Bollywood
-
భాయ్... బాబా... ఓ అంతర్జాతీయ చిత్రం
‘‘అదిరింది టీజర్... సల్మాన్ భాయ్ భలే ఉన్నాడు... సంజూ బాబా కూడా బాగున్నాడు’’ అంటూ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల అభిమానులు ఆనందపడిపోతున్నారు. శుక్రవారం విడుదలైన సౌదీ అరేబియన్ మూవీ ‘7 డాగ్స్’ టీజర్లో సల్మాన్, సంజయ్ల లుక్స్ని ఇలా ప్రశంసించారు. ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రం ఇది.ఈ చిత్రానికి అదిల్ ఎల్ అరబీ, బిలాల్ ఫల్లాహ్ దర్శకత్వం వహిస్తున్నారు. అరబ్ స్టార్స్ కరీం అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో సల్మాన్, సంజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. టీజర్లో ఇద్దరి పాత్రల గురించిన విశేషాలను బయటపెట్టలేదు. సల్మాన్ విచిత్రమైన చూపులు చూస్తుండగా, తుపాకీ గురి పెట్టి, కోపంగా కనిపించారు సంజయ్ దత్.కథేంటంటే... వార్తల్లో ఉన్న ప్రకారం... ఇంటర్పోల్ ఆఫీసర్ ఖలీద్ అల్ అజ్జాజీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. రహస్య ప్రపంచ నేరాల సిండికేట్ అయిన ‘7 డాగ్స్’లోని ఉన్నత స్థాయి సభ్యుడు ఘాలీ అబు దావూద్ను ఈ అధికారి పట్టుకుంటాడు. ఓ ఏడాది తర్వాత ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది. పింక్ లేడీ అనే కొత్త డ్రగ్ను రవాణా చేయడం ప్రారంభిస్తుంది. ఈ ముఠా గుట్టుని రట్టు చేయడానికి ఖలీద్ అయిష్టంగానే ఘాలీతో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ అని సమాచారం. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
కెరీర్ ప్రారంభంలో అవమానాలు, చీవాట్లు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎందరో! తొలి సినిమాకు తను కూడా అలాంటి బాధే అనుభవించానంటున్నాడు నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం (Muzammil Ibrahim). ఈ సూపర్ మోడల్ ఢోకా సినిమాతో హీరోగా మారాడు. ఆ సమయంలో డైరెక్టర్ పూజా భట్ తనను చులకనగా చూసేదని, తల కొట్టేసినట్లుగా ఉండేదని చెప్తున్నాడు.తొలి సినిమా.. దారుణ అనుభవాలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ముజమ్మిల్ ఇబ్రహీం మాట్లాడుతూ.. పూజా భట్ (Pooja Bhatt) నన్ను అన్ప్రొఫెషనల్ అని పిలిచేది. తనకు కోపమెక్కువ. అందుకుతోడు యాటిట్యూడ్.. నటులను చులకనగా చూసేది. నిర్మాత మహేశ్ భట్కు మాత్రం నేనంటే చాలా ఇష్టం. మంచి నటుడినని అంటుండేవారు. ఢోకా సినిమా సమయానికి నా వయసు దాదాపు 20 ఉంటుందనుకుంటా.. అంతే! సెట్లో నన్ను దారుణంగా చూసేవారు. నేను అందరితోనూ గౌరవంగా నడుచుకునేవాడిని.. నాకంటూ కొన్ని అంచనాలుండేవి. కానీ అవన్నీ తలకిందులు చేశారు. నటులంటే శునకాలు!నాతో దుర్భాషలాడిన తీరు చూశాక మరెలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ఆ రేంజ్లో ఆమె నన్ను తిట్టేది. ఈ వాతావరణం చూశాక నాకు చాలా భయమేసింది. సూపర్ మోడల్గా ఇండియాలో నాకంటూ గుర్తింపు, గౌరవం ఉండేది. నేను పడుతున్న అవమానాలు చూసి మహేశ్ భట్ సర్.. నాతో అలా ప్రవర్తించవద్దని పూజా భట్ను కోరేవాడు. కానీ ఆయన సెట్లో లేనప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేది. అంతేకాదు.. నటులు కుక్కల్లాంటివారని.. తాము కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలని ఆమె అంటూ ఉండేదట. (చదవండి: ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ)పీడకలలు వెంటాడేవిచిన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవన్నీ విని భరించలేకపోయాను. నాపై వచ్చిన వార్తలు చూసి మరింత కలత చెందాను. నిద్రలో కూడా పీడకలలు వచ్చేవి. ఎలాగోలా ఆ రోజు బతికితే చాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తుండేవాడిని. అలా కష్టాలు అనుభవించాను. అందుకే తర్వాత రాజ్ 2 ఆఫర్ వచ్చినా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. దీపికాతో రిలేషన్దీపికా పదుకొణె (Deepika Padukone)తో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ముంబైకి వచ్చిన కొత్తలో దీపిక పదుకొణె మోడల్గా పని చేసింది. అప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నాం. మా దగ్గర డబ్బు లేక రిక్షాలోనే తిరిగేవాళ్లం. తర్వాత కొన్ని కారణాలతో బ్రేకప్ చెప్పుకున్నాం. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు పెళ్లయ్యాక మాట్లాడుకోవడమే మానేశాం అని తెలిపాడు. దీపికా.. హీరో రణ్వీర్ సింగ్ను 2019లో పెళ్లాడింది. వీరికి గతేడాది దువా అనే కూతురు జన్మించింది.సినిమాఢోకా మూవీ (Dhokha Movie) విషయానికి వస్తే.. 2007లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. ముజమ్మిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. తులిప్ జోషి హీరోయిన్గా నటించగా అనుపమ్ ఖేర్, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.చదవండి: అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ -
అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ తహతహలాడటమే కాక ఆయా సినిమాల కథలను కాపీ కొడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇప్పుడు మనల్ని కాపీ కొడుతుంది కానీ ఒకప్పుడు సౌత్ సినిమాకు హిందీ ఇండస్ట్రీయే ఆధారం అంటున్నాడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ. హిందీ సినిమాలను రీమేక్ చేసే సౌత్ హీరోలు స్టార్ స్టేటస్ అందుకున్నారంటున్నాడు.సౌత్లో హిందీ సినిమాల రీమేక్స్తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. మొదట్లో దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమాలు రీమేక్ అయ్యేవి. 70's, 80's కాలంలో రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీ రామారావు, రాజ్కుమార్.. వీళ్లంతా కూడా బిగ్బీ సినిమాల రీమేక్స్లో నటించేవారు. అయితే 1990 తర్వాత బచ్చన్ ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాడు.మసాలా సినిమాలుసరిగ్గా అప్పుడే మ్యూజిక్ కంపెనీలు రంగంలోకి దిగాయి. కేవలం వారి పాటల్ని, సంగీతాన్ని అమ్ముకోవడం కోసం సినిమాలు తీసేవి. మైనే ప్యార్ కియా వంటి సినిమాలు అలా వచ్చినవే.. కానీ సౌత్లో మసాలా సినిమాలు తీయడం మాత్రం ఆగలేదు. వాటిక్కూడా బిగ్బీ చిత్రాలే మూలం. దానివల్లే ఇక్కడున్న హీరోలు అభిమానులకు దేవుడిలా మారిపోయారు. అలా ఆ హీరోల స్టార్డమ్ ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది అని వర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ.. -
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్బర్డ్స్కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda)p; -
ఓటీటీకి వచ్చేసిన రూ.120 కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా జాట్. ఈ సినిమాలో సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' ఏప్రిల్ 10న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన జాట్.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్ల వరకు రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా విలన్గా మెప్పించగా.. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.జాట్ అసలు కథేంటంటే..?ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి గ్రామానికి దాదా రణతుంగ (రణ్దీప్ హుడా) శ్రీలంక నుంచి వస్తాడు. తన తమ్ముడితో కలిసి ఆ గ్రామంలో చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే, అనుకోకుండా అదే ఊరి మీదుగా వెళ్తున్న రైలు సాంకేతిక లోపం కారణంగా అక్కడ ఆగిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న జాట్ (సన్నీ డియోల్)కు ఆకలి వేయడంతో దగ్గరలో ఉన్న హోటల్కు వెళ్లి ఇడ్లీ తింటున్న సమయంలో కొందరు రౌడీ మూకలు అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తారు. ఆ సమయంలో తన ప్లేటు నుంచి ఇండ్లీ కిందపడిపోతుంది. ఈ క్రమంలో వారిని సారీ చెప్పమని కోరుతాడు జాట్. కానీ, వారు మాత్రం గొడవకు దిగుతారు. అలా ఒక భారీ ఫైట్తో జాట్ రెచ్చిపోతాడు. ఈ విషయం కాస్త రణతుంగ వద్దకు చేరడంతో జాట్ గురించి ఆరా తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? రణతుంగను చూశాక జాట్కు తెలిసిన నిజం ఏంటి..? వారిద్దరి మధ్య గతంలో ఉన్న లింకేంటి..? రణతుంగపై ఎందుకు పోరుకు దిగుతాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.Don't fear, Jaat is finally here 💥 Iske jaisa na kabhi hua hai, na kabhi hoga 🔥💪Watch Jaat, out now in Hindi and Telugu on Netflix.#JaatOnNetflix pic.twitter.com/3IBxy7QNhi— Netflix India (@NetflixIndia) June 5, 2025 -
సినిమా ఒకటి... క్లైమాక్స్లు రెండు
ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్లో సినిమాయే. కానీ అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల ప్రేక్షకులకు పలు రకాల వినోద మాధ్యమాలు (ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓటీటీ వంటివి) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకురావడం హీరోలు–దర్శక–నిర్మాతలకు పెద్ద సవాల్గా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్ప స్టార్ హీరోల సినిమాలూ ఎక్కువ రోజులు థియేటర్స్లో ఆడే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక రిపీట్ ఆడియన్స్ అన్నమాట దాదాపుగా కనుమరుగైపోతోంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం రిపీట్ ఆడియన్స్ ఉండటం లేదు. ఎలాగూ నెల రోజులు తిరిగే లోపు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా స్ట్రీమింగ్ ఉంటుందనేమో ప్రేక్షకులు నచ్చిన సినిమాను మరోసారి థియేటర్స్లో చూసేందుకు ఏమాత్రం సిద్ధపడటంలేదు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే రెండోసారి ప్రయత్నిస్తుండవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు ఒకే సినిమాను థియేటర్స్లో రెండోసారి చూస్తున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు–దర్శక–నిర్మాతలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ని ఆకర్షించే సరికొత్త వ్యూహాలను రచిస్తూనే ఉన్నారు. తాజాగా హిందీ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ యూనిట్ ప్రేక్షకులను ఆకర్షించే ఓ సరికొత్త వ్యూహానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 5ఏ అండ్ 5బీ హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్లో ‘హౌస్ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ఐదో సినిమా ‘హౌస్ఫుల్ 5’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమైంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్... ఇలా ప్రముఖ తారలు ‘హౌస్ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాని ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’ అంటూ రిలీజ్ చేస్తున్నారు. కానీ... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం లేదు. ఒకే సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్లు ఉంటాయన్నమాట. అంటే... ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమాలో ఒక క్లైమాక్స్ ఉంటే, ‘హౌస్ఫుల్ 5బీ’లో మరో డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటుంది. అలాగే ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’... ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ ఇన్స్టాలో ఓ వీడియోతో అధికారికంగా ధ్రువీకరించారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా ‘హౌస్ఫుల్ 5’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘హౌస్ఫుల్ 5’ కూడా సిద్ధమైంది. ‘హౌస్ఫుల్ 5’ సినిమా రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో రాబోతోంది. మరి... మీరు ‘హౌస్ఫుల్ 5ఏ’ చూస్తారా? లేక ‘హౌస్ఫుల్ 5బీ’ చూస్తారా? లేదా రెండూ చూస్తారా?’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు అక్షయ్ అండ్ రితేష్. ఇదిలా ఉంటే... ‘హౌస్ఫుల్ 5’ సినిమా కథాంశం ఓ కిల్లర్ను కనుక్కునే నేపథ్యంలో సాగుతుంది. దీంతో ‘హౌస్ఫుల్ 5ఏ’లో కిల్లర్ ఒకరైతే, ‘హౌస్ఫుల్ 5బీ’లో కిల్లర్ మరొకరు ఉంటారట. తొలి ఇండియన్ సినిమా! కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచి ఆకట్టుకున్నా క్లైమాక్స్లో మాత్రం ఆడియన్స్ను నిరాశపరుస్తాయి. కానీ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమా చూసిన ఆడియన్స్ ‘హౌస్ఫుల్ 5బీ’ సినిమా క్లైమాక్స్ కోసం మళ్లీ ఆ సినిమాను చూసేందుకు థియేటర్స్కు వెళ్లొచ్చు. అలాగే ‘5బీ’ చూసినవాళ్లు ‘5ఏ’ క్లైమాక్స్ ఇంకా బాగుందని వింటే... ఆ వెర్షన్ చూడ్డానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకుల్లో ‘హౌస్ఫుల్ 5’ సినిమా గురించి ఓ రకమైన చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సినిమాకు మౌత్టాక్గా మారి, ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఇదే జరిగితే థియేటర్స్కు వచ్చే ఆడియన్స్ సంఖ్య మెల్లిగా పెరుగుతుంది. వసూళ్లకు ఇదో కొత్త మార్గం అవుతుంది. రిపీట్ ఆడియన్స్తో థియేటర్లు హౌస్ఫుల్ అయితే... హౌస్ఫుల్ టీమ్ వ్యూహం సక్సెస్ అయినట్లే లెక్క. మరి... ఈ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే... రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ అంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. -
Wedding: క్యాన్సర్తో నటి.. కంటికి రెప్పలా చూసుకునే ప్రియుడు..
బుల్లితెర సెలబ్రిటీ జంట హీనా ఖాన్ (Hina Khan)- రాకీ జైస్వాల్ (Rocky Jaiswal) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 11 ఏళ్ల ప్రేమాయణానికి శుభం పలుకుతూ బుధవారం నాడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను హీనా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇద్దరి ప్రపంచాలు వేరైనా ప్రేమ అనే బంధంతో ఒక్క గూటికి చేరాం. రెండు మనసులు ఒక్కటయ్యాయి. ఎవరూ విడదీయలేనంతగా మా బంధం బలపడింది. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నటిదాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాం. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వైవాహిక ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే హీనా ఖాన్, రాకీ జైస్వాల్ 2014 నుంచి డేటింగ్ చేస్తున్నారు. తన విజయాల్లోనే కాకుండా కష్టాల్లోనూ ఆమెకు రాకీ అండగా ఉన్నాడు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆమెకు సపోర్ట్గా నిలబడ్డాడు. సీరియల్స్..కీమోథెరపీ వల్ల ఆమె జుట్టు తీసేయాల్సి వస్తే అతడు సైతం గుండు గీయించుకుని తనకు మద్దతుగా ఉన్నాడు. తల్లిలా దగ్గరుండి సేవ చేశాడు. ఇలాంటి పార్ట్నర్ దొరకడం తన అదృష్టమని హీనా ఖాన్ పలుమార్లు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది. కసౌటి జిందగీ కే, నాగిన్ (5వ సీజన్) సీరియల్స్లో ప్రధాన పాత్ర పోషించింది. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ అలరించింది. సినిమాలు, వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan) చదవండి: తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ.. -
‘మిస్ వరల్డ్’ స్పాన్సర్లకు సహకరించాల్సిందే: బాలీవుడ్ నటి
మిస్ వరల్డ్ ఇండియా పోటీల్లో పాల్గొన్న వారు స్పాన్సర్ల కార్యక్రమాల్లో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చిందని, నిర్దిష్ట దుస్తులు ధరించమని ఒత్తిడి చేయడం జరిగిందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపించడం మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్, ఐక్యరాజ్యసమితి గుడ్విల్ అంబాసిడర్ దుబాయ్ నివాసి సెలీనా జైట్లీ(Celina Jaitly), మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు.‘సౌందర్య వేదికల విలువను తక్కువగా అంచనా వేయడం బాధాకరం అన్నారామె. ‘అంతర్జాతీయ వేదిక అంటే ప్రొఫెషనలిజం, ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం’’ అంటూ పేర్కొన్నారు. తాజాగా గల్ఫ్ న్యూస్కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ మాట్లాడుతూ గతంలో మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున పోటీపడిన తన అనుభవం గుర్తు చేసుకున్నారు.‘ప్రపంచ మీడియా ముందు మీరు మీ దేశ ప్రతినిధిగా గౌరవంగా ఉండడం ఆవేదన చెందాల్సిన విషయం కాదు, గర్వించదగ్గ విషయం’’ అన్నారు. మిల్లా సిపిఆర్ శిక్షణ వంటి అంశాలను ముందుకు తెచ్చి పోటీకి సంబంధించిన మౌలిక అంశాలపై మార్పులు కోరడం సరికాదని సెలీనా అభిప్రాయపడ్డారు.వచ్చే 2025 చివరి నాటికి సౌందర్య పరిశ్రమ 667 బిలియన్ల డాలర్ల ఆదాయం, ఫ్యాషన్ రంగం 1.7 ట్రిలియన్ల విలువను సాధించబోతున్నాయని, ఈ రంగాలు కేవలం అందం గురించి కాక, కోటి మందికి ఉపాధిని అందిస్తున్నాయన్నారు. అంతేకాక సంప్రదాయ సాంస్కృతిక విలువల వ్యక్తీకరణకు వేదికలుగా కూడా నిలుస్తున్నాయనీ చెప్పారామె. భారతదేశ సౌందర్య రాణుల జాబితాలో ఉండడం గర్వంగా ఉందంటూ చెప్పిన జైట్లీ, సుష్మితా సేన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావించారు. ‘అందాల వేదికలపై వారి విజయాల వల్లే అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ ఆర్ధికవ్యవస్థలోకి అడుగుపెట్టాయి. ఈ వేదికలను తక్కువ చేసి చూడడం బాధాకరం’’ అన్నారు.మిల్లా చేసిన ఆరోపణల్లో స్పాన్సర్లతో పాల్గొనడం ‘దుర్వినియోగం‘గా వర్ణించడాన్ని సెలీనా ఖండించారు. ‘స్పాన్సర్లతో సహకరించడం సందర్భానుసారంగా దుస్తులు ధరించడం వంటివి ఈ వేదికలో సహజమేనని చెప్పారు. ‘‘ ఇది హెచ్ఆర్ సెమినార్ కాదు, ఇది బ్యూటీ కాంటెస్ట్ అని గుర్తుంచుకోవాలి’’ అన్నారామె మిల్లా చేసిన ప్రసంగాల్లో స్పాన్సర్ల కార్యక్రమాలను వ్యభిచారంతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జైట్లీ, ‘ఇలాంటి భాష వాడటం వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాదు. ఇది సాటి మహిళలను తక్కువ చేయడంతో పాటు కోటి మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమలను అవమానించడం కూడా’’ అంటూ మండిపడ్డారు.‘ఒక సైనికుడి కూతురిగా సుదూర ప్రాంతాల్లో పెరిగాను. బ్యూటీ కాంటెస్ట్ వేదికలు నా జీవితాన్నే మార్చాయి. అందాల కిరీటం వల్లనే నేను ఐక్యరాజ్యసమితి, బాలీవుడ్ వేదికల వరకూ వెళ్లగలిగాను’’ అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడారు. వివాదాలు, తప్పుదోవ పట్టించే విమర్శల నడుమ, సెలీనా జైట్లీ చివరగా ఓ విషయం స్పష్టంగా చెప్పారు. ‘‘ బ్యూటీ కాంటెస్ట్లు కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కట్టుబాటు, అంకితభావం, దేశ గౌరవం కోసం నిలబడే వేదికలు’’ -
ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్
ఏదైనా ప్రమోషన్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.పూర్తిగా నమ్ముతున్నా..అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత కొన్ని రోజులుగా ఎన్ఎమ్ఎన్ (నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్) అనే సప్లిమెంట్ను ప్రమోట్ చేసింది. ఇది డీఎన్ఏను రిపేర్ చేసి మన వయసు పెరగనీయకుండా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు ఈ ఎన్ఎమ్ఎన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న గటాకా సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో.. ఈ ట్యాబ్లెట్స్ గురించి వాటి ఫలితాలే చెప్తున్నాయి. నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్కట్స్ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం అని రాసుకొచ్చింది.ఫ్రాడ్.. నమ్మొద్దు: డాక్టర్ఇది చూసిన ద లివర్ డాక్టర్.. సామ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్సు తెలియని నటి అని తిట్టిపోశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్లను ప్రమోట్ చేస్తోందని ఆరోపించాడు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత యాక్టివ్గా ఉన్నట్లు తేలింది.. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదన్నాడు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు.నిజమైన వైద్యుల్ని నమ్మండిమీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యంగ్గా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్ పెట్టమని సూచించాడు. సిగరెట్, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దని.. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే విశ్వసించమని కోరాడు. అసలైన వైద్యులు చెప్పేదే వినండంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా గతంలోనూ సమంత పెట్టిన పలు పోస్టులపై లివర్ డాక్టర్ విమర్శలు గుప్పించాడు. View this post on Instagram A post shared by The Liver Doc (Cyriac Abby Philips) (@theliverdr) చదవండి: టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే! -
టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే!
బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి (Gurmeet Choudhary) - దెబీనా బెనర్జీ (Debinna Bonnerjee) ఇంట దొంగతనం జరిగింది. అది కూడా గుర్మీత్ ఇంట్లో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. ఈ చోరీ విషయాన్ని నటుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అలర్ట్: కొత్తగా చేరిన ఓ పనిమనిషి మా ఇంట్లో కొన్ని వస్తువులు దొంగిలించి పారిపోయాడు. అయితే మా ఇంట్లో ఎవరు పనిలో చేరుతున్నా వారి వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను. దానివల్ల పోయిన వస్తువులు తిరిగి రాబట్టుకోవడం సులువైంది. చోరీ సమయంలో ఇంట్లోనే..దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి రూమ్లో సురక్షితంగా ఉన్నారు. ఇలా జరగడం మా దురదృష్టం. కానీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాను. మీ ఇంట్లో ఎవరు పనికి చేరుతున్నా వారి గురించి ముందే అన్నీ తెలుసుకోండి. వారి వివరాలు సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.డేటింగ్.. పెళ్లిటీవీ సెలబ్రిటీలు దెబీనా బెనర్జీ- గుర్మీత్ చౌదరి రామాయణ్ సీరియల్లో సీతారాముడిగా నటించారు. ఈ సీరియల్ కంటే ముందే వీరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. సీతారాముడిగా పాపులారిటీ పొందడంతో పాటు పెద్దల ఆశీర్వాదాలు అందడంతో 2011 ఫిబ్రవరి 15న పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా లియానా జన్మించింది. తర్వాత దివిషా పుట్టింది. త్వరలోనే గుర్మీత్, దెబీనా.. పతీ పత్ని ఔర్ పంగా- జోడియాన్ కా రియాలిటీ అనే షోలో కనిపించనున్నారు. ఇకపోతే దెబీనా.. అమ్మాయిలు అబ్బాయిలు అనే తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. పేరరసు అనే తమిళ మూవీలో హీరోయిన్గా చేసింది. విజయ్కాంత్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కాశీ విశ్వనాథ్గా డబ్ అయింది.చదవండి: మురళీమోహన్, అలీని తిట్టిన రాజేంద్రప్రసాద్.. అసలేం జరిగిందంటే -
బిగ్ బాస్లోకి యూట్యూబర్లు,ఇన్ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...
ఎక్కడో ఇంగ్లండ్లో పుట్టి ఓ హీరోయిన్ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్ మూలాలు కలిగిన బిగ్బాస్(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ బిగ్ బాస్.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్స్టా గ్రామ్ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన, మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్స్టా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఇన్స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్తో ఇన్ఫ్లుయెన్సర్గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రసిద్ధి పొందిన కిర్రాక్ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్జె కాజల్, ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్ స్టేటస్కు బిగ్ బాస్ ద్వారా మరింత గ్లామర్ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోందనగానే సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్ బాస్ హౌస్లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు, తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్ బాస్కు సంబంధించినవి కాకపోయినా... ప్రాంతీయ బిగ్బాస్లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్ బాస్ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.హిందీలో బాలీవుడ్ దిగ్గజం సల్మాన్ఖాన్ సమర్పిస్తున్న బిగ్ బాస్ 19 గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్ కోసం మేకర్స్ గణనీయమైన ఫార్మాట్ మార్పును ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన, స్థిరపడిన బాలీవుడ్ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.టెల్లీ రిపోర్టర్ నివేదిక ప్రకారం, బిగ్ బాస్ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్ అప్పీల్ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్ బాస్ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్ బిగ్బాస్ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్ బాస్ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్కు కాకపోయినా వచ్చే సీజన్పై సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు. -
బెంగళూరు విజయం.. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా?
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో సంబురాలు మిన్నంటాయి. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందం పట్టలేకపోయింది. ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని ఎమోషనలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుష్క శర్మ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకుని ఓదార్చింది.(ఇది చదవండి: ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్తో లింక్!)అనుష్క గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "అనుష్క నాకు అన్ని కష్టాల్లోనూ అండగా నిలిచింది. వందశాతం ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్కు వస్తోంది. ఈ విజయం అనుష్క శర్మ గర్వంగా భావిస్తుందని కోహ్లీ అన్నారు. తను నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచింది. ఆమెకు బెంగళూరుతో చాలా అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే తను కూడా బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో తను చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు.After IPL win, Virat posed with Anushka, whom he always credits for his success.🔥🔥🔥🔥#iplfinal2025 #RCBvsPBKSfinal #ViratKohli #AnushkaSharma#RCBChampion #ABdeVilliers pic.twitter.com/NGubvamHav— Gagan Meena (@GaganMeena47) June 4, 2025Thank you Anushka Sharma for taking care of this Kid for us 😭❤️ thank you so being there every time he needed someone so strong who can control that storm in him Thank you for being our Lady luck ❤️RCB RCB RCB #AnushkaSharma #EeSalaCupNamde pic.twitter.com/MZpZ9glX6c— Rahul | 🇮🇳 (@TheGoatNDevil) June 3, 2025 -
పెద్దితో పాట
పెద్దితో స్టెప్పులేశారు జాన్వీ కపూర్. రామ్చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న పీరియాడికల్ అండ్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో రామ్చరణ్, జాన్వీతో పాటు ముఖ్య తారాణంగా పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
రాజ్కుమార్ రావు యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయొలెంట్గా టీజర్!
బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. తాజాగా మరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్తో రెడీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మాలిక్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.టీజర్ చూస్తే మోస్ట్ వయోలెంట్ గ్యాంగ్స్టర్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లో యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 1988లో అలహాబాద్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజ్కుమార్ రావు గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు. ఈ సినిమా జూలై 11, 2025న థియేటర్లలో విడుదల కానుంది. -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. -
ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో హృతిక్, ఎన్టీఆర్ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025 -
కమల్ హాసన్ థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు.. క్లారిటీ ఇదే!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పంకజ్.. ఈ వార్తలపై స్పందించారు. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్లో తాను నటించలేదని అన్నారు. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ మాత్రమేనని తెలిపారు.గతంలో తాను దక్షిణాది భాషల్లో నటించడంపై పంకజ్ మాట్లాడారు. అక్కడ నటించాలంటే తనకు భాష ప్రధాన సమస్య అని తెలిపారు. తెలియని భాషలో నటించాలంటే అసౌకర్యంగా ఉంటుందని.. హిందీ అయితే తనకు కంఫర్ట్గా ఉంటుందన్నారు. ఒకసారి తెలుగు సినిమాలో చేయడానికి వెళ్లినప్పుడు ఏబీసీడీల దగ్గర నుంచి చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించారు. నా పాత్రలో చెప్పేది అర్థం నాకు అర్థం కావాలని.. అలాగే నా పాత్ర హిందీలో మాట్లాడాలి.. అప్పుడే నా నటన సహజంగా అనిపిస్తుందని పంకజ్ త్రిపాఠి పంచుకున్నారు. కాగా.. పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'మెట్రో ఇన్ డినో' ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
బాయ్ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ జూన్ 2న అతని పుట్టినరోజును కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె, యూట్యూబర్ ఆలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు.కాగా.. వేదాంగ్ రైనా రెండేళ్ల క్రితం ది ఆర్చీస్ (2023)తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా (2024) మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్ను పంచుకోనున్నారు. -
మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు
మన దగ్గర తక్కువ గానీ బాలీవుడ్లో ప్రేమ, బ్రేకప్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయి. కలిసి సినిమా చేయడం లేటు తెగ రూమర్స్ వచ్చేస్తాయి. వాటిలో కొన్ని నిజమవుతుంటాయి. కొన్ని మాత్రం ఆదిలో ఆగిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అప్పట్లో ప్రేమించుకున్నారనే రూమర్స్ వచ్చి, విడిపోయిన ఓ జంట.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ కలిశారు. రొమాంటిక్ మూవీ కూడా చేయబోతున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్.. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో 'పతీ పత్ని ఔర్ ఓ' మూవీ చేస్తున్న టైంలో హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. తర్వాత 'కాఫీ విత్ కరణ్' షోలో ఈ విషయమై మాట్లాడిన కరణ్ జోహార్.. వాళ్లకు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఇదే కరణ్ జోహార్.. 'దోస్తానా 2' విషయమై కార్తీక్ ఆర్యన్తో గొడవపడ్డాడు. ఇకపై తన నిర్మాణ సంస్థలో కార్తీక్తో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు.కట్ చేస్తే ఇప్పుడు అదే కరణ్ జోహార్.. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా 'తూ మేరీ మైన్ తేరా, మైన్ తేరా తూ మేరీ' సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ సందర్భంగా ఫిబ్రవరి 13న మూవీ థియేటర్లలోకి వస్తుందని చెప్పారు. దీంతో కార్తీక్-అనన్యతో పాటు కార్తీక్-కరణ్ జోహార్ మళ్లీ కలిసిపోయారనే టాక్ వినిపిస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?) -
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
బంగారు కళ్ల బుచ్చమ్మో.. పాటలో అమాయకంగా కనిపించి అందర్నీ ఇట్టే బుట్టలో వేసుకుంది హీరోయిన్ సోనాలి బింద్రె (Sonali Bendre). మురారి సినిమాలో ఆమె నటనకు తెలుగులో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయింది. దాదాపు 20 ఏళ్లలో కేవలం మూడే సినిమాలు చేసింది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జడ్జిగా కనిపించేది.ముఖం చిట్లించేవాడుతాజాగా ఆమె ఓ స్టార్ హీరోతో చేసిన సినిమా అనుభవాల్ని పంచుకుంది. బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి నటించాను. ఆ సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లం.తిట్టాలన్నంత కోపంక్లోజప్ షాట్స్ ఉన్నప్పుడు కూడా తన ముఖం అదోలా పెట్టేవాడు. అసలు నీ సమస్య ఏంటి? అని తిట్టాలనిపించేది. కానీ అలా చేయలేకపోయాను. అయితే సల్మాన్ బయటకు కనిపించేంత కఠినాత్ముడు కాదు. తను చాలా మంచివాడు. సినిమా షూటింగ్ అయ్యేకొద్దీ అతడి గురించి కొద్దికొద్దిగా తెలుసుకుంటూ వచ్చాను. తను బయటకు కోపంగా కనిపిస్తాడు. అందరూ తనను ద్వేషించాలన్నట్లుగానే ప్రవర్తిస్తాడు.బ్లాక్బస్టర్ బొమ్మకానీ తను మృదు స్వభావి. అతడి లోని మంచి మనిషిని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చింది. సల్మాన్, సోనాలి జంటగా నటించిన హమ్ సాత్ హై సినిమాను సూరజ్ బార్జాత్యా తెరకెక్కించాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, టబు, మోహ్నిష్, కరిష్మా కపూర్ తదితరులు నటించారు. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్ -
క్యాన్సర్తో పోరాటం.. ట్రీట్మెంట్ పనిచేయక నటుడు మృతి
బుల్లితెర నటుడు విభు రాఘవ్ క్యాన్సర్తో సోమవారం (జూన్ 2న) కన్నుమూశాడు. పెద్దపేగు క్యాన్సర్తో పోరాడి అలిసిపోయిన అతడు ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆరువారాల క్రితం తన అనారోగ్యం గురించి అతడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఫలించని ట్రీట్మెంట్జనవరిలో కీమోథెరపీ మొదలుపెట్టాం. నాలుగు రౌండ్లయ్యాక ఓ స్కాన్ చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే నాకు ఇస్తున్న ట్రీట్మెంట్ ఏమాత్రం పనిచేయడం లేదు. క్యాన్సర్ నియంత్రణలో ఉండటం కాదుకదా ఏకంగా శరీరమంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు వేరే చికిత్స మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో చూడాలి. నాకు మీ ప్రేమాభిమానాలు కావాలి. అదొక్కటే నేను మీనుంచి ఆశించేది అని చిరునవ్వుతో వీడియో ముగించాడు. ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు.. నీ పెదాలపై ఆ నవ్వు అలాగే ఉండాలి.. నీకంతా మంచే జరుగుతుంది, ఈసారైనా ట్రీట్మెంట్ విజయవంతం కావాలి అని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు.పెద్ద పెగే క్యాన్సర్తో పోరాటంవిభు అసలు పేరు వైభవ్ కుమార్ సింగ్ రాఘవ్. నిషా ఔర్ ఉస్కే కజిన్స్, సావధాన్ ఇండియా.. ఇలాంటి పలు షోలలో కనిపించాడు. 2022లో పెద్దపేగు క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ మధ్యే అతడి పరిస్థితి విషమించడంతో సెలబ్రిటీలు అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయమని అర్థించారు. గతవారం సైతం నటి సింపుల్ కౌల్.. విభును కాపాడుకుందామంటూ తోచినంత సాయం చేయమని అభిమానులను కోరింది. కానీ ఇంతలోనే విభు ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by VIBHU k RAGHAVE ✨ विभु राघव (@vibhuzinsta) చదవండి: ‘గద్దర్ అవార్డ్స్’ లో తెలంగాణకు అన్యాయం: ప్రతాని రామకృష్ణ గౌడ్ -
అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ
హారర్ సినిమాలు హిట్టయ్యాయంటే వరుసపెట్టి మరీ అవే తీస్తూ ఉంటారు. అదేవిధంగా యాక్షన్ మూవీ బ్లాక్బస్టర్ అయిందంటే అలాంటివే వరుసగా వదులుతూ ఉంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kahsyap). ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. కేజీఎఫ్, సలార్ సినిమాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరంతా చూశారుగా.. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఒకేలా కనిపించేవి. హింసపై ఫోకస్యానిమల్ విషయానికి వస్తే ఇందులో హింస, రక్తపాతం బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా రూ.900 కోట్లు సంపాదించింది. ఇది చూసిన ఫిలిం మేకర్స్ తమ చిత్రాల్లోనూ రెట్టింపు హింసను ప్రవేశపెట్టారు. కొన్నిసార్లు అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా వాటిని చొప్పించేవారు. వాళ్లు తప్పు దారిలో వెళ్లడం చూసి నాకు భయమేసేది అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడదే ట్రెండ్ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తర్వాత అందరూ బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్పైనే ఫోకస్ చేశారన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడమే ప్రస్తుతమున్న ట్రెండ్ అని, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. తాను కూడా సత్య సినిమాకు మరో రూ.5 కోట్లు ఎక్కువ పెట్టుంటే ఆ మూవీ సర్వనాశనమయ్యేదన్నాడు.బాలీవుడ్కు గుడ్బైబాలీవుడ్లో దర్శకుడిగా, నటుడిగా రాణించిన అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు. హిందీలో ప్రయోగాలు చేయడం కష్టమని, అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, అందుకే బాలీవుడ్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పూర్తిగా దక్షిణాది సినిమాల్లోనే ఉంటానని తెలిపాడు. ఈయన ప్రస్తుతం అడివిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? -
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika padukone ) వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఒక భారీ ప్రాజెక్ట్ను వదులుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, పనిగంటలతో పాటు రెమ్యునరేషన్ వంటి అంశాలు కూడా కారణం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ హిందీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయిపోయింది. రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి..? అనే అంశంలో సినిమా నటీనటులైనా ఇందుకు మినహాయింపు కాదని చర్చకు దారితీస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ప్రత్యక్షంగా పరోక్షంగా పలు వేదికలపై మాట్లాడుతున్నారు. తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కూడా ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలోని నటీనటులు ఎవరైనా సరే 8 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటామని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని మణిరత్నం అన్నారు. అలాంటి నిర్ణయం సరైనదేనని తాను భావిస్తన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పనిగంటల విషయంలో అలా అడిగే నటీనటులు చిత్రపరిశ్రమలో ఉన్నందుకు తాను సంతోషిస్తున్నట్లు అన్నారు. అలా అడగడంలో తప్పు లేదని ఒక దర్శకుడిగా చెబుతానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మణిరత్నం వ్యాఖ్యలు నటి దీపికా పదుకొణెకు మద్థతుగా ఉన్నాయిని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవ్గణ్ కూడా పనిగంటల విషయంపై మాట్లాడారు. ‘మా’ సినిమా ట్రైలర్ లాంచ్లో మొదట కాజోల్ మాట్లాడుతూ కొత్తగా తల్లి అయిన నటీమణుల వర్కింగ్ అవర్స్ గురించి చెప్పుకొచ్చారు. 8గంటలకు మించి వారు పనిచేయలేరని ఆమె అన్నారు. ఇంతలో అజయ్ దేవ్గణ్ కలుగచేసుకుని ఇలా రియాక్ట్ అయ్యారు. నిజాయతీ ఉన్న దర్శకనిర్మాతలు ఎవరూ కూడా వర్కింగ్ అవర్స్ విషయంలో వ్యతిరేకంగా ఉండరని పేర్కొన్నారు. 8 గంటల పాటు నటీనటులు షూటింగ్లో పాల్గొంటే చాలని వారు అనుకుంటారని ఆయన అభిప్రాయ పడ్డారు. దీంతో వారందరూ కూడా దీపికా పదుకొణెను ఉద్దేశించి ఆమెకు సపోర్ట్గా మాట్లాడారని నెటిజన్లు అనుకున్నారు.దీపికా పదుకొణె కండీషన్స్దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు దీపికా పదుకొణె పెట్టిన కండీషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అయ్యాయి. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునే మొదట రూ.20కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో షేర్ అడిగినట్లు సమాచారం. రెండోది కేవలం రోజుకు 8గంటలు మాత్రమే కేటాయిస్తానని దీపిక డిమాండ్. అయితే, ఉన్న 8 గంటల్లో అందులో 2 గంటలు జర్నీకే పోతుందని చర్చ. తెలుగు డైలాగ్స్ చెప్పలేనని పేర్కొన్న దీపిక. ఇలా పలు కండీషన్స్ ఉండటం వల్ల దీపికా పదుకొణెను సందీప్ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. -
బాల్య వివాహం.. అలాంటి దుస్తులు వేసుకోమనగానే ఏడ్చేశా: హీరోయిన్
ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించినవారిలో మౌసమి చటర్జీ (Moushumi Chatterjee) ఒకరు. మౌసమి అసలు పేరు ఇందిర. చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేజర్ కాకముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. తన ఆంటీ చివరి కోరిక మేరకు పదో తరగతిలో ఉండగానే జయంత్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అనురాగ్ అనే చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంధురాలిగా నటించింది. ఈ సినిమా సక్సెస్తో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. అయితే అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది.నా వల్ల కాలేదుకానీ ఓ సినిమా యూనిట్ చేసిన పనికి తను భయంతో రోదించానంటోంది మౌసమి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1973లో వచ్చిన కుచ్చె ఢాగె సినిమా షూటింగ్లో జరిగిన సంఘటన ఇది.. నాకు బ్యాక్లెస్ బ్లౌజ్, పొట్టి గాగ్రా ఇచ్చి వేసుకోమన్నారు. అవి చూడగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆ డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్లే అనిపించింది. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి నాకిక్కడ పని చేయాలని లేదు.. ఒక్క ఫోన్ కాల్..నన్ను కోల్కతాకు పంపించేయమని వేడుకున్నాను. అప్పటికే వాళ్లు నా బట్టలన్నీ తీసేసుకున్నారు. నా ఫోన్కాల్తో ఆయన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అలా ఆ సినిమా పూర్తి చేశాను. పొట్టి స్కర్టు ధరించాల్సి ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డి సినిమాను రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది. గుడ్డి చిత్రంలో జయా బచ్చన్ నటించగా ఇది కల్ట్ క్లాసిక్గా నిలిచింది.సినిమామౌసమి 'ఆరి' అనే బెంగాలీ చిత్రంతో ఇటీవలే వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఆమె చివరగా నటించిన పీకు సినిమా కూడా మే 9న రీరిలీజ్ అయింది. బాలీవుడ్లో మౌసమి.. రోటీ కపడా ఔర్ మకాన్, అనారి, జిందగీ, స్వర్గ్ నరక్, ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్, ప్రేమ్ బంధన్, స్వయంవర్, అంగూర్, నిశ్చయ్ వంటి పలు చిత్రాలు చేసింది.చదవండి: నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్ -
నా తల్లి అంత్యక్రియలకు వస్తానంటే పాక్ ఒప్పుకోలేదు: సింగర్
అద్నాన్ సమీ (Adnan Sami).. పాకిస్తాన్ ఈ సింగర్ స్వదేశాన్ని కాదనుకుని భారత్పై ప్రేమ పెంచుకున్నాడు. భారతీయ వారసత్వం తీసుకుని ఇక్కడే స్థిరపడిపోయాడు. సంగీత ప్రపంచంలో తనకంటూ గొప్ప స్థానం సంపాదించుకున్న ఇతడిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇవన్నీ పాకిస్తాన్కు గిట్టలేదు. అవకాశం దొరికినప్పుడు అతడిని ముప్పుతిప్పలు పెట్టిందట.తల్లి చనిపోయిందని తెలిసినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అద్నాన్ సమీ మాట్లాడుతూ.. మా అమ్మ బేగం నౌరీన్ పాక్లో మరణించింది. తన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని రెండు దేశాలను కోరాను. భారత్ అందుకు అంగీకరించినా.. పాక్ మాత్రం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మా అమ్మ చనిపోయిందని చెప్పినా కూడా వీసా ఇవ్వలేదు. వాట్సాప్ వీడియోలో తన అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది.భారత్ సొంతిల్లుగా ఎలా మారిందంటే?1998లో నేను కొన్ని పాటలు రిలీజ్ చేశాను. అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక నా పని అయిపోయిందని అంతా అన్నారు. నా పాటలకు మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు నా పాటలు ఎప్పుడొచ్చాయో, పోయాయో కూడా ఎవరికీ తెలీదు. నన్ను తొక్కేయాలనే అదంతా చేస్తున్నారని నాకర్థమైంది. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను.ఆమె సలహా వల్లే..సింగర్ ఆశా భోంస్లేతో మాట్లాడాను. ఇక్కడున్నవాళ్లు నాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఇకపై లండన్లోనే మీతో కలిసి పని చేస్తాను అని చెప్పాను. అందుకామె లండన్లో రికార్డ్ చేయడం దేనికి? నీకు నిజంగా ఏదైనా కొత్తగా చేయాలనుంటే ముంబైకి వచ్చేయ్. ఇక్కడ హిట్టయిన పాటలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని చెప్పింది.కోట్లు విలువైన ఆస్తుల్ని వదులుకుని..అలా నేను ముంబై వచ్చాను. ఆమె దివంగత భర్త, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ ఇంట్లోనే బస చేశాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాకిస్తాన్లో వర్కవుట్ కాని పాటలన్నీ ఇక్కడ ఎంతో ఆదరణ పొందాయి. ప్రజల ప్రేమకు ఎంతగానో సంతోషించాను. డబ్బు సంపాదించడం కోసం ఇక్కడకు రాలేదు. అంతేకాదు, పాకిస్తాన్లో కోట్లు విలువ చేసే ఆస్తుల్ని వదిలేసుకుని ఇక్కడే స్థిరపడిపోయాను అని చెప్పుకొచ్చాడు.కెరీర్..అద్నాన్ సమీ.. తెలుగులో యే జిల్లా.. (శంకర్ దాదా ఎంబీబీఎస్), నచ్చావే నైజాం పోరీ.. (వర్షం), నేనంటే నాకు చాలానే ఇష్టం.. (ఊసరవెల్లి), నిన్ను చూడకుండా నేను ఉండలేనే.. (దేనికైనా రెడీ), ఓ ప్రియా ప్రియా.. (ఇష్క్) ఇలా అనేక పాటలు పాడాడు. హిందీ, ఉర్దు, ఇంగ్లీష్, తమిళ, కన్నడ, మలయాళంలో అనేక సాంగ్స్ ఆలపించాడు.చదవండి: రీరిలీజ్లో ఆల్టైమ్ రికార్డ్.. నీ వల్ల అవుద్ది సామీ! -
కన్నీళ్లు పెట్టుకున్న మహిళ అభిమాని.. అక్షయ్ కుమార్ ఏం చేశారంటే?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన నటించి తాజా చిత్రం హౌస్ఫుల్-5. ఈ కామెటీ ఎంటర్టైనర్ సిరీస్లో వస్తోన్న ఐదో చిత్రం కావడం విశేషం. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో అక్షయ్ కుమార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పుణెలోని ఓ మాల్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు.అయితే ఊహించని విధంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అదే సమయంలో అక్షయ్ కుమార్ వేదికపై మాట్లాడుతుండగా తోపులాట జరిగింది. అభిమానులు తోసుకోవడంతో ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన అక్షయ్ కుమార్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు.. దయచేసి ఎవరూ కూడా తోసుకోవద్దు అంటూ అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత ఏడుస్తున్న ఆ మహిళ అభిమానిని హీరోయిన్లు బజ్వా, ఫెర్నాండెజ్ కౌగిలించుకుని ఓదార్చారు. కాగా.. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నానా పటేకర్, జాక్వెలిన్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సౌందర్య శర్మ, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు
కొన్ని సంతోషాలను కోట్లు పెట్టినా సొంతం చేసుకోలేము. ఆ సంతోషాన్ని ఆస్వాదించడం కోసం కోట్లు వదిలేసుకున్నా బాధ ఉండదు. మహిళకు అత్యంత ఆనందాన్నిచ్చేది అమ్మతనం. 'అమ్మ'యినందుకే ఇలియానా సూపర్ హిట్ మూవీ రైడ్కు సీక్వెల్లో చేయమని ఆఫర్ వచ్చినా వదిలేసుకుంది. కళ్లు చెదిరే పారితోషికం ఇస్తామన్నా.. ప్రస్తుతం తన కొడుకును చూసుకోవడమే ముఖ్యం అని కరాఖండిగా చెప్పేసింది.మిస్క్యారేజ్అయితే కొందరికి అమ్మతనం అంత ఈజీగా దొరకదు. చాలామందికి మొదటి కాన్పు ఆగదు. గర్భస్రావం అవుతూ ఉంటుంది. బాలీవుడ్ నటి, మోడల్, హిందీ బిగ్బాస్ 7 విన్నర్ గౌహర్ ఖాన్ (Gauahar Khan) జీవితంలోనూ అదే జరిగింది. తొలిసారి తన మిస్క్యారేజ్ అనుభవాలను యూట్యూబ్ వేదికగా వెల్లడించింది. గౌహర్.. మానొరంజన్ అనే పాడ్కాస్ట్ను ప్రారంభించింది. ఇందులో మాతృత్వం గురించి, పిల్లల పెంపకం గురించే మాట్లాడనుంది. మొదటగా ఈ పాడ్కాస్ట్లో తన అనుభవాలను వెల్లడించింది.9 వారాలకే కుప్పకూలిన ఆశలుఇంతవరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పనేలేదు. ఈసారి దాన్ని బయటపెడుతున్నా.. జెహాన్ పుట్టడానికంటే ముందు నాకు గర్భస్రావం అయింది. ఆ బాధను మాటల్లో చెప్పలేను. దాదాపు 9 వారాలపాటు కడుపులో మోశాక బిడ్డను కోల్పోయాను. నా సంతోషం ఆవిరైపోయింది. దీని గురించి తర్వాతి ఎపిసోడ్స్లో మాట్లాడతాను. జెహాన్ పుట్టినప్పటి నుంచి అది సాధారణ డెలివరీనా? సీ సెక్షనా? అని అడుగుతూనే ఉన్నారు. నాకు సీ సెక్షన్ చేశారు. అయినా రెండూ కష్టమే.. మీకేం తెలుసు?: నటి కన్నీళ్లుఈ మధ్య ఓ సెలబ్రిటీ (సునీల్ శెట్టి) సాధారణ ప్రసవం కన్నా ఆపరేషన్ ఈజీ అన్నారు. ఆ మాట వినగానే గట్టిగా అరవాలనిపించింది. అలా ఎలా అనగలిగారు? అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ ఉండదు, నవమాసాలు మోయరు, సీ సెక్షన్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అసలే అర్థం కాదు. మీకసలు ఏదీ తెలీదు అని కన్నీళ్లు పెట్టుకుంది. నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty).. తన కూతురు అతియా కంఫర్టబుల్గా ఉంటుందని సీ సెక్షన్కు వెళ్లకుండా కష్టమైనా నేచురల్ డెలివరీనే ఎంచుకుందని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని క్షమాపణ చెప్పాడు.ఎవరీ గౌహర్ ఖాన్?గౌహర్ ఖాన్ విషయానికి వస్తే.. ఈమె శంకర్ దాదా ఎంబీబీఎస్లో నా పేరే కాంచనమాల అనే ఐటం సాంగ్తో అలరించింది. రాకెట్ సింగ్, ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా, ఫీవర్, తేరే ఇంతేజార్ వంటి పలు చిత్రాలు చేసింది. తాండవ్, సాల్ట్ సిటీ, బెస్ట్ సెల్లర్ వంటి వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ను 2020లో పెళ్లి చేసుకోగా 2023లో కుమారుడు జెహాన్ పుట్టాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది.చదవండి: ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!: -
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్?అలా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. 'హైదరాబాద్లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు. నా కష్టార్జితం..నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను' అని రకుల్ చెప్పుకొచ్చింది.సినిమారకుల్ ప్రీత్.. 'కెరటం' సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, పండగ చేస్కో, కిక్ 2, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్, ఇండియన్ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్ -
లేటు వయసులో డేటింగ్.. పొరపాటున జరిగిపోయింది: అమిర్ ఖాన్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాల కంటే వ్యక్తిగతంగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆరు పదుల వయస్సులో ప్రేమ అంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన బర్త్ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూలో గౌరీ స్ప్రాట్తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ వయలులో మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. ఇప్పటికే తన వయసు అయిపోయిందని.. తనకు భాగస్వామి దొరకడం సాధ్యం కాదని భావించేవాడినని ఆమిర్ పేర్కొన్నారు. తనకు వృద్ధాప్యఛాయలు వచ్చినట్లు అనిపించిందని.. గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని తెలిపారు. నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నామని అమిర్ ఖాన్ వెల్లడించారు.గౌరీతో పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నాం. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.. మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు నా తల్లి, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. నాకు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు భాగస్వామి అవసరం లేదు. కిరణ్, రీనా నేను ఇప్పటికీ పానీ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తున్నాం. మేము ప్రతిరోజూ కూర్చుని మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంగా మా మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. మేము భార్యాభర్తలం కాకపోవచ్చు.. కానీ మేము ఎల్లప్పుడూ ఓకే ఫ్యామిలీగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం.' అని వెల్లడించారు. కాగా..అమిర్ ఖాన్, గౌరీ ఏప్రిల్ 12న చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా మొదటిసారి కనిపించారు. ప్రస్తుతం అమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', లోకేష్ కనగరాజ్ 'కూలీ'చిత్రంలో కనిపించనున్నారు. -
ఉత్తరకొరియాగా మార్చొద్దు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీ అరెస్టును బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్పై కొందరు బాలీవుడ్ స్టార్లు ఎందుకు పెదవి విప్పలేదంటూ ఎక్స్లో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు పనోలీని కోల్కతా పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా అందుకామె క్షమాపణలు చెప్పారని కంగన గుర్తు చేశారు. కనుక ఆమెను విడుదల చేసి దీన్ని ఇంతటితో వదిలేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగాక మరింతగా కక్షసాధింపుకు పాల్పడి రాష్ట్రాన్ని ఉత్తరకొరియాగా మార్చొద్దని సూచించారు. నెదర్లాండ్స్ ఎంపీ గ్రీత్ వైల్డర్స్ కూడా పనోలీ అరెస్టును తప్పుబట్టారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గొడ్డలిపెట్టని ఆక్షేపించారు. ఆమె తక్షణ విడుదలకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. -
పెద్ద సినిమా.. నేనే రిజెక్ట్ చేశా.. ఎందుకంటే?: ఇలియానా
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) హిట్ సినిమాల్లో రైడ్ మూవీ ఒకటి. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా (Ileana D’Cruz) హీరోయిన్గా నటించింది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా రైడ్ 2 రిలీజైంది.నోరు విప్పిన బ్యూటీకానీ ఇందులో ఇలియానా స్థానంలో వాణీ కపూర్ తళుక్కుమని మెరిసింది. ఇలియానాను సెలక్ట్ చేయకపోవడంపై దర్శకుడు రాజ్ కుమార్ స్పందిస్తూ.. పెళ్లి తర్వాత ఆమె జీవితం మారిపోయిందని.. తను విదేశాలకు వెళ్లిపోవడం వల్లే కథానాయికను మార్చాల్సి వచ్చిందని వెల్లడించాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఇలియానా పెదవి విప్పింది. రైడ్ 2లో నిన్ను మిస్ అయ్యాం. ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తావ్? అన్న అభిమాని ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రైడ్ సినిమాలో అజయ్ దేవ్గణ్, రాజ్ కుమార్ గుప్తాతో కలిసి పని చేయడం మర్చిపోలేను.అందుకే చేయలేకపోయా..ఈ మూవీ నాకెంతో స్పెషల్. దీని సీక్వెల్లో కూడా నటించమని ఆఫర్ వచ్చింది. కానీ నేనే చేయలేకపోయాను. ఆ అవకాశం వచ్చినప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అప్పుడు వాడే నా మొదటి ప్రాధాన్యత. సినిమా టీమ్ ఇచ్చిన షెడ్యూల్ నాకు సెట్టవలేదు. అలా వదులుకోవాల్సి వచ్చింది. అయినా రైడ్ 2లో వాణి కపూర్ చాలా బాగా చేసింది. తన పాత్రకు మరింత అందాన్ని తీసుకొచ్చిందని ప్రోమోలు చూస్తేనే అర్థమైపోతుందని చెప్పుకొచ్చింది.కచ్చితంగా మళ్లీ వస్తా!వెండితెరపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు.. డైపర్లు మార్చే పనిలో బిజీగా ఉన్నానంటూ బాబు ఫోటోను షేర్ చేసింది. వెండితెరపై రీఎంట్రీ ఉంటుందా? అన్న ప్రశ్నకు తప్పకుండా మళ్లీ సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది. ఇలియానా.. ప్రియుడు మైఖేల్ డోలన్ను 2023లో పెళ్లి చేసుకుంది. వీరికి అదే ఏడాది బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇలియానా రెండోసారి గర్భం దాల్చింది.చదవండి: శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి! -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్ మేనకోడలు!
హీరామండి వెబ్ సిరీస్తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలైన షెర్మిన్ హీరామండిలో కీలక పాత్రలో మెప్పించింది. అంతకుముందు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నటనలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. హీరామండి వెబ్ సిరీస్తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించలేదు. షెర్మిన్కు బాబు పుట్టాడని జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. మే 28న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందారని వెల్లడంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. షెర్మిన్ 2023 నవంబర్లో అమన్ మెహతాను పెళ్లాడారు. వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత అహ్మదాబాద్లో ఉంటున్న షర్మిన్ సెగల్ ఇటీవలే ముంబయికి షిఫ్ట్ అయింది.ఇక సినిమా విషయానికొస్తే షర్మిన్ చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఈ సిరీస్లో అలం జేబ్ పాత్రను అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ఆమె నటనకు తీవ్రంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరామండిలో షర్మిన్ తన గ్లామర్తో గుర్తింపు దక్కించుకుంది.కాగా.. సినీ ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు. View this post on Instagram A post shared by Vickey Lalwani (@iamvickeylalwani) -
రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ జాంకీ పరేఖ్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెర నటుడు నకుల్ మెహతాను పెళ్లాడిన ముద్దుగుమ్మ రెండోసారి గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా.. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు జన్మించారు. మా రెండో బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్ చేశారు.ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు అభినందనలు చెబుతున్నారు. దియా మీర్జా, అదితి శర్మతో పాటు పలువురు సినీతారలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. 13 ఏళ్ల క్రిత జాంకీ పరేఖ్.. నకుల్ మెహతాను పెళ్లాడింది.బుల్లితెర నటుడైన నకుల్ మెహతా 'ఇష్క్బాజ్', 'బడే అచ్చే లగ్తే హై 2' వంటి ప్రముఖ టీవీ షోలతో ఫేమస్ అయ్యారు. ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బుల్లితెర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నకుల్ మెహతా నటించారు. View this post on Instagram A post shared by Nakuul Mehta (@nakuulmehta) -
భారీగా బరువు పెరిగా.. 33 ఏళ్ల వయసులోనే ఆంటీ పాత్రలు వచ్చాయి : బాలీవుడ్ నటి
సినిమా తారలకు ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సివస్తోంది. కొంచెం బొద్దుగా కనిపించినా సరే.. వాళ్లను దూరం పెట్టేస్తుంటారు. అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. బరువుని కంట్రోల్ చేసేందుకు డైటింగ్తో పాటు డేటింగ్ కూడా చేస్తుంటారు. అయినప్పటికీ వారి శరీరంపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి కుషా కపిల(Kusha Kapila) శరీరంపై కూడా నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఉన్నపళంగా బరువు తగ్గడంపై రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్వయంగా కుషానే వివరణ ఇచ్చింది. తన బాడీ గురించి ఇతరులతో మాట్లాడాల్సిన అవరసం లేదని..తనకు నచ్చినట్లుగా తాను ఉంటానని చెబుతూనే ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చింది వివరించింది.బరువు తగ్గడం నాకేమి కొత్తకాదు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడే నేను బరువు పెరిగాను. దీంతో మా అమ్మ నన్ను జిమ్లో జాయిన్ చేయించడంతో మళ్లీ మాములు స్థితికి వచ్చాను. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మళ్లీ నా బరువు విపరీతంగా పెరిగింది. ఎందుకు అలా జరిగిందో తెలియదు. నా బాడీని పట్టించుకోకుండా నా కామెడీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. లెక్చర్లు కూడా నా చదువుని పట్టించుకోకుండా నా కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు. 22 ఏళ్ల వయసులో నేను చాలా బరువు పెరిగాను. దీంతో నా ఫ్రెండ్స్ ఫోటోలు షేర్ చేసి ‘ఇలా మారిపోయావేంటి?’ అని అడిగారు. వారి మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా బాడీపై ఫోకస్ పెట్టాను. ఆరు నెలల్లో విపరీతంగా తగ్గిపోయాను. రోజుకు 800 క్యాలరీస్ కంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో నా శరీరంలో భారీగా మార్పులు జరిగాయి. చాలా సన్నబడిపోయాను. 12 రోజుల పాటు జ్వరం వచ్చింది. కొన్నాళ్ల పాటు అన్నం కూడా తినలేదు. ఆస్పత్రికి వెళితే.. టీబీ అటాక్ అయిందని చెప్పారు. తక్కువ తినడం కారణంగానే టీబీ వచ్చిందని చెప్పారు. ఇమ్యునిటీ పవర్ పూర్తిగా తగ్గిపోయింది.టీబీ కారణంగా బరువు తగ్గినా.. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అంతలా నా మైండ్ మారిపోయింది. కానీ నేను 30 ఏళ్లకు వచ్చేసరికి.. పనిపై ఫోకస్ పెట్టి శరీరాన్ని పట్టించుకోవడం వదిలేశాను. డైట్ ఫాలో కాలేదు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం తీసుకున్నాను. ముంబైకి వెళ్లిన తర్వాత బరువు పెరగడం, తగ్గడం స్టార్ట్ అయింది. అయినా కూడా నేను నా పనిపైనే ఫోకస్ పెట్టాను. వైద్యులను సంప్రదిస్తే.. నీ లైఫ్స్టైల్ని పూర్తిగా మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నేను మళ్లీ నా బాడీపై ఫోకస్ చేశాను.డైట్ ఫాలో అయ్యాను. 33 ఏళ్ల వయసులో నేను కాస్త లావుగానే ఉన్నాను. దీంతో 45-50 ఏళ్ల ఆంటీ పాత్రలే ఎక్కువ వచ్చాయి. అప్పట్లో ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా చేశానో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు బరువు తగ్గడానికి కారణం కూడా సినిమా చాన్స్ల కోసమే. జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతున్నాను. నా బాడీపై ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నాను. నా శరీరంతో నేను ఏదైనా చేస్తా. ఏం చేస్తున్నానని ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అని కుషా కపిల చెప్పుకొచ్చింది.కుషా కపిల కెరీర్ విషయానికొస్తే.. కామెడీ కంటెంట్తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు. -
బాలీవుడ్ లో భయం భయం
బాలీవుడ్లో హారర్ సినిమాల హవా కనిపిస్తోంది. గత ఏడాది విడుదలైన హిందీ హారర్ చిత్రాలు ‘స్త్రీ 2, భూల్ భూలెయ్యా 3, సైతాన్, ముంజ్య’ వంటివి సూపర్హిట్స్గా నిలిచాయి. ఓ విధంగా 2024లో బాలీవుడ్ బాక్సాఫీస్కు హారర్ చిత్రాలే వెన్నుదన్నుగా నిలిచాయి. ఇలా హారర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉందని గమనించిన బాలీవుడ్ స్టార్స్ వరుసగా ఆ తరహా చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ఆ హారర్ సినిమాల వివరాలపై ఓ లుక్ వేద్దాం...భూత్ బంగ్లాలో అక్షయ్ కుమార్హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్లది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో ‘హేరా ఫెరి, గరమ్ మసాలా, భూల్ భూలెయ్యా’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ 2010లో వచ్చిన ‘ఖట్టా మీఠా’ తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్మెంట్ రావడానికి 14 సంవత్సరాలు పట్టింది. గత ఏడాది అక్షయ్ కుమార్ 57వ బర్త్ డే సందర్భంగా ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామెడీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు. హారర్ కామెడీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వామికా గబ్బి, టబు, పరేష్ రావల్, జిస్సూ సేన్ గు΄్తా ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ హారర్ కామెడీ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్కు రిలీజ్ను వాయిదా వేశారు. మరి.. హీరో అక్షయ్ కుమార్–దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ.పోలీస్ స్టేషన్లో భూతంహారర్, గ్యాంగ్స్టర్, రొమాంటిక్... ఇలా డిఫరెంట్ జానర్స్లో సినిమాలు చేశారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. అయితే హారర్ కామెడీ జానర్లో మాత్రం ఆయన సినిమా చేయలేదు. ఈ జానర్లోనూ తన సత్తా నిరూపించుకోవాలనిపోలీస్స్టేషన్ మే భూత్’ అనే సినిమాను ప్రకటించారు రామ్గోపాల్ వర్మ. ‘యూ కాంట్ కిల్ ది డెడ్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. ఈ చిత్రంలో మనోజ్ భాజ్పేయి లీడ్ రోల్ చేస్తారు. ‘మనకు భయం వేస్తేపోలీస్స్టేషన్కు వెళ్తాం. అదేపోలీసులకే భయం వేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్తారు?’ అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ‘‘ఓపోలీస్స్టేషన్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది.ఈ ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్స్ దెయ్యాలుగా మారి,పోలీసులను ఇబ్బందిపెడితే ఎలా ఉంటుంది? అన్నపాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. హారర్ కామెడీ జానర్లోనే ఈ సినిమా ఉంటుంది’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు రామ్గోపాల్ వర్మ. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు. ‘సత్య’ (1998), ‘కౌన్’ (1999), ‘శూల్’ (1999) వంటి చిత్రాల తర్వాత దర్శకుడు రామ్గోపాల్ వర్మ, హీరో మనోజ్ భాజ్పేయిపాతిక సంవత్సరాల తర్వాత మళ్లీపోలీస్స్టేషన్ మే భూత్’ సినిమా కోసం కలిసి పని చేస్తుండటం విశేషం.ప్రేతాత్మతోపోరాటంభూత, ప్రేతాత్మల నుంచి తన కుమార్తెను కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే అసాధారణపోరాటం నేపథ్యంలో సాగే హిందీ చిత్రం ‘మా’ (తెలుగులో అమ్మ అని అర్థం). కాజోల్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో రోనిత్ డాలీ, ఇంద్రనీల్ శుభ్రా, జితిన్ జ్యోతీ గులాటి లీడ్ రోల్స్లో నటించారు. ఈ సీరియస్ హారర్ సినిమాకు విశాల్ రేవంతి ఫ్యూరియా దర్శకత్వం వహించారు. అజయ్ వీణా దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. క్షుద్ర శక్తులు ఓ చిన్నారిని బలి కోరడం, తన కుమార్తె కోసం తల్లి ఓ క్షుద్ర శక్తులతో వీరోచితమైనపోరాటం చేయడం వంటì సీన్స్ ఈ చిత్రం ట్రైలర్లో కనిపిస్తున్నాయి.హాంటెడ్ హౌస్మహేశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘1920’ (2008) సూపర్హిట్గా నిలిచింది. ఆ తర్వాత ‘1920’ హారర్ సిరీస్లో వచ్చిన మరికొన్ని హారర్ సినిమాలతో అసోసియేట్ అయ్యారు విక్రమ్ భట్. తాజాగా ఆయన డైరెక్షన్లోనే ‘హాంటెడ్ హౌస్ 3డీ: ఘోస్ట్స్ ఆఫ్ ది ఫాస్ట్’ అనే సినిమా రానుంది. ఆనంద్ పండిట్, రాకేశ్ జునేజా, శ్వేతాంబరి భట్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాలో మహాక్షయ్ చక్రవర్తి, టియో బాజ్పాయ్, అంచిత్ కౌర్, ఆరిఫ్ జకారియా ప్రధానపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ చేస్తామన్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇండియన్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ ఫిల్మ్గా ‘హాంటెడ్ హౌస్ 3డీ: ఘోస్ట్స్ ఆఫ్ ది ఫాస్ట్’ మూవీ రానుంది.సైతాన్ తిరిగి వస్తాడుగత ఏడాది మార్చిలో థియేటర్స్లోకి వచ్చిన ‘సైతాన్’ ప్రేక్షకులను బాగా భయపెట్టాడు. అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, జ్యోతిక, జానకి బోడివాలా, అంగద్ రాజ్ లీడ్ రోల్స్లో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’. వికాస్ బాల్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది మార్చిలో థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ను భయపెట్టి, సూపర్ హిట్ అయింది. ఆ సమయంలోనే ‘సైతాన్’ సినిమాకు సీక్వెల్ను ప్రకటించారు అజయ్ దేవగన్. అయితే ప్రస్తుతం అజయ్ దేవగన్ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత అజయ్ దేవగన్ ‘సైతాన్ 2’ సినిమాను సెట్స్కు తీసుకువెళ్తారని ఊహింవచ్చు.ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ఫారెస్ట్లో భయం అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా హీరో హీరోయిన్లుగా హిందీలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే సినిమా రానుంది. హారర్ ఎలిమెంట్స్తోపాటు మైథలాజికల్ అంశాలు కూడా మిళితమై ఉన్న ఈ సినిమాకు అరుణభ్ కుమార్– దీపక్ మిశ్రా ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమా నుంచి తమన్నాపాత్ర తాలూకు ప్రీ టీజర్లాంటి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. రాత్రివేళ తమన్నా అడవిలోకి వెళ్లడం, అక్కడ ఓ దీపం వెలిగించడం వంటి విజువల్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ప్రేతాత్మగా రష్మిక?హారర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా లీడ్ రోల్స్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ ఈ సినిమాకు దర్శకుడు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో హారర్ చిత్రం ఇది. ఈ సినిమాలో రష్మికా మందన్నా డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఒకపాత్రలో ఆమె ప్రేతాత్మగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ప్రధానంగా నార్త్ ఇండియా లొకేషన్స్లో చిత్రీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిందట. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘థామా’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.మరికొన్ని హారర్ చిత్రాలు...మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగానే ‘శక్తి శాలిని’, ‘బేడియా 2’, ‘చాముండ’, ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’, ‘పెహ్లా మహాయు«థ్, దూస్రా మహాయు«ద్’ వంటి సినిమాలను ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లోని ‘థామా’ సినిమా ఈ ఏడాది దీపావళికి, ఈ ఏడాది డిసెంబరు 31న ‘శక్తి శాలిని’, వచ్చే ఏడాది ఆగస్టు 14న ‘బేడియా 2’, డిసెంబరు 4న ‘చాముండ’ 2027లో ‘స్త్రీ 3’, ‘మహా ముంజ్య’ చిత్రాలు, 2028లో ‘పెçహ్లా మహాయు«ద్, దూస్రా మహాయు«ద్’ సినిమాలు రిలీజ్ కానున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.ఇక వరుణ్ ధావన్ హీరోగా ‘బేడియా’ ఫ్రాంచైజీ, శ్రద్ధాకపూర్–రాజ్కుమార్ రావు లీడ్ రోల్స్లో ‘స్త్రీ’ ఫ్రాంచైజీ వెండితెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ‘ముంజ్య’ సినిమాలో అభయ్ వర్మ, శర్వారీ లీడ్ రోల్స్ చేశారు. ఆదిత్య సర్పోత్థార్ డైరెక్షన్లోని ‘ముంజ్య’ సినిమా 2024లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ తరుణంలో ఈ సినిమా సీక్వెల్ ‘మహా ముంజ్య’లో వీరే నటిస్తారా? లేక కొత్త నటీనటులు కనిపిస్తారా? అని తెలియాల్సి ఉంది. ఇంకా ‘శక్తి శాలిని, చాముండ’ వంటి సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్కు హీరోయిన్స్ కియారా అద్వానీ, ఆలియా భట్ వంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు -
'సినీ ఇండస్ట్రీలో మహిళలను అలానే చూస్తారు'.. మాజీ మిస్ వరల్డ్ పోస్ట్ వైరల్!
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరుతుగున్న వేళ.. ఏ రంగంలోనైనా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తున్నారని మానుషి చిల్లర్ అభిప్రాయపడింది. తాజాగా ట్విటర్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది.మానుషి తన ట్వీట్లో రాస్తూ.. 'స్త్రీల పట్ల ద్వేషపూరిత మనస్తత్వం ఉన్నవారు.. స్త్రీ సాధించిన విజయం కంటే ఆమె వెనుక పురుషుడి ఉన్నాడని ఆపాదించడం సులభంగా భావిస్తారు. వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ప్రభావం చూపని ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలను పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశా. కానీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే మహిళలను అగౌరవంగా చూడడం.. నేను నిరంతరం గమనిస్తూనే ఉన్నా. లింగ భేదం లేకుండా మనమందరం సమాన విలువ, సాధికారత, విద్యావంతులైన వాతావరణంలో పెరిగాం. కానీ పురుషులు విజయం సాధిస్తే కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులని పొగుడుతారు. అదే మహిళలు సాధిస్తే అవకాశవాదులని ముద్రవేస్తారు. ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కొన్నా. ఒక స్త్రీ గురించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చెడుగా మాట్లాడడం అంత సులభమా? లేదా ఏళ్లుగా పాతుకుపోయిన పక్షపాతమా' అని ప్రశ్నించింది. ముఖ్యంగా మహిళల విజయాన్ని పురుషులకు అపాదించడాన్ని మానుషి చిల్లర్ విమర్శిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే మానుషి చిల్లర్.. అక్షయ్ కుమార్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'సామ్రాట్ పృథ్వీరాజ్'తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విక్కీ కౌశల్ సరసన'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ'లో నటించింది. టాలీవుడ్లో వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలెంటైన్'లో ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించింది. మానుషి చివరిసారిగా 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ మాజీ మిస్ వరల్డ్ జాన్ అబ్రహం థ్రిల్లర్ మూవీ'టెహ్రాన్'లో కనిపించనుంది. ఈ బాలీవుడ్ భామ 017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.A misogynistic mindset finds it easier to attribute a woman’s success to a man’s patronage than her own merit.I’ve always really ignored silly comments which have no consequence in the real world, but I constantly see working women, specially in the entertainment industry being…— Manushi Chhillar (@ManushiChhillar) May 31, 2025 -
చాహల్తో డేటింగ్ రూమర్స్.. ఆర్జే మహ్వశ్ మరో పోస్ట్ వైరల్!
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్వశ్ పేరు మార్మోగిపోతోంది. చాహల్తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా వైరలైంది. ఇంకేముందు టీమిండియా క్రికెటర్ చాహల్తో డేటింగ్ చేస్తున్నారంటూ ఒకటే టాక్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్కు ఆర్జే హాజరు కావడం ఆ రూమర్స్కు మరింత బలం చేకూరింది. ఇటీవల ఆర్సీబీ- పంజాబ్ మ్యాచ్లోనూ మహ్వశ్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ మరో పోస్ట్తో వార్తల్లో నిలిచింది. నీ జీవితంలో ఏది ముఖ్యమో అది నీకే తెలుసు.. నువ్వు ఎవరితోనూ ఎప్పుడు తప్పు చేయవని తెలుసు.. నీ లక్ష్యం విషయంలో క్లారిటీ ఉంది.. మీరు నిజాయితీగా జీవించండి.. ఎవరెమనుకున్నా హ్యాపీగా వాటిని వదిలేయండి. అంటూ ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ చాహల్తో డేటింగ్ వార్తలపైనే స్పందించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తనపై వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఆర్జే మరోసారి క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు.కాగా.. ఆర్జే మహ్వశ్..చాహల్ గతేడాది మొదటిసారి జంటగా కనిపించారు. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్న చాహల్ ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు. అందుకే మహ్వశ్తో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వీరిద్దరు కనిపించడంతో అప్పటి నుంచే మరింత వైరలయ్యాయి. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
పంజాబ్ ఓటమి.. పాపం.. చాహల్ గర్ల్ఫ్రెండ్ రియాక్షన్ చూశారా?
ఇటీవల ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచే ఆమె పేరు తెగ వైరలవుతోంది. ఎందుకంటే టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో ఆమె కనిపించడమే ప్రధాన కారణం. దుబాయ్లో వీరిద్దరు జంటగా మెరవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్జే మహ్వశ్పైనే పడింది. ఇంతకీ చాహల్తో ఉన్న ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీశారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లకు హాజరు కావడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురువారం ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్కు కూడా హాజరైంది. మొదటి నుంచి ఈ సీజన్లో చాహల్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆర్జే మహ్వశ్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో తుది జట్టులో చాహల్ లేకపోయినప్పటికీ ఆమె స్టేడియంలో సందడి చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలవ్వడంచో ఆర్జే మహ్వశ్ తీవ్ర నిరాశకు గురైంది. ఆనందంగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆమెకు పంజాబ్ ఓడిపోవడంతో అప్సెట్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. యుజ్వేంద్ర చాహల్ వేలు గాయం కారణంగా పంజాబ్ చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఆర్జే మహ్వశ్- చాహల్ డేటింగ్ రూమర్స్..యుజ్వేంద్ర చాహల్ తన భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నుంచి మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్ -ఆర్జే మహ్వశ్ జంటగా కనిపించడంతో డేటింగ్ వార్తలొచ్చాయి. అయితే ఆర్జే మహవాష్ తాము కేవలం స్నేహితులమని స్పష్టం చేసింది. చాహల్ తన భార్యతో విడాకుల తర్వాత ఆర్జే మహ్వశ్తో అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. आज #RCBvsPBKS मैच का दो फोटो सबसे ज्यादा सुर्खियों में है।First Virat Kohli and Anushka Sharma Second Shubhankar mishra and Rj mahvashRCB INTO THE FINALS Congratulations RCB#IPLPlayoffs #Qualifier1 pic.twitter.com/T1agohOxUG— Chandan Yadav (@ChandankryadavN) May 29, 2025 -
NMACC లో బాలీవుడ్ స్టార్ కిడ్ బర్త్డే సెలబ్రేషన్స్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల కుమారుడు అబరామ్(AbRam) తన 12వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లో అబ్రామ్ బర్త్డే వేడుక జరిగింది. ఆర్ట్స్ కేఫ్లో తల్లి గౌరీ ఖాన్, సిస్టర్స్ సుహానాతో కలిసి సందడి చేశాడు. ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలు ,వీడియో నెట్టింట సందడి చేస్తున్నాయి.2013 మే 27న సరోగసీ ద్వారా పుట్టాడీ స్టార్ కిడ్. అబ్రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అందమైన వీడియోను NMACC అధికారిక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తల్లి గౌరీ ఖాన్, ఆమె తల్లి, సవితా చిబ్బర్, సుహానా ఖాన్ను ఈ ఫోటోల్లో చూడవచ్చు. బబర్త్డే బోయ్ మల్టీ-టోన్ల షార్ట్స్తో నీలిరంగు పోలో టీ-షర్టులో డాషింగ్గా కనిపించాడు, సుహానా వేవ్ ప్యాటర్న్లతో స్ట్రాపీ మల్టీ-కలర్ మిడి-డ్రెస్లో అందంగా కనిపించింది. అబ్రామ్ తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య హ్యాపీ బర్త్డే అబ్రామ్' పేరుతో ఉన్న కేక్ను కట్ చేశాడు. మొత్తం మీద అబ్రామ్ పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు టోటల్ ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. అబ్రామ్ ఖాన్ ఇప్పటికే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ముఫాసా: ది లయన్ కింగ్ హిందీ వెర్షన్తో తన వాయిస్ ఓవర్తో అరంగేట్రం చేశాడు. చిన్ని'ముసాఫా' కి వాయిస్ను అందించగా, షారుఖ్ ఖాన్ ఓల్డ్ 'ముఫాసా'కి వాయిస్ ఇచ్చారు. అంతేకాదు గిటార్ , ఫుట్బాల్ వాయించడంలో అబ్రామ్కు నైపుణ్యం ఉంది. గత ఏడాది డిసెంబర్లో ఇది తిరిగి విడుదలైంది. అంతేకాదు ఇదే మూవీలో ఆర్యన్ ఖాన్ 'సింబా' గా వాయిస్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)> స్టార్ హీరో షారూఖ్తో పాటు, ఆయన కుమారుడు అబ్రామ్ను అభిమానులు చాలా ఇష్టపడతారు .. ఒక సందర్భంలో తన కొడుకు పేరు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, ప్రవక్త ఇబ్రహీం , రామ్ పేర్లు కలిసి ఉన్నాయని, తనకు ఆ పేరు చాలా ఇష్టమని చెప్పాడు. -
Manchu Lakshmi: 20 మంది ప్రముఖులతో రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్గా మంచు లక్ష్మీ!
గతంలో కాఫీ విత్ కరణ్ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్ మరో రియాలిటీ షోతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోస్ట్గా వస్తోన్న రియాలిటీ గేమ్ షో 'ది ట్రైటర్స్'. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్తో పాటు దక్షిణాది నటులు కూడా ఉండడం ఈ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ షోలోనే పాల్గొనే వారి పేర్లను రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ రియాలిటీ షో ట్రైలర్ను కూడా విడుదల చేశారు.ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్ షోలో ఊహించని మలుపులు, హై-వోల్టేజ్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన గేమ్ ఆడనున్నారు. ఈ షోను రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో నిర్వహించనున్నారు. ఇందులో కరణ్ కుంద్రా, రాజ్ కుంద్రా, రఫ్తార్, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, అన్షులా కపూర్, మహీప్ కపూర్, మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్గా అడుగు పెట్టనున్నారు. ఈ రియాలిటీ షో గెలిచిన వారికి భారీగా నగదు బహుమతి అందుకోనున్నారు.అయితే గేమ్ షోను ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచి తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షోను వెబ్ సిరీస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు రానుంది. -
సౌత్ డైరెక్టర్తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం.. రివీల్ చేసిన రానా నాయుడు నటి!
సినీ ఇండస్ట్రీలో క్యౌస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో ఛాన్సుల పేరుతో చాలామందికి ఇలాంటి అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. సినీ ఇండస్ట్రీతో పాటు చాలా చోట్ల క్యాస్టింగ్ కౌచ్ అనే తరచుగా వింటుంటాం. అలా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెబుతోంది బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా. తన కెరీర్లో కాస్టింగ్ కౌచ్ ఎదురైన చేదు అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. చావ్లా తన వివాహం తర్వాత కూడా జరిగిన కొన్ని చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు.ఓ దర్శకుడి కార్యాలయంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా. ఒకసారి అతని ఆఫీస్ క్యాబిన్లో మీటింగ్ తర్వాత నేను వెళ్తుండగా.. సెండాఫ్ చెప్పేందుకు డోర్ వద్దకు వచ్చాడని తెలిపింది. నాకు వీడ్కోలు చెప్పడానికి తలుపు దగ్గరకు వచ్చి.. తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆ చేదు అనుభవాన్ని వెల్లడించింది. నేను వెంటనే అతన్ని వెనక్కి నెట్టివేశానని తెలిపింది. అతని ప్రవర్తనతో షాక్కు గురయ్యానని.. అసలేం ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించింది. అతను నా వ్యక్తిగత జీవితం గురించి.. అలాగే నా భర్త ఏం చేస్తున్నారని అడిగాడని గుర్తు చేసుకుంది. ఇలాంటి అనుభవం తనకు చాలాసార్లు ఎదురైందని పంచుకుంది. మరోసారి సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా వెల్లడించింది. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు షూటింగ్ సమయంలో తనతో పడుకోవాలని అడిగాడని వివరించింది. అతనికి హిందీ బాష రాకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా చెప్పించాడని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదామె. అంతకుముందు ఇంటర్వ్యూలో ఆడిషన్ల సమయంలో తన బాడీ షేమింగ్కు గురైనట్లు సుర్వీన్ చావ్లా పంచుకుంది. పరిశ్రమలోని మహిళలను తక్కువగా చూస్తారని.. దాని కారణంగా మహిళలు తమను తాము తక్కువగా భావిస్తారని అన్నారు. కెరీర్లో ఎన్ని అడ్డంకులు ఎదురైన చావ్లా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె ఇటీవలే 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4' వెబ్ సిరీస్లో కనిపించింది. అంతకుముందు నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడులోనూ నటించింది. ప్రస్తుతం ఆమె 'రానా నాయుడు సీజన్ 2'లోనూ కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్లో రానా దగ్గుబాటి సరసన మెప్పించనుంది. -
కోహ్లీ లైక్తో 20 లక్షలు మంది ఫాలో.. ఇంత ఖాళీగా ఉన్నారా: రకుల్
బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్(Avneet Kaur) ఫ్యాన్ పేజీలోని ఒక పోస్ట్ను క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli) లైక్ చేయడంతో ఆ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు దాని గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh) మాట్లాడారు. దేశంలో మనం ఇంత కాళీగా ఉన్నామా అంటూ తనదైన స్టైల్లో కామెంట్ చేసింది. ఇలాంటి వాటిని ఎందుకు వైరల్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. అవసరం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని సూచించారు.అవ్నీత్కౌర్ ఫ్యాన్ పేజీలోని ఒక ఫోటోను విరాట్ లైక్ చేయడంపై రకుల్ ఇలా చెప్పుకొచ్చారు. ' ఈ అంశం నన్ను చాలా బాధించింది. హమ్ బోహోత్ వేలే హై (మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా..) అనిపించింది. విరాట్ లైక్ వల్ల ఆమెకు(అవ్నీత్కౌర్) 20 లక్షల మంది ఫాలోవర్స్ కొన్ని గంటల్లోనే పెరిగారు. పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయిందని చెప్పినా కూడా పెద్ద సంఖ్యలో ఆమెను అనుసరించారు. ఇన్స్టాగ్రామ్లో ఒక్కోసారి మనం కూడా పొరపాటున స్నేహితులను అన్ఫాలో చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా కామన్గా జరిగే అంశాలు. విరాట్ కూడా వివరణ ఇచ్చారు. కానీ, విరాట్ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు నచ్చిన, నచ్చని అంశాలు అన్నీ వార్తలుగా మారిపోతున్నాయి. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఇలా వైరల్ చేయడం చాలా విచారకరమైన విషయం. సోషల్ మీడియాలో చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నారు.' అని ఆమె అన్నారు.ఆ అంశంపై కోహ్లీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్లోని ఫీడ్ను క్లియర్ చేస్తున్న క్రమంలో పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంలో ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పారు. అవసరంలేని ప్రచారాలు చేయకండని కూడా కోరారు. -
రెండేళ్ల క్రితమే బ్రేకప్.. మరో నటుడితో యంగ్ హీరోయిన్ డేటింగ్!
సినీ ఇండస్ట్రీలో బ్రేకప్, డేటింగ్ అనే పదాలు చాలా కామన్. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో అయితే ఇవీ కాస్తా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ డేటింగ్కు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తారా సుతారియా మరో నటుడితో డేటింగ్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అడార్ జైన్తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ మరో బాయ్ఫ్రెండ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ నటుడు వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కొన్ని నెలల క్రితం డేటింగ్ ప్రారంభించారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల కొద్ది కాలంగా ఈ జంట పలుసార్లు ఈవెంట్లకు హాజరైనట్లు తెలుస్తోంది. లక్మే ఫ్యాషన్ వీక్తో పాటు ఎ సమ్మర్ ఆఫ్ స్టైల్ అనే ఈవెంట్లో జంటగా కనిపించారు. (ఇది చదవండి: కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!)కాగా.. మరోవైపు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్తో డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరు జంటగా స్కైఫోర్స్ అనే మూవీలో నటించారు. అయితే తమపై డేటింగ్ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. తారా సుతారియా అంతకుముందు ఆడార్ జైన్తో రిలేషన్లో ఉంది. అయితే 2023లో వారు విడిపోయిన తర్వాత.. అడార్ జైన్ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నారు.గతంలో డేటింగ్పై వీర్ పహారియా మాట్లాడుతూ.. 'నా రిలేషన్స్ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. నాకు కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ వార్తలు వింటున్నా. అప్పుడు నేను పబ్లిక్ ఫిగర్ కాదు. అందుకే ఎవరూ నన్ను అడగలేదు. సోషల్ మీడియాలో ఏది ఉన్నా అది ప్రజలకు నిజమనిపిస్తుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. కానీ నేను ఏం చేయగలను? అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్గణ్, రోనిత్రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. -
SSMB29: రూ.20 కోట్ల ఆఫర్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు!
రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఇందులో నో డౌట్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మాత్రం రాజమౌళి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.న్యూస్ 18 కథనం ప్రకారం.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్కు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్ మహేశ్ సినిమాను రిజెక్టర్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళి- మహేశ్ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఎన్టీఆర్ అడిగిన ఆ ప్రశ్నతో నా మైండ్ బ్లాక్ అయింది: రాజేంద్ర ప్రసాద్
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ‘పెద్ద పెద్ద హీరోలు, మహానుభావులంతా ఉన్నారు. మీకంటూ ఉన్న ప్రత్యేకత ఏంటి?’ అని ఎన్టీ రామారావు గారు నన్ను అడిగారు. ఆ ప్రశ్నతో నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. ఓ వారం రోజులు పాటు ఆలోచిస్తూనే ఉండిపోయా. అప్పుడే చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ సినిమాలు చూశాక నాకు ఐడియా వచ్చింది. అందరికీ ఓ సపరేట్ మార్క్ ఉండేది. రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరో అని ఉన్నప్పుడు.. కామెడీ హీరో అని ఎందుకు ఉండకూడదు అనుకున్నాను. ఇక కామెడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్ని చేయాలని, కామెడీ హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించాను. ‘లేడీస్ టైలర్’ తరువాత ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు’ అని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించారు. మే 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కళ అనేది సముద్రం. మనం సముద్రం మొత్తాన్ని తాగగలమా? ఈదగలమా?.. కళ కూడా అంతే. ఎప్పటికీ ఆకలి, దాహం తీరదు. ఎప్పటికీ నటుడిగా ఇంకెన్నో పాత్రలు పోషించాలి. ‘షష్టిపూర్తి’ చిత్రంలో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి. ‘లేడీస్ టైలర్’ మూవీ మాడ్యులేషన్, గెటప్ కావాలని దర్శకుడు పట్టుబట్టుకుని కూర్చున్నారు. కానీ నా యాటిట్యూడ్ వల్ల ఆ పాత్రను ఈజీగా పోషించాను. ఇందులో మూడు ఏజ్ గ్యాప్లను చూపించాం. ఇది నాకు ఛాలెంజింగ్గా అనిపించింది.→ మనం ఏ పాత్రలు పోషించినా.. ఆ పాత్రలే జనాలకు గుర్తుండాలనేది నా సూత్రం. ఇది నా ఐదో జనరేషన్. ఇప్పటికీ నా కోసం ‘షష్టిపూర్తి’ లాంటి పాత్రలు రాస్తున్నారంటే అది నా అదృష్టం. పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. అందుకే ‘షష్టిపూర్తి’కి అంత ప్రాధాన్యం. ఇలాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు.→ ఇళయరాజా గారు మాతో పోటీ పడి మరీ సంగీతాన్ని అందించారు. కీరవాణి గారు మా కోసం పాట రాశారు. కీరవాణి పాట రాస్తున్నారా? అని రాజా గారు కూడా షాక్ అయ్యారు. మా ‘షష్టిపూర్తి’ కోసం రాజా గారు అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ గారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు.→ నా జీవితంలో ఎప్పుడూ కూడా జేబు నిండిందా? లేదా? అన్నది చూడలేదు. చేస్తున్న జాబు (పని) సంతృప్తిని ఇచ్చిందా? లేదా? అన్నది చూశాను. ఏడాదికి పన్నెండు చిత్రాలు చేశాను.. ఎంతో డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులు అన్నీ కూడా పోయాయి. కానీ నేను ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించలేదు. నేను చేస్తున్న పని, వేస్తున్న పాత్రలే సంతృప్తినిస్తుంటాయి. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇప్పటికీ పని దొరుకుతోంది. గత 48 ఏళ్లుగా పని దొరుకుతూనే ఉంది. ఇప్పుడు నా చేతిలో 11 ప్రాజెక్టులున్నాయి. ఇంకో నాలుగు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.→ ‘షష్టిపూర్తి’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. నవ్విస్తాను, ఏడ్పిస్తాను. ఈ మూవీని చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు.→ ప్రస్తుతం కామెడీ తగ్గింది. దానికి ప్రధాన కారణం రచయిత. మా టైంలో అద్భుతమైన కామెడీని రాసేవారు. అప్పట్లో హెల్దీ కామెడీతోనే అందరినీ నవ్వించాను. ఇప్పుడు అలాంటి కామెడీ టైమింగ్, కామెడీ రైటింగ్ కానీ కనిపించడం లేదు. ‘రాబిన్ హుడ్’లో వెన్నెల కిశోర్తో నా ట్రాక్ను అందరూ ఎంజాయ్ చేశారు. మంచి కామెడీ ఇప్పుడు మిస్ అవుతోందని నేను కూడా ఎక్కువగా బాధపడుతుంటాను. ‘అహనా పెళ్లంట’ బ్లాక్ బస్టర్ తరువాత నాకు ఎక్కువ భయం వేసింది. మళ్లీ అలాంటి సినిమా వస్తుందా? అని అనుకున్నాను. ప్రస్తుతం ఉన్న కామెడీ ఇంకా బెటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. -
వోడ్కా తాగండి అంటున్న ప్రభాస్ ‘సీత’.. ఇదేమైనా బాగుందా?
ఒకప్పుడు పౌరాణిక పాత్రలు ధరించిన తారలు...ఆ సందర్భంలో ఎంతో నిష్టగా ఉండేవారని విన్నాం. ఉపవాసాలు చేస్తూ, కటిక నేల మీద నిద్రపోతూ.. దేవుని పాత్రల్ని పండించిన నటీ నటులను కన్నాం. అది నటనే అయినప్పటికీ ప్రజల భావోద్వేగాలతో అనుసంధానమై ఉన్న దేవుళ్లలా కనిపించాలంటే నిజంగా అంతటి దైవభక్తి ఉంటే తప్ప ఆ పాత్రల్ని పండించడం సాధ్యం కాదని అప్పటి వారి భావన. కేవలం పాత్రల్ని పండించడం మాత్రమే కాదు ఆ తర్వాత కూడా తమ నడవడిక, ప్రవర్తన కొంతయినా పద్ధతిగా ఉండేలా జాగ్రత్త పడేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు అంతటి చిత్తశుద్ధిని ఈనాటి తారల్లో చూడలేం. అది అలా ఉంచితే.. మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలని పెద్దలు చెప్పారు. అలాగే సెలబ్రిటీలన్న తర్వాత కాసింత సామాజిక బాధ్యత కూడా ఉండాలని కూడా చెప్పారు..చెబుతున్నారు. కానీ తారల చెవికి అవి ఎక్కడం లేదు. సినిమాల ద్వారా సంపాదించుంటున్నది చాలదన్నట్టు ప్రకటనల్లోనూ వారే కనిపిస్తున్నారు. పోనీ అక్కడైనా కాస్త బాధ్యతగా ఉంటున్నారా? సిగిరెట్స్ నుంచి మద్యం దాకా ప్రజల ఆరోగ్యాల్ని హరించే ఉత్పత్తుల ప్రచారానికి కూడా సై అంటున్నారు. అది సరికాదని ఎందరు నెత్తి నోరూ బాదుకుంటున్నా కాసుల కక్కుర్తిలో కొట్టుకుపోతున్న సెలబ్రిటీల చెవిన పడడం లేదు. ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ ఓ మద్యం బ్రాండ్ ప్రచారంలో కనిపించడం విమర్శలకు గురైన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కాకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. అంటే ఇక ఆమె యువత వోడ్కా తాగడాన్ని శక్తి వంచన లేకుండా ప్రోత్సహించనుందన్న మాట. ‘కృతిని మా జట్టులోకి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది‘ అని బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న కొత్త తరం యువ వినియోగదారుల్లా ఆమె తెలివైనది, స్టైలిష్ గా, నిర్భయంగా ఉంటుందని ఇది తమ మ్యాజిక్ మూమెంట్స్కు కొత్త అధ్యాయం’’ అంటున్నారు. మరోవైపు ‘మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుంది’’ అంటూ కృతి సనన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. సినీతారలు మద్యం ప్రచారంలో పాల్గొనడం పై విమర్శలు వస్తున్నా కృతి సనన్ సినిమా లాంటి యువ తారలు పట్టించుకోకపోవడం విచారకరం. మరోవైపు పొడుగు కాళ్ల సుందరి కృతిసనన్ మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన ఆదిపురుష్లో సీతగా కూడా చేసింది. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా... ఆదిపురుష్ చిత్రంలో సీతగా పౌరాణిక పాత్ర చేసిన తర్వాత ఆమె వోడ్కా ప్రచారంలో పాల్గొనడం ఎంత వరకూ సబబు? అనే ప్రశ్న వస్తోంది. మరి ఆమె ప్రచారాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. View this post on Instagram A post shared by License India (@license.india) -
క్యాన్సర్ బారిన పడిన నటి.. లివర్లో టెన్నిస్ బాల్ సైజ్ కణితి!
ప్రముఖ టీవి నటి దీపికా కాకర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని వారాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న దీపికా, ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, ఆమె కాలేయంలో టెన్నిస్ బాల్ పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఇది స్టేజ్-2 మాలిగ్నెంట్ (క్యాన్సరస్) కణితిగా నిర్ధారణ అయింది.దీపికా తన పోస్ట్లో, "గత కొన్ని వారాలు మాకు చాలా కష్టంగా గడిచాయి. కడుపు పైభాగంలో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, కాలేయంలో కణితి ఉన్నట్లు తెలిసింది. ఇది స్టేజ్-2 క్యాన్సర్గా నిర్ధారణ అయింది. ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవుని అనుగ్రహంతో పాటు, నా అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమతో ఈ కష్టాన్ని అధిగమిస్తానని నమ్ముతున్నాను’ అని దీపికా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీపికా త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, సహ నటులు కామెంట్లు చేస్తూ, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా, ఇటీవల జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నుంచి దీపికా కాకర్ కుటుంబం తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్తో బాగా పాపులర్ అయిన దీపికా, తన భర్త షోయబ్ ఇబ్రహీం, కుమారుడు రుహాన్తో కలిసి కశ్మీర్లో విహారయాత్రకు వెళ్లారు. వారు పహల్గాం సహా పలు ప్రాంతాలను సందర్శించారు. వారు తమ వెకేషన్ను ముగించుకుని తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ విషయాన్ని దీపికా-షోయబ్ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, తాము క్షేమంగా ఉన్నామని అభిమానులకు తెలియజేశారు. దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్గా నిలిచింది. అదే ఏడాదిలో షోయబ్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వీరికి 2023లో రుహాన్ అనే కుమారుడు జన్మించాడు. దీపికా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్షెఫ్ ఇండియా’ షోలో కనిపించారు. View this post on Instagram A post shared by Dipika (@ms.dipika) -
ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!
అతిలోక సుందరి ఐశ్వర్యా రాయ్.. హీరో అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ కాంబోని ఎవరూ అస్సలు ఊహించలేదు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిన వైభవి మర్చంట్ కూడా తను ఇలానే అనుకున్నానని చెప్పింది. ఓ ఐటమ్ సాంగ్లో వీళ్లిద్దరూ నటించిన తర్వాత.. పెళ్లి జరగడంతో ఒక్కసారిగా షాకయ్యానని చెప్పుకొచ్చింది.అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మొన్నటివరకు సహాయ పాత్రల్లో కనిపించాడు. ప్రస్తుతం ఓటీటీ సినిమాల్లో హీరోగా మెరుసున్నాడు. గతంలో అభిషేక్, తండ్రి అమితాబ్తో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' అనే మూవీ చేశాడు. 'కజరారే..' అనే ఐటమ్ సాంగ్ వినే ఉంటారుగా. అది ఈ సినిమాలోనిదే. ఈ చిత్రానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొరియోగ్రాఫర్ వైభవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)''కజరారే..' పాట చేస్తున్నప్పుడు.. తండ్రి అమితాబ్ కూడా సెట్లోనే ఉండటంతో అభిషేక్ చాలా భయపడుతుండేవాడు. ఐశ్వర్య అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని సందేహపడుతూ ఉండేది. ఈ పాట జరిగిన కొన్నేళ్ల తర్వాత అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకోవడంతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత వివాహం చేసుకుంటారని అస్సలు ఊహించలేదు. కానీ జరిగింది' అని వైభవి మర్చంట్ చెప్పుకొచ్చింది.ఈ పాటలో అమితాబ్-అభిషేక్-ఐశ్వర్య.. ముగ్గురూ డ్యాన్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ సాంగ్ ఓ రకంగా ఐశ్వర్యకు కమ్ బ్యాక్ అని అనుకోవచ్చు. ఈ తరహా పాటలతో పాటు సినిమాల్లో మళ్లీ ఈమెకు హీరోయిన్గా అప్పట్లో అవకాశాలు వచ్చాయి. ఏదేమైనా ఓ పాట.. ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లికి కారణమైందనమాట!(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్) -
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
గత రెండు మూడు రోజుల నుంచి దీపిక పదుకొణె తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా. ఈ దర్శకుడు.. ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత దీపికనే అనుకోని, చివరి నిమిషంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తన సినిమా స్టోరీని లీక్ చేస్తుందని సందీప్ ఓ ట్వీట్ చేశాడు. డర్టీ పీఆర్ గేమ్స్ అని రెచ్చిపోయాడు. ఇదంతా కూడా దీపికని ఉద్దేశించే అనే కామెంట్స్ వినిపించాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)తాజాగా ఓ ఫ్యాషన్ షోలోపాల్గొన్న దీపిక పదుకొణె, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది.అయితే దీపిక పరోక్షంగా సందీప్ వంగాకు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే సందీప్ వంగా 'స్పిరిట్' పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దీపిక.. 'కల్కి 2' కోసం సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం ఈమెకు కూతురు పుట్టింది. చివరగా 'సింగం ఎగైన్'లో దీపిక కనిపించింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. (ఇదీ చదవండి: నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్) -
'నేను మరొకరిలా ఉండేందుకు రాలేదు'.. ఐశ్వర్యతో పోలికపై మండిపడ్డ ఊర్వశి భామ!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. విభిన్నమైన డ్రెస్సులతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఫోటోలకు పోజులిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది ముద్దుగుమ్మ. అయితే ఈ ఫెస్టివల్లో ఊర్వశి తీరుపై విమర్శలొచ్చాయి. తన ఫోటో షూట్ కోసం మెట్లను బ్లాక్ చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. కానీ అలాంటిదేం జరగలేదని.. తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది ఊర్వశి రౌతేలా.అంతేకాకుండా ఈ కాన్స్ ఫెస్టివల్కు హాజరైన ఐశ్వర్య రాయ్తో కొందరు పోల్చడంతో ఊర్వశి మరింత క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఐశ్వర్య ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో మాత్రమే కనిపించింది. కాన్స్లో గుర్తింపు పొందిన ఐశ్వర్యతో పోల్చడం ఎవరికైనా గౌరవప్రదమైన విషయం అయినప్పటికీ.. నెటిజన్స్ కామెంట్ చేయడంపై ఊర్వశి స్పందించింది. ఈ మేరకు ఇన్స్టా స్టోరీస్లో క్లారిటీగా రాసుకొచ్చింది.ఊర్వశి తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను నా సొంత చరిష్మాతో ఐశ్వర్య రాయ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్. కానీ నేను మరొకరిలా నకిలీగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేను ఒక బ్లూ ప్రింట్. కాన్స్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చా. నా లుక్, నా స్టైల్, నా విశ్వాసం మీకు అసౌకర్యంగా అనిపిస్తే గట్టిగా ఓ శ్వాస తీసుకోండి. నేను అందరికీ నచ్చే వ్యక్తిని కాదు. నేను ఎల్లప్పుడు బాణసంచా, షాంపైన్ లాగా ఉంటా. నాపై ఎన్ని విమర్శలొచ్చినా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటా. ఎందుకంటే ఎవరూ మీలాగా చేయరు.' అని రాసుకొచ్చింది. -
స్టార్ హీరో ఇంట్లోకి ప్రవేశించిన మహిళ.. చివరికి ఏమైందంటే?
బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో గుర్తు తెలియని మహిళ ప్రవేశించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో ఇంటికి వచ్చిన ఆమె పనిమనిషితో ఆదిత్య రాయ్ కపూర్ను కలిసేందుకు వచ్చానని తెలిపింది. ఆయన కోసం బహుమతులు కూడా తీసుకొచ్చానని చెప్పింది. దీంతో ఆమెను ఇంట్లోకి అనుమతించారు. కానీ ఆ సమయంలో ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేరని సమాచారం.ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంట్లోకి మహిళ వచ్చిన విషయాన్ని ఆ తర్వాత హీరోకు సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ వెంటనే హౌసింగ్ సొసైటీ అధికారులను సంప్రదించగా.. వారు ఖర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 47 ఏళ్ల గజాలా సిద్ధిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.అయితే ఈ కేసు దర్యాప్తులో ఇది సిద్ధిక్కు ఇలా చేయడం మొదటి సారి కాదని తెలిసింది. గత వారంలో ఆమె సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుబాయ్ నివాసిగా చెప్పుకునే గజాలా సిద్ధిక్.. ఆదిత్య రాయ్ కపూర్ను కలవడానికి ముంబైకి వచ్చానని పోలీసులతో చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన బాలీవుడ్ ప్రముఖులను సంప్రదించడానికి ఆమె పదే పదే ప్రయత్నించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదోసారి అలరించేందుకు వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హౌస్ఫుల్-5. గతంలో ఈ సిరీస్లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హౌస్ఫుల్ సిరీస్లో ఐదో చిత్రంగా ఈ సినిమా రానుంది. బాలీవుడ్లోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా హౌస్ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సిరీస్లో ఐదో భాగంగా హౌస్ఫుల్-5 ట్రైలర్ చూస్తుంటే నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే ఇందులో కామెడీ మరింత అలరించేలా ఉంది. కాగా.. ఈ చిత్రంలో రితేశ్ దేశ్ముఖ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సోనమ్ బాజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సాజిద్ నడియాద్వాలా నిర్మాతగా వ్యవహరించగా.. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. -
నేను పూర్తిగా మారిపోయా.. విడాకుల అంశంపై ధనశ్రీ తొలిసారి
టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల అంశం ఇప్పటికీ ఏదోలా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020లో ఈ జంట పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ ఏడాదిన్నర క్రితం విడాకుల రూమర్స్ వచ్చాయి. కట్ చేస్తే ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. అప్పటినుంచి సైలెంట్గానే ఉన్న ఈమె.. ఇప్పుడు తొలిసారి మీడియాతో మాట్లాడింది. విడాకుల తర్వాత తాను చాలా మారిపోయినట్లు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: Spirit: రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?) 'ట్రోలింగ్ నన్నేం బాధపెట్టదు. ఎందుకంటే నాకు మనోబలం ఎక్కువ. బయట సమస్యలు నన్నేం చేయలేవు. నెగిటివిటీ, బహిరంగ విమర్శలు.. నన్ను ఎప్పుడూ బాధించలేదు. నేను చాలా కష్టపడే మనిషిని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను ప్రేమించుకోవడం, క్రమశిక్షణ, వ్యాయామం, మంచి ఫుడ్తో పాటు నన్ను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు' అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.రీసెంట్ టైంలో ఎదురైన పరిస్థితులు నన్ను దృఢంగా మార్చాయి. నా తల్లిదండ్రులు ఎంత బలమైన కూతుర్ని పెంచారో తెలిసొచ్చింది. ఇప్పుడు నాపై వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడేం చెప్పినా అది మరింత చర్చకు కారణమవుతాయి. అలానే ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైన అంశం అని ధనశ్రీ చెప్పింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' కాజల్)చాహల్తో విడాకులు తీసుకోవడం ఏమో గానీ ధనశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. రూ.60 కోట్ల భరణం తీసుకుందని అన్నారు. కానీ అదంతా పుకారే అని తేల్చారు. మరోవైపు చాహల్తో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న ఆర్జే మహ్వశ్ అనే అమ్మాయి కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేది. ఇప్పుడు వాటిపైనే స్పందించిన ధనశ్రీ.. అలాంటివే పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది.ప్రస్తుతం తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో హీరోయిన్గా చేసిన ధనశ్రీ వర్మ.. హిందీలో భోల్ చుక్ మాఫ్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అంతకు ముందు ఈమె యూట్యూబర్గా చాలా ఫేమస్.(ఇదీ చదవండి: ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?) -
MIss World 2025: సిన్మా ఆఫర్లను ఛీ కొట్టిన మిస్ వరల్డ్
పైకి ఎన్ని మాటలు చెప్పినా అందాల రాణులుగా రాణించాలనుకునే వారి అంతిమ లక్ష్యం సినిమాల్లో రాణించడమే అవుతుందనేది నిజం. అందుకు నిదర్శనాలెన్నో మనకు తెలుసు. అయితే అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నప్పటికీ, తద్వారా వచ్చే అనేక రకాల ఆఫర్లను వాటి ద్వారా వచ్చే డబ్బు పేరు ప్రఖ్యాతుల్ని మాత్రం వద్దనుకున్న ఏకైక బ్యూటీ క్వీన్ రీటా ఫారియా(Reita Faria). మన భారతదేశపు తొలి మిస్ వరల్డ్. అప్పట్లోనే స్విమ్ సూట్ ధరించడమే కాకుండా బెస్ట్ ఇన్ స్విమ్ సూట్ అనే టైటిల్ని కూడా దక్కించుకున్న రీటా..అందాల ప్రదర్శన అంటే సినిమా అవకాశాల కోసమేననే అపోహలను 6 దశాబ్ధాల క్రితమే పటాపంచలు చేశారు. అందాల పోటీలను అత్యంత ప్రొఫెషనల్గా తీసుకున్న ఏకైక రోల్మోడల్గా నిలిచారు. ఆమె కధలోకి వెళితే... రీటా ఫారియా పావెల్ 1943 ఆగస్టు 23న ముంబైలోని మాతుంగా ప్రాంతంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు గోవా కాథలిక్కులు, తండ్రి జాన్ టివిమ్ అనే గ్రామానికి, తల్లి ఆంటోయినెట్ గోవాలోని శాంటా క్రజ్కు చెందినవారు,పెద్ద కుమార్తె ఫిలోమెనా తర్వాత ఫరియా వీరికి రెండవ కుమార్తె. ఆమెది మధ్యతరగతి కుటుంబం, తండ్రి మినరల్ వాటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు తల్లి బ్యూటీ సెలూన్ నడిపేవారు. యుక్తవయసులోనే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు వల్ల ఫరియా ఒక సగటు భారతీయ అమ్మాయిలా కాక అసాధారణంగా అనిపించేవారు. దాంతో ఆమె ’మమ్మీ లాంగ్ లెగ్స్ ’ అంటూ సహ విద్యార్థుల ఎగతాళికి గురయ్యారు. అయితే ఫారియా తన పొడవైన స్లిమ్ ఫిజిక్ని క్రీడలలో సత్తా చాటడం కోసం ఉపయోగించుకుని ’త్రోబాల్, నెట్బాల్ బ్యాడ్మింటన్ ఇలా పలు క్రీడల్లో రాణించారు. హాకీలో హ్యాట్రిక్ సాధించి తొలిసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ బాంబే పోటీలో పాల్గొని గెలుచుకున్నారు. అదే ఊపులో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా పోటీని గెలుచుకుని తద్వారా మిస్ వరల్డ్ 1966 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించారు. మిస్ వరల్డ్ పోటీల్లో, ’బెస్ట్ ఇన్ స్విమ్సూట్’ వ’బెస్ట్ ఇన్ ఈవినింగ్వేర్’ అనే ఉప–టైటిళ్లను గెలుచుకుని, ఫైనల్స్లో ఇతర దేశాల నుంచి∙పోటీ పడుతున్న 51 మంది ప్రతినిధులను ఓడించి మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా స్వంతం చేసుకున్నారు.తొలి ఇండియన్ మిస్ వరల్డ్గా నిలిచిన ఆమెను అనేక రకాల ఆఫర్లు చుట్టుముట్టాయి. ముఖ్యంగా సినిమాల్లో నటింపజేయడానికి లాభదాయకమైన ఆఫర్లు విసిరారు. ఆకర్షణీయమైన ఆదాయం అంతకు మించి మరింత గొప్ప కెరీర్ కనిపిస్తున్నప్పటికీ, మోడలింగ్, నటన కాంట్రాక్టులను ఆమె నిస్సంకోచంగా తిరస్కరించారు. బదులుగా వైద్య విద్యపై దృష్టి పెట్టి గ్రాంట్ మెడికల్ కాలేజ్లో చేరి ఎం.బి.బి.ఎస్. డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చదువుకున్నారు. అదే సమయంలో గురుతుల్యులైన డేవిడ్ పావెల్ను 1971లో వివాహం చేసుకుని 1973లో ఐర్లాండ్లోని డబ్లిన్ కు మకాం మార్చారు, అక్కడ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఫారియా తన భర్త, ఎండోక్రినాలజిస్ట్ డేవిడ్ పావెల్తో కలిసి ఐర్లాండ్లోని డబ్లిన్ లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత కూడా మన దేశంతో సహా పలు చోట్ల అందాల పోటీల్లో జడ్జిగా అతిధిగా పాల్లొన్న రీటా ఫరియా... ఎందరో అందగత్తెలకు మార్కులు వేశారు. అయితే అందాల పోటీలో గెలుపు అంటే అందలాలు ఎక్కడానికి పిలుపు కాదని నిరూపించిన రీటా మార్క్ మాత్రం చెరిగిపోనిదే... ఎప్పటికీ... -
ఓటీటీల విషయంపై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం
బాలీవుడ్ ఆగ్ర నటుడు అమిర్ ఖాన్ (Aamir Khan) నటిస్తోన్న కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) థియేటర్లో విడుదలైన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లో విడుదల చేసే యోచనలో ఉన్నారు. సినిమాలపై ఓటీటీల ప్రభావం తగ్గించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు ఎనిమిది వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. ఇలాంటి డీల్ వ్యాపారంలో సరైంది కాదన్నారు.అమీర్ ఖాన్ కొత్త సినిమా 'సితారే జమీన్ పర్' జూన్ 20న విడుదల కానుంది. సాధారణంగా థియేటర్ రన్ 8వారాలు పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సిందే. అయితే, దానిని అమీర్ బ్రేక్ చేయనున్నారు. ఓటీటీలో కాకుండా యూట్యూబ్లో విడుదల చేయనున్నారు. అది కూడా చాలా రోజుల తర్వాతే అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఆ సమయంలో సినిమా చూడాలనుకునే వారు చిత్ర నిర్మాతలు సూచించిన రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నిర్మాతలకు నష్టం వాటిల్లదని ఆయన అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమీర్ చెప్పిన మాట ప్రకారం ఇలా ఓటీటీని బాయ్కాట్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.అమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. 'థియేటర్లలో విడుదలైన సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా థియేటర్స్ తీవ్రంగా నష్టపోతున్నాయిని నేను నమ్ముతున్నాను. ఇక నుంచి నేను నటించే సినిమాలు ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాను. వాటిని థియేటర్స్లో మాత్రమే విడుదల చేస్తాను. అభిమానులు కూడా నా సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలని కోరుకుంటారు. అందుకే నా మూవీని థియేటర్స్లో విడుదల చేస్తాను. దీంతో సినిమా వ్యాపారం బలం పుంజుకుంటుందని నమ్ముతున్నాను.' అని అన్నారు. ఓటీటీల వల్ల ఆడియన్స్ను థియేటర్లకు రావొద్దని మనమే పరోక్షంగా చెబుతున్నామని, అందుకే సినిమాలు విజయవంతం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. 2007లో వచ్చిన 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్గా ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ కామిడీ డ్రామాగా ఈ చిత్రం రానుంది. -
వయస్సు తేడా ఉన్నప్పటికీ: యంగ్ హీరో
బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్ ప్రస్తుతం హోమ్బౌండ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్కు జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్.. టబుతో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమెతో ఇంటిమేట్ సీన్స్ చేయండపై మాట్లాడారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ ఆమెతో అలాంటి సీన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదని అన్నారు.ఇషాన్ మాట్లాడుతూ.. " నిజాయితీగా చెప్పాలంటే టబు లాంటి నటితో దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. ఆమెతో ఇంటిమేట్ సీన్ చేయడానికి నేను భయపడలేదు. నిజానికి నేను చాలా సేఫ్గా భావించా. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో అర్థం చేసుకోవడమే కాకుండా.. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలిగే నటితో నేను నటించా. అదే టబులో ఉన్న గొప్పదనం. మనం ఒక సన్నివేశంలో ఏమి చేస్తున్నామో దాని గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఆమె సెట్లో చిన్నపిల్లాడిలా ఉంటుంది. జోక్స్ వేస్తూ అందరినీ నవిస్తుంది " అని అన్నారు.కాగా.. ఇషాన్ ఖట్టర్ గతంలో 'ఎ సూటిబుల్ బాయ్' అనే వెబ్ సిరీస్లో టబుతో కలిసి నటించారు. 1993లో విక్రమ్ సేథ్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్లో టబు నటించింది. సీనియర్ హీరోయిన్ టబుతో ఇషాన్ ఖట్టర్ ఇంటిమేట్ సీన్స్ను తెరకెక్కించారు. మరోవైపు ఇషాన్ చివరిసారిగా 'ది రాయల్స్'లో కనిపించాడు. ఇది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, ల్యూక్ కెంట్ కీలక పాత్రల్లో నటించారు. -
పటిష్ట భద్రత నడుమ పెళ్లికి హాజరైన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆయన తన స్నేహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు వై ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. అయితే మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడండో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరిచగా.. ఆమెను 14 రోజుల రిమాండ్కు తరలించారు.ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ చివరిసారిగా రష్మిక మందన్నతో కలిసి సికందర్ మూవీలో కనిపించారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించి సాజిద్ నదియాద్వాలా నిర్మించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్, అంజిని ధావన్,జతిన్ సర్నా కూడా నటించారు. ఈ ఏడాదిలో మార్చి 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నేటి నుంచే ఓటీటీలో స్ట్రీమిగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వెండితెరపై ఆపరేషన్స్ ఖుక్రీ
మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా జీవితం వెండితెరపైకి రానుంది. బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ప్రధానపాత్రధారిగా హిందీలో ‘ఆపరేషన్స్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది. ఈ మిలటరీ వార్ డ్రామా సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘ఆపరేషన్స్ ఖుక్రీ: ది అన్స్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్కీపింగ్ మిషన్స్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ పుస్తకం హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. 2000లో వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రాలియోన్లో జరిగిన ఆపరేషన్స్ ఖుక్రీ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.యునైటెడ్ పీస్కీపింగ్ మిషన్స్ లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు, అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. ఈ సైనికుల రక్షణ రెస్క్యూ ఆపరేషన్స్ ను రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. ఈ రాజ్పాల్ పునియాగానే రణ్దీప్ హుడా నటించనున్నారు. మరోవైపు హిందీలో ‘బదాయి హో, మైదాన్స్ ’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు అమిత్ శర్మ కూడా ‘ఆపరేషన్స్ ఖుక్రీ’ ఘటనల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆలియా అరంగేట్రం అదిరిందయ్యా
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజు (మే 13)నే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా –పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కాలేదనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లోని ‘లవ్ అండ్ వార్’ (రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు) సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున వెళ్లలేదట.ఫైనల్గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో ఆమె రెడ్ కార్పెట్పై మెరిశారు. అయితే ఆలియా భట్ ధరించిన కాస్ట్యూమ్స్పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి మల్లికా షెరావత్ ధరించిన కాస్ట్యూమ్ డిజైన్నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్ లవర్స్పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్గా కనిపించారనే ప్రశంసలూ ఆమెకు దక్కాయి.ఇక కెల్లీ రిచర్డ్స్ డైరెక్షన్లోని ‘ది మాస్టర్ మైండ్’ సినిమాను ప్రదర్శించగా, ఐదు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఫ్రాన్స్లో పవర్ కట్స్ కారణంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదరయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్నప్లాన్ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి. -
ప్రభాస్ 'స్పిరిట్'లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ప్రకటన వచ్చేసింది
ప్రభాస్- సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్' (Spirit Movie).. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ప్రకటన వచ్చిన సమయం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానిమల్ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి పూర్తిగా స్పిరిట్ సినిమా కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.స్పిరిట్ సినిమా ప్రకటన వచ్చిన తర్వాత మొదటిసారి అధికారికంగా ఒక ప్రకటన చేశారు మేకర్స్.. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, దీపికా పదుకోణ్ ఆలియా భట్, రష్మికా మందన్నా సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ ఛాన్స్ను త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) అందుకుంది. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ సందీప్ ఒక పోస్ట్ షేర్ చేశారు.సందీప్ షేర్ చేసిన పోస్టర్ను బట్టి చూస్తే స్పిరిట్ చిత్రాన్ని దాదాపు 9 భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీకి మంచి గుర్తింపు దక్కింది. ప్రభాస్ తన కెరీర్లో తొలిసారి పోలీసు ఆఫీసర్గా నటిస్తున్నారు. మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభింస్తామని సందీప్ తెలిపారు. ఇందులో విలన్గా దక్షిణ కొరియా స్టార్ నటుడు మా డాంగ్ సియోక్ను (Ma Dong-seok) తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆనందంలో త్రిప్తిస్పిరిట్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసినందుకు త్రిప్తి డిమ్రీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఈ ప్రకటన రాగానే చాలా ఆనందంలో మునిగిపోయాను. ఈ జర్నీలో నన్ను నమ్మినందుకు సదా రుణపడి ఉంటాను. మరోసారి మీ విజనరీలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ సందీప్ రెడ్డి వంగా' అంటూ ఆమె తెలిపింది.The female lead for my film is now official :-) pic.twitter.com/U7JJQqSUVa— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025 -
బాలీవుడ్లో విషాదం.. రవితేజ ‘కృష్ణ’ విలన్ ఇక లేరు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు. ముకుల్ దేవ్కి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ చిత్రాల్లో నటించిన రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.చదవండి: కన్నప్ప టీమ్కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్ -
మిస్ వరల్డ్ కధలు: సిఎంతో సారీ చెప్పించుకున్న హైదరాబాద్ బ్యూటీ...
ఐశ్వర్యారాయ్ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్గా నిలిచింది. జన్మతః హైదరాబాద్ నగరంలోని ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో జన్మించిన డయానా హేడెన్... సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె పాఠశాల విద్యార్ధినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు దాంతో ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది.మిస్ వరల్డ్గా గెలిచిన ఏడాది తర్వాత, హేడెన్ లండన్ కు వెళ్లి రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి ఉత్తమ నటి నామినేషన్ పొందింది. ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఒథెల్లో చలనచిత్రంతో 2001 లో, తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్ టీవీ షో బిగ్ బాస్ రెండవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొంది 13 వ వారంలో ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయింది. మిస్ వరల్డ్ గెలిచినప్పటికీ సినిమా టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్ జీబ్, అబ్ బస్, లోన్ ఎ లవింగ్ డాల్...తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదా సీదా నటిగానే మిగిలిపోయింది.ఐశ్వర్యారాయ్, సుష్మితాసేన్ల తరహాలో కాకుండా బ్రౌన్ స్కిన్తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్ గెల్చుకున్న డయానా హేడెన్ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్కు గురి కావాల్సి వచ్చింది. అలాంటివాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సిఎం విప్లవ్కుమార్ దేవ్ ఆమె రూపాన్ని హేళన చేయడం ప్రస్తావనార్హం. అసలు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనేలేదని, ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్ధం ఉందని అంటూ ఆయన ఆమె రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని డయానా లు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో ఆమెను కించపరిచారు. ఈ మాటలు తీవ్ర వివాదంగా మారడంతో ఆయన డయానాను క్షమాపణలు కోరారు. -
The Diplomat Review: మాయ మాటలు నమ్మి పాకిస్తాన్ వెళితే..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం డిప్లొమాట్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. వాస్తవ కథలను సినిమాగా తీయడం ఓ సవాల్ అనే చెప్పాలి. అందులోనూ నిజంగా జరిగిన సున్నిత ఘటనలను సినిమా రూపంలో తీయాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అలాంటి ప్రయత్నమే ‘డిప్లొమాట్’( Diplomat Movie Review ) సినిమాలో చేశారు దర్శకుడు శివమ్ నాయర్. ఈ మూవీ చూస్తున్నంతసేపూ ఆ కథను మనం దగ్గరగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో దర్శకుడు నటీనటులతో జీవింపచేశారు. జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించగా సాధియా కతీబ్ మరో పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఏం ఉందో చూద్దాం. ఇదో యథార్థ గాథ. 2017లో ఉజ్మా అహ్మద్ అనే భారతీయ వివాహితను పాకిస్తాన్కు చెందిన తాహిర్ అనే యువకుడు మాయ మాటలతో తమ దేశం రప్పించుకుంటాడు. కేన్సర్ బారిన పడ్డ ఉజ్మా కూతురు వేరే దేశంలో ఉంటుంది. తన కూతురి ఆరోగ్యం కోసం డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తాహిర్ వలలో పడుతుంది ఉజ్మా. పాకిస్తాన్ వెళ్లాక ఉజ్మాకు అతని అసలు రంగు తెలుస్తుంది. తరువాత తాహిర్ ఆమెపై అత్యాచారం జరిపి, చిత్రహింసలు పెడుతుంటాడు. ఈ దశలో ఆ అమ్మాయి అతని దగ్గర నుండి తప్పించుకుని పాకిస్తాన్లోని ఇండియన్ ఎంబసీలోకి శరణార్థిగా ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారి అయిన జేపీ సింగ్కు తన గోడు వెళ్ళబోసుకుంటుంది. ఇంతలో తాహిర్ నానా రకాలుగా ఎంబసీలోకి రావడానికి ప్రయత్నించి చివరకు ఉజ్మా మీద, ఇండియన్ ఎంబసీ మీద కేసు పెడతాడు. అక్కడ నుండి కథ పలు మలుపులు తిరిగి, చివర్లో ఉజ్మాను భారతదేశానికి జేపీ సింగ్ ఎలా క్షేమంగా చేర్చాడన్నదే సినిమా. ఇక్కడ ఉజ్మా వల్ల భారత్–పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు చాలానే వస్తాయి. వాటిని అధిగమించి ఈ భారతదేశ బిడ్డను పాకిస్తాన్ నుండి ఎలా చేర్చాడు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. సినిమా చివర్లో నిజమైన ఉజ్మాతో పాటు అప్పటి ఎంబసీ అధికారిని... వారి చిత్రాలతో చూపించడం చాలా బావుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘డిప్లొమాట్’ నిజంగా సూపర్ థ్రిల్లర్. వర్త్ఫుల్ వాచ్ ఫర్ వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్పై ప్రశంసలు
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes Film Festival)లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్యాన్స్లోని ప్యారిస్ లో జరుగుతున్న 78వ కాన్స్ ఉత్సవాల్లో వరుగా రెండోరోజు తన అద్భుతమైన లుక్తో అందర్నీ అలరించింది. మాజీ మిస్ యూనివర్స్. మొదటి రోజు చీర, కెంపుల హారం, సింధూరంతో అటు ఫ్యాన్స్ను, ఇటు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. రెండో రోజు లుక్లో భారతీయత ఉట్టిపడేలా దర్శనమిచ్చి వావ్ అనిపించింది.కాన్స్ వేడుకలో రెండో రోజు ఐశ్వర్య రాయ్ మోడ్రన్ డ్రెస్లో కనిపించింది. కానీ ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించడం విశేషం. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ డ్రెస్లో ఆమె తళుక్కున మెరిసింది. ముఖ్యంగా చేతితో గీతలోని సంస్కృత శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ చేయించుకోవడం విశేషంగా నిలిచింది. బనారసీ కేప్పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ’ అనే శ్లోకాన్ని తీర్చిదిద్దుకుంది. వెండి, బంగారం, బొగ్గు , నలుపు రంగుల్లో, మైక్రో గ్లాస్ స్ఫటికాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు డిజైనర్ తెలిపారు. అలాగే వారణాసిలో చేతితో నేసిన ఈ కేప్ పై భగవత్ గీతలోని సంస్కృత శోక్లాన్ని ఎంబ్రాయిడరీ చేసినట్టు వెల్లడించారు. దీంతో ఐష్ లుక్పై ఫ్యాషన్ వర్గాలు సహా, సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial)ఐశ్వర్య ఫస్ట్ లుక్ సంప్రదాయం, గుర్తింపుకు చిహ్నంగా ఉండగా, రెండవది పునఃనిర్మాణం ఫ్యాషన్కి గుర్తు అని వ్యాఖ్యానించారు. 78వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 న ప్రారంభమైనాయి.రేపటితో(24) ఈ వేడుకలు ముగియనున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా -
కరోనా బారిన బాలీవుడ్ నటి ఫ్యామిలీ, ఎమోషనల్ పోస్ట్
కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విస్తరిస్తోంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 250 కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది. గత 24 గంటల్లో, మహారాష్ట్రలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది రెండవ అత్యధికం. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మహిళలకు కోవిడ్ సోకినట్ట నిర్ధారణ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ఈ సంవత్సరం రెండు COVID-సంబంధిత మరణాలను కూడా నివేదించింది బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 18 పోటీదారు శిల్పా శిరోద్కర్ తనకు సోకిందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి కోవిడ్ బారిన పడినట్టు జాతీయమీడియా నివేదించింది. కబీర్ సింగ్, ది జ్యువెల్ థీఫ్ మూవీల్లో నటించిన నికితా దత్తాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు, ఆమె కుటుంబంలో తల్లి ఇద్దరూ వైరస్ బారిన పడ్డారని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి (COVID-19) తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్తా తెలిపింది. స్వల్ప లక్షణాలతో, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపింది. ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కూడా నికిత కోవిడ్ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. -
దశాబ్ధాల బంధానికి బిగ్బి కటీఫ్..కౌన్ బనేగా కెబీసీ పతి?
కౌన్ బనేగా కరోర్ పతి(Kaun Banega Crorepati ) అంటే అమితాబ్, అమితాబ్ అంటే కెబిసి అన్నంతగా పెనవేసుకుపోయిన బంధం తెగిపోనుందా? దేశంలో మరెన్నో టీవీ షోలకు ఊపిరిపోసిన ఆ టెలివిజన్ షో సమర్పకుడికి స్థాన చలనం తప్పదా? భారతీయ టెలివిజన్ రంగంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్న వార్త ఇది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఐకానిక్ క్విజ్ షోకు సారధ్యం వహించిన లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇక ఆ బాధ్యతకు గుడ్ బై చెప్పనున్నారు. రెండున్నర దశాబ్ధాల క్రితం అంటే 2000లో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మూడవ సీజన్ మినహా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఫేస్ ఆఫ్ కెబిసీగా ఉన్నారు. ఒక్క 3వ సీజన్ను మాత్రం షారుఖ్ ఖాన్ హోస్ట్ చేశారు. ఆ ఒక్క సీజన్ తప్ప మరెప్పుడూ ఆ షోకి దూరం కాని, ఈ 81 ఏళ్ల బాలీవుడ్ స్టార్...వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి నిష్క్రమిస్తున్నారని ఇటీవలి నివేదికలు ధృవీకరిస్తున్నాయి. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేది మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలను మేల్కొలిపే వార్త కూడా. ఈ విజయవంతమైన షోని అందిస్తున్న సోనీ టీవీ ఇంకా ఈ మార్పును ధృవీకరించనప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న సీజన్ 17 కోసం బిగ్ బి స్థానంలో కొత్త హోస్ట్ రావచ్చనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. దీంతో తదుపరి షో ప్రెజెంటర్ ఎవరు అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ షో పట్ల ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావం చూపిన బిగ్ బీ ఛెయిర్లో కూర్చోవడానికి బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదని సమాచారం. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హంగామా నుంచి అందుతున్న ఒక నివేదిక ప్రకారం, బాలీవుడ్ ’భైజాన్’ – సల్మాన్ ఖాన్(Salman Khan) తో షోరన్నర్లు ముందస్తు చర్చలు జరుపుతున్నారంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, బిగ్ బాస్ షో ద్వారా చిన్న తెరపై బిగ్ బీ తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన సల్లూ భాయ్ భారతదేశపు అత్యంత విజయవంతమైన పురాతన షో... కేబీసీకి కొత్త హోస్ట్గా రానున్నాడు. ఈ వార్తల నేపధ్యంలో ‘‘ సల్మాన్ ఖాన్ కు ఉన్న విస్త్రుత ప్రజాదరణ, ఆయనను బిగ్ బికి సరైన వారసుడిగా మార్చగలదని టీవీ పరిశ్రమలోని వ్యక్తులు భావిస్తున్నారు., ‘సల్మాన్ చిన్న తెరకు ఇప్పటికే చిరపరిచితమైన స్టార్. పైగా ఆయన మారుమూల కేంద్రాలలోని ప్రేక్షకులతో సైతం బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ సరిగ్గా జరిగితే, అతను ఈ షోను తుఫానుగా తీసుకెళ్లగలడు‘ అని ఒక బాలీవుడ్ మీడియా పేర్కొంది.సల్మాన్ ఖాన్ నిజంగా అమితాబ్ బచ్చన్ స్థానంలోకి వస్తే, అభిమానులు ఆయనను నిశితంగా గమనిస్తారు. బిగ్ బి అత్యున్నత స్థాయి ప్రజెంటేషన్తో పోలికలు తప్పవు. అయితే సల్మాన్ ఖాన్ కు వీక్షకుల్లో ఉన్న ఆకర్షణ మాస్ అప్పీల్ కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఏదేమైనా కేబీసీ సీజన్ 17 వచ్చే ఆగస్టులో ప్రారంభమయే అవకాశం ఉంది, ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి, అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి సోనీ టీవీపైనే ఉంది. -
నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్
హైరా హైరా హాయ్ రబ్బ..హైరా హైరా హాయ్ రబ్బ.. అంటూ యూత్అను అలరించి ఫిఫ్టీ కేజీ తాజ్మహల్, తేనె కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్. తన అందం, అభినయంతో కోట్లాది మంది ఫ్యాన్స్ను సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందీమాజీ ప్రపంచ సుందరి. అయితే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్తో పెళ్లి,గర్భధారణ, పాపకు జన్మనిచ్చిన తరువాత ఆమె శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ప్రసవం తర్వాత,ఐశ్వర్య శరీర బరువుపై చాలా విమర్శలొచ్చాయి. ముఖ్యంగా వివిధ ప్రపంచ వేదికల మీద ఐశ్వర్య లుక్పై చాలా వ్యాఖ్యానాలు, అవమానకర సెటైర్లు చెలరేగాయి. తన శరీర ఆకృతిని జడ్జ్ చేస్తూ, బాడీషేమింగ్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో వచ్చిన వ్యాఖ్యలపై ఎప్పుడూ మౌనంగా, గౌరవ ప్రదంగా కనిపించిన ఐశ్వర్య స్పందించింది. 78వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో తనదైన శైలిలో అటు అభిమానులను, తన డ్రీమీ లుక్తో ఇటు ఫ్యాషన్ నిపుణులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు, గాసిప్లు, తన వెయిట్పై ఎన్నడూ స్పందించని ఐశ్వర్య మాత్రం ఒక సందర్భంలో ఆ లెక్క తేల్చేసింది. తనను విమర్శించిన వారిందరికీ ఘాటు రిప్లై వచ్చింది.ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా2011లో తల్లి అయిన తర్వాత, బరువు కారణంగా తీవ్రంగా ట్రోలింగ్కు గురైంది. గతంలో డేవిడ్ ఫ్రాస్ట్తో జరిగిన ఇంటర్వ్యూలో, ఐశ్వర్య తన గర్భధారణ బరువును తగ్గించుకోవడం గురించి అడిగినప్పుడు అసలు దీని గురించి అంత చర్చించాల్సి అవసరం లేదని, ఇది చాలా సహజమని చెప్పుకొచ్చింది. నేను బరువు పెరిగానా లేదా, నీరు పట్టిందా, ఇవేవీ నేను పట్టించుకోను. నా బాడీతో చాలా హాయిగా , సంతోషంగా ఉన్నాను. పాప ఆరాధ్యను చూసుకోవాల్సిన సమయంలో కూడా బయటకు వచ్చాను, లావుగా ఉన్నాననీ, బహిరంగంగా బయటకు వెళ్లడం మానేయలేదని అదే తనకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని ప్రకటించింది. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదనిపించింది. నా గురించి జనాలు మాట్లాడుకుంటూ బిజీగా ఉండే నాకేమీ సమస్యలేదు. కానీ నేను మాత్రం బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసింది.మాతృత్వం తనను వెనక్కి నెట్టలేదని నిరూపించింది ఐశ్వర్య రాయ్, కెరీర్, కుటుంబాన్ని సమతుల్యం చేస్తూ, అవమానాలు, అవహేళన వ్యాఖ్యలకు కృంగిపోకుండా, ఒక మహిళగా ఉండాల్సిన ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తూ ఒక రోల్మోడల్గా నిలుస్తోంది. ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! -
సల్మాన్ ఖాన్ ఇల్లు మరోసారి టార్గెట్ అయిందా..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో ఎప్పుడూ పలు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన ఇంట్లోకి చొరబడిని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన రెండురోజుల తర్వాత పోలీసులు ప్రకటించారు. అయితే, తనని విచారిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు సల్మాన్ ఇంటి వద్ద ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.ముంబైలోని సల్మాన్కు చెందిన గెలాక్సీ అపార్ట్మెంట్లోకి చొరబడిన వ్యక్తి పేరు జితేంద్ర కుమార్ సింగ్ అని పోలీసులు ప్రకటించారు. అయతే, తను సల్మాన్ను కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు ఇలా తెలిపారు. ' రెండురోజుల క్రితం సల్మాన్ ఇంటిముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేంద్రను భద్రతా సిబ్బంది మొదట హెచ్చరించించి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బందితో గొడవపెట్టుకుని తన ఫోన్ను విసిరేశాడు. అయితే, అదేరోజు సాయింత్రం మళ్లీ సల్మాన్ ఇంటి వద్ద అతను మరో వ్యక్తితో కనిపించాడు. ఒకరు బయట ఉన్న సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంటన్నట్లు గేమ్ ప్లాన్ చేయగా సల్మాన్ ఇంట్లోకి జితేంద్ర వెళ్లే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ తనను అడ్డుకుని ముంబై పోలీసులకు అప్పజెప్పారు.' అని వారు తెలిపారు. అయితే, పోలీసుల విచారణలో సల్మాన్ఖాన్ను కలవాలనుకుంటున్నానని జితేంద్ర చెప్పాడు. అడిగితే అనుమతి లేదని చెప్పడంతో ఇలాంటి పనిచేశానని తెలిపాడు. జితేంద్రపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.కొంతకాలంగా సల్మాన్ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్కు భద్రత కల్పించారు. -
భర్తతో ఆ హీరోయిన్ రొమాన్స్ చూసి ఏడ్చేసింది.. హీరో నిర్ణయంతో షాక్!
హీరో హీరోయిన్లు ఆన్స్క్రీన్ రొమాన్స్ బాగా పండిస్తే సినిమా విజయానికి అది దోహదం చేయవచ్చు. కానీ... అదే హీరో/ హీరోయిన్లకు అప్పటికే పెళ్లయి ఉంటే..ఆ పెళ్లికి అది పెనుముప్పుగా మారవచ్చు. ఇప్పుడు పెళ్లయిన నటీనటులు సినిమాల్లో రొమాన్స్ పండించడం వాటిని చూస్తూ కూడా సదరు నటీనటుల భార్య/భర్త ప్రొఫెషనల్గా మాత్రమే తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయి ఉండవచ్చు కానీ ఒకప్పుడు అది అంత సులభమైన విషయం కాదు. అదే పరిస్థితిని ఎదుర్కుంది అలనాటి ఒక సినిమా జంట.దాదాపు ఏభైఏళ్ల క్రితం అంటే, 1970ల చివరలో, బాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశమైన ఆన్స్క్రీన్ జోడీగా పేరొందారు అమితాబ్ బచ్చన్ అలనాటి దక్షిణాది బ్యూటీ క్వీన్ రేఖ. వీరి గురించి గుసగుసలు కూడా పరస్పరం గుసగుసలాడాయి అన్నంతగా వార్తలు వ్యాపించాయి. వారిద్దరి మధ్యా పండిన అద్భుతమైన కెమిస్ట్రీ వెండితెరను వెలిగించింది ఆ గాఢమైన అనుబంధం వెనుక నటన మాత్రమే కాదు అంతకు మించి అని అభిమానులను కూడా నమ్మించింది. కానీ పుకార్లు తమ చుట్టూ తిరుగుతుండగా, అప్పుడూ ఎప్పుడూ అమితాబ్ మౌనంగానే ఉన్నారు. మరోవైపు, సీనియర్ నటి రేఖ మాత్రం తరచు వాస్తవాలు మాట్లాడుతూ వస్తున్నారు. తమ కథలోని అత్యంత నాటకీయ భావోద్వేగ క్షణాలలో ఒకటి 1978 బ్లాక్బస్టర్ ’ముకద్దర్ కా సికందర్’ విడుదల సమయంలో జరిగిందని రేఖ ఇటీవల చెప్పారు. .ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రేఖ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించింది. ’ముకద్దర్ కా సికందర్’ విడుదలకు ముందుగా ఆ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించారని, ఆ సమయంలో ఆ స్క్రీనింగ్ చూడడం కోసం అమితాబ్ బచ్చన్ కుటుంబం వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. వారిని తాను ప్రొజెక్షన్ రూమ్లో నుంచి గమనిస్తూ ఉండిపోయానని తెలిపింది. ‘‘’ముకద్దర్ కా సికందర్’ ట్రయల్ షో చూడటానికి వచ్చిన బచ్చన్ కుటుంబాన్ని ప్రొజెక్షన్ రూమ్లో నుంచి చూస్తూ ఉన్నా. జయ ముందు వరుసలో కూర్చుంది. అతను (అమితాబ్) అతని తల్లిదండ్రులు ఆమె వెనుక వరుసలో ఉన్నారు. వారు ఆమెను నేను చూడగలిగినంత స్పష్టంగా చూడలేకపోయారు. ఆ సమయంలో నేను గమనించాను. అమితాబ్ నాకు (రేఖ) మధ్య మా ప్రేమ సన్నివేశాలు వస్తున్న సమయంలో, ఆమె ముఖం కన్నీటితో తడిసిపోవడం నేను చూడగలిగాను. ఒక వారం తర్వాత, పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు. అతను నాతో కలిసి పనిచేయబోనని తన నిర్మాతలకు స్పష్టం చేశాడని. ఈ నిర్ణయం చాలామందిని షాక్కి గురి చేసింది. ఎందుకంటే అమితాబ్ రేఖ కలిసి పరిశ్రమకు అనేక విజయాలను అందించారు వారి జంటను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డారు.ఏదైతేనేం.. ’ముకద్దర్ కా సికందర్’ తర్వాత, 1981లో వచ్చిన ఏకైక ’సిల్సిలా’ సినిమా వరకు వారు మళ్ళీ కలిసి కనిపించలేదు, ఈ సినిమా వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరుగుతున్న పుకార్లకు అద్దం పట్టింది. తన పట్ల అమితాబ్ కుటుంబం ఎప్పుడు ఎలా స్పందించినా, ఎల్లప్పుడూ జయ గురించి మాత్రం రేఖ గౌరవంగానే మాట్లాడింది, తామిద్దరి మధ్య శత్రుత్వం లేదా ద్వేషం అంటూ వచ్చిన వార్తలను కథలను తోసిపుచ్చింది. గత 1990లలో ఒక ఇంటర్వ్యూలో, రేఖ జయ గురించి తన భావాలను చాలా స్పష్టంగా చెప్పింది. ‘దీదీభాయ్ (జయ) చాలా పరిణతి చెందినది, చాలా కలుపుగోలు మనిషి. నేను ఇంతగా కలిసిపోయే మరో మహిళని చూడలేదు. ఆమె గౌరవించదగ్గ వ్యక్తి. ఆమెకు చాలా బలం ఉంది. నేను ఆమెని ఆరాధిస్తాను.‘ అంటూ చెప్పడం దీనికి నిదర్శనం. విశేషం ఏమిటంటే... 1981లో ‘సిల్సిల’ తర్వాత, అమితాబ్ రేఖ మళ్లీ కలిసి నటించలేదు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఐశ్వర్యరాయ్
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటన సింధూరం ధరించిన కేన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇటీవల పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సింధూరం పెట్టుకుని కనిపించింది. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు కేన్స్ వేదికగా తన లుక్తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య. ఈ సందర్భాన్ని చాటిచెప్పేలా ఐశ్వర్య సిందూరం పెట్టుకుని బలమైన సందేశం ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరుగుతోంది. ఈ సారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్ సినిమాను గుర్తుకు తెచ్చారు. 2002లో తొలిసారి ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్కు చీరకట్టులో హాజరయ్యారు. సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు. కొత్త లుక్ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుర్తు చేసుకుంటున్నారు.ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు. సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ష్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆె చీరను డిజైన్ చేశారు. ఆమె ధరించిన నెక్లెస్ను 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, వజ్రాలతో తయారు చేశారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
31 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన 'విశ్వసుందరి'.. ప్రత్యేకత ఇదే
పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు సుస్మితా సేన్( Sushmita Sen) పరిచయం చేశారు. సరిగ్గా 31 ఏళ క్రితం మే 21న విశ్వసుందరి కిరీటాన్ని ఆమె అందుకున్నారు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో ఆమె పేరు విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోయింది. అప్పటి తీపి గుర్తులను ఆమె తాజాగా మరోసారి గుర్తుచేసుకుంటూ ఫోటలను సోషల్మీడియాలో పంచుకున్నారు.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 'ఈ రోజు నా జీవితంలో ఎప్పిటికీ మరిచిపోలేనిది. నా ఆశలకు మరింత బలాన్ని అందించిన రోజు ఇదే.. ప్రపంచమంతా పర్యటించడానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసే భాగ్యం పొందడానికి దోహదపడిన రోజు. మిస్ యూనివర్స్ రేసులో నా భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన గౌరవం నాకు అభించిందని ఎప్పటికీ గర్వంగా ఉంటుంది. దానిని మాటలలో చెప్పలేం.' అని ఆమె పంచుకున్నారు.1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకుగాను 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసే వారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
కాన్స్లో బాలీవుడ్ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్పై చర్చ
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్ స్టైల్స్, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక కాన్స్రెడ్ కార్పెట్పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్ను నెక్ట్స్ లెవల్ అనిపించుకుంటన్నారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్ నెట్టింట వైరల్గా మారింది. ప్యారిస్లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్గా మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఔరా అనిపించుకుంది. సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు నక్సీ వర్క్ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్ ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial)స్టేట్మెంట్ నెక్లెస్, హైలైట్కాన్స్లో రుచి గుజ్జర్ లుక్ చర్చకు దారితీసింది. పీఎం మోదీ ముఖంతో డిజైన్ చేసిన డబుల్ లేయర్డ్, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్మెంట్ పీస్. స్పెషల్ నెక్లెస్పై మూడు కమలాల మోటిఫ్లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి. ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం బలానికి ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది. భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. ఒక యూజర్ మాత్రం "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ ఆర్గానిక్గా బాగున్నాయి కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు. -
అజయ్ దేవగణ్ రైడ్-2.. ఛావా తర్వాత రెండో చిత్రమిదే!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించిన చిత్రం 'రైడ్ 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1న థియేటర్లలో విడుదలైంది. గతంలో వచ్చిన రైడ్ మూవీ సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసింది. దాదాపు 18 రోజుల తర్వాత ఈ బెంచ్మార్క్ను అధిగమించింది. దీంతో ఈ సంవత్సరం విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.ఈ సినిమాకు రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 201.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో మాత్రమే రూ. 177.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్-ది ఫైనల్ రికనింగ్' కారణంగా రైడ్-2 కలెక్షన్స్ కొద్దిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 151.50 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది.కాగా.. 'రైడ్ 2' ఊహించిన దానికంటే థియేటర్లలో బాగానే నడుస్తోంది. అజయ్ దేవగణ్ కెరీర్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా రైడ్-2 నిలిచింది. గతేడాది నవంబర్లో దీపావళికి విడుదలైన 'సింగం ఎగైన్' తర్వాత ఈ మూవీ రికార్డ్ సాధించింది. అయితే 2018లో విడుదలైన 'రైడ్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 154 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్గా నటించగా.. రితేష్ దేశ్ముఖ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఎన్టీఆర్ 'వార్ 2' టీజర్ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక వచ్చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. తారక్ను ప్రధానంగా హైలెట్ చేస్తూ వీడియో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో తారక్ కిల్లర్ బాడీకి హృతిక్ రోషన్ లుక్స్ తోడు కావడంతో అటు బాలీవుడ్ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు. టీజర్ను చూస్తే భారీ యాక్షన్ సీన్స్తో ఆకట్టుకునేలా సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుగు, హిందీ, తమిళ్ వర్షన్లో టీజర్ విడుదలైంది. అయితే, అన్ని భాషల్లో కూడా తారక్నే డబ్బింగ్ చెప్పాడు.ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు.వార్తో ‘ఎన్టీఆర్ నీల్’కు బ్రేక్ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ‘వార్ 2’ నుంచి అప్డేట్ రావడంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్ని పోస్ట్పోన్ చేసినట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. -
శిల్పా శిరోద్కర్కు కరోనా
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, అందరూ మాస్క్లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శిల్పా శిరోద్కర్. కోవిడ్పాజిటివ్ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఇక బాలీవుడ్లో ‘త్రినేత్ర’, ‘హమ్’ (1991), ‘గోపీ కిషన్’ (1994) వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు శిల్పా.అలాగే 1992లో తెలుగులో ‘బ్రహ్మ’ చిత్రంలో కూడా నటించారామె. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, బ్రేక్ తీసుకున్న శిల్పా ఇటీవల బిగ్బాస్ 18 సీజన్లో కంటెస్టెంట్గాపాల్గొన్నారు. ఇదిలా ఉంటే... ఆసియా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో శిల్పా అక్కడికి ట్రావెల్ చేసి, ముంబై వచ్చారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మహేశ్బాబు సతీమణి నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్ అనే సంగతి తెలిసిందే. -
భారత్- పాక్ వార్.. రూ.50 లక్షల ఆఫర్ వదులుకున్న సింగర్!
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది. -
చాహల్తో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఆర్జే మహ్వశ్!
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్వశ్ పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మకు టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్తో కనిపించడమే. వీరిద్దరు కలిసి దుబాయ్లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఫోటోలు పెద్దఎత్తున వైరలయ్యాయి. ఆ తర్వాతే ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ మహ్వశ్ సందడి చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కానీ తమ రిలేషన్పై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జే మహ్వశ్.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. అవీ తనను ఎలా ప్రభావితం చేశాయో వివరించింది. కొంతమంది ట్రోల్స్ కారణంగా ఇలాంటివీ జరుగుతూ ఉంటాయని తెలిపింది. కానీ అందులో ఎలాంటి నిజం లేకపోవడంతోనే వాటిని అంగీకరించలేకపోయానని పేర్కొంది. ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు.. నిజం తెలియనప్పుడు నా జీవితం పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అని బాధపడ్డానని వెల్లడించింది. అందుకే సోషల్ మీడియాను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆర్జే మహ్వశ్ తన బాధను పంచుకుంది. కానీ నాపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్ బాగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పేవన్నీ కల్పితాలేనని.. మా మధ్య అలాంటిదేమీ లేదని ఆర్జే మహ్వశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.కాగా.. ఆర్జే మహ్వశ్ ప్యార్ పైసా ప్రాఫిట్ అనే సిరీస్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్లో ప్రసారం అవుతోంది. ఈ షో ప్రీమియర్ అయినప్పుడు చాహల్ ఈ సిరీస్పై పోస్ట్ పెట్టారు. -
తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!
దేశభక్తి ప్రధానంగా ఉండే సినిమాలు కొన్ని ఇదివరకే తెరపై సందడి చేశాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి తెలంగాణకు చెందిన అమర జవాన్ బయోపిక్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరా జవాన్? ఏంటి సంగతి?తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు.. 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అప్పట్లో ఈయన ధైర్య సాహసాల గురించి మన ప్రజలు చాలా మాట్లాడుకున్నారు. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే నవల కూడా రాశారు.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)ఇప్పుడు ఈ నవల ఆధారంగానే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ హీరోగా నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో షూటింగ్ మొదలుకానుండగా.. ముంబై, లద్దాఖ్ లో దాదాపు 70 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.గతంలో హీరోస్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి ప్రధానంగా నడిచే సినిమాల్లో సల్మాన్ నటించాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఇతడు మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. గతేడాది 'సికిందర్' చిత్రంతో వచ్చి ఘోరమైన ఫలితం అందుకున్నాడు. మరి ఈసారి జవాన్ బయోపిక్ మూవీతో సల్మాన్ ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
బాలీవుడ్ యువనటి నటి అనన్య పాండే) (Ananya Panday) తన కరియర్ ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. 2025 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో స్థానం సంపాదించి అందర దృష్టిని ఆకర్షించింది. నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించి ఫో ర్బ్స్ ఆసియా పోస్ట్ను అనన్య ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే అనన్య బాయ్ ఫ్రెండ్గా భావిస్తున్నవాకర్ బ్లాంకో ఈ వార్తలపై స్పందించడం విశేషంగా నిలిచింది. అనన్యను అభినందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, క్లాప్స్ ఎమోజీతో స్పెషల్ వార్తను తన అభిమానులకు షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా జాబితా 10వ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో ఆసియాలో అత్యంత ఆశాజనకమైన 300 మంది వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు , 30 ఏళ్లలోపు యంగస్టర్లను ఎంపిక చేసింది. 2025కి గాను ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నందుకు అనన్యపాండే, ఇషాన్ ఖట్టర్ ప్లేస్ దక్కించుకున్నారు.. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి ఎంపిక చేయబడిన కొద్దిమందిలో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. దీంతో ఇద్దరిపై అభినందనలు వెల్లువెత్తాయి.2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో అరంగేట్రం చేసిన అనన్య పాండే, విభిన్నమైన సినిమా పాత్రలు, నటనతోపాటు, తనదైన ష్యాషన్స్టైల్తో తన ప్రత్యేకతను చాటుకుంది. అనేకమది యువ అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆధారంగా తెరకెక్కిన ‘కేసరి చాప్టర్ 2’ లోని నటనకు ప్రశంసలు దక్కిచంఉకుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ఛానల్కు తొలి భారతీయ రాయబారిగా మారింది. స్టైల్ ఐకాన్గా ఆమె హోదాను మరింత సుస్థిరం చేసుకుంది. యువతలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ఆమె ప్రచారమైన సో పాజిటివ్ను కూడా ప్రచారం చేస్తోంది. మరోవైపు, బియాండ్ ది క్లౌడ్స్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ధడక్తో ప్రధాన స్రవంతి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ ఖట్టర్కి 2025లో ఒక కీలకమైన ఏడాదిగా మారింది. గ్లోబల్ సినిమాలు ప్రాజెక్టులతో పాటు, హోమ్బౌండ్ చిత్రంతో కాన్స్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇషాన్ ఇటీవలి మూవీలలో నెట్ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ది రాయల్స్’, అంతర్జాతీయ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది పర్ఫెక్ట్ కపుల్’ ఉన్నాయి, View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)అనన్య పాండే వాకర్ బ్లాంకోల డేటింగ్ సందడిఅనన్య , వాకర్ మధ్య డేటింగ్ సందడి గత ఏడాదిలో(2024)నే ప్రారంభమైంది. ముఖ్యంగాఅనంత్ అంబానీ ,రాధిక మర్చంట్ వివాహంలో ఇద్దరూ కలిసి కనిపించినప్పుడు,వాకర్ను తన భాగస్వామిగా పరిచయం చేసిందని బాంబే టైమ్స్ నివేదిక వెల్లడించింది. అలాగే అనన్య 26వ పుట్టినరోజు (అక్టోబర్ 30, 2024న వాకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అనన్యకు పుట్టిన రోజు విషెస్ తెలుపుతూ నువ్వు చాలా స్పెషల్.. ఐ లవ్ యూ అన్నీ.. అంటూ ఒక సందేశాన్ని, బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేయడంతో ఈ పుకార్ల జోరు మరింత పెరిగింది. 2018లో మనీష్ మల్హోత్రా కార్యక్రమంలో ఆదిత్య కపూర్ కలిసిన అనన్య అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల డేటింగ్ తరువాత వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినట్టు తెలుస్తోంది.వివిధ పరిశ్రమలలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది ప్రభావవంతమైన యువతీయువకుల జాబాతాను ప్రకటిస్తుంది. ఫోర్బ్స్. 2011 నుండి 30 అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. -
విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపిన సింగర్.. ఎందుకంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్ రాహుల్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్ కూడా వెల్లడించాడు.తాజాగా అన్బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?
తెలుగు సినిమా 'బేబి'.. రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కానీ యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేశ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేశ్ అనుకున్నాడు. కానీ రీసెంట్ గా బాబిల్.. బాలీవుడ్ ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్.. ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు. సాయి రాజేశ్, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు.బాబిల్ పోస్ట్ పై స్పందించిన సాయి రాజేశ్.. 'నేను కలిసిన టాలెంటెడ్, కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నాను. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం' అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు. ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు. అంటే 'బేబి' హిందీ రీమేక్ కి బ్రేకులు పడ్డట్లే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Babil (@babil.i.k) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్
వేల మంది కష్టపడితేనే ఓ సినిమా తీయడం సాధ్యమవుతుంది. అదే మూవీ హిట్ అయితే గనక హీరో హీరోయిన్ లేదా దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ వస్తుంది. కానీ ఇదే మూవీ కోసం పనిచేసిన చాలామందికి పెద్దగా గుర్తింపే దక్కదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అంటున్నాడు.బాస్కో మార్టిస్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇతడు తెర వెనక మాత్రమే ఉంటాడు. తెలుగు, హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న చాలా పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. కానీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది రిలీజైన 'దేవర'లో చుట్టమల్లే పాటని కొరియోగ్రఫీ చేసింది కూడా ఇతడే.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుట్టమల్లే పాటకు తనకు గుర్తింపు దక్కకపోవడంపై తన బాధని బయటపెట్టాడు. 'దేవర ప్రమోషన్స్ లో జాన్వీ నా గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ పర్వాలేదులే. మన పని మనం చేసుకుంటే చాలు' అని బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చాడు.బాస్కో మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే జాన్వీ తన పేరు చెప్పకపోవడంపై బాధ పడుతున్నట్లు అనిపించింది. అలానే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం గురించి మరీ నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టినట్లు అనిపించింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన చిన్న చిన్న టెక్నీషియన్స్ కి కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాస్కో చాలా బెటర్!(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు) -
చికెన్ లెగ్స్.. అగ్గిపుల్ల అని బాడీ షేమింగ్ చేశారు : హీరోయిన్
సినిమా తారలు కూడా మనషులే. వాళ్లకి మనసు ఉంటుంది. వాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తే ఆ మనసు బాధపడుతుంది. కానీ కొంతమంది మాత్రం ఇవేవి పట్టించుకోకుండా.. హీరోయిన్లపై ఇష్ట వచ్చినట్లుగా కామెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ల శరీర సౌష్ఠవంపై రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇవన్ని తట్టుకొని నిలబడితేనే మనం మన కెరీర్లో విజయం సాధిస్తాం అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday). 2019లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా వెండితెర ఏంట్రీ ఇచ్చిన ఈ భామ..తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్ఎల్ చిత్రాలలో స్టార్ హీరోయిన్గా మారింది. అయితే తన కెరీర్ తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లలానే తాను కూడా బాడీ షేమింగ్కు గురయ్యాయని చెబుతోంది అనన్య.తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా శరీరంపై కామెంట్స్ చేశారు. కోడీ కాళ్లు.. అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా బాడీపై విమర్శలు చేసేవారు. నీ శరీరం సరైన ఆకారంలో లేదనే కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే.. ‘ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. మనం(మహిళలు) ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధిస్తాం’అని అనన్య చెప్పుకొచ్చింది. -
సోదరి కోసం ప్రీమియం ఇల్లు కొన్న తాప్సీ.. ధర ఎన్ని కోట్లంటే..
బాలీవుడ నటి తాప్సీ పన్ను ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసింది. తన సోదరి సోదరి షగున్తో కలిసి తాజాగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారని స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్ ద్వారా సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమెకు ముంబైలో ఒక ఇల్లు ఉంది. అది ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. తన సోదరి వెడ్డింగ్ ప్లానర్ కావడంతో ఆ ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.తాప్సీ పన్ను, ఆమె సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలోని గోరేగావ్ వెస్ట్లో రూ.4.33 కోట్లతో ప్రీమియం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ణు కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్లో ఈ సమాచారం ఉంది. అందుకు సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా పోర్టల్లో ఉన్నాయి. రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కావడంతో వారు త్వరలోనే కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అదనంగా రూ.30,000 ఛార్జీలను చెల్లించారు. ముంబైలోని ఇంపీరియల్ హైట్స్ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చదరపు అడుగుకు రూ.32,170గా ఉంది. ఇది ఈ ప్రాంతంలో అత్యంత డిమాండ్ ఉన్న లగ్జరీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.కొత్త ఇల్లు తన సోదరి షగున్ కోసం తాప్సీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన తాప్సీ తన భర్త మథియాస్ బోతో పాత ఇంట్లోనే ఉంటుంది. అతను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. కొన్నేళ్లుగా వారిద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత తన సోదరికి ఒక సొంత ఇల్లు ఉండాలని తాప్సీ కొన్నట్లు సమాచారం. -
స్టార్ హీరోతో వాన పాట చేశాక, గదిలోకెళ్లి భోరుమన్న నటి...
ఇప్పుడంటే పెద్ద విషయం కాదు కానీ.. అంత ఆసక్తి కూడా లేదు కానీ ఒకప్పుడు సినిమాల్లో రెయిన్ సాంగ్స్ అంటే ఫుల్ క్రేజ్. అప్పట్లో ఓ దశాబ్ధం పాటు వానపాటలు లేకుండా మాస్ హీరోల సినిమాలు రాలేదంటే అతిశయోక్తి కాదేమో... ఎన్టీయార్ తరం నుంచి చిరంజీవి తరం దాకా కొన్నేళ్ల పాటు ఈ వానపాటల్తో ప్రేక్షకుల్ని తడిపి ముద్దచేసేశారు. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు అటు బాలీవుడ్లోనూ వీటి సందడి ఎక్కువే కనపడేది.ఇప్పుడు లిప్లాక్, మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడం గురించి ఎలాగైతే హీరోయిన్లు కొందరు తమ ఇబ్బందులు బయటపెడుతున్నారో...అప్పుడు వానపాటల గురించి అలాగే చెప్పుకునేవారు. తడిసి ముద్దయిన చీరలో హీరోయిన్ హీరోతో డ్యాన్సు చేస్తుంటే ప్రేక్షకులు కళ్లప్పగించేసేవారు కానీ అలా తెరకు ఒళ్లప్పగించేసినందుకు అందరూ కాకపోయినా కొందరు హీరోయిన్లు మాత్రం తెగ బాధపడేవారు. అప్పట్లో బాలీవుడ్ సినిమా వానపాటల్లో సూపర్ హిట్ సాంగ్లో నటించిన ఓ హీరోయిన్ అదే విధంగా విపరీతంగా బాధపడింది. ఇటీవలే వెలుగులోకి వచ్చిందీ విషయం.కళ్లు తిప్పుకోనివ్వనంత అందం ఉన్నా, గ్లామర్తో కాకుండా బాలీవుడ్లో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది తారల్లో ఒకరు స్మితా పాటిల్(Smita Patil), గ్లామర్కు కాకుండా, గంభీరతకు గుర్తుపెట్టుకునే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె తిరుగులేని స్థానం సంపాదించారు. స్వతంత్ర భావజాలంతో ఉండే స్మితాపాటిల్ కు సామాజిక విలువలపై ఉన్న నమ్మకం ఆమె నటనలో పాత్రల ఎంపికలో స్పష్టంగా కనిపించేది.సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి, నిజాయితీతో నిండిన పాత్రలు పోషించిన స్మితా పాటిల్కు, మొదటి నుంచీ వాణిజ్య చిత్రాల మీద ఆసక్తి పెద్దగా లేదు. అందుకేనేమో ఆమె మొదటి మాస్టర్హిట్ కమర్షియల్ సినిమా ‘‘నమక్ హలాల్’’(Namak Halaal) విజయం గురించి ఆమె ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. మరీ ముఖ్యంగా ఆ సినిమా అద్భుత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ‘ఆజ్ రఫత్ జాయేతో...‘ పాట ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. కుండపోత వర్షంలో తెల్ల చీరలో తడిసి ముద్దవుతూ అందాలన్నీ బహిర్గత పరుస్తూ.. నాటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan)తో చేసిన ఆ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిందేమో కానీ..స్మితా పాటిల్ను మాత్రం ఉస్సురుమనిపించింది. తను ఎప్పుడూ ఊహించని రీతిలో కనిపించాల్సి రావడం ఆమె మనస్సుకు తీవ్రమైన బాధ కలిగించింది. ఆ రోజు వాన పాట షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయిందని, భోరుమంటూ ఏడ్చిందని సాక్షాత్తూ ఆ పాటలో ఆమె సహనటుడు, బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే వెల్లడించారు. మరి అలాంటి పాటకు ఆమె ఎందుకు అంగీకరించింది? ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.ఇది అంతా జరిగినదానికి మూలం సిల్సిలా అనే సినిమా. ఆ సినిమాలో మొదట స్మితా పాటిల్ పర్వీన్ బాబీ ఉండాల్సింది. కానీ వారికి బదులుగా చివరికి జయ బచ్చన్ రేఖ ఎంపికయ్యారు. ఈ విషయం దర్శకుడు యశ్ చోప్రా నుంచి కాకుండా, శశికపూర్ ద్వారా తెలియడం స్మితా పాటిల్ మనోభావాలను తీవ్రంగా గాయపరచిందని సమాచారం. ఆ గాయం పచ్చిగా ఉండగానే నమక్ హలాల్ సినిమాలో అవకాశం వచ్చిందట. ఆవేదనలోనో, ఒక నిర్వేదంలోనో నమక్ హలాల్కి ఓకే చెప్పేసిందట. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించినా, తనకు మరిన్ని సినిమా అవకాశాలు అందించానా... సినిమా రంగంలో తన విలువలకు భిన్నంగా చేశాననే భావన ఆమెను వెంటాడింది.విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందినా.. తనను ఆ పాటలో హీరోయిన్గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం ఆమెకు ఎప్పటికీ ముళ్లులా గుచ్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత స్మితా పాటిల్ ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. అయితే చాలా చిన్న వయసులోనే ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడంతో బాలీవుడ్ ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ గొప్ప నటిని కోల్పోయింది. సదరు నమక్ హలాల్ సినిమాను భలేరాముడు పేరుతో మోహన్బాబు హీరోగా తెలుగులోనూ తీశారు. ఆ సినిమాలోనూ వానపాట ఉంది అంతే స్థాయిలో ఇంకా చెప్పాలంటే మరింత ఘాటుగా తెలుగు పాటను చిత్రీకరించారు. ఆ వానపాటలో ఒకనాటి హీరోయిన్ మాధవి మోహన్బాబుకు జోడీగా నర్తించింది. -
'కేసరి చాప్టర్ 2' తెలుగు ట్రైలర్
‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2) తెలుగు ట్రైలర్ వచ్చేసింది. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ మే 23న తెలుగులో విడుదల కానుంది. ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. -
'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో రాజమౌళి టీమ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్ టీమ్ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్ కోసం ఆమిర్ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్కుమార్ హీరాణీ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ హిందూకుష్ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ బాగా సెట్ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎన్టీఆర్ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్లో ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. -
బిగ్ బాస్ విన్నర్ లివర్లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్ను లివర్లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్కు దూరంగా కెరీర్ పీక్లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
హాయ్.. తారక్, మే 20న నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంది: హృతిక్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయని తెలిసింది.హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్ను ట్యాగ్ చేస్తూ సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్ఖాన్, సల్మాన్ఖాన్, హృతిక్ రోషన్లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్లపై అదిరిపోయే సాంగ్ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2— Hrithik Roshan (@iHrithik) May 16, 2025 -
బాలీవుడ్లో ప్రభాస్ని కొట్టేదెవరు?
ఇప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు. (చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపధ్యంలోనే ప్రభాస్ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్స్టార్ ఎవరు కానున్నారో.. -
పాకిస్తాన్కు స్పాటిఫై ఝలక్.. ఆ పాటలన్నీ డిలీట్
ప్రముఖ మ్యూజిక్ ఫ్లాట్ఫామ్ సంస్థ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి చెందిన పాటలను తొలగించింది. భారత ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ మాధ్యమాల్లో పాకిస్తాన్కు సంబంధించిన వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర కంటెంట్ సైతం తొలగించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పాటిఫై సైతం పాక్ పాటలను తన ఫ్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేసింది.దీంతో పాకిస్తాన్కు చెందిన ఫేమస్ 'జోల్', 'మాండ్' అనే పాటలను స్పాటిఫై నుంచి తొలగించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాపై నిషేధం విధించారు. ఆయన హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను కూడా భారత్లో బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఆయనతో పాటు పలువురు పాక్ నటీనటులను నిషేధించారు. అంతకుముందు పాకిస్తానీ నటులు మావ్రా హోకేన్, మహిరా ఖాన్ సినిమాలైన 'సనమ్ తేరి కసమ్', 'రయీస్' చిత్రాల పోస్టర్లను సైతం తొలగించారు. కాగా.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత కోసమే కేంద్రం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. -
దేశభక్తిని రగిలించే సినిమా.. తెలుగులో విడుదల
జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2). ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 23న టాలీవుడ్లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్లైన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. అక్షయ్ కుమార్ నటించిన దేశభక్తి చిత్రాల్లో ‘కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా ‘కేసరి: ఛాప్టర్ 2’ను మేకర్స్ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్ రచించిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ ఆధారంగా కరణ్ సింగ్ దీన్ని తెరకెక్కించారు. కేసరి చాప్టర్2 సినిమాకు కూడా బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన ఈ చిత్రం మే 23న తెలుగులో కూడా విడుదల కానుంది. గంతంలో ఛావా సినిమా కూడా మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.దేశభక్తిని రగిలించే కోర్టు రూం డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను బ్రిటీష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్ కుమార్ గతంలో కోరారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఈ సినిమా చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని ఆయన అన్నారు. -
'ఇలియానాను ఎందుకు తీసుకోలేదంటే'.. రైడ్-2 డైరెక్టర్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్గా నటించింది. 2018లో వచ్చిన రైడ్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే పార్ట్-1లో హీరోయిన్గా ఇలియానా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైడ్-2లో ఇలియానాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా స్పందించారు. ఇలియానాను కాదని.. వాణి కపూర్ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఆమె జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఓ బిడ్డతో పాటు మంచి కుటుంబం కలిగి ఉంది.. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే హీరోయిన్ను మార్చాల్సి వచ్చిందని రాజ్ కుమార్ గుప్తా వెల్లడించారు.కానీ ఇలియానాతో రైడ్ మూవీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాకు. ఆమె ఎల్లప్పుడూ రైడ్ ప్రపంచంలో భాగమేనని రాజ్ కుమార్ గుప్తా అన్నారు. రైడ్- 2లో వాణి కపూర్ నటించడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని దర్శకుడు పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నటీనటుల మార్పులు తప్పనిసరని ఆయన వివరించారు. అంతకుముందు రైడ్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలియానా స్థానంలో నటించే అంశాన్ని ప్రస్తావించగా.. మా మధ్య ఎటువంటి పోటీ లేదని వాణి కపూర్ స్పష్టం చేశారు. -
బాలీవుడ్ బ్యూటీ ఆశలపై నీళ్లు.. కేన్స్ ఫెస్టివల్ ఛాన్స్ మిస్!
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు ఉర్ఫీ జావెద్. వింత వింత దస్తులు ధరించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతలా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మన జీవితంలో ఇలాంటి వాటికి కుంగి పోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే షేర్ చేయండి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే వీసాకు కూడా దరఖాస్తు చేసింది. కానీ ఊహించని విధంగా ఉర్ఫీ జావెద్ వీసాను అధికారులు తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకున్న బ్యూటీ తాను, తన టీమ్ చాలా నిరాశకు గురయ్యామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. నా లైఫ్తో వ్యాపారంలోనూ ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఉర్ఫీ తెలిపింది. ఇలాంటి వాటితో బాధపడకుండా మరింత స్ట్రాంగ్గా ముందడుగు వేయాలని చెబుతోంది. మీలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే షేర్ చేసుకుని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అంటోంది.(ఇది చదవండి: కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్పై ట్రోలింగ్!)ఉర్ఫీ తన పోస్ట్లో రాస్తూ..'నాకు కేన్స్కు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ విధిరాతతో నా వీసా తిరస్కరణకు గురైంది. కొన్ని డిఫరెంట్ దుస్తులను ప్రదర్శించాలని ఆలోచించాం. వీసా రిజెక్ట్ కావడంతో నేను, నా బృందం చాలా నిరుత్సాహపడ్డాము. మీలో చాలా మంది తిరస్కరణలను స్వయంగా ఎదుర్కొని ఉంటారు. అలాంటి వారి స్టోరీలను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. తిరస్కరణల తర్వాత దాని గురించి నిరాశ చెందడం, ఏడవడం సాధారణం. నిజానికి మనకు ఆరోగ్యకరమైంది కూడా. నేను కూడా ఏడుస్తాను.. కానీ తర్వాత ఏం జరుగుతుంది? మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి తిరస్కరణ మనకు ఒక అవకాశం. జీవితంలో చాలా రిజెక్షన్స్ తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు. మీరు కూడా అలాగే ఉండండి' అంటూ మోటివేషనల్ పోస్ట్ చేసింది. కాగా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 24 వరకు జరగనుంది. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్పై ట్రోలింగ్!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి క్రమం తప్పకుండా హాజరయ్యే హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) ఒకరు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes 2025) ప్రారంభమైన తొలి రోజే సందడి చేసింది ఈ అందాల తార. మల్టీ కలర్ పొడవాటి గౌనుతో పాటు జుడిత్ లీబర్ డిజైన్ చేసిన చిలుక ఆకారంలోని క్రిస్టల్ ఎంబెడెడ్ క్లచ్ బ్యాగ్ను ధరించి..రెడ్ కార్పెట్పై హొలలొలికించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఊర్వశీ లుక్పై విమర్శలు చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ లుక్ని కాపీ కొట్టిందంటూ ఆమె లుక్ని ట్రోల్ చేస్తున్నారు. 2018లో ఐశ్వర్యరాయ్ కూడా ఇలాంటి డ్రెస్నే ధరించి కేన్స్ ఫెస్టివల్కు హాజరైయిందని, అంత కరిష్మా లేకున్నా ఊర్శశీ కూడా ఆమెను అనుకరించిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె ధరించిన డ్రెస్ అతిగా, విచిత్రంగా ఉందని, మేకప్ ఎక్కువైందని ట్రోల్ చేస్తున్నారు.కేన్స్ ఫెస్టివల్ కోసం నిర్వాహకులు ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ రూల్స్లో అతిగా బహిర్గతమయ్యే దుస్తులను ధరించరాదని చెప్పినప్పటికీ, ఊర్వశీ లుక్ ఈ సరిహద్దులను పరీక్షించినట్లు కనిపించింది. ఆమె ధరించిన డ్రెస్ కంటే.. చేతిలో ఉన్న చిలుక బ్యాగ్ అందరిని ఆకట్టుకుంది. దీని ధర సుమారు రూ.4 లక్షలు ఉంటుందట. గతంలో కూడా ఊర్వశీ ఇలా ఖరీదైన వస్తువులను, అభరణాలను ఫిల్మ్ పెస్టివల్లో ప్రదర్శించింది. 2023లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్కి రూ. 276 కోట్ల విలువ చేసే మొసలి నెక్లెస్ని ధరించింది. అప్పట్లో ఈ నెక్లెస్పై కూడా విమర్శలు వచ్చాయి. -
వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు: వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యానిమల్ మూవీ దర్శకుడిపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారని.. రణ్బీర్ కపూర్ను విమర్శించే ధైర్యం బాలీవుడ్లో ఏ డైరెక్టర్కు లేదని అన్నారు.వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..'యానిమల్ విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారు. ఎందుకంటే రణ్బీర్ కపూర్ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో అతను చాలా పవర్ఫుల్. అందుకే అతన్ని విమర్శించడానికి ఎవరూ లేరు. వారికి అంత ధైర్యం ఉంటే ప్రయత్నించి చూడమనండి.బాలీవుడ్లో చాలా మంది దర్శకులు హీరోల గురించి కేవలం వారి వెనుక మాత్రమే మాట్లాడుతారు. వారికి బహిరంగంగా ఏదైనా చెప్పే ధైర్యం కూడా వారు చేయరు. కాబట్టి వారు ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఎంత నీచంగా నటించినా రూ.150 కోట్లు ఇస్తారు. 51 ఏళ్ల నటులు తమంతట తాము నిజమైన స్టార్లు అయితే ఎంత సంపాదించినా తనకు అభ్యంతరం లేదు.నా సమస్య ఏమిటంటే స్టార్డమ్ లేకున్నా స్టార్లలా ప్రవర్తించే వ్యక్తులతోనే. అలా చలామణి అయ్యే వారంటే నాకు నచ్చదు' అని అన్నారు.కాగా.. అంతకుముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్పై విమర్శలపై స్పందించారు. అందరు విమర్శకులు తననే టార్గెట్ చేశారని అన్నారు. మరోవైపు రణ్బీర్ కపూర్ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. ఎందుకంటే వారంతా రణ్బీర్తో కలిసి పనిచేయాలనుకుంటున్నారని నాకు అర్థమైందని సందీప్ వంగా వెల్లడించారు. నేను బాలీవుడ్ కొత్త కావడం నాపై విమర్శలు చేయడం వారికి సులభమని అన్నారు. -
మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్ అవుతారో అస్సలు చెప్పలేం. ఊరగాయలు అమ్మినా ఫేమస్ అవ్వొచ్చు. పూసలు అమ్మినా సరే ఫేమస్ అయిపోవచ్చు. అలానే కొన్నాళ్లక్రితం జరిగిన కుంభమేళాలో పూసలమ్ముతూ వైరల్ అయిపోయిన మోనాలిసా ఇప్పుడు మరో అవకాశం అందుకుంది.(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్) మోనాలిసాకు ఇదివరకే ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలీదు గానీ ఇప్పుడు మరో ఛాన్స్ పట్టేసింది. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.సినిమా ఛాన్సుల మాటేమో గానీ కుంభమేళాలో పూసలమ్మే టైంకి.. ఇప్పటికీ చాలా మారిపోయింది. మోనాలిసా ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. త్వరలో ఈమె నటించిన సాంగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈమె సంగతేంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_) -
జా.ఎన్టీయార్, హృతిక్ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్ను చేజిక్కించుకున్నారు. విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని మిస్టర్ ఫెర్ఫక్షనిస్ట్ అంటారు. కానీ 'దంగల్' వరకు ఓకే కానీ ఆ తర్వాత ఇతడికి దురదృష్టం మొదలైంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దాదాపు మూడేళ్ల పాటు సినిమాలే చేయని ఆమిర్.. కొత్త మూవీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'సితారే జమీన్ పర్' టైటిల్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇది 2023లో రిలీజైన 'ఛాంపియన్స్' అనే మూవీకి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. కొన్ని సీన్లయితే మక్కీకి మక్కీ దింపేశారు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు. మరోవైపు ఎప్పటిలానే ఆమిర్ సినిమాపై ట్రోలింగ్ షురూ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. షార్ట్ టెంపర్ ఉండే ఓ కోచ్ అనుకోని కారణాల వల్ల కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో సదరు జడ్జి ఊహించని తీర్పు ఇస్తారు. మతిస్థిమితం లేని కొందరిని టీమ్ గా చేసి బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. తర్వాత సదరు కోచ్ ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.మంగళవారం రాత్రి ట్రైలర్ రిలీజ్.. అప్పుడే ఆమిర్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలైంది. టర్కీ ఫస్ట్ లేడీని గతంలో ఇతడి కలిశాడని, అందుకే సినిమాని బహిష్కరించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన సుడిగాలి సుధీర్ తమ్ముడు) #SitareZameenPartrailer देखो मिस्टर परफेक्ट ने कैसे पर्फेक्ट्ली फ्रेम टू फ्रेम कॉपी मारी है 😃😃😃🕋🕋🕋I can’t imagine how much they have made a fool of Bollywood lovers in the Past #AmirKhan #Champions pic.twitter.com/ZeKtJoLQve— Ex Shia Muslim News (@ExShiaMuslim) May 13, 2025 -
ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...
కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇండియన్ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగమైనపోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్’’ అంటూపోస్ట్ చేశారు ఆలియా భట్. -
'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం
హాలీవుడ్ క్లాసిక్ సిరీస్కు చెందిన 'కరాటే కిడ్: లెజెండ్స్' ఇప్పుడు సరికొత్తగా భారతీయ ప్రేక్షకులని పలకరించబోతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, కొడుకు యుగ్ కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం పనిచేశారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) జాకీ చాన్ మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగన్ గొంతు అందించగా, బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు. తొలిసారి ఇంటర్నేషనల్ సినిమాకు వాయిస్ ఇవ్వడం అజయ్ దేవగన్కి ఇదే తొలిసారి.సినిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదు
2025 లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (2025 Cannes Film Festival)లో అరంగేట్రం చేసేందుకు అలనాటి అందాల సుందరి సిద్ధమవుతోంది. ఆమె మరెవ్వరో కాదు ప్రఖ్యాత నటి, దర్శకురాలు, నిర్మాత, టాక్ షో హోస్ట్ సిమీ గరేవాల్ (Simi Garewal). అద్భుతమైన నటనతో బాలీవుడ్లో పాపులర్ నటిగా కొనసాగింది. దో బదన్, రాజ్ కపూర్తో మేరా నామ్ జోకర్, అరణ్యర్ దిన్ రాత్రి, పదాతిక్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యానికి ప్రశంసలందుకుంది. అంతేకాదు రెండెజౌస్ విత్ సిమి గరేవాల్, సిమి సెలెక్ట్స్ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్, ఇట్స్ ఎ ఉమెన్స్ వరల్డ్ వంటి కార్యక్రమాలకు హోస్ట్గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.తాజాగా ఈ అందాల సుందరి సిమీ గరేవాల్ తనకెంతో ఇష్టమైనతెల్లని దుస్తుల్లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్స్టాలో సిమీ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సిమీ సందడినిచూసేందుకు ఎదురు చూస్తున్నారు.‘‘56 సంవత్సరాల తరువాత ఈ సినిమా నన్ను కేన్స్లో రెడ్ కార్పెట్పైకి తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను చాలా ధన్యురాల్ని’’ అంటూ ఇన్స్టా పోస్ట్లో సంతోషం వెలిబుచ్చారు.ఇక్కడ సిమి నటించిన, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే 'అరణ్యర్ దిన్ రాత్రి' అప్డేటెడ్ వెర్షన్ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె రెడ్ కార్పెట్ పై నడవనుంది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో, సిమీ గరేవాల్ రెడ్ కార్పెట్పై తాను ధరించబోయే దుస్తుల వీడియోను పోస్ట్ చేసింది. కార్లియో ఫ్యాషన్ బ్రాండ్ నుండి దుస్తులను పరిశీలిస్తున్న క్లిప్ను షేర్ చేసింది. నటి తెల్లటి టోన్డ్ షర్ట్ , ప్యాంటులో చాలా అందంగా, సింపుల్ మృదువైన మేకప్, కళ్ళజోడు, ఓపెన్ హెయిర్ ఆమె లుక్కు మరింత సొబగులద్దాయి. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ డ్రెస్లో అద్భుతంగా కనిపిస్తారని తెలుసు.", "ఆ అందమైన తెల్లని గౌనుకు మరెవరూ న్యాయం చేయలేరు." "మీరు గ్రేస్ బ్యూటీ & డిగ్నిటీకి నిదర్వనం. అంటూ ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు అందించారు.చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ1970 నాటి బాలీవుడ్ 'అరణ్యర్ దిన్ రాత్రి’ చిత్రాన్ని వెస్ ఆండర్సన్ , మార్టిన్ స్కోర్సెస్ అప్డేట్ వెర్షన్గా తీసుకొచ్చారు. ఈ 4K వెర్షన్ను కేన్స్ 2025 ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నట్లు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సునీల్ గంగోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా సత్యజిత్ రే 1970లో నిర్మించిన అడ్వెంచర్ డ్రామా చిత్రం. ఈ చిత్రం 20వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ బేర్కు నామినేట్ అయింది.ఈ చిత్రంలో సిమీగరేవాల్, సౌమిత్ర ఛటర్జీ, షర్మిలా ఠాగూర్ , రబీ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో -
కంఫర్ట్గానే అనిపించింది.. అందుకే ఆ సీన్స్లో నటించా: హీరోయిన్
ఈ మధ్య సినిమాల్లో రొమాన్స్ ఎక్కువైపోయింది. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్లలో అయితే మోతాదుకు మించిన రొమాన్స్ చూపిస్తున్నారు. హీరోయిన్లు కూడా అలాంటి సన్నివేశాలకు నో చెప్పడం లేదు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు అయినా చేయడానికి రెడీ అంటూ ఓపెన్గానే చెప్పేస్తున్నారు. అంతేకాదు అలాంటి సన్నివేశాలు వివాదస్పదంగా మారితే..వాటిని సమర్థిస్తూ చిత్రబృందానికి సపోర్ట్గా నిలుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) కూడా అదే పని చేశారు. ఆమె నటించిన ‘ది రాయల్స్’(The Royals ) వెబ్ సిరీస్ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో హీరో ఇషాన్(Ishaan Khatter), భూమిల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇషాన్ వయసులో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైనా.. ఇంటిమేట్ సీన్స్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ భూమి పెడ్నేకర్ని విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్ చేశారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పులను పోస్ట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు.తాజాగా ఈ సన్నివేశాలపై భూమి ఫెడ్నేకర్ స్పందించింది. ‘వయసులో చిన్నవాడు అయితే ఏంటి? తనతో కంఫర్ట్గా అనిపించింది కాబట్టే..ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశాను’ అని చెప్పుకొచ్చింది. ‘ఇంటిమేట్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సన్నివేశాల్లో ఇమిడిపోయి నటించాలి. ఇద్దరికి కంఫర్ట్గా లేకపోతే ఆ సీన్ ఫేక్గా ఉంటుంది. అందుకే షూటింగ్కి ముందే మేం వర్క్షాప్ చేశాం. ఒకరి గురించి ఒకరం తెసుకున్నాం. ఇద్దరం బాగా క్లోజ్ అయిన తర్వాతే ఆ సీన్స్లో నటించాం. నాకు కంఫర్ట్గా అనిపించింది కాబట్టే అతనితో ఆన్స్క్రీన్ రొమాన్స్ చేశా’ అని భూమి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ది రాయల్స్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్సిరీస్. ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. మోర్పూర్ రాయల్ కుటుంబం చుట్టే తిరిగే కథ ఇది. మే 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
'మీ త్యాగం మరువలేనిది'.. ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.ఆలియా భట్ తన నోట్లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
కేంద్రం అంటే బాలీవుడ్కు భయం.. అందుకే నోరెత్తరు: రచయిత
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు. తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. -
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు.. మోస్ట్ అవైటేడ్ ఇవే!
ఓటీటీలు వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్లకు కొదవే లేదు. థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇకపోతే వెబ్ సిరీస్లు సైతం ఓటీటీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్టరీ, క్రైమ్ సిరీస్లతో పాటు కామెడీ వెబ్ సిరీస్లు సైతం వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది మెప్పించిన సిరీస్లు.. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న వాటిపై మనం ఓ లుక్కేద్దాం పదండి.రానా నాయుడు సీజన్-2..విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. రానా నాయుడు సీజన్-2 త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది.పంచాయత్ సీజన్-4..పంచాయత్ వెబ్ సిరీస్కు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్కు వస్తోంది. జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3బాలీవుడ్లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ భాజ్పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మూడో సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది. ఈ సంవత్సరం నవంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.అసుర్ సీజన్-3..మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ మూడవ సీజన్ కూడా వస్తోంది. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ప్రసారం కానుంది.మిర్జాపూర్ సీజన్- 4..మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్స్ హిట్కాగా.. మీర్జాపూర్ సీజన్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు.ఫర్జీ సీజన్-2..విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ. సీజన్ -1 హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది. -
సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. తన భర్తపై పూర్తిగా నమ్మకముందన్న భార్య!
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై గత కొన్ని నెలలుగా విడాకులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ కూడా తమను విడదీయలేరని పేర్కొంది. గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.తాజాగా మరోసారి తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్తపై అపారమైన నమ్మకం ఉందని తెలిపింది. ఎలాంటి తెలివితక్కువ మహిళ మమ్మల్ని వేరు చేయలేదని స్పష్టం చేసింది. గోవింద నేను లేకుండా జీవిస్తాడని అనుకోవడం లేదు.. తన కుటుంబాన్ని ఎలాంటి తెలివితక్కువ మహిళ కోసం వదిలి వెళ్లడని సునీతా వెల్లడించింది.ఇప్పటికైనా రూమర్స్ను వ్యాప్తి చేయవద్దని ఆమె మీడియాను కోరింది. గోవిందతో తన వివాహం గురించి చర్చించడానికి ఏదైనా ఉంటే నేరుగా తన వద్దకు వచ్చి అడగాలని అహుజా అన్నారు. ఇలాంటి వాటిని ఎప్పటికీ అంగీకరించనని,.. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను నేరుగా అడగాలని తెలిపింది. ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే, మీడియాతో మొదట మాట్లాడే వ్యక్తిని నేనే.. ఆ దేవుడు నా కుటుంబాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయడని నమ్మకముందని పేర్కొంది. కాగా.. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. -
ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో
తెలుగు సినిమాలతో నటుడిగా మారిన హర్షవర్దన్ రాణే.. ఇక్కడ సరైన పాత్రలు, గుర్తింపు రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. అక్కడ హీరోగా పలు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అందులో ఒకటి 'సనమ్ తేరీ కసమ్'. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది. దీంతో చిత్రనిర్మాతలు సీక్వెల్ ని ప్రకటించారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) నిన్నటివరకు భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ లోని పలు ఉగ్రస్థావరాల్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో పలువురు పాక్ నటీనటులు.. ఆపరేషన్ సిందూర్ పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. వాళ్లలో నటి మావ్రా హోకెన్ ఒకరు. ఈమెనే గతంలో 'సనమ్ తేరీ కసమ్'లో హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈమె.. 'ఆపరేషన్ సిందూర్'పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హర్షవర్ధన్, సీక్వెల్ లో ఈమెతో నటించేది లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.'ప్రస్తుత పరిస్థితులని నేను గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. గతంలో నటించిన వాళ్లే ఇప్పుడు 'సనమ్ తేరీ కసమ్ 2'లోనూ నటిస్తానంటే.. నేను అందులో నటించాలని అనుకోవట్లేదు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు.అలానే మావ్రా హోకెన్ పోస్ట్ ని కూడా షేర్ చేసిన హర్షవర్ధన్.. ఏ దేశానికి చెందిన నటీనటుల్ని అయినా నేను గౌరవిస్తాను. కానీ నా దేశం గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని స్పందించాడు. ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం) -
రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?) దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు: జాన్వీ కపూర్
‘‘ఇన్ని రోజులు మనం యుద్ధం రాకూడదనే కోరుకున్నాం. కానీ, ఉగ్రవాదులు మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఇన్ని రోజులు మన మీద జరిగిన దాడుల తర్వాత ఆ బాధను తీర్చుకోవడానికే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వారి దుశ్చర్యలను తిప్పి కొడుతున్నాం. మనది దూకుడు కాదు... దశాబ్దాల బాధకు సమాధానం. అసలు ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ పేర్కొన్నారు.కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురుపిస్తూ, వారికి మద్దతుగా సోషల్ మీడియాలోపోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే పలుపోస్టులు పెట్టినప్పటికీ, తాజాగా తన ఇన్ స్టా్రగామ్లో సుదీర్ఘమైనపోస్ట్ పెట్టారు. ‘‘ఇండియా– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జమ్మూపై దాడుల విజువల్స్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను.పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులు నన్ను ఎంతో బాధించాయి. ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని బాధ. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. మన సైనికులు సరిహద్దు దగ్గరపోరాడుతూ మనల్ని కా పాడుతున్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షిస్తున్న సైనికులకు ఎప్పటికీ రుణపడి ఉండాలి.వాళ్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. ఇలాంటి సమయంలో దేశం మొత్తం మన భారతీయ జవానులకు మద్దతుగా నిలవాలి. ఈ యుద్ధంలో అమాయకులుప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసంప్రార్థిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పుకార్లను ఇతరులతో పంచుకోవద్దు’’ అంటూ జాన్వీ కపూర్పోస్ట్ చేశారు. ఆమెపోస్ట్పై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్వీర్ సింగ్
‘ఆపరేషన్ సిందూర్’ పై హీరో రణ్వీర్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓపోస్ట్ షేర్ చేశారు. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం(భారతీయులు) ఇబ్బంది పెట్టం. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్. ఈ ఆపరేషన్లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు. -
జాతీయ అవార్డ్ గ్రహీత విక్రమ్ కన్నుమూత
జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా జాతీయ అవార్డు అందుకున్నారు. విక్రమ్ గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన వాటిలో.. బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర హిందీ సినిమాలున్నాయి.మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని దాదర్లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విక్రమ్ మృతికి కారణం ఇంకా తెలియరాలేదు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!) -
‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ(Uttam Maheshwari) ప్రకటిస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. దీనిపై నెటిజన్స్ మండిపడ్డారు. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే..ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం అవసరమా అంటూ దర్శకుడిని ట్రోల్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చిరవకు దర్శకుడు ఉత్తమ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నాడు. (చదవండి: భారత్పై ప్రశంసలు.. హీరోయిన్కి బెదిరింపులు!)‘ఈ సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి పని చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రపంచానికి తెలియజేసేలా ఓ పవర్ఫుల్ కథగా వెండితెరపై తీసుకురావాలనుకున్నాను. దేశంపట్ల గౌరవంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాని డబ్బుకి ఆశపడి సినిమా ప్రకటన చేయలేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్’ అని ఉత్తమ్ మహేశ్వరీ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. 26 మంది భారత మహిళల నుదుటిన సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇదే పేరుతో సినిమాను నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. టైటిల్ కోసం విఫల ప్రయత్నాలు చేశాయి. చివరకు నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ తెరకెక్కిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో డైరెక్టర్ పై విధంగా స్పందించాడు. -
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రశంసలు.. హీరోయిన్కి బెదిరింపులు!
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor )ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టినందుకు హీరోయిన్ సెలీనా జైట్లీ(Celina Jaitly )కి బెదిరింపులు వచ్చాయి. భారత్ని ప్రశంసిస్తే అన్ఫాలో చేస్తామంటూ కొంతమంది నెటిజన్లు ఆమెను బెదిరించారు. అలాగే ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా సెలినా ఈ ట్రోల్స్,బెదిరింపులపై స్పందించారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని.. నచ్చని వాళ్లు తనను అన్ఫాలో చేసుకోవచ్చని చెప్పారు. ‘నా దేశం(భారత్) గురించి మాట్లాడితే అన్ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారందరిని నేను ఒకటే చెబుతున్నా.. క్షమాపణలు చేప్పే ప్రసక్తే లేదు. నా దేశం కోసం నేను నిలబడాతాను. ఉగ్రవారదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. హింసను ప్రోత్సహించే వారివైపు నేను ఉండను. భారత్పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే నన్ను అన్ఫాలో చేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. నా దేశ సైనికులు కులం, మతం అడగకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ ట్రోల్స్ని గమనిస్తున్నాను. ఇలాంటి వారిని క్షమించను. జైహింద్’అని ఇన్స్టాలో రాసుకొచ్చింది.కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సెలీనా జైట్లీ.. ఆపరేషన్ సిందూర్ని ప్రారంభించినప్పుడు మన దేశాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ..మనసంతా భారత్ గురించే ఆలోచిస్తుందని, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, త్యాగాలను మరిచిపోలేమని ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై కొంతమంది నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడంపై పైవిధంగా స్పదించింది.మిస్ యూనివర్స్ 2003 రన్నరప్గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్ను పెళ్లాడింది. వీరికి 13 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్తో పాటు ఏడేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) -
సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై (Saif Ali Khan) ఈ ఏడాది ప్రారంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను(30) అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్షీట్ను కూడా దాఖలు చేశారు. అయితే, తన అరెస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని, తనను జైలు నుంచి వడుదల చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్ నెలలో సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కూడా అతను ఉపసంహరించుకున్నాడు.ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు దరఖాస్తు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుండి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు చట్ట నిబంధనలను పాటించలేదన్నాడు. వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు కోరింది. విచారణను మే 13కి వాయిదా వేసింది.జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. -
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో సినిమా పోస్టర్ వచ్చేసింది. ఈ టైటిల్ కోసం బాలీవుడ్ బడా దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే, ఒక నిర్మాణ సంస్థ తమ బ్యానర్ పేరుతో ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని వారి స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. దీంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇదే బ్యాక్డ్రాప్తో బాలీవుడ్లో సినిమా రానుంది.‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి. అయితే, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనుందని ఒక పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళను చూపారు. ఉత్తమ్, నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు. ఇందులో నటిస్తున్న నటీనటులను వారు ప్రకటించలేదు.ఆపరేషన్ సిందూర్, మిషన్ సిందూర్, సిందూర్ : ది రివెంజ్అంటూ ఆపరేషన్ కోడ్నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు.టైటిల్ విషయంలో వెనక్కి తగ్గిన రిలయన్స్ఈ పేరుతో ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్మార్క్ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడటం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలుచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందూరు కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు. -
చూసింది ఫస్ట్ పార్టే! ఇంకా చాలా ఉంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
‘వరల్డ్ ఆడియో – విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్ (వేవ్స్)ను రెండేళ్ళకు ఓసారి చేయాలని అనుకున్నాం. కానీ, జనం నుంచి వస్తున్న స్పందన, వినోద రంగ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ను బట్టి చూస్తే, బహుశా ఇకపై ఏటా ‘వేవ్స్’ను నిర్వహించే అవకాశం ఉంది’‘ అన్నారు కేంద్ర సమాచార – ప్రసార శాఖ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్. ముంబయ్లో ఈ మే 1 నుంచి 4 దాకా జరిగిన ‘వేవ్స్ – 2025’లో భాగంగా దేశం నలుమూలల నుంచి ప్రత్యేకంగా వచ్చిన పత్రికా విలేఖరులతో ఆయన ఇష్టాగోష్ఠి జరిపారు. ‘సాక్షి’ సహా పలువురు సంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘వేవ్స్’ మొదలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సవాళ్ళు, తాను నిర్వహిస్తున్న వివిధ మంత్రిత్వ శాఖల విషయాల మీదుగా సామాజిక దృక్పథం దాకా అనేక అంశాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉత్సాహంగా పంచుకున్నారు. దాదాపు ముప్పావుగంట పైగా సాగిన ఆ భేటీ నుంచి ముఖ్యాంశాలు...ప్రధాని మోదీ ఆలోచన ఫలితంగా...ప్రపంచంలో ఆర్థిక రంగం, వ్యవసాయం... ఇలా వివిధ రంగాలకు అంటూ ఒక శిఖరాగ్ర సదస్సు ఉంది. కానీ, వివిధ రకాల మీడియా – వినోద రంగాలను అనుసంధానిస్తూ భాగస్వాములను అందరినీ ఒక వేదిక మీదకు తెచ్చే ఒక సదస్సు అంటూ ఏదీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రపంచంలోనే ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఈ ‘వరల్డ్ ఆడియో – విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్’ (‘వేవ్స్’) ఆలోచన చేశారు ప్రధాని మోదీ. ఇటీవల మీరు చూసింది ఆ ఆలోచన ఫలితమే! మీడియా, వినోదరంగంలో ప్రపంచస్థాయిలో భారత్ ముందంజలో నిలవాలన్నది ప్రధానమైన ఆశయం.‘వేవ్స్’లో భాగంగా వివిధ దేశాల విధాన రూపకర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (వైపో) డైరెక్టర్ జనరల్ లాంటివారు దీనిలో పాలు పంచుకున్నారు. మే 2వ తేదీన ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ డిక్లరేషన్ కూడా చేశాం. అక్కడ ఆస్కార్, కాన్... ఇక్కడ ‘వేవ్స్’‘వేవ్స్’ ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు మూడు. ఒకటి – దావోస్లోని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ (డబ్ల్యుఈఎఫ్) లాగా మీడియా, వినోద రంగానికి దీన్ని వేదికగా తీర్చిదిద్దడం. నిజానికి, దావోస్లో డబ్ల్యుఈఎఫ్ ఓ చిన్న హోటల్లో ఇప్పుడు మనం వేవ్స్ చేస్తున్న ఈ సెంటర్లో దాదాపు పదోవంతు ప్రదేశంలో మాత్రమే ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నేతలందరూ ఒకచోట చేరే వేదికగా దావోస్ సదస్సు ఎంతగా పాపులరైందో చూడండి. తొలిసారే ఇంత స్పందన వస్తున్న ‘వేవ్స్’ రానున్న రోజుల్లో మరింత పాపులరవడం ఖాయం. ఇక, రెండో లక్ష్యం – ఆస్కార్, కాన్ చలనచిత్రోత్సవాల పద్ధతిలో మన ‘వేవ్స్’ను సైతం ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలపడం! మూడో లక్ష్యం – ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ) అనే శిక్షణ సంస్థను స్థాపించడం! ప్రణాళికాబద్ధంగా ఈ మూడు లక్ష్యాలను వీలైనంత త్వరలోనే చేరుకుంటాం.ఇవాళ వినోద రంగం, సృజనాత్మకతను చూపించే విధానం శరవేగంగా మారిపోతున్నాయి. వాటితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ కూడా మారిపోతుంది. ఆ మార్పులకు తగ్గట్టు మనమూ మారాలి. సమాయత్తం కావాలి. అలా సమాయత్తమయ్యే ప్రయత్నంలో భాగమే... ‘ఐఐసీటీ’. ఈ రంగంలోని అవసరాలకు తగ్గట్టు శిక్షణ నిచ్చే వేదిక కావాలని పలువురు దర్శక, నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టే, మన దేశంలో ‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ’ (ఏవీజీసీ – ఎక్స్ఆర్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభా ప్రమాణాలకు జాతీయ స్థాయి కేంద్రంగా దాన్ని స్థాపిస్తాం. ఆ విభాగంలో వృత్తినిపుణులుగా తయారవ్వాలని కోరుకొనే విద్యార్థులకు ప్రపంచ శ్రేణి విద్య, శిక్షణ అందించే భారీ హబ్గా తీర్చిదిద్దుతాం. ఐఐటీ, ఐఐఎంల పంథాలో... మీడియాలో శిక్షణకు ఐఐసీటీ!మహారాష్ట్రలోని ముంబయ్లోనే ‘ఐఐసీటీ’ని నెలకొల్పనున్నాం. దీనికి దాదాపు రూ. 400 కోట్లు అవసరం. నిజానికి, అది సీడ్ మనీ మాత్రమే. ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ మన దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఐఐఎంల పంథాలో ఉంటుంది. టెక్నాలజీ విద్యలో ఐఐటీ, మేనేజ్మెంట్ విద్యలో ఐఐఎం ఎలా నిలిచాయో, అలా ఇది మీడియా, వినోదరంగ విద్యలో ఓ బెంచ్మార్క్గా నిలుస్తుంది. అలాగని ఇది కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్పించే సంస్థ కాదు. సృజనాత్మకత 80 శాతం, సాంకేతికతను అనువర్తింపజేయడం 20 శాతం... రెంటినీ కలగలిపే శిక్షణ సంస్థ ఇది. వినూత్నమైన ఈ ప్రయత్నంలో కలిసి నడిచేందుకు ఎన్ విడా, మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, స్పాటిఫై, మెటా, వాకామ్, ఎడోబ్, జియో స్టార్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ‘ఐఐసీటీ’లో కోర్సుల విద్యాప్రణాళిక రూపకల్పన, ఇంటర్న్షిప్లు, స్కాలర్షిప్లు, స్టార్టప్ నిధులు అందించడం, ఉద్యోగాలు ఇవ్వడం... వీటన్నిటిలో సహాయ సహకారాలు అందించడానికి అవి ఒప్పుకున్నాయి. దీర్ఘకాలిక ప్రగతి సాధ్యమయ్యేలా తోడు నిలుస్తాయి. ఈ భాగస్వామ్యాల వల్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సినిమా, ఎక్స్టెండెడ్ రియాలిటీలు అన్నింటిలో విద్య, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నూతన ఆవిష్కరణలకు కొత్త ఊపు వస్తుంది. ఐటీ రంగంలో భారత ఘన విజయం సాధించాం కదా. ఆ నమూనానే ఇలా సృజనాత్మక, డిజిటల్ మీడియా రంగంలోనూ అనుసరించి, భవిష్యత్ పురోగతికి తగ్గ వ్యవస్థీకృత ఏర్పాటు చేయడం మా ప్రధాన ఉద్దేశం.అన్నీ వాళ్ళే చూస్తారు! జాబ్ గ్యారెంటీ!!మూడేళ్ళ క్రితం ‘గతిశక్తి యోజన’ కింద ఏవియేషన్ రంగంలో ఒక బీటెక్ కోర్స్ లాంటిది ఎలా ఉండాలని ప్రపంచ ప్రఖ్యాత ‘ఎయిర్ బస్’ సంస్థ వాళ్ళను అడిగాం. వాళ్ళూ మొదట ఇదేదో నోటిమాట వ్యవహారం అనుకున్నారు. ‘మీ నుంచి మాకు డబ్బు అక్కర్లేదు, నాలెడ్జ్ మాత్రమే కోరుతున్నాం’ అని చెప్పాం. మా ఆలోచన, పట్టుదల గ్రహించి, వాళ్ళు ఏవియేషన్ ఇంజనీరింగ్ కోర్సును సిద్ధం చేశారు. ఇవాళ గతిశక్తి యోజన, ఎయిర్బస్ భాగస్వామ్యంతో వడోదరలోని ‘గతిశక్తి విశ్వవిద్యాలయ’లో 6 సెమిస్టర్లలో విద్యార్థుల చదువు, బస, స్కాలర్షిప్లు, ఇంటర్న్షిప్, మెంటార్షిప్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. శిక్షణ అవుతూనే పెద్ద ఉద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి వచ్చింది. ఆ రంగంలో ఇప్పటికి సుమారు 15 వేల మంది ఉద్యోగులు కావాలి. అందుకే, సీమె¯Œ ్స, జాకబ్స్, ఇండిగో లాంటి అనేక సంస్థలు ఆ కోర్సులో చేరీ చేరగానే యువతకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థి ఎదుట బోలెడన్ని అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఉంటాయన్న మాట. త్వరలో ప్రారంభమయ్యే ‘ఐఐసీటీ’ విజన్ కూడా ఇలాంటిదే.రైల్వేపై వాళ్ళు నిర్లక్ష్యం చూపారు!చేపట్టే ఏ పనిలో అయినా... చిత్తశుద్ధి ఉంటే అదే విజయతీరాలకు చేరుస్తుంది. ఉదాహరణకు – మన రైల్వేస్. నిజానికి, మన రైల్వేల ప్రస్థానం, వాటి సేవలు అపారం. యూరప్ లాంటిచోట్ల 20 – 22 ఏళ్ళలో రైలు బోగీని వినియోగంలో నుంచి తొలగిస్తే, మన దగ్గర 35 ఏళ్ళ దాకా వాడతాం. మన రైల్వేల బలం, బలగం ఎక్కువ. అయితే, దురదృష్టవశాత్తూ గత పాలకులు రైల్వేపై నిర్లక్ష్యం వహించారు. శ్రద్ధ చూపలేదు. 1970ల నాటి దగ్గరే రైల్వే నిన్న మొన్నటిదాకా ఆగిపోయింది. అప్పట్లో చేసివుండాల్సిన పని ఇప్పుడు చేయాల్సి వస్తోంది. చివరకు ఫ్యాన్ పాడైపోయినా, బాగు చేయించడానికి నిధులు, శ్రద్ధ కరవైన పరిస్థితి. అలాంటిది పదేళ్ళ క్రితం మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారింది. సామాన్య ప్రజల రవాణా అయిన రైల్వేల ప్రాధాన్యం, స్థితిగతులు ప్రధాని మోదీకి బాగా తెలుసు. అందుకే, రైల్వేల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు.చమురు మీద ఆధారపడడం తగ్గించి, విద్యుత్ మీద దృష్టి పెట్టాం. నూరుశాతం రైల్వేల విద్యుదీకరణ చేశాం. కాలుష్యం తగ్గించాం. స్విట్జర్లాండ్, జపాన్ లాంటివి రైల్వేలను నడుపుతున్న తీరు, ఏటా భారీగా పెడుతున్న పెట్టుబడులు మనకు ఓ ఆదర్శం. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు దాడితో విధ్వంసమైన జపాన్ ధైర్యం కోల్పోకపోగా, అదే అణువిద్యుత్ తయారీ, రైల్వేల వినియోగంతో పురోగమించాలని లక్షించుకొని, ఇంత ప్రగతి సాధించింది. మనకూ అలాంటి విజన్ కావాలి. మన ప్రధాని మోదీకి అలాంటి విజన్ ఉంది. ఇవాళ వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ లాంటివన్నీ దాని ఫలితమే. ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్లు తేవడం, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ వగైరా అలా జరుగుతున్నవే. ఇకపై దృష్టి అంతా షిప్పింగ్పై!చిరకాలంగా పాతుకుపోయిన అభిప్రాయాలలో, వైఖరుల్లో మార్పు తెచ్చి, రైల్వే వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, మళ్ళీ పట్టాలెక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. శ్రమ పడితేనేం, దాని ప్రయోజనం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలో రైల్వే లైన్ల గురించి కొందరు అడుగుతున్నారు. అది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. హిమాలయాలు ఏటా 2 సెంటీమీటర్ల మేర స్థానచలనమవుతాయి. మైదాన ప్రాంతమే లేకుండా వరుసగా సొరంగం, బ్రిడ్జి... మళ్ళీ సొరంగం, బ్రిడ్జి... పద్ధతిలో నిర్మించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అయినా మునుపటితో పోలిస్తే, మా హయాంలో చురుకుగా పనులు చేస్తున్నాం. విమానయాన రంగం, రైల్వేల తర్వాత మా ప్రభుత్వం దృష్టి అంతా నౌకాయాన రంగం (షిప్పింగ్)పై ఉండనుంది.రెండు నెలల్లో ఏఐ ఫేక్కు జవాబు!కృత్రిమ మేధ (ఏఐ) వచ్చాక సాంకేతిక యుగంలో ఎన్నో ముప్పులున్నాయి. ‘ఏఐ’ని సరైన రీతిలో ఉపయోగించుకోకుంటే అనర్థదాయకం. ఆ ముప్పుల నుంచి ఎలా రక్షణ పొందాలన్నది ముఖ్యం. చట్టం చేసి, తద్వారా ‘ఏఐ’ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ఒక పద్ధతి. కానీ, దాని వల్ల ఉపయోగం లేదు. రకరకాల వైఖరుల ద్వారా వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సాంకేతికతకు ‘నో’ చెప్పడమా, చట్టం చేయడమా, మరేదన్నానా... ఇలా ఏ వైఖరిని అవలంబిస్తామన్నది కీలకం. అయితే, అవేవీ కాకుండా టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్ళను టెక్నాలజీతోనే దీటుగా ఎదుర్కోవాలన్నది మన భారతదేశ వైఖరి. ఐఐటీ తదితర సంస్థల సహాయం కోరాం. ‘ఏఐ’ వాడి కల్పించిన ఫేక్ సమాచారమా, కాదా అన్నది కనిపెట్టే టెక్నాలజీ సాధనాలను సిద్ధం చేస్తున్నాం. అది రెండు, మూడు నెలల్లో సిద్ధమై, అందుబాటులోకి రానుంది. జాతి, మతం, ప్రాంతం, భాష... ఇలా వివిధ రకాల పక్షపాత వైఖరులను పసిగట్టి, తొలగిస్తుంది. కేవలం చట్టాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలా టెక్నాలజీతోనే ముప్పును దీటుగా ఎదుర్కోవడమనేది ఆచరణాత్మక పరిష్కారం. మన ఈ వైఖరిని దావోస్లో చెబితే, అందరూ హర్షధ్వానాలు చేశారు. మన ఆలోచనను ప్రపంచమంతా ఇవాళ ప్రశంసిస్తోంది.అవన్నీ లేనిపోని ఆరోపణలు! అడిగితే అన్నిటికీ జవాబిస్తా!!మా ప్రభుత్వం తెచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (డీపీడీపీ) చట్టంలోని నిబంధనలపై కొందరు ఉద్దేశపూర్వకంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి ఏ సందేహమున్నా వివరంగా జవాబివ్వడానికి నేను సిద్ధం. ఆ చట్టంలోని ప్రతి సెక్షన్ నాకు తెలుసు. అపార్ గుప్తా లాంటి కొందరు ఈ చట్టంపై గగ్గోలు పెడుతున్నారు. దీని కింద జర్నలిస్టుల్ని జైలులో వేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. ‘రైట్ టు ప్రైవసీ’ (గోప్యత హక్కు) అనేది ప్రాథమిక హక్కుల్లో భాగమని పుట్టస్వామి కేసులో సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. కానీ, ‘రైట్ టు ప్రైవసీ’ కూడా ఇతర చట్టాలకు లోబడే ఉంటుంది. అలాగని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ చేసే జర్నలిస్టుల హక్కును ఎవరూ కాదనలేరు. పుట్టస్వామి కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు సహా భారీ సంపుటాలన్నీ నేను క్షుణ్ణగా చదివాను. అలాగే, ఈ డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) నీరు గారుస్తున్నారని మరో ఆరోపణ. ఆ ఆరోపణలోనూ పస లేదు.రెండు చేతులతో... మూడు శాఖలు!నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం లేదు. చాలామందితో పోలిస్తే, కొత్తవాణ్ణి. అయినా, నా మీద నమ్మకం ఉంచి, రైల్వే శాఖ, సమాచార – ప్రసార మంత్రిత్వ శాఖ... రెండూ ఇచ్చారు. వాటిని నిర్వహించడం నాకేమీ కష్టంగా అనిపించడం లేదు. పైగా రెండూ నాకు నచ్చిన పనులే. చేతి నిండా ఉన్న ఈ పనుల్ని నేనెంతో ఆస్వాదిస్తున్నా. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ పనులు కూడా నాకెంతో సంతృప్తినిస్తున్నాయి. (నవ్వుతూ...) రెండు చేతులతో మూడు శాఖల పనులూ... అన్నీ ఇష్టంగా, ఆసక్తిగా చేస్తుంటా. ముఖ్యంగా సెమీ కండక్టర్ల రంగంలో చాలా చేస్తున్నాం. ఈ ఏడాది చివరికల్లా దేశీయంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేయనున్నాం. ఈ ఏడాది డిసెంబర్ కల్లా తొలి ‘మేడిన్ ఇండియా’ చిప్ చేసే విధంగా ముందుకు దూసుకుపోతున్నాం. (నవ్వుతూ...) ఢిల్లీలో నా ఆ ఆఫీసు గదిలో స్వదేశీ చిప్ వాడకం కోసం సర్వం సిద్ధం చేసి ఉంచా. హైదరాబాద్లో ఆ సంగతి నాకు తెలీదు!హైదరాబాద్లో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సుదీర్ఘ కాలంగా జరగకపోవడానికి కారణం నాకూ తెలియదు. అన్నింటికీ నా దగ్గర జవాబులు లేవు. (నవ్వుతూ...) నేను మనిషినే కదా... నాకు సర్వస్వం తెలియాలని ఏమీ లేదుగా. ఎందుకు జరగడం లేదో... మీరు ఛాట్ జీపీటీని అడగండి. అదేమి చెబుతుందో చూద్దాం. చేసేందుకు చేతుల నిండా పని ఉంది!ప్రధాని మోదీ మాకు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు... ‘మనం మన కర్తవ్యాన్నీ, బాధ్యతలనూ సమయానికి, సరైన రీతిలో బాగా చేస్తే చాలు. ఇతరుల హక్కులు ఆటోమేటిగ్గా అమలవుతాయి’. మనమే సరైన నిర్ణీత సమయానికి రాకపోతే, రేపు నా దగ్గర పనిచేసే మిగతా వాళ్ళు సరైన సమయానికి రావాలని ఎలా ఆశించగలం? మనం ఆదర్శప్రాయంగా నిలబడితేనే, మన టీమ్ నుంచి కూడా అలాంటిది ఆశించవచ్చు. టెక్నాలజీ వినియోగదారులమైన మనందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే, సమాజానికి హితం జరుగుతుంది. నేనేదో జ్ఞానబోధ చేయడం లేదు... మనస్ఫూర్తిగా నమ్మిన మాట చెబుతున్నా. సమాజం, సర్కార్... రెండూ బాధ్యతతో కలసికట్టుగా నడిస్తేనే ఉపయోగం. రాబోయే తరాలకు మెరుగైన భారతావనిని అందించి వెళ్ళడమే మా పార్టీ, ప్రభుత్వాల ఆలోచన.చదవండి: హద్దులు చెరిపేసిన ఆ రెండు సినిమాలుఇప్పటి దాకా మీరు చూసింది ఒకటో భాగమే. మన దేశాన్ని సర్వసమాయత్తం చేయడంలో భాగంగా పోనుపోనూ మా ప్రభుత్వం చేసేవి, మీరు చూసేవి... ఇంకా చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే, చేయాలన్న చిత్తశుద్ధి, సంకల్పం ఉండాలే కానీ, ఇక్కడ చేయడానికి చేతుల నిండా పని ఉంది. అయితే, ‘దేశ్ బనానా, సమాజ్ బనానా’ (దేశాన్నీ, సమాజాన్నీ సరైన పద్ధతిలో తీర్చిదిద్దడం) అంత తేలిక కాదు... చాలా కష్టం. – రెంటాల జయదేవ -
పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
పాక్ నటుడు ఫవాద్ ఖాన్పై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) మండిపడ్డారు. పహల్గాం ఘటనతో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను ఫవాద్ ఖండించాడు. ఈ సిగ్గుచేటైన దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ పాక్కు పూర్తి మద్ధతుగా వ్యాఖ్యలు చేశాడు. ఆపై భారత్ను తక్కవ చేస్తూ కామెంట్లు చేశాడు. దీంతో బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్ అయింది.సోషల్ మీడియా వేదికగా ఫవాద్ గురించి ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ' మీలాంటి వాళ్లు ఇండియన్ సినిమాల్లో నటించడం మాకు సిగ్గుచేటు' అని అతని ఫోటోను షేర్ చేసింది. దానికి ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ హ్యాష్ ట్యాగ్లను ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఫవాద్ను దుమ్మెత్తిపోస్తున్నారు. భారతీయ సినిమాల మీద ఆధారపడి బతికిన నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా అతన్ని విమర్శించకపోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్పై వ్యాఖ్యలు చేసిన పాక్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరింది. సినిమాల పేరుతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఇలాంటివారికి గుడ్డిగా ఎవరూ మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్ కోరింది. ఫహల్గామ్ దాడి తర్వాత వెంటనే ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను భారత్లో బ్యాన్ చేశారు. ఆపై పాక్ యూట్యూబ్, ఓటీటీ సంస్థల కంటెంట్ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. You working in Indian films was also 'shameful' for us.#OperationSindoor #IndianArmy #IndianAirForce pic.twitter.com/B7CeuQcb2t— Rupali Ganguly (@TheRupali) May 7, 2025 -
కాన్స్కు బెంగాలీ ఫిల్మ్అరణ్యేర్ దిన్ రాత్రి
భారతీయ ప్రముఖ దివంగత దర్శకులు సత్యజిత్ రే ఐకానిక్ బెంగాలీ ఫిల్మ్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (1970) కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుంది. ఫ్రాన్స్లో ఈ నెల 13 నుంచి 24 వరకు 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రోత్సవాల తొలి రోజున ‘కాన్స్ క్లాసికల్ సెక్షన్’ విభాగంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా స్క్రీనింగ్ కానుంది. సునీల్ గంగోపాధ్యాయ రాసిన ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ నవలను అదే పేరుతో సత్యజిత్ రే సినిమాగా తెరకెక్కించారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా చిత్రం 1970 జనవరి 16న ఇండియాలో విడుదల కాగా, 1973 మార్చి 14న యూఎస్లో (ఇంగ్లిష్లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్’) విడుదలైంది.సౌమిత్రా ఛటర్జీ, సుభాష్ ఛటర్జీ, సమిత్ భంజా, రబీ ఘోష్, షర్మిలా ఠాగూర్, కబీర్ బోస్, అపర్ణ సేన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలుపోషించారు. ఈ సినిమా కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైనట్లుగా కాన్స్ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కే రెజల్యూషన్లో రీస్టోర్ చేశారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ది క్రైటీరియన్ కలెక్షన్స్ జానస్ ఫిల్మ్స్ల ఆధ్వర్యంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా 4కే రెజల్యూషన్లో రీ స్టోర్ చేయడం జరిగింది. ఈ చిత్రనిర్మాత పూర్ణిమా దత్తా దగ్గర ఉన్న ఈ సినిమా ఒరిజినల్ కెమెరా, సౌండ్ నెగటివ్ల సాయంతో ఈ సినిమా 4కే రెజల్యూషన్ వీలుపడింది. గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ ఫండింగ్ చేసింది. దర్శకులు మార్టిన్ స్కోర్సెస్, వెస్అండర్సన్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమాను 4కే రెజల్యూషన్లో రూపొందించడానికి కీలక పాత్రలుపోషించారు.సంతోషం... బాధ: సందీప్ రే ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా కాన్స్లో ప్రదర్శితం కానున్న సందర్భంగా సత్యజిత్ రే తనయుడు, దర్శకుడు–సంగీత దర్శకుడు సందీప్ రే స్పందించారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాధగా కూడా ఉంది. ‘కాన్స్’లో సినిమా ప్రదర్శితం కానున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో చాలా మంది ఇప్పుడు జీవించి లేకపోవడం బాధగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తీయాలని నాన్నగారు అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ‘పథేర్ పాంచాలి’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది’’ అని పేర్కొన్నారు. కాన్స్ ఫెస్టివల్కు పూర్ణిమ... షర్మిల ఇక ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన కానున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాత పూర్ణిమా దత్తా, ఈ చిత్రంలో నటించిన షర్మిలా ఠాగూర్ హాజరు కానున్నారు. ఈ చిత్రంలో నటించిన మరో నటి సిమీ గరేవాల్కు ఆహ్వానం అందినప్పటికీ అనారోగ్యం కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నారట. ఇక ఈ 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు భారతదేశం తరఫున ఎంపికైన ఏకైక చిత్రం ‘హోమ్బౌండ్’. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు హైదరాబాదీ వ్యక్తి నీరజ్ దర్శకత్వం వహించారు. ‘అన్సరై్టన్ రిగార్డ్’ విభాగంలో ‘హోమ్బౌండ్’ చిత్రంపోటీ పడుతోంది. -
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ హిట్-3 సినిమాతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యాడు. హిందీలో ఆయన సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, హిట్-3లో విలన్గా ఆల్ఫా పాత్రలో మంచి గుర్తింపు పొందాడు. సికందర్, దర్భార్, భాగీ2 వంటి చిత్రాల్లో కూడా ప్రతీక్ మెప్పించాడు. అయితే, ప్రతీక్ బాబర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు అని చాలామందికి తెలియదు. మహానటి అనే పేరుకు అసలైన ఐకాన్గా ఒకప్పుడు ఆమె పేరు పొందింది.పద్మశ్రీతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్ ఏకైక కుమారుడే ప్రతీక్ బాబర్.. 80కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ కాకముందే ఆమె డైరెక్టర్స్కు కండీషన్స్ పెట్టేది. అగ్లీ డ్రెస్సులు అంటే నో చెప్పేది. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే.. డబ్బు ఎంత ఇచ్చినా సరే డోన్ట్ కేర్ అనేది. ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నదే పదేళ్లు.. అయినా సరే భారీగా ఫ్యాన్స్ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్లీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది. కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది. ఇదొక మచ్చుతునక మాత్రమేనని చెప్పవచ్చు.1955లో జన్మించిన ఆమె దశాబ్దకాలంలోనే 80కి పైగా సినిమాల్లో నటించింది. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2013లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. సినీ నటుడు రాజ్ బబ్బర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్మితా పాటిల్ ప్రతీక్ బబ్బర్ను కన్న తరువాత రెండు వారాలకు చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది. తల్లి మీద ప్రేమతో హిట్-3 నటుడు తన పేరును 'ప్రతీక్ స్మితా పాటిల్'గా మార్చుకున్నాడు. -
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం
మన దేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.'వారి (ఫవాద్-మహిరా) కామెంట్స్ మన దేశాన్ని అగౌవరపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు'(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు)'కళ పేరుతో ఇలాంటి నటీనటుల్ని గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌవరపరచం లాంటిదే. చిత్రపరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం' అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్ అసోసియేషన్ పేర్కొంది.గత నెలలో పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా.. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'అబిర్ గులాల్'. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) -
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్లోని టాప్ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఈ పేరు చాలా శక్తివంతంగా ఉందని గుర్తించిన సినీ మేకర్స్ టైటిల్ హక్కుల కోసం క్యూ కడుతున్నాయి.ఇప్పటికే అనేక మంది నిర్మాతలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు BN తివారీ ఇండియా టుడేతో ధృవీకరించారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం పనిచేసే సంఘాలలో ఒకటి)లో దాదాపు 15 మంది చిత్రనిర్మాతలు, స్టూడియోలు కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు.హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాతలు నిన్నటి నుంచి "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ రేసులో మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందంజలో ఉందని, ఈ టైటిల్ను రిజిస్టర్ చేసిన మొదటి బ్యానర్ అని సమాచారం. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఆపై ప్రముఖ బ్యానర్లు జీ స్టూడియోస్, టి-సిరీస్ ఈ టైటిల్ను రిజిస్టర్ చేసిన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ బ్యానర్లన్నీ కూడా ఇటీవలనే పహల్గామ్ దాడిని ప్రపంచానికి చూపాలని పహల్గామ్ పేరుతో టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే, "ఆపరేషన్ సిందూర్" అనేది ఒక శక్తివంతమైన టైటిల్ కావడంతో చాలామంది పోటీపడుతున్నారు. -
ఆమిర్ని కలిసిన అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందని, దాని కోసమే ఆమిర్ని కలిశాడని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్ భేటీనే హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
మొన్ననే విడాకులు .. ఇప్పుడు ఐటమ్ సాంగ్
టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర చాహల్.. కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలావరకు బాగానే ఉండేది. మరి ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు.అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ.. సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్నీమధ్యే తెలుగులో 'ఆకాశం దాటివస్తావా' మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడీ ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రం మే 09న థియేటర్లలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్-ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తోంది.ఎందుకంటే విడాకులు తీసుకున్న కొన్నిరోజుల తర్వాత తెలుగు, హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారిపోతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
Operation Sindoor: వెండితెరపై భారత్-పాక్ యుద్ధ గాథలు
ఆపరేషన్ సిందూర్..ఇప్పుడు భారత్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆత్మాహుతి డ్రోన్లు.. స్కాల్ప్ క్షిపణులు.. హ్యామర్ బాంబులతో విరుచుపడింది. ఆ దేశ పౌరులకు నష్టం కలిగించకుండా..కేవలం ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకొని ఈ ఆపరేషన్ చేపట్టారు.భారత్-పాకిస్తాన్ మధ్య గతంలో జరిగిన యుద్ధాలు, మెరుపు దాడులు భారత సైన్యం యొక్క ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటాయి. ఈ యుద్ధ గాథలు వెండితెరపై దేశభక్తి ఉట్టిపడే సినిమాలుగా మలిచాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, భారత్-పాక్ యుద్ధాల ఆధారంగా తెరకెక్కిన ఆర్మీ సినిమాలపై ఓ లుక్కేద్దాం.బోర్డర్ (1997)ఈ చిత్రం 1971 యుద్ధంలో లాంగేవాలా సరిహద్దు పోస్ట్ను రక్షించిన 120 మంది భారతీయ సైనికుల ధైర్యసాహసాలను తెలియజేస్తుంది . వారు పాకిస్తాన్ యొక్క భారీ ట్యాంక్ రెజిమెంట్ను ఎదుర్కొని, రాత్రంతా పోరాడి, ఉదయం భారత వైమానిక దళ సహాయంతో విజయం సాధించారు. ఈ సినిమా దేశభక్తి గీతాలు, ఉద్వేగభరిత సన్నివేశాలు మరియు యుద్ధ దృశ్యాలతో బాక్సాఫీస్ విజయం సాధించింది. “సందేశే ఆతే హై” గీతం ఇప్పటికీ దేశభక్తి గీతాలలో ఒక ఐకాన్గా నిలిచింది. సన్నీ డియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ దత్తా దర్శకత్వం వహించారు.లక్ష్య (2004)ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు టైగర్ హిల్ను తిరిగి స్వాధీనం చేసుకున్న సంఘటనలను చిత్రీకరిస్తుంది. హృతిక్ రోషన్ పోషించిన కరణ్ షెర్గిల్ అనే లక్ష్యం లేని యువకుడు సైన్యంలో చేరి, యుద్ధంలో హీరోగా మారే ప్రయాణం ఈ సినిమా కథాంశం. ఈ సినిమా యువతను సైన్యంలో చేరేందుకు ప్రేరేపించింది మరియు దేశభక్తితో పాటు వ్యక్తిగత పరివర్తనను కూడా చూపించింది. హృతిక్ రోషన్, ప్రీతి జింటా, అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించారు.1971 (2007)ఈ చిత్రం 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం చేతిలో ఖైదీలుగా ఉన్న ఆరుగురు భారతీయ సైనికుల కథను చెబుతుంది. వారు తమ దేశానికి తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు, త్యాగాలను ఈ సినిమా చిత్రీకరిస్తుంది. ఈ చిత్రం యుద్ధ ఖైదీల జీవితాలలోని కష్టాలను మరియు వారి ధైర్యాన్ని వాస్తవికంగా చూపించింది. దర్శకుడు: అమృత్ సాగర్ ; నటీనటులు: మనోజ్ బాజ్పాయ్, రవి కిషన్, దీపక్ దోబ్రియాల్ది గాజీ అటాక్ (2017)ఈ చిత్రం 1971 యుద్ధంలో భారత నావికాదళ సబ్మెరైన్ INS కరంజ్, పాకిస్తాన్ సబ్మెరైన్ PNS గాజీ మధ్య జరిగిన జల యుద్ధాన్ని చిత్రీకరిస్తుంది. భారత నావికాదళం విశాఖపట్నం ఓడరేవును రక్షించడానికి చేసిన ప్రయత్నాలను ఈ సినిమా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు: సంకల్ప్ రెడ్డి; నటీనటులు: రానా దగ్గుబాటి, కే కే మీనన్, అతుల్ కులకర్ణి.ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)ఈ చిత్రం 2016లో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కింది. “హౌస్ ది జోష్?” అనే డైలాగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆధునిక యుద్ధ వ్యూహాలు, సైనిక సామర్థ్యం మరియు దేశభక్తిని చూపించడంలో విజయవంతమైంది. దర్శకుడు: ఆదిత్య ధర్; నటీనటులు: విక్కీ కౌశల్, యామి గౌతమ్, పరేష్ రావల్షేర్షా (2021)ఈ చిత్రం కార్గిల్ యుద్ధంలో పరమవీర చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా రూపొందింది. విక్రమ్ బత్రా యొక్క ధైర్యం, నాయకత్వం , త్యాగాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. “యే దిల్ మాంగే మోర్” అనే విక్రమ్ బత్రా యొక్క ప్రసిద్ధ నినాదం ఈ సినిమాతో మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ కీలక పాత్రలు పోషించారు.‘ఆపరేషన్ వాలెంటైన్’(2024)పుల్వామా ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా తెరకెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ (Varun Tej), మానుషి చిల్లర్ (Manushi Chhillar) ప్రధాన పాత్రల్లో నటించారు. -
చాలా భయపడ్డా.. పారిపోవాలనిపించింది: షారుక్ ఖాన్
సెలబ్రిటీల ఫ్యాషన్ షో ‘మెట్ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ వేదికగా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్ గాలా’ డ్రెస్కోడ్ ‘టైలర్డ్ ఫర్ యు’ కాగా, ‘సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్స్టైల్’ను థీమ్గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు. ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్ ఖాన్( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు షారుక్ ఖాన్. ‘‘ఈ ఏడాది మెట్ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్ కార్పెట్పై నడవలేదు. నాకు ఫ్యాషన్పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్ జోనస్, హీరోయిన్ కియారా అద్వానీ, సింగర్–నటుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్’తో మెరిశారు. -
బాలీవుడ్ అమ్ముడు పోయింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj ) బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో సగం మంది నటీనటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ప్రకాశ్ రాజ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణాలను వివరించారు.“నేను సూటిగా మాట్లాడతాను. రాజకీయ పరిణామాలపై నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతుంటాను. దీని వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించి, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాతే నేను గళం విప్పాలని నిర్ణయించుకున్నాను,” అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించాలనే ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ, ధైర్యంతో ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“సినిమా పరిశ్రమలో సగం మంది అమ్ముడుపోయినవారే. కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ, ప్రశ్నించే ధైర్యం లేదు. నా సన్నిహిత మిత్రుడు ఒకరు, ‘ప్రకాశ్, నీకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావ్, మాకు అంత ధైర్యం లేదు’ అని చెప్పారు. వారి పరస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, చరిత్ర నేరాలు చేసిన వారిని క్షమించినా, మౌనంగా ఉండేవారిని మాత్రం క్షమించదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాజాగా సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రంలో కనిపించారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’, విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పోలీసులకు నటి ఫిర్యాదు.. పరారీలో నటుడు అజాజ్ ఖాన్!
ఇటీవల హౌస్ అరెస్ట్ షో వివాదం తర్వాత అజాజ్ ఖాన్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఈ షోలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీంతో ఆ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ కూడా బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఓ నటి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అజాజ్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైనట్లు తెలుస్తోంది.తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక నటి ముంబయిలోని చార్కోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్ను సంప్రదించేందుకు పోలీసులు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పరారైనట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. 'హౌస్ అరెస్ట్' షోలో పాత్రను ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 'హౌస్ అరెస్ట్' అనే షోలో అనుచిత కంటెంట్ను ప్రసారం చేసినందుకు మరో కేసులో కూడా పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యజమానులపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ షోను వెంటనే నిషేధించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్తో ఎంట్రీ!
ప్రతిష్టాత్మక ఈవెంట్లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ మెరిసింది. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో జరిగిన మెట్గాలాలో బాలీవుడ్ సినీ తారలంత సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. తన బేబీ బంప్తో వేదికపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తులను కియారా ధరించి ఈవెంట్లో మెరిసింది.కాగా..'సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్తో మెట్ గాలా- 2025 ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బేబీ బంప్తో మెట్ గాలా కార్పెట్పై ఎంట్రీ ఇచ్చిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. ఈ సందర్భంగా నా జీవితంలో ఒక నటిగా, కాబోయే తల్లిగా మెట్ గాలా అరంగేట్రం చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని కియారా పేర్కొంది. నా స్టైలిస్ట్ లుక్ను డిజైన్ చేయడానికి గౌరవ్ సృష్టించిన డ్రెస్ కోడ్ చాలా అందంగా ఉందని తెలిపింది.సినిమాల విషయానికొస్తే కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ సరసన కనిపించింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ కాలేకపోయింది. కాగా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొత్త ఏడాదిలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కియారా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. -
అడవిలో థామా
‘థామా’ సినిమా కోసం దాదాపు నెలపాటు అడవిలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీతోపాటు అక్కడి ఫారెస్ట్లో జరుగుతోందట.ఆయుష్మాన్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల తర్వాత ఆయుష్– రష్మిక– నవాజుద్దీన్ సిద్ధిఖీలపై క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్లో చిత్రీకరిస్తారని బాలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్తో ‘థామా’ షూటింగ్ టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందని,పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని సమాచారం. ఇక మడాక్ ఫిల్మ్స్(నిర్మాత దినేష్ విజన్) హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా ‘థామా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.కొడుకు తైమూర్కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార్చేశాడు. (ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
ఈ కాలం సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చాలా కామన్.. అదే 40 ఏళ్ల క్రితం అలాంటి సీన్లు థియేటర్స్లో రన్ అయితే పెద్ద చర్చనీయాంశం అని చెప్పవచ్చు. 1988లో బాలీవుడ్లో విడుదలైన 'దయావన్' సినిమా పెద్ద సన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ కాలం నాటి సినిమాలను ఫాలో అయ్యే వారికి దాని ప్రభావం ఏంటో బాగా తెలుసు. వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ నటించిన 'దయావన్' మూవీ విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య తెరకెక్కించిన మోస్ట్ రొమాంటిక్ సీన్ ఉండటంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రం విడుదల సమయానికి మాధురీ దీక్షిత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఆపై ఆమె ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగులేస్తుంది. ఈ క్రమంలో తనేంటో నిరూపించుకోవడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ, వినోద్ ఖన్నా అప్పటికే బాలీవుడ్లో పాపులర్ హీరోగా ఉన్నారు. వీరి కాంబినేషన్లో అలాంటి సీన్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.'దయావన్' సినిమా గురించి ఆ రోజుల్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వచ్చిన నివేదికల ప్రకారం.. రొమాంటిక్ సీన్ తీస్తున్న సమయంలో వినోద్ ఖన్నా పరిది దాటిపోయాడట. స్క్రీప్ట్ ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లు చేయడం ఏంటి అంటూ దర్శకుడు కూడా పలుమార్లు కట్ అని చెప్పాడట. అయినప్పటికీ మాధురితో రొమాంటిక్ సీన్ ఆపలేదట. ఆ సమయంలో ముద్దు పెడుతున్న క్రమంలో ఆమె పెదవిని కూడా ఖన్నా కొరికేశాడని దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందని చెప్పుకొచ్చారు. ఈ సీన్ తర్వాత మాధురి చాలా ఇబ్బంది పడిందట. విషయం తెలుసుకున్న వినోద్ ఖన్నా క్షమాపణలు కూడా చెప్పారట.సినిమా విడుదల తర్వాత అసలు రచ్చ మొదలైంది. ఆ సీన్ను తొలగించాలంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సీన్ను తెరపై చూసిన తర్వాత మాధురికి కూడా నచ్చలేదట. దీంతో దానిని తొలగించాలని ఆమె కూడా కోరారట. కానీ, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను డైరెక్టర్, హీరో కలిసి రూ.1 కోటి అదనంగా చెల్లించారు. ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. డింపుల్ కపాడియాతో కూడా మరో సినిమాలో వినోద్ ఖన్నా ఇలాంటి పనే చేశాడని చాలామంది చెబుతుంటారు.ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితంపేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్తో బాధపడుతూ 2017 ఏప్రిల్ 27న ఆయన మరణించారు. -
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
‘అమెరికా ఫస్ట్’అనే విధానంతో ప్రపంచ దేశాలపై ‘సుంకాల యుద్ధం’ ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే వివిధ రంగాలపై భారీగా టారీఫ్ విధించిన ట్రంప్..ఇప్పుడు సినిమా రంగంపై విరుచుపడ్డాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించి సినిమా రంగానికి షాకిచ్చాడు. ట్రంప్ నిర్ణయం భారత సినీ పరిశ్రమపై ముఖ్యంగా టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు.గతకొన్నేళ్లుగా అమెరికాలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ భారీగా కలెక్షన్స్ రాబట్టే చిత్రాలలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు అగ్రస్థానంలో ఉంటాయి. పటాన్, ఆర్ఆర్ఆర్, డంకీ, పుష్ప, జవాన్ లాంటి చిత్రాలు అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. (చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై 100% సుంకం)ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఉత్తర అమెరికాలో భారీ క్రేజీ ఉంది. ఇండియా కంటే ఒక్క రోజు ముందుగానే అక్కడ సినిమాను రిలీజ్ చేస్తారు. అక్కడ హిట్ టాక్ వస్తే.. ఇక్కడ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వేసిన టారీఫ్ బాంబుకి అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కుదేలు అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ చెప్పినట్లుగా విదేశీ చిత్రాలకు 100 శాతం సుంకం విధిస్తే.. ఒక మిలియన్ డాలర్కు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ మరో మిలియన్ డాలర్ని టాక్సీగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ రెట్టింపు ధరను చెల్లించి ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలన్నమాట. ఈ భారం ప్రేక్షకుడిపై వేయాల్సి ఉంటుంది. లాభాల కోసం టికెట్ ధరను పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న ధరకే ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లడం లేదు. ఇక ధరలు పెంచితే.. అమెరికాలో కూడా థియేటర్స్ ఖాలీ అవ్వడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న రేటుకి రెట్టింపు చెల్లించాలి కాబట్టి..అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తారు. అలాగే ఓటీటీలకు కూడా ట్రంప్ నిర్ణయం వర్తిసుందని చెబితే మాత్రం.. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఇండియన్ సినిమాలకు తక్కువ డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలకు ట్రంప్ భారీ షాకిచ్చాడనే చెప్పాలి.పాన్ ఇండియా సినిమాపై ట్రంప్ ఎఫెక్ట్అమెరికా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే భారీ బడ్జెట్తో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ధనుష్ ‘కుబేర’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, చిరంజీవి ‘విశ్వంభర’ తదితర చిత్రాలన్ని త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఓవర్సిస్ బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ విధించిన 100 శాతం సుంకం కారణంగా ఈ చిత్రాలకు జరిగే బిజినెస్లో తేడాలు వస్తాయి. ఓవర్సీస్లో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అలాగే ఓటీటీలో కూడా కొనుగోలు విషయంలో వెనకడుకు వేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సినిమా రంగంపై విధించిన వందశాతం టారీఫ్ విషయంలో ఆయన మరోసారి ఆలోచన చేస్తాడా? మనసు మార్చుకొని టారిఫ్ తగ్గిస్తాడా లేదా చూడాలి. -
నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్ బీ టౌన్లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్ అయినా గ్యారహ్.. గ్యారహ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ. -
భారతీయ తొలి ఐటమ్ గాళ్ ఓ పాకిస్తానీ..
భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్ సాంగ్స్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్ చిత్రాలు ఐటమ్ సాంగ్ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్ రసిలే’, కరీనా కపూర్ ‘ఫేవికోల్ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్బర్ దిల్బర్’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్కీ రాత్ ద్వారా ఐటమ్ క్వీన్గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన ఈ ఐటమ్ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా?సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా ఈ ఐటమ్ నంబర్ల ట్రెండ్ను హెలెన్, బిందు లేదా జీనత్ అమెన్ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.అన్నా మేరీ గ్వీజెలర్...ఉరఫ్ మేడమ్ అజురీ... బాలీవుడ్లో తొలి ఐటమ్ డాన్సర్ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్ కాగా, తండ్రి జర్మన్ జ్యూయిష్ డాక్టర్. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు. అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్ సర్కిల్ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్’, ‘క్వత్ల్–ఎ–ఆమ్’, ‘ది బాంబే టాకీస్’, ‘నయా సంసార్’ వంటి చిత్రాలతో సహా 700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్ అయ్యింది.తమ ప్యాలెస్లో నృత్యం చేయాలంటూ మేడమ్ అజురీకి బ్రిటన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది. దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్ డ్యాన్సులకు ఊపిరిపోసిన అజురీ ఆగస్టు 1998లో మరణించింది. -
'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. అతను హోస్ట్గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్పై చార్కోప్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
పాక్ నటుడి సినిమాపై బ్యాన్ వద్దు.. రిలీజ్ చేయాలి: ప్రకాశ్ రాజ్
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ అన్నిరకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో ఉన్న పాక్ ప్రజలను వారి స్వదేశానికి వెళ్లగొట్టింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లను సైతం నిలిపివేసింది. పాక్ నటులను, వారి సినిమాలను బ్యాన్ చేసింది.సినిమాలను నిషేధించకూడదుదీంతో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సినిమాలను బ్యాన్ చేయడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుపట్టాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మాట్లాడుతూ.. సినిమాలను నిషేధించడాన్ని నేను సమర్థించను. అది ఎటువంటి సినిమాలు అయినా సరే.. వాటిని జనాల నిర్ణయానికి వదిలేయాలి. శృతిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదు అని పేర్కొన్నాడు. అయితే పాక్ నటుడి సినిమాను సపోర్ట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్పై విమర్శలు వస్తున్నాయి.అబీర్ గులాల్..పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం అబీర్ గులాల్ (Abir Gulaal Movie). వాణీ కపూర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఆర్తి ఎస్.బగ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్ నిర్మించారు. మే 9న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతలోనే జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. కేంద్రం పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫవాద్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై బ్యాన్ ప్రకటించింది.చదవండి: సారీ చెప్పమన్న బేబీ డైరెక్టర్.. రెండేళ్ల జీవితం వృథా అన్న బాలీవుడ్ హీరో -
సారీ చెప్పమన్న 'బేబీ' డైరెక్టర్.. రెండేళ్ల జీవితం ధారపోశానన్న హీరో
బాలీవుడ్లో కనీస మర్యాద ఇవ్వరు.. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటూ హిందీ చిత్రపరిశ్రమపై ఫైర్ అయ్యాడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, హీరో బాబిల్ ఖాన్ (Babil Khan). అర్జున్ కపూర్, అనన్య పాండే, షనయా కపూర్, అర్జిత్ సింగ్.. ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలామంది ఉన్నారని, బాలీవుడ్ పని చేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అసలు ఏమనుకుంటున్నావ్?కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. అర్జున్, అనన్య, షనయా, అర్జిత్లను తాను విమర్శించలేదని, సపోర్ట్ చేశానని పేర్కొన్నాడు. దీనిపై తెలుగు డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) స్పందించాడు. అంటే ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసిన మేము ఇప్పుడు సైలెంట్గా ఈ టాపిక్ను వదిలేయాలంటావ్.. అసలు మా గురించి ఏం అనుకుంటున్నావ్? అంటే.. నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా? సారీ చెప్పాల్సిందే!నీకు సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? నీకు నిజంగా వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి.. అనిపిస్తే ఇచ్చుకో.. కానీ నీకోసం నిల్చున్న మా అందరినీ లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన బాబిల్.. నువ్వు నా మనసు ముక్కలు చేశావ్.. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని నీ ముందు ధారపోశాను.మణికట్టు కోసుకున్నాఒళ్లు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. కానీ ఏం చేసినా అన్నీ తిరస్కరించావ్. ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించాను. మురికిగుంటలో బొర్లాను. నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్ డిలీట్ చేశాడు.బేబీ రీమేక్లో బాబిల్?బేబీ సినిమా (Baby Movie)తో రూ.100 కోట్ల హిట్ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేశ్. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం నటుడు బాబిల్ ఖాన్ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండేళ్లగా అతడిని తిప్పించుకున్న సాయి రాజేశ్ చివరకు అతడిని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. Babil reacts to filmmaker Sai Rajesh’s criticism: “I slit my wrist for him”byu/Normal_Weather8827 inBollyBlindsNGossip చదవండి: బాలీవుడ్ అంతా కాపీనే: నవాజుద్దీన్ సిద్దిఖీ -
బాలీవుడ్ అంతా కాపీనే.. ఆ సంస్కృతి ఇప్పటిదీ కాదు: నవాజుద్దీన్ తీవ్ర విమర్శలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం కోస్టావో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ను అడ్డుకున్న కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా దర్శకుడు సేజల్ షా రూపొందించారు. ఇటీవలే ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. తన మూవీ రిలీజ్ తర్వాత నవాజుద్దీన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ప్రస్తుత స్థితి గురించి మాట్లాడారు. హిందీలో ఇతరుల సినిమాలను కాపీ కొట్టడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.బాలీవుడ్ గురించి నవాజ్ మాట్లాడుతూ, "మన పరిశ్రమలో ఐదేళ్లుగా ఇదే పునరావృతం అవుతోంది. అందుకే ప్రేక్షకులు విసుగు చెంది చివరకు విడిచిపెట్టారు. వాస్తవానికి బాలీవుడ్లో అభద్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అంతా ఓకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఒకటి హిట్ అయితే చాలు. ఇక దానికే 2,3,4 అంటూ సీక్వెల్స్ తీసుకుంటూ పోతారు. బ్యాంకుల్లో జరిగే ఆర్థిక దివాలా లాగే.. ఇది కూడా క్రియేటివ్ దివాలా. బాలీవుడ్లో క్రియేటివిటీ లోపించింది. ఇప్పుడే కాదు.. ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో కాపీ కొడుతూనే ఉన్నారు. కథలు , పాటలు ఇతర ఇండస్ట్రీల నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నారు' అని కాస్తా ఘాటుగానే విమర్శించారు.సౌత్ నుంచి కాపీ చేయడంపై మాట్లాడుతూ..'ఇక్కడ ఉండే దొంగలు ఎలా సృజనాత్మకంగా ఉంటారు? మనం దక్షిణాది నుంచి, కొన్నిసార్లు ఇతర ఇండస్ట్రీల నుంచి కథలు దొంగిలించాం. హిట్లుగా మారిన కొన్ని కల్ట్ సినిమాల్లో కూడా కాపీ చేసిన సన్నివేశాలు ఉంటాయి. గతంలో వారు ఒక వీడియోను అందజేసి ఇది మేము తీయాలనుకుంటున్న సినిమా అని చెప్పేవారు. దానిని చూసి ఇక్కడ దానిని రిపీట్ చేసేవారు. ఇలాంటి పరిశ్రమ నుంచి మనం ఏమి ఆశించవచ్చు? ఎలాంటి నటులు వస్తారు? అంతా ఓకే రకమైనవారు అవుతారు. అందుకే నటులు, దర్శకులు తప్పుకోవడం ప్రారంభించారు - అనురాగ్ కశ్యప్ లాంటి మంచి కథలు అందించేవారు కూడా తప్పుకుంటున్నారు' అని తెలిపారు. -
బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు
సినిమా ఇండస్ట్రీ అంటేనే నెపోటిజం, ఒకరిని ఒకరు తొక్కేయడాలు లాంటివి చాలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే వీటి గురించి పెద్దగా బయటకు రాదు, రానివ్వరు. అప్పుడప్పుడు కొందరు నటీనటులు మాత్రం తమ బాధని వెళ్లగక్కుతుంటారు. అవి వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి.(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) తాజాగా హిందీ సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరో బాబిల్ ఖాన్.. ఏడుస్తూ బాధపడుతూ ఓ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో అస్సలు మర్యాద ఇవ్వరు అని నోటికొచ్చింది మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటికే వీడియోని డిలీడ్ చేయడంతో పాటు అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశాడు.'ఈ రోజు మీ అందరితో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో(బాలీవుడ్) అర్జున్, అనన్య, షనయాతో పాటు సంబంధం లేని అర్జిత్ సింగ్ లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే అత్యంత నకిలీ ఇండస్ట్రీ. ఇది బాగుండాలని కోరుకునేది కొందరే. నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను' అని బాబిల్ ఏడుస్తూ సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?) గతంలో లంచ్ బాక్స్, పీకూ, పాన్ సింగ్ తోమార్ తదితర సినిమాలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకే ఈ బాబిల్ ఖాన్. 2020లో తండ్రి చనిపోయిన తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. మొన్నీమధ్యే లాగౌట్ అనే ఓటీటీ మూవీలో హీరోగానూ చేశాడు.ఇప్పుడు చేసిన ఈ వీడియో పీఆర్ స్టంట్ లేదంటే నిజంగా బాధతో చెప్పాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అర్జున్, అనన్య, షనయా నెపోటిజం అని అన్నాడు. అదే టైంలో తన తండ్రి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని బాబిల్ మర్చిపోయినట్లున్నాడు. మరి దీని వెనుక ఏం మతలబు ఉందో?(ఇదీ చదవండి: భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ)