breaking news
Jayashankar District Latest News
-
వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆరోపణలు
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డిభూపాలపల్లి రూరల్: సింగరేణిపై బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి భరోసా యాత్రపై ఆరోపణలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఎంఎస్ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి ఇబ్బందుల్లో పడిందన్నారు. కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి చొరవతో వేలం లేకుండా తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించినట్లు తెలిపారు. రామగుండం మంథిని, భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే బీఎంఎస్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎరుకల గణపతి, సెంట్రల్ కార్యదర్శి సట్కూరి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి రాసకట్ల నర్సింగరావు, మల్లేష్ పాల్గొన్నారు. -
ఏఐతో ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పులు..
శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, వరంగల్: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రజాహితంగా సమూల మార్పులు తేనుంది. ప్రజా సమస్యలు, ఫైళ్లు, లెటర్ల తయారీ, సమావేశాల నిర్ణయాల అమలులో జాప్యాన్ని నియంత్రించేందుకు ఏఐ ఉపయోగపడనుంది. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో 250 మంది అధికారులకు ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫీషియెన్సీ శిక్షణ ఇచ్చింది. రోజువారీ ప్రభుత్వ పనుల్లో అధికారులు ఏఐ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద కూడా చాలెంజ్గా తీసుకొని అధికారులు ఏఐ వినియోగిస్తే ప్రజల సత్వర సేవలకు మరింత దగ్గరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక లేఖల తయారీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానాలు, ఉన్నతాధికారులకు సమర్పించే నివేదికలు, మీటింగ్ మినిట్స్, జీఓ ఉత్తర్వుల సారాంశం, వివిధ పథకాల అమలుకు ప్రజలకు సులభంగా అర్థమయ్యే సమాచారం రూపొందించడం వంటి పనుల్లో చాట్జీపీటీ, నోట్బుక్ఎల్ఎం, క్లాడ్, భాషిణి వంటి ఏఐ సాధనాలను వినియోగించనున్నారు. ఇలా నెలరోజుల్లో ఏఐ పనితీరుతో జిల్లా పరిపాలనలో వేగం, పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సాంకేతికతను అమలుచేస్తే ‘మీ పని పూర్తయ్యింది‘ అనే సమాధానం ప్రజలకు చేరనుంది. అదే జరిగితే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం మరింత బలపడుతుంది. అంశం పనిభారం తగ్గే శాతం80%పవర్పాయింట్/రిపోర్టులు ప్రజా ఫిర్యాదులు డేటా విశ్లేషణ తెలుగు అనువాదం మీటింగ్ మినిట్స్ డాక్యుమెంట్ సారాంశం లెటర్ల తయారీ82%85%88%90%92%95%ఏఐతో శాఖల వారీగా ప్రయోజనాలు ఇలా..ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం వివిధ విభాగాల అధికారులకు సమాచారం, ఆదేశాలను త్వరగా చేరవేసేందుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా అయితే డ్రాఫ్ట్ రెడీ చేసుకునేందుకు గంటల సమయం తీసుకుంటుంది. అదే ఏఐకి సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్ల వ్యవధిలోనే డ్రాఫ్ట్ రెడీ అవుతుంది. కోర్టు కేసుల్లోనూ 100 నుంచి 150 పేజీల డాక్యుమెంట్ ఉన్న కాపీలను గూగుల్ క్ల్లౌడ్లో స్కాన్ చేసి ఒక పేజీలో ముఖ్యమైన సారాంశం ఇవ్వాలని సరైన ప్రాంప్ట్ ఇస్తే సెకన్లలో సిద్ధమవుతుంది. అలాగే, అధికారులు కూడా తమ రోజువారీ పనుల్లో ఏఐ వాడితే ప్రజాసమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైళ్ల కదలికలో వేగం పెరుగుతుంది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. ప్రభుత్వ సేవలు త్వరగా చేరువ అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది. – డాక్టర్ సత్యశారద, వరంగల్ కలెక్టర్వరంగల్ కలెక్టరేట్లో అధికారులకు ఏఐపై శిక్షణ ఇస్తున్న ట్రైనర్ఏఐ నుంచి కచ్చితమైన, ఉపయోగకరమైన ఫలితాలు పొందాలంటే అధికారులు నాలుగు దశల ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ పాటించాలి. ముందుగా మీ పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత ఏ పనిచేయాలో టాస్క్ రూపంలో వివరించాలి. ఆపై సంబంధిత గణాంకాలు, తేదీలు, అవసరమైన సమాచారం వంటి వివరాలు ఇవ్వాలి. చివరగా సమాధానం ఏ రూపంలో కావాలో ఫార్మాట్ను సూచించాలి. ఈ నాలుగు అంశాలను స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఏఐ మరింత కచ్చితమైన, అవసరానికి అనుగుణమైన సమాధానాలు అధికారులకు అందిస్తుంది. – వాసుదేవ నటరాజ్, ఏఐ ట్రైనర్, టీఫైబర్ ఇలా చేస్తేనే ఫలితం.. -
రుణం ఇస్తలేరు..
నాకు బోర్లగూడెంలో నాలుగు ఎకరాల భూమికి 2022లో అటవీ హక్కు పట్టా వచ్చింది. కానీ ఆ భూమి ఆన్లైన్లో నమోదు కాలేదని బ్యాంకులో చెపుతున్నారు. క్రాప్ లోన్ ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు బ్యాంకుకు వెళ్లినా స్పందించడం లేదు. ధరణిలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమో భూభారతిలో నమోదు కాలేదని అంటున్నారు. సాగు పెట్టుబడికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించి పోడు రైతులకు పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి. – ముకులోత్ కమల, బోర్లగూడెం, మహాముత్తారం -
సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ● గణపసముద్రం, రామప్ప చెరువుల పరిశీలనగణపురం: గణపసముద్రం చెరువు కింద ఆయకట్టు రైతాంగానికి సాగు నీటితో పాటు జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గణపసముద్రం, రామప్ప చెరువును బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపసముద్రం చెరువులో నీళ్లు ఉంటే గణపురం మండలంతో పాటు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండల రైతాంగానికి మోరంచవాగు ద్వారా నీరు అంది రెండు పంటలు పండించుకుంటారన్నారు. గణపసముద్రం చెరువు మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 5 మండలాలకు తాగునీరు అందిస్తుందన్నారు. గణపసముద్రం చెరువును రిజర్వాయర్ చేస్తూ దేవాదుల ద్వారా రామప్ప సరస్సుకు నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కెనాల్ నిర్మాణ పనులు చేయలేదన్నారు. రెండు రోజుల నుంచి దేవాదుల నుంచి రామప్పకు నీటిని పంపిస్తున్నారని.. రామప్ప ఫుల్లెవెల్ వాటర్ ట్యాంకును మెంటేన్ చేస్తూ గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం చెరువుకు నీటిని పంపు చేయాలన్నారు. చెరువును పూర్తిగా నింపి నిరంతరం ఫుల్ లెవల్ ట్యాంక్ మెంటేన్ చేస్తూ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కాగితాలకే.. హక్కులు
కాళేశ్వరం: సాగు హక్కుల కోసం అడవిలో పోరాడిన రైతులు.. ఇప్పుడు పెట్టుబడి సహాయం కోసం బ్యాంకర్లతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ రుణాలు ససేమిరా అంటుండడంతో పట్టాలు చేతిలో ఉన్నా పెట్టుబడి సాయం దక్కని పరిస్థితి నెలకొంది. వానాకాలం సాగు సీజన్ ముంచుకొస్తుండడంతో పెట్టుబడి కోసం గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4,852 ఎకరాల్లో పట్టాలు కాటారం డివిజన్లోని కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్ మండలాల్లో 2022 సంవత్సరంలో 2,076 మంది పోడు రైతులకు 4,852 ఎకరాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అటవీశాఖ ద్వారా రైతులు పట్టాలు పొందినా బ్యాంకుల్లో మాత్రం రుణాలు ఇవ్వడం లేదు. ధరణి సంబంధిత సాంకేతిక సమస్యల కారణంగా ఆ భూములు ఆన్లైన్లో నమోదు కాలేదని .. ప్రస్తుతం భూభారతి పోర్టల్లో కూడా ఆ భూముల వివరాలు కనిపించకపోవడంతో వాటిని బ్యాంకులు చెల్లుబాటు అయ్యే రికార్డులుగా పరిగణించడం లేదు. దీంతో పంట రుణాలు మంజూరు చేయడం లేదు. బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరం చూపడం లేదు. పెట్టుబడి సాయం.. గతంలో రుణాలు పొందిన రైతులకు మాత్రమే రుణాల రెన్యూవల్ జరుగుతుండగా, కొత్తగా రుణాలు కోరుతున్న వారికి బ్యాంకర్లు సహకరించడం లేదు. వానాకాలం సీజన్ కావడంతో విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం అత్యవసరంగా పెట్టుబడి అవసరమైన సమయంలో రుణాలు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే తీవ్ర వర్షాభావం పరిస్థితులు.. రుణాలు అందకపోతే సాగు పనులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోడురైతులకు అందని రుణాలు భూభారతి పోర్టల్లో కనిపించని వివరాలు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకర్లు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ఇబ్బందులు పడుతున్న గిరిజనులుభూభారతి పోర్టల్లో నమోదు కాలేదు..పాత పంట రుణాలను మాత్రమే రెన్యూవల్ చేస్తున్నాం. భూభారతి పోర్టల్లో పోడు రైతుల పట్టాలు నమోదు కాలేదు. ఆన్లైన్లో కనిపించడం లేదు. దీంతో బ్యాంకు రూల్స్ ప్రకారం రుణాలు ఇవ్వడం కుదరదు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతిన్నది నిజమే. – ఎ.తిరుపతి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ -
నియమాలు పాటిస్తే ప్రమాదాల నివారణ
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రహదారి భద్రతపై పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారులపై ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయడం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని ఆదేశించారు. రహదారి ప్రమాదం సంభవించినప్పుడు బాధితులను గంటలోపు ఆస్పత్రికి తరలించడం అత్యంత ముఖ్యమన్నారు. అలా సహాయం చేసిన వారికి ‘రహావీర్ అవార్డు’తో పాటు రూ.25వేల నగదు ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీటీఓ శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీ్త్ర నిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.. మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీ్త్ర నిధి రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార, పశు సంవర్ధక, మున్సిపల్, పంచాయతీ శాఖ, మెప్మా, సెర్ప్ అధికారులు, కోఆర్డినేటర్లు, ఏపీఎంలతో జిల్లా స్థాయి సీ్త్ర నిధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీ్త్ర నిధి రుణాల మంజూరులో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మహాముత్తారం, పలిమెల మండలాల్లో రుణాల వినియోగదారులు తక్కువగా ఉన్నారని, ఆ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉన్నాం.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యా, వాతావరణ పరిస్థితులు, పౌర సరఫరాలు, ప్రజా పాలన తదితర అంశాలపై హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. -
భూముల రీసర్వేతో సమస్యలు పరిష్కారం
రేగొండ: భూముల రీసర్వేతో అన్ని రకాల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, రైతులు ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంతో పాటు జగ్గయ్యపేట గ్రామంలో నిర్వహించిన భూముల రీసర్వే గ్రామ సభల్లో ఆర్డీఓ హరికృష్ణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. భూ హక్కులు లేకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలకు దూరం అవుతున్నారన్నారు. కొత్తపల్లిగోరి గ్రామంలో 3,800 ఎకరాలు, జగ్గయ్యపేటలో 2,450 ఎకరాలలో భూ రీసర్వే చేయనున్నట్లు తెలిపారు. మండలంలో సర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఎంపీఓ సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్రావు ఓంప్రకాశ్, పున్నం రవి, రాజేశ్వరరావు, మటికె సంతోష్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. పకడ్బందీగా ‘సర్’ ప్రక్రియ రేగొండ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆర్డీఓ హరికృష్ణ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 258, 259 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ విధుల్లో ఉన్న బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లకు ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. తప్పులు లేకుండా ఆన్లైన్ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఆర్ఐ రాజ్యలక్ష్మి, సూపర్వైజర్ పకిడె రాజయ్య, బీఎల్ఓలు రజీయా, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. మద్దులపల్లిలో 100 శాతం ఎస్ఐఆర్ పూర్తి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం 100 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా బీఎల్ఓ మొండయ్యను సర్పంచ్ ఎల్పుల సరిత శాలువాతో గురువారం సన్మానించారు. 165వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని 536 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తిచేసినందుకు ఆయనను అభినందించారు. మండలంలోనే ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తిచేసిన గ్రామంగా మద్దులపల్లి నిలిచిందని తెలిపారు. -
కార్మికులకు స్వీట్ల పంపిణీ
● తాడిచర్ల–2 బ్లాక్ సాధన విజయోత్సవాలు నిర్వహణభూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తాడిచర్ల–2 బ్లాక్ సాధన విజయోత్సవాలను గురువారం భూపాలపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. కేటీకే ఓసీ–2 గనిలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడిచర్ల–2 బ్లాక్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో కలిసి మిఠాయిలు పంచుకొని విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తాడిచర్ల–2 బ్లాక్ సాధన సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. ఈ గని ద్వారా భూపాలపల్లి ఏరియాకు ప్రయోజనం చేకూరడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును సింగరేణికి నేరుగా కేటాయించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు, ప్రాజెక్టు అధికారులు, అధికారులు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశమహావిద్యలలోని కాళీక్రమాన్ని అనుసరించి అమ్మవారి స్నపన మూర్తిని కపాలినీగా, షోఢశీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి బోగభేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. ఆలయ ఈఓ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు. -
సిగ్నల్స్ స్విచ్ఛాఫ్
భూపాలపల్లి: జిల్లా కేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ నెల రోజులుగా మూగబోయాయి. సిగ్నల్స్ స్విచ్చాఫ్ కావడంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక, ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందో అర్ధం కాక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. చేతులూపుతూ సిగ్నల్.. ఇసుక, సింగరేణి బొగ్గు లారీలతోపాటు మంచిర్యాల, గోదావరిఖని, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వందలాది వాహనాలు ప్రతీ రోజు భూపాలపల్లి జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ట్రాఫిక్ భారీగా పెరగడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని భావించి మూడేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆ చౌరస్తాలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోగా సిగ్నల్స్ ఏర్పాటు చేశాక తగ్గుముఖం పట్టాయి. అయితే నెల రోజులుగా సిగ్నల్స్ పనిచేయడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చేసేది లేక వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో చేతులూపుతూ సూచనలిస్తూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. అయినప్పటికీ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పాదాచారులు రోడ్డు క్రాస్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండటంతో పోలీసులు రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ సేఫ్టీ బాటన్ లైట్లతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా వాహనం అదుపు తప్పితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. డీటీఓ దుర్మరణం మరువకముందే.. జూన్ 22వ తేదీన జాతీయ రహదారిపై బొగ్గులారీ అదు పు తప్పి ఢీ కొట్టిన ఘటనలో జిల్లా రవాణాశాఖ అధికారి వెంకన్న దుర్మరణం పాలైన ఘటన జిల్లా మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పెద్ద ప్రమాదం జరిగి ఒక ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయినా.. అధికారుల్లో స్పందన కరువైందనే విమర్శలున్నాయి. ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్దరించకపోవడం గమనార్హం. మరో ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా.? అని ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్ చేతులతోనే సూచికలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు నెల రోజులుగా వాహనదారులకు ఇబ్బందులు జాతీయ రహదారిపై ఇటీవలే డీటీఓ వెంకన్న దుర్మరణం మరో ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా..? త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం.. పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నల్స్కు సంబంధించిన మదర్బోర్డు పోయింది. కొత్త బోర్డుకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నిధుల విడుదల కోసం మున్సిపాలిటీ అధికారులకు లేఖ రాశాం. త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. -
సీఐటీయూ పోరాటంతో ఆర్థిక ప్రయోజనం
● యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ చేసిన పోరాట ఫలితంగా సుమారు 2 వేల మంది జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు తెలిపారు. భూపాలపల్లి సింగరేణి గెస్ట్హౌస్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంస్థ అవసరాల కోసం అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు బదిలీ చేసిన జనరల్ అసిస్టెంట్లకు బేసిక్ వేతనం తగ్గించి తక్కువ జీతాలు చెల్లించడం వల్ల కార్మికులు నష్టపోయారని చెప్పారు. దీనిపై సీఐటీయూ హైకోర్టును ఆశ్రయించగా, పాత వేతనాలు, అలవెన్సులు కొనసాగించడంతోపాటు బకాయిలు చెల్లించాలని కోర్టు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించిందన్నారు. 2012 నాటి సింగరేణి సర్క్యులర్ ప్రకారం అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు వచ్చిన ఉద్యోగుల బేసిక్, గ్రేడ్లు, ప్రమోషన్లు తగ్గించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ను బీజేపీ కేటాయించిందని చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ బ్లాక్ సింగరేణికి రావాల్సినదేనని, కే వలం అనుమతి ప్రక్రియ మాత్రమే పూర్తయింద న్నారు. పెండింగ్లోని 15 బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. భరోసా యాత్ర పేరుతో బీజేపీ, బీఎంఎస్ కార్మికులను త ప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. వివిధ సంఘాల నుంచి సీఐటీయూలో చేరిన కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి, బ్రాంచ్ కార్యదర్శి సాయిలు, బ్రాంచ్ కోశాధికారి తోట రమేష్, గుగులోతు శ్రీకాంత్, బాపురావు పాల్గొన్నారు. -
భూముల రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
● చెల్పూరు, ధర్మారావుపేటలో గ్రామసభలు ● పాల్గొన్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మగణపురం/భూపాలపల్లి రూరల్: భూముల రీ సర్వేతో అన్నిరకాల భూ ముల సమస్యలు పరిష్కారమవుతాయని, అధికారులు సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. బుధవారం గణపురం మండలం చెల్పూరు, ధర్మారావుపేట, భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎం. కొత్తపల్లిలో నిర్వహించిన భూముల రీ సర్వే గ్రామసభల్లో వారు మాట్లాడారు. భూముల రీ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ఆక్రమణకు గురైన భూములను గుర్తించనున్న ట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. మోకా మీద ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టా పాస్బుక్లు ఇచ్చి రైతు బీమా, రైతు భరోసా, పంట రుణాలు ఇచ్చేలా చేసేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ హక్కులు లేక రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలకు దూ రం అవుతున్నారన్నారు. పైలట్ ప్రాజెక్టులో జిల్లాలో 70 గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్లు ఇచ్చామని వారు సర్వేలో పాల్గొంటారని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భూభారతి చ ట్టం రూపొందించిందని తెలిపారు. సర్వే జరిగితే త ప్ప భూ సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర వ్యా ప్తంగా ప్రతి మండలంలో 5 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. వాస్తవంగా భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులను గుర్తించి పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కుసుమ కుమారి, హరికృష్ణ, రాజేశ్వర్ రావు, భాస్కర్ పాల్గొన్నారు. -
రూ.20 లక్షలు లేవా..?
భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏడాది క్రితం పని చేయకపోవడంతో స్థానిక పోలీసు అధికారులు సుమారు రూ.30 వేల వరకు వెచ్చించి మరమ్మతులు చేయించారు. అయితే నెల రోజుల క్రితం అవి మళ్లీ రిపేరు రావడంతో టెక్నీషియన్లను పిలిపించి చూపించారు. అయితే వారు ట్రాఫిక్ సిగ్నల్స్ బోర్డును బెంగుళూరు పంపించగా అది సరిచేయలేమని వెల్లడించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను రీస్టోరేషన్ లేదా రీ ప్లేస్మెంట్ చేయాలని, అందుకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని సూచించారు. దీంతో స్థానిక పోలీసులు రిపేరు చేయించలేక, నిధుల కోసం మున్సిపాలిటీ అధికారులకు లేఖ రాశారు. అయితే స్థానిక అభివృద్ధి పనులకు సింగరేణి నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. అంతేకాక మున్సిపాలిటీ నిధులతోపాటు డీఎంఎఫ్టీ నిధులు భారీ మొత్తంలో ఉన్నాయి. అయినప్పటికీ నెల రోజుల నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతు పనులపై రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కేంద్రమంత్రి కిషన్రెడ్డిది రాజకీయ యాత్ర
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి: కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిది రాజకీయ యాత్ర అని, కేంద్ర కేబినెట్లో ఉండి సింగరేణి కార్మికులకు ఏం భరోసా ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో, ఇప్పుడు కేంద్రమంత్రి పదవుల్లో ఉండి ఈ ప్రాంతానికి కిషన్రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో పర్యటించినప్పుడు సింగరేణి చైర్మన్, డైరెక్టర్లను పిలిపించి, సమీక్ష నిర్వహించి ఇక్కడి సమస్యలు పరిష్కరించరాదా.. అని ప్రశ్నించారు. తాడిచర్ల బ్లాక్ –2ను సింగరేణికి కేటాయించామని చెబుతున్న మంత్రి.. కోయగూడెం, సత్తుపల్లి తదితర బ్లాక్లను సంస్థకు ఎందుకు కేటాయించలేదన్నారు. ఐటీ రద్దు, మెడికల్ అన్ఫిట్లు జరగక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సింగరేణిలో ఓపెన్కాస్ట్ టెండర్లలో అవినీతి జరుగుతుందని, ఓబీ టెండర్లు ఎక్సెస్ రేట్లకు పోవడం మూలంగా కంపెనీ నష్టపోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. గండ్ర హరీష్రెడ్డి, కట్ల పూర్ణచందర్, నరేందర్, మాడ హరీశ్రెడ్డి, దేవరకొండ మధు, నూనె రాజు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు భూపాలపల్లి అర్బన్: సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సూపర్ ఎల్నినో, కరువు పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గండ్ర పేర్కొన్నారు. -
వైద్యకళాశాల భవనం పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి: ఆగస్టు నెలాఖరు నాటికి వైద్యకళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి పూర్తిస్థాయిలో అప్పగించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో టీజీఎంఐడీసీతోపాటు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజువారీ ప్రగతిని సమీక్షిస్తూ ముందుకెళ్లాలని అధికారులకు తెలిపారు. అలాగే విద్యుత్, నీటి సరఫరా, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అన్ని విభాగాల సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హాస్టల్ నిర్మాణ పనులను సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ రమేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం దేవస్థానం టెండర్ మళ్లీ వాయిదా కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ, అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని రాతితో నిర్మించడానికి రూ.198 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. కాగా, కాళేశ్వరం దేవస్థానంలో జూన్ 17న శృంగేరి పీఠం శిష్య బృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదిమక్తీశ్వరాలయంలో బాలాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినా.. వాయిదా పడింది. ఇలా జూన్ 23న, ఈనెల 4, 8న వాయిదా వేశారు. 15న బుధవారం కూడా యాథావిధిగా వాయిదా పడినట్లు తెలిసింది. టెండర్లో పాల్గొనడానికి ఎవరూ రాలేదని సమాచారం. ఈ విషయమై ఆర్అండ్బీ ఎస్ఈ రమేష్బాబును ఫోన్లో సంప్రదించగా మొదటి కాల్లో ఎవరూ రాలేదని, రెండో కాల్లో ఎప్పుడనేది చెబుతానన్నారు. మాజీ మావోయిస్టుల కార్యవర్గం ఎన్నిక చిట్యాల: భూపాలపల్లి జిల్లా మాజీ మావోయిస్టులు బుధవారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమంలో అమరులైన వారికి జోహార్లు అర్పించారు. అనంతరం మాజీ మావోయిస్టు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బండి కిష్టస్వామి, జిల్లా అధ్యక్షుడిగా కంకణాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా దాసారపు రాధ, ఉపాధ్యక్షుడిగా బొమ్మకంటి రవి, ప్రధాన కార్యదర్శిగా పాశం పర్వతాలు, కోశాధికారిగా మాచర్ల రఘు, కార్యదర్శిగా లావుడ్య జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా జున్ను సదయ్య, లద్దునూరి ఐలయ్య, మండ రమేష్, దైనంపల్లి వెంకటేశ్వర్లు, ఆకునూరి భాగ్యలక్ష్మి, కచ్చు శ్రీనివాస్, రేహనాబేగం, చింతనిప్పుల రాజమణి, భద్రునాయక్, పున్నం రవి, బండి లలితను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కంకణాల శంకర్ మాట్లాడుతూ.. మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేంత వరకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేటితో ముగియనున్న సీపీగెట్ కేయూ క్యాంపస్: తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్–26 బుధవారం కూడా రాష్ట్రంలో 22 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ కంప్యూటర్ బేస్ట్ విధానంలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషన్లో ఎం కామ్, ఎమ్మెస్సీ బాటనీ కోర్సులకు 6,939 మంది అభ్యర్థులకు గాను 6,037 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీసీపీగెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు 3,579 మంది అభ్యర్థులకుగాను 3,294 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. సాయంత్రం సెషన్లో నిర్వహించిన ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అండ్ హెచ్ఆర్ఏ కోర్సుకు 484 మంది అభ్యర్థులకుగాను 376 మంది హాజరైనట్లు రాజేందర్ వెల్లడించారు. ఈనెల 16న ఉదయం సెషన్లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. సుమారు 1300 మంది అభ్యర్థులు రాయబోతున్నట్లు ఆయన తెలిపారు. -
అంతులేని నిరీక్షణ
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026అరకొర వేతనం..● అప్పుల ఊబిలో కార్మికులు ● బడి ఊడ్చే చేతికి మిగిలింది శూన్యంనెలకు కేవలం రూ.3వేలు.. మహా అయితే రూ.6వేలు లేదా రూ.8వేలు. ప్రస్తుత కాలంలో ధనవంతులకు ఒకరోజు హోటల్ బిల్లు లేదా ఒక కుటుంబానికి వారం రోజుల నిత్యావసరాలకు సరిపోని డబ్బులు. కానీ ఈ అరకొర వేతనమే ప్రభుత్వ పాఠశాల స్కావెంజర్ల జీవిత ఆధారం. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి రోజూ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లకు ఆరు నెలలుగా పైసా జీతం అందడం లేదు. స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ పాఠశాల అంటున్న ప్రభుత్వాలు, పాలకులు ఆ స్వచ్ఛత వెనుక ఉన్న కార్మికుల కష్టాన్ని మాత్రం గుర్తించడం లేదు. నిత్యావసర వస్తువులు కొనలేక, కుటుంబాలను పోషించుకోలేక జిల్లాలోని స్కావెంజర్లు నరకయాతన పడుతున్నారు. – భూపాలపల్లి అర్బన్ 500 మంది స్కావెంజర్లు.. జిల్లాలోని 400 పాఠశాలల్లో సుమారు 500 మంది స్కావెంజర్లు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పనులు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.3,000, రూ.6,000, రూ.8,000 చొప్పున వేతనం నిర్ణయించారు. స్కావెంజర్లకు ప్రతి నెలా రూ.18లక్షల వేతనం చెల్లిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80కోట్లు మంజూరుచేసింది. గత విద్యా సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ విద్యా సంవత్సరంలోని జూన్ మాసానికి సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది. వేతనాలు నిలిచిపోవడంతో నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్కావెంజర్లు వాపోతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దె, వైద్య ఖర్చులు, ఇతర కుటుంబ అవసరాలు తీర్చలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎంఎఫ్టీ నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలల ఖాతాల్లోకి.. స్కావెంజర్లకు సంబంధించిన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం లేదు. కలెక్టర్ తన పరిఽధిలో ఉండేటువంటి డీఎంఎఫ్టీ బడ్జెట్ నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఈ వేతనాలు నేరుగా స్కావెంజర్లకు కాకుండా పాఠశాలలకు సంబంధించిన అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీ చైర్మన్లు విడుదల చేసి స్కావెంజర్లకు ఇస్తున్నారు.పాఠశాలల పరిశుభ్రతపై ప్రభావం స్కావెంజర్లు పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వేతనాలు లేక నిరుత్సాహానికి గురైతే పాఠశాలల పరిశుభ్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఆరునెలలుగా స్కావెంజర్లకు అందని వేతనాలు -
నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు
● భద్రకాళి దేవాలయంలో ఏర్పాట్లు చేసిన అధికారులు ● మృతికా ఘటాలకు వేదపండితుల సూత్ర వేష్ఠనంహన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు. ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో ప్రారంభం.. ఉదయం 5 గంటలకు నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి. గౌరీగణపతి పూజ, చతుఃస్థానార్చన పూజలు, ఉదయం 10 గంటలకు అమ్మవారి సహస్ర కలశాభిషేకం చేయనున్నారు. ఉదయం, సాయంత్రం కాళీ క్రమాల్లో పూజలు శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని వివిధ కాళీక్రమాల్లో ఆరాధిస్తారు. ప్రతి క్రమానికి ప్రత్యేకత ఉండడం విశేషం. జూలై 29 వరకు జరిగే శాకంబరీ పూజల్లో భాగంగా బుధవారం ఉదయం కాళీ క్రమం, కామేశ్వరీ నిత్యాక్రమంలో పూజలు చేస్తారు. 16న కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం, 17న కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం, 18న కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం, 19న విరోధిని క్రమం, వహ్నివాసినీ క్రమం, 20న విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, 21న ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం, 22న ఉగ్రాప్రభా క్రమం, త్వరితా క్రమం, 23న దీప్తా క్రమం, కులసుందరీ క్రమం, 24న నీలా క్రమం, నిత్యా క్రమం, 25న ఘనా క్రమం, నీలపతాకా క్రమం, 26న బలాకా క్రమం, విజయా క్రమం, 27న మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం, 28న ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం, 29న మితాక్రమం, చిత్రానిత్యా క్రమాలలో పూజలు నిర్వహించనున్నారు. 29న శాకంబరీగా అలంకరణ.. ఆషాడ శుద్ధపౌర్ణమి బుధవారం ఉదయం నాలుగు గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీగా అలంకరిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. -
కరకట్టకు ఇసుక బస్తాలు
ఏటూరునాగారం: వర్షాకాలం వచ్చిందంటే కరకట్టకు ఇసుక బస్తాలను అడ్డుకట్ట వేయాల్సిందే. గత ఐదేళ్లుగా రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి కరకట్ట పలు చోట్ల గండ్లు పడి మట్టి కోతకు గురవుతుంది. ఇటీవల జియో ట్యూబ్స్తో కొంతమేర అడ్డుకట్ట వేసినా ఇటీవల వచ్చిన వరదలతో మరో రెండు చోట్ల కరకట్ట మట్టి ఒర్లిపోయింది. దీంతో వర్షాల తీవ్రతతో గోదావరి ఉధృతిగా వస్తే కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గమనించిన ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం రెండు చోట్ల ఇసుక బస్తాలను వేయించారు. ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత నిర్మాణానికి కాంక్రీట్ వాల్ నిర్మించాలని రైతులు వాపోతున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ నెల 20లోగా నేషనల్ అవార్ుడ్స టీచర్స్ వెబ్సైట్లో తమ దరఖాస్తులను పూర్తిచేసి ఫైనల్ చేయాలని సూచించారు. జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కప్పతల్లి ఆట కాళేశ్వరం : వర్షాలు సమృద్ధిగా కురవాలని మహదేవపూర్ మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు మంగళవారం కప్పతల్లి ఆట ఆడారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పచ్చటి ఆకులతో, పూలతో కప్పతల్లి బొమ్మను సిద్ధం చేసి, పల్లకీలో ఊరేగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక కాలంలోని సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్కు ఘన వీడ్కోలు భూపాలపల్లి అర్బన్: ఏరియా నుంచి బదిలీపై వెళ్తున్న ఏరియా డీజీఎం (క్వాలిటీ) కృష్ణప్రసాద్కు మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఆయన సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, జ్యోతి, శ్యామ్సుందర్, రాజారావు, రాజేశ్వర్, తిరుపతి, పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్, వివిధ గనుల శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీడీఏ డీడీగా జనార్దన్ బాధ్యతలు ఏటూరునాగారం: ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్)గా దబ్బగట్ల జనార్దన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఫిరంగి ఉద్యోగోన్నతిపై ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(టీడబ్ల్యూ)గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో ఓడీ (ఆన్డ్యూటీ డిప్యూటేషన్) ప్రాతిపదికన మంచిర్యాల జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న జనార్దన్ నియామక ఉత్తర్వులు రద్దు అయ్యాయి. అదే విధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నుంచి అందిన ఆదేశాల మేరకు జనార్దన్ ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(ట్రైబల్ వెల్ఫేర్)గా వచ్చిన జాయినింగ్ రిపోర్టును పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకు అందజేసి విధుల్లో చేరారు. అనంతరం పీఓకు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు. ‘ఏజెన్సీలో వలస నిరోధక చట్టం అమలుచేయాలి’ వాజేడు: ఏజెన్సీలో అక్రమ వలస నిరోధక చట్టం అమలు చేయాలని గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మొరుమూరులో మంగళవారం ఆదివాసీలతో సమావేశమై ఆయన మాట్లాడారు. 5వ షెడ్యూల్ పరిధిలోని వలస గిరిజనేతరులు అక్రమంగా వచ్చి ఆదివాసీల భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. వలస నిరోధక చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాబు, తిరుపతి, సుధాకర్, మహేశ్, రాజ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంవతం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం జరగకూడదన్నారు. మొదటి దశలో 4,437 ఇళ్లు మంజూరుకాగా.. 712మంది ఇంకా పనులు ప్రారంభించలేదన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీకాంత్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. 20లోగా ఎస్ఐఆర్ పూర్తిచేయాలి గణపురం: ఈ నెల 20వ తేదీలోగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. గణపురం మండలకేంద్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని గడువులోగా వందశాతం పూర్తి చేయడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం గణపురం మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. గణపురంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్ కుమారస్వామి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు. -
మగవారే అధికం!
● పుట్టుక.. చావులో పురుషులే ఎక్కువ ● సీఆర్ఎస్–24లో నివేదికలో ఉమ్మడి వరంగల్ ముఖచిత్రంమొత్తం జననాలు: 57,156మగ శిశువులు: 30,421, ఆడ శిశువులు: 26,735మొత్తం మరణాలు: 28,649(పురుషులు: 17,441, మహిళలు: 11,208) అత్యధిక జననాలు, మరణాలు: హనుమకొండ అత్యల్ప జననాలు: ములుగు అత్యల్ప మరణాలు: వరంగల్సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టుకై నా.. చావైనా.. మగవారిదే పైచేయి ఉంటోంది. అదే సమయంలో ఆడబిడ్డల జననాలు తగ్గడం కాస్త ఆందోళన కలిగే అంశంగా ఉంది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) 2024 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైన 57,156 జననాల్లో 30,421 మంది మగ శిశువులు, 26,735 మంది ఆడ శిశువులు ఉన్నారు. అంటే 3,686 మంది మగ శిశువులు ఎక్కువగా జన్మించారు. ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 879 మంది ఆడ శిశువులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న కుటుంబాలవ్వడం, సంతానోత్పత్తి రేటు క్షీణించడం, కొన్ని ప్రాంతాల్లో సామాజిక అంశాలు ఆడపిల్లల జననాలపై ప్రభావం చూపుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఉమ్మడి జిల్లాలో నమోదైన 28,649 మరణాల్లో 17,441 మంది పురుషులు, 11,208 మంది మహిళలు ఉన్నారు. అంటే 6,233 మంది పురుషులు ఎక్కువగా మరణించారు. మహిళలతో పోలిస్తే పురుషులు వ్యవసాయం, నిర్మాణం, రవాణా, పరిశ్రమలు వంటి ప్రమాదకర వృత్తుల్లో ఎక్కువగా ఉండడం, రోడ్డు ప్రమాదాలు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, మద్యం, పొగాకు వినియోగం వంటి జీవనశైలి వల్ల మరణాలు ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జననాలు, మరణాలు హనుమకొండలోనే ఎక్కువ హనుమకొండ జిల్లాలో జననాలు, మరణాలు రెండూ అత్యధికంగా నమోదవగా, వరంగల్లో అత్యల్ప మరణాలు, ములుగులో అత్యల్ప జననాలు నమోదయ్యాయి. జననాల్లో ములుగు జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 991 మంది ఆడ శిశువులు ఉండడం సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ నిష్పత్తి 805కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. జననాల్లో ఆడబిడ్డల నిష్పత్తి పెరగడం, పురుషుల్లో జీవనశైలి వ్యాధులు, ప్రమాదాలను తగ్గించడం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ఈ సీఆర్ఎస్ గణాంకాలు సూచిస్తున్నాయి.జిల్లా జననం మరణం మగ ఆడ మగ ఆడ భూపాలపల్లి 3,189 2,875 1,198 740 హనుమకొండ 13,464 11,920 8032 4,800 మహబూబాబాద్ 6,568 5,286 3185 2139 జనగామ 3,682 3,383 2,896 1,977 వరంగల్ 2,056 1,822 774 447 ములుగు 1,462 1,449 1,356 1,105ఆడపిల్లల జననాలను ప్రోత్సహించాలి సీఆర్ఎస్–24 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 879 మంది ఆడ శిశువులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమే. బాలికల పుట్టుకను ప్రోత్సహించే పథకాలతో పాటు చట్టవిరుద్ధ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, బాలికల విద్య సంక్షేమానికి ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు మరింత బలోపేతం చే యాలి. అప్పుడే లింగ నిష్పత్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది. – మండల పరశురాములు, సామాజికవేత్త, వరంగల్ -
తెలంగాణకు మణికిరీటం ‘తాడిచర్ల–2’
● కోల్బ్లాక్ ద్వారా రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ ● కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిమల్హర్: తాడిచర్ల–2 కోల్బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్బ్లాక్ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్బ్లాక్గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్రెడ్డి, మల్క మోహన్రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కృషి భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికు సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. భూపాలపల్లి కేటీకే–8 గనిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో సమావేశమై వారి సమస్యలు, ఆందోళనలను తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల శ్రమ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలు కార్మికుల్లో అభద్రతా భావాన్ని పెంచాయని విమర్శించారు. సింగరేణిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రాంచందర్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, కె.వి. రమణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర నాయకులు మాధవనాయక్, అప్పాని శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధిలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్రావు, ములుగు డీఎీస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్రావు, శరత్బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అధికారులతో సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
లైసెన్స్డ్ సర్వేయర్లదే కీలకపాత్ర
భూపాలపల్లి అర్బన్: భూ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీసర్వేపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 91 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఈ నెల 20లోపు విధుల్లో చేరి రీసర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. గడువులోగా విధులకు హాజరుకాని సర్వేయర్ల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. శాసీ్త్ర య పద్ధతిలో రీసర్వే నిర్వహించడం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. జిల్లాలో తొలి దశలో ఏడు గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి సర్వేయర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, లైసెన్స్డ్ సర్వేయర్లు పాల్గొన్నారు. ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ప్రజావాణిలో అందిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 71 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికా రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మజిల్లాలోని సంక్షేమ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించేందుకు కుట్టుపని ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎస్సీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ అధికారులతో యూనిఫాంల తయారీ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీఆర్డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, మైనారిటీ సంక్షేమ అధికారులు నాగసాగర్, కుమారస్వామి, సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
– భూపాలపల్లి/రేగొండ/చిట్యాల/టేకుమట్ల/ మొగుళ్లపల్లి/కాళేశ్వరం/మల్హర్/మహాముత్తారం
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వారంరోజులుగా పెరుగుతున్నాయి. జ్వర పీడితులు పెరుగుతుండడంతో పల్లెల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతుంటే.. పీహెచ్సీ, సీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికి తోడు రక్త కణాలను లెక్కించే యంత్రాలున్నా కెమికల్స్లేక పనిచేయకపోవడంతో ఏ చిన్న పరీక్షకై నా, వైద్య సేవలకై నా రోగులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి రెఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షల రిపోర్ట్లు వెంటనే రాకపోవడంతో వైద్యం వెంటనే అందక పేదరోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎల్నినో ప్రభావంతో పల్లెల్లో డెంగీ కేసులు పెరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. ఎత్తిపోతలపై అవగాహన లేని సీఎం గోదావరి నీటి ఎత్తిపోతలపై సీఎం రేవంత్రెడ్డికి కనీసం అవగాహన లేదని ఎమ్మెల్సీ రవీందర్ రావు దుయ్యబట్టారు. తాడిచర్ల–2.. బాహుబలి బ్లాక్ జిల్లాలోని తాడిచర్ల–2 సింగరేణి సంస్థకు బాహుబలి బ్లాక్ అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. చిట్యాల సీహెచ్సీలో జ్వర పీడితులను పరీక్షిస్తున్న వైద్యులు జిల్లాలో 769 మందికి ఫీవర్● సోమవారం చిట్యాల సీహెచ్సీలో 55 కేసులు ● ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత ● సెల్ కౌంటింగ్ మిషన్లున్నా కెమికల్స్ లేవు ● అన్ని పరీక్షలు, వైద్యసేవలకు జీజీహెచ్కు రెఫర్ ● పీహెచ్సీలకు రెండేళ్లుగా అందని జేఏఎస్ నిధులు ఎస్ఐఆర్ హెల్ప్లైన్ కేంద్రం ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవసరమైన సమాచారం అందించేందుకు భూపాలపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఐ హెల్ప్లైన్ కేంద్రాన్ని ఆర్డీఓ హరికృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తులు, సందేహాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని సమగ్ర సమాచారాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, జీపీఓ కిరణ్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సాగర్, శ్రావణ్, రాజ్కుమార్, వరుణ్ పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు గణపురం: ఆరుద్ర నక్షత్రం చతుర్ధశి పర్వదినం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో గణపతిపూజ, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు, గణపేశ్వరునికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గణపురం ఎస్ఐ అశోక్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదిముక్తీశ్వరాలయంలో భక్తుల సందడి కాళేశ్వరం: ఆరుద్ర నక్షత్రం మహా శివుడికి జన్మనక్షత్రం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలోని బాలాలయంలో భక్తులు సందడి నెలకొంది. సోమవారం కావడంతో ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఆదిముక్తీశ్వరాలయంలో భక్తులు అభిషేక పూజలు చేశారు. అనంతరం బాలాలయంలో ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడితో శివనామస్మరణ మారుమోగింది. వనదేవతలకు మొక్కులుఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మల సన్నిధిలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు సమర్పించారు. ఎత్తు బంగారం, యాటలతో మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల రీజియన్ సంయుక్త అధికారి బొంగిని రాజేశ్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేశ్లు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. శివభక్తుల సందడి వెంకటాపురం(ఎం): శివభక్తులతో రామప్ప ఆలయం కిటకిటలాడింది. సోమవారం శతవసంతాల మహాశైవాక్షయోగం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో పూజలు నిర్వహించేందుకు భక్తులకు సుమారు గంటన్నర సమయం పట్టింది. ఆర్చకులు హరీశ్శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మారుమూల అటవీ ప్రాంతాలైన మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి, మల్హర్ మండలం తాడిచర్ల, మహాముత్తారం పీహెచ్సీల్లో ఒక్కో వైద్యుడు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఆయా పీహెచ్సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కో పోస్టు చొప్పున ఖాళీ ఉన్నాయి. మహాముత్తారం పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఒకరిని డిప్యుటేషన్పై ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా పంపారు. మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాల ప్రజలకు సేవలు అందించే మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)లో గైనకాలజిస్ట్, పిల్లలు, మత్తు, దంత వైద్యులు లేరు. మొగుళ్లపల్లి పీహెచ్సీలో గడిచిన మూడేళ్లుగా ఫార్మాసిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. చిట్యాల సీహెచ్సీకి సూపరింటెండెంట్ కరువయ్యాడు. ఎవరికై నా జ్వరం వస్తే వైద్యులు మొదటగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ) రక్త పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష చేసే సెల్ కౌంటింగ్ మిషన్లు పలుచోట్ల పని చేయడం లేదు. అంబట్పల్లి, గణపురం, కాటారం, మొగుళ్లపల్లి, వెలిశాల పీహెచ్సీల్లో రియాజెన్స్(కెమికల్స్) లేక సెల్ కౌంటింగ్ మిషన్లు మూలన పడ్డాయి. చేసేది లేక ల్యాబ్ టెక్నీషియన్లు సీబీపీ కోసం రక్త నమూనాను జీజీహెచ్కు పంపిస్తున్నారు. దీంతో రోగులు తమ రక్త పరీక్ష రిపోర్ట్ను రెండు రోజులు ఆలస్యంగా అందుకొని, అనంతరం చికిత్స పొందాల్సి వస్తుంది. పీహెచ్సీల్లోని ల్యాబ్ల్లో కెమికల్ లేని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కొనుగోలు కోసం తన నిధులు ఇస్తానని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగానే ఉన్నాం. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం. వైద్యులు, సిబ్బంది కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్యాధికారి రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఆరోగ్యకేంద్రాల్లో చిన్నచిన్న పనులు, మౌలిక వసతులను కూడా వైద్యాధికారులు కల్పించలేకపోతున్నారు. ఒక్కో పీహెచ్సీకి ఏడాదికి జన్ ఆరోగ్య సమితి(జేఎఎస్) నుంచి రూ.1.50 లక్షలు నిధులను ప్రభుత్వం విడుదల చేసేది. గతేడాది, ఈ ఏడాది ఈ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆస్పత్రుల్లో తాగునీటి శుద్ధి యంత్రాలు, ల్యాబ్లో కెమికల్స్ కొనుగోలు తదితర వసతులు కల్పించలేకపోతున్నారు. జ్వరాలు, సీజనల్ వ్యాధుల విజృంభనను ఏఎన్ఎంలు గ్రామస్థాయిలో ముందస్తుగా గుర్తించి వైద్యులకు తెలియజేస్తారు. క్షేత్రస్థాయిలో వీరి సమాచారం కీలకం. జిల్లాలో 84 పోస్టులు ఉండగా 42 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సోలార్ టెక్నీషియన్ శిక్షణ ప్రారంభం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం సోలార్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సోలార్ ఎనర్జీ రంగంలో నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం కృష్ణప్రసాద్, వీటీసీ మేనేజర్ నజీర్, అసిస్టెంట్ మేనేజర్ మహేశ్, ట్రైనర్ జయంత్ పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నేర నియంత్రణపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా విచారణ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ (2.0)లో కేసుల వివరాలను సకాలంలో నమోదు చేసి నిరంతరం అప్డేట్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి, రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయి పోలీసింగ్ను మరింత బలోపేతం చేసి, విలేజ్ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి 17 ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతీ ఫిర్యాదును శ్రద్ధగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలు మధ్యవర్తులు లేదా పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాదివస్ ద్వారా ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన జంగిలి శ్రీనివాస్ దంపతులు దివ్యాంగులు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. ఇద్దరు దివ్యాంగులైనప్పటికీ ఎవరికి కూడా దివ్యాంగ పింఛన్ రావడం లేదు. జీవనోపాధి కోసం చిన్న దుకాణం ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్తో పాటు జీవనోపాధి కోసం రుణం మంజూరుచేయాలని కలెక్టర్ను వేడుకున్నారు. – భూపాలపల్లి అర్బన్జిల్లాలో వారం రోజుల క్రితం జ్వరాల కేసులే నమోదు కాలేదు. ఇప్పుడు ఒక్కో పీహెచ్సీలో రోజుకు 10కి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాడిచర్ల పీహెచ్సీకి సోమవారం ఒక్కరోజు 120 మంది రోగులు రాగా అందులో 12 మంది సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. రేగొండలో 14 మంది, జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 14, ఒక్క చిట్యాల సీహెచ్సీలోనే 55 జ్వరం కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పీహెచ్సీల్లో ఈ నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో 769 జ్వరాల కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించిన వారు సైతం ఉన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక దోమల గుడ్లు, లార్వాలు పెరిగి డెంగీ కేసులు భారీ ఎత్తున నమోదవుతాయని నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమై మండల కేంద్రాల్లోని పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతుల కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ఇల్లు లేదు.. పింఛన్ లేదు.. -
ఆప్షన్ ఉద్యోగుల్లో ఆశలు
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీపీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు. పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ.. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదు అని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2,000 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంల్లోను ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించిన టీజీ ఆర్పీడీసీఎల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తి అయ్యేలా ఖరారు చేసినా చివరకు ప్రక్రియ నిలిచిపోయింది. ఈఆర్సీ లైసెన్స్ మంజూరు చేసి తర్వాతే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది.టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్పీడీఎల్కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్స్ 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 15, పర్సనల్ ఆఫీసర్స్ 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజీఆర్పీడీసీఎల్కు కావాల్సిన ఉద్యోగులు 2,000 ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1252 మంది దరఖాస్తు మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు -
నేడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాక
భూపాలపల్లి రూరల్: సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు నేడు (సోమవారం) భూపాలపల్లి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఎల్వీ కన్వెన్షన్ హాల్లో సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు. రాత్రి జెన్కో గెస్ట్హౌస్లో విశ్రాంతి తీసుకుని మంగళవారం ఉదయం గని గేట్ మీటింగ్లో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాడిచర్ల ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మత్స్యకారుల విభాగం జిల్లా చైర్మన్గా రమేశ్ మహాముత్తారం: కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల విభాగం జిల్లా చైర్మన్గా మహాముత్తారం మండలం యామన్పల్లి గ్రామానికి చెందిన అట్టెం రమేశ్ ముదిరాజ్ను నియమించినట్లు పిషరీష్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం భూపాలపల్లి అర్బన్:జిల్లాలో యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్, జీసీడీఓ వి.శైలజ తెలిపారు. జిల్లాలో ఎంపికై న కాటారం, చిట్యాల, టేకుమట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి మొత్తం 108 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకోగా, 75 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా మూడు కేజీబీవీలలో ఒక్కో పాఠశాలకు 20 మంది చొప్పున మొత్తం 60 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో ఎంపికై న విద్యార్థినులకు పూర్తి రెసిడెన్షియల్ సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడంతో పాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, సాంస్కృతిక, క్రీడలు, వృత్తి విద్య, యోగా వంటి అంశాల్లో కూడా శిక్షణ అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్గా పైడిపల్లి రమేశ్ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్గా పైడిపల్లి రమేశ్ను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రమేశ్ జేఏసీ కన్వీనర్గా పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. పాండవుల గుట్టల్లో రాక్ క్లైంబింగ్ రేగొండ: సాహసాలు ఇష్టపడే వారికి క్లైంబింగ్ ఓ గొప్ప అనుభూతి. మండలంలోని తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టల్లో హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్లో శనివారం బసచేశారు. విద్యార్థులు ఆదివారం పాండవుల గుట్టలను సందర్శించి ఉత్సాహంగా రాక్ క్లైంబింగ్ చేశారు. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి తెలిపారు. -
1995లో చైన్నెలో కలిశాను..
ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్ -
ఆశతో మొక్కలకు నీరు
పత్తి మొక్కల ఎండిపోకుండా నీరు పెట్టిన రైతుమహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన రైతు కమటం రాజయ్య తనకున్న నాలుగు ఎకరాల చేనులో వారం రోజుల కిందట ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షం జాడలేదు. పగటిపూట ఎండలు దంచికొడుతుండడంతో ఇప్పుడిప్పుడే మొలకెత్తిన లేత మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడితో పాటు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని రైతు భావించి.. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్పై ఆధారపడి నాలుగు ఎకరాలకు ఓ పైపును అడ్డంగా పెట్టి సాలుకు ఓ రంధ్రం చేసి రెండురోజులుగా పైపుతో నీరు పెడుతున్నాడు. వర్షం పడకపోతే కాపాడుకుంటున్న పంట కూడా చేజారిపోతుందనే భయం రాజయ్య లాగా జిల్లావ్యాప్తంగా ఎందరో రైతులను రాత్రిళ్లు నిద్రపోనివ్వడం లేదు. – కాళేశ్వరం -
సీఈఆర్ క్లబ్ కార్యదర్శిగా చంద్రశేఖర్
భూపాలపల్లి అర్బన్: ఏరియా సీఈఆర్ క్లబ్ నూతన కార్యదర్శిగా కాపు చంద్రశేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. సీఈఆర్ క్లబ్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించగా, క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శి పదవికి కాపు చంద్రశేఖర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా యు.శ్రీనివాస్, మధిర కొమరయ్య, క్రీడల కెప్టెన్గా పాక శ్రీనివాస్, సాంస్కృతిక కెప్టెన్గా ఆడిచెర్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జి.శ్రీనివాసరావు, ఆర్.శ్రీకాంత్, ఎండీ.తాజుద్దీన్, టి.చిరంజీవి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు విశ్రాంత్ కుమార్, సాయికృష్ణ, వంశీ, సందీప్, దీప పొద్దర్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్ రెడ్డి, వివిధ కార్మిక సంఘాల నాయకులు, సీఈఆర్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం
భూపాలపల్లి అర్బన్: కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ) నాల్గవ జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొరిమి రాజ్కుమార్ ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయన్నారు. ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచడం, సమ్మె హక్కును పరిమితం చేసే చట్టాలు తీసుకురావడం అన్యాయమన్నారు. 1920లో స్థాపించబడిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న సంఘమని, కార్మికులంతా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జెన్కో, ఆర్టీసీ, మున్సిపల్, గ్రామపంచాయతీ, బిల్డింగ్ నిర్మాణ రంగం, మధ్యాహ్న భోజన పథకం, సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, హమాలీలు, సివిల్ సప్లై హమాలీలతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాసభలో మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి క్యాతరాజు సతీష్, నాయకులు వెంకటేష్, తాళ్ల పోశం, శీను, సుగుణ, సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా సమితి సభ్యులు శ్రీకాంత్, జోసెఫ్, గులాం నబీ పాల్గొన్నారు. -
ఇలా.. ‘నులి’మేద్దాం
భూపాలపల్లి అర్బన్: పిల్లల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. నులి పురుగుల నిర్మూలనకు జిల్లాలోని 19 ఏళ్ల లోపు పిల్లలు 70,773మందికి నేడు (సోమవారం) ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఒకేషనల్ కాలేజీలు, మెడికల్ కళాశాలలతో పాటు బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు అందజేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటి నుంచి రెండేళ్ల లోపు పిల్లలకు సగం మాత్ర (200 ఎం.జీ), ఆపై వయస్సు పిల్లలకు ఒక పూర్తి మాత్ర (400 ఎంజీ) వేయనున్నారు. ఈ మాత్రలను ఇప్పటికే ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. వ్యాపించే విధానం మనిషి శరీరంలోకి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకెర పురుగులు అనే మూడు రకాల పురుగులు ప్రవేశిస్తుంటాయి. నులి పురుగులున్న వ్యక్తి మల విసర్జన చేయడం ద్వారా అందులోని గుడ్లు నేలలోకి, తద్వారా తాగునీరు, గాలి ద్వారా ఆహార పదార్థాల పైకి చేరుతాయి. తెలియకుండా ఆ నీరు తాగినా, అటువంటి ఆహారం తిన్నా వారి కడుపులోకి ఈ నులి పురుగులు ప్రవేశిస్తాయి. కడుపులో ఈ పురుగులున్న వారు రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురవడం వంటి వాటితో బాధ పడుతుంటారు. వీటి నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ఒక్కటే మార్గం. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కూడా వీటిని తీసుకోవచ్చు. నిర్మూలనతో ఇవి ప్రయోజనాలు నులి పురుగులను నివారిస్తే మనం తింటున్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది. తద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఆరోగ్యం బాగుపడటంతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి కలుగుతుంది. పని చేయగల సామర్థ్యం పెరుగుతుంది. నేడు నులి పురుగుల నివారణ కార్యక్రమం అన్ని కేంద్రాలకూ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జిల్లాలో 70,773మంది పిల్లలు గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ శుభ్రమైన నీటిని తాగాలి. ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత ఉంచాలి. కూరగాయలు, పండ్లను శుభ్రమైన నీటితో కడగాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయట తిరిగేటప్పుడు బూట్లు/ చెప్పులు ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయరాదు. ఎప్పుడూ మరుగుదొడ్డినే వాడాలి. ఏదైనా తినకముందు, తిన్న తర్వాత, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. -
తాడిచర్ల ఓసీపీ–2 సింగరేణికి కీలకం
● నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించాలి ● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణమల్హర్: తాడిచర్ల ఓసీపీ–2 గని సింగరేణి సంస్థకు ఎంతో కీలకమైన ప్రాజెక్టు అని, ఈ గనిని వీలైనంత త్వరగా ఉత్పత్తిలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇటీవల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేటాయించిన తాడిచర్ల ఓసీపీ–2 ఉపరితల బొగ్గు గనిని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకష్ణ, సింగరేణి భూపాలపల్లి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించి ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గని ప్రారంభానికి అవసరమైన మెటీరియల్, భారీ యంత్రాలు, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గని అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తిచేసి ఓసీపీ–2 గనిని ప్రారంభించేందుకు కృషి చేయాలని సూచించారు. గని ప్రారంభం ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ఎంపీ గడ్డం వంశీకష్ణను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గని ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎంపీకి వివరించి, చేపట్టాల్సిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ ఎస్ఓటు జీఎం కృష్ణ ప్రసాద్, సర్వే అధికారి శైలేంద్రకుమార్, ఎస్టేట్ అధికారి బబుల్రాజ్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ పాల్గొన్నారు. -
మూడేళ్ల విరామం అవసరం
● డీఎంహెచ్ఓ మధుసూదన్ భూపాలపల్లి అర్బన్: సంతాన సమయంలో బిడ్డకు బిడ్డకు మధ్య మూడేళ్ల విరామం అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఈ నెల 11నుంచి 18వరకు జిల్లావ్యాప్తంగా జనాభా నియంత్రణ, మాతా–శిశు సంరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం మూడు సంవత్సరాల విరామం ఉండేలా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలన్నారు. దీంతో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని, చిన్న కుటుంబంతోనే ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధి, సమానత్వం సాధ్యమవుతాయని తెలిపారు. 2026 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ‘యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం–నేడు మరియు భవిష్యత్కోసం‘ అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, సుస్థిర అభివృద్ధిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్ దివ్య (జీజీహెచ్), డాక్టర్ రోహిణి (భూపాలపల్లి), ఏఎన్ఎం శ్రీలత (మొగుళ్లపల్లి), ఆశ కార్యకర్త రాజశ్రీ (పొట్లపల్లి), కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మధుమితను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఓలు డాక్టర్ శ్రీదేవి, సందీప్, డెమో కె.శ్రీదేవి, ఏఎంఓ సుధాకర్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్ అయోమయం
భూపాలపల్లి నియోజకవర్గం వివరాలు మండలాలు 8 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామంటున్న బీఎల్ఓలు ఇంకా అందలేదంటున్న ఓటర్లు 2002కు ముందు జాబితాలో కనిపించని ఓటర్ల వివరాలు ఫారాలు నింపేందుకు తప్పని తిప్పలు ఫలితంగా డిజిటలైజేషన్లో వెనుకంజ -
వేగవంతంగా భూ రీసర్వే ప్రక్రియ
భూపాలపల్లి అర్బన్: భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఖమ్మం ఐడీఓసీ కార్యాలయం నుంచి భూ రీసర్వే, భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్ లోకేష్కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహనిర్మాణ శాఖ డైరెక్టర్ వీపీ గౌతం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. అనంతరం కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలపై ప్రత్యేక సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు. భూ రీసర్వేను నిర్ణీత సమయంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ను పరిశీలించిన ఆర్డీఓ
భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఆర్డీఓ హరికృష్ణ శనివారం పరిశీలించారు. పట్టణంలోని రాంనగర్, సుభాష్ కాలనీ, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఓటరు నమోదు, వివరాల సవరణపై అవగాహన కల్పిస్తూ, ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో చదువుకున్న యువత సహకరించాలని కోరారు. పట్టణంలో ఇప్పటివరకు డిజిటలైజేషన్ కేవలం 14 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. ఈ నెల 20లోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూపర్వైజర్లు, బీఎల్ఓలకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్ అంజలిరెడ్డి, జీపీఓ కిరణ్ పాల్గొన్నారు. 14న కళాశాలల బంద్ భూపాలపల్లి అర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు బంద్కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్ తెలిపారు. భూపాలపల్లిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. 14న నిర్వహించే కళాశాలల బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాక భూపాలపల్లి రూరల్: ఈనెల 13న భూపాలపల్లి పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సభ ఉందని.. పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి తెలిపారు. వీఎల్ కన్వెన్షన్ హాల్లో సభ ఏర్పాట్లను కీర్తిరెడ్డి శనివారం పరిశీలించారు. కీర్తిరెడ్డి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, లింగంపల్లి ప్రసాదరావు, రాష్ట కార్యవర్గ సభ్యులు ఎరుకల గణపతి, తదితర నాయకులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడి భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్ఎం) శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే సమీప పోలీస్స్టేషన్కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పర్యాటకుల సందడివెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశా రు. ఆలయ విశిష్టతను గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటు షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. -
క్రీడల్లో నైపుణ్యాల పెంపునకు కృషి
భూపాలపల్లి అర్బన్: క్రీడల్లో నైపుణ్యాల పెంపునకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ ఉపయోగపడుతుందని డీవైఎస్ఓ చిర్ర రఘు తెలిపారు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో ’స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్’ కార్యక్రమం నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్ నిపుణులైన కోచ్లు జిల్లాలోని పీడీలు, పీఈటీలు, క్రీడా సంఘాల సభ్యులు, క్రీడాకారులకు ఒకరోజు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మెళకువలతో పాటు ఫిజియోథెరపీ చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థులు, జిల్లా యువజన, క్రీడలశాఖ సిబ్బంది శివసాగర్ పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
ఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించడం అద్భుత అవకాశంగా భావి స్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండజనగామ ఏబీవీపరకాల ప్రభుత్వనర్సంపేట ప్రభుత్వపింగిళి మహిళామహబూబాబాద్ ప్రభుత్వకాకతీయ -
అడవుల్లో రంపపు కోత
భూపాలపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఓ వైపు వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు జిల్లాలోని అడవుల్లో పోడు జోరుగా సాగుతతోంది. కొందరు వ్యక్తులు భారీ వృక్షాలను సైతం నేలకూల్చి అత్యంత విలువైన అటవీ భూమిని పోడుచేసి సాగుకు యత్నిస్తున్నారు. ఫలితంగా వందల ఎకరాల్లో పచ్చదనం మాయమవుతోంది. రంపపు మిషన్ల గర్జన.. దట్టమైన చెట్లు, వన్యప్రాణులతో ఉన్న జిల్లా అటవీ ప్రాంతంలో ఇప్పుడు పోడు జోరుగా జరుగుతోంది. గతంలో గొడ్డళ్లతో చెట్లను నరికి అటవీ భూమిని పోడు చేసేవారు. అటవీ అధికారుల తనిఖీలు ఎక్కువవడం, కేసులు నమోదవుతుండటంతో పోడుదారులు నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. పెట్రోల్తో నడిచే రంపపు మిషన్లను రంగంలోకి దించి రాత్రికి రాత్రే ఏళ్ల నాటి భారీ వృక్షాలను సైతం నిమిషాల వ్యవధిలోనే కూల్చి పోడు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా రోజుకింత పోడు జరుగుతూనే ఉంది. మహాముత్తారం మండలంలోని మహబూబ్పల్లి–పోలారం సమీప అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు భారీ వృక్షాలను నరికి పోడు చేసి భూమిని చదును చేశారు. డొబ్బలపాడు మోడల్ పాఠశాల సమీపంలో చెట్లను నరకడమే కాక ఏకంగా అడవికి నిప్పు పెట్టారు. పలిమెల మండలంలోని పలిమెల, కామన్పల్లి, బోడాయిగూడెం, పంకెన, మోదేడు, లెంకలగడ్డ, సర్వాయిపేట, దమ్మూరు, ము కునూరు గ్రామాల సమీపంలో పోడు చేశారు. ఆజంనగర్ రేంజ్ పరిధిలోని ఎర్రారం సెక్షన్ ప్రేమ్నగర్ బీట్, నందిగామ సెక్షన్ గండికామారం నార్త్, సౌత్, నాగారం గ్రామం ఎదురుగా గల అడవిలో ఇంకా పోడు జరుగుతోంది. భూపాలపల్లి రేంజ్ పరిధిలోని ఆముదాలపల్లి బీట్ నుంచి మొదలుకొని పెద్దాపూర్ 1 వరకు, ఇదే రేంజ్లోని రాంపూర్ నార్త్ బీట్లోని రాజీవ్నగర్ దగ్గర, ఊట్లపల్లి సమీపంలో అటవీ భూమిలోని చెట్లను నరికేశారు. చెల్పూరు రేంజ్లోని గుర్రంపేట జామాయిల్ ప్లాంటేషన్ను చెట్లను కొందరు వ్యక్తులు నరికించి పోడు చేసినట్లు సమాచారం. ఈ భూమిలో పోడుదారులు పత్తి గింజలు సైతం నాటినట్లు తెలుస్తోంది. జిల్లాలో జోరుగా పోడు పెట్రోల్తో నడిచే చెయిన్ రంపం మిషన్లతో నరికివేత నేలకూలుతున్న భారీ వృక్షాలు వందల ఎకరాల్లో మాయమవుతున్న పచ్చదనం కొందరు అటవీశాఖ సిబ్బంది సహకారంతో పాటు ఉద్యోగుల కొరత మూలంగా కూడా పోడు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు రెండు, మూడు సెక్షన్లు, బీట్ల బాధ్యతలు చూడాల్సి వస్తుంది. జిల్లాలో 9 రేంజ్లు ఉండగా సరిపడా రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు. 42 సెక్షన్లు ఉండగా 8 ఖాళీలు, 170 బీట్లు ఉండగా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువవుతోంది. -
‘సర్’ నమోదులో నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్
భూపాలపల్లి: ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ నమోదు 14 శాతానికి, ఇతర మండలాల్లో సుమారు 50 శాతానికే పరిమితమైందని అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ 10 శాతం కంటే తక్కువ నమోదు చేసిన బీఎల్ఓలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల పురోగతిని నిశితంగా సమీక్షిస్తోందని అన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు ఎస్ఐఆర్ ఫారాలు అందజేయడంతో పాటు వాటిని పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లు లేకుండా చేస్తున్నాం.. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పొరపాట్లు లేకుండా చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ న్యూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక -
బస్సులన్నీ సీఎం సభకు..
● ప్రయాణికులకు తప్పని ఇక్కట్లుభూపాలపల్లి: ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభకు ఆర్టీసీ బస్సులను పంపించడంతో జిల్లాలో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూపాలపల్లి డిపోలో 95 బస్సులు ఉండగా 61 బస్సులను గురువారం రాత్రి నుంచే సీఎం సభకు తరలించారు. మిగిలిన 34 బస్సులను మాత్రమే శుక్రవారం నడిపించారు. దీంతో పరకాల, హనుమకొండ, హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వైపు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకో బస్సు రావడంతో సీట్ల కోసం నానా తంటాలు పడ్డారు. చివరకు చేసేది లేక బస్సులో నిలబడి వెళ్లారు. -
‘సాగు’దామా.. ఆగుదామా?
సాక్షిప్రతినిధి, వరంగల్: వానాకాలం ప్రారంభమై నెల దాటినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో సాగు ముందుకు సాగట్లేదు. శుక్రవారం నాటికి 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆతర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పత్తి సాగు చేసిన రైతులు అవి మొలకెత్తక ఆందోళన చెందుతుండగా.. వరి రైతులు పొలాల్లో ముదిరిపోతున్న నారును చూసి దిగులు పడుతున్నారు. వానాకాలం సాగులో ముందుకెళ్లడమా? ఆగిపోవడమా? తేల్చుకోలేకపోతున్నారు. వానాకాలం సాగు లెక్క ఇలా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన సీజన్ అండ్ క్రాప్ కవరేజ్ నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 15.93 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 5,00,220 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. అంటే మొత్తం లక్ష్యంలో 31.42 శాతం మాత్రమే సాగైంది. ఇందులో వరి లక్ష్యం 9.21 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 36,201 ఎకరాల్లో (3.9 శాతం) మాత్రమే సాగయ్యింది. ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తి 5,94,102 ఎకరాల లక్ష్యానికిగాను 4,19,605 (70.62 శాతం) ఎకరాల్లో పత్తి సాగైంది. వరి నాట్లు వేసేందుకు రైతులు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉండగా.. పత్తి సాగు ఎక్కువగా పూర్తయింది. అయితే మొలకెత్తని, ఎండిపోతున్న పత్తి పంట సైతం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. 52 మండలాల్లో లోటు, భారీ లోటు.. 79 మండలాలకు గాను ఈ వానాకాలంలో ఇంకా 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతమే ఉంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, హసన్పర్తి, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, వరంగల్ జిల్లా గీసుకొండ, నర్సంపేట, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లో భారీగా లోటు వర్షపాతం ఉంది. అలాగే హనుమకొండ జిల్లాలో 8, వరంగల్లో 8, జనగామలో 7, మహబూబాబాద్లో 12, జేఎస్ భూపాలపల్లిలో 7 మండలాలు కలిపి 42 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాల్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 41.15 శాతం సాగు పూర్తైంది. జిల్లాల వారీగా సాగు లక్ష్యం, సాగైంది., శాతం(ఎకరాల్లో)సాగు శాతం– వేంకటేశ్వరరావు, రైతు, కక్కిరాలపల్లి కలిసిరానికాలం అన్నదాత అయోమయం ములుగు మినహా ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతం 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వాన జాడ లేదు, సాగు జోరు లేదు.. ఇప్పటికీ 31.42 శాతమే సాగు 15.93 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం.. 5,00,220 ఎకరాల్లోనే సాగు కాడెత్తేసిన వరి రైతు.. 9,21,445కు 36,201 ఎకరాల్లో సాగు 70.62 శాతంగా పత్తి సాగు.. మొలకెత్తని రైతుల ఆశలు రైతులకు చుక్కలు చూపుతున్న వానాకాలం సాగుజిల్లా సాధారణ నమోదైన వర్షం లోటు / వర్షపాతం (మి. మీలలో) అధికం భూపాలపల్లి 217.3 178.6 –17.8 హనుమకొండ 194.6 85.8 –55.9 వరంగల్ 203.2 113.5 –44.1 జనగామ 163.9 131.0 –20.1 మహబూబాబాద్ 186.2 161.0 –13.5 ములుగు 262.5 292.5 +11.4 జిల్లా సీజన్ లక్ష్యం ఇప్పటి వరకు సాగు (ఎకరాలు) సాగు శాతంహనుమకొండ 2,38,964 76,982 32.21 వరంగల్ 2,81,943 97,619 34.62 జనగామ 3,59,281 1,40,359 39.07 మహబూబాబాద్ 3,71,318 76,902 20.71 ములుగు 1,29,824 21,261 16.38 జేఎస్ భూపాలపల్లి 2,11,670 87,097 41.15 31.42 వానల కోసం ఎదురు చూస్తున్నాఐనవోలు: నాకు చెలుక, పొలం కలిపి 7.5 ఎకరాల వరకు ఉంది. 3 ఎకరాల్లో పత్తి, ఎకరం పసుపు సాగు చేస్తున్న. వానలు సరిగ్గా కురవక రెండుసార్లు పత్తి విత్తనాలు పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు 2 ఎకరాల్లో పల్లికాయ వేశాను. మిగిలిన ఎకరంన్నరలో తిండి గింజల కోసం వరి సాగు కోసం వర్షాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే పెట్టుబడి 60 వేలు దాటింది. ఏటా మాదిరిగా వానలు సరిగ్గా కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సరైన వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోతాం.పత్తి మొలకలు ఎండుతున్నాయికొన్ని రోజుల క్రితం కురిసిన తొలకరి జల్లులకు 3 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటడంతో మొలకెత్తాయి. ప్రస్తుతం సరైన వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టి ఆందోళన చెందుతున్నాం. రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం మొలకలు ఎండిపోతాయి. – హింగే మనోహర్, రైతు, పీచర -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
భూపాలపల్లి అర్బన్: విద్యాసంస్థల బంద్ పిలుపు జిల్లాలో విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొతుకు ప్రవీణ్కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు బంద్కు సహకరించాయన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ అంతరాయం భూపాలపల్లి అర్బన్: విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా నేడు(శనివారం) జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు భూపాలపల్లి ఏఈ విశ్యాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి, జంగేడు సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి సబ్స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు, జంగేడు సబ్స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: 2026–27 విద్యా సంవత్సరానికి బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు నూతన, రెన్యువల్కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ప్రొఫెషనల్, పీజీ, ఇతర అర్హత గల కోర్సులలో చదువుతున్న విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.4 వేల సాయం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి బీసీ విద్యార్థికి సంవత్సరానికి రూ.4వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు పథకం ప్రయోజనం అందేలా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రోగులకు అందుబాటులో ఉండాలి ఏటూరునాగారం: ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేశారు. మందుల నిల్వ గదులు, లేబర్ రూమ్, జనరల్ వార్డు, ఓపీ, మరుగుదొడ్లు, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది వస్తున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఆహారం అందిస్తున్నారా.. ఏమైనా సమస్యలున్నాయా.. అని తెలుసుకున్నారు. మాతాశిశు ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్, ఎస్పీ
భూపాలపల్లి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె.జీవన్కుమార్ను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వేర్వేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల పాల్గొన్నారు. విద్యార్థినులకు షీ టీం అవగాహన మల్హర్(కాటారం): కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు గురువారం జిల్లా షీ టీం ఎస్సై ఫజల్ఖాన్ ఆధ్వర్యంలో భరోసా బృందం సభ్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించి, ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచించారు. ఎస్సై ఫజల్ఖాన్ మాట్లాడుతూ.. విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కని పిస్తే వెంటనే ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించాలని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా మహాముత్తారం: కాటారం మండలకేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో హెల్త్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన తేజావత్ సమ్మయ్య గత రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం నిమ్మగూడెం గ్రామంలో అతని దహన సంస్కారాలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని డీఎంహెచ్ఓ మధుసూదన్ పరామర్శించారు. సమ్మయ్య కుటుంబసభ్యులకు అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. డీఎంహెచ్ఓ వెంట మహాముత్తారం, కాటారం వైద్యసిబ్బంది ఉన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి మల్హర్: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్మన్ నాగప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని కొయ్యూరు సబ్స్టేషన్ ఆవరణలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి పలు సమస్యలపై 26 దరఖాస్తులు స్వీకరించారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, అధికారులు సత్యనారాయణ, రామారావు, భూపాలపల్లి సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్, కాటారం డివిజన్ ఇంజనీర్ నాగరాజు, ఏఈలు రమేష్, శేఖర్ పాల్గొన్నారు. మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ భూపాలపల్లి అర్బన్: రైతులకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా యూరియా ముందస్తు బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలతో సమీప మీసేవ కేంద్రంలో రూ.10 సేవా రుసుం చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పోడు పట్టాలు కలిగిన రైతులు, డిజిటల్ సంతకం పూర్తికాని భూముల పట్టాదారులు కూడా ఆధార్ ఆధారంగా ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు. -
డిజిటల్ బోధన
భూపాలపల్లి అర్బన్: సర్కారు బడుల్లో డిజిటల్ బోధనను బలోపేతం చేయడం, విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎంపికచేసిన పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేయగా.. బోధకులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో రెండేళ్ల కిందట ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమమేధ(ఏఐ)పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు సైతం అందించింది. అనుభవమున్న ఉపాధ్యాయులతో కొంతకాలం బోధన చేపట్టారు. పూర్తిస్థాయిలో బోధకులు లేకపోవడంతో ల్యాట్లు నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో బోధకుల నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. కంప్యూటర్ విద్యను పునరుద్ధరించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించేందుకు సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీ ద్వారా నియమించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డీఈఓ, ఎంఈఓలు కలిసి పాఠశాలల మ్యాపింగ్, పాఠశాలల కేటాయింపు అనంతరం మరో మూడు రోజులలోగా కేటాయించిన పాఠశాలల్లో చేరేలా కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలో కంప్యూటర్లు ఉన్న 36 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, పీఎంశ్రీ బడులు ఉన్నాయి. ఈ పాఠశాలల్లోనే బోధకుల నియామకాన్ని చేపట్టనున్నారు. రెండు పాఠశాలలకు ఒక బోధకుడి చొప్పున మొత్తం 18 మందిని నియమించనున్నారు. వారు బోధించేందుకు వీలుగా తక్కువ దూరం కలిగిన రెండు పాఠశాలలు కలిపి మ్యాపింగ్ చేస్తారు. ఆయా పాఠశాలల్లో బోధనల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో ఒక ఇన్చార్జ్ అధికారిని నియమిస్తారు. జిల్లాలో శివబాలాజీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్టర్ల నియామకం జరుగుతుంది. 2008 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను ప్రారంభించింది. అధునాతన కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014 నుంచి కంప్యూటర్ విద్య కనుమరుగైంది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లు నిరుపయోగంగా మారి ధ్వంసమయ్యాయి. ఇప్పడు మళ్లీ కంప్యూటర్ విద్యపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంప్యూటర్ విద్యను మళ్లీ ప్రారంభించడం విద్యార్థుల భవిష్యత్కు ఎంతో కీలకమైన నిర్ణయం. దీంతో విద్యార్థుల్లో ప్రాధమిక కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడంతో పాటు సాంకేతికతపై అవగాహన ఏర్పడుతుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్పాయింట్ వంటి ప్రాథమిక సాఫ్ట్వేర్ను నేర్పిస్తారు. ప్రాజెక్ట్లు, అసైన్మెంట్లు, ప్రజెంటేషన్లు తయారు చేసే సామర్ధ్యం పెరుగుతుంది. జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక పదమూడేళ్ల తర్వాత పునఃప్రారంభం ఏజెన్సీ ద్వారా ఇన్స్ట్రక్టర్ల నియామకం -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం
భూపాలపల్లి: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి–ప్రణాళికలు అంశంపై చిట్యాల, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన అవగాహన సదస్సును కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు ఆదాయ వనరులు సొంతంగా సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామాల నుంచి దేశ, విదేశాలలో నివసిస్తున్న ప్రముఖులు ద్వారా గ్రామాలు అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు లీడ్ తీసుకోవాలన్నారు. అభివృద్ధికి మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఓసీ–3లో తప్పిన ప్రమాదం
గణపురం: గణపురం మండలం పరుశరాంపల్లి శివారులోని ఓసీ–3లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ఓసీ–3లో బాంబ్ బ్లాస్టింగ్ కార్మికులు ఉన్నప్పుడే అధికారులు హెచ్చరిక లేకుండా వేరే వ్యక్తులతో బాంబ్ బ్లాస్టింగ్ చేశారు. కార్మికుల కథనం ప్రకారం.. ఓపెన్ కాస్టు గనిలో 82 మంది బాంబ్బ్లాస్టింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు 56మంది వచ్చి విధుల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రతీ నెల తమకు 26 రోజులు మస్టర్లు వేయాలని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వారం రోజుల గడువు పెట్టారు. ఇది బుధవారానికి ముగిసింది. దీంతో గురువారం పనులు అడ్డుకోవడానికి బ్లాస్టింగ్ రెగ్యులర్ కార్మికులు రాగా అప్పటికే నూతన వ్యక్తులను తీసుకొచ్చిన అధికారులు హెచ్చరిక లేకుండానే గనిలో బాంబ్ బ్లాస్లింగ్ చేయించారు. దీంతో కార్మికులు చెల్లా చెదురయ్యారు. ఓసీ–3 మేనేజర్ కావాలనే బ్లాస్టింగ్ చేశారని ఆందోళనకు దిగారు. ఓసీ–3లో కార్మికులు ఉండగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం తప్పేనని ఇన్చార్జ్ ఓసీ–3 మేనేజర్ శ్యాంసుందర్ అన్నారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు తాము, పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు. మస్టర్లు వేయాలని బ్లాస్టింగ్ కార్మికుల ఆందోళన అదే సమయంలో బ్లాస్టింగ్ -
వేగవంతంగా సాదాబైనామా ప్రక్రియ
రేగొండ: అర్హులైన రైతులకు ఇబ్బందులు కలుగకుండా సాదాబైనామా ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం నిజాంపల్లి గ్రామంలోని 285, 286 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. పోలింగ్ విధుల్లో ఉన్న బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లకు ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, బీఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
పథకాలు అర్హులకు చేరాలి
● గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ● అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల అమలుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆ రోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలని సూచించారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల కృషిని ప్రశంసించిన గవర్నర్ హన్మకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ వి ధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొనుగోలు చేశారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొనుగోలు చేశారు. -
ఉపాధి పనులకు సాంకేతిక నిఘా!
కాళేశ్వరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్’ (వీబీ జీ రామ్ జీ)ను కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పనుల పర్యవేక్షణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానంలో చోటుచేసుకున్న నకిలీ మస్టర్లు, తప్పుడు కొలతలు, బినామీలు వ్యవస్థతో చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత పర్యవేక్షణకు చట్టబద్ధత కల్పించడం ఈ విధానంలో ప్రధాన మార్పుగా నిలిచింది. దీంతో ఉపాధి హామీ పథకం అమలు మరింత పారదర్శకంగా మారనుంది. డ్రోన్లతో నిఘా! కొత్త విధానంలో ఇస్రో భువన్ పోర్టల్క్ చెందిన శాటిలైట్ చిత్రాలను విస్తృతంగా వినియోగించనున్నారు. ప్రతీ జిల్లాలో అంబుడ్స్మను డ్రోన్ పర్యవేక్షణ సౌకర్యం కల్పించనున్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొని తప్పుడు కొలతలు నమోదు చేసే అవకాశాలను పూర్తిగా నియంత్రణ వ్యవస్థను రూపొందించారు. శాటిలైట్, డ్రోన్ ద్వారా నమోదైన కొలతలు, ఎంబీల్లో నమోదైన వివరాలు సరిపోలకపోతే వెంటనే విచారణ చేపడుతారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారుల ఐడీలను నిలిపివేయడంతో పాటు రికవరీ చర్యలు చేపట్టనున్నారు.గ్రామపంచాయతీలు 248 ఫీల్డ్ అసిస్టెంట్లు 130 ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీలు 118 జాబ్ కార్డులు 1,06,463 ఆక్టివ్ జాబ్ కార్డులు 66,016 పని దినాల లక్ష్యం 25.26లక్షలు నకిలీ మస్టర్లు, తప్పుడు కొలతలకు ఇక కఠిన చర్యలు -
11వ రోజుకు చేరిన దీక్షలు
భూపాలపల్లి అర్బన్: కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 11వ రోజుకు చేరాయి. పే అప్గ్రేడేషన్, పీఆర్పీ అమలు చేయడంతో పాటు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న అధికారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన దీక్షలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ పెద్దింటి విశ్రాంత్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ ఎలిగేటి సందీప్కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాక రాహుల్, డిప్యూటీ మేనేజర్ బిట్ల రాజా రవితేజ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉపేందర్, డిప్యూటీ మేనేజర్ పుల్లూరి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుగులోత్ నాగేందర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ పాల్గొన్నారు. -
గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు
మల్హర్: గుడుంబా తయారుచేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. గురువారం అడ్వాలపల్లి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామంలో అధిక మొత్తంలో గుడుంబా తయారీదారులు ఉన్నారని.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అప్పటికీ వారిలో మార్పు రానట్లయితే ప్రభుత్వ అందించే పథకాలు అన్ని రద్దవుతాయని చెప్పారు. ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. చిన్న పిల్లలకి వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 38 లీటర్ల గుడుంబాను, సుమారు 800 లీటర్ల బెల్లంపాకాన్ని ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జునరావు. కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్, కాటారం ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవుసం సాగక దిగాలు
భూపాలపల్లి రూరల్: దున్నిన దుక్కుల్లో విత్తులు పెట్టాల్సిన రైతులు వాన లేక నెల రోజులుగా ఆకాశంవైపు చూస్తున్నారు. రోహిణి కార్తె చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిపించకుండానే వెళ్లిపోయింది. మృగశిర కార్తె వచ్చినా వాన జాడే లేదు. ఆరుద్ర కార్తె కూడా వెళ్లిపోయింది. కానీ వర్షాలు మాత్రం అనుకున్న స్థాయిలో కురవడం లేదు. జూలై నెలలో కురిసే వానలపైనే రైతుల సాగు ఆధారపడి ఉంది. 2,16,734 ఎకరాల్లో పంటలు సాగు.. రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సీజన్లో జిల్లాలో 2,16,734 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసినా... జూన్ ముగిసే నాటికి 1,06,560 ఎకరాల పత్తి సాగు అంచనాకు 45వేల ఎకరాల్లో పత్తి సాగు నమోదైంది. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న పంటలు సాగుచేస్తుంటారు. ఇందులో వరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సీజన్లో 1,09,854 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 50వేల ఎకరాలకు పైగా నారుమడులు సిద్ధమయ్యాయి. అది ఎక్కువగా బోర్లు, భూగర్భజలాల ఆధారంగా రైతులు నార్లు పోసిన ప్రాంతాలే. తదుపరి వర్షాలు లేకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాగు కొంతమేర ఊరటనిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సగటు వర్షపాతం సాధారణస్థాయిలో నమోదైనప్పటికీ మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉంది. 8 మండలాల్లో జూన్ మాసంలో లోటువర్షపాతం కనిపించింది. జూలై మాసంలో కురిసే వర్షాలపైనే ఈ ఏడాది సాగు భవిష్యత్ ఆధారపడి ఉంది. దుక్కులు దున్ని, దిక్కులు చూస్తున్న రైతులు ఎండుతున్న నారుమడులు.. మొలకెత్తని వత్తి గింజలు లక్ష్యానికి చాలా దూరంలో పంటల సాగు విస్తీర్ణం ఈ నెలలో కురిసే వర్షాలపైనే ఆశలు -
వైఎస్సార్ జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, 104 ఆరోగ్య సేవలు, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు, ఇందిరమ్మ గృహాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సామాజిక భద్రతా పింఛన్లు, స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రోత్సాహం వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకమన్నారు. పేద ప్రజల సంక్షేమమే నిజమైన పాలన అనే విషయాన్ని ఆయన తన పాలనతో నిరూపించారని అన్నారు. అనంతరం రైతు భరోసా నిధుల విడుదలకు కృతజ్ఞతగా సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవాన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శీను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
పలిమెల: వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చల్ల మధుసూదన్ వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం మహదేవపూర్, పలిమెల పరిధిలోని అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, పలిమెల, పంకెన గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాలను డీఎంహెచ్ఓ మధుసూదన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బంది హాజరు వివరాలు, ఓపీ రిజిస్టర్, ల్యాబ్ నిర్వహించే పరీక్షల వి ధానం, ఫార్మసీ, లేబర్ రూమ్లను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందుల స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్యసిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం మండలకేంద్రంలో నూతన నిర్మిస్తున్న పీహెచ్సీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ కల్యాణి, డాక్టర్ జగదీశ్ ఖన్నా, డీపీఓ చిరంజీవి, డీడీఎం మధు, డాక్టర్ రఘురామ్, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ విజయ్కుమార్, హెచ్ఓ సత్యనారాయణ, నర్సింగ్ ఆఫీసర్లు మరియా, స్వప్న, ఎల్టీ సుధాకర్, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, లేబర్ రూమ్, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మందుల నిల్వలు సమృద్ధిగా ఉంచాలని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. డీఎంహెచ్ఓ మధుసూదన్ -
కాళేశ్వరాలయం టెండర్లు మళ్లీ వాయిదా
కాళేశ్వరం: కాళేశ్వరాలయం అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ బుధవారం మరోమారు వాయిదాపడింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఏప్రిల్ 20న సీఎం రేవంత్రెడ్డి రూ.198 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు హైదరాబాద్లో గతనెల 23న, ఈనెల 4న జరగాల్సి ఉండగా అనివార్ల కారణాలతో వాయిదా పడ్డాయి. బుధవారం కూడా వాయిదా పడినట్లు తెలిసింది. ఈనెల 15న నిర్వహించనున్నట్లు సమాచారం. టెండర్ల ప్రక్రియ వాయిదా పడుతుండడంతో పనులు 2027 జూన్లో నిర్వహించే గోదావరి పుష్కరాల సమయానికి పూర్తవుతాయా అనేది సందేహంగా ఉంది. ఇప్పటికే దేవస్థానంలోని ప్రాకారాలు, ఉప ఆలయాల్లోని విగ్రహాలను తొలగించి రాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఫైవుడ్ బాక్సుల్లో వరిధాన్యంలో భద్రపరిచారు. కానీ టెండర్లు ముగిసి పనులు ప్రారంభం జరిగితేనే అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక దేవాదాయశాఖ అధికారులు మౌనంపాటిస్తున్నారు. ఎలాంటి విషయాలూ బయటకు తెలియకుండా గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు కాళేశ్వరం దేవస్ధానం గత నెల 17నుంచి మూసివేయడంతో ఉప ఆలయమైన అడవిలోని శ్రీఆదిముక్తీశ్వరాలయంలో అత్తిచెట్టుతో తయారు చేసిన ఉత్సవమూర్తులు బాలాలయంలో ఆసీనులయ్యారు. అక్కడే భక్తులు దర్శనాలు చేసుకునే వీలు కల్పించారు. కాలసర్ప, శని పూజలు అక్కడే నిర్వహిస్తున్నారు. ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. 15న నిర్వహించే అవకాశం -
పోలీస్ శాఖలో కొలువుల జాతర
సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో సుమారు ఏడు వేల వరకు పోస్టుల భర్తీ తక్షణ అవసరంగా గుర్తించింది. ఈ మేరకు 5,000 ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జీఓలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వేలాది మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే పోలీస్ అకాడమీ, కోచింగ్ సెంటర్లలో సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లాకు గణనీయమైన పోస్టులు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పోలీసు ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్తే. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కోసం ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. స్థానికత (లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపినట్లు అధికారులు ప్రకటించారు. స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కూడా గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశాలున్నాయని నిరుద్యోగులు భావిస్తున్నారు. రిక్రూట్మెంట్ బోర్డుకు కీలక బాధ్యత.. స్థానిక కేడర్ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతల వివరాలను సంబంధిత శాఖలు అందించిన వెంటనే స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి షెడ్యూల్తో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతుండగా, పోలీసు శాఖలో కొలువుల జాతర ప్రారంభమైనట్టేనని అభిప్రాయపడుతున్నారు. స్థా నిక కేడర్లో ఎక్కువ పోస్టులు దక్కితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వందలాది మందికి ప్రభు త్వ ఉద్యోగాలు, ఖాకీ డ్రెస్ కల నెరవేరే అవకాశం ఉంది. భర్తీ చేయనున్న పోస్టులు ఇవే... ఎస్ఐ (సివిల్) 148 ఎస్ఐ (ఏఆర్) 14 రిజర్వ్ ఎస్ఐ (టీజీఎస్పీ) 12 ఎస్ఐ (ఎస్ఏఆర్ సీపీఎల్) 3 అసిస్టెంట్ ఎస్ఐ (ఎఫ్పీబీ) 23 కానిస్టేబుల్ (సివిల్) 3,697 కానిస్టేబుల్ (ఏఆర్) 1,052 కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) 24 కానిస్టేబుల్ (డ్రైవర్) 20 కానిస్టేబుల్ (మెకానిక్) 7 మొత్తం పోస్టులు 5,000కమిషనరేట్ / మంజూరైన పనిచేస్తున్న మొత్తం ఖాళీల జిల్లా పోస్టులు వారు ఖాళీలు శాతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ 8,828 7,181 1,647 18.66 మహబూబాబాద్ 2,132 1,983 149 6.99 ములుగు 1,562 1,375 187 11.97 జయశంకర్ భూపాలపల్లి 1,605 1,450 155 9.66 మొత్తం 14,127 11,989 2,138 15.13ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,138 పోస్టులు ఖాళీ త్వరలో నోటిఫికేషన్.. నిరుద్యోగుల్లో కొత్త ఆశలు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడి -
కానిస్టేబుల్ ఉద్యోగమే లక్ష్యం
ఖిలా వరంగల్: డిగ్రీ పూర్తయ్యింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నాలక్ష్యంగా పెట్టుకున్నా. ఫిట్నెస్ కోసం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటి వద్ద ఉంటూ సంబంధిత సబ్జెక్ట్లు చదువుతున్నా. ఇటీవల ఆర్మీ ఉద్యోగం పరీక్ష రాశాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నా కల. ఇందుకు కోచింగ్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తున్నా. – పిట్టల సాయి, కాశికుంట వరంగల్కుటుంబానికి అండగా ఉండాలని.. ఖిలా వరంగల్: పాఠశాల స్థాయి నుంచే ఎన్సీసీ ట్రైనింగ్ పొందినా. నాటి నుంచి పోలీసు అంటే నాకు మక్కువ. ఆరేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం శ్రమిస్తున్నా. పోలీసు ఉద్యోగం సాఽధించి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో రోజూ క్రీడామైదానంలో నాలుగు గంటలు పరుగు, ఫిట్నెస్ అంశంలో సాధన చేస్తున్నా. – పూజ నాగరాజు, కరీమాబాద్ వరంగల్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మహాముత్తారం: విధ్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు ఎస్టీ బాలుర వసతి గృహన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలోని స్టాక్రూంలోని కూరగాయలు, పప్పుదినుసులు, బియ్యం పరిశీలించారు. విద్యార్థులను భోజన వసతులపై అడిగి తెలుసుకున్నారు. మండలకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహంలో వసతులు లేకపోవడంతో పాటు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో కాటారం తరలివెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ ప్రకాశ్రెడ్డి, సర్పంచ్ కొండగొర్ల బాపు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కోల్డ్ స్టోరేజీలోని మిర్చి నిల్వలపై ఆరా
ఖిలా వరంగల్: రూ.8 కోట్లకు పైగా మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైన ఓ వ్యాపారి, కోల్డ్స్టోరేజీలోని మిర్చి నిల్వల గురించి బుధవారం బాధిత రైతులు, పోలీసులు ఆరాతీశారు. నగరంలోని ఓ కోల్డ్స్టోరేజీలో మిర్చి బస్తాల నిల్వలు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. సదరు వ్యాపారిపై చిట్యాల పోలీస్ స్టేషన్లో బాధిత రైతులు ఫిర్యాదు చేయగా కోల్డ్స్టోరేజీలో భద్రపర్చిన నిల్వలను చిట్యాల సీఐ మల్లేశ్యాదవ్ పరిశీలించారు. బాధిత రైతులకు డబ్బులు చెల్లించాలని కోరుతూ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్ బండి జనార్దన్, పాలకవర్గ సభ్యులు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులతో సీఐ సమావేశమయ్యారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి అడ్తి వ్యాపారుల పక్షాన నిలిచారు. పరారైన వ్యాపారి నుంచి అడ్తి వ్యాపారి వేణు 545 మిర్చి బస్తాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి శీతల గిడ్డంగిలో భద్రపర్చుకున్నాడని స్పష్టం చేశారు. పరారైన వ్యాపారి.. వేణు వద్ద సరుకు కుదువ పెట్టి రూ.33 లక్షల తీసుకున్నాడని పోలీసులకు వివరించారు. -
తాడిచర్ల ప్రాజెక్టు కీలకం
భూపాలపల్లి అర్బన్: తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సింగరేణి భవిష్యత్కు కీలకంగా మారుతుందని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్–2ను సింగరేణికి కేటాయించిన సందర్భంగా బుధవారం ఏరియాలోని పలు గనుల్లో కార్మికులకు స్వీట్లు పంచి బాణాసంచా పేల్చుతూ సంబరాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్తో పాటు కార్యాలయ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి, నాయకులు సంపత్, మధుసూదన్రెడ్డి, దొంగల రాజేందర్, వెలబోయిన సుజేందర్, గణపతి పాల్గొన్నారు. పోరాటాలు కొనసాగించాలి భూపాలపల్లి అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ద్వితీయ మహాసభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి నిరంతరంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, పోడు, ఆక్రమిత ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఎన్నిక తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోలం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషోర్, ఉపాధ్యక్షులుగా బొడ్డు సునీత, కోడెం శంకర్, సహాయ కార్యదర్శులుగా జాడి మల్లేశ్వరి, వద్ది గోమాత, కోశాధికారిగా మామిడి రాధ ఎన్నికయ్యారు. మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలి భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో 16 నెలలుగా నిలిచిపోయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును ఎప్పుడు నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రస్తుతం కార్మికుల హక్కుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు నిర్వహణపై ఇప్పటివరకు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా, గుర్తింపు పొందిన సంఘాల నాయకులు ప్రకటనలు చేయడం, గతంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల కార్మికుల్లో అయోమయం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూఎస్ నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, మధుకర్, లక్ష్మినారాయణ, రవి, మనోజ్, వెంకటేశ్ పాల్గొన్నారు. హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని జవహర్నగర్ కాలనీలో నివాసం ఉంటూ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హోంగార్డుగా పనిచేసే గోలి శ్రీనివాస్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్ విషయం తెలుసుకొని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ కుటుంబానికి పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అమలుచేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, సంవత్సరం పాటు పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనంతో కూడిన బోనస్ ఇవ్వాలని కోరా రు. ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు సంపత్, రాకేష్, సురేష్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
‘బొగత’ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ములుగు: జిల్లాలోని బొగత జలపాతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం బొగత జలపాతం వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. బొగత పరిసరాలను పర్యాటకులు ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచే విధంగా ఇందిరా మహిళా శక్తి ఫుడ్కోర్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలు, భద్రత, దిశా నిర్ధేశక బోర్డులతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి పర్యాటకుడికి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, టూరిజం అధికారి శివాజీ, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026
మండల విద్యావ్యవస్థను గాడిలో పెట్టాల్సిన మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈఓ)లు జిల్లాలోని ఉన్నటువంటి 12 మండలాలలో ఇన్చార్జ్లే కొనసాగుతున్నారు. జిల్లాలో ఆయా మండలంలో ఉన్న ఉన్నత పాఠశాలల సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఇఓలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పాఠశాల విధులు, మండల బాధ్యతలను కొనసాగిస్తున్నారు. అదనపు బాధ్యతలతో రెండు వైపులా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. కార్యాలయ నిర్వహణ తప్ప పాఠశాలల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. వారి పాఠశాలలో కూడా విద్యార్థులకు విద్యను బోధించే అవకాశాన్ని కోల్పోతూ పాఠశాలలకు వెళ్లి సంతకాలు పెట్టి రావాల్సిన పరిస్థితులు దాపరించుకున్నాయి. పాఠశాలలపై తనిఖీలే లేవు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. పర్యవేక్షణ లేకపోవడంలో ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనతో గతంలో ఉన్నటువంటి డివిజన్ స్థాయి డిప్యూటీ ఈఓ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. డిప్యూటీ ఈఓలు వారి పరిధిలోని పాఠశాలలను తప్పని సరిగా బాధ్యతగా తనిఖీలు చేసేది. వారు కుడా లేకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోయింది. ఎంఈఓలు ఇన్చార్జ్లే కావడంలో పాఠశాలలు తనిఖీ చేసేందుకు దృష్టి సారించడం లేదు. తనిఖీలు చేసినా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. పరీక్షలపై ప్రభావం ఉన్నత అధికారి సమీక్ష సమావేశాలకు హాజరుకావడంతో పర్యవేక్షణ సరిగా చేయలేకపోతున్నారు. డీఈఓ సైతం ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. దీంతో నాలుగైదు ఏళ్లుగా పదో తరగతి ఫలితాలపై ప్రభావం పడుతుంది. ఎంఈఓలు ప్రాఽథమిక పాఠశాలల పర్యవేక్షణకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఉన్నత పాఠశాలలపై డీఈఓ ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలపై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏడాది ఫలి తాలు రాష్ట్ర స్థాయిలో జిల్లా వెనుకబడి పోతుంది. ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం జిల్లాలో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు పాఠశాలలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం లేదు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించడం లేదు. విద్యాసంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చినా పట్టించుకోవడం లేదు. రెగ్యులర్ అధికారులను నియమించాలి.. విద్యాశాఖలో ఇన్చార్జ్ డీఈఓ, ఎంఈఓలు కొనసాగుతున్నారు. ప్రభుత్వం మండల, డివిజన్, జిల్లా విద్యాశాఖ రెగ్యులర్ అధికారులను నియమించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించాలి. – కల్లోజు దిలీప్కుమార్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులుడీఈఓ, 12 మండలాల్లోనూ ఎంఈఓలు లేరు.. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు కొరవడిన పాఠశాలల పర్యవేక్షణజిల్లాలో పాఠశాలల వివరాలుసహదేవుడు తప్పా.. అందరూ.. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఒక్క సహదేవుడు తప్ప మిగితా అందరు డీఈఓలు ఇన్చార్జ్లే విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఏర్పడిన తరువాత 2016 సంవత్సరంలో డీఈఓగా సహదేవుడు నియమితులయ్యారు. ఆయన బదిలీ అనంతరం తొమ్మిదేళ్లుగా ఇన్చార్జ్ డీఈఓలు కొనసాగుతున్నారు. వరంగల్ డీఈఓ నారాయణరెడ్డి, ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్, వరంగల్ ఆర్జేడి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ డీఈఓ నారాయణరెడ్డి, హనుమకొండ డైట్ కళాశాల ప్రినిపాల్ మహ్మద్ అబ్దుల్హై, ములుగు డీఈఓ ఫణిని, ఏడీ శ్రీనివాస్రెడ్డి, హనుమకొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్కుమార్, ప్రస్తుతం డీఈఓ కార్యాలయ ఏడీ రాజేందర్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. జిల్లా విద్యాశాఖలో ఇన్చార్జ్ల పాలన రాజ్యమేలుతోంది. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లోనూ ఒక్కటంటే ఒక్క మండలంలోనూ శాశ్వత ఎంఈఓ లేకపోవడం విద్యావ్యవస్థ దుస్థితికి అద్దంపడుతోంది. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా బాధ్యతలు అప్పగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో పాఠశాలల పర్యవేక్షణ లోపించడమే కాకుండా హెడ్మాస్టర్లపై అదనపు భారం పడుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతోంది. జిల్లా విద్యావ్యవస్థను పర్యవేక్షించాల్సిన డీఈఓ సైతం ఇన్చార్జ్గానే కొనసాగుతున్నారు. – భూపాలపల్లి అర్బన్ -
ప్రజల భాగస్వామ్యం కీలకం
పలిమెల: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున కార్డన్సెర్ఛ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఇటువంటి ప్రత్యేక కార్డన్సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలిమెల ఎస్హెచ్ఓ టి.సాయిశశాంక్, మహదేవపూర్ ఎస్సై సాంబమూర్తి, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ సూర్యనారాయణ -
వివాహేతర సంబంధమే..
రేగొండ: మండలకేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న జెట్టి శ్రావణ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు మంగళవారం వెల్లడించారు. నిందితులు దమ్మన్నపేట క్రాస్ మీదుగా వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. రేగొండ మండలకేంద్రంలోని వైన్స్ ఎదుట మండలకేంద్రానికి చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ బజ్జీల షాప్ నిర్వహిస్తున్నారు. అక్కడే రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రావణ్ ఫాస్ట్ పుడ్ సెంటర్ ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో షాపు నిర్వహణ కోసం శ్రీకాంత్కు రూ.5లక్షలు శ్రావణ్ ఇప్పించాడు. డబ్బుల కోసం శ్రీకాంత్ ఇంటికి తరచూ వెళ్లే క్రమంలో అతని భార్యతో శ్రావణ్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ జరిగినా శ్రావణ్ వైఖరిలో మార్పు రాకపోవడంతో పాటు అప్పుగా తీసుకున్న డబ్బులను అడుగుతూ ఇబ్బంది పెడుతున్నాడని అతనిపై శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడు. దీంతో శ్రీకాంత్ మరో ముగ్గురితో కలిసి ఈ నెల 3న రాత్రి శ్రావణ్ను అతని ఫాస్ట్ పుడ్సెంటర్ ముందే హత్య చేశారు. నిందితులను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ కరుణాకర్ రావు, ఎస్సై సుధాకర్, సిబ్బందిని అభినందించారు. హత్యకేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్రావు -
కంపుకొడుతున్న రోడ్లు
మహాముత్తారం, యామన్పల్లి, బోర్లగూడెం, నిమ్మగూడెం తదితర గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మించారు కానీ సైడ్కాల్వలు నిర్మించలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారుల పైనుంచి మురుగునీరు పారుతోంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లుపై మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. యామన్పల్లి ప్రధాన కూడలి వద్ద నిత్యం నీరు పారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డ్రెయినేజీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరుతున్నారు. – మహాముత్తారంయామన్పల్లి ప్రధాన రహదారిపై పారుతున్న మురుగునీరు -
అభ్యంతరాల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: ఎన్హెచ్ఎంలో ల్యాబ్టెక్నీషియన్ పోస్టు నియామక ప్రొవిజనల్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను డీఎంహెచ్ఓ కార్యాలయంలోని నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 9 సాయంత్రం 5గంటలలోపు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రస్థాయికి ఎంపిక చిట్యాల: వికసిత్ భారత్లో భాగంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్రా ప్రధాన్ నిర్వహించిన పోటీలలో మండలంలోని నైన్పాక జిల్లా పరిషత్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం.సుధాకర్ తెలిపారు. మంగళవారం శ్రీపతి వర్షిత్, శ్రీరామ్, కార్తిక్, శివకుమార్, గౌతమ్ రాష్ట్రస్థాయిలో ఎంపికై మొదటి స్థానంలో నిలిచారన్నారు. వీరిని అధ్యాపక బృందం సన్మానించింది. చేపల వేట వద్దు.. గణపురం: మండలకేంద్రంలోని గణసముద్రం చెరువులో జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేట చేయొద్దొని జిల్లా మత్స్యశాఖ అధికారి వై.విజయ్కుమార్ తెలిపారు. వరదలు, చేపల వనరుల సంరక్షణ, చేప పిల్లల అభివృద్ధి, మత్స్య సంపద పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మత్స్యకార సహకార సంఘాలు, గ్రామస్తులు మత్స్య సంపద పెరుగుదలకు సహకరించాలన్నారు. రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి భూపాలపల్లి రూరల్: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద కొత్త పండ్ల తోటల స్థాపన, నాణ్యమైన కూరగాయల నారు పంపిణీ, పూల తోటల పెంపకం పాతతోటల పునరుద్ధరణ, నీటి కుంటల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు లభిస్తాయని అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు పండ్ల తోటలు, కూరగాయలు, పూలు సాగు చేసుకోవడానికి 40నుంచి 50శాతం వరకు రాయితీ పొందవచ్చని తెలిపారు. జీపీల బలోపేతమే లక్ష్యం ములుగు: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి సీతక్క రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజల అభ్యున్నతికే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, మిషన్ భగీరథ ఎస్ఈ చల్లారెడ్డి, ఈఈ సురేందర్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, మిషన్ భగీరథ డీఈ సునీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కందకాలు తవ్వితే ఉద్యమిస్తాంఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీస్తే ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, రైతులు, గిరిజనులు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఇన్చార్జ్ ఏపీఓ ప్రతాప్కు నాయకులు అందజేశారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలోని గంటలకుంట గ్రామానికి చెందిన గిరిజనులు 25 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా వివాదానికి కారణాలివే.. కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
వాగుదాటి.. వైద్య పరీక్షలు
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని చెల్పాక(రొయ్యూర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చాముండేశ్వరి, ఏఎన్ఎం ఆదిలక్ష్మి, ఆశ కార్యకర్త ధనలక్ష్మిలు వాగు దాటి వెళ్లి వైద్యం అందించారు. ఈ మేరకు మంగళవారం ఎలిశెట్టిపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 45 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యురాలు చాముండేశ్వరి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు సూచనలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా లోతట్టు గ్రామాల ప్రజలకు కావాల్సిన మందులు మూడు నెలలకు సరిపడా నిల్వ చేసినట్లు వివరించారు. అలాగే ఎలిశెట్టిపల్లికి చెందిన గర్బిణి సౌజన్యను ముందస్తుగా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి 108లో తరలించినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగితే చికిత్స అందించడం ఇబ్బంది అవుతుందని ఆమె ప్రసవానికి రెండు వారాల సమయం ఉన్నా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలించి ప్రసవం పొందేవరకు యోగ క్షేమాలు చూస్తామని వివరించారు. 45 మందికి మందుల పంపిణీ -
ఎరువుల దుకాణాల్లో తనిఖీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం, రాపల్లికోట గ్రామాల్లో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, ఏఓ శ్రీజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియాను అధిక ధరలకు విక్రయించడం, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించకపోవడం, రైతులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సూరారంలోని సాయి ఫర్టిలైజర్స్ రూ.2.39 లక్షల విలువైన స్టాక్, రాపల్లికోటలోని డీసీఎంఎస్ దుకాణం రూ.1.47 లక్షల విలువైన స్టాక్లకు స్టాప్ సేల్ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. సూరారంలోని వినాయక ఫర్టిలైజర్స్ లైసెన్స్ను వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఏడీఏ హెచ్చరించారు. వారివెంట వ్యవసాయ విస్తరణ అధికారులు రచన, ధర్మేందర్ ఉన్నారు. స్తంభంపల్లి గ్రామంలో.. మహాముత్తారం: మండలంలోని స్తంభంపల్లి(పీకే) గ్రామంలోని శ్రీరామ ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ ఎరువుల దుకాణాన్ని మండలవ్యవసాయ అధికారి అనూష తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985నిబందనలను ఉల్లంఘించినట్లు బయటపడింది. దీంతో ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ఎరువుల క్రయవిక్రయాలు జరుపరాదని ఫెర్టిలైజర్ యాజమాని శ్రీనివాస్కు సూచించారు. -
జిల్లాలో సాగు అంచనా 1,12,213 ఎకరాలు
వరిసాగు అంచనా (ఎకరాలు) 1,70015,75312,7777,1007,5007,5778,7605,34710,70015,600538014,019 కొత్తపల్లిగోరిపలిమెలచిట్యాలమల్హర్టేకుమట్లభూపాలపల్లిగణపురంకాటారంమొగుళ్లపల్లిమహాముత్తారంమహదేవపూర్ -
గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయు కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రమోషన్లు ఇవ్వాలని ధర్నా భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసిన సీనియర్ మైనింగ్ సర్దార్లకు వెంటనే ఓవర్మెన్ గ్రేడ్–బీ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ.. ఓవర్మెన్ పోస్టులు ఖాళీ లేవని చెప్పి ప్రమోషన్లు నిలిపివేస్తూనే యాక్టింగ్ ఓవర్మెన్ విధులు చేయించడం అన్యాయమన్నారు. 2016–17 బ్యాచ్ అర్హులైన సీనియర్ మైనింగ్ సర్దార్లకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని, జేఎంఈటీ సిబ్బందికి కూడా శిక్షణ పూర్తయిన వెంటనే షార్ట్ ఫైరర్ లేదా సర్దార్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మైనింగ్ సిబ్బంది ఆసిఫ్పాషా, రామచందర్, సికిందర్సింగ్, రాయమల్లు, ఆఖిల్, రాజ్కుమార్, జగత్రావు, తిరుపతి, రాజేందర్, కరీముల్లా పాల్గొన్నారు. అర్జీల పరిష్కారానికి కృషిఏటూరునాగారం: గిరిజన దర్బార్లో గిరిజనులు వివిధ సమస్యలపై అందించిన అర్జీలను పీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) ప్రతాప్ తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆరు వినతులను ఆయన స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలం నూగూరుకు చెందిన రైతులు భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. కొత్తగూడ మండలం ఓటాయితండాకు చెందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని వేడుకున్నారు. వెంకటాపురం(ఎం) అందుగులమీది గ్రామంలోని బూర్గుపేటకు రేషన్షాప్ ఇప్పించాలని స్థానికులు విన్నవించారు. ఏటూరునాగారం గిరిజన పాఠశాలలో 8వ తరగతి ఆడ్మిషన్ ఇప్ప ంచాలని గోవిందరావుపేట బుస్పాపురం గ్రా మానికి చెందిన గిరిజనుడు వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలం సర్వాయి గ్రామానికి చెందిన మహిళ ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకు అవకాశం ఇప్పించాలని కోరారు. వాజేడుమండలం పేరూరుకు చెందిన ఓ వ్యక్తి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉన్నానని ఏదైనా పాఠశాలలో నర్సు ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డీటీ అనిల్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్రావు, జియాలజిస్ట్ కిశోర్, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ శంకర్ పాల్గొన్నారు. అంకితభావంతో పనిచేయాలి ములుగు రూరల్: పోలీసులు విధుల్లో అంకితభావంతో పని చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి రెయిన్ కోట్లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలంలో విధులకు ఆటంకం కలగకుండా పోలీసులు విధులు నిర్వహించే విధంగా రెయిన్ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైతే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే నేరుగా తనను కలువచ్చని తెలిపారు. కింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్ఐ స్వామి పాల్గొన్నారు. -
యువత ఆవిష్కరణలతోనే పారిశ్రామికాభివృద్ధి
● జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ సిద్ధార్థరెడ్డి భూపాలపల్లి అర్బన్: యువత ఆవిష్కరణలతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ సిద్దార్ధరెడ్డి తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సామల గార్డెన్లో సోమవారం నిర్వహించిన తేజస్ వర్క్షాప్లో సిద్ధార్థరెడ్డి పాల్గొని మాట్లాడారు. యువతలోని వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం, కొత్త సాంకేతికత వినియోగం ద్వారానే రాష్ట్రం, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. వర్క్షాప్లో ప్రతినిధులు డీపీఐఐటీ ఆన్లైన్ ద్వారా స్టార్టప్లు, ఆవిష్కరణలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించారు. టీజీఐసీ, ఆర్ఐసీహెచ్, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు స్టార్టప్ల ఏర్పాటు, పరిశోధనలను మార్కెట్కు తీసుకెళ్లే విధానం, ప్రభుత్వ పథకాలు, రాయితీలు, స్వయం ఉపాధి అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొని నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
రుణం చెల్లించాలంటూ ఎర్రజెండాలు
మొగుళ్లపల్లి: బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ డీసీసీబీ అధికారులు రైతు భూమిలో ఎర్ర జెండాలు పాతారు. డీసీసీబీ పరకాల బ్రాంచ్ మేనేజర్ మన్యం స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు గుర్రపు తిరుపతి రెడ్డి తన తల్లితండ్రుల సంబంధించిన 9 ఎకరాల భూమిని పరకాల డీసీసీబీ బ్రాంచ్లో తనఖా పెట్టి 2017లో రూ.10లక్షల రుణం తీసుకున్నాడు. పలుమార్లు రుణం చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా చెల్లించకపోవడంతో భూమిని వేలం వేస్తామని సూచిస్తూ రైతుకు గత నెలలో నోటీసులు జారీచేశారు. నోటీసుకు స్పందించకపోవడంతో సంబంధిత రుణ గ్రహీత రైతు భూమిలో సోమవారం ఎర్రజెండాలు పాతినట్లు మేనేజర్ స్వాతి తెలిపారు. ఈ నెల 16న సంబంధిత భూమిని బహిరంగ వేలం వేయనున్నట్లు చెప్పారు. మొగుళ్లపల్లి బ్రాంచ్ మేనేజర్ మేకల ప్రతిభ, ఫీల్డ్ ఆఫీసర్ గట్ల విక్రం బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.. -
ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం
ఏటూరునాగారం: కాళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, కన్నెపల్లి ఇతర పంపుహౌజ్లలో నీటిని నింపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సునీల్కుమార్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీటిని వృఽథాగా దిగువకు వదులుతుందన్నారు. మేడిగడ్డ వద్ద పగుళ్లు వచ్చిన పిల్లర్లకు మరమ్మతులు చేసుకోవాలని నేషనల్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏడాదిన్నర క్రితమే చెప్పినా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్కకు పనులు చేయించేందుకు కంకర, సిమెంట్ దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. కేవలం బ్యారేజ్లలో నీరు నింపితే ఇసుకను తోడుకునే అవకాశం ఉండదని భావించిన ప్రభుత్వం నీరు నింపకుండా ఇసుకను తోడుకుంటుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరాన్ని కడితే కూలేశ్వరమని మంత్రి సీతక్క మాట్లాడడం బాధాకరమన్నారు. సీతమ్మ సాగర్ కింద బ్యాక్ వాటర్లో ఇసుక కలిసిపోతుందని తప్పుడు నివేదికలతో చేపట్టిన డిసిల్టేషన్ను అడ్డుకొని తీరుతామన్నారు. మంగపేట మండలం కత్తిగూడెం వద్ద శివగంగ ప్రాజెక్టు నిర్మించకుండా ఇసుకను తోడుకునేందుకు సీతమ్మ సాగర్ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, వలిబాబా, ప్రదీప్రావు, అశోక్ గౌడ్, ధనలక్ష్మి, నాగ రమేశ్, లక్ష్మణరావు, ఎండి కుర్బాన్ అలి, రఘు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు -
బాలలు సమాజ సంపద
● సహకార సంఘాలను బలోపేతం చేయాలి ● కలెక్టర్ రాహుల్ శర్మభూపాలపల్లి: బాలలు సమాజ సంపద అని, వారు బడిలో ఉండాలని, పనులలో కాదని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఆపరేషన్ ముష్కాన్ జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కలెక్టర్కు ఎన్యుమరేషన్ ఫారం అందజేత.. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మకు సోమవారం బీఎల్ఓ సదయ్య, సూపర్వైజర్ జితేందర్ ఎన్యుమరేషన్ ఫారం అందజేశా రు. కలెక్టర్ రాహుల్ శర్మకు 79వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు నమోదు చేసుకోగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఫారం అందజేశారు. వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్తలు.. జంతువుల ద్వారా మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ మధుసూదన్, డీఆర్ఓ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.. ప్రజావాణి దరకాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 112 నుంచి వినతులు స్వీకరించారు. ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి.. ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికి ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డివార్మింగ్ డే ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సంఘాలను బలోపేతం చేయాలి.. సహకార సంఘాలను బహుళ సేవ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సహకార శాఖ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 99.21 శాతం ఫారాల పంపిణీ పూర్తి.. జిల్లాలో 99.21 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్లోని ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. -
వరిసాగు వెరీ స్లో
మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026భూపాలపల్లి: జిల్లాలో వరిసాగుపై నీలినీడలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు నిండకపోవడం, పంట పొలాల్లో నీరు నిల్వకపోవడంతో వరినారు కోసం రైతులు వడ్లు అలకడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వరిసాగు పూర్తిస్థాయిలో జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతికొచ్చిన నారు 320 ఎకరాల్లోనే.. జిల్లాలోని 12 మండలాల్లో ఈ ఏడాది 1,12,213 ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఎల్నినో ప్రభావంతో జూన్, ఈ నెలలో వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. ఇటీవల కురిసిన వర్షాలు పత్తి పంటలకు ప్రాణం పోసినప్పటికీ వరిసాగుకు అనుకూలంగా లేవు. ప్రతీ ఏటా జూలై నెలలో వరినారు చేతికొచ్చి చివరి వారంలో నాట్లు వేసేవారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కనీసం నారుమడులు సిద్ధం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. బోర్లు, బావులు ఉన్న వారు మాత్రం ఇప్పుడిప్పుడే నారుమడుల సిద్ధం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా కేవలం 320 ఎకరాలు కొత్తపల్లిగోరి మండలానికి చెందిన రైతులు వడ్లు అలికి నారు సిద్ధం చేసుకున్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. వరిసాగుపై ఎల్నినో ఎఫెక్ట్.. వరిసాగుపై ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నూటికి 60 శాతం మంది రైతులు వర్షాల మీదనే ఆధారపడి వరిసాగు చేస్తుంటారు. కొంతమందికి మాత్రమే బోర్లు, బావులు ఉన్నాయి. మిగిలిన వారంతా భీంఘన్పూర్ రిజర్వాయర్, గణపసముద్రం తదితర చిన్న, పెద్ద చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడి వరిసాగు చేస్తుంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆయా జలాశయాల్లో నీరు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉష్ణోగ్రత తగ్గి ప్రతీరోజు మబ్బులు వస్తూ వాతావరణం చల్లబడుతున్నా చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు మాత్రం కురియడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్తో ఈ ఏడాది వరిసాగు తీవ్ర స్థాయిలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వంగడాల సాగుకు రైతుల మొగ్గు.. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న ఏడు వంగడాలను మాత్రమే సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. బీపీటీ 5,204, ఆర్ఎన్ఆర్ 15048, హెఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 వంగాలనే రైతులు కొనుగోలు చేస్తున్నారు. కేఎన్ఎం 7715తో పాటు ఒకటి, రెండు రకాల వరి విత్తనాలు జిల్లాలో అందుబాటులో లేకపోవడంతో రైతులు వరంగల్ తదితర పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అందుబాటులో అన్ని రకాల వంగడాలు రైతులు ప్రధానంగా సాగుచేసే అన్ని రకాల వరి వంగడాలను అందుబాటులో ఉంచాం. వరిసాగుకు రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం తక్కువగా కురిసినందున కొంతమంది రైతులు మాత్రమే నాట్లు వేశారు. మరిన్ని వర్షాలు కురిస్తే.. సుమారు లక్ష ఎకరాలకు పైగా వరిసాగు జరుగుతుందని అంచనా వేశాం. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి నారుమడులు సిద్ధమైంది 320 ఎకరాల్లోనే.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు ఏడు రకాల వంగడాల వైపు రైతుల చూపు దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ప్రవేశాలు పూర్తిచేయాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను పూర్తి చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 11 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు), 6 ఆదర్శ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో విజయలక్ష్మి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలో పూర్తి స్థాయిలో ప్రవేశాలు కల్పించాలని, యూడైస్ ప్లస్లో నమోదైన విద్యార్థులందరూ హాస్టల్కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాజరు 95 శాతానికి తగ్గకుండా చూడాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలంలో హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీసీడీఓ శైలజ, ఏఎంఓ పింగిళి విజయపాల్రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్ స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నల్లగుంటలో సోమవారం వరంగల్ డీసీసీ బ్యాంక్ ములుగు శాఖ, వెంకటాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సోమవారం అవగాహన కల్పించినట్లు బ్రాంచ్ ఫీల్ట్ ఆఫీసర్ కార్తీక్రెడ్డి తెలిపారు. ప్రజలకు బ్యాంక్ ఖాతా, పొదుపు, ఫిక్సిడ్ డిపాజిట్ ప్రాముఖ్యత, పీఎంజేజేబీవై(ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన), పీఎంఎస్బీవై(ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), కేవైసీ, రీకేవైసీ, అలాగే బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది యాట లింగయ్య, రమేశ్, కోటి తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే ఎలా సర్..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయి పని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో దాదాపు పూర్తయినా.. కీలకమైన డిజిటైజేషన్ మాత్రం ముందుకు కదలడం లేదు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30.53 లక్షల ఓటర్లలో 98.22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన అధికారులు.. వాటిలో కేవలం 8.91 శాతాన్నే డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయగలిగారు. అన్ని జిల్లాల్లోనూ 96 నుంచి 99.22 శాతం వరకు ఈఎఫ్ల పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతుండగా, పంపిణీ చేసిన ఫారాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఏ జిల్లాలోనూ సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు. ఈఎఫ్ల పంపిణీలో వేగం.. డిజిటైజేషనే నత్తనడకన.. ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్)ల పంపిణీ మొదట కొంత మందగించిన తర్వాత వేగం పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్లు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫారాలను తిరిగి తెప్పించడం, డిజిటైజేషన్ చేయడంలో కాలయాపన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,75,468 (99.21 శాతం) ఈఎఫ్లు పంపిణీ చేసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే జిల్లాలో డిజిటైజేషన్ కేవలం 47,543 (10.25 శాతమే) పూర్తైంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. పంపిణీ చేసిన ఫారాల్లో అత్యధిక భాగం ఇంకా డిజిటల్ వ్యవస్థలో నమోదు కావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 99.41 శాతం పంపిణీ చేసినా డిజిటైజేషన్ 7.80 శాతం మాత్రమే. ములుగులో 98.48 శాతం పంపిణీకి 13.88 శాతం, జనగామలో 99.65 శాతం పంపిణీకి 11.38 శాతం, వరంగల్లో 96.17 శాతం పంపిణీకి 5.40 శాతం, హనుమకొండలో 97.47 శాతం పంపిణీకి కేవలం 4.79 శాతం మాత్రమే డిజిటైజేషన్ అయ్యింది. ఫీల్డ్లో పనిచేసిన శ్రమ వృథా అవుతోందా..? బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల నిరక్షరాస్యత కారణంగా ఫారాలు తిరిగి సకాలంలో అందడం లేదు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల వ్యవహారాలపై అవగాహన ఉన్న అధికారులు చెబుతున్నారు. పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి తదుపరి ప్రక్రియలు వేగం అందుకునే అవకాశం ఉంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సిన నేపథ్యంలో డిజిటైజేషన్ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. ‘సర్’పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో .. జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 31న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా..మరో 23 రోజులే మిగిలి ఉండటంతో డిజిటైజేషన్ వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. చదువు రాదు.. ఫారం ఎలా నింపాలి ఓటర్ల ఫారాన్ని నింపడం కోసం నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఫారం ఇచ్చి నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలాంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను బతిమలాడాల్సి వస్తున్నది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు. – బొజ్జు ఐలయ్య, జఫర్గడ్ శివారు వడ్డెగూడెం ‘ఫారం’ ఇంటికొచ్చింది.. సిస్టంలోకి చేరలేదు 98.22 శాతం ఫారాల పంపిణీ.. డిజిటైజేషన్ మాత్రం 8.91 శాతం పంపిణీలో దూకుడు.. నమోదు మాత్రం నత్తనడక ఫైనల్ పబ్లికేషన్కు మరో 23 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ‘సర్’పురోగతి..జిల్లా మొత్తం ఈఎఫ్లు డిజిటలైజ్ చేసిన ఓటర్లు పంపిణీ ఈఎఫ్లు జేఎస్భూపాలపల్లి 2,77,882 2,75,468 47,543 హనుమకొండ 5,09,014 4,96,160 24,364 వరంగల్ 7,76,953 7,47,157 41,933 జనగామ 7,67,484 7,64,797 87,317 మహబూబాబాద్ 4,84,935 4,82,070 37,830 ములుగు 2,36,970 2,33,369 32,900 30,53,238 29,99,021 2,71,887 -
● ఒప్పించారు.. మెప్పించారు
బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం తెరిపించడంలో సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులది కీలకపాత్ర సత్ఫలితాలిచ్చిన జయశంకర్ బడిబాట ఒనగూరే ప్రయోజనాలు వివరించడంతో సక్సెస్ -
ఆధ్యాత్మిక కేంద్రంగా కొడవటంచ అభివృద్ధి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రేగొండ : ఆధ్యాత్మిక కేంద్రంగా కొడవటంచను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని కొడవటంచ ఆలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కోటంచ అభివృద్ధికి రూ.12.15 కోట్లు గతంలో కేటాయించిందన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం రూ.51 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో రాజగోపురం, కోనేరు, గోశాల, ఆర్చి గేట్లు తదితర దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోపు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ – ధర్మదాయ స్థపతి వల్లి నాయక్, ఆలయ మాజీ చైర్మన్ నాయినేని సంపత్రావు, దేవాదాయ శాఖ ఇంజనీర్ విభాగం ఎస్ఈ దుర్గప్రసాద్, డీఈఈ, రమేష్ బాబు, ఆర్ అండ్ బీ ఎస్ఈ రమేష్ బాబు, డీఈ గౌస్, ఏఈ నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి భూపాలపల్లి అర్బన్: ఎన్ఐ యాక్ట్కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్యాంక్ అధికారులు, చిట్ఫండ్ కంపెనీల మేనేజర్లు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా చెక్ బౌన్స్ కేసులను వేగంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. బ్యాంకు అధికారులు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి అధి క సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు జూ నియర్ సివిల్ జడ్జి అఖిల, ప్రభుత్వ న్యాయవాది బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాములు, న్యాయవాదులు విష్ణువర్ధన్, చిరంజీవి, మొయినుద్దీన్ ఉన్నారు. న్యాయసేవలను ప్రతీ పౌరుడికి చేరవేయాలి ప్రతీ పౌరుడికి ఉచిత న్యాయసేవలు అందేలా పారా లీగల్ వలంటీర్లు పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్కుమార్ సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన పారా లీగల్ వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు న్యాయ అవగాహన కల్పించడంతోపాటు, ప్రభుత్వ ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించాలన్నారు. యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఉచితశిక్షణ మల్హర్(కాటారం): ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో కాటారం యూత్ ట్రైనింగ్ సెంట ర్లో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల కు వివిధ వృత్తి కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు సెంటర్ మేనేజర్ రాజశేఖర్ శనివారం తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్, సోలార్ పంప్ు టెక్నీషి యన్, రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్స్, ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల్లో శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇతర వివరాలకు 63034 48760 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
బల్క్ భూముల నివేదిక అందించాలి
భూపాలపల్లి: సర్వే పూర్తయిన బల్క్ భూముల నివేదికలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో బల్క్ భూ ములు, సర్వే, సాదా బైనామా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై భూపాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పూర్తి నివేదికలను అందజేయాలన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఇంటింటికీ 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ 9 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. డీఆర్ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ట్రాన్స్జెండర్ల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఈఆర్ఎస్ పథకం కింద మహిళా శిశు, వయోవృద్ధులు, ట్రాన్సజెండర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈఆర్ఎస్ పథకంలో ఎంపికై న ట్రాన్స్జెండర్కు రూ.75 వేల విలువైన చెక్కును కలెక్టర్ అందజేశారు. ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యమిస్తున్నాం.. ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యమిస్తున్నామని, వైద్య, విద్య ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ సంజయ్ జాజు అన్ని శాఖల కార్యదర్శులతో కలిసి వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్కు ఐడీఓసీ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం.. వీడియో కాన్ఫరెన్స్కు గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో ప్రాధాన్య అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని, సమావేశానికి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ముందస్తు సమాచారం ఇచ్చినా కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ కాన్ఫరెన్స్కు గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
కాళేశ్వరం: జిల్లాలోని మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వ రం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ వెంట రానున్నారు. పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యం.. బీఆర్ఎస్ హయాంలో 2022 జూలై 14న భారీ వరదల కారణంగా లక్ష్మీ పంపుహౌస్ నీటమునిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మరమ్మతులు కొనసాగుతున్నాయి. నీట మునిగి చెడిపోయిన ఐదు మోటార్లు రిపేర్లు కూడా చేశారు. 2023, అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్లో 20 పియర్ కుంగి, వంతెనకు పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ సూచనలతో ప్రభుత్వం నీటిని నిలపడం లేదు. రెండుసార్లు సీఎం రేవంత్రెడ్డి బరాజ్ను పరీక్షించి పరీక్షల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. 2024, జూ లై 26న మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీ, లక్ష్మీపంపుహౌస్లను సందర్శించి ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. పంపులు నడిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది ఆగస్టు 25న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పంపుహౌస్ను ముట్టడించారు. పోలీసులు అడ్డుకొని నచ్చజెప్పి పంపారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనలతో పలు రకాల మరమ్మతులు, జియోఫిజికల్, జియోటెక్నికల్, జీపీటీ ఇతర పరీక్షలు చేపట్టింది. పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. గత నెలలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి పర్యటించి పరీక్షలు పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్లో నీరు అందించే కార్యక్రమం చేపడుతామని ప్ర కటించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటి ని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు పార్టీనాయకులు పేర్కొంటున్నారు. కాగా, ప్రాజెక్టును రెండోసారి పరిశీలించడానికి రానుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ కనిపిస్తుందని చర్చ.ప్రభుత్వం కళ్లు తెరవాలిఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను శనివారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మీపంపుహౌస్లో మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీరందించాలని, ఇకనైనా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబులు కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. -
నేరాల నియంత్రణలో అప్రమత్తంగా పనిచేయాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల నియంత్రణలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్ సెక్యూరిటీ వింగ్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు, విచారణ పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల నివారణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ప్రతీ సైబర్ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తూ, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
గోదావరి చెంతకు ప్రాణహిత
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ప్రాణహితనదికి వరద తాకిడి పెరిగింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరినదికి ప్రాణహిత వరద వచ్చి చేరుతుండడంతో జలకళ ఉట్టిపడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్నటికీ భారీవర్షాలు లేక గోదావరిలోకి వరద చేరలేదు. శనివారం కాళేశ్వరం వద్ద ప్రాణహితనది వరదతో 5.570 మీటర్ల ఎత్తులో నీటి మట్టం దిగువకు ప్రవహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 62,700 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసిన ప్రాణహిత నది వరద -
తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
భూపాలపల్లి రూరల్: సాయుధ పోరాటంలో నేలకొరిగిన తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచిపోయారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిర అన్నారు. దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందిర, బీసీ సంఘం నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన బంధనాల నుంచి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టిన వీరుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు కోరే సుధాకర్, కోరే కుమార్, నీలం రమేష్, స్వామి, సతీష్ పాల్గొన్నారు. -
అడవికి రక్షకులేరి?
భూపాలపల్లి: రాష్ట్రంలోనే అత్యధిక అడవులు కలిగి ఉన్న కాళేశ్వరం సర్కిల్ను అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా రేంజ్, సెక్షన్, బీట్ ఆఫీసర్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో అధికారి రెండు, మూడు బీట్ల బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా పోడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐదు జిల్లాల్లో 562 ఖాళీలు.. కాళేశ్వరం సర్కిల్ పరిధిలో భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాళేశ్వరం సర్కిల్ పరిధిలో భూపాలపల్లి జిల్లాలో 9 రేంజ్లు, 42 సెక్షన్లు, 170 బీట్లు ఉన్నాయి. ములుగు జిల్లాలో 13 రేంజ్లు, 60 సెక్షన్లు, 310 బీట్లు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 3 రేంజ్లు, 12 సెక్షన్లు, 35 బీట్లు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 15 రేంజ్లు, 70 సెక్షన్లు, 230 బీట్లు ఉన్నాయి. కొమురంభీం జిల్లాలో 12 రేంజ్లు, 85 సెక్షన్లు, 250 బీట్లు ఉన్నాయి. ఆయా జిల్లాల పరిధిలో 52 రేంజ్లు ఉండగా రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ స్థానాలు 20 చొప్పున ఖాళీగా ఉన్నాయి. బీట్ ఆఫీసర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఐదు జిల్లాల్లో 995 స్థానాలకు గాను 522 ఖాళీగా ఉన్నాయి. దీంతో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం ఇబ్బందికరంగా మారింది. ఒక్కో బీట్ కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉండటం, ఒక బీట్ ఆఫీసర్కు రెండు, మూడు బీట్ల బాధ్యతలు అదనంగా అప్పగించడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ఫూట్ పెట్రోలింగ్ చేసే వారే కరువయ్యారు. తెరపైకి పోడు సెగలు.. ప్రస్తుతం తొలకరి పలకరించడంతో ఐదు జిల్లాల పరిధిలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ప్రతీ ఏటా ఈ సమయం అటవీశాఖకు సవాల్గా మారుతుంది. గతంలో పోడు చేసిన వారు, పోడు కోసం చెట్లు నరికి భూమి పొతం చేసిన సాగు కోసం ప్రయత్నిస్తారు. ఈ సమయంలోనే అటవీశాఖ అధికారులు, సిబ్బంది కొరత ఉండటంతో పోడు పెరిగే ప్రమాదం ఉంది. కాళేశ్వరం సర్కిల్ పరిధిలో ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, కొమురంభీం జిల్లాలో పోడు లొల్లులు తీవ్రంగా ఉంటాయి. పోడుదారులు, అటవీశాఖ అధికారుల మధ్య పరస్పర దాడులు ప్రతీ ఏటా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు, సిబ్బంది కొరత లేకుంటే పోడు సమస్య తలెత్తకుండా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం సర్కిల్ పరిధిలో భారీగా ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం అదనపు భారంతో అధికారుల ఇబ్బందులు ప్రస్తుతం పోడు జరిగే వేళ తప్పని తిప్పలు జిల్లా రేంజర్లు సెక్షన్ బీట్ ఆఫీసర్లు ఆఫీసర్లుభూపాలపల్లి 0 08 100 ములుగు 08 05 160 పెద్దపల్లి 01 0 22 మంచిర్యాల 07 06 120 కొమురంభీం 04 01 120 -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాన్ష్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
ఇసుక.. ఇష్టారాజ్యం!
కాగిత రహిత విధానం విస్తరణటేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు, రాఘవరెడ్డిపేట, ఆశిరెడ్డిపల్లి, సుబ్బక్కపల్లి, ఎంపేడు, బూర్నపల్లి, కలికోట గ్రామాల చలివాగు, మానేరు పరివాహక ప్రాంతాల నుంచి అక్రమార్కులు నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు ఇష్టారీతిన తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని ఎమ్మెల్యే చెప్పిన మాట అక్రమార్కుల పాలిట వరంగా మారింది. పరకాల, ములుగు, హనుమకొండ ప్రాంతాలకు కూడా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించే ట్రాక్టర్లకు అనుమతి పత్రాలను జారీచేస్తే సహజ సంపదను కాపాడినట్లు ఉంటుందని పలువురు అంటున్నారు. – టేకుమట్ల పకడ్బందీగా పారిశుద్ధ్య పనులు రేగొండ: పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్ అడిషనల్ కమిషనర్ రవీందర్ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్ గ్రామాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా ఇళ్ల పరిసరాలలో, రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చూడాలని చెప్పారు. నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఖర్చు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ లత, డీఆర్డీఓ బాలకృష్ణ, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్ఙునరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలకు కాగిత రహిత (పేపర్లెస్) సేవలను మరింత విస్తరించనున్నట్లు ఈడీఎం శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం రవితో కలిసి మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మొబైల్ యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆదాయం, ఈబీసీ, ఓబీసీ తదితర రెవెన్యూ శాఖ సేవల వెరిఫికేషన్ కోసం ఇకపై దరఖాస్తుదారులు భౌతిక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ యాప్ ద్వారా అధికారులు లాగిన్, పాస్వర్డ్లతో దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్లను జారీ చేయవచ్చని వివరించారు. ఈ విధానంతో తక్కువ సమయంలో ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. గతంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలకే పరిమితమైన ఈ విధానాన్ని ప్రస్తుతం రెవెన్యూ శాఖలోని అన్ని కేటగిరీల సేవలకు విస్తరించినట్లు తెలిపారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టరాదని, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులతో పాటు నిర్వాహకులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు భూపాలపల్లి రూరల్: అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల కోసం బల్క్, మల్టిఫుల్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్ కనెక్షన్ల కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వేగం పెంచాలి
● ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ భూపాలపల్లి అర్బన్: భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీల అమలులో వేగం పెంచాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు తెలిపారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, జెన్కో, సింగరేణి సంస్థలకు జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి రెవెన్యూ, సర్వే, సింగరేణి, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణ అంశంపై పీఎన్, పీడీ, అవార్డు తదితర ప్రక్రియను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నిర్వాసితులకు అందించాల్సిన పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలను ఆలస్యం లేకుండా, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో అందించాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం ఈ అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజిలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూ సేకరణ పూర్తయితే తక్షణమే ఇరిగేషన్ శాఖకు భూములను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, జెన్కో సీఈ శ్రీప్రకాశ్, సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
రేగొండ: ఫాస్ట్ పుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మండలకేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35)మండలకేంద్రంలోని వైన్స్ షాప్ ఎదురుగా ఫాస్ట్ పుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి షాపు మూసి ఇంటికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా.. మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. యువకుడిని హత్యచేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. మృతుడికి భార్య మౌనిక, కూతురు, కుమారుడు ఉన్నారు. -
బకాయి బియ్యం తప్పనిసరిగా అప్పగించాలి
భూపాలపల్లి అర్బన్: డిఫాల్ట్ మిల్లర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 శాతం బియ్యం సరఫరా, 25 శాతం పెనాల్టీ వసూళ్లు, రబీ 2022–23 సీజన్లో వేలం వేసిన వడ్ల రికవరీ అంశాలపై స మీక్షించారు. బకాయిగా ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. ఆదేశాలను విస్మరించే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఓఎస్డీ ప్రభాకర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రాములు, డీఎస్ఓ కిరణ్కుమార్, ఏఎస్ఓ వేణుగోపాల్, డీటీలు రాజు, సురేందర్ పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలను పెంచాలి
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలను అధికంగా పెంచాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్హాల్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని అదనపు కలెక్టర్ విద్యాశాఖ, డీఆర్డీఏ, స్వయం సహాయక సంఘాల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పదో తరగతిలో 900, ఇంటర్మీడియట్లో 600 ప్రవేశాలు నమోదయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు సెప్టెంబర్లో జరగనున్న జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ నిర్వహించే పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్, వయోజన విద్య ఉపసంచాలకుడు వేణుగోపాల్, డీఆర్డీఓ బాలకృష్ణ, స్వయం సహాయక బృందాల అధికారి రాజేశ్వరి, ఓపెన్ స్కూల్ సొసైటీ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు, పరీక్షల సహాయకులు కుసుమ కృష్ణమోహన్, చల్ల కిషన్రెడ్డి పాల్గొన్నారు. దోమల నివారణకు డ్రైడే పాటించాలి దోమల నివారణకు డ్రై డే–ఫ్రై డే తప్పని సరిగా పాటించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం రాంనగర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాలనీవాసులకు ‘డ్రై డే–ఫ్రై డే’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. డెంగీ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు, మురికిగుంటలు లేకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమల నివారణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల పాల్గొన్నారు. -
జయశంకర్ భూపాలపల్లి
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 20267స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతంగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. – చెన్నారావుపేటభరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం అనాథలైన వారి ఇద్దరు కుమారులు చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలకేంద్రంలో ఎంజేపీ బాలుర పాఠశాలను శుక్రవారం కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఆయన తనిఖీ చేశారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండటంతో.. మరుగుదొడ్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని అక్కడి పరిస్థితులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని భవన యజమానిని హెచ్చరించారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, స్నానాల కోసం నల్లాలు ఏర్పాటు, డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసం మెస్ చార్జీలను పెంచినట్లు తెలి పారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ వేల్పుల ప్రభాకర్, సర్పంచ్ మౌనిక పాల్గొన్నారు. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
మల్హర్(కాటారం): పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించి పారదర్శక సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని బల్క్ ల్యాండ్ సమస్యలు, సాదాబైనామా, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీడీపీఓ రాధిక, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం తనిఖీ.. అంకుశాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. కాటారం పీఏసీఎస్లో యూరియా బుకింగ్ వివరాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి యూరియా పంపిణీలో ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, నానో యూరియాపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్శర్మ -
కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభించగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18వేల మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలల్లో 3వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జిల్లాలో ఈ పథకం అమలుకు విద్యాశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేడి పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు. దీంతో విద్యార్థుల హాజరు పెరగడంతో పాటు వారి ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తుండగా, ఇప్పుడు అల్పాహారం కూడా అందించనుండటం కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనంతో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే చర్యగా విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెండింగ్ బిల్లులు విడుదల 2023–24 విద్యాసంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో మండలానికి ఒకటి చొప్పున పైలెట్ ప్రాజెక్ట్గా అల్పాహారం ప్రారంభించింది. 2024లో జరిగిన ఎన్నికల అనంతరం బిల్లులు చెల్లించకపోవడంతో అల్పాహారం పథకం విద్యార్థులకు నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పెండింగ్ బిల్లును చెల్లించేందుకు అంగీకరించడంతో జిల్లాకు రావాల్సిన రూ.3,14,740 విడుదల చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధ్యాయులకు సైతం అల్పాహారం గతంలో పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనాన్ని ఉపాధ్యాయులు సైతం తినేవారు. కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయులు తినవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నం భోజనానికి ఉపాధ్యాయులు దూరంగా ఉంటున్నారు. ఉపాధ్యాయులు సైతం అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేయడం వలన నాణ్యమైన అల్పాహారం, భోజనం విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు వర్తింప చేయాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అల్పాహారం ప్రభుత్వం కీలక నిర్ణయం జిల్లాలో 21వేల మంది విద్యార్థులకు ప్రయోజనం -
కొనసాగుతున్న సింగరేణి అధికారుల దీక్షలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎంఓఏఐ ఆధ్వర్యంలో ఏరియా జీఎం కార్యాలయం ఎదుట చేపడుతున్న దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్, బీఎంఎస్ నాయకులు, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఉద్యోగు ల సంఘం నాయకులు రాంబాబు, భిక్షమయ్య , భూక్యా మోహన్, హేమనాయక్, సికిందర్సింగ్ పా ల్గొని సంఘీభావం తెలిపారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేద మల్టీ స్పెషాలిటీ, సాయిరత్న హాస్పిటల్లను పరిశీలించారు. ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ అనుమతులు, కాలుష్య నియంత్రణ మండలి ధ్రువపత్రాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రోగులకు అందుబాటులో ఉంచాల్సిన ధరల పట్టికలు, ఇతర చట్టబద్ధ పత్రాలను తనిఖీ చేశారు. అల్ట్రాసౌండ్ యంత్రాలకు సంబంధించిన రికార్డులు, కేసు షీట్లు పరిశీలించి సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించే దిశగా వైద్యులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యాలకు అన్ని అనుమతులు, ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడంతో పాటు రోగులకు నాణ్యమైన, పారదర్శక వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఇన్చార్జ్ డెమో శ్రీదేవి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ -
మోడల్ స్కూల్ తనిఖీ
గణపురం: మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ను డిప్యూటీ డైరెక్టర్ (మధ్యాహ్న భోజన) జిల్లా పరిశీలనాధికారి వీఎస్ జనార్దన్రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డుల పరిశీలన, అడ్మీషన్ల ప్రగతి, మధ్యాహ్న భోజన పథకం అమలు పనితీరుతో పాటు తదితర విభాగాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఎంఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాల గడువు పొడిగింపు భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ జుమ్లానాయక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల పొందేందుకు అపరాద రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12న ప్రవేశ పరీక్ష భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఎంపికై న మూడు కేజీబీవీ కేంద్రాల్లో యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు 6వ తరగతి నుంచే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అయిన జేఈఈ, నీట్, సీఎల్ఏటీ తదితరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
వెలమలపల్లి పాఠశాల రీఓపెన్
మల్హర్: మండలంలోని తాడిచర్ల వెలమలపల్లిలో గతంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను గురువారం డీఈఓ రాజేందర్ రీఓపెన్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలను విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూతపడిన పాఠశాలను తిరిగి తెరవడంతో గ్రామంలోని చిన్నారులకు విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు దూరం వెళ్లే అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, ఎంఈఓ లక్ష్మణ్బాబు, తాడిచర్ల జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ం తిరుపతిరెడ్డి, ఏఎంఓ విజయపాల్రెడ్డి, కుమారస్వామి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పద్మ, గంగరాజు పాల్గొన్నారు. -
పత్తికి ప్రాణం
ప్రధాన పంటల సాగు అంచనా (ఎకరాల్లో)...25,000 మిర్చి వరి 1,09,854 పత్తి 1,08,560 భూపాలపల్లి రూరల్: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వానలు పత్తి పంటలకు ప్రాణంపోశాయి. గత నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. దీంతో పత్తి మొలకలు ఎండిపోయే దశలో ఉండగా రెండు రోజులుగా చిరుజల్లులు పడుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముందే కురిసి.. ముఖం చాటేసి.. జిల్లాలో జూన్ మెదటి వారంలో రెండు మూడు వర్షాలు పడటంతో రైతులు వానలు కురుస్తాయన్న నమ్మకంతో కొందరు పత్తివిత్తనాలు విత్తారు. మరికొందరు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోగా అనంతరం వర్షాలు మొఖం దాటేశాయి. దీంతో రైతులంతా ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో జలకళ సంతరించుకునే అవకాశాలున్నాయి. పత్తికి అనుకూలంగా.. నెల రోజుల క్రితం సాగు ప్రారంభించిన భూముల్లో పత్తి పంట మొలక దశలో ఉంది. వర్షాలు లేకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. పలుచోట్ల పత్తి మొలకలు ఎండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు ప్రాణం పోస్తున్నాయి. ప్రతీరోజు వర్షం కురుస్తుండటంతో రైతులు పత్తి పంటలో పోగుంటలు పెడుతున్నారు. వానలతో వరి నార్లు పోసుకోవడం ముమ్మరం కానుంది. చెరువులు, కుంటల్లో నీటిమట్టం పెరిగితే వరిసాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.మండలం బుధ గురు మహదేవపూర్ 23.4 28.2 పలిమెల 25.4 28.2 మహాముత్తారం 11.8 6.4 కాటారం 19.8 7.6 మల్హర్ 39.4 00 భూపాలపల్లి 25.6 00 చిట్యాల 6.0 2.4 టేకుమట్ల 7.4 00 మొగుళ్లపల్లి 6.0 0.8 రేగొండ 5.8 6.4 గణపురం 6.2 00రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పత్తి పంటలకు ప్రాణం పొసినట్లయింది. మొదట్ల వాన కొట్టిన తర్వాత వానలు కొడుతాయని ఆశతో పత్తివిత్తనాలు విత్తాము. కానీ పడలేదు. పత్తి గింజలు ఎండిపోతాయనుకన్నాం కానీ నిన్న, మొన్న కురిసిన వానలతో పత్తి గింజలు మొలకెత్తుతాయి. – గూడెపు లింగయ్య, జంగేడు, భూపాలపల్లి -
పేదలకు అత్యాధునిక వైద్యసేవలు
భూపాలపల్లి అర్బన్: పేద ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఎంఆర్ఐ యంత్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జిల్లాలో పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాన్నారు. గతేడాది ఆస్పత్రిలో వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆస్పత్రిని 100 పడకల నుంచి 300 పడకలకు అప్గ్రేడ్ చేయడంతో పాటు రూ.14 కోట్ల వ్యయంతో నాలుగో అంతస్తు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే గుండె సంబంధిత చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంజీఎం తర్వాత ప్రభుత్వ రంగంలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు చేసిన ఆస్పత్రిగా భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిలవడం గర్వకారణమన్నారు. ఎంఆర్ఐ యంత్రం కోసం నిధులు సమకూర్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, హెచ్డీఎఫ్సీ క్లస్టర్ హెడ్ రాజేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
విద్యార్థులకు ప్రణాళికతో బోధించాలి
వాజేడు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించి మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని కాచారం పాఠశాలతో పాటు పెద్దగొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. పాఠాలు చదివించి.. రాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చదువులో వెనుక బడిన వారిని గుర్తించి అందరితో సమానంగా చదివేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. చదువుపై శ్రద్ధ చూపేలా బోధించాలన్నారు. పెద్ద గొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య తగ్గడంపై ప్రశ్నించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో -
కొత్త సీపీకి సవాళ్ల స్వాగతం!
వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్జోషి, ఏవీ రంగనాథ్, అంబర్కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్కింగ్ సమస్య.. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏఆర్లో ఎక్కడి వారు అక్కడే.. పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్సై, ఆర్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. సీసీఎస్లో కదలరు.. వదలరు దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలున్నాయి. కరువైన లా అండ్ ఆర్డర్.. వరంగల్ సబ్ డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. నేతల అండ.. నిబంధనలు తూచ్ వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దృష్టి సారిస్తే... మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏఆర్లో పాతుకుపోయిన అధికారులు సీసీఎస్లో ముదుర్లుతో సమస్యలుకమిషనరేట్ను వీడని అవినీతి అధికారులు.. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థను జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. జిల్లాను బాల కార్మికుల రహిత జిల్లాగా మార్చుకునేందుకు పాటుపడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎస్పీ కిశోర్, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, జిల్లా కార్మికశాఖ అధికారి వినోద తదితరులు పాల్గొన్నారు. ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
సాగుతో లాభాల వైపు..
భూపాలపల్లి: ఏళ్ల తరబడి కష్టనష్టాలను అనుభవించి పత్తి, మిర్చి, వరి సాగు చేసిన రైతులు ఆధునిక వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయిల్పామ్ గెలల ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో సాగుకు రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 2,500 ఎకరాల్లో సాగు అంచనా.. జిల్లాలోని 12 మండలాల్లో 2021 సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు 352 ఎకరాలతో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతీ ఏటా పెరుగుకుంటూ రాగా 2024–2026 మధ్య కాలంలో కాస్త తగ్గింది. జిల్లాలో 2021లో సాగు ప్రారంభించిన రైతులకు మార్చి నెల నుంచి మంచి దిగుబడి వస్తుంది. దీంతో రైతులంతా ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 150 ఎకరాల్లో రైతులు మొక్కలు నాటగా.. మునుపెన్నడూ లేని విధంగా 2,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరిగే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందల మంది రైతులు మొక్కల కోసం డీడీలు తీసి ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వీరంతా ఈ నెల చివరి వారంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. భారీ ధర పలుకుతున్న గెలలు.. మన దేశానికి ముఖ్యంగా మలేషియా నుంచి క్రూడ్ పామాయిల్ ఎక్కువగా దిగుమతి అవుతుంది. కోవిడ్ సమయం 2021లో మలేషియా ఎగుమతిని నిలిపివేసింది. దీంతో అప్పుడు ఆయిల్పామ్ గెల టన్ను ధర రూ. 24వేలకు చేరుకుంది. అనంతరం పరిస్థితులు చక్కబడటంతో 2022లో రూ.13వేలు, 2023లో రూ.13,500, 2024లో రూ.14వేలు, 2025లో రూ.20వేల ధర పలికింది. ఇప్పుడు ఏకంగా గెలల టన్ను ధర రూ.24వేలకు చేరుకుంది. ప్రస్తుత ధరలను గమనించిన రైతులు, భవిష్యత్లో కూడా ఆయిల్పామ్కు డిమాండ్ ఉంటుందని భావించి మూడు ఎకరాలకు పైన ఉన్న రైతులంతా ఈ పంట సాగుకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఈ ఏడాది ఊహించని రీతిలో జిల్లాలో ఆయిల్పామ్ సాగు జరగబోతుందని తెలుస్తోంది. రైతులుఎకరాలు1,877.54478.4610.61352.551,163.90229189609112403202520212023202620242022 ప్రస్తుతం టన్ను గెల ధర రూ.24వేలు ఎకరాకు రూ.లక్షన్నరకు పైగా రాబడి 30 ఏళ్లపాటు రానున్న దిగుబడి -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
వెంకటాపురం(ఎం): విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి లక్ష్యంతో చదివాలని ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికా సం, పరీక్షల పట్ల భయాన్ని తొలగించుకోవడంపై ఎలా అనే ఆంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి, ఇంటిలిజెన్స్ ఎస్పీ రమేశ్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చదువుకోవాల నే తపన, ఆశయం, సంకల్పం బలంగా ఉంటే మి మ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదని వెల్లడించారు. కొత్త విషయాలు, తెలియని అంశాలు నేర్చుకోవడానికి ఎప్పుడు వెనుకాడరాదని వివరించారు. సక్సెస్ అనే ది ప్రయత్నం చేయడంలోనే ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశ్నలు వే స్తూ జవాబులు రాబడుతూ వారికి బహుమతులను అందించి ఉత్సాహపరిచారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాధిక, ఎస్సై రాజు, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, కిరణ్, అంబేడ్కర్, కి శోర్బాబు, వేణు, సంధ్యారాణి, జోత్స్న పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్ -
పోలీస్స్టేషన్ తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పోలీసు సేవలను మరింత మెరుగుపర్చే దిశగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు. -
పేదలకు పట్టాలివ్వాలని ధర్నా
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని సర్వే నెంబర్ 280లో నివసిస్తున్న భగత్సింగ్ కాలనీవాసులకు పట్టాలివ్వడంతో పాటు ఇంటినంబర్లు మంజూరు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు ఎన్నిసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. కలెక్టర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భగత్సింగ్ కాలనీవాసులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్కు చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన అధికారులు
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె.జీవన్కుమార్ను జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన బాధ్యతల స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో న్యాయసేవల మెరుగుదల, ప్రజలకు సత్వర న్యాయం అందించే అంశాలపై పరస్పరం చర్చించారు. పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలి మహాముత్తారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులకు సూచించారు. బుదవారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఆర్ఐ భాస్కర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. 92 శాతం బొగ్గు ఉత్పత్తి భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో జూన్ మాసంలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా 92శాతం సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన మాసంలో 2.35లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం చేయాల్సి ఉండగా 2.15లక్షల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. రోజు వారిగా సుమారు 7,181 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేసినట్లు చెప్పారు. రెండు ఓపెన్ కాస్టు గనుల్లో 121శాతం మట్టి వెలికితీత పనులు చేపట్టినట్లు వివరించారు. జూలై మాసంలో 3.67లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ విధించినట్లు తెలిపారు. కార్మికులు సమష్ఠి కృషి చేసి ఉత్పత్తి సామర్ాధ్యన్ని పెంచాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎప్ఎస్ (ప్రిలిమ్స్ కం మెయిన్స్) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈనెల 12వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 19న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. 10నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ సౌకర్యం ఉంటుందన్నారు. ఉన్నత విద్యాభ్యాసానికి.. భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో చేసిన దరఖాస్తులను కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం అందించాలన్నారు. చెట్టుకు ఢీకొన్న ఆటో మహాముత్తారం: మండలంలోని యామన్పల్లి సమీపంలో ఆటో అదుపు తప్పి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పంకెన గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం ఆటోలో ఆజంనగర్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యామన్పల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మ, అశ్విన్, శారద, శైలజకు తీవ్రగాయాలయ్యాయి. -
ఓటర్ల చేర్పులు, మార్పులు పరిశీలించాలి
ములుగు: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైందని, ఓటర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు గమనించాలని సూచించారు. గణన ఫారాలు, దరఖాస్తుల నింపే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు కూడా సరైన సమాచారం అందిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రతీ అర్హుడికి ఓటు హక్కు ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, పార్టీ నాయకులు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
లోటు వర్షపాతమే..
భూపాలపల్లి రూరల్: వారం రోజులుగా భారీవర్షం కురుస్తుందా అన్నట్లుగానే పొద్దంతా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడుతుంది. ఊరిస్తున్న మబ్బులు చివరకు చిరుజల్లులు కురిశాక వరుణ దేవుడు మొఖం చాటేస్తున్నాడు. జిల్లాలో ప్రతీరోజు ఇదే పరిస్థితి నెలకొంటుంది. వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రెండుసార్లు మోస్తారుగా వానలు కురిశాయే తప్పా భారీ వర్షాలు కురువలేదు. ఎల్నీఓ ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై నీలినీడలు అలుముకున్నాయి, సాగు ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే.. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో జిల్లావ్యాప్తంగా సగటున రెండు రోజులు మాత్రమే వర్షం కురియగా, అధికలోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో టేకుమట్ల మండలంలో సాధారణ వర్షపాతం 149.9 నమోదు కాగా, ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. మిగితా మండలాల్లో పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఆలస్యం కానున్న మిర్చి, వరి సాగు.. సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురియకపోవడంతో మిర్చి, వరి పంటల సాగు ఆలస్యం కానుంది. వర్షాలు కురుస్తాయన్న ఆశతో కొందరు రైతులు బోరుబావుల వద్ద వడ్లను అలికారు. ప్రస్తుతం వరిపైరు నారు దశలో ఉంది. మరిన్ని వర్షాలు కురిస్తే పూర్తి స్థాయిలో నార్లు పోసుకోనున్నారు. లేదంటే వెదజల్లే పద్ధతి ద్వారా పంట సాగు చేసే అవకాశం ఉంది.మండలం నమోదు సాధారణం లోటు భూపాలపల్లి 180.9 155.9 +16 చిట్యాల 64.8 147.6 56 రేగొండ 101.2 145.4 30 గణపురం 183.6 143.7 +28 కొత్తపల్లిగోరి 83.7 145.4 42 టేకుమట్ల 149.2 149.8 0 మొగుళ్లపల్లి 84.6 146.9 42 మహదేవపూర్ 121.8 175.4 +31 పలిమెల 94.6 183.9 49 మహాముత్తారం 156.3 162.3 4 కాటారం 146.2 141.2 +4 మల్హర్ 80.6 138.7 42 మోస్తరు వానలు కురిసింది రెండు రోజులే.. చెరువుల్లోకి చేరని నీరు వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు -
బడి.. సమస్యల ఒడి
మొత్తం ఖాళీలు 286అసంపూర్తిగా అభివృద్ధి పనులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులుప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరతఉపాధ్యాయుల ఖాళీల వివరాలు ఎస్జీటీ 191 స్కూల్ అసిస్టెంట్ 75 పీజీహెచ్ఎంలు 6 ఎల్పీలు 3 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 10 పీఈటీ 1పేద విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ పాఠశాలలు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, సరిపడా తరగతి గదులు లేకపోవడం, గదుల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడం, అద్దె భవనాల్లో పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు నేడు ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చే హామీలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సాక్షి బృందం విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – భూపాలపల్లి అర్బన్జిల్లాలో పాఠశాలలు 394ప్రాథమిక 281ప్రాథమికోన్నత 43ఉన్నత 70విద్యార్థులు 18వేలు -
పోలియో చుక్కలకు దూరం కావొద్దు
● డీఐఓ డాక్టర్ నాగరాణి మల్హర్(కాటారం): ఐదేళ్లలోపు చిన్నారులందరూ పొలియో చుక్కలకు దూరం కావద్దని డీఐఓ నాగరాణి అన్నారు. మండలంలో కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న పల్స్పోలియో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటారం గ్రామంలో సర్వే బృందాల పనితీరును సమీక్షింంచారు. ఐదేళ్లలోపు చిన్నారులందరినీ గుర్తించి పోలియో చుక్కలు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం కాటారంలోని లలిత క్లినిక్, భద్రకాళి ల్యాబ్ను ఆమె తనిఖీ చేసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మౌనిక, హెచ్వీ పద్మావతి, ఆశ కార్యకర్తలు రమాదేవి, రుక్సానా, రాజేశ్వరి పాల్గొన్నారు. -
హోటల్ నిర్వహణకు అడ్డు
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం, పూజలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేవస్థానం ఆవరణలో హోటల్ నిర్వహణకు టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు మంగళవారం హోటల్ ఏర్పాటు చేయగా ఆలయ సమీపంలో వద్దని దేవస్థానం సిబ్బంది తిరిగి పంపారు. పలు దుకాణాలు, హోటల్ నిర్వహణకు సరైన సదుపాయాలు చేయలేదు. హోటల్కు సంబంధించిన మెటీరియల్ పూర్తిగా చెడిపోయాయని నిర్వాహకురాలు కావ్య వాపోయారు. దేవాదాయశాఖ ఉన్నతాదికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సింగరేణి అధికారులకు ఘన సన్మానం భూపాలపల్లి అర్బన్: పదవీ విరమణ పొందిన భూపాలపల్లి ఏరియా ఎస్ఓటు జీఎం కవీంద్ర, ఓసీపీ–3 ప్రాజెక్టు ఆఫీసర్ వాసం బిక్షమయ్యను ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన అధికారులు సంస్థ అభివృద్ధిలో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. ఉత్పత్తి లక్ష్యాల సాధన, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలులో కవీంద్ర, భిక్షమయ్య సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, జ్యోతి, రాజేశ్వర్, రవీందర్, ములుకుంట్ల తిరుపతి, కృష్ణప్రసాద్, శ్యామ్సుందర్, వివిధ శాఖల అధికారులు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఎంఓఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు. నిజాయితీ, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ సేవల నుంచి ఉద్యోగ విరమణ పొందిన సబ్ యూనిట్ ఆఫీసర్ మొహమ్మద్ అబ్దుల్ అలీమ్ విధి నిర్వహణలో నిజాయితీ, అంకిత భావానికి నిలువెత్తు నిదరన్శమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. అబ్దుల్ అలీమ్ను ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. అలీమ్ తన ఉద్యోగ జీవితమంతా నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమరయ్య, అలీమ్ కుటుంబ సభ్యులు, వైద్యాధికా రులు, మినిస్టీరియల్, పారామెడికల్ సిబ్బంది పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు. 12వ వేతన ఒప్పందం వెంటనే పూర్తి చేయాలి భూపాలపల్లి అర్బన్: 12వ వేతన ఒప్పందం వెంటనే పూర్తిచేయాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులతో పాటు సింగరేణి కార్మికుల 12వ వేతన ఒప్పందం గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో జరిగిన కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జేబీసీసీఐ 12వ వేతన కమిటీ ఏర్పాటు చేసి వేతన ఒప్పంద చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.56వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా గనుల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు నర్సింగరావు, లక్ష్మణ్, మల్లేష్, సాగర్, మల్లేష్, పునీత్రావు, స్వామి, శంకర్, నారాయణ, రఘుపతిరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎంఆర్ఐ సేవలు షురూ
● హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం ● పేదలకు స్థానికంగానే ఖరీదైన వైద్య పరీక్షలు భూపాలపల్లి అర్బన్: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సేవలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో పేద ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎంఆర్ఐ పరీక్షల కోసం ప్రజలు వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సకాలంలో వ్యాధి నిర్ధారణ జరిగి మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు కృషిచేసిన కలెక్టర్ రాహుల్శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ భాగస్వామ్యంతో అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లాకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎంపీ వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సూపరిండెంటెండ్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎస్ను కలిసిన కలెక్టర్ భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలెక్టర్ రాహుల్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం సీఎస్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనాంశాలను సీఎస్కు వివరించారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భూపాలపల్లి: భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణం అందించేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, ఆర్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.. ఉద్యోగ విరమణ పొందినవారు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని మంగళవారం పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరయ్యారు. ఉద్యోగ విరమణ పొందిన కొత్తపల్లిగోరి ఎస్సై–2 ఎండీ షాఖాన్, పీసీఆర్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై పులియాల రాజిరెడ్డి, మొగుళ్లపల్లి ఏఎస్సై వెంకటరత్నంలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, ఉద్యోగ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి మల్హర్(కాటారం): పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కాటారం పోలీస్స్టేషన్, సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ సంకీర్త్ సందర్శించి, సమగ్ర తనిఖీ నిర్వహించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
చెట్టుకొమ్మ మీదపడి మేకల కాపరి మృతి
మహాముత్తారం: అడవిలోని చెట్టుకొమ్మ విరిగి పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కనుకునూర్ గ్రామానికి చెందిన పొడెం సమ్మక్క(39) ప్రతిరోజు మేకలు కాసేందుకు అడవికి వెళ్తోంది. మంగళవారం కూడా వెళ్లింది. ఈ క్రమంలో అడవిలో ఓచెట్టుకొమ్మ విరిగి మీద పడడంతో సమ్మక్క అక్కడికక్కడే మృతిచెందింది. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చాయి. సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప అడవిలోకి వెళ్లి గాలించగా చనిపోయి కనిపించింది. సోదరుడు బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్సై గొర్ల రమేశ్ తెలిపారు. జీపీ కార్యదర్శుల డిప్యుటేషన్లు రద్దు ఏటూరునాగారం: జిల్లాలోని 71 మంది పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్లను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఇటీవల రద్దు చేశారు. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శులు తిరిగి వారి ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధుల్లో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన 71 మందిని వేర్వేరు ప్రాంతాలకు డిప్యూటేషన్పై పంపించారు. -
మేడారం పనుల్లో వేగం పెంచాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, వన మహోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మేడారం హరిత హోటల్లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, వన మహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంతాల్లో వన మహోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మేడారం పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి: ప్రజల సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో 19మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసు అధికారులు మర్యాదగా వ్యవహరించాలని, చట్టబద్ధంగా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. -
నేను బతికే ఉన్నా..
● కాగితాల్లో చంపేశారు..పింఛన్ ఆపేశారు! మల్హర్: అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థలోని లోపాలకు ఓ నిరుపేద వృద్ధురాలు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కండ్లముందే తిరుగుతున్న ఓ వృద్ధురాలిని రికార్డుల్లో చంపేసిన అధికారులు.. ఆమెకు వస్తున్న ఏకై క ఆధారమైన పెన్షన్ను తొలగించారు. రికార్డుల నిర్వహణలో దొర్లిన ఒక పెద్ద తప్పిదం ఓ వృద్ధురాలి జీవనాధారాన్ని దెబ్బతీసింది. నేను బతికే ఉన్నా.. అంటూ ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతోంది. వృద్ధురాలి కథనం ప్రకారం.. మల్హర్ మండలం కొండంపేట గ్రామ పంచాయతీ పరిధి గట్టుపల్లె గ్రామానికి చెందిన గోరేటి పార్వతికి 68 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఐదు నెలలుగా పింఛను నిలిచిపోయింది. చనిపోయినట్లు చూపించి పెన్షన్ ఆపేశారు. దీంతో మార్చి 20వ తేదీన కార్యదర్శికి పెన్షన్ వస్తలేదని దరఖాస్తు పెట్టుకుంది. దీంతో రోజు గడవడం కష్టంగా ఉంది అని పార్వతి కన్నీటి పర్యంతమైంది. సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. పెన్షన్ను పునరుద్ధరించాలని వృద్ధురాలు వేడుకుంటుంది. -
అభివృద్ధిలో గణాంకాల పాత్ర కీలకం
● సీపీఓ జవహర్లాల్ భూపాలపల్లి: దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో గణాంకాల పాత్ర అత్యంత కీలకమని సీపీఓ జవహర్లాల్ అన్నారు. ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త పీసీ మహలనోబిస్ జ్ఞాపకార్థం సోమవారం సీపీఓ కార్యాలయంలో జాతీయ గణాంక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఓ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో పీసీ మహాలనోబిస్ చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సీపీఓ శామ్యుల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా గణాంక అధికారులు కిష్టయ్య, వెంకటేశ్వర్లు, ఉప గణాంక అధికారులు మహేష్, బాబులాల్, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: వన మహోత్సవంలో శాఖల వారిగా కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వన మహోత్సవంపై డీఎఫ్ఓ నవీన్రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, వివరాలను అటవీశాఖ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరిక్రిష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలి.. ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65మంది నుంచి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ను కలిసిన డీటీఓ శ్రీనివాస్.. జిల్లా రవాణాశాఖ అధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీనివాస్ ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇక్కడ డీటీఓ విధులు నిర్వహిస్తున్న వెంకన్న ఈ నెల 22న జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బి.శ్రీనివాస్ను భూపాలపల్లి డీటీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ 56 శాతం పూర్తి.. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ జిల్లాలో 56 శాతం పూర్తయినట్లు కలెక్టర్ రాహుల్శర్మ వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. -
రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జూలై 13 వరకు కొనసాగే ఈ దీక్షల్లో సింగరేణి అధికారులకు వేతన సవరణ అమలు చేయాలని, పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కోలిండియా అధికారులతో సమానంగా అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో దీక్షలు చేపడుతున్నట్లు సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్ తెలిపారు. వీరి దీక్షలకు జీఎం కార్యాలయ హెచ్ఓడీలు, ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి మద్దతు తెలపగా, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో సీఎంఓఏఐ నాయకులు సమ్మిరెడ్డి, విక్రమ్, అలీమ్, ప్రమోద్, సుశాంత్, శ్రీనివాస్, మౌనిక, షైనీ పాల్గొన్నారు. రేపు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా జూలై 1న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట నిర్వహించే ధర్నాకు కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పసునూటి రాజేందర్, మోటపలుకుల రమేష్, నరేష్నేత, దుడ్డేల సాయిలు, జూపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడారు. అనేక సమస్యలపై ప్రభుత్వానికి యాజమాన్యానికి అనేకసార్లు కార్మిక సంఘాలు విన్నవించినా సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్కుమార్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన తరువాత స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన జీవన్కుమార్ భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జె.జీవన్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ నుంచి బాధ్యతలను స్వీకరించిన జీవన్కుమార్కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్యలాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్కుమార్, ప్రధాన కార్యదర్శి రాములు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, అడిషనల్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్కు డేంజర్ జోన్ నిర్వాసితుల వినతి మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్కు 500మీటర్ల దూరంలో ఉన్న పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ ఇండ్ల సేకరణ నిమిత్తం సర్వే చేయించాలని సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మకు డేంజర్ జోన్ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డేంజర్ జోన్ ఇండ్ల సేకరణలో భాగంగా కాటారం ఆర్డీఓ ద్వారా భూములు, ఇండ్లకు సర్వే చేయించాలని కలెక్టర్ను కోరారు. ఇప్పటికే సేకరణ నిమిత్తం హైదరాబాద్ జోన్కో ద్వారా నిధులు కలెక్టర్ ఖాతాలో జమయినట్లు వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, నిర్వాసితులు రాజేశ్వర్రావు, రమేశ్, సురేష్రావు, సత్యనారాయణ, గట్టయ్య, అజ్మత్ అలీ, చంద్రయ్య పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు భూపాలపల్లి రూరల్: రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహణకు అధికారికంగా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఆరు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. చికినేపల్లి, రేగొండ, చల్లగరిగె, మొగుళ్లపల్లి, గిద్దెముత్తారం, టేకుమట్ల సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 5న నామినేషన్ల పరిశీలన, 6న ఉపసంహరణలు, 10న ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉంటుందని వాల్యానాయక్ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి సోమవారం 11మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు పరామర్శ చిట్యాల: చల్లగరిగ గ్రామానికి చెందిన నోముల సదమ్మ, గులాం జిలాని, జూకల్ గ్రామంలోని తాంపు భద్రయ్య, సౌడ కిషన్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాలను మధుసూదనాచారి పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల రమేష్ ముదిరాజ్, రత్న రవి, కన్నెబోయిన అశోక్, జంబుల చంద్రమౌళి ఉన్నారు. -
భద్రత పట్టించుకోరా?
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు బేఖాతరు చేస్తూ వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా శ్రద్ధ చూపడం లేదు. గాలి, వెలుతురు లేని ఎౖతైన, ఇరుకుగదుల్లో వందలాది మంది విద్యార్థులను కూర్చోబెట్టి క్లాసులు నిర్వహిస్తుండడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకోవడం లేదు. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణకు అవసరమైన భద్రతా ప్రమాణాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 75 ప్రైవేట్ పాఠశాలలు.. జిల్లావ్యాప్తంగా 75కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 20వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో అధికశాతం ఇరుకు గదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు కరువు.. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలు ఉన్నాయి. పాఠశాల విరామ సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది బాలికలు బాత్ రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు తాగేందుకు సరిపడా నీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు ఉన్నాయి.ఇరుకుగదుల్లో ప్రైవేట్ పాఠశాలల తరగతుల నిర్వహణ కార్పొరేట్ ఫీజులు.. వసతులు జీరో కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులునిబంధనలు గాలికి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే అనుమతించాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా మామూళ్లకు అలవాటు పడి, రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
పత్తికే ప్రాధాన్యం
భూపాలపల్లి రూరల్: రబీలో వర్షాభావానికి తోడు పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో కుదేలైన రైతులు.. వానాకాలం సాగుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సారి వర్షాలు గతేడాది మాదిరిగా కాకుండా తక్కువగా కురుస్తాయని, స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇటీవల రెండు సార్లు కురిసిన అడపాదడప వర్షాలతో రైతులు సాగుబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా దుక్కులు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు విత్తనాలు సైతం విత్తారు. ఈ మేరకు అధికార యంత్రాంగం స్పందించి నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంతో పాటు సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచాలనే డిమాండ్ రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. పత్తికి ప్రాధాన్యం.. జిల్లాలో గతేడాది 91,510 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. ఈ సారి ఇప్పటివరకు 1,06,560 ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 45వేలు ఎకరాలు సాగు చేశారని, 1,100 ఎకరాలు వరి నార్లు పోసుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తికి మాత్రం ధరలో పెద్దగా ప్రాధాన్యత లేకున్నా పెద్దమొత్తంలో లాభాలు రాకపోయినా పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు బాగుండటంతో ఇతర పంటలు సాగుచేసే రైతులు కూడా పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. పెరగనున్న మిర్చి సాగు.. రెండేళ్లుగా మిర్చి పంటలకు ఎక్కువగా చీడపీడలు ఆశిస్తున్నాయి. మార్కెట్లో మాత్రం క్వింటాల్కు మిర్చికి నాణ్యతను బట్టి రూ.20వేల నుంచి రూ45వేలకు పైగా అధిక ధర పలికింది. రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో గతేడాది కేవలం 7,700 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేయగా ప్రస్తుతం 20వేల ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మిర్చి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది మిర్చికి అధిక ధర వస్తుందనే నమ్మకంతోనే రైతులు మిర్చి పంట వైపు మొగ్గు చూపుతున్నారు.వరి 1,09,854 పత్తి 1,06,560 మిర్చి 20,000 మినుములు 90పెసర 110కంది 120మొత్తం 2,36,734 2,36,734 ఎకరాలకు పైగా సాగు 45వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు -
ముక్కలైన కలల రెక్కలు
పైలట్ కావాలన్న కల.. శిక్షణలోనే కూలిపోయిన విమానంహసన్పర్తి: తల్లిదండ్రులకు అండగా నిలవాలని.. పైలట్గా ఉన్నత స్థానానికి చేరుకోవాలని.. కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని సుమంత్ కన్న కలలు ఒక్క ప్రమాదంతో ముగిశాయి. ఆకాశాన్ని జయించాలని బయలుదేరిన యువకుడిని.. అదే ఆకాశం శాశ్వతంగా తనలో కలుపుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ తల్లి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. పైలట్గా తిరిగి వచ్చి తల్లిదండ్రులకు గర్వకారణం కావా ల్సిన ఆ కుమారుడు.. శవపేటికలో వస్తాడనే విషయాన్ని ఆ కుటుంబం ఊహించలేదు. హసన్పర్తికి చెందిన ఆడెపు సుమంత్ (21) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో శిక్షణ విమానం భారత కాలమానం ప్రకారం శనివారం కుప్పకూలడంతో మృతిచెందాడు. ఈ వార్తతో కుటుంబంలో, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్య తరగతి కుటుంబం నుంచి.. హసన్పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడెపు వరలక్ష్మి–చంద్రమోళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్పర్తిలో స్థిరపడింది. చంద్రమౌళి హసన్పర్తిలో పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడెపు సుమంత్. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత 6నుంచి పదో తరగతి వరకు ఎల్లాపురంలోని ఎస్పీఆర్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ ఆల్ఫోర్స్లో పూర్తి చేశాడు. పైలట్ కావాలన్నదే సుమంత్ లక్ష్యం. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందాడు. దక్షిణాఫ్రికాలో శిక్షణ కోసం గతేడాది వెళ్లాడు. మరో రెండు నెలలైతే.. మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఒక్క ఫోన్కాల్తో కుప్పకూలిన కుటుంబం శనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని శోకసద్రంలో ముంచింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.. అతను లేడు’అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామమంతా శోకసంద్రం సుమంత్ మరణవార్త తెలియగానే హసన్పర్తి గ్రామానికి చెందిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి రోదనలు ఆగడం లేదు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ‘చాలా మంచివాడు.. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరం’అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు ఆగమంటాళ్లు సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతోందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో హసన్పర్తికి చెందిన ట్రెయినీ పైలట్ సుమంత్ మృతి రెండు నెలల్లో పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తానని తెలిపిన యువకుడు అంతలోనే తీవ్ర విషాదం.. తల్లిదండ్రులకు తీరని శోకం -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
గణపురం: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా తల్లితండ్రులు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గణపురం మండలం చెల్పూరు పీహెచ్సీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లితండ్రులు నిర్లక్ష్యం చేయకుండా పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఆరోగ్యకేంద్రాలతో పాటు సబ్సెంటర్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాలలో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారని.. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 34,728 మందికి పోలియో చుక్కలు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 34,728 మంది చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యాశాఖ అఽఽధికారి డాక్టర్ మధుసూదన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేయడానికి 296 బూత్లు, 14 మొబైల్ బృందాలు, 14 ట్రాన్సిట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి 1,184 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు. పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారుల కోసం నేడు (సోమవారం), 30 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. పకడ్బందీగా పల్స్పోలియో మహాముత్తారం: పల్స్పోలియో కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఆదివారం మండలంలో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా మహాముత్తారం, కోనంపేట, యామన్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండలంలో 1,666 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. డీఎంహెచ్ఓ వెంట మండల వైద్యాధికారి సందీప్ ఉన్నారు. పల్స్పోలియో కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి మధుసూదన్ చెల్పూరు ఆరోగ్యకేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్శర్మ -
పీఆర్సీ ఊసేలేదు!
● మూడేళ్లుగా వేతన సవరణ పెండింగ్ ● దశల వారీగా అందోళన, నిరసన కార్యక్రమాలు● పట్టించుకోని యాజమాన్యం, పాలకులు ● నేటి నుంచి జీఎం కార్యాలయం ఎదుట దీక్షలు2,200 మంది అధికారులు రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా 2,200 మంది అధికారులు పనిచేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో సుమారు 250 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ చెల్లించాల్సి ఉంది. ఈ–వన్ గ్రేడ్ నుంచి ఈ–8 గ్రేడ్ వరకు పీఆర్పీ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో అఽధికారికి సీనియారిటీ ప్రకారం ఏడాదికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు పీఆర్సీ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల బకాయిలు సుమారు రూ.277కోట్లు రావాల్సి ఉందని.. మరోఏడాది లెక్క తేలాల్సి ఉందంటున్నారు. తమను యాజమాన్యం పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో సింగరేణి అధికారులు ఉన్నారు. తమకు పీఆర్పీ చెల్లించకుండా యాజమాన్యం చిన్న చూపు చూస్తోందని అధికారులు వాపోతున్నారు. దశల వారీగా ఆందోళనలు సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు అధికారులు పిలుపునిచ్చారు. తొలిదశలో కార్మికవాడల నుంచి జీఎం కార్యాలయాల వరకు ఆందోళన నిర్వహించారు. జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. రెండోదశలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు. నేటినుంచి రిలే నిరాహార దీక్షలకు స్పందించకపోతే ప్లేడేలు, బాయికాట్ చేయడం, వర్క్ టూ రూల్ పాటించనున్నట్లు సింగరేణి అధికారుల సంఘం ప్రకటించింది.సింగరేణిలో ఉత్పత్తిని పరుగులు పెట్టించే అధికారుల సంక్షేమాన్ని యాజమాన్యం, పాలకులు పక్కనబెట్టారు. ఏకంగా మూడేళ్లుగా అధికారుల వేతన సవరణ (పీఆర్సీ) ఊసే ఎత్తకపోవడంతో సింగరేణి అధికారులు ఇక ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. చర్చల దశ దాటి నేటినుంచి క్షేత్రస్థాయిలో ఆందోళనలకు దిగుతున్నారు. నేటినుంచి సింగరేణి అధికారుల పోరుబాట ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడే ప్రమాదం ఉంది. – భూపాలపల్లి అర్బన్ఆర్థిక సంవత్సరం బకాయిలు 2022–23 రూ.117కోట్లు 2023–24 రూ.127కోట్లు 2024–25 రూ.150 కోట్లు మూడేళ్ల పీఆర్పీ చెల్లించాలి పదోన్నతి పాలసీ రూపొందించి అమలు చేయాలి పారదర్శకంగా పదోన్నతి, బదిలీలు ఉండాలి సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండొద్దు సంస్థకు రూ.50వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి అధికారుల క్వార్టర్లకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి అధికారుల ఐఐఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలి.సింగరేణి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. సకాలంలో పీఆర్పీ బకాయిలు చెల్లించకపోవడంతో అసంతృప్తి పెరిగింది. అనేక విధాలుగా ఆందోళనలు నిర్వహించాం. యాజమాన్యం స్పందించకపోవడం బాధగా ఉంది. అధికారులకు రావాల్సిన పీఆర్పీతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించాలి. డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదు. న్యాయమైన డిమాండ్లను సింగరేణి యాజమాన్యం పరిష్కరించాలి. – నజీర్, సీఎంఓఏఐ ఏరియా అఽధ్యక్షుడు -
రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని కొత్త పట్టాదారులైన రైతులు రైతుభరోసా పథకం లబ్ధి పొందడానికి జూలై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ విడతలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. అర్హులైన రైతులు భర్తీ చేసిన రైతుభరోసా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ జిరాక్స్, కొత్త పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్లను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. జూలై 30 నుంచి అర్హులైన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన కొత్త రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోటగుళ్లలో జడ్జి ప్రత్యేక పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షత్రం కోటగుళ్లలో పరకాల జూనియర్ సివి ల్ జడ్జి శ్రీవల్లి శైలజ ఆదివారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జూపల్లి నాగరాజు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఏకతాటిపైకి రావాలి భూపాలపల్లి రూరల్: భవిష్యత్ తరాల అభివృద్ధి, సనాతన ధర్మం కోసం హిందువులందరూ ఏకతాటిపైకి రావాలని ఎండోమెంట్ (థార్మిక) సెల్ విభాగం స్టేట్ జాయింట్ కన్వీనర్, జిల్లా ఇన్చార్జ్ మాడుగుల రవీందర్ శర్మ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జిల్లా సెల్ కన్వీనర్ కర్ర జయపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాయ్ చర్చ కార్యక్రమానికి మాడుగుల రవీందర్ శర్మ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ విభాగం జిల్లా కో కన్వీనర్లు నరేందర్ రెడ్డి, సునీల్ చంద్ర, జాయింట్ కన్వీనర్లు పండగటి పురుషోత్తం, బండారి రమేష్, శ్రీనివాస్ చార్యులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సబ్ సెంటర్ల పరిశీలన ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏటూరునాగారం, గంగారం, తదితర సబ్ సెంటర్లను ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ పరిశీలించారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది సూచనలు చేశారు. వైద్య సిబ్బంది వర్షాకాలం ముగిసే వరకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఇంటింట తిరుగుతూ జ్వర పీడితులను గుర్తించాలన్నారు. ఏజెన్సీలో భారీ వర్షం ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలో 9 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అత్యధికంగా 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగును ప్రజలు బోటులో దాటారు. ఇటీవల వర్షాలకు కొండాయి– దొడ్ల మధ్యలో ఉన్న జంపన్నవాగు ఉధృతికి తాత్కాలిక రోడ్డు తెగిపోగా ప్రజల అవసరాల నిమిత్తం మళ్లీ తాత్కాలికంగా రోడ్డు వేశారు. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రాకపోకలను మొదలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు జీసీసీ వెనుకాల ఉన్న కొత్తగుడిసెల్లోని ఇళ్లకు నీరు వచ్చి చేరింది. -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేలా దిశానిర్ధేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, జలగం రంజిత్, కుసుమ సతీష్, గుజ్జ సత్యనారాయణ రావు, మధు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం -
డిటోనేటర్ల వినియోగాన్ని నిలిపేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగం కారణంగా పలు నియర్–మిస్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. తాత్కాలికంగా డిటోనేటర్లను నిలిపివేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ డిటోనేటర్లతో మైనింగ్ సిబ్బంది, ముఖ్యంగా షార్ట్ ఫైరర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అండర్ గ్రౌండ్లో తడి ప్రదేశాల్లో బ్లాస్టింగ్ ఆపరేషన్లు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్లలో డిజిటల్ సందేశాలు కొన్నిసార్లు తప్పుగా ప్రదర్శించబడుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జి శ్రీనివాస్, బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోశం పాల్గొన్నారు. -
డీపీఓ పరిపాలన విభాగం తనిఖీ
భూపాలపల్లి అర్బన్: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని పరిపాలన విభాగాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పరిపాలనా రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణ, అధికారిక పత్రాలు, పెండింగ్ అంశాలు, కార్యాలయ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నాణ్యత, కార్యాలయ పనితీరు, ప్రభుత్వ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని, కార్యాలయ నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలి
ములుగు: తల్లిదండ్రులు చిన్న పిల్లలను మొదటగా అంగన్ వాడీ పాఠశాలలకు పంపాలని డీడబ్ల్యూఓ ప్రేమలత తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ప్రీ స్కూల్ కార్యక్రమాలను అన్ని విధాలుగా నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల అభివృద్ధికి తోడ్పడేలా శారీరక, భాషా, మేధాభివృద్ధి పూర్వ గణితాభివృద్ధికి సంబంధించిన ఆట, పాటలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ములుగు ప్రాజెక్ట్ సీడీపీఓ శిరీష, ఎస్టీ కాలనీ కార్పొరేటర్ స్వాతి, ప్రథమ్ ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ నాగేశ్వర్రావు, సూపర్వైజర్ కళావతి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. డీడబ్లూఓ ప్రేమలత -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
ములుగు రూరల్: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఆరోగ్యశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రణాళిక ప్రకారం పోలియో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో 22,572 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారని 312 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 రూట్లు, బస్టాండ్ వద్ద బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి సుధీర్, వ్యాధి నిరోదక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రంజిత్, మాస్ మీడియా అధికారి సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, సాంబయ్య, స్వరూప, సురేష్బాబు, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి ములుగు రూరల్: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీన్కుమార్ అన్నారు. శనివారం మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారుతుందన్నారు. వర్షాలకు రంగు మారి ఎఫ్సీఐ బియ్యం దిగుమతులు చేసుకోవడం లేదని చెప్పారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
రేగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నకిలీ ఓటర్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శనివారం మండలకేంద్రంలో సర్లో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలని కోరారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేయాలని తెలిపారు. ఓటరుగా అర్హత ఉన్న వారు తమ పేరు నమోదు చేయించుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపునకు సహకరించాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మొబైల్ టీబీ ఎక్స్రే స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. రావులపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాధుల బారిన పడకుండా చి న్నారులకు తప్పకుండా టీకా ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర రావు, సర్పంచ్ మౌనిక, ఆశవర్కర్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ -
‘విత్తు’కోని ఆశలు
● జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ● మొలకెత్తని పత్తి గింజలు ● మళ్లీ విత్తుతున్న రైతులు ● జలాశయాల్లో అడుగంటుతున్న నీరు ● వరి, మిర్చి పంటల సాగుపై ఆందోళన ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వ వివరాలు (మిలియన్ ఘనపు అడుగుల్లో).. జలాశయం సామర్థ్యం ప్రస్తుతం గణపసముద్రం 380 151 బొగ్గులవాగు 406.56 80.10 భీంఘన్పూర్ 380 15120వేల ఎకరాల్లో మొలకెత్తని పత్తి విత్తనాలు.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో జిల్లాలో సుమారు 2,36,734 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తిపంట 1,06,560 ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేయగా, తొలకరి వర్షాలకు సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పత్తిగింజలు నాటారు. వర్షాలు ముఖం చాటేయడం, అప్పుడప్పుడు చిరుజల్లులు మాత్రమే కురియడంతో సుమారు 20వేల ఎకరాల్లో పత్తిగింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు చేసేది లేక గడిచిన రెండు రోజులుగా మళ్లీ (పోగుంటలు) మొలకెత్తని చోట పత్తి విత్తనాలు వేస్తున్నారు. పత్తి మొలిచిన చోట మొక్కలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. బోర్ల ద్వారా నీటిని అందిస్తుండగా మరికొందరు ముందస్తుగా స్ప్రింకర్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ఏడు మండలాల్లో తక్కువ వర్షపాతం.. జిల్లాలోని 12 మండలాల్లో ఏడు మండలాల్లో జూన్ నెలలో తక్కువ వర్షాపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 120.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 109.9 మాత్రమే నమోదైంది. మహదేవపూర్, పలిమెల, మల్హర్, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదు కాగా.. అతి తక్కువగా మొగుళ్లపల్లి మండలంలో ఈ నెల మొత్తంలో 57.1 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా ఆరు రోజులు మాత్రమే వర్షం కురిసినట్లుగా అధికారులు వెల్లడించారు. వరి, మిర్చి సాగుపై ఆందోళన.. ఎల్నినో ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ హెచ్చరించడంతో జిల్లాలో వరి, మిర్చి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లు, బావులు ఉన్నవారు సాగుకు సిద్ధం అవుతుండగా వర్షం మీదే ఆధారపడే వారు ఇతర పంటలను సాగు చేయాలని భావిస్తున్నారు. బోర్లు ఉన్నప్పటికీ వర్షాలు కురవకపోతే భూగర్భజలాలు అడుగంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం రైతులు ఆందోళన చెందవద్దు. ఎల్పినో ప్రభావం జిల్లాలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక వరి వంగడాలు, పప్పు దినుసులు, అపరాలను సాగు చేయాలి. ఈ పంటలు వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటాయి. – బాబురావు, జిల్లా వ్యవసాయాధికారిమహదేవపూర్లో రెండోసారి పత్తిగింజలు వేస్తున్న రైతులు అన్నదాతలకు ఈ ఏడాది తిప్పలు తప్పేలా లేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రైతులు పత్తి గింజలు నాటి పది రోజులు కావస్తున్నా.. అవి మొలకెత్తకపోవడంతో మళ్లీ గింజలు వేయాల్సి వస్తుంది. మొలకెత్తిన మొక్కలను సైతం కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పత్తి సాగే ఇలా ఉంటే మిర్చి, వరి పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – భూపాలపల్లి -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ పూర్తయ్యేలా.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
30వరకు గడువు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్సైట్ ద్వారా ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిస్ట్ డిజైనర్–ఎఫ్ఈఎం, సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయాన్ని, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు. అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉపాధ్యాయులు నేషనల్అవార్డుటీచర్స్.ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా జూలై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయి గుర్తింపు పొందాలన్నారు. నాపాకలో పూజలు చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో శ్రీ సర్వతోభద్ర ఆది ఏకశిలా శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకుడు పెండెల ప్రభాకరాచార్యులు ఆయనకు ప్రత్యేక పూజలు జరిపించి దేవాలయ విశిష్టతను వివరించారు. ఇలాంటి దేవాలయం ఇంతవరకు ఎక్కడా చూడలేదని, ఆలయం అభివృద్ధి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జయశ్రీ, ఏపీఓ హలీంపాషా, ఈసీ సుధాకర్ ఉన్నారు. సమన్వయంతో కార్మికులకు న్యాయం భూపాలపల్లి అర్బన్: బాండెడ్ లేబర్ వ్యవస్థ నిర్మూలన, కార్మికుల అక్రమ రవాణా నివారణ, కార్మిక సంక్షేమ పథకాల సమర్థ అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది (గవర్నమెంట్ ప్లీడర్) బొట్ల సుధాకర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సంయుక్తంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖల అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ వినోద్, పలిమెల తహసీల్దార్ రాజేశ్వర్రావు, సీఐ కరుణాకర్రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, నాయబ్ తహసీల్దార్లు అంజలిరెడ్డి, అబ్దుల్, శ్రీలత, భాస్కర్, ఎస్ఐలు పాల్గొన్నారు. యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా అనిల్ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా భూపాలపల్లి పట్టణానికి చెందిన శిరుప అనిల్కుమార్ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో అనిల్ కుమార్ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు అనిల్ను సత్కరించారు. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(కె): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాచం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 26మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ఆభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ మహేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైయ్యద్ ముస్సేన్, మన్నెం సునీల్, జల్లిగంపల కళాధర్, చిట్టెం వాసు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ -
శనిత్రయోదశి భక్తుల రద్దీ
కాళేశ్వరం: శనిత్రయోదశి సందర్భంగా కాళేశ్వరం దేవస్థానంలోని బాలాలయంలో ఆదిముక్తీశ్వరస్వామి వద్ద శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం ఆదిముక్తీశ్వరాలయం వద్ద శని పూజలు, కాలసర్ప పూజలు, అభిషేక పూజలు, కుంకుమార్చనలు వేర్వేరుగా నిర్వహించారు. వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.2.94లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేశ్ తెలిపారు.సామూహికంగా శనిపూజలు నిర్వహిస్తున్న భక్తులు -
ఆదివాసీల ఓట్లు తొలగించొద్దు
ఏటూరునాగారం: ఓటరు జాబితా సమగ్ర సవరణలో ఆదివాసీలు ఓట్లు తొలగించవద్దని, గోదావరిలో డిసిల్టేషన్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఎండీ దావూద్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రవికుమార్ మాట్లాడుతూ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా కార్యకర్తలు చూడాలన్నారు. కాంట్రాక్టర్ల లాభాల కోసమే గోదావరిలో ఇసుక తోడుతున్నారని తెలిపారు. వెంకటాపురం(కె) మండలం యాకన్నగూడెం నుంచి సుడిబాక వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించడంతో పాటు పాత పద్ధతుల్లోనే ఇసుక క్వారీలను కొనసాగించాలన్నారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. ఇసుక ద్వారా వచ్చే లాభాలను ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని గోదావరి నదిలో సుమారు 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 4వేల ఎకరాల్లో సుమారు 3 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. దీంతో ఈ ప్రాంతానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. తాగు, సాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, చిట్టి బాబు, రఘుపతి, వాసు, జిల్లా కమిటీ సభ్యులు మల్లారెడ్డి, చిరంజీవి, దేవయ్య, చారి, దామోదర్, గపూర్, కిష్టయ్య, అశోక్, రవితేజ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్


