. సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ పంటను అమ్ముకుంటే న్యాయం జరిగే అవకాశం ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో తేమ పేరుతో రైతులకు నిర్ణయించిన ధర కంటే తక్కువగా ఇస్తారని, తూకాల్లో కూడా అవకతవకలు ఉంటాయని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి జిల్లాలో అక్టోబర్ నెలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. పత్తి కొనుగోళ్లు, ఇతరత్రా విషయాల్లో పారదర్శకంగా రైతుల బ్యాంక్ ఖాతాకు అనుసంధానం ఉండాలనే నిబంధన పెట్టారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో ఆధార్ కార్డులతో పాటు పాస్బుక్ కూడా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. రైతులు తమ వివరాలను కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్లో కొనుగోళ్లు ప్రారంభం.. జిల్లాలో 5 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అక్టోబర్ రెండు, మూడో వారంలో కొనుగోళ్లు ప్రారంభిస్తాం. దళారులను నమ్మకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి. – ప్రవీణ్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి జిల్లావ్యాప్తంగా 5 సీసీఐ కేంద్రాల ఏర్పాటు అక్టోబర్ రెండో వారంలో ప్రారంభించే అవకాశం 9 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా మద్దతు ధర క్వింటాకు రూ.8,110 వర్షాలకు దిగుబడి తగ్గే అవకాశం -
ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ రాహుల్శర్మ భూపాలపల్లి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై పీఓ, ఏపీఓలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనదన్నారు. లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు నిర్వహించిన శిక్షణపై ఎన్నికల సంఘం సూచనల మేరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు ఉంటాయని పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ తదితర అంశాలను మాస్టర్ ట్రైనర్లు సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని, ఏదేని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఆర్ఓ శ్రీనివాస్, సీపీఓ బాబురావు, భూపాలపల్లి ఎంపీడీఓ నాగరాజు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దుజిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు తెగిపోయాయన్న అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, వదంతులను ప్రజలు నమ్మకూడదని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ప్రస్తుతం జిల్లా పరిధిలోని చెరువులు అన్ని పటిష్టమైన స్థితిలో భద్రంగా ఉన్నాయని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని స్పష్టంచేశారు. సంబంధిత ప్రాంతాల్లో ఇరిగేషన్ డీఈఈలు, ఏఈఈలు, లష్కర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారుల నుంచి అందే సమాచారం తప్ప వేరే వదంతులను నమ్మవద్దన్నారు. సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఐలమ్మ స్ఫూర్తితో ముందడుగు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి అర్బన్: ఐలమ్మ పోరాటపటిమ, పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ పోరాట ఉద్యమ నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి సముచితంగా గౌరవించినట్లు తెలిపారు. నాటి రోజుల్లో రజాకారులను, భూ స్వాములను ఎదిరించి పోరాడిన యోధురాలని కొనియాడారు. ఆమె ఆశయాలను ఆచరణలో పెట్టి అమలు చేయాల్సిన బాధ్యతను మనందరం తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. త్యాగానికి పోరాటానికి స్ఫూర్తిగా వీరనారి చాకలి ఐలమ్మ నిలిచారని తెలిపారు. చాకలి ఐలమ్మ సింబల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్గా నిలిచారన్నారు. నాటి రోజుల్లో పెత్తందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిర, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఐలమ్మను స్మరించుకోవాలి భూపాలపల్లి అర్బన్: నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మను స్మరించుకోవాలని అదనపు ఎస్పీ నరేశ్కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారన్నారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె నిజమైన వీరవనిత అన్నారు. ఆమె ధైర్యసాహసాలు, పోరాటస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు ఈ తరం వారికి ఆదర్శమన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఫర్హాన, రత్నం, శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవార్ల దర్శనం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన శ్రీఽశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శణమిచ్చారు. శుక్రవారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించారు. అర్చకులు విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. భజన కార్యక్రమాలు చేశారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.27 అడుగులకు గణపసముద్రం గణపురం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలకేంద్రంలోని గణపసముద్రం చెరువు 27 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. గణపసముద్రం చెరువు మొత్తం నీటి మట్టం 30 అడుగులు కాగా మరో 3 అడుగుల నీటి మట్టం చేరుకుంటే గణపసముద్రం చెరువు మత్తడి పడనుంది. గణపసముద్రం చెరువుపై ఉన్న గొలుసు చెరువులైన భాగీర్థిపేట, రామన్నగూడెం, బుద్ధారం, వంగపల్లి వాని చెరువులు మత్తళ్లు పోస్తుండడంతో పాటు రామప్ప సరస్సు నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీంతో మరో రోజు వర్షం కురిస్తే చెరువు పూర్తిగా నిండి మత్తడి పోయనుంది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్, ఐటీ మాస్టర్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించినట్లు ఆర్గనైజేషన్ డైరెక్టర్ వేముల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరానికి ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు తెలిపారు. సేకరించిన 103 యూనిట్లను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అందించినట్లు చెప్పారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న శంకర్ను ఎంజీఎం వైద్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేముల కుమార్, సురేందర్, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్ పాల్గొన్నారు. వర్షంతో నష్టం కాటారం: కాటారం, మహాముత్తారం మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అపార నష్టం జరిగింది. పలు గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. వరద నీరు నిల్వడంతో పత్తి మొక్కలు ఎర్రబారాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది. మండలంలోని రేగులగూడెంలో పోశయ్య అనే వ్యక్తికి చెందిన ఇళ్లు వర్షానికి నేల మట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గోడకూలి మహిళ మృతి కాళేశ్వరం: వరుసగా కురుస్తున్న వానలతో తడిసిన ఓ ఇంటి గోడ కూలడంతో మహిళ మృతిచెందిన ఘటన బెగుళూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద లక్ష్మి(42) కొంతకాలం నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. ఈక్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటి గోడకూలి ఆమైపె పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త దుర్గయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్ ఎస్సై–2 సాయిశశాంక్ తెలిపారు. తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ పంచనామా నిర్వహించారు. -
సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక తీజ్
భూపాలపల్లి రూరల్: సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని, ఈ వేడుకలు సామాజిక ఐక్యతను, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి మండలం రూరల్, అర్బన్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమలపూర్తో పాటు, గొల్లబు ద్దారం, దూదేకులపల్లి, అర్బన్లో కుందురుపల్లి, బానోత్వీధిలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. లంబాడీల సంస్కృతిసంప్రదాయాలకు ప్రతీక తీజ్ అన్నారు. లంబాడీ కులస్తుల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం యువతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల లంబాడాలు కుల పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ప్రాధాన్యం రంగాలకు అధిక రుణాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలు కోరుకున్న ప్రాధాన్యం రంగాలకు అధిక రుణాలు అందించా లని, రుణ లక్ష్యసాధనకు సమన్వయం అవసరమ ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో బ్యాంకర్లు, అధికారులతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణ లక్ష్యం రూ.1,221.72 కోట్లు కాగా అందులో రూ.136.74 కోట్లు రుణ లక్ష్యం సాధించారన్నారు. రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో పంట రుణాలు, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, ఎడ్యుకేషన్, వ్యవసాయ రుణాలను సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎ లాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాలన్నా రు. ఆయా బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న యూని ట్లను బ్యాంకు అధికారులతో తరచూ సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రికవరీ శాతా న్ని పెంచేందుకు అధికారులు గ్రామ స్థాయిలో లబ్దిదారులకు అవగాహన పరిచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళాశక్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు మోడల్ సీఎస్సీ సెంటర్స్ ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఏ ర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్సాయి, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, యూబీఐ డీజీఎం, టీజీబీ ఆర్ఎం, జిల్లా అధికారులు, ఎల్డీఎం తిరుపతి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
సౌరశక్తి వినియోగంపై అవగాహన
గోవిందరావుపేట: జిల్లాలో చల్వాయి, పస్రా, గోవిందరావుపేట, వెంకటాపూర్ గ్రామపంచాయితీ కార్యాలయాల్లో గురువారం ఆయా సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్పై ప్రత్యేక ప్రచార కార్యక్రమం, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్ఈడీసీఓ జిల్లా అధికారి రాజేందర్, ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ అఖిల, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ హాజరై మాట్లాడారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ములుగు, గోవిందరావుపేట, చల్వాయి, పస్రా, వెంకటాపూర్, ఏటూరునాగారం, కమలాపూర్, వెంకటాపురం గ్రామాలను మోడల్ విలేజ్గా ఎంపికచేశామన్నారు. ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.కోటి వరకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు మోడల్ సోలార్ విలేజ్ స్కీం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు దరఖాస్తులు
భూపాలపల్లి: మద్యం షాపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులు (ఏ4) ప్రారంభం కానుండగా టెండర్ల ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించింది. రెండు జిల్లాల్లో 59 షాపులు.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో మొత్తం 59 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీలకు 7, గౌడ కులస్తులకు 9, ఓపెన్ కేటగిరీలో 32, ములుగు జిల్లాలో ఎస్టీలకు 11 దుకాణాలను కేటాయించారు. మూడు స్లాబ్లో ఉన్న ఈ షాపులకు నేటి (శుక్రవారం) నుంచి అబ్కారీ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న డ్రా తీసి షాపులను కేటాయించనున్నారు. డ్రా పద్ధతిలో షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి రెండేళ్ల పాటు మద్యం షాపులను నడుపుకోనున్నారు. కాగా గతేడాది దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు ఉండగా ఈ ఏడాది ప్రభుత్వం రూ. 3 లక్షలకు పెంచింది. నేటి నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు స్వీకరణ అక్టోబర్ 23న డ్రా, దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 59 షాపులు -
మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం
ములుగు: మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేంద్రం జాతీయ హోదా కల్పించేలా తన వంతు కృషి చేస్తానని మహబుబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తెలిపారు. ములు గు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత అన్నదాన కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తను ఎంపీగా ఉండి ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని వెల్ల డించారు. గిరిజన యూనివర్సిటీ కోసం నిరాహార దీక్ష చేశానని తెలి పారు. ఇప్పుడు మేడారం జాతీయ హోదా కోసం కృషి చేస్తానన్నారు. రానున్న జాతర వరకు జాతీయ హోదా కల్పించేలా చర్యలు చేపడతానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ స భ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ -
పేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం
కాటారం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి గురువారం మంజూరుపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు సిమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో అసమర్థ పాలన సాగించిందని మంత్రి విమర్శించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ తదితర పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ఇతరులు ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే పోలీసు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగకుండా ఎంపీడీఓలు, గృహ నిర్మాణశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని, ఇళ్ల నిర్మాణం ఆగిపోతే అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తామని హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణులకు సీమంతం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండ్రు రమేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, లబ్ధిదారులు పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
కాత్యాయనీగా అలంకరణ
లక్ష్య సాధకులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో విజేతలుగా నిలిచారు.వాతావరణం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉంది.కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాలైన ఽశుభానందదేవి (పార్వతి), సరస్వతి అమ్మవార్లు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు కాత్యాయనీగా భక్తులు దర్శమిచ్చారు. గురువారం ఆలయ అర్చకులు అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువస్త్రాలు, పూలతో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందించారు. అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్
తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.జిల్లాలో అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలతో పాటు రిటర్నింగ్ అధికారులను కూడా సిద్ధం చేశారు. మండలాలకు నమూనా బ్యాలెట్ పేపర్లు చేరాయి. దీంతో పల్లెల్లో ఎన్నికల జోష్తో వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈనెల 30లోపే షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రిజర్వేషన్లపై ఆశావహులు టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియామక పదవులు దక్కకుండానే రెండేళ్లు గడిచిపోయింది. ఈక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వస్తే పదవులు దక్కుతాయని ఆశతో పోటీలో ఉంటున్నట్లు ప్రకటిస్తున్నారు. తమ కుల సంఘాలను ఒకటిగా చేసుకుంటున్నారు. ఇరుగు, పొరుగును దగ్గర చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వార్డుల వారీగా నిత్యం ప్రజల్లో ఉంటూ కసరత్తు ప్రారంభించారు. రిజర్వేషన్లు ఎలా ఉండబో తున్నాయనే ఉత్కంఠ మాత్రం జిల్లావ్యాప్తంగా మొదలైంది. పాన్ డబ్బాలు, టీస్టాల్స్, హోటళ్లు, దాబాల్లో నలుగురు కలిస్తే చాలు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపైనే చర్చ సాగుతోంది. రేసులో ఉండే ఆశావహులు ఇప్పటికే దావత్లు, పార్టీలు కూడా మొదలుపెట్టారు. ఒక్కో సర్పంచ్కు రేసులో పదిమంది వరకు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. యూత్ ఎక్కువగా రాజకీయాలవైపు ఫోకస్ చేస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలిస్తే సర్పంచ్ లేదా ఎంపీటీసీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
పట్టు తప్పుతున్న పాలన
ఇన్చార్జ్ అధికారులు ఉన్న శాఖలు జిల్లా అదనపు కలెక్టర్(ఎల్బీ) అసిస్టెంట్ లేబర్ అధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి మిషన్ భగీరథ ఈఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ భూగర్భ జలాల అధికారి హార్టికల్చర్ అధికారి అగ్రికల్చర్ అధికారి పరిశ్రమల శాఖ మేనేజర్ తూనికలు, కొలతలు పంచాయతీ రాజ్శాఖ ఈఈ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మైనారిటీ అభివృద్ధి అధికారి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జిల్లా టూరిజం అధికారి జిల్లా సంక్షేమ అధికారిభూపాలపల్లి అర్బన్: జిల్లాలో పాలన పట్టు తప్పుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల, పాలకవర్గాల ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అంతటా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయి రెండేళ్లు కావొస్తోంది. అలాగే 8 నెలల క్రితం మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పూర్తి కావడంతో అంతా ప్రత్యేకాధికారులతోనే పాలనను నెట్టుకొస్తున్నారు. అసలే శాఖాపరమైన బాధ్యతలతో సతమతమయ్యే అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలో ఏ శాఖలో చూసినా అధికారులు బిజీబిజీగానే కనిపిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జ్ అధికారులకే మళ్లీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా సర్వే పనులు, సంక్షేమ పథకాల అమలు పనుల్లోనే అధికారులు నిమగ్నమవుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదంటున్నారు. పర్యవేక్షణ కొరపడడంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే లెక్కగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలో పలు ప్రధాన శాఖలను ఇన్చార్జ్లతోనే నెట్టుకు రావడంతో పాలన పట్టుతప్పే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల ఉరుకులు పరుగులు.. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్బెడ్రూం లాంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే, లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగానే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అదనపు విధులతో అధికారులపై ఒత్తిడి పెరిగి పోవడంతోనే ప్రభుత్వానికి సరైన నివేదికలు అందడం లేదని తెలుస్తోంది. అలాగే సరైన గడువులోగా వివిధ రకాల నివేదికలను అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారుల సతమతం.. ప్రత్యేక పాలన కొనసాగడంతో కొన్ని శాఖల జిల్లా అధికారులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు జెడ్పీ సీఈఓ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), మున్సిపాలిటీ, ప్రత్యేక అధికారిగా, మండల ప్రత్యేక అధికారిగా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మైనార్టీ, ఎస్సీ వెల్ఫేర్ శాఖలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 17 శాఖల్లో ఇన్చార్జ్ అధికారులకు ఇన్చార్జ్ విధులను అప్పగించడంతో ఏశాఖలోనూ పూర్తిస్థాయిలో పనిచేసిన పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. జిల్లా మార్కెటింగ్, టీజీఎంఐడీసీ, ఎకై ్సజ్, పరిశ్రమల, లేబర్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, తునికలు కొలతలు, డ్రగ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు విధులతో అధికారులు సతమతమవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు జిల్లా అధికారి అందుబాటులో లేరని చెప్పడంతో నిరాశగా తిరిగి వెళ్లిపోతున్నారు. కనీసం కొందరు అధికారులు ఫోన్లోనైనా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇలా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు పూర్తి కావడం లేదని వారు పేర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. అలాగే, దీనికి తోడు తరుచు వీడియో, టెలికాన్ఫరెన్స్లు, వివిధ కార్యక్రమాలతో అధికారులు బిజీబిజీగా మారుతున్నారు.కొరవడుతున్న పర్యవేక్షణఇన్చార్జ్ బాధ్యతలు, అదనపు విధులతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సొంత శాఖల పనితీరు పైననే దృష్టి సారించలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం పని ఒత్తిడి కారణంగానే సొంత శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను పసిగట్టలేక పోయారన్న చర్చ జరుగుతోంది. అదనపు విధులతో సొంత శాఖ పనులపై కొంత నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పలు శాఖల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రస్థాయి అఽధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో ఆయా శాఖల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని పసిగట్టలేకపోవడంతోనే పాలన గాడితప్పుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అదనపు విధులతో అధికారులపై తీవ్ర ఒత్తిడి ఒక్కొక్కరికి నాలుగైదు శాఖల ఇన్చార్జ్ బాధ్యతలు ప్రత్యేక పాలనలో ప్రజలకు తప్పని ఇబ్బందులు -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఏరియాలోని కృష్ణకాలనీలో జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతీ సింగరేణి ఉద్యోగి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. భూపాలపల్లి నుంచి కోల్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ కేటగిరిల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ నరేష్నాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, అఽధికారులు పాల్గోన్నారు. దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి జిల్లా కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మున్సిపల్, పోలీస్శాఖ అధికారులను అదేశించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ రాజేందర్ ఆధ్వర్యంలో వికలాంగులు, చేయూత పింఛన్దారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు, చేయూత పింఛన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలన్నారు. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పెంపు కోసం పింఛన్దారులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ శ్యాంబాబు, రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, నాయకులు నోముల శ్రీనివాస్, మంద తిరుపతి, భద్రయ్య, రాజు పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
● డీఎంహెచ్ఓ మధుసూదన్ భూపాలపల్లి అర్బన్: స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై బుధవారం డీఎంహెచ్ఓ తన కార్యాలయంలో జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లతో పాటు ఇప్పటికే ఉన్న స్కానింగ్ సెంటర్ల అనుమతి గురించి అడ్వైజర్ కమిటీ ముందుంచామన్నారు. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సెక్స్ రేషియో తక్కువగా ఉన్నటువంటి మండలాలు ఒడితల, రేగొండ, కాటారం, చెల్పూర్, మహాముత్తారం, ఆజాంనగర్లు, ఏఎన్ఎంలకు విడతల వారీగా సమావేశం నిర్వహించి డాక్యుమెంట్ ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారిణి శ్రీదేవి, గైనకాలజిస్టులు కవిత, డాక్టర్ అనీషా, పీడియాట్రిషన్ డాక్టర్ సుధాకర్, సోషల్ వర్కర్ ప్రసాద్, డెమో శ్రీదేవి పాల్గొన్నారు. -
నేడు మంత్రి శ్రీధర్బాబు పర్యటన
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేడు(గురువారం) మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక బీఎల్ఎమ్ గార్డెన్స్లో కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్, మల్హర్ మండలాలకు సంబంధించిన 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు. 4 మండలాలకు చెందిన లబ్ధిదారులకు 50 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 90 కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణమాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.34 మంది క్రీడాకారులు కోల్ ఇండియాకు ఎంపికభూపాలపల్లి అర్బన్: గత రెండు రోజుల పాటు భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 34 మంది క్రీడాకారులను కోల్ ఇండియా పోటీలకు ఎంపిక చేసినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మిస్టర్ సింగరేణిగా సుంకరి శ్రీనివాస్రెడ్డి, బెస్ట్ స్ట్రాంగ్మెన్గా రమేష్, బెస్ట్ స్ట్రాంగ్ ఉమెన్గా దువ్వ అనూష, బెస్ట్ లిఫ్టర్గా కోరం అనిల్కుమార్లు ఎంపికై నట్లు వెల్లడించారు.యాప్ను వినియోగించుకోవాలిభూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగా టీజీఎన్పీడీసీఎల్ 20 ఫీచర్లతో రూపొందించిన యాప్ను వినియోగించుకోవాలని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్సూర్ నాయక్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్లో టీజీఎన్పీడీసీఎల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ సేవలను వినిగించుకోవాలని సూచించారు.గాలివాన బీభత్సంవాజేడు: మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన గాలివాన సుమారుగా గంట పాటు వచ్చింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలో సుమారుగా 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏఈ అర్షద్ అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది మండల కేంద్రంలో లైన్ల వెంట తిరిగి ఇన్స్లెటర్ పెయిల్ అయినట్లు గుర్తించారు. వెంటనే కొత్తది అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.క్రికెట్ టోర్నమెంట్కు రేవంత్ ఎంపికఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి రేవంత్గౌడ్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో అండర్ –19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 27న ఉత్తరాఖండ్లో హరిద్వార్లో జరిగే టోర్న మెంట్లో పాల్గొననున్నట్లు కోచ్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా కాటాపూర్ గౌడ సంఘం అధ్వర్యంలో కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య, గీత కార్మికులు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ముజాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కోడి సతీష్, నాయకులు మద్దూరి రాములు, రహమాన్లు రేవంత్గౌడ్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.పాతాళగంగ పైపెకి..ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి– మేడారం మార్గంలోని రోడ్డుకు కొద్ది దూరంలో అడవిలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. మేడారానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ చేతి పంపు ఉంది. మేడారానికి వచ్చిన భక్తులు అడవి ప్రాంతంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకునేందుకు చేతి పంపు నీటితో అవసరాలను తీర్చుకుంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుడడంతో భూగర్భజలాలు పెరిగి చేతి పంపు నుంచి పాతాళగంగ వ్యవసాయ బోరు మోటారు పోసినట్లుగా ఉబికి వస్తుడడంతో మేడారానికి వచ్చిన భక్తులు, దారిగుండా వెళ్లే వాహనాదారులు అక్కడ కొద్ది సేపు వాహనాలను నిలిపి చూసి వెళ్తున్నారు. -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు నిఖిల్రాజ్
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల హ్యాండ్బాల్ అకాడమి విద్యార్థి నిఖిల్రాజ్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గత నెల 30న హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ మినీ సెలక్షన్స్ ట్రైల్స్లో నిఖిల్రాజ్ ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వహకులు 17వ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ అకాడమి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, కార్యదర్శి లక్ష్మణ్, టీం కోచ్ వెంకటేశ్ వెల్లడించారు. రేపటి నుంచి 29వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో నికిల్రాజ్ తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నారు. అకాడమి విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికావడం పట్ల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడీ వెంకటేశ్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, వార్డెన్ బలరాం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. -
బతుకమ్మ సంబురాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయం ఆవరణలో తెలంగాణ టూరిజం, కల్చరల్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా పర్యటన రద్దు అయింది. దీంతో రాత్రి 7గంటలకు అడిషనల్ కలెక్టక్ విజయలక్ష్మి, డిడబ్ల్యూఓ మల్లీశ్వరీ, డీవైఎస్ఏ రఘులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షం కారణంగా ప్రధాన ఆలయం అనివెట్టి మండపం వద్ద అడిషనల్ కలెక్టర్తో కలిసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలు, అధికారులు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆడారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, ఎంపీడీఓ రవీంద్రనాధ్, హరితహోటల్ మేనేజర్ జక్కం సురేష్, సీడీపీఓ రాధిక, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శి సత్యనారాయణ, తదితరలు పాల్గొన్నారు. -
యూరియా అక్రమ రవాణాపై నిఘా
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: యూరియా అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్ఫోర్స్ టీంలు పటిష్టమైన నిఘా పెంచాలన్నారు. యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలన్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టాస్క్ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని, ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూరియాకు కొరత లేదన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్లపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేసినట్లు తెలిపారు. ఆ భూముల్లో పంటలు సాగు చేయకుండా, అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఈ సమావేశంలో డీఏవో బాబురావు, ఉద్యానవనశాఖ అధికారి సునీల్కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏలు, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. -
పశు జన్యువనరులపై అవగాహన
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్యశాల ఆవరణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ వారు ఐసీఏఆర్ నెట్వర్క్ ప్రాజెక్టు కింద పశు జన్యు వనరులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 62 మంది పాడి రైతులు, జీవాల పెంపకం దారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వైద్యులు ఏకాంబరం, సరిన్ కార్తికేయన్, గోపాల కృష్ణమూర్తి, వెంకన్నలు పలు సూచనలు చేశారు. వారికి నాటు పశు సంపద గుర్తింపు ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణులు సవివరంగా తెలియజేశారు. పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న జాతులను గుర్తించి, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యంతో ఉన్న జాతులను అభివృద్ధి చేసి, వ్యవసాయాన్ని స్థిరంగా నిలుపుకోవచ్చన్నారు. జాతుల చరిత్ర, సంబంధాలు తెలుస్తాయని వెల్లడించారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ పాడి పరిశ్రమకు మరింత ఊతమిచ్చే విధంగా యూనివర్సిటీలోని లాభసాటి పద్ధతులను ప్రత్యక్షంగా సందర్శించడానికి మండల రైతులను ఆహ్వానించినట్లు వెల్లడించారు.గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ స్వీకరించిన మహదేవపూర్ మండల పశువైద్యుడు బుర్ర రాజబాబును మండల రైతులు అందరూ కలిసి ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు యూనివర్సిటీ తయారు చేసిన మినరల్ మిక్సర్ ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గార్లతో పాటు శాఖ సిబ్బంది, గోపాలమిత్రలు, పశుమిత్రలు పాల్గొన్నారు. -
సరికొత్త మేడారం..!
వనదేవతల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణానికి శ్రీకారం మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి సభకు వచ్చిన మహిళలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ములుగు: తెలంగాణ కుంభమేళా, వనదేవతల జన జాతర మేడారం రూపుమారనుంది. సమ్మక్క,సారలమ్మ ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్ప్లాన్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. వచ్చే జనవరిలో జరిగే మహాజాతరకు శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి మేడారం సందర్శించారు. తల్లుల దర్శనం, మొక్కుల చెల్లింపు, పనుల పరిశీలన, బహిరంగ సభలో ప్రసంగం మొత్తంగా ఆయన పర్యటన మేడారంలో 2.04 గంటలపాటు కొనసాగింది. సీఎంతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు. జాతర ప్రాశస్త్యం గుర్తుండి పోయేలా ప్రణాళిక: మంత్రి ధనసరి సీతక్క జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తుండి పోయేలా ప్రణాళిక రూపొందించి మేడారంలో అభివృద్ధి పనులు చేయనున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించాం. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధి ప్రణాళి కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తల్లుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గద్దెల విస్తరణ విషయంలో అనేక అపోహలు ఉన్న నేపథ్యంలో నిర్మాణం ఏ విధంగా జరగాలని, గిరిజనుల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడడం కోసం సీఎం స్వయంగా మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. మాస్టర్ప్లాన్ను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి సమ్మక్క, సారలమ్మకు మొక్కుల సమర్పణ అభివృద్ధి పనులు పరిశీలించి మంత్రులకు సూచనలు గిరిజన సంప్రదాయాల ప్రకారమే పనులు సాగుతాయని స్పష్టీకరణ రెండు గంటలపాటు సాగిన ముఖ్యమంత్రి పర్యటన –ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. వన దేవతల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క–సారలమ్మ ఆలయం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. -
గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి
భూపాలపల్లి రూరల్: గిరిజనుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి మండలంలో గొల్ల బుద్ధారం నుంచి రాజునాయక్ కుంట, దూదేకులపల్లి నుంచి రేగడిగుట్ట వరకు రూ.4 కోట్ల 30 లక్షలతో నిర్మించనున్న బీటీ రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్ల బుద్ధారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్రాజెక్టులు చేపట్టినట్లు వివరించారు. గిరిజన, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు రెండు రోజుల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు కోరిన విధంగా నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో ఇతర దేశాల నుంచి యూరియా రాక కొరత ఏర్పడిందని చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. మేడారం వెళ్లేందుకు కమలాపూర్ క్రాస్ నుంచి రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు సిటీ స్కానింగ్, వైద్య, సిబ్బంది పోస్టుల భర్తీ చర్యలు చేపట్టామని తెలిపారు. పాఠశాలలకు అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ అధికారి మల్లీ శ్వరి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు ఆర్టీఏమెంబర్ రాంచంద్రయ్య పాల్గొన్నారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ -
ఆదాయంపై పట్టింపేది..?
భూపాలపల్లి: నివాస భవనాలపై ఆస్తి పన్నును ముక్కుపిండి మరీ వసూలు చేసే మున్సిపాలిటీ అధికారులు ట్రేడ్ లైసెన్స్లు జారీచేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వ్యాపార సముదాయాలకు అందించే కేటగిరి 2 విద్యుత్ మీటర్ల సంఖ్య, ము న్సిపల్ అధికారులు జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్లకు వేలల్లో వ్యత్యాసం ఉంది. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది. 1967 భవనాల తేడా.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నివాస భవనాలు 10,952, నివాస, వ్యాపార భవనాలు 834, వ్యాపార 593, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు 1,211 ఉన్నాయి. ఈ మేరకు 1,427 వ్యాపార భవనాలకు ట్రేడ్ లైసెన్స్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఇందులో సైతం ఇప్పటి వరకు 986 మాత్రమే జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... వ్యాపార, పరిశ్రమలకు ఎన్పీడీసీఎల్ అధికారులు జారీ చేసే కేటగిరి 2, 3, 4 మీటర్ల సంఖ్యకు, మున్సిపల్ అధికారులు జారీచేసిన ట్రేడ్ లైసెన్స్ల సంఖ్యకు ఏమాత్రమూ పొంతన కుదరడం లేదు. భూపాలపల్లి అర్బన్ పరిధిలో కమర్షియల్ మీటర్లు 3,394 ఉన్నట్లుగా ఎన్పీడీసీఎల్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన మున్సిపల్ అధికారులు మరో 1,967 భవనాలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో తేడాలు రావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార భవనాలకు ట్రేడ్ లైసెన్స్లు జారీ చేయడంలో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే నిర్వహిస్తే మరింత ఆదాయం.. మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ల జారీ విషయంలో గడిచిన పదేళ్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని షాపులన్నింటికీ ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వడం లేదని, అధికారులు ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని గత పాలకవర్గాల సమయంలో పలువురు కౌన్సిలర్లు అనేకమార్లు ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రత్యేక సర్వే నిర్వహిస్తే ట్రేడ్ లైసెన్స్ల సంఖ్య పెరిగి మున్సిపాలిటీకి మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉంది. వ్యాపార భవనాలన్నింటికీ లైసెన్స్లు జారీ చేశాం. డబ్బాలు, టేలకు ఎన్పీడీసీఎల్ అధికారులు 2వ కేటగిరి విద్యుత్ మీటర్లు ఇస్తారు. ఇంటి నంబర్లు లేనందున మున్సిపాలిటీ మాత్రం తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్లు ఇస్తుంది. దీంతో రెండు శాఖల మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది. ఎన్పీడీసీఎల్ అధికారుల నుంచి డేటా తీసుకొని మరోమారు సర్వే నిర్వహించి వ్యాపార భవనాలన్నింటికీ ట్రేడ్ లైసెన్స్లు జారీ చేస్తాం. – భాస్కర్, మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమర్షియల్ కేటగిరీలోని విద్యుత్ మీటర్లు 3,394 వ్యాపార భవనాలకు సైతం నాన్ రెసిడెన్షియల్ టాక్స్ ఫలితంగా మున్సిపాలిటీ ఆదాయానికి గండి -
కోలిండియాలో సింగరేణి సత్తా చాటాలి
భూపాలపల్లి అర్బన్: త్వరలో జరగనున్న కోలిండియా క్రీడాపోటీలలో సింగరేణి క్రీడాకారులు సత్తాచాటి ముందు వరుసలో నిలబెట్టాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ స్థాయి బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు మంగళవారం భూపాలపల్లిలో ప్రారంభమయ్యాయి. ఏరియాలోని కృష్ణకాలనీ మినీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి రాజేశ్వర్రెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడలు అందరిలో మానసికోల్లాసం, సానుకూలతను నింపుతాయన్నారు. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్ వర్క్ను వికసింపజేస్తాయని చెప్పారు. నేటి ఆధునిక జీవన విధానంలో వర్క్ లైఫ్ బ్యా లెన్స్ కోసం క్రీడల పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. మహిళా ఉద్యోగులు క్రీడల్లో రాణించాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారన్నారు. ఈ అవకాశాలతో మహిళలు సింగరేణిలో అన్ని రంగాల్లో, ము ఖ్యంగా క్రీడలలో స్ఫూర్తిగా ముందుకు రావాలన్నా రు. మహిళల పాత్రను మరింత ప్రోత్సహిస్తూ, మహిళా ఉద్యోగులు క్రీడల్లో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఐఏ భూపాలపల్లి ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్, గుర్తింపు, ప్రా తినిథ్య సంఘం నాయకులు మోటపలుకుల రమేష్, బెతెల్లి మధుకర్రెడ్డి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రా వణ్కుమార్, న్యాయ నిర్ణేతలు ఏసప్ప, మహమ్మద్ ఇంతియాజ్, మల్లేష్యాదవ్, హనుమంత్రాజ్, జా న్వెస్లీ, అశోక్, నరేందర్రెడ్డి, రమేష్, పర్స శ్రీని వాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ దేవయ్య పాల్గొన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి కంపెనీ స్థాయి బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం -
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు 34 శాతం లాభాల వాటా ప్రకటించడం పట్ల్ల ఐఎన్టీయూసీ నాయకులు మంగళవారం జిల్లాకేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఐన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 34శాతం వాటా ప్రకటించడం సంతోషకరమైన విషయమన్నారు. లాభాల వాటా పెంచేందుకు కృషిచేసిన సింగరేణి ఏరియాల మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, బుచ్చయ్య, రఘుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, అశోక్, రమేష్, రవి, కృష్ణ, సమ్మయ్య పాల్గొన్నారు. మొగుళ్లపల్లి: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి మంగళవారం దర్శించుకున్నా రు. ప్రతి ఒక్కరినీ తల్ల్లి చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చదువు అన్నారెడ్డి, రమేష్, కుమార్, రామస్వామి, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాటారం: సూర్యాపేట జిల్లా దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో అన్యాయానికి గురవుతున్న వలస కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుయాదవ్, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోకన్వీనర్ అయితే బాపు, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఫ్యాక్టరీపై ఉంటుందని అన్నారు. అన్యాయానికి గురవుతున్న వలస కార్మికులకు తోడుగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు, సంఘాలు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కాలినేని రాజమణి, పొలం ప్రసాద్ పాల్గొన్నారు. కాటారం: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. కాటారం మండలకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం జిల్లా వైద్యాధికారి తనిఖీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణ, అనుమతి పత్రాలు, సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని పలు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశారు. వైద్య పరీక్షలకు సంబంధించిన ధరల పట్టికను ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని, అర్హులైన వైద్యులతో మాత్రమే వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్య పరీక్షల పేరిట గ్రామీణ ప్రజల వద్ద అడ్డగోలుగా బిల్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయవద్దని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సందీప్, మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఉన్నారు. ఆయుర్వేద వైద్య శిబిరం గణపురం:మైలారం గ్రామంలో ఆయుర్వేద ఉచిత వైద్యశిబిరాన్ని డీఎంహెచ్ఓ మధుసూదన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ జీవితంతో ఆయుర్వేద వైద్యం ముడిపడి ఉందన్నారు. వైద్య శిబిరంలో 425 మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు తనూజ రాణి, సారంగపాణి, జగదీష్ కన్నా, గీత పాల్గొన్నారు. -
ఓపెన్కాస్ట్ సందర్శన
మల్హర్: మండలంలోని తాడిచర్ల బ్లాక్–1 ఓపెన్కాస్ట్ను జెన్కో ఐఆర్టీసీ, డైరెక్టర్ (కోల్ అండ్ లాజిస్టిక్) నాగ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాగ్య ఓపెన్కాస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఓసీపీలో జరుగుతున్న పని తీరు, బొగ్గు ఉత్పత్తి వివరాలను ఏఎమ్మార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్కాస్ట్ ప్లాన్లు, పర్యావరణం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను నాగ్యకు ఏఎమ్మార్ అధికారులు వివరించారు. ఓపెన్కాస్ట్లో జరుగుతున్న పనులు, మైన్లో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి అభినందించారు. అనంతరం నాగ్య మాట్లాడుతూ.. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి నిర్ధేశించిన బొగ్గు లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ సీఈఓ డీఎల్ఆర్ ప్రసాద్, కేటీపీ ఓవైఎం సీఈ శ్రీప్రకాశ్, ఎస్ఈ రామకృష్ణ, ముత్యంరావ్, జెన్కో జనరల్ మేనేజర్ మోహన్రావు, తాడిచర్ల ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్టి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
● బిల్లులు లేకుండా విక్రయాలు ● ఎరువుల దుకాణం లైసెన్స్ సస్పెన్షన్కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రోస్ ఎరువులమందు దుకాణం నుంచి కాటారం మండలం దామెరకుంటకు బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై కె పవన్కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రోస్ ఎరువు మందుల దుకాణం గుండా దామెరకుంటకు 27 బస్తాలు ట్రాక్టర్లో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పట్టుకుని పోలీసుస్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు తెలిపారు. బిల్లులు లేవు..దుకాణం సస్పెన్షన్ అగ్రోస్ ఎరువుల దుకాణంలో మహదేవపూర్ మండలం వ్యవసాయఽ అధికారి సుప్రజ్యోతి సోమవారం తనిఖీ చేపట్టారు. కాటారం మండలం దామెరకుంటకు ట్రాక్టర్లో తరలిస్తూ పట్టుబడ్డ 27 యూరియా బస్తాల్లో 21 బస్తాలకు బిల్లులు ఉన్నాయని తెలిపారు. మిగితా ఆరు యూరియా బస్తాలను ముగ్గురు రైతులకు బిల్లులు లేకుండా విక్రయాలు జరిపినట్లు తేలినట్లు పేర్కొన్నారు. దుకాణంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దుకాణంలోని రికార్డులు స్వాధీనం చేసుకొని దుకాణం సీజ్ చేసి సస్పెషన్షన్ చేసినట్లు వెల్లడించారు. ఎరువుల దుకాణాల ఇష్టారాజ్యం రహస్యంగా యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. -
భూ సేకరణ పూర్తి చేస్తాం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: జాతీయ రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఆర్అండ్బీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం మొత్తం 130 హెక్టార్లలో భూమి అవసరం ఉందని, దానిలో 117.97 సేకరణ పూర్తయిందని తెలిపారు. పెండింగ్లో 12.3 హెక్టార్ల భూ సమస్య ఉందని, ఇందులో 7.79 హెక్టార్ల భూమి కోర్టు కేసుల్లో ఉందని వెల్లడించారు. మిగిలిన 6.02 హెక్టార్ల భూమికి టైటిల్ సమస్యలు ఉన్నందున, నిధులు డిపాజిట్ చేసి భూ సేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్అండ్బీ డీఈ కిరణ్కుమార్ పాల్గొన్నారు. పరిష్కారానికి చర్యలు.. ప్రజలు ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి : సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారాన్ని వెయ్యేళ్లు నిలబడేలా అభివృద్ధి పనులు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, మాస్టర్ప్లాన్ ఆవిష్కరణ కోసం మంగళవారం సీఎం రేవంత్రెడ్డి మేడారం వస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ములుగులో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 7న మేడారంలో సమ్మక్క, సారలమ్మ దీవెనలు తీసుకొని సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారని తెలిపారు. 2024లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంనుంచి ఎన్నికల భేరి మోగించి రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. మేడారానికి మంజూరైన రూ.150 కోట్ల నిధులతో మూడు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. భక్తులకు అను, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తితో, విశ్వాసంతోనే గద్దెల ప్రాంగణం చుట్టూ సాలాహారం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో కొంతమంది తప్పిపోతున్నారని అలాంటి సంఘటనలు జరగకుండా అందరి అభిప్రాయం మేరకు గద్దెల ప్రాంతాన్ని గ్రానైట్తో తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. రూ.15 కోట్లతో జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.5కోట్లతో జంపన్నవాగుకు ఇరువైపులా గ్రీనరీతోపాటు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రదేశాలైన రామప్ప, లక్నవరం, మేడారం జాతర ప్రత్యేకతలు తెలుపుతూ వాటి కళాత్మకతను పర్యాటకులకు తెలియజేసే విధంగా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి ఉన్నారు. మేడారంలో ఏర్పాట్ల పరిశీలన.. మేడారాన్ని సోమవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి మంత్రి సీతక్క పరీశీలించారు. సమ్మక్క సారలమ్మ దేవతలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో శంకుస్థాపన, పరిశీలించే పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ పర్యటనకు జిల్లాలోని అన్ని మండలాలనుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఏపిఓ వసంతరావు, అధికారులు పాల్గొన్నారు. పనుల పరిశీలన, మాస్టర్ప్లాన్ ఆవిష్కరణకు నేడు మేడారం రానున్న సీఎం రేవంత్రెడ్డి భక్తులు, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల ప్రాంతం అభివృద్ధి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
సమస్యలు తీరేదెన్నడో..?
● ఇబ్బందులు పడుతున్న రేషన్ డీలర్లు ● హామీల అమలులో పాలకుల జాప్యం ● గౌరవ వేతనం డిమాండ్ బుట్టదాఖలు ● నెలవారీ కమీషన్లూ అందట్లేదు..భూపాలపల్లి అర్బన్: రేషన్ డీలర్లు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొరపెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేది ఏమీ లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిమాండ్లు తీరుస్తామనే హామీలు డీలర్లను ఊరిస్తూ వచ్చాయి. ఏ ఒక్క సమస్యా తీరలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ డీలర్లకు అనేక హామీలు గుప్పించింది. రెండేళ్లు అవుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇలా ఎన్నో సమస్యలను పాలకులకు ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నా, కనీసం చర్చలు కూడా జరపడం లేదనే ఆవేదన డీలర్లను వేధిస్తోంది. ప్రజాపాలనలో తమ కష్టాలు తీరుతాయనే నమ్మకం డీలర్లలో సన్నగిల్లుతోంది. ఆరు నెలలుగా అందని కమీషన్.. రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు కూడా ప్రతినెల క్రమంగా అందడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా ఆరు నెలలకు సంబంధించిన కమీషన్లు ఇంకా జమ కాలేదని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలో 247 మంది రేషన్ డీలర్లు ఉండగా, ఐదు నెలలకు ఒక్కొక్కరికి దాదాపు రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. నెలవారిగా డబ్బులు అందకపోవడంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘అమ్మ హస్తం’ పథకం అమలు చేశారు. బియ్యంతో పాటు చక్కెర, పప్పులు, నూనె ఇతర సరుకులు మొత్తంగా 9 నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేవారు. ఇది డీలర్లకు కాస్త లాభసాటిగానే ఉండేది. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. దీంతో కమీషన్లు గణనీయంగా తగ్గాయి. ఖర్చులు పెరగడం, కమీషన్లు తగ్గడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున అమ్మ హస్తం మాదిరిగా నిత్యావసరాల సరుకుల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డీలర్లు వేడుకుంటున్నారు. హామీలు నెరవేర్చాలి నెలవారీ కమీషన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలన్నింటినీ అమలు చేయాలి. డీలర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి పరిష్కరించాలి. – గడ్డం రాధాకృష్ణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఖర్చులు పోను మిగిలేదేమీ లేదు..ఖర్చులన్నీ పోనూ డీలర్లకు చివరకు మిగిలేది ఏమీ లేదని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. దిగుమతి చార్జీలు సైతం తామే భరించడం వల్ల ఏమీ మిగలడం లేదంటున్నారు. ఒక్కోసారి తామే అదనంగా భరించాల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది డీలర్ల వాదన. ఒక డీలర్ వంద క్వింటాళ్ల బియ్యం బస్తాలను దిగుమతి చేసుకుంటే రవాణా, డైవర్, కూలీ మొత్తంగా రూ.2 వేల వరకు భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. వంద క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే క్వింటాలుకు రూ.140 చొప్పున మొత్తంగా రూ.14 వేలు కమీషన్ రూపంలో డీలర్కు లభిస్తుంది. ఈ ఆదాయంలో షాపు అద్దె, విద్యుత్ చార్జీలు, హమాలీ కూలీలు, ఇతరత్రా ఖర్చుల చెల్లింపులు జరిగితే ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో దిగుమతి చార్జీలు మరో భారంగా మారాయంటున్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించి దిగుమతి చార్జీలను భరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా డీలర్కు నెలకు రూ.2 వేలు మిగిలే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్లలో కాంటా సరిగ్గా ఉండక తూకంలో తక్కువ బియ్యం వస్తున్నాయని, బస్తాకు రెండు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ భారాన్ని కూడా తామే మోయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. క్వింటాల్ బియ్యం బస్తా కచ్చితమైన తూకంతో డీలర్లకు సరఫరా చేయాలని, షాపు రెన్యువల్ శాశ్వత ప్రాతిపదికన జరగాలని, ప్రతి నెల ఒకటవ తేదీలోగా బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలివే.. డీలర్లకు గౌరవ వేతనం నెలకు రూ.5వేలు ఇస్తాం క్వింటాకు కమీషన్ రూ.140నుంచి రూ.300కు పెంచుతాం ఒక్కొక్కరికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తాం డీలర్ చనిపోతే అతని స్థానంలో వారసులకు అవకాశం కల్పిస్తాం రేషన్ షాపు కరెంట్ బిల్లు, గది కిరాయిలు చెల్లిస్తాం -
యూరియా కోసం బారులు
చిట్యాల: మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయమే క్యూలైన్లో బారులుదీరారు. ఓడీఎంఎస్, అగ్రోస్, షాపులలో 555 యూరియా బస్తాలను పోలీసు బందోబస్తు నడుమ రైతులకు పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా బస్తాలు దొరక్కపోవడంతో అనేక ఇబ్బందులు పడుతూ వెనుదిరిగిపోయారు. అధికారులు చొరవ తీసుకుని యూరియా అందించాలని అంటున్నారు. మల్హర్: మండలంలోని తాడిచర్ల సహకార సొసైటీ, కొయ్యూరు, అన్సాన్పల్లి గ్రామాల్లో సోమవారం యారియా కోసం రైతులు బారులుదీరారు. మండలంలోని తాడిచర్ల సొసైటీకి ఆదివారం రాత్రి 40 టన్నులు, కొయ్యూరుకు 10 టన్నులు, అన్సాన్పల్లికి 15 టన్నుల యూరియా వచ్చింది. దీంతో సోమవారం సొసైటీ వద్దకు, కొయ్యూరు, అన్సాన్పల్లిలో గ్రామాల్లో రైతులు యూరియా కోసం భారీగా తరలివచ్చారు. కొయ్యూరు పోలీసులు పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల పేర్ల ఆధారంగా వారికి టోకెన్లు అందించారు. తాడిచర్ల సొసైటీ వద్ద ఒక్క రైతుకు రెండు బస్తాలు, కొయ్యూరు, అన్సాన్పల్లిలో రైతుకు ఒక్క యూరియా బస్తాను అందించారు. మరో రెండు, మూడు రోజుల్లో మళ్లీ లోడ్ వస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. -
హామీలను నెరవేర్చాలి
రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ దోర్నాల రాజేందర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల, చేయూత పెన్షన్దారుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులు, చేయూత పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచాలని లేనియెడల పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న మండలకేంద్రంలో నిర్వహిస్తున్న సన్నాహక సభకు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో పెన్షన్దారులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, నాయకులు నోముల శ్రీనివాస్, మంద తిరుపతి, ఎర్ర భద్రయ్య, ఆరెపల్లి రాజు, కొండమల్ల విష్ణు పాల్గొన్నారు. -
నేటినుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయాల్లో నేటి(సోమవారం) నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈసారి తిథులు కలిసి ఒకే రోజు రావడంతో ఒక రోజు పెరిగి పదకొండు రోజుల పాటు వివిధ అలంకరణల్లో భక్తులకు శ్రీశుభానందదేవి(పార్వతి), శ్రీసరస్వతి అమ్మవార్లు వివిధ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. వివిధ అలంకరణలు.. 22న బాలత్రిపురా సుందరి దేవి , 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణదేవి, 25న కాత్యాయనిదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి, 28న మహాచండీ దేవి, 29న మూలనక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతిదేవి, 30న దుర్గాదేవి (దుర్గాష్టమి), అక్టోబర్ 1న మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అదే రోజున మధ్యాహ్నం బలిహరణం, పూర్ణాహుతి యాగశాలలో హోమం కార్యక్రమం నిర్వహిస్తారు. 2న రాజరాజేశ్వరీదేవి అలంకరణల్లో భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. దీంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. విజయ దశమి (దసరా) సందర్భంగా సాయంత్రం శ్రీరామాలయం నుంచి గోదావరికి మంగళవాయిద్యాలతో బయలుదేరి 4.30గంటలకు శమీ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. ఉత్సవాలకు 11 రోజులు ప్రత్యేకంగా ప్రతి రోజు వరంగల్కు చెందిన వారితో డెకరేషన్స్ పూలతో అలంకరిస్తారు. ఇప్పటికే ఆలయాలు విద్యుత్ బల్బులతో అలంకరిస్తున్నారు. ముస్తాబైన అమ్మవార్ల ఆలయాలు నేడు బాల త్రిపురా సుందరిదేవి అలంకరణ -
నేటి నుంచి ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: నేటినుంచి (సోమవారం) ఓపెన్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. కాళేశ్వరం: పితృపక్షాలను పురస్కరించుకొని అమావాస్య సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆవరణలో మహదేవపూర్ గ్రామానికి చెందిన నూక సత్యనారాయణ, ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు హాజరై భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, కాళేశ్వరం మాజీ ఎంపీటీసీ రేవెల్లి మమత, దేవస్థానం మాజీ డైరెక్టర్లు గందెసి సత్యనారాయణ, మెంగాని అశోక్, సీనియర్ నాయకులు గందెసిరి మధుసూదన్ పాల్గొన్నారు. జీఓ నంబర్ 64ను రద్దు చేయాలి భూపాలపల్లి అర్బన్: జీఓనంబర్ 64ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఆశ్రమ పాఠశాలల కాంటిజెన్సీ వర్కర్స్ చేపడుతున్న దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకు చేరుకోగా బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. వారి దీక్షలకు సాయిలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరారు. జీఓ వలన వేతనాలు తగ్గుతున్నాయన్నారు. నూతన జీఓను సవరించి పాత జీఓ 212ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు జావీద్, వెంకటలక్ష్మి, కిషన్, రామ్సింగ్, కంటిభాయ్, స్వరూప, విజయ, ఎర్రక్క పాల్గొన్నారు. నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం మొగుళ్లపల్లి : ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 69 మందికి రూ.16.50లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శ చిట్యాల: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన జాలిగపు కొంరయ్య, మండలకేంద్రంలో పెరుమాండ్ల కృష్ణగౌడ్, అందుకుతండాలో దాసారపు రాజయ్య(డీలర్), నైన్పాకలో వావిళ్ల రాములు, మండ రాజక్క, బిక్కనూరి లచ్చక్క ఇటీవల మృతిచెందారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు బుర్ర లక్ష్మన్, గుర్రపు తిరుపతిగౌడ్, చిలుకల రాయకోంరు, దొడ్డి కిష్టయ్య ఉన్నారు. -
నిషేధించినా ఆగట్లేరు..
వాజేడు: ములుగు జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనను నిలిపివేసినా.. చెప్పాపెట్టకుండా, అధికారుల కళ్లుగప్పి దొడ్డిదారిన పలువురు పర్యాటకులు వెళ్తున్నారు. రక్షణ లేని జలపాతాలను చూస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పర్యాటకులకు ఎంత చెప్పినా.. ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినా వెళ్లడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం మండల పరిధిలోని కొంగాల సమీపంలోని గుట్టల్లో ఉన్న దూసపాటి లొద్ది జలపాతాన్ని చూసేందుకు హైదరాబాద్కు చెందిన కొండిశెట్టి మహాశ్విన్(18) తన మిత్రులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతయ్యాడు. మంగళవారం జీపీ సిబ్బంది అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టగా మృతదేహం బయటపడింది. నిషేధిత జలపాతాల వద్దకు వెళ్లొద్దు జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యంధార, మాసన్ లొద్ది, భామన సిరి, గుండం, దూసపాటి లొద్ది మొదలైన జలపాతాల సందర్శనను వెళ్లవద్దని కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వర్షాకాలం ప్రారంభంలోనే అధికారికంగా ప్రకటించారు. చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేశారు. కొందరు పర్యాటకులు సిబ్బంది విధులకు రాని సమయం కంటే ముందే, మరికొందరు దొంగదారుల్లో జలపాతాల వద్దకు వెళ్లి వస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ముత్యంధార జలపాతానికి వెళ్లిన కొందరు పర్యాటకులు వెళ్లి ఒక్కరు తప్పిపోవడంతో అధికారులు రాత్రంతా గాలించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన మరచిపోకముందే దూసపాటి లొద్దికి వెళ్లిన యువకుడు మృత్యువాత పడడం విషాదకరంగా మారింది. దొంగచాటున నిషేధిత జలపాతాల సందర్శన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పర్యాటకులు -
మునిగిన పంట పొలాలు
మల్హర్: మానేరు బ్యాక్ వాటర్ కారణంగా మల్హర్ మండలంలోని వల్లెకుంట మానేరు శివారులోని పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని రోజులు కురిస్తున్న వర్షాలతో ప్రవాహం పెరిగింది. ఇటీవల కరీంనగర్ డ్యాం గేట్లు ఎత్తడంతో తాడిచర్ల– ఖమ్మంపల్లి మానేరులో వరద ప్రవావం పెరిగింది. దీంతో అడవి సోమన్పల్లి, వల్లెకుంట వద్ద నిర్మించిన చెక్డ్యామ్ వద్ద వరద పెరగడంతో వల్లెకుంట శివారులోని 15 ఎకరాల మేరకు పంట పొలాలు నీట మునిగాయి. పొలాలు మునగడంతో తమ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చోరీలు జరగకుండా ముందస్తు చర్యలు
భూపాలపల్లి: బతుకమ్మ, దసరా పండుగ సెలవుల నేపథ్యంలో జిల్లాలో చోరీలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పండుగల సందర్భంగా వేలాది మంది సొంత ఊర్లకు వెళ్లే అవకాశం ఉందని, ఈ సమయాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసు గస్తీని మరింత పెంచుతామన్నారు. ఊర్లకు వెళ్తున్న వారు కూడా తమవంతుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీసులతో పాటు క్రైం విభాగం ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఇళ్ల పరిసరాలు, షాపింగ్ మాళ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఊళ్లకు వెళ్లే వారు ముందస్తుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. బీరువా తాళాలు ఇంట్లో వదిలి వెళ్లవద్దని, ఇంట్లోని ఒక గదిలో లైట్ వేసి ఉంచాలన్నారు. ఎక్కువ రోజులు విహారయాత్రలకు వెళ్లే వారు పేపర్, పాల డెలివరీని ఆపేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా భూపాలపల్లి పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 58159కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. ఎస్పీ కిరణ్ ఖరే -
పూల పండుగ షురూ..
‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆటా పాటలతో ఆడపడుచుల పండుగ బతుకమ్మ ఆదివారం ప్రారంభమైంది. జిల్లాలో ఉదయం నుంచే పూల సేకరణలో నిమగ్నమైన మహిళలు సాయంత్రానికి తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులతో కలిసి సమీప ఆలయాలు, కూడళ్లలో బతుకమ్మలను ఒక చోట చేర్చారు. చప్పట్లతో చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. బతుకమ్మ పాటలతో వీధులు మారుమోగాయి. ఆడపడుచులకు అతిపెద్ద పండుగైన బతుకమ్మ ఎంగిలిపూలతో ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలో బతుకమ్మ ఆడుకునేందుకు మున్సిపాలిటీ, గ్రామాలలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆట స్థలాలు చదునుచేసి విద్యుత్ సౌకర్యం కల్పించారు. – భూపాలపల్లి అర్బన్ -
కల్చరల్ పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్పీపుల్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏరియా స్థాయి కల్చరల్ పోటీలను ప్రారంభించారు. ఏరియాలోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ మారుతి హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్, డాన్స్, ఇతర వైవిద్యమైన కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శించారు. సింగరేణి సంస్థ సాంస్కృతిక సంపదను సమృద్ధి చేస్తూ ఉద్యోగుల ఆనంద, సామాజిక ఐక్యతను పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. కోలిండియా స్థాయిలో రాణించే విధంగా ప్రదర్శనలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ అడిచర్ల శ్రీనివాస్, కళాకారులు పాల్గొన్నారు. -
23న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి
ములుగు: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధికి ఈ నెల 23 (మంగళవారం)న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నట్లు తెలిసింది. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అభివృద్ధిపై సమీక్ష అనంతరం డిజైన్లను సీఎం రేవంత్రెడ్డి ఖరారు చేస్తారని సమాచారం. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఐసీసీసీలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు–పద్మ దంపతులు దర్శించుకున్నారు. శనివారం ఆయన ఆలయానికి రాగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. ఆశీర్వచన వేదికపై ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఆయనకు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఆయన వెంట సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏరియా స్థాయి లాల్ టెన్నిస్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా సర్వే అధికారి శైలేంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్లు మల్లేష్, శ్రీరాములు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాటారం: మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలకు చెందిన నాగేశ్వరి సబ్ జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో నాగేశ్వరి ప్రతిభ కనబర్చడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి చల్ల సునీత తెలిపారు. ఈ నెల 25నుంచి 28వరకు నిజామాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్ఓ పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక కాళేశ్వరం: ఈనెల 16 నుంచి 19 వరకు జరిగిన మండలస్థాయి పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయికి విద్యార్థులు ఎంపికయ్యారు. మహదేవపూర్ బాలుర ఉన్నత అండర్ 17 వాలీబాల్లో ప్రథమ స్థానం, అండర్ 14 వాలీబాల్లో ప్రథమస్థానం, అండర్ 17 ఖోఖో లో జాయింట్ వినర్స్గా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనిల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు శిరంగి రమేష్ శనివారం తెలిపారు. త్వరలో జరిగే జిల్లాస్థాయిలో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర మాస్టర్ప్లాన్ అభివృద్ధి పనులు, భూ సేకరణకు రైతులు సకరించాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో గల ఐటీడీఏ గెస్ట్హౌస్లోని సమావేశ మందిరంలో భూ సేకరణపై బాధిత రైతులతో ఆయన శనివారం సమావేశం అయ్యారు. భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు 20 ఎకరాల స్థలం అవసరమని గుర్తించి రైతులతో ఆర్డీఓ వెంకటేశ్ మాట్లాడారు. రైతులు ముందుగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ డిజైన్ను రూపొందించనున్నట్లు తెలిపారు. -
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరిరేగొండ: పోషక విలువలు గల ఆహరం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. శనివారం మండలంలోని మడతపల్లి ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ.. పోషకాహార లోపం సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. ప్రతి అంగన్వాడీ టీచర్ తన పరిధిలోని బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. పోషణలోపం లేని సమాజం నిర్మించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు లక్ష్మి, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు భద్రయ్య, చైల్డ్ కో ఆర్డినేటర్ తిరుపతి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. -
ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త
● పండుగ వేళ చోరీలు జరిగే అవకాశం ● జాగ్రత్తలు పాటించాలంటున్న పోలీసులు భూపాలపల్లి: కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి పట్టణంలో వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారు ఉద్యోగ రీత్యా ఇక్కడ నివాసం ఉంటారు. నేటినుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో సొంత గ్రామాలు, దైవ దర్శనాలు, టూర్లకు వెళ్తారు. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి ● ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ● ఊరికి వెళ్తే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ● తద్వారా పోలీసులు రాత్రి వేళ గస్తీ ఇంటి పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తారు. ● ఊరికి వెళ్తున్న విషయాన్ని కనిపించిన అందరికీ చెప్పకూడదు. ● సెలవు దినాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పెట్రోలింగ్ పెంచుతాం..బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పిల్లలకు సెలవులు వచ్చి సొంత ఊర్లకు వెళ్తున్న వారు తగు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. స్థానికంగా ఉన్న వారికి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలి. ఊర్లకు వెళ్తున్న వారు తప్పకుండా పోలీసులకు తెలియజేయాలి. సమాచారం ఇస్తే రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో పోలీసు సిబ్బంది పహారా కాస్తారు. సెలవుల నేపథ్యంలో రాత్రివేళ పెట్రోలింగ్ మరింత పెంచుతాం. ప్రతీ కాలనీలో గస్తీ నిర్వహిస్తాం. – డి నరేష్కుమార్, సీఐ, భూపాలపల్లి -
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): హైదరాబాద్లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 30 మంది విదేశీయులు శిక్షణలో భాగంగా శనివారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప దేవాలయాన్ని వివిధ దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు, అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్ వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. -
కారిడార్ భూసేకరణ పూర్తి చేస్తాం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించనున్న కారిడార్కు సంబంధించి జిల్లాలో పెండింగ్లో ఉన్న 12 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. నాగ్పూర్–విజయవాడ కారిడార్ నిర్మాణ భూసేకరణపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్పూర్–విజయవాడ కారిడార్, మహదేవపూర్–కాళేశ్వరం జాతీయ రహదారి వెడల్పునకు అటవీశాఖ భూ కేటాయింపు పురోగతిపై సీఎస్ సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, ఆర్అండ్బీ డీఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దాడుల నియంత్రణకు చర్యలు
కాటారం: ఎస్సీ ఎస్టీలపై దాడుల నియంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, దళితుల భూ సమస్యలపై కాటారం మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్హాల్లో శనివారం దళిత బహుజన ఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్, శంకర్ మాట్లాడుతూ దళితులపై దాడుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. చింతకాని శివారులోని 241 సర్వేనంబర్లో భూ ఆక్రమణకు ప్రయత్నించిన న్యాయవాదిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు బాల్రాజు, మధు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
లోపాలు లేని బిల్లింగ్ విధానం
భూపాలపల్లి రూరల్: విద్యుత్ బిల్లుల అందజేతలో వేగం, మరింత పారదర్శకతను పెంచేందుకు ‘ఆటోమేటిక్’ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) వ్యవస్థను రూపొందించామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు మాన్యువల్ బిల్లింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు ఏఎంఆర్ విధానం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టంచేశారు. సర్కిల్లో అధిక సామర్థ్యం విద్యుత్ వినియోగించే పరిశ్రమలకు వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాటారం: మండలంలోని మేడిపల్లి, మద్దులపల్లి గ్రామాల సమీపంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయాలపాలయ్యారు. భూపాలపల్లి వైపు నుంచి కాటారం వైపుగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు డ్రైవర్తో పాటు పలువురు గాయాలపాలయ్యారు. మద్దులపల్లి వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు గాయాలపాలవగా చికిత్స నిమిత్తం మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భూపాలపల్లి అర్బన్: న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న భౌతిక దాడులను నిరసిస్తూ శుక్రవారం జిల్లాలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యులు సాయికుమార్, నాంపల్లికి చెందిన హనుమంత్నాయక్పై భౌతికదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో న్యాయవాదుల రక్షణ చట్టం ప్రవేశపెట్టి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మహేందర్, రవీందర్, రాజ్కుమార్, రమేష్, రవీందర్, సుధాకర్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతాయని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఏరియాలోని కేటీకే ఒకటో గనిలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాలలో జరిగిన ఒప్పందాలను అమలు చేయించడంలో గుర్తింపు సంఘం దృష్టి సారించడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే నిరసన కార్యక్రమాలు చేపట్టడం కాదని.. పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వాస్తవ లాభాల వాటా ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ యూనియన్ల నుంచి సీఐటీయూలో చేరిన కార్మికులకు రాజిరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రాజయ్య, బందు సాయిలు, తోట రమేష్, బాబురావు, దేవేందర్ పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరి వరద తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం కాళేశ్వరం పుష్కరఘాటు వద్ద 9మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీలో 6.25లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలి వస్తుంది. దీంతో బ్యారేజీలో 85గేట్లు ఎత్తి దిగువకు వరదను తరలిస్తున్నారు. మూడు రోజుల కిందట ఎగువన వర్షాలు కురువడంతో కాళేశ్వరం వద్ద 11.500మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదు కాగా, మేడిగడ్డ బ్యారేజీలో 9.50లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిపోయింది. -
ఆ 5 శాఖలు...!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు ముమ్మరమైనా.. కొందరు అధికారులు, ఉద్యోగుల్లో మార్పు లేదు. లంచం.. లంచం.. లంచం.. ఈ పదం కొన్ని శాఖల్లో సర్వసాధారణంగా మారింది. అవసరం కొద్ది లంచం ఇవ్వడం.. అధికారులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. హద్దులు దాటి అధికంగా డిమాండ్ చేసినప్పుడు... బాధితులు ఏసీబీని ఆశ్రయించడం పరిపాటిగా మారుతోంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో పలువురు అధికారులు ఏసీబీకి చిక్కుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా రెవెన్యూ, రవాణా, పోలీసు, రిజిస్ట్రేషన్, విద్యుత్శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి కొందరికీ శాపంగా మారుతోంది. కాళేశ్వరం వివాదం తర్వాత నీటిపారుదలశాఖలో పనిచేసే అధికారులు కొందరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కటకటాల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఉమ్మడి వరంగల్లో అవినీతి, అక్రమాలు యధాతధంగా కొనసాగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఫిర్యాదులు.. అవినీతి పరులపై ఆరా.. అవినీతి, అక్రమార్కులపై ఏసీబీ దూకుడు పెంచడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, విద్యుత్శాఖలతో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ‘కుడా’లలోని పలు విభాగాల్లో కొందరు అధికారులపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ పనికి ఓ రేటును ఫిక్స్ చేసి మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని కొందరు పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లపైన భూదందాలు, సెటిల్మెంట్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల కోసం భూసేకరణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పేరిట రెవెన్యూ అధికారుల వసూళ్లు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, ఎఫ్టీఎల్ స్థలాలు, ఎల్ఆర్ఎస్ లేని నాన్ లేఅవుటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల కొందరు సబ్ రిజిస్ట్రార్లపైన ఉన్నాయి. అదే విధంగా విద్యుత్శాఖలో కొందరు అధికారులు బినామీలను పెట్టుకుని కాంట్రాక్టులు చేస్తుండటంతో పాటు విద్యుత్ కనెక్షన్లు, సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. రవాణాశాఖ హనుమకొండ, వరంగల్ డీటీఓ కార్యాలయాల్లో హద్దుల దాటిన అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా ఏసీబీ అధికారులు మౌనం వహించడంపైన చర్చ జరుగుతోంది. జీడబ్ల్యూఎంసీ, కుడాలలో కొందరు అవినీతి అధికారులపైన బాధితులు ఏసీబీని సంప్రదించినట్లు చెప్తున్నారు. ఏదేమైనా ఏసీబీ దూకుడుతో రోజురోజుకూ అవినీతికి పాల్పడే వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. ఉమ్మడి వరంగల్లో వరుసగా కొందరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదులతో దాడులకు గురవుతున్నారు. ఆగస్టులో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి, అక్రమాస్తులను గుర్తించారు. ఫిబ్రవరిలో వరంగల్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, సోదాలు నిర్వహించారు. అంతకుముందు ఇరిగేషన్ డిపార్టుమెంట్లో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్పైన ఏసీబీ దాడులు నిర్వహించి రూ.200 కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ జగదీష్ ఓ బెల్లం వ్యాపారానికి సంబంధించి రూ.4లక్షలు డిమాండ్ చేసి లంచం తీసుకున్న కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈ రమేష్, ఆయన అసిస్టెంట్ రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కేసు నుంచి నిందితులను తప్పించేందుకు లంచం తీసుకున్న పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రూ.19,200లు మహబూబాబాద్ సబ్ రిజిష్ట్రార్ తస్లీమ మహమ్మద్ను అప్పట్లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించారు. విద్యుత్శాఖ హైదరాబాద్లో పనిచేసే ఏడీఈ అంబేద్కర్పై ఏసీబీ దాడులు, వెల్లడైన అక్రమాస్తుల నేపథ్యంలో ఆశాఖ అధికారులపైని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఉమ్మడి వరంగల్లో వరుసగా ఏసీబీ దాడులు, కేసులు అవుతున్నా ఆ ఐదు శాఖల్లోని కొందరు అధికారుల్లో మార్పు రాకపోవడంపై చర్చ జరుగుతోంది. తీరు మారని పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, విద్యుత్ శాఖలు ఏసీబీకి చిక్కుతున్నా వీడని ఆయా శాఖల అధికారుల కక్కుర్తి కాసుల కోసం అడ్డదారులు.. అక్రమార్జనే ధ్యేయంగా పనులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వీరిపైనే అధిక ఫిర్యాదులు నీటిపారుదలశాఖ అధికారులపైన పెరిగిన దాడులుసంవత్సరం కేసుల సంఖ్య 2021 07 2022 09 2023 11 2024 17 2025 (ఆగస్టు 31 వరకు) 12