breaking news
Jayashankar District Latest News
-
జీపీ ట్రాక్టర్లకు రిపేర్లేవి!
కాళేశ్వరం: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కీలకంగా ఉండాల్సిన చెత్త సేకరణ ట్రాక్టర్లు పలు పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు లేక మూలకు పడ్డాయి. రెండేళ్ల నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు పంచాయతీల భారం కార్యదర్శులు భరించారు. దీంతో నిధుల లేమితో నిర్వహణ అంతంతే నిర్వహించారనే విమర్శలు లేకపోలేదు. కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలు కావస్తున్నా పాత ట్రాక్టర్లకు మరమ్మతులు, నిర్వహణకు నిధులులేక పలు గ్రామాల్లో కొంతమంది సర్పంచులు స్వంత ఖర్చులు పెట్టి మరమ్మతులు చేసినా, పలు పంచాయతీల్లో చెత్త సేకరణ చేయడం లేదు. దీంతో కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లు పనికిరావడం లేదు. కొన్ని గ్రామపంచాయతీల్లో నెలల తరబడి ట్రాక్టర్లు షెడ్ల వద్ద నిలిచిపోవడంతో చెత్త సేకరణకు అడ్డంకిగా మారింది. నిధులొచ్చినా.. జీపీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యాయి. వచ్చిన కొంతమేర నిధులతో పాత సర్పంచులు చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు చేయాలని పంచాయతీ చుట్టూర ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఖర్చులు పెట్టిన కార్యదర్శులు తమ బాకీల వసూలు పనిలో పడ్డారు. ప్రస్తుతం కొత్త సర్పంచులు చేపట్టిన పనుల భారంతో చెల్లింపులు చేయలేక వారికి గొడవలు మొదలయ్యాయని తెలిసింది. జిల్లాలో ఇలా.. జిల్లాలో 12 మండలాల్లో 248 పంచాయతీల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. భూపాలపల్లిలో 4, మొగుళ్లపల్లి 5, రేగొండ 2, చిట్యాల 3, టేకుమట్ల 4, కాటారం 4, మహాముత్తారం 4, మహదేవపూర్ 4, మల్హర్ 3, పలిమెల 2 గ్రామపంచాయతీ ట్రాక్టర్లు రిపేర్లతో మూలకుపడ్డాయి. లైసెన్స్, ఇన్సూరెన్స్ లేక! పలు జీపీల్లో ట్రాక్టర్లు నడిపేందుకు లైసెన్స్, అనుభవం లేని డైవర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ట్రాక్టర్లపై అవగాహన లేకపోవడంతో నిత్యం మరమ్మతులకు కారణం అవుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు జీపీ ట్రాక్టర్లకు సంబంధించి సగానికిపైగా ట్రాక్టర్లకు ఇన్సురెన్స్ కూడా లేదని తెలిసింది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో జీపీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో కోర్టు పంచాయతీ నుంచి సదరు మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది దృష్టిలో ఉంచుకొని జీపీ ట్రాక్టర్లకు లైసెన్స్, ఇన్సురెన్స్ కూడా సరిగ్గా చూసుకోవాల్సి ఉంది. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జీపీలు లైసెన్స్లేని డ్రైవర్లు.. ఇన్సూరెన్స్ లేని ట్రాక్టర్లు దృష్టిసారించని అధికారులుచెత్త సేకరణ లేకపోవడంతో పలు పంచాయతీల్లో వీధుల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపిస్తూ, దోమల సమస్య తీవ్రతరం అవుతుంది. పాఠశాలలు, అంగన్వాడీలు, కాలనీలు, హోటళ్లు, లాడ్జిలు, కిరాణ దుకాణాలు, పాన్ డబ్బాలు, పాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ గ్రామాల లక్ష్యాలపై పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. చిన్నపాటి మరమ్మతులతో తిరిగి వినియోగంలోకి వచ్చే ట్రాక్టర్లను పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. తక్షణమే ట్రాక్టర్లకు మరమ్మతులు చేసి చెత్త సేకరణను పునఃప్రారంభించి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అన్ని జీపీల్లో ట్రాక్టర్లు ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్లు ఉంటే పంచాయతీల్లోనే చేయిస్తారు. జిల్లాలో జీపీ ట్రాక్టర్లకు రిపేర్లు ఎక్కడ ఉన్నవి సమాచారం లేదు. ఉన్నతాధికారులు కూడా ట్రాక్టర్లపై సమాచారం అడగలేదు. – శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి రూరల్: ప్రాధాన్యత రంగాలకు రూ.2971.20 కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా.. డిసెంబర్ మాసం నాటికి రూ.1937.21 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కన్సల్టేటివ్, జిల్లాస్థాయి రివ్యూ కమిటీ, జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కమిటీ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ తయారుచేయాలని సూచించారు. రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందించాలని తెలిపారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు తిరిగి రెన్యూవల్ చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆపుతున్నారని అన్నారు. రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పడే 100 మంది రైతులను చూపిస్తానని అసంతృప్తి వ్యక్తంచేశారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రిలేషన్ మెయింటైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్సాయి, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
కొవ్వొత్తులతో ర్యాలీ
చిట్యాల: నాగర్ కర్నూల్ జిల్లా బమ్మెరలో అగ్రవర్ణాల చేతిలో బలైన చిన్నారికి ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జాక్, రజక సంఘాలు మానవహారంతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు బుర్ర వెంకటేష్గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల అహంకారానికి అభం శుభం తెలియని చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తౌటం నవీన్, పుల్ల అశోక్, శీలపాక నాగరాజు, పుల్ల మల్లయ్య, పాండ్రాల వీరస్వామి, రవీందర్, కుమారస్వామి, కిరణ్, తిరుపతి, శశికుమార్, కిషన్ పాల్గొన్నారు. రోడ్డుపై నిర్లక్ష్యం.. ప్రమాదానికి నెలవు! కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇలా మోడువారి ప్రమాదానికి నెలవుగా ఉన్నప్పటికీ ఆర్అండ్బీ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రానున్న వేసవి కాలంలో గాలిదుమారాలు వస్తే వాహనదారులపై పడే ప్రమాదం ఉంది. ప్రమాదం జరగకముందే మోడువారిన చెట్లను తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను డీఐఈఓ వెంకన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ద్వితీయ సంవత్సరంలో 76 మంది విద్యార్థులకు గాను 75 మంది, ఒకేషనల్ కోర్సులో 27 మంది విద్యార్థులకు గాను 27 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని చెప్పారు. మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి, మల్లూరు పుష్కరఘాట్ నిర్మాణం అంచనా నివేదికను మంత్రి సీతక్కకు గురువారం అందజేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ తెలిపారు. ఇటీవల మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి హేమాచలక్షేత్రం అభివృద్ధి, మల్లూరులో పుష్కరఘాట్ ఏర్పాటుపై నివేదిక అందజేయగా సానుకూలంగా స్పందించిన సీతక్క కలెక్టర్తో మాట్లాడి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో అంచనా నివేదిక తయారు చేయాలని ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి పనులపై రూపొందించిన నివేదికను గురువారం మేడారంలో మంత్రి సీతక్కను కలిసి అందజేసినట్లు వెల్లడించారు. -
ఐఏఎస్ల ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రట్రరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబా బాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ప్రభుత్వం నియమించింది. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగుళాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఐటీడీఏ పీఓ టు కరీంనగర్ కలెక్టర్.. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 2024 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దీంతో ఆమెను ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్బాజ్పాయ్.. ‘గ్రేటర్’ కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీగ్రేటర్ వరంగల్ ఇన్ ? అవుట్ చాహత్ బాజ్పాయ్ హనుమకొండ ఇన్ చాహత్ బాజ్పాయ్ అవుట్ స్నేహ శబరీష్ జనగామ ఇన్ సందీప్కుమార్ ఝా అవుట్ షేక్ రిజ్వాన్ బాషా మహబూబాబాద్ ఇన్ స్నేహ శబరీష్ అవుట్ అద్వైత్సింగ్ ఏటూరునాగారం ఐటీడీఏ ఇన్ ? అవుట్ చిత్రామిశ్రాస్నేహ శబరీష్ వివరాలు..చాహత్ బాజ్పాయ్ వివరాలు.. -
అట్టహాసంగా బ్రహ్మోత్సవాలు
రేగొండ: భక్తుల కొంగుబంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అభిషేకంతో మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ సేవలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో దేదీప్యమానంగా వెలుగొందేందుకు అధికారులు ఆలయాన్ని దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ ఈఓ మహేష్, ఆలయ సిబ్బంది శ్రావణ్, రవీందర్, సుధాకర్, భక్తులు పాల్గొన్నారు. నిత్య అన్నసత్రం ప్రారంభం వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్య అన్న సత్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు కాసం నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎర్రం సదాశివ శంకర్, సభ్యులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు కొడవటంచ ఆలయంలో నేడు ధ్వజారోహణం (గరుడముద్ద), రాత్రి అశ్వవాహనసేవ, ఎదురుకోళ్లు అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పోషకాహారం విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. వంట సిబ్బంది పరిశుభ్రత పాటించడంతో పాటు, తాజా ఆహార పదార్థాలనే వినియోగించాలన్నారు. గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించరాదని ఆదేశించారు. భోజనం నాణ్యంగా ఉందని అభినందిస్తూ, ప్రతిరోజూ ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తరచుగా పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించి మంచి అలవాట్లు అలవరచుకోవాలని కోరారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపాల్ జీవరత్నం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
‘క్యూమార్ట్’లో మిల్లెట్ యూనిట్ ఉత్పత్తులు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని చెల్పూరు మహిళ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారుచేసిన పోషకాహార తినుబండారాలను హైదరాబాద్లోని క్యూ మార్ట్లో విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన క్యూమార్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా తయారవుతున్న నాణ్యమైన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. చెల్పూరు మహిళ మిల్లెట్ యూనిట్ ద్వారా తయారవుతున్న మిల్లెట్ పౌడర్, మిల్లెట్ రైస్, మిల్లెట్ ఉప్మా రవ్వ, రాగి లడ్డు, నువ్వుల లడ్డు వంటి పోషకాహార పదార్థాలు క్యూ మార్ట్లో విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్న ఉత్పత్తులకు నగర మార్కెట్ అందుబాటులోకి వస్తుందని, తద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరగడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ, క్యూ మార్ట్ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.హైదరాబాద్లో విక్రయించేందుకు ఒప్పందం -
డ్రోన్తో భూముల సర్వే
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరినది పుష్కరాలకు వీఐపీఘాటు నుంచి మెయిన్ఘాటు వరకు ఘాట్లు, రోడ్డు విస్తరణపై గోదావరి పొడవునా డ్రోన్ కెమెరాతో భూముల సర్వే చేపట్టారు. బుధవారం రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్శాఖల ఆధ్వర్యంలో భూములను డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. కాగా, వీఐపీఘాటు నుంచి మెయిన్ఘాటు వరకు 860 మీటర్ల పొడవుతో 10.5 ఎకరాల భూమిని రైతులు 20 మీటర్ల వరకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట అధికారులు 50 మీటర్ల వరకు తీసుకుంటున్నామని కొలతలు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడంతో రైతులు సర్వేను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి 20 మీటర్ల వరకు ఇచ్చేందుకు రైతులను ఒప్పించారు. దీంతో ఘాట్లు, రోడ్డు నిర్మాణం అడ్డంకులు తొలిగిపోయాయి. నిధులు మంజూరు కావడంతో పనులు మొదలు కానున్నాయి. వంతెన వరకు డ్రోన్ సర్వే... వీఐపీఘాటు నుంచి అంతరాష్ట్ర వంతెన వరకు డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టారు. గోదావరి పుష్కరాల వరకు పుష్కరఘాటు, రోడ్డు విస్తరణ చేపట్టాడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం వీఐపీఘాటు టు మెయిన్ ఘాటు వరకు సర్వే చేసినప్పటికి, పుష్కరాల వరకు మళ్లీ విస్తరణ చేయాల్సి వస్తుందని ముందస్తుగానే అధికారులు సర్వేను చేపట్టారని తెలిసింది. ఇదే కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలపై దృష్టిసారించారని సమాచారం. -
బ్రహ్మోత్సవాలకు వేళాయె
రేగొండ: భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం స్వస్తి వాచనము, శేషవాహనము సేవ (పుట్టబంగారం సేవ), అంకురారోహణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. తరలిరానున్న భక్తజనం కోటంచ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తనున్నారు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు నిలువనున్నాయి. జాతరకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఆలయ మాఢవీధుల గుండా మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాతనే విడిది చేయడం ఇక్కడి ఆనవాయితీ. భక్తుల రవాణా సౌకర్యం కోసం పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి కొడవటంచ ఆలయానికి ప్రభుత్వం రూ.12.15 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అతిథి గృహాలు నిర్మించడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస చేసే సౌకర్యం ఉండటంతో అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. భక్తుల తాగునీటి వసతి కోసం ప్రభుత్వం రూ.86.90 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఆలయ ప్రాంగణంలో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు, వసతి గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు పైపులైన్ వేశారు. ఆలయ ఆవరణలో రూ.1.2 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. జాతరలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి జాతర కోటంచకు పోటెత్తనున్న భక్తజనం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు -
ఇంటర్ పరీక్షలు షురూ
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులను తెలుగు పరీక్షను నిర్వహించారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. 1,829 వందల మంది విద్యార్థులకు గాను 1,772 వందల మంది హాజరు కాగా 57 మంది గైర్హాజరైనారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యానోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. -
డేంజర్ జోన్ నిర్వాసితులతో సమావేశం
మల్హర్: మండలంలోని పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులతో బుధవారం హైదరాబాద్లోని మంత్రి శ్రీధర్బాబు తన కార్యాలయంలో జెన్కో సీఎండీ హరీష్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపెన్కాస్ట్ బ్లాస్టింగ్లతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఇళ్లను సేకరించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్వాసితులు మంత్రి, సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. శాసీ్త్రయ పద్ధతిలో సర్వే నిర్వహించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ అజయ్, తాడిచర్ల సర్పంచ్ స్వామి, నిర్వాసితులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం భూపాలపల్లి అర్బన్: హకీంపేట్ తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కోసం మండల, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10 బాలికలు, బాలుర చొప్పున మొత్తం 20 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నేటి (గురువారం) నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. మండల స్థాయి పోటీలు మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలు భూపాలపల్లిలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఎంపికలో శారీరక ప్రమాణాలు, క్రీడా పరీక్షలు, మెడికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాల ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు మండల విద్యాఅధికారిని సంప్రదించాలన్నారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆర్పీ తిప్పనబోయిన రామకృష్ణ ప్రకృతిని గౌరవిస్తూ వృక్షపూజ నిర్వహించారు. బుధవారం పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠ్యబోధనలో భాగంగా విద్యార్థులకు ప్రకృతిలో చెట్ల గొప్పతనాన్ని వివరించారు. పర్యావరణానికి హాని తలపెట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మానవాళికి, పక్షులకు, జంతువులకు, జీవరాసులకు కేంద్రమైన చెట్లు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ ఫోరం అధ్యక్షుడు కమలాకర్, ఆర్పీలు ఏడుకొండలు, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు.ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. -
రాలుతున్న ఆశలు
భూపాలపల్లి రూరల్: మామిడి రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. గత పదిరోజులుగా వాతావరణ మార్పులతో బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి మామిడితోటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పూత, పిందెలు నేలరాలుతున్నాయి. కళ్లెదుటే రాలిపోతున్న పూత, పిందెలను చూస్తూ మామిడి రైతులు నిరాశ చెందుతున్నారు. దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టాలపాలవుతామని ఆందోళనకు గురవుతున్నారు. ఆదిలోనే కష్టాలు.. జిల్లాలో డిసెంబర్, జనవరి నెల నుంచే మామిడి చెట్లకు పూత పూయడం ప్రారంభమైంది. పూత పూసిన నెలరోజుల తర్వాత పిందెలు కాయడం, ఆ తర్వాత నెల, రెండు నెలలకి కాయ సైజు పెరుగుతూ వస్తుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి తోటలకు ఈసారి పూత బాగా రావడంతో రైతులు సంతోషపడ్డారు. కానీ ప్రస్తుత వాతావరణ మార్పులతో ఆదిలోనే కష్టాల్లో పడ్డారు. బూడిద తెగుళ్లు, తేనెమంచు పురుగు మామిడి తోటలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో మామిడి పూత, పిందెలు రాలిపోతున్నాయి. ప్రధానంగా జనవరిలో పూత వచ్చి, ఫిబ్రవరిలో పిందెలు వచ్చిన చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పిందెలురాలి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎన్ని మందులు వాడుతున్నా.. తెగుళ్ల ఉధృతి తగ్గడం లేదని అంటున్నారు. ఏడాదిగా కష్టపడుతూ అనేక మందులు కొడుతూ తోటలను కాపాడుకున్నా.. వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నేలపాలవుతున్న మామిడి పూత, పిందెలు ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్ల తోటల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన నేలలు ఉండాలి. జిల్లాలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువ. సాగునీటి విషయానికి వస్తే చెరువులు, కుంటలతో పాటు బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్ల తోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఈ క్రమంలోనే జిల్లాలో మామిడి, బత్తాయి, బొప్పాయి, జామ, సపోట డ్రాగన్ప్రూట్ తదితర పండ్లతోటలను సాగు చేస్తున్నారు. ఆయా పండ్లతోటల కంటే మామిడి సాగు ఎక్కువగా ఉంది. జిల్లాలో 654 ఎకరాల్లో మామిడి తోటలు పిందె, కాయ దశలో ఉన్నాయి. తోటలపై తెగుళ్లు, తేనెమంచు పురుగు ఉధృతి వాతావరణ మార్పులే కారణం దిగుబడులపై తీవ్ర ప్రభావం ఆందోళనలో మామిడి రైతులు -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
పలిమెల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని పంకెనలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీలోని డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్, పీహెచ్సీ బిల్డింగ్లను సందర్శించి పనుల పురోగతిని డీఈ సాయిలును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయి పవన్, ఏఈ సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఆర్ఐ, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా శక్తి దేశాభివృద్ధికి పునాది
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: మహిళల శక్తి దేశాభివృద్ధికి పునాది అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, యువతులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
మల్హర్(కాటారం): కాటారం మండలం బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో ప్రతిపాదిత చిన్న కాళేశ్వరం కాల్వ నిర్మాణ పనుల కోసం అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కాల్వ నిర్మాణానికి సంబంధించిన సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకుని తమ ఆందోళన, నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి తమ కుటుంబాల జీవనాధారమని, ఆ భూముల మీదుగా కాల్వ నిర్మాణం చేపడితే సాగు పూర్తిగా దెబ్బతింటుందని, తమ బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనం, పరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు సర్వే పనులు జరగన్విమని హెచ్చరించారు. రైతుల నిరసనతో సర్వే పనులు నిలిచిపోయాయి. కాగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
వ్యక్తిగత వివరాలు... కుటుంబ నేపథ్యం..
పేరు: బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా. మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి. తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ). ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం, గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్కౌంటర్లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ జైలులో ఉన్నారు.సగర్వంగా స్వాగతం పలుకుతాం చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. – కొప్పుల జగన్నాథరావు, దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లి ● -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరంలో 1,544 మంది, వృత్తి విద్యా కోర్సుకు 298 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,586 మంది, సెకండియర్ వృత్తి విద్యా కోర్సుకు 350 మంది మొత్తం 3,778 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలకు 20 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,544 మంది పదోతరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకన్న పాల్గొన్నారు. కంట్రోల్ రూం రూం ఏర్పాటు.. విద్యార్థులకు సలహాలు, సందేహాల నివృత్తి, పరీక్షా కేంద్రాల సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 97052 99368, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 80088 78060 నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. మొబైల్ యాప్ తప్పనిసరి.. గ్రామస్థాయిలో మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేసి దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈ –డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఇంటర్మీడియట్ వార్షిక కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు. 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలు రాయనున్న 3,778 మంది విద్యార్థులు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు -
దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..
ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరిన దామోదర్, 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు. ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2003లో మేడారం ఎల్ఓఎస్ ఇన్చార్జ్గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు. 2006లో ఖమ్మం–కరీంనగర్–వరంగల్ (కేకేడ బ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు, 2007లో డివి జనల్కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం)గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన దామోదర్, యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
పదిశాతం పనులు కూడా చేయలె
ఆస్పత్రి పనులను పరిశీలిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, చిత్రంలో మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, శంకర్ నాయక్ తదితరులు ● రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ● వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలన – ఎంజీఎం -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్లతో కలిసి మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, యూరియా కోసం రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేయుట తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, టీజీ ఎండీసీ శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే తక్షణమే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి రిమాండ్ చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాలకే ఇసుక రవాణా జరగాలని, జిల్లా దాటి పోకుండా చూడాలన్నారు. నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న కొడవటంచ దేవాలయ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు, మరుగుదొడ్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కోటివరాల కొడవటంచ
రేగొండ: భక్తజన బాంధవుడిగా పేరుగాంచిన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి (గురువారం) నుంచి ప్రారంభమై వారం రోజులపాటు వైభవంగా కొనసాగునున్నాయి. ఇటీవలే స్వామి వారి పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు వైభవంగా చేపట్టారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని కొలిస్తే కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన కొడవటంచ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొడవటంచ క్షేత్రం నిత్యపూజలతో భక్తిపారవశ్యంతో పొంగిపోతుంది. వందల సంవత్సరాల క్రితం వెలసిన కొడవటంచలో ఒకప్పుడు జాతర సమయంలోనే భక్తులు మొక్కులు చెల్లించుకునేవారు. కోరికలు నెరవేరడంతో జాతర సమయంలోనే కాకుండా నిత్యం స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. కొత్త వాహనాలకు పూజలు చేసేందుకు కూడా భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఉదయం ఐదు గంటల నుంచే స్వామి వారికి సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎక్కడాలేని విధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచ ఆలయంలోనే నిర్వహించడం ప్రత్యేకత. ప్రతి నెలా స్వామి వారికి స్వాతి నక్షత్రంలో కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. నివేదన సమయంలో ఆలయ సన్నిధిలో సమానత్వానికి సూచికగా భక్తులను కూర్చోబెట్టి స్వామి వారి ప్రసాదాన్ని అందిస్తారు.స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తాం. – నాయినేని సంపత్ రావు, ఉత్సవ కమిటీ చైర్మన్వారం రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో, ఎలాంటి వివాదాలకు దారి తీయకుండా శాంతియుతంగా జరుపుకోవాలి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జాతరలో అల్లర్లకు పాల్పడే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. – రాజేష్, ఎస్సై, రేగొండ●26న (గురువారం) ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం స్వస్తి వాచనము, శేషవాహనము సేవ (పుట్టబంగారం సేవ), అంకురారోహణం బ్రహ్మోత్సవాలు ప్రారంభం 27న (శుక్రవారం) ధ్వజరోహణం (గరుడముద్ర) కార్యక్రమాలతోపాటు అశ్వవాహన సేవ, స్వామి వారి ఎదుర్కోలు, స్వామి వారి కల్యాణం (తలంబ్రాలు) 28న (శనివారం) ఉదయం గజవాహనసేవ, రాత్రి చంద్రవాహన సేవ 01న (ఆదివారం) ఉదయం సింహవాహన సేవ, రాత్రి గరుడోత్సవం, సదస్యము 02న (సోమవారం) ఉదయం హనుమంతవాహనసేవ, రాత్రి చిన్న రథ సేవ, దోపోత్సవం 03న (మంగళవారం) హోళి పండుగ రోజున చంద్రగ్రహం ఉన్నందున ఉదయం నిత్యవిధి, హోమ, బలిహరణములు, పూర్ణాహుతి, నైవేథ్యం అనంతరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం మూసివేత 04న (బుధవారం) బోనాలు,, జాతర, సాయంత్రం పెద్ద రథోత్సవం 05న (గురువారం) ఉదయంచక్రస్నానం, జాతర రాత్రి శ్రీపుష్పయాగము రేపటి నుంచి కోటంచ బ్రహ్మోత్సవాలు షురూ 27న స్వామి వారి కల్యాణం -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జాతీయ చేనేత దినోత్స వం సందర్భంగా అవార్డులకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ జిల్లా అధికా రి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లకు వృత్తిలో నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డును అందించనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపి కైనవారికి రూ.25,000 నగదుతోపాటు సర్టిఫికె ట్ అందజేసి సత్కరిస్తారని తెలిపారు. మార్చి 31లోగా సహాయ సంచాలకులు, చేనేత, జౌళి శాఖ వరంగల్ కార్యాలయలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు చేనేత, జౌళి శాఖ వరంగల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఆలయాల అభివృద్ధికి కృషి రేగొండ : ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం మండలంలోని కోటంచ ఆలయంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరుణ్రెడ్డి ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సంపత్రావు, ఈఓ మహేష్ పాల్గొన్నారు. మల్హర్(కాటారం): కాటారంలో ఏర్పాటు చేసిన సౌర ప్యానళ్లను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇళ్లకు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్ల వివరాలను సంస్థ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటినీ సౌర విద్యుత్ కేంద్రంగా మార్చాలని సీఎండీ సంస్థ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్చూర్, డీఈఈ (టెక్నికల్) జగదీష్, కాటారం డీఈఈ నాగరాజు, డీఎం రెడ్కో మహేందర్రెడ్డి, రమేష్ పాల్గొన్నారు. పోలీస్ స్పోర్ట్స్లో జిల్లా పోలీసుల ప్రతిభ భూపాలపల్లి: తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో జిల్లా పోలీసులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన నాల్గో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో బాస్కెట్బాల్ పోటీల్లో మహదేవపూర్ సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేజ్ హస్సేన్లు బ్రాంజ్ మెడ ల్స్ సాధించారు. ఆర్మ్ రెజ్లింగ్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాశీరాం బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నారు. జిల్లాకు పతకాలు తీసుకొచ్చిన వీరిని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు ఎస్పీ నరేష్కుమార్ మంగళవారం అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి రూరల్: కలెక్టరేట్లో అధికారులు పోష యాక్ట్– 2013 పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణలో పోష చట్టం ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా ఇన్చార్జ్ సంక్షేమాధికారి మల్లీశ్వరీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 44 అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7 ప్రైవేట్ సంస్థల్లో ఐసీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కృష్ణ, రాధిక, ఉమ తదితరులు పాల్గొన్నారు. మంగపేట: హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి సీతక్క సిఫారసు లేఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత, ఆల య కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్, అర్చకులు కలెక్టర్ దివారకు మంగళవారం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మహే శ్ మాట్లాడుతూ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులపై మంత్రి సీతక్కకు సోమవా రం ఆలయ అర్చకులు నివేదికను అందజేసిన విషయం విధితమే. ఈ మేరకు అభివృద్ధి పనులకు ఎస్టిమేషన్ నివేదిక సిద్ధం చేయాలని దేవాదాయశాఖ డీఈ రమేష్బాబును ఆదేశించారని తెలిపారు. -
గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
కాళేశ్వరం: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. మహదేవపూర్ మండలంలోని గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులకు మొదటి విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 9 గ్రామపంచాయతీల వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీడీఓ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో వార్డు సభ్యుల విధులు, చేయాల్సిన కార్యక్రమాలు, నిధులు తదితర అంశాలపై వివరించారు. తహసీల్దార్ రామారావు, టీఓటీ కుమారస్వామి, మహదేవపూర్ సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్, రాణిబాయిరామారావు, ఆకుతోట సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు వార్డుసభ్యులకు శిక్షణ తరగతులు -
టాలెంట్ టెస్ట్లో విద్యార్థుల ప్రతిభ
మల్హర్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. 12 మండలాలకు సంబంధించి పాఠశాలకు ముగ్గురు చొప్పున 36 మంది 8వ, 9వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తాడిచర్ల ఉన్నత పాఠశాలకు చెందిన శైలాని ప్రథమ, సిరిచందన తృతీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వర్థిని నాలుగో స్థానంలో నిలిచింది. గైడ్ టీచర్స్గా వ్యవహరించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కుమారస్వామి, వెంకటేశ్వర్లులకు, ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
శాసీ్త్రయ దృక్పథంతో కొత్త ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు శాసీ్త్రయ ధృక్పథంతో విషయాలను పరిశీలించి కొత్త ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని సెక్టోరియల్ అధికారి విజయపాల్రెడ్డి కోరారు. జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్లు విజయపాల్రెడ్డి, రమేష్, రాజగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా సైన్స్ అభివృద్ధి చెందుతోందని, సైన్స్ ద్వారా సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. ప్రతీ విద్యార్థి శాసీ్త్రయ దృక్పథంతో విషయాలను పరిశీలించి కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు కొత్త అనుభూతిని కలిగించింద న్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ స్వామి, జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు బిల్ల రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి గండు రాజబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిప్రసన్న పాల్గొన్నారు. -
మూడేళ్లుగా తిరుగుతున్నా..
మంచిర్యాల–విజయవాడ గ్రీన్ిఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా గిద్దెముత్తారం గ్రామంలోని మా ఇంటి నంబర్ 8–28/1, ఇంటి ఆవరణలోని నాలుగు గుంటల ఖాళీ స్థలం తీసుకునేందుకు రెవెన్యూ అఽధికారులు సర్వే చేశారు. రూ.14లక్షల 28వేల 147 పరిహారం మాత్రమే చెల్లిస్తామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పూర్తి పరిహారం చెల్లించలేదు. ఇంటికి పరిహారం రూ. 50లక్షల పరిహారం, నాలుగు గుంటల ఖాళీ స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. మూడేళ్ల నుంచి తగిన పరిహారం కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. -
శంకుస్థాపన సరే.. పనులేవి?
చిట్యాల: చిట్యాల, టేకుమట్ల మండలాల ప్రధాన రహదారిపై మూడు చోట్ల కల్వర్టుల నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. చిట్యాల మండలంలోని నవాబుపేట, సీఆర్పల్లి శివారులోని ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం కోసం ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిసెంబరు 2024లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి 14 నెలలు పూర్తయినా సంబంధిత కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్ సమీపంలో కల్వర్టు పక్కన తాత్కాలిక రోడ్డు కోసం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. ప్రతీ ఏడాది వర్షాకాలంలో గుట్టల ప్రాంతం నుంచి వర్షపునీరు వస్తుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కల్వర్టుల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, సమాచార, పంచాయతీరాజ్, రవాణా, విద్యుత్, ఆర్టీసీ, ట్రెజరీ, పోస్టల్, మున్సిపల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 20 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1,701 మంది బాలురు, 1,843 మంది బాలికలు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్కుమార్, డీఈఓ రాజేందర్, డీఎంహెచ్ఓ మధుసూదన్, డీటీఓ సంధాని, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్క్ అవుట్ పూర్తి చేయాలి.. జిల్లాలో మిగిలిన ఇందిరమ్మ ఇళ్లకు తక్షణమే మార్క్ అవుట్ పూర్తి చేసి, బేస్ లెవెల్ నుంచి రూఫ్ కాంక్రీట్ దశ వరకు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, పీఆర్, మున్సిపల్, ఎంపీడీఓలతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, 2 బీహెచ్కే గృహాల సముదాయాల పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 4,165 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 58 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన 4,107 ఇళ్లలో 898 ఇళ్లు ప్రారంభ దశలో, 582 బేస్ లెవెల్ దశలో, 1,092 రూఫ్ లెవెల్ దశలో, 481 రూఫ్ కాంక్రీట్ దశలో ఉండగా, 1054 ఇళ్లకు మార్క్ అవుట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. డైరీ ఆవిష్కరణ.. జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 సంవత్సరం డైరీ, క్యాలెండర్ను సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీలోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఓ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలు విజయవంతం చేస్తాం.. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. పుష్కర ఏర్పాట్లపై దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 20 సెంటర్లు, 3,544 మంది విద్యార్థులు ఇందిరమ్మ ఇళ్లకు మార్క్ అవుట్ పూర్తి చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ -
రాష్ట్రస్థాయికి ఎంపిక
కాళేశ్వరం: ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయం’ రేటింగ్లో భాగంగా మహదేవపూర్ మండలం సూరారం ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పాఠశాల 86.67శాతం ఫోర్ స్టార్ రేటింగ్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.పద్మ పేర్కొన్నారు. డీఈఓ రాజేందర్ చేతుల మీదుగా సోమవారం భూపాలపల్లిలో శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రం, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి పురుషోత్తంరెడ్డి ప్రాథమిక పాఠశాల సూరారం హెచ్ఎం, ఉపాధ్యాయులు ప్రసన్న, శ్రావణ్, లక్ష్మణ్, స్కావెంజర్ స్వప్నను అభినందించారు. హేమాచలక్షేత్రం అభివృద్ధిపై నివేదికమంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు సోమవారం నివేదికను అందజేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రెవెల్లి మహేశ్ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో సీతక్కను కలిసి ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు. మకర సంక్రాంతి రోజున స్వామివారి వరపూజ మహోత్సవానికి ఆలయానికి వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ఏప్రిల్లో జరగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముందుగా ఆలయంలో భక్తుల సౌకర్యానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రికి వివరించి నివేదికను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణం చేపడితే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే హేమాచలక్షేత్రంలో చేపట్టాల్సిన పనులతో పాటు మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని పూజారులు వివరించారు. మంత్రికి నివేదిక అందజేసిన వారిలో ఆలయ అర్చకులు ఏడునూతుల ఈశ్వర్చంద్ రామానుజం దాస్, అనిపెద్ది నాగరాజీవ్ శర్మ, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ ఉన్నారు. బస్టాండ్ పనులు నాణ్యతతో చేపట్టాలిములుగు: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. బస్టాండ్ నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో వారు మాట్లాడారు. బస్టాండ్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఉండేలా బస్టాండ్ నిర్మాణాన్ని చేపడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్పర్సన్ చంద్రకళ ఆధ్వర్యంలో వైస్చైర్పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, కౌన్సిలర్లు గుంటోజు పావని, నల్లెల్ల స్వాతి, ఎండి,కుతుబుద్దీన్, కెశెట్టి నవీన్, సిలువేరు సాంబయ్య కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాలతో సత్కరించారు. -
సీఎం పర్యటనలతో ప్రజాధనం వృథా
ములుగు: ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్రెడ్డి మూడుసార్లు దేవాదుల ప్రాజెక్టును సందర్శించినా స్థానికులకు ఒరిగిందేమీలేదని, పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధుల కోసమే తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్నారు. రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి సీటు కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్రెడ్డి సీఎం ఎలా అయ్యేవారని విమర్శించారు. తెలంగాణ సాధకుడైన కేసీఆర్ను విమర్శించే అర్హత రేవంత్రెడ్డికి లేదన్నారు. జిల్లాలోని గంగారం, కొత్తగూడెం మండలాలకు పాఖాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు తుపాకుల గూడెంలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కాల్వల ద్వారా సాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాలను రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. సమ్మక్క బ్యారేజీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బైకాని ఓదెలు, కోగిల మహేశ్, పోరిక విజయరాం నాయక్, కుడుముల లక్ష్మినారాయణ, లకావత్ నర్సింహనాయక్, చెన్న విజయ్, ఆకుతోట చంద్రమౌళి, గోనెల భారత్, బైకని సాగర్, అనుముల సురేష్, గండి కుమార్, ముంజాల భిక్షపతి, మాచర్ల ప్రభాకర్, గొర్రె సమ్మయ్య పాల్గొన్నారు.● బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి -
సమస్యల గోడు..
● ఒక్కొక్కరిది.. ఒక్కో సమస్య ● జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులుభూపాలపల్లి అర్బన్: పరిష్కారానికి నోచుకోని భూ సమస్య.. భూములకు అందని నష్టపరిహారం.. భూ నిర్వాసితులకు అందని నష్టపరిహారం.. అందని సన్నధాన్యం బోనస్ డబ్బులు.. ఇలా జిల్లా నలుమూలల నుంచి సోమవారం ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్కు తమ గోడును చెప్పుకుని పరిష్కారం చూపండని వేడుకున్నారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్ రాహుల్శర్మ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. జాప్యం చేయొద్దు.. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.అన్యాయంగా పట్టా చేసుకున్నరు..మహాముత్తారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 468లో 6.17 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా మార్క బాలయ్య, మార్క వెంకటేశ్వర్లు పట్టాదారులుగా చేరారు. 75 ఏళ్ల క్రితం 30కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం మార్క లచ్చయ్య వద్ద నుంచి కొనుగోలు చేశాం. ఇళ్ల స్థలాలుగా భూమి ఉండగా.. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రతీ ఏడాది రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్నారు. మేము కొనుగోలు చేసినట్లు పురోక్తునామా ఉన్నది. కలెక్టర్ స్పందించి పట్టా రద్దు చేయాలి. – బాధితులు, మహాముత్తారంప్రజావాణికి వినతుల వెల్లువ -
అధికారులపై చర్య తీసుకోవాలి..
గణపురం మండలం ధర్మరావుపేట శివారు 318/118, 318/119 సర్వే నంబర్లలో మాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూమి ఓపెన్కాస్టు–3 ప్రాజెక్ట్ కోసం 2021 సర్వే చేసి తీసుకున్నారు. ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. అనేకమార్లు ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. గతేడాది ఏప్రిల్ 23న కూలీ పనికి వెళ్లిన నా భార్య వద్దకు గుర్తు తెలియని వ్యక్తి ఆర్డీఓ కార్యాలయం నుంచి వచ్చి, భూమి పరిహారం కోసం సంతకాలు కావాలని తెల్ల కాగితంపై తీసుకెళ్లారు. అనంతరం తన పేరుపైన 1.30గుంటల భూమి మాత్రమే ఉందంటున్నారు. మిగితా భూమి లేదంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – కట్కూరి రాంరెడ్డి, రామగుండాలపల్లి, కొత్తపల్లిగోరి -
108 ఉద్యోగులకు స్టార్ అవార్డులు
హన్మకొండ అర్బన్/ఎంజీఎం: ఆపద సమయంలో 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మెరుగైన వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడిన హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు 108 సిబ్బందికి 108 సర్వీస్ వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్టార్ అవార్డులు అందించారు. ఐనవోలుకు చెందిన ఈఎంటీ ఏనుగుల రాజు, పరకాల టీం సభ్యులు పాముల రాజు, పుట్ట విజయభాస్కర్, ధర్మసాగర్ మండలానికి చెందిన మాచర్ల వెంకటేశ్, వరంగల్ జిల్లాకు చెందిన ఈఎంటీలు కె.నాగరాజు, శ్యాంసుందర్, పైలట్ వై.రాజన్న, కుమారస్వామి అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా మేనేజర్ గుర్రపు భరత్ కుమార్, భూపాలపల్లి మేనేజర్ రాజు నాయక్, హనుమకొండ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కొరవడిన ప్రోత్సాహం
యువతను సామాజిక చైతన్యం దిశగా నడిపించడంతోపాటు వారిలోని కళను గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన యువజన సర్వీసులు, వ్యవహారాల శాఖ నిద్దరబోతోంది. ఎన్వైకే ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించే కార్యక్రమాలేవీ లేకపోవడంతో ఉత్సాహం నీరుగారుతోంది. పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమల్లోనూ వీరి కృషి ఎంతో ఉండేది. గతంలో సంఘాలుగా ఏర్పడి ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం అలాంటివేవీ కానరావడం లేదు. వలంటీర్లను తొలగించడంతో యువజన సంఘాలన్నీ నిరుపయోగంగా మారాయి. ● యువతలోని శక్తియుక్తులను వెలికితీసి వారిని సంఘటిత పరిచి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడం, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా చూడటం ● వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ● వ్యక్తిత్వ వికాసం పెంపొందించి సమగ్ర పౌరులుగా తీర్చిదిద్దడం ● నాయకత్వ లక్షణాలు పెంపొందించి సంఘ కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించేలా చేయడం ● యువజన సంఘాలు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగానికి, గ్రామ ప్రజల అభ్యున్నతి సాధించడంలో సమన్వయం చేయడం ● వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా తీర్చిదిద్దడంభూపాలపల్లి అర్బన్: ప్రతీ గ్రామంలో దేశ నాయకుల పేరిట యువజన సంఘాల బోర్డులు గతంలో కనిపించేవి. జిల్లాలోని 12 మండలాల్లో ఒక్క యువజన సంఘం కూడా నమోదైలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వీరి సేవలు ప్రస్తుతం కనిపించడం లేదు. గతంలో రక్తదానం, మొక్కల పంపిణీ, పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత, గ్రామాలకు రోడ్లు వేసుకోవడం, గుంతలు పూడ్చడం, ఎయిడ్స్పై అవగాహన, వ్యక్తిత్వ వికాస శిబిరాలు నిర్వహించడం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం.. తదితర కార్యక్రమాలుండేవి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. మత్తుకు బానిసలుగా.. జిల్లాలోని మెజార్టీ యువకులు చెడు వ్యసనాలకు బానిస అయి మత్తులో కూరుకుపోయారు. జిల్లాలో ఇటీవల గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిలో చాలామంది యువకులే కావడం ఆందోళన కలిగించే విషయం. వారిలో అంతర్లీనమైన ప్రతిభను వెలికితీసేందుకు ఎలాంటి కార్యక్రమాలూ జరగడం లేదు. అక్కడక్కడా కొందరు తలా కొంత పోగు చేసుకొని క్రీడల్లో పాల్గొంటూ బహుమతుల కోసం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాకు ప్రత్యేకంగా ఎన్వైకే కార్యాలయం ఏర్పాటుతోనే మేలు కలుగుతుంది. జిల్లాలో కనిపించని యువజన సంఘాలు వ్యసనాలకు బానిసలవుతున్న యువకులు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం ఇప్పటి వరకు ఒక్క సంఘం రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి కానరాని సేవలు -
ప్రతీ ఎకరాకు నీరు
ములుగు: రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్లోగా పూర్తిచేసి 6 లక్షల ఎకరాల ఆయట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ మోటార్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటెక్వెల్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.15,500 కోట్లు ఖర్చు చేసినా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తాం.. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మంత్రివర్గంలో ఆమోదించి నిధులు సమకూర్చి పూర్తిచేస్తామని సీఎం అన్నారు. నిర్మాణం పూర్తయ్యేందుకు నిధుల కొరత, భూసేకరణ సమస్య ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రూ. 8 లక్షల 11 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంపై అప్పుల భారం ఉందని వెల్లడించారు. గోదావరి, కృష్ణా జలాలపై అపోహలు వద్దని, తెలంగాణకు రావాల్సిన వాటాను, నీటి హక్కులపై ప్రభుత్వం తరఫున పూర్తిగా పోరాడి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ పౌరుడికి తాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. నీళ్లు, నిధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్ల ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని విమర్శించారు. జూన్ 2 వరకు భూసేకరణ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల ప్రాజెక్టులో సొరంగ మార్గంతోపాటు పంపుహౌస్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ జూన్ 2 వరకు పూర్తిచేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. గోదావరి నదిలో చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జలాశయాల్లో తెలంగాణ వాటా పరిరక్షణకు చర్యలు మొదలయ్యాయని, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పోరాటం చేస్తున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా పాల్గొన్నారు.రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి దేవాదులకు ఇప్పటి వరకు రూ.15,500 కోట్లు ఖర్చు గోదావరి, కృష్ణా జలాల వాటా, నీటి హక్కులు పూర్తిగా కాపాడుదాం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుపాకుల గూడెంలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల ఇంటెక్వెల్ పరిశీలన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఎత్తిపోయలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షా పది వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా రెండేళ్లలో చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని సీఎం రేవంత్రెడ్డి రు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గోదావరి నది జలా లపై ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నది జలాల కోసం పక్క రాష్ట్రాలతోపాటు అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. కష్టపడి ప్రాజెక్టులను నిర్మించుకొని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకుందామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మంత్రివర్గంతో సమీక్షించనున్నట్లు సీఎం తెలిపారు. మేడారం జాతరను మహా కుంభమేళాగా జరిపించామని, మేడారంలో శాశ్వత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మల్హర్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని తాడిచర్ల రైతు వేదికలో 99 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో ఎంపికై న వారికి పథకం మంజూరు పత్రాలు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బండి స్వామి, గడ్డం క్రాంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ఉప సర్పంచ్ బబ్బలి రాజు, మాజీ ఎంపీపీ మల్హల్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి -
మేడారంలో భక్తుల రద్దీ
ఎస్ఎస్తాడ్వాయి: మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన ఆర్చీ ద్వారం నుంచి భక్తులను పోలీసులు క్రమపద్ధతిలో దర్శనాలకు పంపించారు. నార్లాపూర్ పోలీస్స్టేషన్ ఎస్సై కమలాకర్ భక్తుల రద్దీని పర్యవేక్షించి ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మేడారం కార్యనిర్వహణాధికారి వీరస్వామి కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎత్తు బంగారం అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సంప్రదాయంగా పూజారులు ఆయనకు డోలివాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయన వెంట సూపరింటెండెంట్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు, సిబ్బంది ఉన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు వనదేవతలకు మొక్కులు -
బెల్టుషాపులకే విక్రయాలు
● సిండికేటుగా ఏర్పడిన మద్యం వ్యాపారులు ● ‘బెల్టు’ల కోసం మండలానికి ఒక ప్రత్యేక షాపు ● ఆ షాపుల్లో రిటైల్ విక్రయాలు బంద్ ● పట్టించుకోని ఎకై ్సజ్శాఖ అధికారులు భూపాలపల్లి: మద్యం విక్రయాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. తమకేమీ తెలియదన్నట్లుగా ఎకై ్సజ్శాఖ కళ్లు మూసుకుంటుండగా, మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సిండికేటుగా ఏర్పడి మండలంలోని ఒక షాపులో రిటైల్ విక్రయాలు జరుపకుండా బెల్టుషాపులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉండగా రెండు ఎకై ్సజ్ సర్కిల్లు ఉన్నాయి. కాటారం సర్కిల్ పరిధిలో 11, భూపాలపల్లి సర్కిల్లో 19 మద్యంషాపులు ఉన్నాయి. ఈ రెండు సర్కిల్ల పరిధిలోని మ ద్యం వ్యాపారులు తమ దందాను ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. మండలం యూనిట్గా సిండికేటుగా ఏర్పడిన వ్యాపారులు ఒక షాపును పూర్తి గా బెల్టుషాపులకే కేటాయించారు. రేగొండ, చి ట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్.. ఇలా ప్రతీ మండలంలో ఒక షాపులో బెల్టుషాపులకు మాత్రమే మద్యం విక్రయిస్తారు. ఆయా షాపుల్లో రిటైల్ విక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారు. బెల్టుషాపుల కోసం కేటాయించిన షాపు నుంచి ప్రతీరోజు ప్రత్యేక వాహనాల్లో(ట్రాలీలు) గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం రవాణా చేస్తున్నారు. ఒక్కో షాపు నుంచి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మద్యం సరఫరా చేస్తున్నారు. అంతేకాక బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. ఒక్కో క్వార్టర్, బీరుపై రూ.20 అదనంగా తీసుకొని డెలివరీ చేస్తున్నారు. బెల్టుషాపుల యజమానులు మరో రూ. 20 పెంచి విక్రయిస్తుండటంతో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సిండికేటుగా ఏర్పడిన వ్యాపారులు ప్రత్యేక తనిఖీ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో టీంలో పదిమంది యువకులు ఉంటారు. వీరంతా వారి పరిధిలోని మండలంలోని బెల్టుషాపుల్లో ప్రతీరోజు తనిఖీలు చేపడుతారు. సిండికేటుగా ఏర్పడిన షాపు నుంచి మద్యం కొనుగోలు చేస్తే చూసి వదిలేస్తారు. లేక ఏదైనా మద్యంషాపు నుంచి ఎమ్మార్పీ ధరకు కొనుగోలు చేసినట్లుగా కనిపిస్తే ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఎకై ్సజ్శాఖ అధికారులకు అప్పగిస్తారు. వ్యాపారుల సూచనల మేరకు అధికారులు కేసులు నమోదు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి, బెల్టుషాపులకు మాత్రమే మద్యం విక్రయిస్తున్న షాపుల వద్ద నిబంధనలు కానరావడం లేదు. షాపు ముందు గెజిట్ నంబర్, 18 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మబడదు, ధరల పట్టిక లాంటివి, పర్మిట్ రూంకు సంబంధించిన వివరాలు ఏమీ కనబడవు. ఆయా షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయకుండా చేశారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూతవేటు దూరంలో ఉన్న పోలీసులు, నిత్యం పర్యవేక్షించే ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెల భారీ మొత్తంలో మామూళ్లు అందుతుండటం మూలంగానే ‘బెల్టు’ దందాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. -
రజకులపై దాడి అమానుషం
భూపాలపల్లి రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మండలంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజకులపై జరిగిన దాడి అమానుషమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి పాల్గొన్నారు. కోటగుళ్లను సందర్శించిన ఇంగ్లండ్ దేశస్తులు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను ఆదివారం ఇంగ్లండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరి సందర్శించారు. రామప్ప గైడ్ గోరంట్ల విజయ్కుమార్ ఆలయ విశిష్టతను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ఆలయ శిల్పసంపద అద్భుతంగా ఉందన్నారు. వారి కెమెరాలలో శిల్ప సంపదను బంధించుకున్నారు. మెడల్స్ సాధించడంపై హర్షం మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెడల్స్ సాధించడం పట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య హర్షం వ్యక్తంచేశారు. హనుమకొండ జవహర్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16 షాట్ఫుట్లో జిల్లాకు చెందిన సమన్విత గోల్డ్ మెడల్, అన్విత 18 లాంగ్జంప్లో సిల్వర్ మెడల్, పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు వారు ఆదివారం మెమొంటోలు, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. స్టేట్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి, డీవైఎస్ అశోక్, క్రీడాభిమానులు నవీన్రావు, రామ్నారాయణ, మధుకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలిఎస్ఎస్తాడ్వాయి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం యాపలగడ్డలో మార్చి 4నుంచి 7వ తేదీ వరకు అర్రెం వంశస్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పగిడిద్దరాజు జాతరను విజయవంతం చేయాలని మేడారం జాతర మాజీ చైర్మన్ అర్రెం లచ్చుపటేల్ కోరారు. మేడారం జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన స్వామి, సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అర్రెం వంశీయులతో కలిసి పగిడిద్దరాజు జాతర పోస్టర్ను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్కను, పలువురు ప్రజాప్రతినిధులను జాతరకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. -
పకడ్బందీ ఏర్పాట్లు
25నుంచి ఇంటర్ పరీక్షలు ● జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు ● 3,778వేల మంది విద్యార్థులు భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉండగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. 34 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 1,842, ద్వితీయ సంవత్సరంలో 1,936 మొత్తంగా 3,778మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్, 6 మోడల్ జూనియర్ కళాశాలలు, 4 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 2 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, 10 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 మైనారిటీ, 4 బీసీ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. 8 పరీక్ష కేంద్రాలు జిల్లాలో 34 జూనియర్ కళాశాలలు ఉండగా.. ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ప్రథమ సంవత్సరం పరీక్షలు, 26న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. విద్యార్థులు తమ హాల్టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకొని నేరుగా పరీక్ష సెంటర్కు రావచ్చు. విద్యార్థులకు హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్ మినహాయించి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్ అనుమతి లేదు. సిబ్బంది నియామకం పరీక్షల నిర్వహణ కోసం దాదాపు 90మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 8 పరీక్ష కేంద్రాల్లో 16 మంది సీఎస్, డీఓలు, మాస్కాపియింగ్, మాల్ప్రాక్టీస్ జరగకుండా చూసేందుకు ప్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 143 సెక్షన్ విధించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గొడవలు, జనసందోహం లేకుండా చూసేందుకు పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఉదయం, మధ్యాహ్నం ఐదు రూట్లలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బొర్లగుడెం, ఆజాంనగర్ నుంచి భూపాలపల్లికి, గంగారం నుంచి తాడిచర్ల వరకు, కష్ణారావుపేట, సర్వాయిపేట నుంచి మహదేవపూర్ వరకు వేర్వేరుగా, దామెరకుంట నుంచి కాటారం వరకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అఽధికారులు సర్వీసులను సిద్ధం చేసినట్లు తెలిపారు. పకడ్బందీ చర్యలు..జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షల్లో మాస్ కాపియింగ్, మాల్ప్రాక్టీస్ను ప్రోత్సహించవద్దని సీఎస్, డీఓ, సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. విద్యార్థులు పరీక్ష నిబంధనల ప్రకారం హాజరుకావాలి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. – వెంకన్న, ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారిపరీక్ష కేంద్రాలివే.. భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల తేజస్విని గాంధీ జూనియర్ కళాశాల భూపాలపల్లి చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల చిట్యాల మోడల్ జూనియర్ కళాశాల కాటారం ప్రభుత్వ జూనియర్ కళాశాల కాటారం మోడల్ జూనియర్ కళాశాల మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్హర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల -
సంగీతం శ్వాసకు వ్యాయామం
నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందుతున్నా. సంగీతం శ్వాసకు వ్యాయామం వంటిది. ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం సంగీతం క్లాస్కు వెళ్తాను. సంగీతం మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. పనిఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో కుటుంబ బంధాలు మెరుగుపడుతాయి. విశ్వాసం, శాంతి పెరుగుతుంది. – డాక్టర్ జ్యోతి హరికీర్తి, మెడికల్ ఆఫీసర్ అనంతలక్ష్మి వైద్య కళాశాల, వరంగల్ అలసటను పారదోలే మార్గం.. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అలసట నివారణకు సంగీతం సహాయపడుతుంది. ప్రశాంత సంగీతం కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆధ్మాత్మికత, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. కచేరీలు, ప్రదర్శనల ద్వారా సమాజం పరిచయమవుతుంది. – గాట్ల భార్గవి, మెడికో, కాకతీయ వైద్య కళాశాల ● -
సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ
● ఛైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డి ● మూడు జిల్లాల అధికారులతో సమీక్ష● సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్యహన్మకొండ అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డి అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ బృందం శుక్రవారం పర్యటనలో గుర్తించిన అంశాలను ప్రస్తావించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో లోపాలున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ, వరంగల్ డీఈఓలను ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, ఇమ్యునైజేషన్ స్థితిగతులపై పూర్తి వివరాలు సమర్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యకు సూచించారు. బాల్యవివాహాల నిర్మూలన, బాల్యవివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం ‘స్టూడెంట్ వెల్నెస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందనగౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేశ్, ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి, డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేశ్, ఎస్.ప్రవీణ్కుమార్, ఉమ, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, జి.తిరుపతి, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రమాదంలో సింగరేణి సంస్థ భూపాలపల్లి అర్బన్: ఉత్తర తెలంగాణకు కొంగుబంగారంగా పేరొందిన సింగరేణి సంస్థ కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరెటి రాజన్న, నాయకులు సమ్ము రాజయ్య, దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్రెడ్డి, జైపాల్సింగ్, బేగ్, మాదరబోయిన వెంకటేష్, నామల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, బీరన్న పాల్గొన్నారు. -
హాట్టాపిక్గా దేవాదుల ప్రాజెక్టు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి వరంగల్ ఆయకట్టుకు కీలకమైన ప్రాజెక్టులో దేవాదుల పంపుహౌస్ మోటార్లు పనిచేయకపోవడం వివాదాస్పదంగా మారింది. గత యాసంగి సీజన్లో మోటార్లు మొరాయించాయి. ఫలితంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక ఎండిపోయాయని రైతుల పక్షాన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దేవన్నపేట పంపుహౌస్ను హుటాహుటిన సందర్శించారు. మోటార్లు రన్ అయ్యే వరకు అక్కడే ఉంటామని ప్రకటించినా.. ఆ వెంటనే మోటార్లు ఆన్ కాలేదు. మోటార్లలో సాంకేతిక కారణాలు తలెత్తాయన్న అధికారులు.. ఆ తర్వాత రెండింటిని ఆన్చేయగా యాసంగి సీజన్ దాటే సమయానికి నీళ్లందాయి. ఈ సీజన్లోనూ దేవన్నపేట పంపుహౌస్లో మోటార్లు ఆన్ చేయకపోవడంతో శుక్రవారం సందర్శించిన మాజీ మంత్రి హరీశ్రావు బృందం... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి, గోదావరిలో సరిపడా నీళ్లున్నా దేవాదుల ఎత్తిపోతల ద్వారా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే దేవన్నపేట పంపుహౌస్లో నీటిపారుదలశాఖ అధికారులు శనివారం మోటార్ను ఆన్చేశారు. సాగునీరు అందించేందుకు పంపు ఆన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇదీ సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్... ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2.15 గంటలకు మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చేరుకుంటారు. 2.45 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటలకు అక్కడినుంచి బయలుదేరి దేవాదుల ప్రాజెక్టుకు 3.30 గంటలకు చేరుకుంటారు. 5 గంటల వరకు ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహిస్తారు. ప్రాజెక్టు పంపుహౌస్లకు నేతల తాకిడి నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్, మాజీ ఎమ్మెల్యేల బృందం నేడు సీఎం రేవంత్రెడ్డి రాక.. గంగారం వద్ద పనుల పరిశీలన అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష ఎట్టకేలకు ఒక మోటార్ను ఆన్ చేసిన అధికారులు -
26న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
భూపాలపల్లి రూరల్: ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ హరికృష్ణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బంజారా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు గురుకుల ప్రవేశ పరీక్ష భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి గురుకులాల 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు(ఆదివారం) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలికలు), ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలురు) కాటారం, మోడల్ స్కూల్ గంగారం క్రాస్, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల చిట్యాల, మోడల్ స్కూల్ గణపురం, మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల గాంధీనగర్, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మొగుళ్లపల్లిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,667 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. బైక్ను ఢీకొట్టిన ఇసుక లారీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని నర్సరీ వద్ద జాతీయ రహదారిపై బైక్ను ఇసుక లారీ ఢీకొట్టిన ఘటనలో అన్నదమ్ములు గాయాలపాయ్యారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా చంద్రాపూర్కు చెందిన అన్నదమ్ములు ఉజ్వల్, ప్రజ్వల్ ద్విచక్రవాహనంపై శనివారం మేడారం బయలుదేరారు. నర్సరీ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ఉజ్వల్కు మొహం, పంటికి, ప్రజ్వల్కు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. లారీతో సహా డ్రైవర్ పరారయ్యారు. క్షతగాత్రులను స్థానికులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పోలీసులు ఘటనా స్థఽలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రామప్పను సందర్శించిన ఆర్టీఐ కమిషనర్ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
ఇష్టంగా నేర్చుకోవాలి..
యువతకు, పెద్దవారికి సంగీతం, నృత్య కళలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలు చేస్తూ.. సాయంత్రం వేళలో హాజరవుతున్నారు. కళల్లో రాణించాలంటే ఇష్టంగా నేర్చుకోవాలి. మా నాన్న నౌడ్గడ హనుమంతరావు ఇక్కడ అధ్యాపకులుగా బోధించారు. నేను ఇక్కడే వయోలిన్ వాయిద్యం కోర్సులో శిక్షణ పొందాను. ప్రస్తుతం నేను కళాశాలకు 11వ ప్రిన్సిపాల్ని కావడం సంతోషంగా అనిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది విదేశాల్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. మరికొందరు గురుకులాల్లో ఉద్యోగాలు పొందారు. – నౌడ్గడ సుధీర్కుమార్, విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ -
ఇన్టెక్ వెల్కు నేడు సీఎం
నేడు (ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ఇన్టెక్ వెల్ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్ వెల్ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. -
న్యాయస్థానంలో అవినీతి జలగలు!
భూపాలపల్లి అర్బన్: కొంతమంది లంచగొండి ఉద్యోగులతో న్యాయస్థానానికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన కోర్టులో శుక్రవారం జరిగిన ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. కొంతమంది అవినీతిపరులు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కోర్టుకు వచ్చిన బాధితుల నుంచి మధ్యవర్తుల ద్వారా అందిన వరకు బలవంతంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.వేలల్లో వసూళ్లు.. జిల్లా కేంద్రంలోని కోర్టులకు హాజరయ్యే వారినుంచి ఒక్కోపనికి ఒక్కోవిధంగా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉన్నతాధికారి బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా సివిల్ కేసులకు సంబంధించిన ఫైళ్ల నుంచి అధికంగా వేల రూ పాయలు చేతులు మారుతుంటాయి. డబ్బులు కిందిస్థాయి సిబ్బందితో తీసుకోవడమే కాకుండా నేరుగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఏసీబీకి పట్టుబడిన ముగ్గురు ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బాధితుడి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటున్న ఇన్చార్జ్ ఏఓగా పని చేస్తున్న స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయిచరణ్, ఆఫీస్ సబార్డినేట్లు పున్నం రజిత, కొమ్ము సునీతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. రెవెన్యూ శాఖలోనే అధికంగా.. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అవినీతి ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరంలో చిట్యాల తహసీల్దార్, వీఆర్ఓ, 2018లో మహదేవపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, వీఆర్ఏ భర్త, అదే ఏడాది చిట్యాల డిప్యూటీ తహసీల్దార్, 2019లో కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సీీసీ, 2021లో భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్, సర్వేయర్, టేకుమట్ల వీఆర్ఓ, 2022 జూలై 22న కాటారం తహసీల్దార్, భూపాలపల్లి ఎస్సై, 2023లో రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్న ఏఎస్ఓ, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్, 2024లో పంచాయతీ రాజ్లో ఈఈ, ఏటీఓ, సీనియర్ అసిస్టెంట్ ఒకేసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం జిల్లా కోర్టులో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.జిల్లా కోర్టులో ఆకస్మికంగా ఏసీబీ దాడులు జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు బాధితులకు ధైర్యం కల్పించి ప్రత్యేక దృష్టి సారిస్తే మరికొంత మంది పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలను సైతం ఓ అధికారి రూ.2 లక్షల చొప్పున అమ్ముకొని పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. లంచం తీసుకుంటూ చిక్కిన ముగ్గురు ఉద్యోగులు గతంలో అధికంగా రెవెన్యూ శాఖలో దాడులు -
ఘనంగా ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు
రేగొండ: మండలంలోని కొడవటంచ ఆలయంలో స్వామి వారికి ధాన్యాధివాసం ఫల, పుష్పశయ్యాధివాసములు, న్యాసవిధి కార్యక్రమాలను శుక్రవారం వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ధ్వజస్తంభం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పునఃప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యేలు విజయరమణారావు, రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. నేడు స్పీకర్ రాక.. కొడవటంచ ఆలయంలో నేడు (శనివారం) శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ ఆండాల్ ఆళ్వార్ల ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రానున్నట్లు ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు తెలిపారు. -
తిరిగి పంపించారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇన్చార్జ్ ఎఫ్ఏఓగా బదిలీపై వచ్చిన మధుసూదన్ను కలెక్టర్ రాహుల్శర్మ తిరిగి పంపించారు. ‘అవినీతి అధికారికి అందలం’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయాలని మధుసూదన్ను కలెక్టర్ ఆదేశించారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వానికి సరెండర్ అయిన ఎఫ్ఏఓను జిల్లాకు బదిలీ చేయడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనిని జిల్లాలో జాయిన్ చేసుకోకుండా తిరిగి పంపించాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. దీంతో డీఈఓ రాజేందర్ సదరు ఎఫ్ఏఓను రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఎస్ఓ, అకౌంటెంట్స్, పలువురు అధికారులు, సిబ్బంది అనందం వ్యక్తంచేశారు. కలెక్టర్ ఇదే విధంగా స్పందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఎఫ్ఏఓ వ్యవహారంపై కలెక్టర్ మండిపాటు -
మంచి మార్కుల సాధనకు కృషి
ప్రతీ విద్యార్థిపైన ప్రత్యేకంగా శ్రద్ధపెడుతున్నాం. మంచి మార్కుల సాధనకు ఉపాధ్యాయులం కృషి చేస్తున్నాం. వెనుబడిన విద్యార్థులపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయో గమనించి ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహిస్తున్నాం. – దొనికల రాజేందర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్సైన్స్, కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్ సబ్జెక్టుల వారీగా ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ చూపుతున్నాం. మంచి మార్కులే లక్ష్యంగా సెలబస్ పూర్తి చేసి రివిజన్ కంప్లీట్ చేశాం. ఇంగ్లిష్ సబ్జెక్టులో మంచి స్కోరింగ్ చేయడానికి విద్యార్థులకు తగు సూచనలు ఇస్తున్నాం. – మియాపురం జగన్నాఽథం, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, జెడ్పీహెచ్ఎస్ వెలిశాల నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సిలబస్ పూర్తిచేసి ఉపాధ్యాయులు రివిజన్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేశారు. ప్రతీ సబ్జెక్టు వారీగా ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి మంచి మార్కులు సాధిస్తారు. – రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు
భూపాలపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ, టీజీఎంఐడీసీ అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన సీలింగ్, ఏసీ ఫిట్టింగ్, విద్యుత్ సరఫరా, కంప్యూటర్ మార్పులు తదితర పనులను పూర్తిచేసి నిర్ణీత గడువులోగా ఏర్పాటు చేయాలన్నారు. సిటీ స్కాన్ యంత్రం ప్రారంభమైనప్పటికీ టెక్నీషియన్ కొరత కారణంగా సేవలు అందుబాటులోకి రాలేదని, వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా సిటీ స్కాన్ టెక్నీషియన్ నియామకం చేపట్టి త్వరితగతిన సేవలను ప్రారంభించాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఖాళీగా ఉన్న డైస్ భవనంలో ఆప్తమాలజీ, సైకియాట్రీ, ఫిజియోథెరపీ, డెంటల్ ఓపీ సేవలు ప్రారంభించి రోగులకు సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్ పోస్టర్ ఆవిష్కరణ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ పోస్టర్ను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ శుక్రవారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సేవకు అంకితభావంతో ఉన్న యువతకు భారత వాయుసేనలో చేరడం ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన యువత ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అధిక సంఖ్యలో వాయుసేనలో చేరి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎల్.మహిపాల్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. భూసేకరణ వేగిరం చేయాలి.. జిల్లాలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులకు భూ సేకరణపై రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లా కు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక అభివద్ధికి దోహదపడుతుందని తెలి పారు. భూసేకరణ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా, భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, నేషనల్ హైవే, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు భూ సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూ యజ మానులతో చర్చలు జరిపి వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూ సేకరణ వేగిరం కలెక్టర్ రాహుల్ శర్మ -
పరీక్షలకు సన్నద్ధం
కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులుకాళేశ్వరం: పదో తరగతి బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక నజర్ పెట్టారు. టాప్ మార్కులే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే 100రోజుల కార్యక్రమంలో భాగంగా సిలబస్ పూర్తిచేసి, రివిజన్ చేపట్టారు. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేక సమయం కేటాయించి ముఖ్యమైన ప్రశ్నలు, బిట్ బ్యాంక్, మోడల్ పేపర్లపై సాధన చేయిస్తున్నారు. గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ ముఖ్యాంశాలను గుర్తించి విద్యార్థులకు వివరంగా బోధిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అదనపు క్లాసులు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గంటపాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల హాజరు, చదువు పురోగతిపై చర్చిస్తున్నారు. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఎక్కువమంది ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఒక దఫా ప్రీ పైనల్ పరీక్షలు పూర్తి చేశారు. మళ్లీ రెండోదఫా మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సంవత్సరం ఉత్తీర్ణత కన్నా ఈసారి మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సమయపాలన, పునరావృతం, ఆత్మవిశ్వాసం పెంపుపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి మెరుగైన ఫలితాలు సాధించి ఆదర్శంగా జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని ఉపాధ్యాయులు సంకల్పిస్తున్నారు. జిల్లాలో 122 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,548 మంది పదో తరగతి విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనున్నారు. ఉదయం, సాయంత్రం గంటపాటు నిర్వహణ మార్చి 14 నుంచి పరీక్షలు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు -
కోటగుళ్ల సందర్శన
గణపురం: కాకతీయుల కళా క్షేత్రం గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను శుక్రవారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు బుర్ర నవీన్కుమార్ సందర్శించారు. ఆయనకు అర్చకుడు నాగరాజు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా సంక్షేమాధికారి జి.మల్లిశ్వరి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ అనిల్చందర్ రావు, డీవీఏహెచ్ఓ ఎ.కుమారస్వామి, గణపురం–2 ఎస్ఐ అమూల్య ఉన్నారు. కమిషన్ మెంబర్ పర్యటన భూపాలపల్లి రూరల్: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ బొర్ర నవీన్ కుమార్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. భూపాలపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల, అంగన్వాడీ సెంటర్, మైనార్టీ బాలుర పాఠశాల, ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, చైల్డ్ కేర్ ఇన్స్ట్యూషన్స్ కాటారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాలల భవిష్యత్, హక్కుల కోసం ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ అనిల్ చందర్రావు, డీఎంహెచ్ఓ మధుసూదన్, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటరత్నం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా, వెటర్నరీ డాక్టర్ కుమారస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి పాల్గొన్నారు. మార్చి 5న జాబ్మేళా ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో మార్చి 5న హనుమకొండలోని గిరిజన భవన్లో జాబ్మేళాను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివిన నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు. గిరిజన నిరుద్యోగులు మార్చి 5న ఉదయం 10 గంటలకు హనుమకొండ గిరిజన భవన్కు బయోడెటా, సర్టిఫికెట్స్ను నేరుగా తీసుకొని హాజరు కావాలని కోరారు. మేడారం జాతరపై పుస్తకం ఆవిష్కరణములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రచురించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో అరుదైన చాయాచిత్రాలను సంకలం చేసి పుస్తకంగా రూపొందించిన ప్రముఖ చిత్ర నిర్మాత నర్సింగరావు, ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీపీ పాపారావు, రిటైర్డ్ ఎన్ఐటీ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ రతన్ జె పూలెలను మంత్రి ప్రశంసించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
మల్హర్ (మహాముత్తారం): పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు, ఫిర్యాదుదారులకు భరోసా, నమ్ముకాన్ని కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మండలంలోని మహాముత్తారం (అడవి ముత్తారం) పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ఉండాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠ పెరిగేలా పనిచేయాలని సూచించారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతీ ఫిర్యాదుపై స్పందించి ప్రాథమిక విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. మధ్యవర్తులకు తావు కల్పించకూడదని సిబ్బందికి తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం అయినందున సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
అందలం
అవినీతి అధికారికి హనుమకొండ జిల్లాలో ప్రభుత్వానికి సరెండర్ ● ఇన్చార్జ్గా పనిచేసిన భూపాలపల్లి జిల్లాలో సైతం అనేక ఫిర్యాదులు ● పైరవీతో పది రోజుల్లోనే భూపాలపల్లికి రీపోస్టింగ్ ● కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్న ఉద్యోగులుభూపాలపల్లి అర్బన్: హనుమకొండ డీఈఓ కార్యాలయం సమగ్ర శిక్షలో ఫైనాన్స్, అకౌంట్స్ ఆఫీసర్గా (ఎఫ్ఏఓ), భూపాలపల్లి డీఈఓ కార్యాలయ ఇన్చార్జ్ ఎఫ్ఏఓగా డిప్యుటేషన్పై(ఫారిన్ సర్వీస్) పనిచేస్తున్న అధికారి(జేఏఓ)ని పలు అవినీతి ఆరోపణలతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ /సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్కు సరెండర్ చేస్తూ హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకుండా తిరిగి జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ట్రెజరీశాఖకు జూనియర్ అకౌంట్స్ అధికారి (జేఏఓ) డిప్యుటేషన్పై విద్యాశాఖలో అడుగుపెట్టి కిందిస్థాయి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఏఐ పాఠాలు..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాఠాలు చెబుతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 5 పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్, ఏఐ పరిజ్ఞానాన్ని అలవాటు చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 317 ప్రాథమిక, 44 ప్రాథ మికోన్నత పాఠశాలలు ఉండగా సుమారు 2 వేల మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులు ఎవరిపైనా ఆధారపడకుండా.. ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) పథకానికి 28 రకాల సాంకేతిక అంశాలను జోడించారు. 3, 4, 5వ తరగతుల విద్యార్థులను ప్రారంభ పరీక్ష ఆధారంగా ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారు. విద్యార్థులు ఎవరిపై ఆధారపడకుండా తమ స్థాయికి తగ్గట్టుగా డిజిటల్ సాధనాల ద్వారా సొంతంగా నేర్చుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి దశలో కంప్యూటర్లు, ట్యాబులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యం కల్పించారు. ఇక చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ ఎంఎల్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వ విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపికై న పాఠశాలలు ఇవే.. భూపాలపల్లి మండలంలోని కమలాపూర్, గుర్రంపేట, కాటారం మండలంలోని కాటారం, చింతకాని, మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి ఏఐ పాఠాలు నేర్పించనున్నారు. పేద విద్యార్థులకు ప్రయోజనం గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఏఐ పాఠాలు వరంగా మారనున్నాయి. ధనిక కుటుంబాల్లో విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో గ్రామీణ స్థాయిలోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు కంప్యూటర్, ఏఐ పరిజ్ఞానంపై అభ్యసించడం వలన భవిష్యత్లో ఉన్నత విద్యాభ్యాసాలకు ఉపయోగపడుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినట్లు ప్రభుత్వం ఏఐ బోధన ప్రవేశ పెట్టింది. చదువులో వెనుకబడిన పిల్లలు సాధారణ తరగతుల్లో ప్రశ్నలు అడగడానికి ఇబ్బంది పడతారు. ఎక్స్ప్రెస్ ఎంఎల్ వంటి డిజిటల్ సాధనాలతో వేగంగా నేర్చుకుంటున్నారు. – పింగిలి విజయపాల్రెడ్డి, మానిటరింగ్ ఆఫీసర్●ఏఐ బోధన విద్యార్థులకు భారంగా కాకుండా ఆట పాటల మధ్య సాగుతోంది. గణితంలో ఆరోహణ, అవరోహణ క్రమాలు, పజిల్స్ పూర్తిచేయడం, వినూత్న డిజైన్ల రూపకల్పన ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతోంది. ఆంగ్లంలో మిస్సింగ్ లెటర్స్ గుర్తించడం, తెలుగులో పదాల స్పష్టమైన ఉచ్ఛరణ వంటి కృత్యాలను డిజిటల్ పద్ధతిలో నేర్పిస్తున్నారు. ప్రాథమికస్థాయి నుంచే సాంకేతికతపై అవగాహన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం -
పుష్కరఘాట్ల నిర్మాణానికి చర్యలు
ఏటూరునాగారం: వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పుష్కరఘాట్లు, పార్కింగ్ స్థలాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ముళ్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లను ఆర్డీఓ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ముళ్లకట్ట, రామన్నగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎక్కడ అయితే గోదావరి లోతు తక్కువగా ఉంటుందో అక్కడ ఘాట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఘాట్ సమీపంలో గోదావరి లోతు 20 ఫీట్లు ఉండగా ఆ లోతు మరింత తగ్గించి భక్తులు పుణ్యస్నానాలను ఆచరించే విధంగా చూడాలని సూచించారు. ఘాట్కు వచ్చే వాహనాల మళ్లింపు, వన్ వే వంటి విషయాలపై సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సీఐ శ్రీనివాస్ పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకలు , పార్కింగ్ విషయాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. గ్రామంలోని ప్రజలు వారి అభిప్రాయాలను తీసుకొని గతంలో దానికంటే భిన్నంగా సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీనిపై స్థానికులు అధికారులకు సహకరించి పుష్కరాలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. -
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
ములుగు రూరల్: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్గౌస్పల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆరె కులస్తులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పసుల కార్తీక్ మాట్లాడుతూ శివాజీ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘు, సంఘం నాయకులు తిప్పారపు కిషన్రావు, యువరాజు, కుడుతల రమేష్, సుధాకర్, ఆగయ్య, వంశీ, శశీ, రఘు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారికి గురువారం వేదుమ ఫ్యాబ్రిక్ హౌజ్ తయారుచేసిన కస్టమైజ్డ్ ఆర్ట్ డిజైన్ చీరను బహూకరించారు. చీరపై హ్యాండ్ ఆర్ట్తో అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా ప్రతిబింబించారు. -
ఆలయ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: కొడవటంచ ఆలయ అభివృద్ధి కోసం నూతనంగా ఏర్పాటైన ఉత్సవ కమిటీ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మండలంలోని కొడవటంచ ఆలయ ప్రాంగణంలో 14 మంది ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ చైర్మన్గా నాయినేని సంపత్రావును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నూతన కమిటీ కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రముఖుల హాజరు.. కొడవటంచ ఆలయంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వేద పండితులు ప్రతిష్టాయాగారంభం, జలధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఉమ్మడి వరంగల్ మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ఆలయ ఈఓ మహేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. -
రామప్పను సందర్శించిన అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 41 మంది అటవీశాఖ అధికారులు డీసీఎఫ్ఓ గంగారెడ్డి ఆధ్వర్యంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువుతో పాటు పాలంపేట గ్రామ శివారులోని కేన్ మొక్కలను సందర్శించారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: వచ్చే విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఎంపికకు ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఇందిర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత పాఠశాల నుంచి 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్ ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు ఆంగ్ల మాధ్యమ బోధన విడిగా వసతి గృహం, మౌలిక వసతులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్లు, అర్హత గల అధ్యాపకులు కలిగి ఉండాలన్నారు. గడిచిన ఐదేళ్లలో పదో తరగతిలో 90శాతం ఉత్తీర్ణత, 50శాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. మార్చి 25వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు. నష్ట పరిహారం చెల్లించాలి మల్హర్(కాటారం): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వీరాపూర్లో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని నిర్వాసితులు గురువారం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. వీరాపూర్ శివారులోని సర్వే నంబర్ 5, 6, 15, 17 నంబర్లలోని భూములు, రాఘవపల్లి శివారులో తమ భూములు సేకరించి, ఎంజైమెంట్ సర్వే నిర్వహించి ప్రాజెక్టు కట్టపోశారని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులకు స్పందించి సేకరించిన భూములకు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ములుగు రూరల్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవించదర్ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని పత్తిపల్లి, దేవగిరిపట్నం, అనంపల్లి గ్రామస్తులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం జంగాలపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్పాషా, కూనూరు అశోక్గౌడ్, జగన్నాధచారి, కార్యకర్తలు పాల్గొన్నారు. వాజేడు: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్, లిటిల్ క్రాస్ సొసైటీ ఎన్జీఓ సహకారంతో చేపట్టినట్లు వివరించారు. ఈ కుట్టు మిషన్ శిక్షణ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా నేర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంకే సింగ్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 17 గ్రామ పంచాయతీలకు చెందిన మహిళలు, లిటిల్ క్రాస్ సొసైటీ ఎన్జీఓ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాలి
భూపాలపల్లి అర్బన్: విద్యా ప్రమాణాల పెంపు, సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలల ద్వారా విద్యా ప్రమాణాలను మరింతగా అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పథకంలో ఎంపిక చేసి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్యార్థులకు సైన్స్, రీసెర్చ్ రంగాల్లో శిక్షణ, క్షేత్ర పర్యటనలు, ఇండస్ట్రియల్ విజిట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు, క్రీడా సామగ్రి, బోధనా సామగ్రి, విద్యార్థులకు ఐడీ కార్డులు, బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్, వృత్తి విద్యా పరికరాలు, చైల్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చర్యలు, విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ (కరాటే) శిక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా అవసరమైన సామగ్రి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. సమగ్ర కార్యాచరణ చేపట్టాలి వ్యవసాయ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి నూరు శాతం అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్న, చిట్టచివరి రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం కాకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భూసార పరీక్షల ద్వారా సరైన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా కోసం రైతులు యాప్ ద్వారా నమోదుకు రైతు వేడుకల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎరువుల నాణ్యత నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నకిలీ విత్తనాలు, ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీపాల్, రమేష్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేగొండ: లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు, విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని కొడవటంచలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ట, 26 నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నుట్లు తెలిపారు. 21న కోటంచ ఆలయానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి, శాసనసభ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీలు స్వామి వారి దర్శనానికి రానున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ అందించాలన్నారు. ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. వీఐపీలు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మీ, ఆలయ చైర్మన్ సంపత్రావు, ఈఓ మహేష్ పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కొడవటంచలో ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో కోటంచ ఆలయ అభివృద్ధి కొరకు ఇచ్చిన మాట ప్రకారం రూ.12.15 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొని మొక్కులు చెల్లించారు. -
రైతులను ఆర్థికంగా ప్రోత్సహించడమే ధ్యేయం
మల్హర్(మహాముత్తారం): గిరిజన ప్రాంతంలో రైతులను ఆర్థికంగా ప్రోత్సహించడమే నాబార్డు సంస్థ ధ్యేయమని తెలంగాణ రీజినల్ నాబార్డ్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని బోర్లగూడెంలో మేడారం గిరిజన రైతు ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్ల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నాబార్డు సంస్థలో రైతులు ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లాభం పొందాలని పిలుపునిచ్చారు. రైతులను ఆర్థికంగా నష్టపోకుండా ఈ సంస్థ ద్వారా బోర్లగూడెంలో ఫెర్టిలైజర్ షాపు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వరి కోత మిషన్, డ్రోన్ సౌకర్యం, వ్యక్తిగత రుణాలు, మామిడి మొక్కల పెంపకం, రైతులకు పనిముట్ల సౌకర్యం, చేపల ఉత్పత్తి కేంద్రం, కూరగాయల పండించుటకు రైతులకు ఆర్థిక సహాయం పొందాలన్నారు. పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మేడారం గిరిజన ఎఫ్పీఓ దత్తత గ్రామాల్లో రైతులకు 15 బోర్లు వేసి, లింకు పైపులు ఉచితంగా అందించామన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నాబార్డ్ జనరల్ మేనేజర్ హామీ ఇచ్చారు. అనంతరం డైరెక్టర్లు వేణుగోపాల్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మధు, షార్ప్ సీఈఓ నరసింహచారి, ప్రోగ్రాం మేనేజర్ చారి, ప్రాజెక్టు మేనేజర్ వీరన్న చారి, సీఈఓ పోడం దామోదర్, షార్ప్ ఉద్యోగి మానేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రీజినల్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ -
పీహెచ్సీకి తాళాలు
భూపాలపల్లి రూరల్: ఆజంనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా లేవని, వైద్యులు సమయపాలన పాటించడం లేదంటూ గ్రామస్తులు బుధవారం ఆస్పత్రికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా కూడా వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి హాజరుకావడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఆస్పత్రి బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు చిన్నారులతో వచ్చిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రంలో క్రమం తప్పకుండా వైద్యులు, నర్సులు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు వచ్చి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు తాళం తీశారు. కాగా ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురి ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలు కాగా వైద్యం కోసం ఆజంనగర్ ఆస్పత్రికి రాగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. -
ద్విచక్ర వాహనాలు ఢీ
● ఇద్దరు యువకుల మృతి భూపాలపల్లి రూరల్: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ భూపాలపల్లి కాటారం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గాదె మహేష్ (29) భూపాలపల్లి పట్టణంలోని బంధువుల ఇంటికి ఓ ఫంక్షన్కు వెళ్లి తిరి నర్సింగాపూర్కు తిరుగు ప్రయాణమయ్యాడు. అదేక్రమంలో గణపురం గ్రామాణికి చెందిన రెబ్బ శ్రీకాంత్ (25) ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి వైపు వస్తున్న క్రమంలో కమలాపూర్ క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై సతీష్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల గాదె మహేష్ భార్య సౌందర్య డెలివరి అయిందని, 19 రోజుల కూతురు ఉన్నట్లు బంధువులు రోదిస్తూ తెలిపారు. ములుగు: పీఎం ముద్రయోజన పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జ నరల్ మేనేజర్ సిద్ధార్థ్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈడీసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారంటీ పత్రాలు లేకుండానే రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా పరిశ్రమ కేంద్రంలో సంప్రదించాలన్నారు. -
ఇంటర్నల్ మార్కుల పరిశీలన
టేకుమట్ల: మండలంలోని గర్మిళ్లపల్లి, వెలిశాల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఇంటర్నల్ మార్కులను వెరిఫికేషన్ టీం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థుల రాత అంశాలకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాల్లోని రికార్డులు, వారి ప్రతిభను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వెరిఫికేషన్ టీం లీడర్ కొట్టె ప్రసాద్ విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించి వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు అశోక్, ప్రకాష్, వరప్రసాద్, ఉపాధ్యాయులు రాము, గిరిబాబు, రాంచందర్, జగన్నాదం, రమేష్, మాదవీలత, రహీమా, మల్లయ్య, వెంకటేశ్వర్లు, నరేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చిట్యాల: మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలకు చెందిన కౌటం అభిలాష్ రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చి షాట్పుట్ విభాగంలో తృతీయ బహుమతి సాధించారు. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రత్యేక అవసరాల గల పిల్లల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ బహుమతి సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ తెలిపారు. దీంతో విద్యార్థిని సర్పంచ్ ఎలగోండ స్వప్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కోరుకోప్పుల కావ్య, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు. ‘ఎఫ్ఏఓను సరెండర్ చేయాలి’భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇన్చార్జ్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎఫ్ఏఓ) ఏ.మధుసూదన్ను సరెండర్ చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన డీటీఎఫ్ జిల్లా కమిటీ అత్యవసర సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీ ఎస్ఓలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్, తిరుపతి, శ్రీనివాస్రెడ్డి, వీరేశం, ప్రభాకర్, రమణారెడ్డి సదానందంలు పాల్గొన్నారు. గోవిందరావుపేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గల సీపీఎం కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఎండీ గఫూర్ పాషా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో రైతులు 14 నెలల పాటు పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే చర్యలను చేపట్టిందన్నారు. దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు 500 బిలియన్ డాలర్ల విలువ చేసే రూ. 45 లక్షల కోట్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు తెరిచి సుంకాలను తగ్గించారని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలకు రూపకల్పన చేశారని వివరించారు. వీటికి వ్యతిరేకంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ఆ దిరెడ్డి, యాకుబ్, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల స్వాగతం
కొత్త పాలకవర్గానికి అనేక సవాళ్లు● కోతులు, కుక్కలు, పందుల బెడద నివారించాలి ● శ్మశానవాటికలో కనీస సౌకర్యాలు కరువు ● మూడు కూడళ్ల విస్తరణపై దృష్టి సారించాలి చుట్టూ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా కేంద్రంలో రాత్రి పగలు తేడా లేకుండా కోతులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి. రోజుకు పదికి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. గత పాలకులు కోతుల నివారణకు పట్టణ సరిహద్దుల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు అమలు కాలేదు. అంతేకాక కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాన రహదారులు, అంబేడ్కర్ చౌరస్తా మినహా, కూడళ్ల వద్ద సులభ్ కాంపెక్ల్లు లేక ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం పలు సెంటర్లలో 8 సులభ్ కాంప్లెక్స్లను నిర్మించారు. అయితే నీటి సరఫరా లేకపోవడంతో అవి వృథాగా ఉన్నాయి. మరమ్మతు చేపట్టి, నీటి సరఫరా చేసి వినియోగంలోకి తీసుకోవరావాలని పలువురు కోరుతున్నారు. భూపాలపల్లి పట్టణంలో ప్రతీ గురువారం జరిగే వారసంతలో కనీస సౌకర్యాలు లేవు. వారసంత శాశ్వత స్థలం కేటాయించలేదు. సంతలో వ్యాపారుల సౌకర్యార్థం ప్లాట్ఫాంలు, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సుమారు ఐదేళ్ల క్రితం కూరగాయల మార్కెట్ సమీపంలో సమీకృత నాన్వెజ్ మార్కెట్ భవనాన్ని నిర్మించి ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దీంతో చికెన్, మటన్ వ్యాపారులు ప్రధాన రహదారులపైనే తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో దుర్గందం వెదజల్లుతుంది. అంబేడ్కర్ సెంటర్ నుంచి కృష్ణకాలనీకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. రహదారి విస్తరణకు ప్రణాళికలు రూపొందించినా..ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అంబేడ్కర్ సెంటర్, గణేష్ చౌక్లో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణం పొడవున జాతీయ రహదారిపై ఉన్న షాపుల ఎదుట ఫుట్పాత్లు ఆక్రమణలకు గురయ్యాయి. దుఖాణదారులు తమ బోర్డులు, వస్తువులను ఫుట్పాత్లపైనే ప్రదర్శిస్తుండటంతో పాదాచారులు, మహిళలు చేసేది లేక రహదారిపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బాంబులగడ్డ వద్ద గల శ్మశానవాటికలో ఒకటే బోరు ఉంది. అ ది మరమ్మతుకు నోచుకున్న సమయంలో దహన సంస్కారాల నిమిత్తం వచ్చిన వారు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అలాకే ఒ కే శ్మశానవాటిక సరిపోవడం లేదు. పట్టణంలో మిగిలిన మూడు వైపులా శ్మశానవాటిక ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుంది. చిరు వ్యాపారులు రహదారులపైనే తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వారి సౌకర్యార్థం బస్టాండ్ సమీపంలో నిర్మించి, ప్రస్తుతం వృథాగా ఉన్న స్ట్రీట్ వెండర్స్ షాపింగ్ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకురావాలి. -
క్రీడాపోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
ఏటూరునాగారం: జిల్లాలోని భవిత కేంద్రంలో చదువుకుంటున్న దివ్యాంగులు క్రీడాపోటీల్లో సత్తా చాటారు. హైదరాబాద్లోని దోమలగూడలో గల వ్యాయామ విద్య కళాశాలలో దివ్యాంగ చిన్నారులకు మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఏడు పతకాలను కై సవం చేసుకున్నారు. ఇది ఎంతో గర్వకారణమని భవిత సెంటర్ల జిల్లా కోఆర్డినేటర్ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటూరునాగారంలోని భవిత సెంటర్కు చెందిన దివ్యాంగ బుద్ధిమాద్యుడు మైకల్ అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి పరుగుపందెం, లాంగ్జంప్, డిస్కస్ త్రోలో మొదటి బహుమతిగా గోల్డ్మెడల్ సాధించారని తెలిపారు. అలాగే షాట్పుట్లో మైకల్కు తృతీయ బహుమతిగా సిల్వర్ మెడల్ సాధించాడని వివరించారు. అలాగే మరో విద్యార్థి చెవిటి మూగ విభాగంలో మెట్టు శివకృష్ణ పరుగు పందెం, లాంగ్ జంప్లో మొదటి బహుమతిగా గోల్డ్మెడల్ సాధించగా, షాట్పుట్లో తృతీయ బహుమతిగా సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అలాగే చెవిటి మూగ విభాగంలో డ్యాగల భానుప్రసాద్కు ప్రోత్సాహక బహుమతులు సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు స్వరూపరాణి, గొర్రె రమేష్, పులి సుమ, కంకల రమేశ్ పాల్గొన్నారు. -
పెళ్లి పండుగ మొదలు..
జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. జోరుగా వ్యాపారం.. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్నా, చిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ముందుగానే బుక్ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లను ఆశ్రయిస్తున్నారు. బడ్జెట్ ఖర్చుపై ఆలోచనలు.. ఈసారి పెళ్లిళ్లకు బడ్జెట్ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి కుటుంబాలు గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటినుంచి శుభముహూర్తాలు రెండు నెలల్లో ముహూర్తాలు లిమిటెడ్ -
నెలలోనే.. మీటరు లోతుకు..
జిల్లాలో తగ్గుతున్న భూగర్భజలాలునీటి మట్టం వివరాలు (మీటర్లలో..)భూపాలపల్లి రూరల్: యాసంగి పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గుతోంది. ఎండలు సైతం ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తుండడంతో నెల రోజుల్లో దాదాపు ఒక మీటరు లోతుకు పడిపోయింది. వేసవిలో సాగు నీటి అవసరాలు పెరిగితే భూగర్భ జలాలు పాతాళానికి చేరే అవకాశాలున్నాయి. జిల్లాలో యాసంగి పంటల సాగు జోరందుకుంది. ఇప్పటికే 95,590 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గణపురం సరస్సు కింద 3వేల ఎకరాలు, భీం ఘన్పూర్ చెరువు కింద 1,500 ఎకరాలలో పంటలు సాగవుతుండగా, బోర్లు, మిగితా బావుల కింద సాగవుతున్నట్లు అంచనా. దీనికితోడు 28,678 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నారు. వరికే నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవుతుండడంతో సాగునీటి అవసరం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. డిసెంబర్లో సాధారణ నీటిమట్టం 7.48 మీటర్లు కాగా, జనవరిలో 8.38 మీటర్లకు పడిపోయింది. దాదాపు ఒక మీటరు లోతుల్లోకి వెళ్లాయి. ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. అది కూడా ఒకేసారి దంచికొట్టిన వానలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయి. తర్వాత వర్షాల జాడ కరువైంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. కాటారం మండలంలో 2.57 మీటర్లు పడిపోగా రేగొండ 1.39 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. ముదురుతున్న ఎండలు.. సాధారణంగా మార్చిలో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ సారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో 30 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు ముదరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎండలతో పంటలకు ఎంత నీరు అందించినా వెంటవెంటనే ఆరిపోతూనే ఉంది. ముఖ్యంగా వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండున్నర నెలలకు పైగా నీరందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఉన్నప్పుడు నీరు ఎక్కువ అవసరం ఉంటుంది. ఇప్పుడే భూగర్భ జలమట్టం పడిపోతుండడంతో బోర్లలోని ఊటలు తగ్గిపోతున్నాయి. ఎండలు మరింత ముదిరితే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి. బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో పంటలు గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో నీటి వినియోగం పెరిగి భూగర్భ జలమట్టం పడిపోతోంది. నీటిని పొదుపు వాడుకోవాలి. ఏ పంటకు ఎంత అవసరమో అంతమేర నీటినే వాడాలి. – కె. శ్రీనివాసరావు, జిల్లా భూగర్భజల అధికారిమండలం డిసెంబర్ జనవరి 2025 2026 భూపాలపల్లి 7.77 8.97 చిట్యాల 4. 35 3.65 గణపురం 4.50 4.66 కొత్తపల్లిగోరి 2.90 3.46 కాటారం 18.73 20.16 మహదేవపూర్ 11.33 11.93 మహాముత్తారం 2.57 3.67 మల్హర్ 13.23 13.90 మొగుళ్లపల్లి 3.18 3.93 పలిమెల 9.20 10.03 రేగొండ 2.60 3.21 టేకుమట్ల 3.00 3.68 ఫిబ్రవరిలోనే హడలెత్తిస్తున్న ఎండలు పెరుగుతున్న నీటి వినియోగం -
కేసీఆర్కు శుభాకాంక్షలు
భూపాలపల్లి: తెలంగాణ తొలి ముఖ్యమత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 20న జాబ్ మేళా భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి ఏరియాలో పనిచేసేందుకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల నియమాకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంబీఏ, డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని అన్నారు. అర్హత, ఆసక్తిగల యువకులు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, పాన్కార్డు, ఇతర పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 97010 78288 నంబర్లో సంపద్రించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్కు సన్మానం భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ను మంగళవారం గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తని వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వేముల సదానందం, నాయకులు బండి శ్రీనివాస్, బుర్ర కుమారస్వామి, పెసరు నాగరాజు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా వెంకట్ భూపాలపల్లి అర్బన్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా వెంకట్ను ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బొనకంటి సుభాష్లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా స్వప్నకుమారి, రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జె.రాజ్కుమార్, సంయుక్త కార్యదర్శులుగా వెంకటరమణ, సదానందం, రాజేందర్, జిల్లా కోశాధికారిగా రాజేంద్రప్రసాద్, కమిటీ సభ్యులుగా రాజ్కుమార్, రాజశేఖర్, రాజు, మొగిలి, రాకేష్, చల్ల రాజు, శివ, కిరణ్, అరవింద్, బాలులను ఎన్నుకున్నారు. మల్హర్(మహాముత్తారం): సీఎం కప్లో భాగంగా జిల్లాస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో మండలంలోని దుబ్బలపాడు ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పి.అంజలి 400 మీటర్స్, 100 మీటర్ల రన్నింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. బ్యాడ్మెంటన్ విభాగంలో అంజలి, రిశ్విక, ఖోఖో విభాగంలో సుమలత, రక్షిత స్టేట్ లెవెల్కు ఎంపికయినట్లు పీడీ తిరుపతి చెప్పారు. రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ప్రిన్సిపాల్ మహ్మద్ షరీఫ్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. మల్హర్(మహాముత్తారం): మహాముత్తారం మండలంలోని పెగడపల్లి ప్రధాన రహదారి వద్ద మంగళవారం మహాముత్తారం ఎస్సై–2 మహేష్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కనుకునూర్, మహాముత్తారం, బోర్లగూడెం వెళ్లే వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన ప్రతాలను పరిశీలించి పత్రాలు సక్రమంగా లేని వారికి జరిమాన విధించారు. అనుమానితులను విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ‘తీన్మార్’
జనగామ/తొర్రూరు/డోర్నకల్: జనగామ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం హాలులో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ సభ్యుల ఓటింగ్లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఓటింగ్కు రాగా 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్ నెలకొంది. ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్ లాటరీ విధానాన్ని అమలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ మద్దతు దారుడు 23వ వార్డు కౌన్సిలర్ భూష పర్వతాలు వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎన్నికై న ఇద్దరికీ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓట్లు వేశారు. దీంతో ఓట్లు సమానం కావడంతో ఇరు పార్టీలు సూచించిన వార్డు సభ్యులపేర్లతో చీటలు వేసి లాటరీ తీయగా వచ్చిన పేర్లను ప్రకటించారు. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తూనం శ్రావణ్ కుమార్ చైర్మన్గా, సోమ రజినీ వైస్ చైర్పర్సన్గా ఎంపికై నట్లు ఆర్డీఓ ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డోర్నకల్లో మొత్తం 15 వార్డుల్లో 11మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, నలుగురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండగా మంగళవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండేటి రాజకుమారిని, వైస్ చైర్పర్సన్గా మాదా లావణ్య పేర్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ నుంచి ఎవరినీ ప్రతిపాదించక పోవడంతో వారిద్దరిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. జనగామ, తొర్రూరు, డోర్నకల్ సైతం కాంగ్రెస్ కైవసం లాటరీ పద్ధతిలో జనగామ, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక -
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పురపాలన అంతా మహిళల చేతుల్లోకి వెళ్లిపోయింది. సోమవారం, మంగళవారం.. జరిగిన ఎన్నికల్లో వారికే పెద్దపీట దక్కింది. వాస్తవానికి అన్నిచోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేని కారణంగా డోర్నకల్.. సరిసమానమైన మెజారిటీ, గొడవలు, ఉద్రిక్తతతో జనగామ, తొర్రూరు ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ రెండు రోజుల్లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో సగానికి పైగా పదవులను మహిళలు సాధించారు. 12 చైర్పర్సన్ స్థానాల్లో 7 స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. వైస్ చైర్మన్ స్థానాల్లో 8 మంది మహిళలే దక్కించుకున్నారు. వారంతా కూడా సోమ, మంగళవారాల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు 12 కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా.. ఇందులో అత్యధికంగా మహిళలే కావడంపై చర్చ జరుగుతోంది. జనరల్ స్థానాల్లోనూ సమీకరణల్లో భాగంగా అనూహ్యంగా చైర్పర్సన్ పదవులు ‘ఆమె’ను వరించాయి. ములుగు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా అక్కడ చింతనిప్పుల చంద్రకళ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. మహబూబాబాద్ ఎస్టీ జనరల్ అయినప్పటికీ ఇక్కడ ఎస్టీ మహిళ గుగులోత్ జ్యోతికి పురపీఠం వరించింది. మరిపెడలో వీసారపు ప్రగతి, కేసముద్రంలో బానోత్ సునీత, నర్సంపేటలో పెండెం శ్రీలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్నికలు జరిగిన జనగామ బీసీ జనరల్కు రిజర్వు కాగా, ఇక్కడ లాటరీ ద్వారా 22వ వార్డు కౌన్సిలర్ కడకంచి బాలమణిని చైర్పర్సన్గా అదృష్టం వరించింది. డోర్నకల్ ఎస్సీ జనరల్ కాగా ఇక్కడా మహిళకు అవకాశం ఇవ్వడంతో కుండేటి రాజకుమారి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వైస్ చైర్పర్సన్లుగా లావణ్య (డోర్నకల్), నీలా రాజమ్మ (స్టేషన్ఘన్పూర్), నేనావత్ షీభారాణి (వర్ధన్నపేట), హతియా షాహీన్ (ములుగు), దివ్య (పరకాల), సునీత (మరిపెడ), అల్లం రమ (కేసముద్రం)కు చాన్స్ దక్కింది. బీఆర్ఎస్ గెలుస్తుందనుకున్న తొర్రూరు మున్సిపాలిటీ కూడా లాటరీలో కాంగ్రెస్కే దక్కగా, అక్కడ 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజిని వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. జ్యోతి మహబూబాబాద్బాలమణి జనగామబానోత్ సునీత కేసముద్రంరాజకుమారి డోర్నకల్ వీసారపు ప్రగతి మరిపెడపెండెం శ్రీలక్ష్మి నర్సంపేట– సాక్షిప్రతినిధి, వరంగల్చంద్రకళ ములుగుగెలిపించింది, గెలిచింది ‘ఆమె’నేగ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన నారీమణులు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎన్నికల నిర్ణేతలుగా నిలిచారు. ఇదే సమయంలో అత్యధిక మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ పీఠాలను అధిష్టించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17.. మూడు తేదీల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పురుషులకంటే 1.09 లక్షల మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగాప్రచురించిన ఓటర్ల జాబితాలో నూ భూపాలపల్లి మినహా అంతటా వారిదే ఆధిక్యం ఉంది. మొత్తం 12 బల్దియాలలో 3,35,244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,72,087 కాగా, పురుషులు 1,63,088. ఇందులో 1,27,004 మంది పురుషులు ఓట్లేయగా, మహిళలు 1,35,238 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నీల రాజమ్మ స్టేషన్ఘన్పూర్సునీతారెడ్డి మరిపెడజనగామ ఎమ్మెల్యే పల్లా ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్రఅల్లం రమ కేసముద్రంషీభారాణి వర్ధన్నపేటఏకు దివ్య పరకాలలావణ్య డోర్నకల్ రజిని తొర్రూరు ఆసియాషాహీన్ ములుగుచైర్ పర్సన్లుఓరుగల్లు మున్సిపల్ పీఠాలపై మహిళలదే పై‘చేయి’.. మున్సిపల్ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశం 12 మున్సిపాలిటీలకు ఏడు చోట్ల మహిళలే చైర్పర్సన్లు 8 మున్సిపాలిటీల్లో వారే వైస్ చైర్పర్సన్లు.. ‘ఆమె’కు కలిసొచ్చిన ‘లక్కీ’ వైస్ చైర్ పర్సన్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్.. మహిళలకు దక్కిందెక్కడ.. -
ప్రత్యేక అవసరాల విద్యార్థులకు క్రీడలు
భూపాలపల్లి: పాఠశాల విద్యాశాఖ (సమగ్ర శిక్ష) ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రాష్ట్రస్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాలొనేందుకు జిల్లా విద్యాశాఖ తరఫున బయలుదేరిన విద్యార్థుల బస్సును సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ములుగు జిల్లాకు ఏడేళ్లు
మేజర్ గ్రామపంచాయతీ హోదాతోనే జిల్లా కేంద్రంగా ఏర్పాటైన ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు 2022 సెప్టెంబర్ 12న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి ధనసరి సీతక్క ప్రత్యేక చొరవతో బండారుపల్లి, జీవింతరావుపల్లి జీపీలను కలుపుకొని 2024 లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు ప్రభుత్వం, గవర్నర్ ఆమోదించారు. దీంతో 2025 ఏప్రిల్ 5న ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నూతనంగా ఏర్పాటైన ములుగు మున్సిపాలిటీకి ఈనెల 11 ఎన్నికలు జరగగా 20 వార్డుల్లో 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, రెండు ఇండిపెండెంట్లు, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. ములుగు మున్సిప ల్ తొలి చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన చింతనిప్పుల చంద్రకళ ఎన్నికయ్యారు. ములుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ల పునర్విభజన చేపట్టింది. ఆ సమయంలో ములుగు, భూపాలపల్లిని ఒకే జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో ములుగు ప్రజలు ములుగు జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించడంతో 2019 ఫిబ్రవరి 16న జిల్లా ఏర్పాటు చేస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. 17వ తేదీ నుంచి కొత్తగా ములుగు జిల్లా పాలన అమలులోకి వచ్చింది. 1956లో తాలుకాగా 1985లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన ములుగు 2011లో మేజర్ పంచాయతీగా అభివృద్ధి చెందింది. 33వ జిల్లాగా ఏర్పాటు 2016లోనే ములుగు జిల్లా ఏర్పడుతుందని ఆశించిన ఇక్కడి ప్రజలకు నిరాశ ఎదురుకావడంతో ఉద్యమబాట పట్టారు. ప్రజల ఆకాంక్షను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు, భద్రాద్రి కొత్తగూడెం సెగ్మెంట్ పరిధిలోని రెండు మండలాలు కలిపి జిల్లాగా ప్రకటించింది. 9 మండలా లు 174 గ్రామపంచాయతీలతో ఏర్పడిన ములు గు జిల్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ములుగు పరిధిలోని మల్లంపల్లి గ్రామపంచాయతీని జేడీ మల్లంపల్లి మండలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జిల్లాలో మండలాల సంఖ్య 10కి చేరింది. ములుగు జిల్లా 3,881 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రాష్ట్రంలోనే 11వ అతిపెద్ద జిల్లాగా (వైశాల్యంలో) గుర్తింపు పొందింది. ఇందులో 2,945.45 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉండడం, 90 కిలోమీటర్ల విశాలమైన, సుందరమైన గోదావరి తీరం కలిగి ఉండటం విశేషం. రామప్పకు యునెస్కో గుర్తింపు.. జిల్లాలో రామప్ప, లక్నవరం, మేడారం సమ్మ క్క– సారలమ్మ, మల్లూరు లక్ష్మీనరసింహస్వామి , బొగత, ముత్యంధార జలపాతం, బ్లాక్బెర్రీ తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు పొందిన ఏకై క ఆలయం రామప్ప ఈ జిల్లాలో ఉంది. రామప్ప ఆలయానికి 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. గత నెలలో జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రూ.101 కోట్లతో తల్లుల గద్దెలను ప్రభుత్వం విస్తరించింది. అంతేకాకుండా రాష్ట్ర కెబినేట్ సమావేశాన్ని సీఎం రేవంత్రెడ్డి మేడారంలో ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు రూ.150 కోట్ల నిధులు కేటాయించారు. విద్యారంగంలో ముందడుగు డిగ్రీ కళాశాల కోసం ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నుంచి దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల ఏర్పాటు జిల్లాకు శుభపరిణామంగా భావించవచ్చు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించి న సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించగా కేంద్రం రూ.830 కోట్లను కేటాయించింది. 287 ఎకరాలను అప్పగించగా పనులు పురోగతిలో ఉన్నాయి. నేడు 8వ వసంతంలోకి అడుగు జీపీ నుంచి మున్సిపాలిటీగా.. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
భూపాలపల్లి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
కాళేశ్వరంలో పారిశుద్ధ్య సేవలు
కాళేశ్వరం: కాళేశ్వరంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో పలువీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. పలుచోట్ల బ్లీచింగ్ చల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్రెడ్డి, ఎంపీఓలు భవాని, ప్రకాశ్రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కౌన్సిలర్లకు సన్మానం భూపాలపల్లి రూరల్: బీఆర్ఎస్ కౌన్సిలర్లను జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సన్మానించారు. నిబద్ధతతో ప్రజాసేవ చేసి పార్టీ గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ సేవలు మరువలేనివి ఏటూరునాగారం: సేవాలాల్ సేవలు మరవలేనివని మహబూబాబాద్, ములుగు జిల్లాల గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గురుకులం పాఠశాలలో సేవాలాల్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి హరి సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం వారం రోజులపాటు సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ప్రిన్సి పాల్ శ్రీరాములు, అధ్యాపకులు వీరన్న, జైపా ల్, కుమారస్వామి, పృథ్వీరాజ్, గోపాల్రావు, నర్సయ్య, కృష్ణయ్య, శంకర్ పాల్గొన్నారు. మంత్రి సీతక్కను సత్కరించిన నాయకులు గోవిందరావుపేట: ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం నూతన చైర్మన్, వైస్ చైర్మ న్ ఎన్నిక అనంతరం చల్వాయి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. -
విధేయులకే పట్టం
భూపాలపల్లి: స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విధేయులకే మున్సిపల్ పీఠాలు దక్కాయి. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఆయన అనుచరులే ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నిక.. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ఎంపికై న కౌన్సిలర్లు అందరు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు, సీపీఐ ఒకరు, ఒక స్వతంత్ర కౌన్సిలర్.. మొత్తం 18 మంది క్యాంపు నుంచి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయానికి ఒక ప్రత్యేక బస్సులో వచ్చారు. బీఆర్ఎస్కు చెందిన 10 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు వేర్వేరుగా వచ్చారు. తొలుత ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్ స్థానానికి బుర్ర కొమురయ్యను కౌన్సిలర్ అప్పం కిషన్ ప్రతిపాదించగా, మరో కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ బలపరిచారు. చైర్మన్ స్థానానికి ఒకరే బరిలో ఉంటంతో బుర్ర కొమురయ్య చైర్మన్గా ఎన్నికై నట్లు ఆర్డీఓ హరిక్రిష్ణ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ స్థానానికి అంబాల శ్రీనివాస్ను కౌన్సిలర్ బొడ్డు అశోక్ ప్రతిపాదించగా, మరో కౌన్సిలర్ ఇస్లావత్ రాజునాయక్ బలపరిచారు. ఈ స్థానానికి సైతం పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆర్డీఓ వెల్లడించి ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్కు ఎన్నిక జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎలాంటి అల్లర్లు లేకుండా.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం ఎలాంటి అల్లర్లు, సంఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సరిపడా మెజార్టీ ఉండటం, ఎమ్మెల్యే సత్యనారాయణరావు సూచనల మేరకు చైర్మన్, వైస్చైర్మన్ అభ్యర్థుల ఎంపికకు మిగిలిన కౌన్సిలర్లు మద్ధతు పలకడంతో ఘర్షణలు, అలకలు, బుజ్జగింపు పర్వాలు చోటు చేసుకోలేదు. తడబాటుతో ప్రమాణ స్వీకారం.. ప్రమాణ స్వీకారం సమయంలో పలువురు కౌన్సిలర్లు తడబడ్డారు. దీంతో భూపాలపల్లి ఆర్డీఓ హరిక్రిష్ణ ప్రమాణ స్వీకార పత్రాన్ని చదువుతూ వారితో చెప్పించారు. 20 ఏళ్ల నుంచి వెంట ఉన్న వారికే.. గడిచిన 20 ఏళ్లుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెంట ఉన్న వారికే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కాయనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు కై వసం చేసుకోవడంతో నలు గురు కౌన్సిలర్లు చైర్మన్ పీఠాన్ని, ఐదారుగురు వైస్ చైర్మన్ స్థానాన్ని ఆశించారు. ఈ మేరకు క్యాంపులో సైతం తమవంతు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు. ఎమ్మెల్యే సత్తన్న ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, అతని వెన్నంటి ఉన్న బుర్ర కొమురయ్యకు చైర్మన్, అంబాల శ్రీనివాస్కు వైస్ చైర్మన్ పదవులు వరించాయి.పేరు బుర్ర కొమురయ్య తండ్రి పేరు రాజీరు పుట్టిన తేదీ 01–05–1974 చదువు పదవ తరగతి పాస్ వృత్తి సివిల్ కాంట్రాక్టర్ పదవులు మాజీ సర్పంచ్ (జంగేడు) ‘సత్తన్న’ వెంట నడిచిన వారికి దక్కిన అవకాశం పాలకవర్గం ప్రమాణ స్వీకారం పూర్తిప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికై న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావు ఇవ్వొద్దని, ప్రజల గౌరవాన్ని కాపాడాలని, వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. -
అంగరంగ వైభవోపేతంగా..
సోమవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో కాళేశ్వరాలయం వ్యూ కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. 14న శనివారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా ఉత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహించారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు బైకుంఠపాండా, రాముశర్మ, శ్రావణ్కుమార్, రామకృష్ణ, పవన్శర్మ, రాజ్కుమార్ పాల్గొన్నారు. శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం కాళేశ్వరం అనుబంధ దేవాలయమైన అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి మరుసటి రోజున ఆనవాయితీ ప్రకారం శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4గంటలకు ఆలయ వేదపండితులు కల్యాణ తంతును ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్రెడ్డి ఉన్నారు. అర్చకులు వెల్ది శరత్శ్చంద్రశర్మ, పాండా, పవన్శర్మ, రాధకృష్ణ, విజ య్కుమార్శర్మ, రిటైర్డు అర్చకులు పాల్గొన్నారు. ఆదాయం రూ. 23.35లక్షలు మూడు రోజులకు గాను కాళేశ్వరం దేవస్థానానికి వివిధ పూజలు, లడ్డు ప్రసాదాలు, తైబజార్ విక్రయాల ద్వారా రూ. 23.35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. మేడారం ఎఫెక్టుతో మూడు రోజుల్లో 60వేల మంది వరకు దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. దేవస్థానానికి రూ.23.35 లక్షల ఆదాయం వైభవంగా ఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం -
వైభవంగా గట్టు మల్లన్న జాతర
టేకుమట్ల: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారమైన గట్టు మల్లన్నను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలోని బూర్నపల్లి గట్టుపై కొనసాగే గట్టు మల్లన్న జాతర ఆదివారం అత్యంత వైభవంగా కొనసాగింది. శనివారం చిన్న పట్నంతో మొదలై పెద్ద పట్నం ఆదివారం రాత్రి వరకు కొనసాగిన మల్లన్న పట్నాలకు మండలంతో పాటు పెద్దపల్లి, ముత్తారం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం గట్టు మల్లన్న జాతరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన గట్టు మల్లన్న జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పోటెత్తిన భక్తజనం దర్శించుకున్న పలువురు నేతలు -
విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాలి
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రతీ పరీక్షకు ముందు ఫీజుల పేరుతో వేధిస్తున్నారు. ఫీజు కోసం పొద్దంతా ఎండలో నిల్చోపెడుతూ, పరీక్ష రాయనీయడం లేదు. కొంత మందిని ఇంటి వద్ద వ్యాన్లు ఎక్కించుకోవడం లేదు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – నేరెళ్ల జోసఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి -
ఘనంగా లింగోద్భవపూజ
కాళేశ్వరం: మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వేదపండితులు లింగోద్భవ పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, రుద్రపఠనాలతో ఆలయం మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని మారెడు దళాలు సమర్పించారు. అనంతరం చండీహోమం, కాళరాత్రి హోమాలు నిర్వహించారు. ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. పూజలో పాల్గొన్న మంత్రి.. శివరాత్రి సందర్భంగా లింగోద్భవ పూజలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని విశేష అభిషేక, అర్చనలు చేశారు. ఆయనకు రాజగోపురం వద్ద మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో (కాళేశ్వర ముక్తీశ్వరులు) ద్విలింగాలకు మారెడు దళాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఆయనను అర్చకులు శేషవస్త్రాలతో సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మహదేవపూర్ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం రాత్రి ప్రారంభించారు. కాళేశ్వరం వస్తున్న సందర్భంగా మహదేవపూర్లో వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ హసీనభాను, నాయకులు కటకం అశోక్ తదితరులు ఉన్నారు. పాల్గొన్న ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
వాల్పోస్టర్ ఆవిష్కరణ
రేగొండ: మండలంలోని కోటంచలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట మహోత్సవం, స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయన్నారు. స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. అనంతరం గడిపల్లి శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, నాయకులు ఉమేష్ గౌడ్, భిక్షపతి, రవీందర్ రావు, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు. -
కిక్కిరిసిన కాళేశ్వర క్షేత్రం, గణపేశ్వరాలయం
కాళేశ్వరం/గణపురం: మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం కాళేశ్వరాలయం, గణపేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమ గోదావరి, వీఐపీ ఘాటులో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలతో మొక్కులు చెల్లించారు. గోదావరి మాతకు దీపాలు వదిలి, దంపతి స్నానాలు చేశారు. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివార్లకు గోదావరి జలాలతో అభిషేక పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ప్రకారదేవతలకు మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు గోదావరి తీరం, ఆలయ పరిసరాలు, ఆలయంలోని క్యూలైన్లలో బారులుదీరారు. శివనామస్మరణతో కాళేశ్వరాలయం మారుమోగింది. పుర వీధులన్నీ భక్తజనంతో నిండిపోయాయి. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం శ్రీశుభానంద ముక్తీశ్వరుల కల్యాణం, గోదావరిహారతి, తెప్పోత్సవానికి భక్తులు హాజరై భక్తిని చాటారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి బాలశివుడిని దర్శించుకున్నారు. భక్తులు జాగరణతో పాటు ఉపవాస దీక్షలను నియమ నిష్టలతో పాటించారు. ఆలయం ఆవరణలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు భద్రతా చర్యలు చేపట్టారు. గోదావరిలో పుణ్యస్నానాలు.. ఆలయంలో అభిషేకాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తుల రాక -
భవానీ సహిత గణపేశ్వరుడి కల్యాణం
గణపురంలోని గణపేశ్వరాలయం శివ నామస్మరణతో మారుమోగింది. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి స్వామి వారి కల్యాణం ఆలయ ధర్మకర్త అట్లూరి పావన రాజ్యలక్ష్మీనరసింహారావు దంపతులతో అర్చకుల బృందం నేత్ర పర్వంగా నిర్వహించగా భక్తులు కన్నుల పండుగగా తిలకించారు. జాగరణకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి దంపతులు, డీఎస్పీ అవిరినేని సంపత్ రావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. -
నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
● ముందుగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేడు (సోమవారం) జరగనుంది. మున్సిపాలిటీ పరిధిలో 30వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మెజారిటీ కలిగిన సభ్యులలో నుంచి చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక చేపడుతారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని నోటీసులను కమిషనర్ అందించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన కాళేశ్వరం: కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సులోచన కళాక్షేత్రం, నాట్య గురువు వేముల రాధిక సతీష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. ఆదివారం కార్తికేయ, వర్ణిక, క్రితిక, శ్రీనిక, అదితి, మీనాక్షి, రితిక, చార్విక, జశ్విత, అక్షిత, హర్ష నందిని, నాగద్రితి, శిరీష, తనుశ్రీ, శ్రీజ వారి ప్రతిభను చాటారు. రాధిక శిష్య బృందం ప్రదర్శించిన విఘ్నేశ్వర కీర్తన, శివ పంచాక్షరి, శివాష్టకం, నీలకంఠ నిరంజన అంశాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాక్టర్ ప్రేమ్ ఆధ్వర్యంలో శార్వాని కూచిపూడి బృందం ఆకట్టుకుంది. నిరంతర విద్యుత్ సరఫరా భూపాలపల్లి రూరల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందించామని సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.మల్చూరునాయక్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సబ్స్టేషన్ను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ పరంగా సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు ముమ్మర ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా అందించామన్నారు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. -
ఎవరికో?
మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభ పూజ నిర్వహిస్తున్న అర్చకులుచైర్మన్ పీఠం భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల క్యాంపులో, పట్టణంలో ఆ పీఠం ఎవరికి దక్కనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 16న జరగనున్న ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుండగా ఆశావహుల మధ్య పోటీ ఉత్కంఠను రేపుతోంది. క్యాంపులో కౌన్సిలర్లు.. ఎమ్మెల్యే వ్యూహం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి సీపీఐతో కలుపుకొని 17 వార్డు స్థానాలను కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన వార్డు సభ్యులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపకుండా, ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చాకచక్యంగా వ్యవహరించారు. ఫలితాలు వచ్చిన వెంటనే పార్టీ కౌన్సిలర్లు అందరినీ రహస్య క్యాంపునకు తరలించారు. చైర్మన్ ఎన్నిక రోజు వరకు వీరంతా ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే ఉండనున్నారు. చైర్మన్ రేసులో ముగ్గురు కౌన్సిలర్లు.. మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు ఈ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2, 9, 19 వార్డుల నుంచి గెలుపొందిన బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, కురిమిళ్ల శ్రీనివాస్ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నారు. క్యాంపులో ఉన్న ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు ఈ ముగ్గురు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైస్ చైర్మన్కు తీవ్ర పోటీ.. మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. చైర్మన్ స్థానాన్ని బీసీ పురుషుడికి ఇచ్చే అవకాశాలు ఉండటంతో వైస్ చైర్మన్ పదవిని మహిళలకు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. చైర్మన్ స్థానం బీసీలకు కేటాయించినందున వైస్ చైర్మన్ స్థానాన్ని అయినా తమకు అప్పగించాలని కొందరు ఓసీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరుతున్నట్లు తెలిసింది. ఇంకా నిర్ణయానికి రాని ఎమ్మెల్యే.. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాల ఎంపిక విషయమై శనివారం రాత్రి వరకు కూడా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ నాయకులతో చర్చించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది తేల్చుకోనున్నట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి రాకుండా అందరిని కలుపుకుపోయే అభ్యర్థిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు కాకుండా కొత్త వారిని తెరపైకి తీసుకువస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే మనసులో ఎవరు ఉంటే వారే ఆ పీఠాలను అధిష్టించే అవకాశం ఉన్నందున, ఆయన ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. పట్టణానికా.. విలీన గ్రామాలకా.. ? గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు విలీన గ్రామాలకు చెందిన వారే చైర్మన్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈసారి పట్టణానికి చెందిన వారికే పట్టం కడతారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా రేపు భూపాలపల్లి మున్సిపాలిటీ కొత్త సారథి ఎవరనేది తేలిపోనుంది.కురిమిళ్ల శ్రీనివాస్ బుర్ర కొమురయ్య కాంగ్రెస్ క్యాంపులో ముగ్గురి మధ్య పోటాపోటీ వైస్ చైర్మన్ ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యే సత్తన్న మదిలో ఎవరో.. రేపే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక -
నెగ్గి తగ్గిన కారు..
● అధికార కాంగ్రెస్కు తీవ్ర పోటీ ● పక్కా ప్రణాళికతో కాంగ్రెస్కు 16 స్థానాలు ● రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్న కమలం ● తప్పిన కమ్యూనిస్టుల గురి.. ఒక్క స్థానానికే పరిమితంభూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఏకై క మున్సిపాలిటీని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కై వసం చేసుకునేందుకు రెండు నెలల నుంచి పక్కా ప్రణాళికతో ముందువెళ్లి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అధికార పార్టీకి దీటుగా అభ్యర్థులను బరిలో దింపి ప్రచారం నిర్వహించింది. గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పోలైన ఓట్లలో కాంగ్రెస్కు దీటుగా వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. బీజేీపీ ఎప్పటి లాగే రెండు స్థానాలకే పరిమితమైంది. కార్మిక కాలనీల్లో పట్టున్న వామపక్షాలు సైతం ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి. 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పార్టీలు సాధించిన ఓట్లతో పోలిస్తే ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల ఓట్ల సంఖ్య తగ్గింది. తిరుగులేని కాంగ్రెస్ ఎన్నికలు ఏవైనా ఫలితం మాత్రం ఒకటే కాంగ్రెస్ విజయం. భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 30 వార్డుల్లో 16 వార్డులు గెలుచుకుని మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. మున్సిపాలిటీలో త్రిముఖ పోరు నెలకొన్నా కాంగ్రెస్ మాత్రం ఏకపక్షంగా మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొదటి సారిగా కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. అధికార పక్షం కావడంతో కాంగ్రెస్కు ఎదురులేకుండా పోయింది. ముందు నుంచి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. వార్డుల వారీగా గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై సర్వేచేసి వారికే టికెట్ కేటాయించింది. ఏ వార్డులో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఎక్కువగా ప్రచారం చేసింది. మరో మూడు వార్డుల్లో అతివిశ్వాసంతో ఓడిపోయామని కాంగ్రెస్ చెబుతోంది. గట్టిపోటీనిచ్చిన బీఆర్ఎస్ మున్సిపల్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి పట్టణ ప్రజలు ప్రధానంగా కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అనుకున్నారు. అందుకు అనుగుణంగానే పురపోరు సాగింది. కాంగ్రెస్ 25, వామపక్షాలు 5 వార్డుల్లో పోటీ చేయగా ప్రతి వార్డులో తీవ్ర పోటీ నిచ్చింది. 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి తొక్కింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెండు నెలల నుంచి మున్సిపల్ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ వార్డులో ఒక్కటి రెండు సార్లు బస్తీ బాట నిర్వహించారు. రెండు మూడు సార్లు గండ్ర దంపతులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించారు. వికసించని కమలం నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు చేదు ఫలితాలనిచ్చాయి. కేవలం రెండు వార్డులను కై వసం చేసుకుంది. 14వ వార్డులో రెండో స్థానంలో నిలవగా.. 22 వార్డుల్లో మూడో స్థానంలో నిలిచింది. 2015లో రెండు స్థానాలు 2020లో ఒక కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఈసారి రెండు స్థానాలకు పరిమితమైంది. పక్కాగా ప్రచారం చేసినా.. చాలా వార్డుల్లో ప్రజలు ఆదరించకపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్లను తీసుకువచ్చి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అయినా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామనుకున్న వార్డుల్లోనూ ఓడిపోవడం ఆ పార్టీని విస్మయానికి గురిచేస్తుంది. పట్టు తప్పుతున్న కమ్యూనిస్టులు గతంలో భూపాలపల్లి పట్టణంలో సీపీఐ, సీపీఎంలకు పట్టు ఉండేది. పార్టీల అనుబంధ సింగరేణి కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూ ఉన్నాయి. ప్రధానంగా ఏఐటీయూసీకి కార్మికుల్లో బలం ఉంది. గత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఐఎన్టీయూసీకి తీవ్రమైన పోటీనిచ్చింది. గత రెండు పర్యాయాలు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒకటి, రెండు చొప్పున కమ్యూనిస్టులు గెలిపొంది అధికార బీఆర్ఎస్కు తీవ్ర పోటీని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి సీపీఐ 4, సీపీఎం 1 స్థానంలో పోటీ చేయగా 24 వార్డులో మాత్రమే సీపీఐ గెలుపొందింది. 28వ వార్డు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. -
ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఇసుక లారీ
ఏటూరునాగారం: ఓ ట్రాక్టర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మండల పరిధిలోని రొయ్యూర్ సమీపంలో గల 163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలోని నలుగురు, ఇంజిన్పై కూర్చున్న ఇద్దరు ఎగిరిపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన కూలీలు ట్రాక్టర్ యజమాని పూజారి బుచ్చయ్యతో కలిసి మిర్చి తోట నుంచి ఏటూరునాగారం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఆరుగురిని 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులు గాయాలతో బయపడినట్లు వైద్యులు తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొట్టి వెళ్లిన లారీ కోసం స్థానికులు ఆరా తీస్తున్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపునకు కార్తికేయ కేయూ క్యాంపస్: కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 17 నుంచి 23వ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరం (నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు)లో కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, ఎన్ఎస్ఎస్ వలంటీర్ బాలంకి కార్తికేయ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ శనివారం తెలిపారు. ఈ మేరకు కార్తికేయను కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.శైలజ, ఎం.సౌజన్య తదితరులు అభినందించారు. -
తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పూజారులు కడియం శ్రీహరి, కౌన్సిలర్లను అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందజేశారు. -
భక్తుల సందడి
వెంకటాపురం(ఎం)/మంగపేట: చారిత్రక రామప్ప దేవాలయం, హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రామప్పకు పర్యాటకులు, విద్యార్థులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ పర్యాటకులకు వివరించారు. అలాగే రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శనివారం భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
ఎదుర్కోలు మహోత్సవం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శివాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. శివ పార్వతుల కల్యాణం ముందు రోజు ఎదుర్కోళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు రాజ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడు, పార్వతి ఇరు పక్షాల గ్రామ పెద్దలు ఎదర్కోళ్లు నిర్వహించి తాంబూలాలను ఇచ్చి పుచ్చుకున్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక ములుగు రూరల్: సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఇటీవల జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో షాట్పుట్లో అండర్–16 విభాగంలో ఆకాంక్ష, రెజ్లింగ్ అండర్–14 విభాగంలో పూజిత, రెజ్లింగ్ అండర్–16 విభాగంలో రేష్మ, వాల్బాల్లో రిజ్వాన, శ్రీవేణి, కబడ్డీలో శ్రావ్య, 600 మీటర్ల పరుగు పందెంలో సన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ విద్యార్థినులు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ రజిని, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు. కాజీపేటలో రైల్వేట్రాక్ మరమ్మతు పనులు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో శనివారం రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రైల్వేట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంలో రైల్వేట్రాక్ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్ (ట్రాక్ రెల్ రిప్లస్) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేదని, ప్రస్తు తం ఎలాంటి జాయింట్ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్ స్టాఫ్, యంత్రాలతో ట్రాక్ రెన్యువల్ పనులు చేపడుతున్నట్లు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. కంప్యూటర్ సైన్స్ బీఓఎస్గా రమేశ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు. -
కేయూలో పార్ట్టైం లెక్చరర్ల నియామకం!
● 16న నోటిఫికేషన్ ఇవ్వనున్న అధికారులు ● వివిధ విభాగాల్లో 100 పోస్టుల భర్తీకి నిర్ణయంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్వైజ్గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 100 మంది నియామకం.. కేయూపరిధిలో 130 మంది పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే.. కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. నోటిఫికేషన్ వస్తే ఎంతమందిని నియమిస్తారనే వివరాలు తెలియనుంది. ఈ విషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు. -
నేటినుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
కాళేశ్వరం: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నేటి (శనివారం) నుంచి సోమవారం వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఉత్సవాలకు భక్తులు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా తరలిరానున్నారు. 14న శనివారం ఉదయం 10గంటలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ, రుత్విగ్వరణం, మృత్సంగ్రహణం, 11 గంటలకు దేవతారాధన, నవకలశారాధన, నవగ్రహారాధనం నిర్వహిస్తారు. 11.30 గంటలకు మండప దేవతారాధన, వృషభ ధ్వజారోహణం చేపడుతారు. సాయంత్రం నాలుగు గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ఉత్సవ మూర్తుల ఊరేగింపు, ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ప్రసిద్ధ కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. 15న ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్కాటకలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ శుభానంద–ముక్తీశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం నా లుగువేల మంది కూర్చునేలాగా నిర్మించారు. కానీ కల్యాణం జరిగే వేదిక మాత్రం చిన్నగా ఉందని విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. వెనుకవైపు కూర్చునే వారికి కల్యాణం తంతు కనపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు రెండు వైపులా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కాళేశ్వరంలో కల్యాణమహోత్సవం భారీగా తరలిరానున్న భక్తులు -
ఓటర్లకు ధన్యవాదాలు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన పట్టణంలోని 30 వార్డుల ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తల శ్రమకు ఫలితమన్నారు. రెండేళ్ల ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు. ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. -
ప్రజామద్దతుకు నిదర్శనం
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించిన భూపాలపల్లి పట్టణ ఓటర్లకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఽశుక్రవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు చూపిన విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజా మద్దతుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల విజయంలో కీలక భూమిక పోషించిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ప్రజా పాలన, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పట్టణ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఓటు వేశారని హర్షం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్దే పై‘చేయి’
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా భూపాలపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ విజయ దుందుభి మోగించింది. వామపక్షాలతో జతకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎవరితో పొత్తు లేకున్నా చైర్మన్, వైస్చైర్మన్ స్థానాలను కై వసం చేసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీలో నిలిచిన బీఆర్ఎస్ రెండో స్థానంలో, ఎప్పటి మాదిరిగానే బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా అధికా ర కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రచారం నిర్వహించాయి. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లికి వచ్చి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ సభలు, సమావేశాలు నిర్వహించగా మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పొత్తుగా ఏర్పడి.. కాంగ్రెస్ 25 స్థానాలు, సీపీఐ 4, సీపీఎం ఒక స్థానంలో పోటీ చేశాయి. బీఆర్ఎస్ 30 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో బరిలో నిలిచాయి. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 16, సీపీఐ 1, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి మూడుసార్లు ఎన్నికలు జరుగగా.. రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీయే చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుంది. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో బండారి సంపూర్ణరవి, 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సెగ్గెం వెంకటరాణిసిద్ధు చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. మూడోసారి జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్, వైస్చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ సరిపడా వార్డు స్థానాలు కై వసం చేసుకోవడంతో చైర్మన్, వైస్చైర్మన్ స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కాగా 2, 9, 19, 30 వార్డుల నుంచి గెలుపొందిన బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, కురిమిళ్ల శ్రీనివాస్, బొడ్డు అశోక్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వైస్చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్తో జతకట్టిన వామపక్షాలు ఐదు స్థానాల్లో బరిలో నిలిచినప్పటికీ 24వ వార్డులో వేముల జ్యోతి మాత్రమే గెలుపొందింది. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సత్తా చాటే సీపీఐ, సీపీఎంలు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అంతంత మాత్రంగానే ప్రభావం చూపాయి. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్లు 13 మంది పోటీ చేయగా ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మిగిలిన 28 మంది కొత్తగా ఎన్నికై న వారే ఉన్నారు. దీంతో ఈ పాలకవర్గంలో అన్ని కొత్త ముఖాలే కనిపించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 16 మంది అభ్యర్థులకు టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్ నేడు(శనివారం) విప్ జారీ చేయనున్నట్లు సమాచారం. భూపాలపల్లి పట్టణంలోని క్రిష్ణాకాలనీ కమ్యూనిటీ హాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పర్యవేక్షించారు. విజేతలు వీరే.. వివరాలు 11లో.. 30 వార్డుల్లో 16 స్థానాలు కై వసం ఢీలాపడ్డ కారు.. 10 స్థానాల్లోనే గెలుపు కాంగ్రెస్ సహకరించినా ఒక్క వార్డుకే వామపక్షాలు పరిమితం రెండింటితో సరిపుచ్చుకున్న బీజేపీ మున్సిపాలిటీపై తొలిసారి కాంగ్రెస్ జెండా -
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. తొడుగు బహూకరణ ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తౌటిరెడ్డి స్వర్ణలత–భాస్కర్ రెడ్డి దంపతులు గణపేశ్వరుడికి రూ.80వేల విలువగల నాగేంద్ర సహిత అర్ధనారీశ్వర తొడుగును బహూకరించారు. వారికి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నగరంపల్లి మాజీ సర్పంచ్ మాదాటి సత్యలక్ష్మీనారాయణ రెడ్డి, బైరెడ్డి మహేందర్ రెడ్డి, కొమ్మెర శైలజ శ్రీనివాస్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నాగదేవత పడిగె లభ్యం మల్హర్: మండలంలోని దబ్బపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతీర్థం (సమ్మక్క–సారలమ్మ) జాతర నిర్వహించే ప్రదేశంలో నాగదేవత పడిగె లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతూండ్ల గ్రామానికి చెందిన మహిళకు దేవుడి వచ్చి దుబ్బతీర్థం జాతర ఆవరణలో నాగులమ్మ దేవత పడిగె ఉంది బయటకు తీసి పూజలు చేయాలని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈమేరకు జాతర ఆవరణలో తవ్వి చూడక నాగపడిగె దొరికినట్లు చెప్పారు. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని నాగుదేవత పడిగెకు పూజలు చేశారు. కొయ్యూరు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కాళేశ్వరం: కాళేశ్వరం రాజగోపురం వద్ద బారీకేడ్లు ఇనుప పెన్సింగ్తో అడ్డంగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో రాజగోపురం ఎదుట క్యూలైన్లకు మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు నేరుగా ఆలయంలోకి వెళ్లేవారు. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా రాజగోపురం ఎదుట 100 మీటర్ల పొడవుతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో గోదావరివైపు నుంచి వచ్చే భక్తులు, బస్టాండ్ వైపు నుంచి వచ్చే వారంతా క్యూలైన్లో వెళ్లేందుకు క్యూ కాంప్లెక్సు వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఎదుట మార్గం లేకపోవడంపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. -
కదంతొక్కిన కార్మికులు
అంబేడ్కర్ సెంటర్లో ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణంలో సింగరేణి, కాంట్రాక్ట్, అంగన్వాడీ, మధ్యాహ్న, ఆశ వర్కర్లు కదంతొక్కారు. జాతీయ కార్మిక సంఽఘాల పిలుపులో భాగంగా గురువారం టోకెన్ సమ్మెను విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సింగరేణి గనుల వద్ద ధర్నా చేపట్టారు. అత్యవసర కార్మికులు మినహా సింగరేణి కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో ఏరియాలో 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో సింగరేణి, కాంట్రాక్ట్, అంగన్వాడీ, మధ్యాహ్న, ఆశ వర్కర్ల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య మాట్లాడారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. – భూపాలపల్లి అర్బన్ -
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి రూరల్: నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిపో పరిధిలోని మండలాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినీయోగం చేసుకోవాలని కోరారు. 99592 26707కు ఫోన్చేసి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని డీఎం కోరారు. కాళేశ్వరాలయంలో పూజలు కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వొడ్డెపల్లి రామచందర్రావు, ఎలక్షన్ అబ్జర్వర్ గంగాధర్ గురువారం వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేసి శ్రీశుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. త్రివేణి సంగమంలో హంసవాహనం కాళేశ్వరం: ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాత్రి ఏడు గంటలకు త్రివేణి సంగమంలో హంసవాహనంలో తెప్పోత్సవం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయంత్రం హంసవాహనం ఆకృతితో గోదావరిలో కూలీలు తయారు చేశారు. దీంతో సగం వరకు తయారైన హంసవాహనం పర్యాటకులు, భక్తులను ముచ్చట గొలుపుతుంది. కాటారంలో 2కే రన్ మల్హర్(కాటారం): ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం కాటారం మండలకేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. ఎస్బీఐ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు 2కే రన్ సాగగా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కేవైసీ మోసాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. తెలియని సందేశాల లింక్లను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. ప్రతీ బ్యాంకు ఖాతాదారు కేవైసీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఎస్సై శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు ప్రవీణ్, హరిరాంనాయక్, సంతోష్, సికందర్, భాస్కర్, రవినాయక్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి రేగొండ: మండలకేంద్రంలోని పరకాల–భూపాలపల్లి రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కోతులపురం గ్రామానికి చెందిన పొట్ట నరేష్ (25) ఇసుక లోడింగ్ కోసం మహదేవపూర్ వెళ్తున్నాడు. మండలకేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా నరేష్ నడిపే లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ క్యాబిన్లో ఇరుక్కుపోయి కాళ్లకు తీవ్ర గాయాలతో పాటు తల వెనుక తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. చికిత్స కోసం 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. -
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అంబేడ్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మూడు ప్రధాన పార్టీలు, 107 మంది అభ్యర్థులు, 30 వార్డుల్లో పోటీ, వీరిలో ఎవరెవరు గెలుపుతీరాలను చేరుతారనే విషయం మధ్యాహ్నంతో స్పష్టత రానుంది. దాదాపు 15 రోజులుగా నెలకొన్న మున్సిపల్ ఎన్నికల హంగామాకు నేడు (శుక్రవారం) జరిగే ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది. ఇందుకు సంబంఽధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నానికే వెలువడనున్న ఫలితాలు భూపాలపల్లి మున్సిపల్ పీఠాన్ని ఎవరు కై వసం చేసుకుంటారనేది మధ్యాహ్నంలోపు స్పష్టత రానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 10 గంటల వరకే ఫలితాల సరళి తెలియనుంది. 30 వార్డుల్లో సగటున 1800 ఓటర్లు ఉంటే వీటిలో సగటున 1100 నుంచి 1300 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్నంలోపే పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందరిలో ఉత్కంఠ.. క్యాంపులు షురూ.. ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే ఉత్కంఠలో అందరూ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగింది. కొన్ని వార్డుల్లో ఓటరు నాడి కనిపెట్టడం కష్టంగా ఉందని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో విపరీతమైన టెన్షన్ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి అభ్యర్థులందరూ ఓట్లు ఎటు పడ్డాయనే విశ్లేషణల్లో ఉన్నారు. కులసంఘాల ఓట్లు, తమ వర్గానికి సంబంధించిన ఓట్లు ఎటు పడ్డాయనే లెక్కల్లోనే ఇంకా అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే గెలుపొందిన తరువాత పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు అంతగా పోటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. చైర్మన్ స్థానాన్ని ఎవరు కై వసం చేసుకున్నా ఒకటి, రెండు సీట్ల ఆధిక్యంతో మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు క్యాంపు రాజకీయాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి సాయంత్రం ఫలితాల వెల్లడి కాగానే ఆయా పార్టీల నేతలు తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించేందుకు సిద్ధం అవుతున్నారు. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా ప్రాంగణంలోని మినీ ఫంక్షన్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లకు ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు. లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి చర్యలకు అనుమతి లేదన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలకు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద శాంతి భద్రతలు కాపాడేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. -
కోటగుళ్లలో కట్టుదిట్టమైన భద్రత
గణపురం: ఈ నెల 15న కోటగుళ్లలో నిర్వహించే శివ కల్యాణ మహోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. గురువారం కోటగుళ్లను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఎస్పీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో సన్మానించారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భద్రత చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భూపాలపల్లి డీఎస్పీ అవిరినేని సంపత్ రావు, గణపురం సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ రేఖ అశోక్ పాల్గొన్నారు.ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
‘మేడారం’ ఆదాయం
రూ.13,51,76,275హన్మకొండ కల్చరల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఆదాయం రూ. 13,51,76,275 వచ్చినట్లు మేడారం జాతర ఈఓ వీరస్వామి తెలిపారు. మహాజాతర సందర్భంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్ర, 3 ఒడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వతేదీ సోమవారం హనుమకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలోకి చేర్చారు. హుండీల లెక్కింపు ఫిబ్రవరి 5న గురువారం ప్రారంభమైంది. చివరిరోజు లభించిన ఆదాయం.. ఎనిమిదో రోజు (చివరిరోజు) గురువారం చిల్లరనాణేలను వేరు చేసి తూకం వేసి లెక్కించడంతో మహాజాతర హుండీల లెక్కింపు పూర్తయ్యింది. చివరిరోజు లెక్కింపులో నాణేల ద్వారా లభించిన ఆదాయం రూ.4,56,399, ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ ద్వారా) రూ. 21,36,607 మొత్తం కలిపి రూ.25,93,006 సమకూరింది. జాతర ఆదాయం రూ.13,51,76,275 మహా జాతర మొత్తం ఆదాయం రూ.13,51,76,275గా నమోదైందని ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తులు వివిధ రకాల వస్తువుల రూపంలో వేసిన బంగారం, వెండి సూక్ష్మ కానుకలను సైతం ప్రత్యేక నిపుణుల సహాయంతో, సెన్సార్ల సహాయంతో గుర్తించి లెక్కకట్టారు. ఏటా పెరుగుతున్న ఆదాయం 1946లో జాతర ఆదాయం రూ.17,173 కాగా, 1968లో దేవాదాయశాఖ మొదటిసారిగా నిర్వహించిన జాతరలో రూ.1,20,113గా నమోదైంది. 1980లో మొదటిసారిగా వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసిన జె.బాపురెడ్డి ఐఏఎస్ పెద్ద ఎత్తున ప్రచారంతో జాతర ఆదాయం రూ. 4,50,000 వచ్చింది. అదేవిధంగా 2002 నుంచి జాతర ఆదాయం కోటి రూపాయలు దాటింది. 2016 జాతర ఆదాయం రూ. 8.90 కోట్లుగా నమోదైంది. ఈవిధంగా ప్రతిఏటా జాతర ఆదాయం కోట్లల్లో పెరుగుతూ వస్తోంది. పూర్తయిన మహా జాతర హుండీల లెక్కింపు చివరి రోజు లభించిన ఆదాయం రూ. 4,56,399 ఈ–హుండీల ద్వారా (క్యూ ఆర్ల ద్వారా) రూ. 21,36,607 గత జాతరకంటే అదనంగా 288 హుండీల ఏర్పాటు అయినప్పటికీ పెరగని ఆదాయం, తగ్గిన బంగారు, వెండి కానుకలు2024లో మేడారం జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో 518 హుండీలు, తిరుగువారం హుండీలు 22 కలుపుకుని మొత్తం 540 హుండీలకుగాను ఆదాయం రూ.12,71,79,280 సమకూరింది. కాగా, ప్రస్తుతం జాతరలో గద్దెల ప్రాంగణంలో 828 హుండీలను ఏర్పాటు చేయగా.. రూ.13,51,76,275గా నమోదైంది. గతంకంటే 288 హుండీలను అదనంగా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. గత జాతరలో 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు లభించాయి. ప్రస్తుత జాతరలో 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31కిలోల 700 గ్రా ముల వెండి లభించింది. గతం కంటే తక్కువగా కానుకలు వచ్చాయి. దీనికి బంగారం, వెండి రే ట్లు పెరగడమే కారణంగా చెప్పవచ్చని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత జాతర ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత జాతర ఆదాయం ఆశించినంత పెరగలేదు. -
పవర్లిఫ్టింగ్లో జాఫర్కు గోల్డ్ మెడల్
కాజీపేట రూరల్: కాజీపేట రాంనగర్ (కడిపికొండ)కు చెందిన నేషనల్ ఐరన్ క్లబ్ జిమ్ కోచ్ కమ్ చైర్మన్ ఎండీ.జాఫర్ మాస్టర్ పంజాబ్ హరిద్వార్లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్ను కై వసం చేసుకున్నారు. 59 కేజీల విభాగంలో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ కాంపిటీషన్లో 317 1/2 కిలోల టోటల్ చేసి తెలంగాణ నుంచి జాఫర్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ను సాధించి రికార్డును బ్రేక్ చేశారు. ఈమేరకు తెలంగాణ నుంచి పాల్గొని గోల్డ్మెడల్ను సాధించిన జాఫర్ను పలువురు అభినందించారు. ఇప్పటి వరకు 15 నేషనల్ పవర్ లిఫ్టింగ్లో పాల్గొని విజయం సాధించినట్లు, ప్రపంచ ఇంటర్నేషనల్ పవర్ లిప్టింగ్ పోటీలో పాల్గొని విజయం సాధిండమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని జాఫర్ వేడుకుంటున్నారు. -
‘ఉపాధి’ పనుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం పెద్దాపూర్, సుబ్బక్కపల్లి, రామ్నాయక్ తండాలతో పాటు గుర్రంపేట గ్రామంలోని పొట్టి కుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీఓ బాలకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు కొలతల ప్రకారం పని చేసి రోజువారి గరిష్ట కూలి రూ.307లు పొందాలన్నారు. పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, నీడ కోసం టెంట్, తాగునీరు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపేట సర్పంచ్ కోడూరు రమేష్, వార్డు మెంబర్ అరవింద్, అధికారులు, ఏపీఓ రావుల కిరణ్, పీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. రామప్పలో విదేశీయుల సందడి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన మేరి, జాన్ బోమెన్, యోహీ మోబర్ల్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అంతర్జాతీయ సదస్సుకు హనుమకొండ జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎన్ఐటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సదస్సులో శ్రీది లైఫ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఠాకూర్ దేవ్ సింగ్శ్రీ అంశంపై పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈసందర్భంగా అశోక్కుమార్ను గైడ్ రవికుమార్, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు, కోచ్లు తదితరులు అభినందించారు. వరంగల్ క్రైం: అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భవన నిర్మాణ రంగంలో వాడే బ్రాండెడ్ కంపెనీ అయిన గోల్డ్ మెడల్ కంపెనీని పోలిన నకిలీ వైర్లు విక్రయిస్తున్నాడో వ్యాపారి. పక్కా సమాచారంతో డబ్బాల సమీపంలోని అర్భుద ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీలో టాస్క్ఫోర్స్ పోలీసులు, హనుమకొండ పోలీసులు బుధవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూ.3.59 లక్షల నకిలీ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. షాప్ యజమాని కంతి లాల్ అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజు, ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్
ములుగు జిల్లా 80.41 శాతం హనుమకొండ జిల్లా 80.18 శాతం వరంగల్ జిల్లా 85.42 శాతం జేఎస్ భూపాలపల్లి 65.18 శాతం మహబూబాబాద్ జిల్లా 78.90 శాతం జనగామ జిల్లా 80.66 శాతం సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ల నుంచి 1,073 మంది కౌన్సిలర్ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది.గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం -
మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు శాఖకు సూచించారు. దేవాలయం, అన్నదాన సత్రాలు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, గోదావరి ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. 15న సరస్వతీ ఘాట్ వద్ద జరిగే తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ఆలయంలో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. మహదేవ్పూర్, కాటారం, భూపాలపల్లి మార్గంలో ఇసుక వాహనాల రాకపోకలను నిషేధించాలన్నారు. పరిశుభ్రత, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, 104, 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం స్టాండ్బైలో ఉంచాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అర్చన టిక్కెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలని దేవస్థాన ఈఓకు సూచించారు. 14 నుంచి 16 వరకు కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో వైన్షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసి మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్కు ఆహ్వాన పత్రిక అందజేత కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ రాహుల్ శర్మకు బుధవారం ఆలయ ఈఓ, పూజారి ఆహ్వానపత్రికను అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, అర్చకులు కలెక్టర్కు మహాశివరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను వివరించి, ఈ నెల 15 తేదీన నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, జాగరణ, రథోత్సవం తదితర వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందించారు. ప్రత్యేక బస్సులు మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం ఇందు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని బుధవారం తెలంగాణ జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కట్టా అంజనీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు అలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. అదేవిధంగా మహాశి రాత్రిని పురస్కరించుకుని న్యాయవాది చండ్రపాటి చిదంబరనాథ్శర్మ దంపతుల ఆధ్వర్యంలో ఐదురోజుల పాటు నిర్వహించే మహారుద్రయాగాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. -
ఓటెత్తారు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ఎన్నికలుపోలింగ్ సరళి ఇలా..భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 34,367 మంది ఓటు హక్కు వినియోగం.. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా, పురుష ఓటర్లు 26,786, మహిళ ఓటర్లు 25,936, ఇతరులు నలుగురు, మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 34,367 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 65.18 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. యువత ఆసక్తి.. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత ఆసక్తి చూపారు. పలువురు తల్లులు చంటిబిడ్డలను ఎత్తుకొని రాగా, వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ.. ఎన్నికల సరళి, ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ పర్యవేక్షించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోల్ చీటీలు లేక ఇబ్బందులు.. పలువురు ఓటర్లకు పోల్ చీటీలు అందక ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల రోజునే కొందరు వివిధ రాజకీయ పార్టీల వద్ద పోల్చీటీలు పొందగా, మరికొందరు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న బీఎల్ఓల వద్ద తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన పోలింగ్ శాతం భూపాలపల్లి మున్సిపాలిటీలో 2020లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి 1.81 శాతం పోలింగ్ పెరి గింది. కాగా అత్యధికంగా 2014లో 70.55 శాతం పోలింగ్ జరిగింది. అనంతరం 2020లో 63.37 శాతం పోలింగ్ జరుగగా, బుధవారం జరిగిన ఎన్నికల్లో 65.18 శాతం పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్ రూమ్కు తరలిన బ్యాలెట్ బాక్సులు.. పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. రేపు (శుక్రవారం) ఓట్ల లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. పట్టణంలో 30 వార్డులు ఉండగా 107 మంది అభ్యర్థలు బరిలో ఉన్నారు. ఇందులో స్వతంత్రులు అంతంత మాత్రంగానే ఉనికి చాటుకోబుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు పార్టీలు చెరో 10 స్థానాలను పక్కాగా కై వసం చేసుకోనుండగా మిగిలిన పదింటిలో గట్టి పోటీ ఉంది. ఈ స్థానాల్లో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గట్టెక్కుతారు. అయితే ఈ వార్డుల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కై వసం చేసుకుంటే ఆ పార్టీనే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకునే అవకాశం ఉంది.ఓటర్లకు డబ్బులు పంచుతూ పలువురు పట్టుబడ్డారు. 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. లక్షల స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3వ వార్డులో డబ్బులు పంచేందుకు వెళ్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూ. 7,500 స్వాధీనం చేసుకున్నారు. చెదురు ముదురు ఘటనలు.. 6వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఇతర ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను పంపించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన బీఎల్ఓలకు భోజన సౌకర్యం కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. 65.18 శాతం పోలింగ్ నమోదు పోల్ చీటీలు అందక పలుచోట్ల ఇబ్బందులు పోలింగ్ను పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ రేపు కౌంటింగ్..ఫలితాల వెల్లడి -
కాళేశ్వరంలో తెప్పోత్సవానికి ఏర్పాట్లు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలోని సరస్వతీఘాటులో తెప్పోత్సవం నిర్వహించడానికి దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నుంచి తీసుకువచ్చిన తెప్పకు సంబంధించిన సామగ్రితో హంస ఆకృతిని తయారు చేస్తున్నారు. తెప్పను 45 డ్రమ్ముల నుంచి 60 డ్రమ్ముల వరకు సుమారు 40 మంది కూర్చుని ప్రయాణించే విధంగా కూలీలు తయారు చేస్తున్నారు. దీనికి ఒక మోటార్ పడవను అమర్చనున్నారు. మహాశివరాత్రి (ఆదివారం) రోజు రాత్రి 7 గంటలకు విశేష పూజలతో ఉత్సవమూర్తులను జలవిహారం చేయనున్నారు. అంగరంగవైభవంగా జరగనున్న కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. -
ముసలయ్య జాతరకు ఏర్పాట్లు పూర్తి
ములుగు రూరల్: మండల పరిధిలోని రాయినిగూడెంలో గుట్టమీది ముసలయ్య జాతరకు పూజారులు తేదీలను ఖరారు చేయడంతో పాటు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తవిటి నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం గుడిశుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు గుట్టమీది ముసలయ్య జాతర నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొ క్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తవిటి పుష్పక్క, రాములు, సమ్మయ్య, రామస్వామి, విజయ, సర్పంచ్ ఈసం సునీత, ఉప సర్పంచ్ దేవేందర్రావు, ఆలయ ప్రచార కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మందు.. మనీ.. గిఫ్ట్లు
భూపాలపల్లి: ఓటర్లను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. పంపిణీకి కాదేది అనర్హం అన్నట్లుగా డబ్బు, మందుతో పాటు వివిధ రకాల నజరానాలు అందజేశారు. చీరలు, టవల్స్, క్రికెట్ కిట్లు, చికెన్, కూల్డ్రింక్స్ కూడా ఓటర్లకు పంచారు. రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు... భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ప్రతీ వార్డులో డబ్బు పంపిణీ జరిగింది. ఒక్కో వార్డులో సుమారుగా 1500 నుంచి 2200 ఓట్ల వరకు ఉన్నాయి. అందులో మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, డబుల్ ఓట్లు సుమారు రెండు వందల వరకు ఉన్నాయి. మిగిలిన ఓటర్లకు ఒక్కో వార్డులో ఒక్కో విధంగా అభ్యర్థులు డబ్బు పంపిణీ చేశారు. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్న వార్డుల్లో ఓటుకు రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఇవ్వగా, పలు వార్డుల్లో రూ.1,500 నుంచి రూ. 2వేల వరకు ఇచ్చారు. ఏ వార్డులో కూడా ఓటుకు రూ.1,500లకు తక్కువగా ఇవ్వలేదు. మొత్తంగా ఒక్కో అభ్యర్థి నగదు పంపిణీ విషయంలోనే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కనిపించని అధికారులు.. ఎన్నికల నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘన జరిగినా, కట్టడి చేయాల్సిన అధికారులు, ప్రత్యేక టీంలు అంతగా కానరాలేదు. అభ్యర్థులు తమ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ డబ్బు, నజరానాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసినా అంతగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నామమాత్రంగా రహదారులపై తనిఖీలు చేపట్టారని, చిన్నచిన్న కేసులు మాత్రం నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చును చూసి సాధారణ ప్రజలు నివ్వెరపోయారు. డబ్బు లేని వారు ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు లేవంటూ పలువురు చర్చించుకుంటున్నారు. డబ్బు పంపిణీ చేసినప్పటికీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోననే భయంతో కొందరు అభ్యర్థులు ప్రత్యేక నజరానాలు ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రతీ ఇంటికి కేజీ చికెన్, కూల్డ్రింక్స్, ఒక క్వార్టర్ మద్యం, చీరలు, టవల్స్, యువకుల కోసం క్రికెట్ కిట్స్ అందజేశారు. కొన్ని వార్డుల్లో అయితే వాడకొక మేకను గిఫ్ట్గా ఇవ్వడంతో రాత్రంతా దసరాను తలపించింది. మొత్తంగా ప్రత్యర్థుల వైపు ఓటర్లు మళ్లకుండా ఉండేందుకు పలువురు అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు. అర్ధరాత్రి వరకు ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారు కోరినవన్నీ అందిస్తూ వచ్చారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చీరలు, టవల్స్, క్రికెట్ కిట్లు, చికెన్, కూల్డ్రింక్స్ కూడా.. అర్ధరాత్రి వరకు ఓటర్ల ఇళ్ల చుట్టూ అభ్యర్థులు -
వాణిజ్య శాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కోర్స్ ద్వారా ట్యాలీ ప్రైమ్ (జీఎస్టీ) ఉపయోగించి వ్యాపార కౌంటింగ్, బిల్లింగ్ ఇన్వెంటరీ నిర్వహణకు సంబంధించి లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించే విధానాన్ని శిక్షణార్థులు నేర్చుకుంటారని తెలిపారు. కోర్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు జూనియర్ అకౌంటింగ్, అకౌంట్స్ అసిస్టెంట్, జీఎస్టీ అసిస్టెంట్ బిల్డింగ్ ఆపరేటర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు, హక్కుల పరిరక్షణకు కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏరియాలోని అన్ని గనుల వద్ద గేట్ మీటింగ్లు నిర్వహించి కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను రద్దు చేయాలన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటా యించి, పర్మనెంట్ కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని తెలిపారు. ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ● మద్దులపల్లిలో భయాందోళన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం దుమ్ముతో కూడిన సుడిగుండం సుమారు 45 నిమిషాల పాటు కనిపించి స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. సాయంత్రం వేళ చేలల్లో పనుల నిమిత్తం వెళ్లిన పలువురు తిరిగి వస్తున్న క్రమంలో సుడిగుండాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దుమ్ము గాలిలోకి ఎగసిపడటంతో పరిసర ప్రాంతమంతా దుమ్ము మేఘాలతో నిండిపోయింది. దృశ్యం భయానకంగా మారడంతో ఏం జరుగుతుందోనని భయపడ్డారు. మేడారం అడవుల్లో ఏర్పడ్డ టోర్నాడా లాంటిదని భయాందోళనకు గురయ్యారు. ప్రాణ, ఆస్తినష్టం, చెట్లు కూలడం జరగలేదని స్థానికులు తెలిపారు. కొద్దిసేపటి తరువాత సుడిగుండం అదుపులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సుడిగుండం ఎగిసిపడ్డ వీడియోలు సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
ఎంజీఎంలో రక్తం కొరత!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఓపీ చిట్టీ నుంచి మొదలుకుని చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతీ విభాగంలో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందే రోగులు మెరుగైన వైద్యసేవలు పొందడానికి రక్తనిధి కేంద్రం సేవలు అత్యంత కీలకం. కానీ, ఈ కేంద్రం సేవల సమస్యలను పరిష్కరించడం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంజీఎం ఆస్పత్రిలో 1,500 పడకలతోపాటు సీకేఎం, జీఎంహెచ్, ఆర్ఈహెచ్, టీబీ ఆస్పత్రులతో పాటు చుట్ట పక్కల ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా ఈ బ్లడ్బ్యాంకు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్లడ్బ్యాంకులో 300 యూనిట్ల కంటే ఎక్కువగా రక్తం నిల్వ లేదనే విషయాన్ని గమనిస్తే దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. విధుల్లో ఒక వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు.. ఎంజీఎం ఆస్పత్రి రక్తనిధి కేంద్రానికి సిబ్బంది కొరత తలనొప్పిగా మారింది. క్యాంపుల నిర్వహణ కోసం కౌన్సిలర్లు లేకుండా కేంద్రం కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాయకుల జన్మదినం, మానవతా దృక్పథంతో వచ్చే రక్తదాతల సహకారం తప్ప కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. గతంలో మోటిటేటర్గా పనిచేసి అత్యత్తుమ అవార్డులు సాధించిన కల్యాణి అనే ఉద్యోగిని పరిపాలనాధికారులు అకారణంగా తొలగించారు. కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్పై వచ్చిన కౌన్సిలర్ను సైతం వెనక్కి పంపించేశారు. బ్లడ్బ్యాంకులో ముగ్గురు వైద్యాధికారులు, 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, మోటివేటర్, కౌన్సిలర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఒకే ఒక్క వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే కొనసాగుతున్నారు. ఏటూరునాగారంనుంచి ఇటీవల ఓ కేన్సర్ పేషెంట్ చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. రక్తం కావాలని సదరు పేషంట్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. వారు బ్లడ్బ్యాంకుకు వెళ్తే సిబ్బంది ఒక యూనిట్ మ్రాతమే ఇచ్చారు. ఇంకో యూనిట్ కావాలంటే లేదు అని చెప్పారు. దీంతో వారు ప్రైవేట్ బ్లడ్బ్యాంకు వెళ్లి రక్తం ప్యాకెట్ కొనుక్కొని వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క కేన్సర్ పేషంట్ది మాత్రమే కాదు.. ఎంజీఎం ఆస్పత్రిలో అనేకమంది రోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రక్తనిధి కేంద్రంలో నియామకానికి నోచుకోని కౌన్సిలర్లు.. రక్తం కోసం పరుగులు తీస్తున్న పేద రోగులు -
మున్సిపోల్కు సిద్ధం
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికలను నేడు (బుధవారం) నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 52,726 మంది ఓటర్లు ఉండగా పురుషులు 26,786, మహిళలు 25,936 ఉన్నారు. నలుగురు ఇతరులు ఉన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటుచేయగా.. మంగళవారం సామగ్రితో ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీరు, టెంట్ సౌకర్యాలు కల్పించి, వీల్చైర్లు అందుబాటులో ఉంచారు.6 జోన్లు.. 8 రూట్లు 30 వార్డుల్లోని 86 పోలింగ్ కేంద్రాలను 6 జోన్లు, 8 రూట్లుగా విభజించారు. ఎన్నికల నిర్వహణకు 561 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఆర్ఓ, ఏఆర్ఓ, మైక్రోఅబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ల వివరాలను తెలిపేందుకు బీఎల్ఓలను అందుబాటులో ఉంచనున్నారు.పోలింగ్ సందర్భంగా ఎటువంటి ఘటనలూ చోటు చేసుకోకుండా, ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్్ కేంద్రాల్లో అసౌకర్యాలు, ఓటర్ల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 86 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. 27 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. 30 వార్డులు.. 86 బూత్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది -
టోకెన్ సమ్మె రాజకీయ స్వార్థమే
భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె పూర్తిగా రాజకీయ స్వార్థంతో, కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ నిర్వహిస్తున్నదని బీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ విమర్శించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం ఒకరోజు సమ్మెలతో కార్మికులకు ఒరిగిందేమిటో సంఘాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు కోడ్లలో కార్మిక వ్యతిరేక అంశాలపై సవరణల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న బీఎంఎస్ ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు మద్దతు ఇవ్వదని స్పష్టం చేస్తూ, కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మెలో పాల్గొని నష్టపోవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘రామప్ప శిల్పకళ బాగుంది’
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ బాగుందని శిక్షణ అధికారులు కొనియాడారు. మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు సందర్శించారు. భారత్ దర్శన్ స్టడీ టూర్లో భాగంగా శిక్షణ తీసుకుంటున్న 75 మంది అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని దర్శించుకుని గ్రూప్ ఫొటోలు దిగారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్కుమార్ వివరించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు, టూరిస్ట్ పోలీసులు ఉన్నారు. -
450 మందితో పోలీస్ బందోబస్తు..
భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల భద్రత కోసం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు 8 రూట్లలో పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు, ఇంకు బాటిళ్లు, వాటర్ బాటిళ్లు నిషేధమని, పోలింగ్ బూత్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధమని స్పష్టంచేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తున్న అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్ -
సమ్మెతో కార్మికులకే నష్టం
భూపాలపల్లి అర్బన్: జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె డిమాండ్లు సింగరేణి పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం, కోలిండియా పరిధిలో ఉంటాయని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మె కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి నష్టం జరగడం వలన రూ.77 కోట్లు, కార్మికులకు రూ.12కోట్ల నష్టం వాటిల్లితుందన్నారు. నూతన లేబర్ కోడ్ల వలన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు నష్టం లేదన్నారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. కార్మికులు గ్రహించి సమ్మెకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్యాంసుందర్, శ్రావణ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు
డిపోల వారీగా తిరిగిన బస్సులు, ఆదాయం(రూలలో)డిపో బస్సులు కిలో మీటర్లు ప్రయాణికులు ఆదాయం హనుమకొండ 387 5 18,722 2,55,732 3,90,34,592 జనగామ 180 2,86,666 67,148 1,86,79,760 వరంగల్–1 283 4,05,208 2,64,785 3,23,88,513 వరంగల్–2 217 5,92,450 3,41,593 4,61,28,361 మహబూబాబాద్ 117 2,08,548 46,931 1,06,53,950 నర్సంపేట 152 2,30,372 85,857 1,64,85,955 పరకాల 175 2,50.260 84,574 1,72,40,378 తొర్రూరు 110 1,82,469 40,802 1,06,16,240 భూపాలపల్లి 90 1,31,460 46,163 1,12,00,375 హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124లు ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు.మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 తిరిగిన మొత్తం కిలో మీటర్లు 28,06,155 -
హుండీ ఆదాయం రూ.10.92లక్షలు
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.10.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా నోట్లు రూ.9,82,050, నాణెములు రూ.1,10,329 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత, సర్పంచ్్ మొగిళి, పంచాయతీ కార్యదర్శి అమూల్య, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి భజన బృందాలు పాల్గొన్నారు. -
నిర్భయంగా ఓటేయండి
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ స్టేడియంలోని బ్యాలెట్ బాక్సులు నిల్వచేయడానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఓట్లు లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోనా, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ తరుణ్ప్రసాద్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్శర్మ -
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 14 నుంచి 16 వరకు జరుగు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగొద్దని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన కాళేశ్వరం దేవస్థానం సమావేశ మందిరంలో మహాశివరాత్రి జాతర నిర్వహణ ఏర్పాట్లపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన మహాశివరాత్రి జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత సమర్థవంతమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా భద్రత, రాకపోకలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలు, పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్పోస్టర్లను సబ్ కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఈఓ మహేష్తో కలిసి క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లపై చర్చించారు. సబ్కలెక్టర్ పాతనక్ష రహదారిని సర్పంచ్తో కలిసి పరిశీలించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, తహసీల్దార్ రామారావు, డీటీ యూసఫ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, ఎస్సై తమాషారెడ్డి, రెవెన్యూ సిబ్బంది శ్యామ్తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ కాళేశ్వరంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష -
తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ప్రజాదివస్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యలకు పోలీసులు తక్షణ పరిష్కార మార్గం చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధ్యక్షతన ప్రజాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన 10 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ, సంబంధిత అధికారుల సమన్వయంతో వాటిని పరిష్కరిస్తున్నామని, ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. -
నిబంధనలు తూచ్!
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లిలో ఏర్పాటుచేసిన ఎన్నికల బృందాలకు సదుపాయాలు కల్పించకపోవడంతో నామమాత్రంగా పనిచేస్తున్నాయి. మున్సిపాలిటీలో కనీసం అధికారులు ఎన్నికల కోడ్ను సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రధాన రహదారిపై ఉన్నటువంటి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు కూడా తొడగలేదు. ఖర్చులపై నిఘా కరువు.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎస్ఎస్టీ టీమ్ ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. ప్రచారంలో భాగంగా జన సమీకరణ, అభ్యర్థులు, నాయకుల ప్రసంగాన్ని వీడియో తీయాల్సి ఉండగా.. 30 వార్డుల్లో ఎక్కడ కూడా వీడియో తీసిన సందర్భాలు లేవు. చెక్పోస్టుల వద్ద కూడా వీడియో రికార్డింగ్ లేకుండానే తనిఖీలు చేస్తున్నారు. బెల్ట్షాపుల తనిఖీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలు గురి చేయకుండా ఉండేందుకు కాలనీలో ఎఫ్ఎస్టీ టీమ్ నిత్యం గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. అధికారులు పూర్తిగా పార్టీల నాయకులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సెల్ఫోన్లలో వీడియో.. ఎన్నికల పరిశీలనకు ఏర్పాటు చేసిన టీమ్లలో వీడియో గ్రాఫర్స్ను ఏర్పాటు చేయలేదు. వీడియోగ్రాఫర్కు ఇచ్చే డబ్బులను సొంత జేబులోకి వెసుకునేందుకు జిల్లా స్థాయి అధికారి ఒకరు మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకొని వీడియో గ్రాఫర్స్ను నియమించకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఎనిమిది మంది వీడియోగ్రాఫర్లకు ఇచ్చిన ఆర్డర్లను సైతం రద్దు చేసినట్లు సమాచారం. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని టీమ్లకు కేటాయించి తుతూ మంత్రంగా సెల్ఫోన్లలో వీడియోలు తీయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్డర్లు లేకుండా మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని ఎన్నికల పనులకు వినియోగించుకుంటున్నారు. వారికి వచ్చే పారితోషకాలను మిగుల్చుకునే పనిలో పడ్డారు. -
బోనమెత్తిన మహిళలు
మహదేవపూర్ మండల కేంద్రంలో మల్లన్న బోనాల జాతర పండుగ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి మొక్కులు చెల్లించారు. సోమవారం మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి బోనం సమర్పించారు. ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాల నడుమ భక్తులు మల్లన్న స్వామికి ఇష్టమైన గజ్జెల లాగులు వేసుకొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి జాడి శ్రీశైలం, జాడి గట్టయ్య, జాడి వెంకయ్య, సమ్మయ్య, జాడి గట్టయ్య, రాజేందర్, రేగుల భాస్కర్, లక్ష్మి దేవర పూజారులు పాల్గొన్నారు. – కాళేశ్వరం -
అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని, 420 హామీలను అమలు చేయకపోతే వీపు చింతపండు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన భూపాలపల్లి పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి రైతుబంధు ఇప్పటి వరకు పడలేదన్నారు. తులం బంగారం, రూ.4వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, బతుకమ్మ చీరలు మీ ఎమ్మెల్యే సత్తన్న, సీఎం రేవంత్రెడ్డి ఇచ్చారా అని అడిగాడు. వెనుకట ఒకడు మొఖం బాగాలేక అద్దాన్ని పగులగొట్టిండట.. అట్లున్నది మన సీఎం పరిస్థితి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే లాగులో తొండలు చొర్రగొడుతా. గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా.. అని అంటుండన్నారు. అభివృద్ధి చేసిన గండ్ర ఈయన.. భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసిన అసలు గండ్ర ఈయన(వెంకటరమణారెడ్డి) అని, ఇచ్చిన హామీలు అమలు చేయని గండ్ర ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణరావు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి.. కాంగ్రెస్ది అభయ హస్తం కాదని, భస్మాసుర హస్తం అని కేటీఆర్ అన్నారు. భూపాలపల్లి ప్రజలకు హుషారు ఎక్కువ అని, ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. సీఎం వచ్చినా ఓట్లు రావు.. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు వచ్చారని, అయినప్పటికీ గాలి బీఆర్ఎస్ వైపు వీస్తుండటంతో భయపడి సీఎం రేవంత్రెడ్డి వచ్చారని, అయినా కాంగ్రెస్కు ఓట్లు పడవని, ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులతో భూపాలపల్లిలో చేపట్టిన పనులను ఎమ్మెల్యే సత్యనారాయణరావు నిలిపివేయించి బుద్దారంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాడని అన్నారు. ఆయన భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేక బుద్దారం గ్రామ సర్పంచా అని ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజన అశాసీ్త్రయంగా జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో, జిల్లాలను తగ్గిస్తామని సీఎం రేవంత్రెడ్డి మేడారంలో ప్రకటించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, మా జోలికి వస్తే నలిచి పారేస్తామని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఫిబ్రవరి వచ్చినా రైతు భరోసా పడలే 420 హామీలు అమలు చేయకపోతే.. వీపు చింతపండు చేస్తాం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ప్రచారం ముగిసింది..
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కోటగుళ్లలో పూజలు గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆశుతోష్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకటలక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించారు. వారిని ఆలయ అర్చకుడు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. సోమవారం ప్రత్యేక పూజలు కోటగుళ్లలో సోమవారం సందర్భంగా గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు స్వా మి వారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి చిట్యాల: క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతో ఆడాలని డీవైఎస్ఓ చిర్రా రఘు అన్నారు. సోమవారం జూకల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ జిల్లాస్థాయి సాఫ్ట్బాల్, బేస్బాల్ పోటీలకు జిల్లాలోని 12 మండలాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ రఘు మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ, ఏఎంఓ విజయపాల్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి, బండి ప్రసాద్, నూకల లింగయ్య, గాజర్ల శ్రీనివాస్, పూర్ణిమ, సమ్మయ్య, హేమలత, కల్యాణి, సులోచన పాల్గొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం భూపాలపల్లి అర్బన్: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12న దేశ వ్యాప్త ఒక రోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ.. సోమవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గంలో పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు కంపేటి రాజయ్య, మధుకర్రెడ్డి, తిరుపతి, బుచ్చయ్య, పోషం, సమ్మయ్య, రమేష్, సారయ్య పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు ప్రచారానికి తెరవేశారు. పట్టణాల్లో సాగిన, మైకుల మోత, ప్రచారహోరు మూగబోయింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులుగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1073 మంది పోటీ చేస్తుండగా.. ఒక్కో వార్డు నుంచి సగటున నలుగురైదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున ఆ పార్టీల అగ్రనాయకులు ప్రచారం నిర్వహించగా.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎఫ్బీ, రెబల్స్, ఇండిపెండెట్లు కూడా ప్రచారం సాగించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించడంతో ఒక్కసారిగా పట్టణాల్లో మైకుల మోత ఆగిపోయింది. ఆఖరు రోజు ప్రచార హోరు ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందునుంచే ఆయా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ధనసరి సీతక్క తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఆయా నియోజకవర్గాల పరిధి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర, జిల్లా నాయకులు జె.హుస్సేన్ నాయక్, డాక్టర్ కాళీప్రసాద్, చందుపట్ల కీర్తిరెడ్డి తదితరులు అభ్యర్థుల తరఫున ప్రచారంలో తిరిగారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో ప్రధాన పార్టీలు ప్రచారవేడిని పెంచాయి. ఇదిలా ఉండగా.. ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపాలిటీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పంపిణీ కార్యక్రమానికి పార్టీలు సోమవారం రాత్రినుంచే తెర తీశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటర్లకు ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,500.. మద్యం, మాంసం కూడా సరఫరా చేయడం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ రోజు స్థానిక సెలవు● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి అర్బన్: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు అందరూ మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ ఏర్పాట్ల కోసం వినియోగించనున్న ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాల కార్యాలయాలకు నేడు(మంగళవారం) సెలవు ప్రకటించినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్తో పాటు ఎన్నికల కమిషన్ అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, రేషన్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ తదితర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాలకు నేడు అధికారులు, సిబ్బంది.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,72,087లు కాగా, పురుషులు 1,63,088లు. ఆ మేరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సర్వం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అభ్యర్థుల ఖర్చు నామమాత్రంగా టీమ్ల ఏర్పాటు వీడియో రికార్డు లేకుండానే తనిఖీలు నిధులు మిగుల్చుకునే పనిలో అధికారులుఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుమున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరకాల గణపతి డిగ్రీ కాలేజీ నర్సంపేట ఏఎంసీ, నర్సంపేట వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్ వర్ధన్నపేట జనగామ ఏకశిల బీఈడీ కాలేజీ స్టేషన్ఘన్పూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్ హాల్ మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డోర్నకల్ నిర్మల హైస్కూల్ కేసముద్రం ఏఎంసీ, కేసముద్రం మరిపెడ సెయింట్ అగస్టిన్స్ హైస్కూల్ తొర్రూరు ఆర్యభట్ట హైస్కూల్ ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ -
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గణపురం మండలం చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం.. -
చింపాంజి వేషంతో..
మల్హర్ మండలం కొయ్యూరులో ప్రజలు కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ కోతుల భయంతో వణికిపోతున్నారు. ఎలాగైనా కోతుల సమస్యను పరిష్కరించాలని ఉపసర్పంచ్ సవేందర్ అనుకున్నాడు. ఆదివారం చింపాంజి వేశధారణలో గ్రామమంతా తిరిగాడు. భయంతో కోతులన్నీ పారిపోయాయి. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అటవీశాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని ఉపసర్పంచ్ సవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎడ్ల మధుసూదన్, లకావత్ లక్ష్మి తిరుపతి, రవళి శేషి వర్ధన్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. – మల్హర్ -
రోజుకు రూ.300
ప్రచారంతో ఉపాధి పొందుతున్న కార్యకర్తలుభూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో మైలేజీ కోసం అభ్యర్థులు కార్యకర్తలకు రోజుకు రూ.300 చెల్లిస్తూ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. పొద్దున ప్రచారానికి రూ.200, సాయంత్రం ప్రచారానికి రూ.100 చెల్తిస్తున్నారు. ర్యాలీలు, రోడ్షోలే కాకుండా వార్డుల్లో ప్రచారానికి కూడా అభ్యర్థులు కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారు. భారీ జనసమీకరణ కనిపించేలా.. భూపాలపల్లి మున్సిపల్లో అభ్యర్థులకు జనసమీకరణ కష్టంగా మారుతోంది. తమ వెంట ఎక్కువ మంది కనిపించేందుకు కార్యకర్తలను ఆశ్రయిస్తున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు వెంట ఉంటే లాభం లేదనుకుంటున్న అభ్యర్థులు భారీగా అనుచరులు, కార్యకర్తలతో ప్రచారంలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా తమ వెంట ఎక్కువ మంది జనాలు పాల్గొనాలని అనుకుంటున్నారు. సగటున రోజుకు రూ.300 ఇస్తామని తమ తరఫున ప్రచారంలో పాల్గొనాలని అడుగుతున్నారు. వీటితో పాటు ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం దాకా వంట ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికయ్యే ఖర్చులన్నింటినీ అభ్యర్థులే చెల్లిస్తున్నారు. ర్యాలీలకు, రోడ్షోలకు.. ప్రధాన నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాలకు జనసమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయా వార్డుల్లోని అభ్యర్థులపై పడింది. దీంతో ఎంతోకొంత ఇచ్చి ప్రచార సమయంలో జనాలు ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు, పార్టీలకు సంబంధించిన ముఖ్యనాయకులు వచ్చినప్పుడు కార్యకర్తల వినియోగం ఎక్కువగా ఉంటుంది. రోడ్షోలు, బైక్ ర్యాలీలకు పెట్రోల్ ఖర్చులతో పాటు మందు, విందు ఇతరత్రా ఖర్చులను అభ్యర్థులు భరించాల్సి వస్తోంది. ప్రచారానికి ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులందరూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ.300 వస్తుండటంతో ఇదే లాభసాటిగా ఉందని అనుకుంటున్నారు. ఇలా కొంతమంది వ్యవసాయ కూలీలు ఉపాధి పొందుతున్నారు. మున్సిపాలిటీ విలీన గ్రామాలైన కాశింపల్లి, పుల్లూరు రామయ్యపల్లి, జంగేడు, వేశాలపల్లి గ్రామాల్లో వ్యవసాయం ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల యాసంగి వరి నాట్లపై, ఇతర పంటల సాగుపై కూలీల కొరత ప్రభావం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోసం వాడుకుంటున్న అభ్యర్థులు విలీన గ్రామాల్లో యాసంగి పనులకు దెబ్బ -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చి దగా చేశారు..
వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.ఆదివారం నాలుగోరోజు 200 మేడారం హుండీలు లెక్కించగా రూ.2,64,75,757 ఆదాయం వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు.రోడ్షోకు హాజరైన పార్టీ శ్రేణులు నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పైసా పని చేయలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయక మో సం చేశారని.. ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆది వారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రోడ్ షోలు నిర్వహించారు. ఆయా చోట్ల కేటీఆర్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఒక్క తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నారని, హామీల పేరుతో మోసం చేసిన రేవంత్రెడ్డి సర్కారుకు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. రూ.4వేల పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదని, బతుకమ్మ చీర ఏమైందని, రంజాన్తోఫా రాలేదని, దీంతో పాటు పలు రకాల వాగ్దానాలు విస్మరించిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి గుణపాఠం చెప్పాలన్నారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందన్నారు. వర్ధన్నపేటలో దొంగ, పోలీస్ కలిసి మోసం.. దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును విమర్శించారు. రైతులకు, ప్రజలకు వెనకటి రోజులు తెప్పిస్తానని సీఎం అన్నారని వ్యంగ్యంగా అన్నారు. ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి రైతులు క్యూలైన్లో చెప్పులు పెట్టుకునేలా చేసి వారి అరిగోస పుచ్చుకున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే వర్ధన్నపేటలో జంక్షన్లు, రోడ్డు వెడల్పు, వీధి లైట్లు, డ్రైయినేజీలు అభివృద్ధి చేశా మన్నారు. రెండేళ్లలో చేయలేని వాడు వచ్చే మూడేళ్లలో ఏం పనులు చేస్తారని ప్రశ్నించారు. వంద పడకల ఆస్పత్రి పట్టణం నుంచి ఎందుకు మారుస్తున్నారని, తిరిగి ఇక్కడే అంటూ అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తండాలను వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు గిరిజనులకు ఇష్టం లేకుంటే తమ ప్రభుత్వం రాగానే, పాత పంచాయతీ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. చేయిచ్చిన పార్టీని నమ్మకండి.. హామీల అమలులో ప్రజలకు చేయిచ్చిన, చెవిలో పూలు పెట్టే కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. మార్పు కోసం కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, 420 హామీలిచ్చి అమలు చేయకుండా మోసగించారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క తప్పు ఓటు వేస్తే ఐదేళ్లు బాధ పడతారని, ఒక్కసారి వేసే మోసపోయారని మళ్లీ పునరావృతం కావద్దన్నారు. మున్సిపాలిటీల్లో ఓటు అడిగే అర్హత బీఆర్ఎస్కే ఉందన్నారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ గెలిచినట్లేనన్నారు.11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భస్మాసుర హస్తానికి ఎగనామం పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి ఆదరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, నాగుర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తొర్రూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. తొర్రూరులో రూ.వందల కోట్ల అభివృద్ధి నా హయాంలో జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ పని చేసిందో చెప్పాలి. వంద పడకల ఆస్పత్రి, మినీ ట్యాంకుబండ్, ఇతర పనులు మంజూరు చేయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాకు పేరు వస్తుందనే భయంతో పనులు చేయడం లేదు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి నేను నర్సంపేట పట్టణ అభివృద్ధికి తెచ్చిన నిధులను వాడుతున్నారే తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. రౌడీయిజం చెలాయించే విధంగా మాట్లాడుతున్నారే తప్ప అభివృద్ధి పట్ల అంకిత భావం లేదు. నన్ను బెదిరించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు.. వారి వల్ల ఏమీ కాదు. – పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకతతో నిబంధనల ప్రకారం సమర్థంగా నిర్వహించాలని (స్థానిక సంస్థలు) ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓలకు సంబంధించిన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పీఓ, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. మున్సిపల్ కమిషనర్ జోనా, మాస్టర్ ట్రెయినర్లు, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. -
ఇండిపెండెంట్లే కీలకం!
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలుపోటీలో అత్యధికంగా స్వతంత్రులు సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా ఉంది? హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబ ల్స్ కూడా) పోటీలో ఉన్నారు. ఇందులో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అన్ని వార్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
కాళేశ్వరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్
● పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసుల చర్యలు ● వంతెన నుంచి కాళేశ్వరానికి పాత రోడ్డుకు హద్దులుకాళేశ్వరం: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ నది అంత్యపుష్కరాలకు గతంలో జరిగినట్లు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తుగా పోలీసుశాఖ దృష్టిసారించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశాల మేరకు శనివారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ తహసీల్ధార్ రామారావు, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కన్నెపల్లి సమీపంలోని అంతరాష్ట్ర వంతెన రోడ్డు నుంచి కాళేశ్వరం మధునపోచమ్మ చెట్టు సమీపం గుండా టవర్ వరకు పాత నక్ష గొలుసు రహదారిని రెవెన్యూశాఖ సర్వే చేసి ఫార్మేషన్ రోడ్డు వేసేందుకు హద్దులు వేశారు. కాగా, 33 ఫీట్ల వెడల్పుతో 25 మంది వరకు రైతులకు చెందిన భూముల గుండా రహదారి వెళ్లనుంది. ఈ రహదారితో ఏర్పాటుతో పుష్కరాలకు వచ్చే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల వాహనాలు లోపలికి కాకుండా అక్కడే పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 25–30 ఎకరాల్లో స్థలాన్ని పరిశీలించారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందని పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పీఆర్ డీఈ సాయిలు, ఏఈ సతీష్, మహదేవ్పూర్ డిప్యూటీ తహసీల్దార్ యూసుఫ్, ఆర్ఐ రఘు, సర్వేయర్ రమేష్, కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్రెడ్డి, కన్నెపల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్, వీపీఓ శ్యామ్, దేవస్థానం మాజీ ధర్మకర్తలు అశోక్, సమ్మయ్య, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి చేసేవారికే పట్టం
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీని అభివృద్ధి చేసేవారినే గెలిపించుకుంటామని, నీతి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని భూపాలపల్లి పట్టణ ప్రజలు స్పష్టం చేశారు. శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలతో భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల ఎజెండా–సమస్యలు–పరిష్కారాలపై చర్చావేదిక నిర్వహించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతోనే భూపాలపల్లిలో ప్రధాన సమస్యలు పరిష్కారామవుతాయని, మూడు కూడళ్లలో రహదారి విస్తరణ చేపట్టి, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డుల పరిధిలో 52,726 ఓటర్లు ఉన్నారు. చర్చావేదికలో పలువురు వెల్లడించిన సమస్యలు వారి మాటల్లోనే.. రహదారి విస్తరణ చేపట్టాలిపట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రతీ రోజు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతున్నాయి. చౌరస్తా చు ట్టూ నాలుగు వైపులా రహదారి విస్తరణ చేపట్టాలి. అంబేడ్కర్ చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్షెల్టర్ నిర్మాణం చేపట్టాలి. –కొడపాక శంకర్, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలిజయశంకర్ చౌరస్తా వద్ద రోడ్డు ఇరుకుగా ఉంది. సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంబేడ్కర్ చౌరస్తా మాదిరిగానే అక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. – స్వామి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి సింగరేణి కంపెనీలో 30 ఏళ్లకు పైగా పని చేసి రిటైర్డ్ అయిన వారు వందలాది మంది భూపాలపల్లిలో ఉన్నారు. వారందరి సౌకర్యార్థం సింగరేణి యాజమాన్యం ఒక కమ్యూనిటీ హాల్ను నిర్మించాలి. – మారెపెల్లి రామస్వామి, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు పార్కులో సౌకర్యాలు కల్పించాలిజయశంకర్ పార్కును సింగరేణి, మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. పార్కులో ఓపెన్ జిమ్ మొత్తం మరమ్మతుకు గురైంది. సీసీ కెమెరాలు లేవు. దీంతో సాయంత్రం వేళల్లో మహిళలు పార్కుకు వచ్చేందుకు భయపడుతున్నారు. పాముల బెడద కూడా ఉంది. పార్కులో కనీసం తాగునీటి సౌకర్యం లేదు. –అంబటి శంకర్, సింగరేణి కార్మికుడు ర్యాష్ డ్రైవింగ్పై చర్యలు తీసుకోవాలియువకులు ప్రధాన రహదారితో పాటు చిన్నచిన్న వీధుల్లో సైతం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు, మహిళలు రోడ్డెక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు. అలాగే చెత్త సేకరణ ట్రాక్టర్లు ప్రతీరోజు కాలనీలకు రావడం లేదు. – కొండపర్తి శ్రీనివాస్, వ్యాపారి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి జంక్షన్లను అభివృద్ధి చేయాలి కోతులు, కుక్కల బెడద నివారించాలి ‘సాక్షి’ చర్చావేదికలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు -
లారీలతో ఇబ్బందులు
కాళేశ్వరం ఇసుక, సింగరేణి బొగ్గు లారీలతో పట్టణంలోని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నివారణకు మోరంచపల్లి నుంచి పట్టణంలోని బాంబులగడ్డ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. –యాకయ్య, పట్టణవాసి కోతుల బెడద లేకుండా చూడాలి పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వాటి నివారణకు మున్సిపల్ అధికారులు, రాబోవు పాలకవర్గం తగు చర్యలు తీసుకోవాలి. – కోల తిరుపతి, వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలి పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న షాపుల యజమానులు ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమించారు. కాలినడకన వెళ్లే వారికి దారి లేక జాతీయ రహదారిపై నడవాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలి. –శ్రీనివాస్రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు -
నేడు సీఎం రేవంత్రెడ్డి పర్యటన
సాక్షిప్రతినిఽధి, వరంగల్ /భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్లైన్ ఏర్పాటు, భీంఘన్పూర్ రిజర్వాయర్ ఆధునీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డిలు శనివారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలు దేరుతారు. 2:00 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. 2:15 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రోడ్డు ద్వారా చేరుకుంటారు. 2:40 గంటల వరకు స్వామి వారి దర్శనం, అతిథి గృహం, ఇతర ఆలయాల ప్రారంభోత్సవం 2:50 గంటలకు గణపురం మండలం చెల్పూరుకు చేరుకుంటారు. 3:15 గంటలకు ఘణపురం మండలం చెల్పూరుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు అవుతారు 5:00 గంటల వరకు ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడుతారు. 6:00 గంటలకు చెల్పూరు హెలిపాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. -
రైతులను కాపాడుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు చిట్యాల : దేశానికి అన్నంపెట్టే రైతులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాస్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతు సంక్షేమంపై వివిధ గ్రామాలకు చెందిన అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మాట్లాడారు. రైతులకు చట్టపరమైన ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని పేర్కొన్నారు. ఎరువుల షాపులు, నకిలీ పెస్టిసైడ్స్, నాసిరకం విత్తనాల పర్యవేక్షణకు అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి నిత్యం తనిఖీలు చేయాలని కోరుతూ పలు సూచనలు చేశారు. ఈ సదస్సులో పీపీ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.శ్రీనివాస్, స్పెషల్ పీపీ నిమ్మల విష్ణువర్ధన్, సర్పంచ్ తౌటం లక్ష్మి, న్యాయవాదులు రాజ్కుమార్, మహేందర్ రెడ్డి, పారా లీగల్ వలంటీర్ ఆరెపల్లి తిరుపతి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. నాపాక ఆలయం సందర్శన.. మండలంలోని నైన్పాకలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి సర్వతోభద్ర ఆలయాన్ని సీనియర్ జడ్జి నాగరాజు సందర్శించి ప్రత్యేక పూజాలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకుడు పెండ్యాల ప్రభాకారచార్యులు దేవాలయ విశిష్టతను వివరించారు. కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్ తదితరులు ఉన్నారు. -
గోశాలలో గో మహత్య ప్రవచనం
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శివకృష్ణ గోశాలలో శనివారం గో మహత్య ప్రవచనం నిర్వహించారు. గోశాల నిర్వాహకులు లక్ష్మి,ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచకులు పాలెపు చంద్రశేఖర్ శర్మతో గోమాత ఆధ్యాత్మిక, వైదిక, సంస్కృతిక ప్రాధాన్యతపై భక్తులకు ప్రవచనాలు వినిపిస్తున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆదివారం (నేడు) ప్రవచన కార్యక్రమం ముగియనున్నా నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోకృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు తెలిపారు. కొడుకు పుట్టిన సంబరం తీరక ముందే తండ్రి హఠాన్మరణం ● పదిహేనేళ్లకు సంతానం కాళేశ్వరం: పెళ్లయిన పదిహేనేళ్లకు సంతానం కలిగింది. కొడుకు పుట్టిన సంబురంలో మునిగితేలిన ఆ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన కాళేశ్వరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన పొన్నం వేణు (40), సంధ్యారాణి దంపతులు గత పన్నేండేళ్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వాటర్ప్లాంట్, కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి సంతానం లేక పదిహేనేళ్లుగా మనోవేదనకు గురయ్యారు. వారంరోజులక్రితం వీరికి కుమారుడు జన్మించాడు. దీంతో వారిద్దరి సంబరానికి అవధుల్లేవు. కానీ ఇంతలోనే విధి వక్రిరించడంతో వేణుకు షుగర్ లెవల్స్ బాగా పెరిగి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం చేరాడు. అక్కడే చికిత్సపొందున్న క్రమంలో శనివారం గుండెపోటుతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. కొడుకు పుట్టిన ఆనందం, భార్య సంతోషం అన్నీ వేణు మృతితో ఆవిరైపోయాయి. ఇస్రో సందర్శనకు ఎంపిక చిట్యాల : మండలంలోని జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ఈనెల 26న ఇస్రోను సందర్శించి, రాకెట్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినట్లు ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ శనివారం తెలిపారు. ఎన్నికై న విద్యార్థులను, ప్రధానోపాధ్యాయుడిని, ఉపాధ్యాయులను కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించినట్లు పేర్కొన్నారు. అలాగే భూపాలపల్లి జిల్లాలోని మరిన్ని పాఠశాలల విద్యార్థులు కూడా సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెరిగిన గోదావరి వరద మంగపేట : మండలంలో గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో గోదావరి ఒడ్డు వెంట చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు నిలిచి పోయాయి. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజ్ ఎగువ ప్రాంతం నుంచి వరద ఇన్ఫ్లో పెరగడంతో శనివారం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరిలో వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రం వరకు కరకట్ట బండ్ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వరద నీరు చేరింది. పొక్లెయినర్ల చుట్టూ సైతం నీరు చేరడంతోపాటు బండ్ నిర్మాణానికి వినియోగించే రాళ్లు కూడా నీట మునిగి పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఇదే విషయంపై ఇరిగేషన్ ఏఈ వలీమ్మహ్మద్ను వివరణ కోరగా గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల తాత్కాలికంగా పనులకు అంతరాయం కలిగిందన్నారు. 14,503 క్యూసెక్కుల నీరు విడుదల కన్నాయిగూడెం : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి దిగువకు 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 6,000 క్యూసెక్కుల ఉన్న నీరు శనివారం బ్యారేజ్లోకి ఒక్కసారిగా 14,750లకు వచ్చి చేరింది. రామప్పను సందర్శించిన 13 దేశాల ప్రతినిధులు వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని 13 దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు శనివారం సందర్శించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ శిక్షణ పొందుతున్న లెబనాన్, టర్కీ, ఉజ్జెకిస్తాన్, జింబాబ్వే, ఈజిప్ట్, మొరా కో, ఇథియోపియా, టాంజానియా, లైబీరియా, మాలి, బోట్స్వానా, మారిషన్, గ్వాబెమాల దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో రామప్పను సందర్శించగా అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. -
ఆహార కల్తీ నియంత్రణ అధికారుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలను శుక్రవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ వరుణ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో ఆహారం తయారు చేసే సిబ్బందికి ఆహార భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఆహార తయారీ సమయంలో తప్పనిసరిగా హెడ్క్యాప్స్, గ్లోవ్స్ ధరించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య రికార్డులను నిర్వహించాలన్నారు. పిల్లల ఆరోగ్యం అత్యంత కీలకమని, నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఆహార భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఏవైనా లోపాలు కనిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. -
రేపు సీఎం బహిరంగసభ
గణపురం: గణపురం మండలం చెల్పూరు శివారులో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం అధికారులతో కలిసి సీఎం బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు జూలసల్లి నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు. చిట్యాల: మండలంలోని వెంచరామి శివారు పూరేడుగుట్ట వద్ద జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఎండోమెంట్ ఈఓ మహేష్ , కార్యనిర్వహణ అధికారి ప్రసాద్, జాతర కమిటీ చైర్మన్ నాయిని స్వామి, కమిటీ సభ్యులు, పూజారుల ఆధ్వర్యంలో జాతరలో ఏర్పాటు చేసిన నాలుగు హుండీలను లెక్కించగా.. రూ.4లక్షల 50 వేల ఆదాయం లభించింది. టెండర్ల ద్వారా రూ.74వేలు, 1 గ్రామ్ బంగారం, 73 గ్రాముల వెండి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వపల్లి సర్పంచ్ పులి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ కచ్చు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, నాయకులు కచ్చు శ్రీనివాస్ పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రచారానికి వినియోగించే వాహనాలకు సంబంధించి ముందుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో మైక్ పర్మిషన్, ర్యాలీ పర్మిషన్, బహిరంగ సభలకు సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికలు శాంతియుతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. -
బస్తీమే సవాల్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. జిల్లా కేంద్రం, నియోజకవర్గ ప్రధాన కేంద్రం కావడంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ఈనెల 11న పోలింగ్ ఉండటం, పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉన్న తరుణంలో ఉన్న మూడు రోజుల్లో అభ్యర్థులు ప్రచారాన్ని గడపగడపకు తీసుకెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉన్న కొద్ది రోజులనే ప్రచారానికి అనువుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా ప్రచారంలో మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఇతర ముఖ్యనాయకులు పాల్గొనటంతో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ముమ్మరంగా వార్డుల్లో పర్యటిస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు ఉండగా 107 మంది పోటీ పడుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఉదయం 7–8 గంటల నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఓటర్ల గడపగడపకు వెళ్తూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక నాయకులతో పాటు బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనచారి తమ అభ్యర్థులను గెలిపించాలని పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గండ్ర సత్యనారాయణరావు వీరితో పాటు బీజేపీ తరఫున భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుదామని ప్రధాన పార్టీలు అనుకుంటున్నప్పటికీ ప్రచారానికి తక్కువ రోజులు సమయమే ఉండటంతో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నెల 8వ తేదీ సీఎం రేవంత్రెడ్డి చెల్పూరు శివారులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ నెల 9న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆ పార్టీ తెలిపింది. స్వతంత్రుల మద్దతు కోసం.. ప్రస్తుతం మున్సిపాలిటీ బరిలో 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిని ప్రచారానికి దూరంగా ఉంచేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. స్వతంత్రులను పోటీ నుంచి తప్పించి వారి మద్దతు పొందితే గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయనే అభిప్రాయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ప్రచార బరిలోకి మంత్రులు, ఎమ్మెల్యే ప్రతీ ఓటు కీలకం.. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం ప్రచారానికి మరో మూడు రోజులే.. బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి, రోడ్ షోకు మాజీ మంత్రి కేటీఆర్ప్రస్తుతం పట్టణంలో ప్రధానంగా మూడు పార్టీలు తలపడుతుండటంతో ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒక్క ఓటు కూడా గెలుపోటములను నిర్ణయించే పరిస్థితి ఉండటంతో ప్రతీ ఓటుకోసం ప్రత్యక్షంగా ఓటర్లను కలుస్తున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు హైదరాబాద్, హనుమకొండలో ఉన్న వారితో మాట్లాడుతూ పోలింగ్ రోజూ తప్పకుండా వచ్చి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పలు వార్డుల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులను, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. -
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
● మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే ● గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు.. పకడ్బందీగా గెలుపు కోసం పావులు ● రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం ● ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్చార్జ్ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా.. సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్చార్జ్లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 10 నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు..ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సవాల్గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్ రెడ్డి చైర్మన్ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్చార్జ్లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీలు అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్ఎస్)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు. ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జ్లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్నాయక్(బీఆర్ఎస్)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్ఎస్ నుంచి మాజీ విప్ దాస్యం వినయ్భాస్కర్, కాంగ్రెస్ నుంచి సీహెచ్ వెంకటేశ్లు ఇన్చార్జ్లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్నాయక్.. అభ్యర్థులను బరిలోకి దింపారు. డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (బీఆర్ఎస్)లకు సవాల్గా మారాయి. -
మే తొలి వారంలోపు పూర్తి
కాళేశ్వరం: సరస్వతినది అంత్యపుష్కరాలకు సంబంధించి చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు మే తొలి వారంలోపు పూర్తిచేయాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. మే 21నుంచి జూన్ 1వరకు కాళేశ్వరంలో జరుగు పుష్కరాల ప్రతిపాదిత పనులను శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ కార్యాలయంలో ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంక్తీర్త్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.30.61 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మూడు నెలల సమయం ఉన్నందున పనులకు ప్రాధాన్యత నిర్ణయించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల పురోగతిపై ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపడుతానన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అటవీమార్గంలోని కుదురుపల్లి–బీరసాగర్ రహదారి నిర్మాణానికి అంచనాలు సమర్పించాలన్నారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి, 30–40 ఎకరాల్లో వాహనాల పార్కింగ్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరస్వతీఘాట్ వద్ద పక్షితీర్ధంను అభివృద్ధి చేయాలని అర్కిటెక్చర్ మ్యాప్ ద్వారా వివరించారు. టెంట్సిటీ, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్ల వద్ద జనరేటర్ల ఏర్పాటు చేయాలని, చరిత్ర ఆనవాళ్లు పదిలంగా ఉండేవిధంగా 86 గదుల భవనం సమీపంలో మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ప్రతిపాదనల మార్పుల కోసం.. అంచనా ప్రతిపాదనల్లో మార్పులు అవసరమైతే రెండు రోజుల్లో సవరించిన ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి, సబ్కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి రేగొండ: కోటంచలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ అన్నారు. ఆలయంలో పనులతో పాటు, ఆలయ మాడ వీధులు, షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహ పనులను ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ నెల 8న సీఎం రేవంత్రెడ్డి రానున్న నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, ఆలయ ఈఓ మహేష్ పాల్గొన్నారు. సరస్వతినది అంత్యపుష్కరాల పనులకు డెడ్లైన్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
పులి.. ఒకటా? రెండా?
రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివారులోని పరిశె రాజుకుచెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేష్ అటవీశాఖ డీఎఫ్ఓ కొండల్రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలుగా నిర్ధారించారు.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దులోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో పులి సంచరించినట్లు శుక్రవారం మద్దూరు సీఐ రమేష్, ఎస్సై ఆసీఫ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు గుర్తించారు. సమీప గ్రామాలైన కట్కూర్, వీఎస్ఆర్ నగర్, బండనాగారం, బంజేరు, మార్మాముల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆడనా.. మగనా... ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్ బెంగాల్ టైగర్గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పులికోసం బోన్లు.. ట్రాప్ కెమెరాల ఏర్పాటు పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్ జాడలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది. మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు. రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు. వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి. పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ, ఎస్హెచ్ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి. -
సోషల్ సందడి..
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోషల్ మీడియా వేదికగా వారం రోజుల నుంచే మొదలైంది. షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాను తమ ప్రచార అస్త్రంగా చేసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల సెంటిమెంట్ను ప్రధాన ప్రచార అస్త్రంగా బీజేపీ మలుచుకుంటోంది. ఆ పార్టీతో పాటు అనుబంధ సంఘాల పేరిట కూడా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా పరోక్ష ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను హైలెట్ చేస్తూ వార్డుల్లో తమ ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీ వాగ్ధానాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ప్రధాన పార్టీలన్నీ వార్డుల వారీగా ఓ వైపు పార్టీల పేరిట, మరో వైపు థార్మిక సంఘాలు, ఆధ్యాత్మిక యువజన సంఘాల పేరిట గ్రూపులను ఏర్పాటు చేయడంలో తలమునకలవుతున్నాయి. ప్రచారంలో సోషల్ మీడి యా పాత్ర అత్యంత కీలకంగా మారబోతోందని, ఈ ప్రచారమే ప్రధాన అస్త్రం అవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతీ ఓటరు వద్ద సెల్ఫోన్ ఉండడం.. సోషల్ మీడియాను విస్తృతంగా ఫాలో అవుతున్న కారణంగా వాట్సాప్ గ్రూపునకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలను సైతం పార్టీలు తమ ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నాయి. వార్డుల వారీగా ఇన్చార్జ్ల నియామకం.. సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా మలుచుకునే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు వార్డుల వారీగా ఇన్చార్జ్లను నియమించుకొని గ్రూపులను ఏర్పాటు చేసుకొని ప్రచార పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఇన్చార్జ్లంతా తమ వార్డులోని పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించే వారు అలాగే తటస్తులను సైతం గ్రూపులో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఆయా పార్టీల ఇన్చార్జ్లే గ్రూపునకు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ వారు మాత్రమే పోస్టులు పెట్టే విధంగా చూసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా సమన్వయకర్త వార్డుల వారీగా ఇన్చార్జ్లతో టచ్లో ఉంటూ పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల తరఫున జారీ అయ్యే అన్ని ప్రకటనలను అలాగే పథకాల ప్రాధాన్యతను ఈ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఈ ఇన్చార్జ్లు నిరాటంకంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని రకాల పోస్టులను వైరల్ చేస్తూ తమ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసే యువకులకు ఆయా పార్టీల అభ్యర్థులు రోజుకు రూ.1500 చొప్పున పారితోషికం చెల్లిస్తున్నారు. కెమెరాలు, సెల్ఫోన్లలో వీడియో, ఫొటోలు తీసుకుంటూ ఇన్స్ట్రాగామ్ రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ను వార్డు గ్రూపులు, ఓటర్లకు పంపించే పని చేస్తున్నారు. ఎన్నికల కారణంగా సోషల్ మీడియాపై పట్టున్న యువకులకు ఉపాధి సైతం లభిస్తుంది. వార్డుల వారీగా గ్రూపులు ఏర్పాటు వేదికలుగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్లు అన్ని పార్టీల గ్రూపుల్లో వార్డుల ప్రజలు మార్మోగుతున్న ప్రచారం -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
భూపాలపల్లి: ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సీఎం పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్య, విద్యుత్, అగ్నిమాపక, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సందర్భంగా శాఖల వారీగా నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కొడవటంచ, చెల్పూరు హెలిప్యాడ్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాలతో సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర వైద్యసేవల కోసం కొడవటంచలో సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలన్నారు. చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే సభా ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చెల్పూరులో పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతంలో ఆయుష్ ఆస్పత్రిలో సేఫ్ హౌస్, మీటింగ్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్కు అవసరమైన వాహనాల ఏర్పాటు, సీఎం ప్రయాణానికి వినియోగించే వాహనాల ఫిట్నెస్ తనిఖీలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొడవటంచ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,వీఐపీల ప్రొటోకాల్, పురోహితులను నియమించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ పూర్తి.. పురపాలక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన రెండో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తూ టీ–పోల్ పోర్టల్ ద్వారా ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు 104 మంది, ఏపీఓలు 104, ఓపీఓలు 312 మందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించి 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పొరపాట్లకు తావివ్వొద్దు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


