మూడేళ్లుగా తిరుగుతున్నా..
మంచిర్యాల–విజయవాడ గ్రీన్ిఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా గిద్దెముత్తారం గ్రామంలోని మా ఇంటి నంబర్ 8–28/1, ఇంటి ఆవరణలోని నాలుగు గుంటల ఖాళీ స్థలం తీసుకునేందుకు రెవెన్యూ అఽధికారులు సర్వే చేశారు. రూ.14లక్షల 28వేల 147 పరిహారం మాత్రమే చెల్లిస్తామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పూర్తి పరిహారం చెల్లించలేదు. ఇంటికి పరిహారం రూ. 50లక్షల పరిహారం, నాలుగు గుంటల ఖాళీ స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. మూడేళ్ల నుంచి తగిన పరిహారం కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.


