Bollywood
-
విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మౌనీరాయ్ విడాకులు తీసుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త సూరజ్ నంబియార్ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే దీనికి కారణం. ఇప్పటికీ వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకుల తతంగం కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న పుకార్లపై మౌనీ స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)'మీడియా వాళ్లకు విజ్ఞప్తి. అవాస్తవాలని ప్రచారం చేయొద్దు. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్' అని మౌనీరాయ్.. తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మరి విడాకుల వార్తల్లో నిజానిజాలేంటి అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.2018లో దుబాయిలో కలుసుకున్న సూరజ్-మౌనీరాయ్ నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి 2022లో గోవా వేదికగా పెళ్లి చేసుకున్నారు. మలయాళీ-బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుక జరిగింది. సూరజ్, దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ కాగా మౌనీ, హిందీ-దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్, నటిగా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. లేటెస్ట్గా అయితే చిరు 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది.(ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ) -
పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి
'ధురంధర్' సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రూ.1300 కోట్లు వసూలు చేయగా.. ఈ మార్చిలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన బీభత్సం చేసింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులు కొల్లగొట్టింది. పుష్ప, బాహుబలి.. దేన్ని వదల్లేదు. చాలామంది ఈ మూవీస్ నచ్చాయి గానీ కొందరు మాత్రం ప్రొపగాండా అని విమర్శించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడే పాక్ నాయకుల్లో అలజడి రేగింది. తన దేశంలోని లయరీ ప్రాంతం గురించి తప్పుతప్పుగా చూపించారని మండిపడ్డారు. అసలు లయరీ ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతూ 'మేరీ లయరీ' అనే సినిమాని కూడా ప్రకటించారు. గత వీకెండ్ అంటే మే 08న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు కాస్తోకూస్తో బజ్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి వచ్చిన ఘోరాతీ ఘోరంగా పరిస్థితి తయారైంది.ఆజ్ తక్ కథనం ప్రకారం.. 'మేరీ లయరీ' సినిమాకు పాక్లోని కొన్ని థియేటర్లలో మరీ 22 టికెట్లే అమ్ముడుపోయాయట. ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో తొలిరోజే చాలా థియేటర్లలో నుంచి సినిమాని తీసేశారట. అబూ అలీహా దర్శకత్వం వహించిన 'మేరీ లయరీ' మూవీలో ఆయేషా ఒమర్, దననీర్ మొబీన్, సామియా ముంతాజ్ ప్రధాన పాత్రలు చేశారు.'ధురంధర్' రెండు భాగాలు కూడా గూఢచర్యం, పాక్ ఉగ్రవాదం నేపథ్యంగా తీశారు. 'మేరీ లయరీ' మాత్రం లయరీ ప్రాంతంలో ఫుట్బాల్, సమాజ జీవనం, మహిళల ఆత్మవిశ్వాసం బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. గతంలోనే ఓ సందర్భంలో మాట్లాడిన సింధ్ సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్.. భారతీయ సినిమాల్లో లయరీ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లే మూవీ తీస్తే సొంత ప్రేక్షకుల నుంచే తిరస్కరణ ఎదురైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
కాన్స్లో సందడి
‘ఎంట్రీ సూపర్... ప్రిన్సెస్లా ఉంది’ అంటూ ప్రస్తుతం కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్న ఆలియా భట్ని ఉద్దేశించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో 79వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ 23 వరకూ జరుగుతుంది. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు ఐశ్వర్యా రాయ్, ఆలియా భట్, తారా సుతారియా తదితరులు పాల్గొననున్నారు.ఇప్పటికే ఆలియా ఫ్రాన్స్ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె ఇందులో భాగంగానే అక్కడికి వెళ్లారు. తొలి రోజు రెడ్ కార్పెట్పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్ రివెరా దగ్గర దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్లో ఆమె మెరిసిపోయారు. ఇలా తొలి రోజే ఫొటోషూట్తో ఆకట్టుకున్న ఆలియా... మరి రెడ్ కార్పెట్పై ఏ స్థాయిలో సందడి చేస్తారో చూడాలి. -
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న తాజా నిర్ణయంపై హీరో విశాల్ స్పందించారు. తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్ చేసిన సీఎం విజయ్ నిర్ణయంపై విజయ్ చిరకాల మిత్రుడు, విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా విశాల్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు."ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది. వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్లో తన సంతోషాన్ని ప్రకటించారు.చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB— Vishal (@VishalKOfficial) May 12, 2026 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర కీలక నేతలను గౌరవప్రదంగా కలుసుకోవడం కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది. -
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
మరో ప్రముఖ హీరోయిన్ విడాకులు?
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అనేది ఎంత సాధారణమో.. విడాకులు అంతే కామన్గా కనిపిస్తుంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు హీరో లేదా హీరోయిన్లు.. పట్టుమని కొన్నేళ్లయినా సంసార బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఇప్పుడు అలానే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నాగిని' సీరియల్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్.. హిందీ, పంజాబీ భాషల్లో హీరోయిన్, విలనీ పాత్రలు చేస్తూ వస్తోంది. లేటెస్ట్గా అయితే చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది. ఓ హిందీ మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. కెరీర్ పరంగా కాస్తోకూస్తో బిజీగా ఉన్న ఈమెనే ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని మాట్లాడుకుంటున్నారు. భర్తని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే ఈ రూమర్స్కి కారణం.సూరజ్ నంబియార్ అనే దుబాయికి చెందిన బిజినెస్మ్యాన్ని 2022 జనవరిలో మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. మరి ఏమైందో ఏమో ఇప్పుడు ఒకరిని ఒకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకున్నారు. మౌనీ రాయ్ స్నేహితురాలు, హీరోయిన్ దిశా పటానీ కూడా సూరజ్ని అన్ ఫాలో చేసింది. పెళ్లి ఫొటోలని సూరజ్ తన అకౌంట్ నుంచి తీసేసినప్పటికీ.. మౌనీ రాయ్ మాత్రం అలానే ఉంచింది. ఈ విషయంపై మౌనీ క్లారిటీ ఇస్తే నిజాలు బయటకు రావు.(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు) -
నిబంధనలన్నీ హీరోయిన్లకే!
‘‘బాలీవుడ్లో వివక్ష ఎక్కువ. ఒక సినిమా బడ్జెట్ తగ్గించాలంటే ముందు హీరోయిన్ల పారితోషికం తగ్గిస్తారు. అలాగే లొకేషన్కి హీరో రాక ముందే హీరోయిన్ మేకప్ వేసుకుని రెడీగా ఉండాలంటారు. సెట్స్లో హీరో ఏది అడిగినా కాదనకుండా సమకూర్చుతారు. గౌరవ మర్యాదల విషయంలోనూ తేడా చూపించేస్తారు. నిబంధనలన్నీ హీరోయిన్లకే ఉంటాయి’’ అని కృతీ సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆమె నటించిన ‘కాక్టెయిల్ 2’ చిత్రం జూన్ 19న విడుదల కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కృతీ సనన్... ‘‘బాలీవుడ్లో నేను నెపోటిజమ్ బాధితురాలిని’’ అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘స్టార్ కిడ్స్ వల్ల బాలీవుడ్లో చాలా అవకాశాలు కోల్పోయాను. ముందు నన్ను హీరోయిన్గా తీసుకుని, ఆ తర్వాత స్టార్ కిడ్స్ కోసం నన్ను పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.వారసులతో పోటీ పడి అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ‘మిమి’ సినిమాకి ముందు ఐదేళ్లు నా కెరీర్ ఎంతో కష్టంగా సాగింది. టాలెంట్ ఉండి కూడా అవకాశాల కోసం చాలా ఎదురు చూడాల్సి వచ్చేది. దాంతో కొంత ఒత్తిడికి లోనై, సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని చేదు అనుభవాలు, పరాజయాలు, కష్టాలు అనుభవ పాఠాలుగా ఉపయోగపడ్డాయి. కెరీర్లో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో నేర్పించాయి’’ అని పేర్కొన్నారు కృతీ సనన్. -
బోల్డ్ హారర్లో...
ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత బోల్డ్గా తమన్నా కనిపిస్తారని ఆమె కమిట్ అయిన తాజా చిత్రం స్పష్టం చేస్తోంది. ఇంతకీ అది ఏ సినిమా అంటే... బాలీవుడ్లో బోల్డ్ హారర్ మూవీగా పాపులర్ అయిన ‘రాగిణి ఎంఎంఎస్’లోని మూడో భాగం. ఏక్తా కపూర్ నిర్మించిన ‘రాగిణి ఎంఎంఎస్’, ఆ చిత్రం సీక్వెల్ ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి.తొలి భాగంలో కైనాజ్ మోతీవాలా, రెండో భాగంలో సన్నీ లియోన్ లీడ్ రోల్స్ చేశారు. మూడో భాగంలో తమన్నా నటించనున్నారు. ఈ పాత్ర చాలా గ్లామరస్గా ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్లో రొమాన్స్ మోతాదు కూడా ఎక్కువగానే ఉన్న విషయం రెండు భాగాలు చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. మూడో భాగంలో కూడా అలానే ఉంటుందని, మోడ్రన్ అమ్మాయిగా, ఆత్మగా తమన్నా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రంలో ఆయుష్ శర్మ సరసన ఆమె నటిస్తారు. తమన్నాకన్నా ఆయుష్ ఏడాది చిన్న. ఇంకా ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం. సందీప్ వంగా గతంలో 'యానిమల్'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్ఫుల్గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. -
రెండో కుమారుడి నామకరణం.. పేరు రివీల్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఏప్రిల్ 29న ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు రెండోసారి కుమారుడు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇప్పటికే ఆమెకు వాయి కపూర్ అహుజా అనే బాబు ఉన్నారు. తాజాగా తన రెండో కుమారుడి నామకరణ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు రివీల్ చేసింది.తన రెండో కుమారుడికి రుద్రలోఖ్ కపూర్ అహుజా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పేరుకు తన అన్నయ్య వాయుతో కలిసి వేదపరమైన రిలేషన్ ఉందని పేర్కొంది. ఈ పేరు వెనుక లోతైన, ఆధ్యాత్మిక అర్థం ఉందని తెలిపారు. రుద్ర అంటే మెరుపు, శ్వాస, స్వస్థత, పునరుద్ధరణతో ముడిపడి ఉన్న ఒక శక్తివంతమైన, పరివర్తన శక్తికి ప్రతీక అని సోనమ్ అన్నారు.. వాయువు జీవశక్తికి ప్రతీక కాగా.. రుద్ర శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. కాగా.. 2018లో వివాహం చేసుకున్న ఆనంద్ ఆహుజాను సోనమ్ కపూర్ పెళ్లాడింది. వీరిలో 2022లో మొదటి బిడ్డ జన్మించాడు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు. -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
నేను ఆరోగ్యంగానే ఉన్నాను
‘‘నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం... వాటిని నమ్మకండి’’ అని సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తెలిపారు. శక్తి కపూర్ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ వార్తలపై ఆయన స్పందించి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మృతి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఇలాంటి తప్పుడు వార్తలను అందరం ఖండించాలి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారాయన. విలన్గా, కమెడియన్గా దాదాపు 700 చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు శక్తి కపూర్. ఆయన కుమార్తె శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రెండోసారి తల్లైన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్ భామ ఆస్కా గోరాడియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాడి డిసెంబర్లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ బాబు పుట్టాడని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు పుట్టగా.. తాజాగా రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందారు. మే 1న తేదీన బిడ్డకు జన్మనివ్వగా.. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ బాలీవుడ్ బ్యూటీ అమెరికాకు చెందిన యోగా టీచర్, వ్యాపారవేత్త అయిన బ్రెంట్ గోబుల్ 2017లో పెళ్లాడింది. 2017లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2023లో కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి విలియం అలెగ్జాండర్ అని పేరు పెట్టారు. గతేడాది ఈ జంట తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు.ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. ఆస్కా గోరాడియా హిందీలో 'కుసుమ్', 'లాగీ తుఝ్సే లగన్', 'నాగిన్' వంటి సీరియల్స్తో మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా బిగ్బాస్ సీజన్-6లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) -
దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో డేట్ రివీల్ చేసింది. మే 14వ తేదీ నుంచి ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయితే ఓటీటీలో అన్కట్ వర్షన్ ఉంటుందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో దురంధర్-2 ఉండనుందని పేర్కొంది.అయితే ఇండియాలోని ప్రేక్షకులకు స్ట్రీమింగ్ తేదీ ఇంకా రాలేదు. మనదేశంలో జియో హాట్స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ప్రకటించనుంది. తాజా సమాచారం ప్రకారం మే 15 నుంచే ఇండియాలో దురంధర్-2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం దురంధర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
'బాలీవుడ్లో మర్యాద ఇవ్వరు'.. సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్..!
గతేడాది టూరిస్ట్ ఫ్యామిలీతో రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఫ్యామిలీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో తెలుగులో స్టార్ హీరోల సినిమాలు చేసింది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్.. బాలీవుడ్లో కన్నా సౌత్లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్ దక్షిణ నటులకు గౌరవం ఇవ్వరని సిమ్రాన్ అన్నారు. సౌత్ నటీనటులకు కేటాయించే హోటళ్లు, టికెట్లు, స్టాఫ్ విషయంలో కూడా బేరసారాలు చేస్తారని కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో హీరో దుల్కర్ సల్మాన్ కూడా ప్రస్తావించారని ఆమె గుర్తు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో దక్షిణాది నటులకు సరైన గౌరవం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో మాకు ఎంత గుర్తింపు వచ్చినా బాలీవుడ్లో పట్టించుకోరని అన్నారు. తాను హిందీ సినిమాలకు దూరంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని వెల్లడించారు. తాజాగా సిమ్రాన్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. -
షాకింగ్ ట్వీట్.. దురంధర్పై కాంగ్రెస్ లీడర్ ప్రశంసలు.!
రణ్వీర్సింగ్ దురంధర్ చిత్రంపై ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ ప్రశంసలు కురిపించారు. దురంధర్ పార్ట్-1 నిన్ననే చేశానని తెలిపారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆదిత్య ధర్ దర్శకత్వం అంటే చాలా ఇష్టమని ట్వీట్ చేశారు. ఈ మూవీలో రణ్వీర్ సింగ్ అద్బుతంగా నటించారని రాసుకొచ్చారు. ఈ మూవీని తెరకెక్కించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఎలాంటి ప్రాపగండ లేదని ఆమె స్పష్టం చేశారు.ఈ మూవీలో ఏ వర్గం వారిని చెడుగా చూపించలేదని షామా ట్విటర్లో తెలిపారు. కేవలం పాకిస్తాన్లోని పరిస్థితులను.. అక్కడున్న స్థానికుల గురించి మాత్రమే ఈ చిత్రంలో చూపించారని ఆమె అన్నారు. అక్కడి వాటిని మన ఇండియాలో ఉన్నవారితో పోల్చి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షామా మహమ్మద్పై ఒక్కసారిగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇచ్చిపడేసింది. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించగా సరైన సమాధానమిచ్చింది.ఎవరైనా ఈ మూవీలో ప్రాపగండ ఉందనుకుంటే అలాంటి వాళ్లు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని షామా మహమ్మద్ సలహా ఇచ్చింది. వెంటనే ఆ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఎక్కడా కూడా ముస్లిం వర్గాన్ని చెడుగా చూపించలేదని.. పాకిస్తానీలను మాత్రమే చూపించిందని తెలిపింది. ఇక్కడివాళ్లంతా కలిసి ఇండియన్ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెటిజన్కు ఇచ్చిపడేసింది. ఓ కాంగ్రెస్ లీడర్ దురంధర్ సినిమాను ప్రశంసించడంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ గతేడాది డిసెంబర్లో రిలీజైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ను షేర్ చేస్తూ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్-2 మార్చిలో రిలీజైంది. ఈ సినిమా ఏకంగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాలు కలిసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇందులో రణ్వీర్ సింగ్.. హంజా అలీ మజారీ అనే అండర్కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. It did not show Muslims in bad light but Pakistanis in bad light ! Shame on you for confusing the two. People like you spoil the name of Muslims in India. You are most welcome to leave India & take the citizenship of Pakistan https://t.co/dpNypFQ9VM— Dr. Shama Mohamed (@drshamamohd) May 7, 2026 -
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్కి ఇది మాత్రమే కాదు, జిమ్లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. -
నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సంజయ్ కపూర్ మరణం తరువాత అతని భార్య ప్రియా కపూర్, తల్లి రాణీ కపూర్ మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనా గ్రూప్ (Sona Group) వారసత్వ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఈ ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు కోర్టు మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఆశ్రయించాలని సూచించింది.మధ్యవర్తిగా మాజీ సీజేఐసోనా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రాణి కపూర్- ఆమె కోడలు ప్రియా కపూర్ (దివంగత సంజయ్ కపూర్ భార్య) మధ్య నడుస్తోంది. ఈ కేసులో విచారణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ గారిని ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించారు. ఇరు పక్షాలు సామరస్యపూర్వక పరిష్కారానికి అంగీకరించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.వివాదం ఏమిటి?2017లో తనకు స్ట్రోక్ వచ్చినప్పుడు,తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తన కుమారుడు సంజయ్ కపూర్, కోడలు ప్రియా కపూర్ తన ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేశారని తల్లి రాణి కపూర్ ఆరోపించారు. పరిపాలనాపరమైన ఫార్మాలిటీస్ అని చెప్పి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. గతేడాది జూన్లో సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైంది. ప్రియా కపూర్ సోనా గ్రూప్ సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ఆస్తిలో ఎటువంటి వాటా లేకుండా చేస్తున్నారని రాణి కపూర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ జె.బి. పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఇది కుటుంబ వివాదం కనుక కుటుంబానికే పరిమితం చేచాలని ఇది ఇతరులకు వినోదంగా మారకూడదని హితవు పలికింది. అలాగే . 80 ఏళ్ల వయస్సులో ఉన్న పిటిషనర్ కోర్టుల చుట్టూ తిరగడం కంటే, మధ్యవర్తిత్వం ద్వారా అన్ని సమస్యలను (A to Z) ఒకేసారి పరిష్కరించు కోవడం శ్రేయస్కరం అంటూ పెద్దావిడ రాణి కపూర్కి సూచించింది.కాగా సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తరువాత, ఆయన తొలి, మాజీ భార్య, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలలు ఆస్తులు, వారసత్వ హక్కులపై కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు. సంజయ్ కపూర్ ఆస్తులపై ప్రియా కపూర్ ఎటువంటి థర్డ్-పార్టీ హక్కులను సృష్టించకుండా కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది మరోవైపు ఈ వివాదం వార్తల్లోకి రావడంతో గురువారం ట్రేడింగ్లో సోనా బీఎల్ డబ్ల్యూ (Sona BLW) షేర్లు సుమారు 0.96శాతం బనష్టపోయాయి. ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
బాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్.. స్పెషలిస్ట్ ఎవరు?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్లో ఫ్రాంచైజీ సినిమాలు రూపొందుతున్నాయి. కానీ ఈ ట్రెండ్ బాలీవుడ్లో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఫ్రాంచైజీ సినిమాల సీక్వెల్స్తో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం సీక్వెల్ సినిమాలు చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్ స్టార్స్ ఎవరు? ఆ సినిమాల ప్రజెంట్ స్టేటస్ ఏంటి? అనే అంశాలపై ఓ లుక్ వేయండి.. ముగ్గురు కాదు... నలుగురు ఇడియట్స్ హిందీ చిత్రం ‘త్రీ ఇడియట్స్’ ఎంతటి బ్లాక్బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. ఆమిర్ ఖాన్ హీరోగా ఆర్. మాధవన్, శర్మాన్ జోషి కీలక పాత్రల్లో రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన సెటైరికల్ కామెడీ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘త్రీ ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధికారికంగా ప్రకటించారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమా కథ సిద్ధమైందని, రాజ్కుమార్ హిరాణి ప్రజెంట్ స్క్రీన్ ప్లే కోసం వర్క్ చేస్తున్నారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను సెట్స్కు తీసుకువెళ్తామని ఆమిర్ ఖాన్ తెలిపారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఉన్న కామెడీ ఈ సినిమా సీక్వెల్లోనూ ఉంటుందని, ప్రధాన పాత్రధారులందరూ ఆల్మోస్ట్ ఉంటారని ఆమిర్ పేర్కొన్నారు. అలాగే ‘త్రీ ఇడియట్స్’ కథ ముగిసిన పది సంవత్సరాల తర్వాత నుంచి సీక్వెల్ కథ ప్రారంభం అవుతుందని ఆమిర్ తెలిపారు. కాగా, ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్కు ‘ఫోర్ ఇడియట్స్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలోని నాలుగో ప్రధాన పాత్రధారిగా విక్కీ కౌశల్ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. రాజ్కుమార్ హిరాణి డైరెక్షన్లో వచ్చిన గత చిత్రాలు ‘సంజు, డంకీ’ల్లో విక్కీ కౌశల్ కీ రోల్స్ చేశారు. తాజాగా ‘ఫోర్ ఇడియట్స్’ సినిమాలోనూ విక్కీ కౌశల్ నటించనున్నారని, ఆల్రెడీ కథ వినిపించగా, విక్కీ ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. 2027 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. పఠాన్ మళ్లీ వస్తున్నాడు! షారుక్ ఖాన్ కెరీర్లో రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ‘పఠాన్’ చిత్రం కూడా ఒకటి. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం, డింపుల్ క΄ాడియా, అశుతోష్ రాణా ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023లో రిలీజై, బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో అప్పట్నుంచే ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్లో ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్గా ‘పఠాన్ 2’ రాబోతున్నట్లు షారుక్ ఖాన్ పరోక్షంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తోనే ‘కింగ్’ సినిమా చేస్తున్నారు షారుక్. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే ‘పఠాన్’ సినిమాను సెట్స్కు తీసుకుని వెళ్తారా? లేక మరో సినిమా తర్వాత, ‘పఠాన్ 2’ను టేకప్ చేస్తారా? అనేది చూడాలి. త్రిపాత్రాభినయం? బాలీవుడ్లో ‘క్రిష్’ ఫ్రాంచైజీ ఎంతటి సక్సెస్ఫుల్ సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ‘క్రిష్ 4’ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఆయన తండ్రి రాకేష్ రోషన్ పర్యవేక్షణ ఉంటుందట. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ నటించిన గత చిత్రం ‘వార్ 2’ బాక్సాఫీస్ అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో ‘క్రిష్ 4’ సినిమా సెట్స్కు వెళ్లడానికి కొంత సమయం పట్టేలా ఉంది. మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ ‘క్రిష్ 4’లో హృతిక్ రోషన్ త్రి΄ాత్రాభినయం చేయనున్నారట. ప్రియాంకా చో్ర΄ా మరో లీడ్ రోల్లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. 2006లో వచ్చిన ‘క్రిష్’, 2013లో వచ్చిన ‘క్రిష్ 3’ సినిమాల్లో ప్రియాంకా చో్ర΄ా భాగమయ్యారు. మరి... ‘క్రిష్ 4’లో ప్రియాంక నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్తో హృతిక్ రోషన్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా చేసిన తర్వాత ‘క్రిష్ 4’ చిత్రాన్ని సెట్స్కు తీసుకుని వెళ్తారా? లేక, ముందే మెగాఫోన్ పడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఖల్ నాయక్ రిటర్న్స్ బలరామ్ భల్లు ప్రసాద్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘ఖల్ నాయక్’ అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు సంజయ్ దత్. ఇప్పుడు ఈ ‘ఖల్ నాయక్’ ప్రస్తావన ఎందుకు అంటే... బలరామ్ భల్లుగా మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్నారు సంజయ్ దత్. అవును... మీరు ఊహించినది నిజమే. ‘ఖల్ నాయక్’ సినిమాకి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్కు ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఖల్ నాయక్’ సినిమాకు సుభాస్ ఘాయ్ దర్శకత్వం వహించగా, ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రానికి మాత్రం మరో దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఆ దర్శకుడు ఎవరు? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ కి మాత్రం సుభాష్ ఘాయ్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారట అలాగే ‘ఖల్ నాయక్’ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ సీక్వెల్లో మాత్రం గెస్ట్ రోల్స్ చేయనున్నారని బాలీవుడ్ సమాచారం. జియో స్టూడియోస్, అక్షా కాంబోజ్, సంజయ్ దత్ నిర్మించనున్న ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రం వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. కొత్త డాన్ ఎవరు? బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై డాన్స్ అంటే అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్లు గుర్తొస్తారు. 1978లో వచ్చిన ‘డాన్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా, ఆ తర్వాత వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2’ (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు. ఇవన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కాగా ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2 (2011)’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ 2023లో ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. రణ్వీర్ సింగ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా అధికారిక అనౌన్స్మెంట్స్ వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్కు వెళ్లలేదు. ఈ సినిమా విషయంలో రణ్వీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ల మధ్య అభి్ర΄ాయభేదాలు వచ్చాయనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఈ డిఫరెన్సెస్ సమసి΄ోయి, కొత్త డాన్గా రణ్వీర్సింగ్నే నటిస్తారా? లేక ఈ ప్లేస్ను మరో హీరో భర్తీ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైనా ‘డాన్ 3’ సినిమా ఉంటుందని, ఇటీవల ఓ సందర్భంలో ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారన్న వార్తలు ఉన్నాయి. ట్రెండీ లవ్స్టోరీ ‘కాక్టెయిల్’ సీక్వెల్ ‘కాక్టెయిల్ 2’ సిద్ధమైంది. ‘కాక్టెయిల్’ సినిమాకు దర్శకత్వం వహించిన హోమి అడజానియానే, ‘కాక్ టెయిల్ 2’ సినిమాకూ దర్శకత్వం వహించారు. కానీ నటీనటులు మారారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ‘కాక్టెయిల్’ సినిమాలో లీడ్ రోల్స్ చేయగా, సీక్వెల్లో మాత్రం షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. మోడ్రన్ లైఫ్స్టైల్, ట్రెండీ లవ్ రిలేషన్షిప్స్, యూత్ఫుల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. ‘కాక్టెయిల్ 2’ సినిమా మేజర్ షూటింగ్ను విదేశాల్లో చేశారు. ఇటలీలో ఎక్కవ చిత్రీకణ జరగింది. దినేష్ విజన్, లవ్రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్లో రిలీజ్ కానుంది. ప్రేమ... పెళ్లి... వినోదం వైవాహిక జీవితం సాఫీగా సాగినంతవరకూ అంతా బాగానే ఉంటుంది. అనివార్యమైన సమస్యలు వచ్చినప్పుడు అప్పటివరకూ సంతోషంగా ఉన్న దంపతుల జీవితాలు ఎలాంటి ఇరుకుల్లో పడతాయి? అనే కథాంశంతో రూ΄÷ందిన చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. కార్తీక్ ఆర్యన్, అనన్య ΄ాండే, భూమి పెడ్నేకర్ నటించిన తొలి భాగం ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019)కి దర్శకత్వం వహించిన ముదస్సర్ అజీజ్ సీక్వెల్ని కూడా తెరకెక్కించారు. నిజానికి 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో సంజీవ్ కుమార్, విద్యా సిన్హా, రంజితా కౌర్ ముఖ్య తారలుగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘పతీ పత్నీ ఔర్ దో’కి ఈ తొలి భాగం రీమేక్. ఇక... తాజాగా రూపొందిన సీక్వెల్ మార్చి 4న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో కాస్త జాప్యం జరగడంతో వాయిదా వేశారు. ప్రేమ, పెళ్లి, వినోదం నేపథ్యంలో రూ΄÷ందిన ‘పతీ పత్నీ ఔర్ వో దో’ని ఫైనల్లీ మే 15న విడుదల చేయాలనుకుంటున్నారు. సీక్వెల్ స్పెషలిస్ట్ బాలీవుడ్లో సీక్వెల్స్ అంటే అజయ్ దేవగన్ ప్రస్తావన ఉండకుండా ఉండదు. ఎందుకంటే... అజయ్దేవగన్ హీరోగా ఏదో ఒక సీక్వెల్ సినిమా సెట్స్పై ఉంటూనే ఉంటుంది. ‘సింగమ్, గోల్మాల్, ధమాల్, దృశ్యం’... ఈ నాలుగు ఫ్రాంచైజీ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన తాజా సినిమా ‘సింగమ్ ఎగైన్’ 2024లో రిలీజైంది. ప్రస్తుతం ‘గోల్ మాల్, దృశ్యం 3’ సినిమాలు సెట్స్పై ఉండగా, ‘ధమాల్ 4’ సినిమా జూలైలో రిలీజ్కు సిద్ధమైంది. ఫుల్ నవ్వుల్తో నాలుగో ధమాల్ 2007లో ఆరంభమైంది నవ్వుల ధమాల్. ఇప్పటివరకూ మూడు దఫాలుగా నవ్వుల ధమాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు నాలుగోసారి ఫుల్ నవ్వుల్తో సిద్ధమైంది. ‘ధమాల్’ (2007) ఫస్ట్ పార్ట్ని స్వీయదర్శకత్వంలో రూపొందించారు ఇంద్రకుమార్. ఆ ఫస్ట్ పార్ట్లో సంజయ్ దత్, రితేష్, దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా తదితరులు నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘డబుల్ ధమాల్’ (2011)లోనూ సంజయ్ దత్, రితేష్, దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, ఆశిష్ చౌదరి, జావేద్ జాఫ్రీ నటించారు. అలాగే మల్లికా శెరావత్, కంగనా రనౌత్ వంటి తారలు కూడా సీక్వెల్లో యాడ్ అయ్యారు. ఈ చిత్రం కూడా ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే రూ΄÷ంది, నవ్వులు పంచింది. ఆ తర్వాత ఇంకా నవ్విస్తా అంటూ మూడో భాగంగా ‘టోటల్ ధమాల్’ (2019)ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇంద్రకుమార్. ఈ సీక్వెల్లోనూ రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ నటించారు. కానీ సంజయ్ దత్ నటించలేదు. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ మూడో భాగం తారాగణంలో యాడ్ అయ్యారు. ఈ సినిమాకి అజయ్ దేవగన్ ఓ నిర్మాత కూడా. ఇక ఇప్పుడు ‘ధమాల్ 4’ అంటూ నాలుగో ధమాల్ సిద్ధమైంది. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్, మాధవన్, రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, జావేద్ జాఫ్రీ, రవి కిషన్ తదితరులు నటించారు. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ ఫుల్ కామెడీ మూవీని కూడా ఇంద్రకుమారే తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వాస్తవానికి మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ భారీ అంచనాల నడుమ విడుదలకు (మార్చి 19) సిద్ధమైన నేపథ్యంలో జూన్కి వాయిదా వేశారు. అయితే మరో భారీ సినిమా యశ్ ‘టాక్సిక్’ జూన్ 4న విడుదలకు సిద్ధం కావడంతో మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ కూడా వాయిదా పడింది. ఫైనల్లీ ‘ధమాల్ 4’ని జూలై 3న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.ఊటీలో గోల్మాల్ ప్రస్తుతం ‘గోల్మాల్ 5’ సినిమా చిత్రీకరణ కోసం అజయ్ దేవగన్ అండ్ గ్యాంగ్ ఊటీలో ఉన్నారు. రోహిత్ శెట్టి డైరెక్షన్లోని ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, అర్షద్ వార్షి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ కేము ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ‘గోల్మాల్’ తొలి భాగంలో నటించిన శర్మాన్ జోషి, దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ‘గోల్మాల్ 5’లో భాగం అయ్యారు. ప్రస్తుతం ఊటీలో జరుగుతున్న షూటింగ్లో ΄ాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ ‘గోల్మాల్ 5’ సినిమా రిలీజ్ కానుంది.అక్టోబరులో దృశ్యం 3 ‘దృశ్యం’ అనగానే మనకు మలయాళంలో మోహన్లాల్ గుర్తొస్తారు. కానీ బాలీవుడ్ సినిమా లవర్స్కి అజయ్ దేవగన్ గుర్తుకు రావొచ్చు. ఎందుకంటే.. మలయాళ ‘దృశ్యం’ సినిమా ఫ్రాంచైజీ హిందీ రీమేక్స్లో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటించి, ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అభిషేక్ ΄ాతక్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే హిందీ ‘దృశ్యం 2’లో నటించిన అక్షయ్ ఖన్నా ΄ాత్రలో మూడో భాగంలో జయదీప్ కనిపిస్తారట. టబు, శ్రియ శరణ్, రజత్ కపూర్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్లు మరోమాట... మలయాళ ‘దృశ్యం 3’ సినిమా మే 21న రిలీజ్ కానుంది. తెలుగు ‘దృశ్యం 3’ మూవీలో వెంకటేశ్, మీనా నటిస్తారు. కానీ తెలుగు వెర్షన్ ఎప్పుడు సెట్స్కు వెళ్తుందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇంకా హారర్ మూవీ ‘సైతాన్’కు సీక్వెల్గా ‘సైతాన్ 2’ సినిమా చేయనున్నట్లుగా అజయ్ దేవగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సీక్వెల్ సినిమాలు చేస్తున్నారు కనుక అజయ్ దేవగన్ను సీక్వెల్ స్పెషలిస్ట్ అని సరదాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలతో పాటు కంగనా రనౌత్ ‘క్వీన్ 2’, ‘తుంబాడ్ 2’ వంటి మరికొన్ని హిందీ చిత్రాల సీక్వెల్స్ సెట్స్కు వెళ్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. -
స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై అట్రాసిటీ కేసు
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. స్మృతి ఫ్రెండ్ విజ్ఞాన్ ప్రకాశ్ ఫిర్యాదుతో సంగ్లీ పోలీసులు.. పలాష్పై ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త సినీ, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ)ఏం జరిగింది?పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. ఓ సినిమా కోసం పలాష్, తన దగ్గర రూ.25 లక్షలు తీసుకున్నాడని విజ్ఞాన్ ఫిర్యాదు చేశాడు. ఆరు నెలలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి తనని మోసం చేశారని విజ్ఞాన్ ఆరోపించాడు. గతేడాది నవంబరులో మహరాష్ట్రలోని సంగ్లీ-అష్టా రహదారిపై ఉన్న టోల్ ప్లాజ్ దగ్గర డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే పలాష్.. తన కులాన్ని ఉద్దేశించి తిట్టాడని, బూతులతో అవమానించాడని విజ్ఞాన్ పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.గతేడాది నవంబరులోనే క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ పెళ్లి జరగాలి. కానీ అనుహ్యంగా రద్దయింది. పలాష్కి మరో అమ్మాయితో సంబంధం ఉండటం వల్ల ఇది రద్దయిందని రకరకాల రూమర్స్ వినిపించాయి. దీని గురించి అంతా మర్చిపోయారు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పలాష్పై స్మృతి స్నేహితుడు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఆ వార్తల్లో నిజం లేదు: కియారా అద్వానీ
‘‘టాక్సిక్’ సినిమాలో నా పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’’ అంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు.కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథకి అవసరం మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ చిత్రీకరించారట గీతూ మోహన్దాస్. అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆ సన్నివేశాలను తొలగించాలని కియారా కోరారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు కియారా అద్వానీ.‘‘టాక్సిక్’ మూవీలో నా పాత్రకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నేను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే విధంగా నాపై ఉన్న కొన్ని సీన్స్ తొలగించమని యూనిట్ని కోరాననే వార్తలు కూడా అవాస్తవం. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే’’ అని స్పష్టం చేశారు కియారా. ఇదిలా ఉంటే.. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ‘టాక్సిక్’ జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ కావడం లేదంటూ యశ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. -
కాన్స్ సందడి షురూ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి మొదలైంది. ఈ నెల 12 నుంచి 23 వరకు ఫ్రాన్స్ వేదికగా 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రస్తుతం ఈ ఫెస్టివల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రధాన పోటీ విభాగాలకు దక్షిణ కొరియా సినీ దర్శకుడు పార్క్ చాన్–వూక్ జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇక రెండు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఈ చిత్రోత్సవాలకు హాజరవుతున్న ఐశ్వర్యా రాయ్ ఈ ఏడాది కూడా హాజరు కానున్నారని తెలిసింది. అలాగే గత ఏడాది తొలిసారి ఈ ఫెస్టివల్కు హాజరైన ఆలియా భట్ ఈ ఏడాది కూడా వెళ్తారని బాలీవుడ్ సమాచారం.‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ ప్రస్తుత డైరెక్టర్ అశుతోష్ గోవారీకర్, బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వెళ్లనున్నారని తెలిసింది. పంజాబీ సినిమా ‘చర్దికలా’, మలయాళం సినిమా ‘బాలన్: ది బాయ్’ వంటి భారతీయ సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సభ్యులు ఈ ఫెస్టివల్కు హాజరవుతారు.ఇక కాన్స్ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్న తొలి పంజాబీ సినిమాగా ‘చర్దికలా’ నిలిచింది. అమ్మీ విర్క్, రూపి గిల్, హిమ్మత్ సంధు లీడ్ రోల్స్లో ఈ సినిమాను అమర్జిత్ సింగ్ సరోన్ దర్శకత్వంలో పింకీ ధాలివాల్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్స్లో రిలీజ్ కానుంది. అంటే... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన అనంతరం ఈ సినిమా థియేటర్స్లో విడుదల అవుతుంది. -
అతనితోనే జాన్వీ కపూర్ పెళ్లి.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్లో రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్.. శిఖర్తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది. -
ఒకప్పుడు సల్మాన్ హీరోయిన్.. ఇప్పుడేమో టిఫిన్ సెంటర్ నడుపుతూ
సినిమా తారల తళుకుబెళుకుల వెనక చీకటి, కన్నీటి గాధలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి బయటకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ హీరోయిన్ దీనస్థితి విషయం వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ లాంటి గుర్తింపు ఉన్న హీరో సరసన నటించినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడేమో టిఫిన్ బండి నడుపుతూ చాలా సాధారణంగా బతికేస్తోంది. ఇంతకీ ఎవరీమె? ఏంటి స్టోరీ?(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)పూజా దద్వాల్. ఈ పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 1995లో వచ్చిన వీర్గతి సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన హీరోయిన్గా చేసింది. కానీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఈమె యాక్టింగ్తో మెప్పించింది. దీనికంటే ముందు 'జీనే నహీ దూంగీ' చిత్రంలోనూ నటించింది. అయితే వెండితెరపై సక్సెస్ రాకపోయేసరికి టీవీల్లో ప్రయత్నించింది. ఇక్కడా సేమ్ సీన్ రిపీటైంది. ఇక యాక్టింగ్ వల్ల కాదనుకుని పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిలైంది.భర్తతో కలిసి సంతోషంగా ఉన్న టైంలో టీబీ మహమ్మారి ఈమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఓ రోజు వీక్నెస్తో కిందపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా టీబీ అని తేలింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తమామ ఈమెని వదిలించుకోవాలని చూశారు. ముంబైలో వదిలేశారు. ఆఖరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకోలేదు. దీంతో అనాథ అయిపోయిన ఈమె.. చేతిలో డబ్బుల్లేక అల్లాడిపోయింది. సరిగ్గా ఆ టైంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ ఈమెని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే తనతో పాటు నటించిన సల్మాన్ని సాయం అడుగుదామనుకుని ఓ వీడియో చేసింది.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)పూజా చేసిన వీడియో సల్మాన్ వరకు చేరగా.. ఈమెకు సాయం చేసేందుకు అతడు ముందుకొచ్చాడు. పరిస్థితి చూసి చలించిపోయాడు. చికిత్స, ఆహారం, బట్టలు.. ఇలా అవసరమైన ప్రతిదీ ఈమెకు అందేలా చూశాడు. దీంతో చనిపోతుందనుకున్న పూజా.. ఐదు నెలల్లో కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఇలా ఉన్నానంటే సల్మాన్ ఖానే కారణమని, ఆయన మేలు మరవలేను అని ఎమోషనల్ అయింది.కోలుకుని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ముంబైలో చిన్న అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చింది. 2020లో 'షుక్రానా' అనే పంజాబీ మూవీలో నటించింది. ఇదేమైనా తన తలరాత మారుస్తుందని అనుకుంటే.. ఇదీ నిరాశపరిచింది. ఈమె పరిస్థితి చూడలేకపోయిన దర్శకుడు రాజేంద్ర సింగ్.. టిఫిన్ బండి పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అవసరమైన సామాగ్రి కొనిచ్చి సాయం చేశాడు. అప్పటినుంచి టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగిస్తోంది. గతంలోనే ఈమె స్టోరీ బయటకొచ్చినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?) -
తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?
సినిమా సెలబ్రిటీల ప్రేమ అనేది చాలా సాధారణమైన విషయం. ప్రేమలో పడటం, డేటింగ్ చేయడం లాంటివి వింటూనే ఉంటాం. హీరోయిన్ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో గతంలో డేటింగ్ చేసింది. మరి ఏమైందో ఏమో వీళ్లిద్దరూ విడిపోయారు. అలాంటిది తాజాగా తమన్నా చేసిన కామెంట్స్.. మళ్లీ ఈమె ప్రేమలో పడిందా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి.(ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)'ప్రేమ అనేది ఓ లావాదేవి కాదు. మనం ఎదుటి వ్యక్తికి ప్రేమ ఇస్తున్నప్పుడు తిరిగి దాన్ని ఆశించడం కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్ని సార్లయినా ప్రేమలో పడే అవకాశముంది. అది కేవలం ఒక్కరితే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డిసైడ్ అయితే ఎన్నిసార్లయినా ప్రేమ పుడుతుంది. బంధాలు మనల్ని బంధించేవిగా ఉండకూడదు. మన ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి' అని తమన్నా చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.'లస్ట్ స్టోరీస్ 2' షూటింగ్ టైంలో తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ వీళ్లిద్దరూ విడిపోయారు. తమన్నా ఇలా డౌట్ వచ్చే కామెంట్స్ చేస్తుండగా.. విజయ్ వర్మ కూడా మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రీసెంట్గానే ఒకటి రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!) -
ప్రియుడితో బ్రేకప్.. హీరోతో డేటింగ్..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియాకు సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఆమెకు తన బాయ్ఫ్రెండ్ వీర్ పహారియాతో బ్రేకప్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు తారా కానీ.. పహారియా కానీ స్పందించలేదు. విడిపోవడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదుఅయితే అంతలోనే తారా సుతారియాపై మరో రూమర్ వైరల్గా మారింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో ఆమె డేటింగ్లో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదిక ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడిది బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. కాగా.. గతంలో ఆదిత్య రాయ్ కపూర్.. హీరోయిన్ అనన్య పాండేతో రిలేషన్ కొనసాగించారు. అయితే గతేడాది చివర్లో ముంబైలో జరిగిన కచేరీ వివాదం తర్వాత తారా, వీర్ పహారియాపై బ్రేకర్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బాలీవుడ్ భామ యశ్ చిత్రం టాక్సిక్లో కనిపించనుంది. -
ముగ్గురితో రొమాన్స్.. ఫుల్ కామెడీగా ట్రైలర్
రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పతి పత్నీ ఔర్ వో దో. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే పెళ్లి తర్వాత మరో ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్ నేపథ్యంలో కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు అమ్మాయిలను ఎలా డీల్ చేశాడన్నదే పతి పత్నీ ఔర్ వో దో. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రజాపతి పాండే పాత్రలో ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆడవాళ్ల శరీరం లైంగిక ఆకర్షణ కోసమే కాదు.. ట్రోలర్స్పై నటి ఫైర్!
మహిళలపై బాడీ షేమింగ్ చేసేవాళ్లపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ స్వరా భాస్కర్ మరోసారి ఫైర్ అయింది. ఆడవాళ్ల శరీరం కేవలం గ్లామర్ ప్రదర్శించడానికి, లైంగిక ఆకర్షణ కోసమే కాదని.. ఒకరికి ప్రాణం పోయడం వంటి గొప్ప పని కూడా చేస్తుందని, అలాంటప్పుడు శరీరంలో మార్పులు రావడం చాలా సహజమని, వాటిని స్వీకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.తను వెడ్స్ మను’, ‘రాంజనా’ వంటి సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వరా భాస్కర్..2023లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. బరువు పెరిగి కాస్త లావుగా మారింది. అయితే తాజాగా తన పాత ఫోటోని, ప్రస్తుత ఫోటోని కలిపి ఒక కొలాజ్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త వైరల్ కావడం.. కొంతమంది నెటిజన్స్ ‘గుర్తుపట్టలేనంత మారిపోయింది’. ‘ఇక ఆమె కెరీర్ క్లోజ్’ అంటూ బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు.వీటిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఒక ప్రాణానికి జన్మనివ్వడం సాధారణ విషయం కాదు. ఆ సమయంలో బాడీ ఎన్నో మార్పులకు గురవడం చాలా సహజం. బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్లీ ఇంతకుముందులానే ఉండాలని ఒత్తిడి చేయడం సరికాదు. ఆడాళ్లు షోకేస్లో పెట్టే అందాల బొమ్మలు అసలే కాదు’ అంటూ ఇన్స్టాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.‘నేను ఈ మాటను పదే పదే ప్పాలనుకుంటున్నాను. మహిళల శరీరం కేవలం ఆకర్షణ కోసం లేదా గ్లామర్ కోసం కాదు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత మునపటిలా మారాలని అనుకోలేదు. ఎందుకంటే మీకు బిడ్డ పుట్టాక, మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. మీరు జీవితాంతం తల్లిదండ్రులుగానే ఉంటారు. జీవితం పూర్తిగా మారిపోతుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. నిజమే.. మనం మన పాత జీవితాన్ని, చిన్ననాటి స్వేచ్ఛా లైఫ్ ను, సన్నగా ఉన్న శరీరాన్ని మిస్ అవుతాం. కానీ మన చిన్ననాటిలాగే ఉండాలని అనుకోవడం, మన శరీరాన్ని గతంలోకి బలవంతంగా నెట్టడం ఒకరకమైన క్రూరత్వం.మన శరీరం మరో మనిషికి జన్మనిచ్చింది. కనుక శరీరం మారడం సహజం. కెమెరాల కోసం, అపరిచితుల కోసం ఆకర్షణీయంగా కనిపించాలని ఒత్తిడి పెంచుకోవడం తెలివి తక్కువ పని. డెలీవరీ తర్వాత బరువు పెరిగిన మహిళలపై బాడీ షేమింగ్ చేయడం నీచమైన పని.ఒక మహిళ..తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా బతకాలి. అలా అని నేను ఫిట్నెస్గా ఉండకూడదని చెప్పడం లేదు. మన శరీరాలను గౌరవించుకోవడానికి, మనకు సరిపోని పరిమితుల్లో మనల్ని మనం బంధించుకోవడం ఆపడానికి చేసే వాదన. జీవితం అనేది మన అంతరాత్మలోకి, ముందుకు సాగే ఒక ప్రయాణం. మన శరీరాలకు కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంలో తప్పులేదు’ అని స్వరా భాస్కర్ ఇన్స్టాలో రాసుకొచ్చింది.ఇక నటీనటులు గ్లామర్గా ఉండాలని చెప్పేవాళ్లకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది.‘నటన అనేది టాలెంట్కు సంబంధించిన విషయం. దానికి మనిషి బరువుతోనో, గ్లామర్తోనో అస్సలు సంబంధం లేదు’ అని స్వరా భాస్కర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారగా.. పలువురు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
కేప్ టౌన్లో కింగ్
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ల్యాండ్ అయ్యారు కింగ్. ‘పఠాన్’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో షారుక్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘కింగ్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరుగుతోంది. షారుక్ – దీపిక పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ పాట, ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.కాగా కేప్ టౌన్లో షారుక్–దీపికల మధ్య చిత్రీకరిస్తున్న కొన్ని విజువల్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. ‘‘కింగ్’ సినిమా సెట్స్ నుంచి లీకైన ఫొటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయకండి. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు మా టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. థియేటర్స్లో బిగ్ స్క్రీన్పై సర్ప్రైజెస్ కోసం వేచి చూద్దాం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు సిద్ధార్థ్ ఆనంద్. గౌరీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మిస్తున్న ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ కానుంది. -
సాయిపల్లవి సినిమాని పట్టించుకోవట్లేదు.. దారుణమైన కలెక్షన్స్!
సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగులో చాలామంది ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఆయా సినిమాలు ఫెయిలైనా సరే ఈమె యాక్టింగ్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇప్పటివరకు ఈమె చేసిన చిత్రాలు ఫెయిలైనా సరే కాస్తంత డబ్బులు రాబట్టాయి. కానీ హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' మాత్రం తొలిరోజే దారుణమైన కలెక్షన్స్తో ఈమెకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం? ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ప్రీమియర్స్ వేయగా.. సినిమా చూస్తూ ఆమిర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తాడు. అయినా సరే ఈ మూవీని జనాలు పట్టించుకోవట్లేదు. చెప్పాలంటే రిలీజ్కి ముందే బజ్ లేదు. పెద్దగా బుకింగ్స్ కూడా జరగలేదు. సరే థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుంటే హిట్ అవ్వొచ్చని అనుకున్నారు. కానీ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ బాగానే చేసిందని అంటున్నారు గానీ మిగతా విషయాల గురించి పెద్దగా మాట్లాడట్లేదు. చాలామంది మిడ్ రేంజ్ హీరోల కంటే సాయిపల్లవికి బాగానే గుర్తింపు ఉంది. ఇది కూడా 'ఏక్ దిన్' విషయంలో పనిచేసినట్లు లేదు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరుతో తీసుకొచ్చారు గానీ ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలీదు. షోలు కూడా పదికి మించి లేవంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.థాయ్ సినిమా 'వన్ డే' రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్ నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ విషయానికొస్తే తొలిరోజు రూ.కోటి అటుఇటుగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ పాజిటివ్గా లేదు, కలెక్షన్సే పెద్దగా రావట్లేదు. ఈ అంశాలన్నీ చూస్తుంటే సాయిపల్లవికి బాలీవుడ్లో ఫస్ట్ స్ట్రోక్ తగిలినట్లే కనిపిస్తుంది. వీకెండ్ పూర్తయితే అప్పుడు వచ్చే వసూళ్ల బట్టి ఫలితంపై క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్) -
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
న్యూఢిల్లీ : నటి ఆకాంక్ష రంజన్ కపూర్ (32) తాను తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్న విషయాన్ని సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన ఎగ్ ఫ్రీజింగ్ నిర్ణయం వెనుక గల కారణాన్ని ఆమె మరింత వివరంగా తెలియజేశారు.సోహాఅలీ ఖాన్ పాడ్కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' తాజా ఎపిసోడ్లో, ఆకాంక్ష కపూర్ తాను తన అండాలను ఎందుకు ఫ్రీజ్ చేయించుకోవాలనుకున్నదీ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో, ఆకాంక్ష తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్నారు. కడుపులో పెద్ద బెలూన్ ఉన్నట్టేఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల తాను చాలా నొప్పిని అనుభవించానని ఆకాంక్ష తెలిపారు. శారీరకంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అయితే ఇది అందరికీ ఇలాగే జరుగుతుందనుకోను, కానీ తన విషయంలో మాత్రం విపరీతమైన నొప్పి ని భరించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. 2-3 రోజుల పాటు నేను సరిగ్గా నడవలేకపోయాను. కడుపులో ఏదో పెద్ద బెలూన్ ఉన్నట్లుగా అనిపించేది, కనీసం నిటారుగా నిలబడలేకపోయేదాన్ని. తాను చాలా సన్నగా ఉండటం వల్ల అలా అనిపించి ఉండవచ్చని డాక్టర్ చెప్పారని వివరించింది.ఎగ్ ఫ్రీజింగ్ వెనుక రెండు ప్రధాన కారణాలుతన స్నేహితులు గర్భం దాల్చుతున్న సమయంలో అందరూ పలకరిస్తుండటంతో, ఆమె కూడా AMH (Anti-Mullerian Hormone) టెస్ట్ చేయించుకున్నారు. తన వయస్సుతో పోలిస్తే ఆమెలో ఈ హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉందని తేలింది. (AMH టెస్ట్ ద్వారా ఒక మహిళలో అండాల నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు). తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతుండటం, సంతానలేమి సమస్యలు ఎదుర్కోవడం చూసి ఆమె ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆకాంక్ష తెలిపారు.ఇది భయం కాదు..ఇన్సూరెన్స్ భయంతో తీసుకున్న నిర్ణయం కాదని, తన భవిష్యత్తు కోసం చేసిన అని స్పష్టం చేసిన ఆకాంక్ష, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమన్నారు. ఇదొక బీమా లాంటిదని పేర్కొన్నారు.ముందే చేసి ఉండాల్సింది..ప్రస్తుతం తనకు 32 ఏళ్లని, అసలైతే 20 ఏళ్ల వయస్సులోనే లేదా 20ల మధ్యలో ఈ ప్రక్రియ చేసి ఉంటే అండాలు మరింత ఆరోగ్యంగా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఇప్పటికే ఆలస్యం చేశానని ఇది ఎగ్ ఫ్రీజింగ్ గురించి ముందే తెలిసి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. కాగా ఆకాంక్ష రంజన్ కపూర్, దర్శకుడు శరణ్ శర్మ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బీ-టౌన్లో హాట్ టాపిక్గా మారింది. ఆకాంక్ష రంజన్ కపూర్ 'గిల్టీ' (Guilty) వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
ఆ డైరెక్టర్ 10 సార్లు లైంగికంగా వేధించాడు.. మోనాలిసా సంచలన ఆరోపణలు!
కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో స్టార్గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు తరచు వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్గా మారిన మోనాలిసా.. ఒకవైపు సినిమాల్లోనే నటిస్తూనే.. ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం..వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం..విచారణలో ఆమె మైనర్ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు నమోదు అవ్వడం..అంతలోనే ఆమె ప్రెగ్నెంట్ అని ప్రకటించడం..ఇలా గత కొద్ది రోజులుగా మోనాలిసా పర్సనల్ లైఫ్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం ముగియకముందే మరో ఈ వైరల్ భామ మరో బాంబ్ పేల్చింది. తనను హీరోయిన్ గా మార్చి, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. అతను తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిశ్రాతో పాటు మరో ముగ్గురిపై కూడా ఆమె పోక్సో చట్టం కింద ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలన సృష్టించింది.ఫిర్యాదులో ఏముంది?‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని మోనాలిసా ఫిర్యాదు పేర్కొంది.‘షూటింగ్ సమయంలో దర్శకుడు నాతో పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పినా.. పట్టించుకోలేదు. షూటింగ్ మొత్తంలో అతను నన్ను దాదాపు 10 సార్లు లైంగికంగా వేధించాడు. మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ అనుచితంగా ప్రవర్తించాడు’ అని ఫిర్యాదులో పేర్కొంది.న్యాయవాదిపై కూడా ఫిర్యాదుమోనాలిసా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అనిల్ విలయిల్ పేరు కూడా ఉంది.అనిల్ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. గురువారం కోర్టుకు హాజరైన మోనాలిసా, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనలు మధ్యప్రదేశ్లో జరిగినట్లు తెలుస్తుండటంతో, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
సాహో నటి విడాకులు.. పెళ్లైన ఐదేళ్లకే బంధానికి గుడ్ బై
ప్రముఖ నటి ఎవలీన్ శర్మ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. తమ ఐదేళ్ల వివాహా బంధానికి గుడ్ బై చెప్పనుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయంపై ఓ ఛానెల్లో మాట్లాడిన ఆమె.. అవును మేమిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. పిల్లల విషయంలో ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి మేము గోప్యతను కోరుకుంటున్నామని అన్నారు. కాగా.. నటి ఎవలిన్ శర్మ 2021 మే 15న డెంటల్ సర్జన్ అయిన తుషాన్ బిందీని పెళ్లాడారు. వీరికి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లైన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహపూర్వకంగా తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఎవలీన్ తెలిపారు. తమ పిల్లలను మాత్రం కలిసే పెంచుతామని కూడా స్పష్టం చేశారు. కాగా.. ఎవలీన్ శర్మ 2012లో హిందీ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. 2019 వరకు పలు హిందీ చిత్రాలలో కనిపించారు. ఆమె 2013లో విడుదలైన 'యే జవానీ హై దీవానీ' మూవీలో మెప్పించింది. అంతేకాకుండా 2014లో విడుదలైన 'యారియాన్', 'మై తేరా హీరో' చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులో ప్రభాస్ మూవీ సాహోలో ఐషా పాత్రలో ఆకట్టుకుంది. -
షారూక్ ఖాన్కు ఈగో ఎక్కువ.. అందుకే నచ్చలేదు: సింగర్ అభిజిత్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ గురించి ఆయన మాట్లాడారు. షారూక్తో వచ్చిన విభేదాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సూపర్స్టార్ క్షమాపణ చెప్పకపోవడం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. షారూక్ ఖాన్కు ఉన్న అహం వల్లే వృత్తిపరంగా ఆయన సినిమాలకు పనిచేయడం లేదని అన్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన షారూక్తో విభేదాలపై స్పందించారు. విభేదాలకు అదే కారణం..పాడ్కాస్ట్లో అభిజీత్ మాట్లాడుతూ.. 'షారుఖ్ ఖాన్కు అహం ఎక్కువ. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. అందే మా మధ్య విభేదాలకు కారణమైంది. షారుఖ్ నా కంటే చిన్నవాడు.. అయినా ఫరా ఖాన్ భర్త అతన్ని అంతగా దూషించినప్పుడు కూడా షారుఖ్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఒక కుక్కకు షారూఖ్ అని పేరు కూడా పెట్టాడు.. అయినా వారిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అయినా మీరు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేకపోవడం నన్ను బాధించింది. మీరు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ నాకు క్షమాపణ చెప్పలేదు” అని అన్నారు. ఇదే తనపై భావోద్వేగమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు.షారూఖ్ తాను చేసిన తప్పును అంగీకరించకపోవడమే తనను ఎక్కువగా బాధించిందని అభిజిత్ అన్నారు. అందుకే షారూక్ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. అయితే తన నిర్ణయం అహంకారంతో కాదని.. వ్యక్తిగత నిరాశతోనే తీసుకున్నానని సింగర్ స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో షారూక్ కోసం తాను ఇతర నటుల కోసం కూడా పాడటం మానేశానని అన్నారు. షారుక్ ఖాన్తో సన్నిహితంగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోవడం లేదని అనిపించేదని అభిజీత్ భట్టాచార్య అన్నారు. నాకు సరైన గుర్తింపు, క్రెడిట్ లేకపోవడం వల్లే షారూక్తో విభేదాలు తలెత్తాయని గతంలో అభిజీత్ చాలాసార్లు వెల్లడించారు. కాగా.. సింగర్ అభిజిత్ 'బాద్షా', 'మై హూ నా' వంటి చిత్రాలలోని పాటలకు తన గాత్రం అందించారు. మై హూ నా మూవీ టైమ్లో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. అభిజిత్ చివరిసారిగా షారూక్ బిల్లు చిత్రానికి పనిచేశారు. -
మైక్ కిందపడేసి వెళ్లిపోయాడు.. అవమానంగా అనిపించింది: ప్రియాంక
చాలా మంది తారల మాదిరే తాను కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అంటోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ‘కెరీర్ ప్రారంభంలో డ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. నటన పరంగా ఓకే కానీ..డ్యాన్స్ వచ్చేది కాదు. కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్ మరిచిపోయేదాన్ని. నా పక్కన ఉన్న కోస్టార్ ఆ స్టెప్పులు అద్భుతంగా చేసేవారు. నేనేమో వారికి సరిపోయేలా స్టెప్పులు వేయలేక ఇబ్బంది పడేదాన్ని. ఓసారి దక్షిణాఫ్రికాలో ఓ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ నాపై సీరియస్ అయ్యాడు. నువ్వు అందాల పోటీ నుంచి వచ్చిండొచ్చు, అందంగా ఉండొచ్చ.. కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో అంటూ మైక్ కిందపడేసి సెట్ నుంచి వెళ్లిపోయాడు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. దీన్ని సవాలుగా తీసుకొని డ్యాన్స్ నేర్చుకున్నా. అప్పట్లో ప్రతి రోజు దాదాపు ఆరు గంటల పాటు కత్రినా కైఫ్తో కలిసి ప్రాక్టీస్ చేశా’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.ఇక హాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ‘బాలీవుడ్లో స్టార్ అయినంత మాత్రాన అక్కడి వాళ్లు ఆదరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఒక దేశంలో మీకు పేరు ప్రఖాత్యులు ఉన్నంత మాత్రాన మరో దేశంలో కూడా అదే విధంగా గౌరవం పొందాలని ఆశించకూడదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులను సంపాదించుకోవాలి. ప్రజల నుంచి గౌరవం పొందాలంటే బాగా కష్టపడాలి. ఇప్పుడు నేను అక్కడ సూపర్ స్టార్ కాదు. కానీ నటిగా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నా’ అని ప్రియాంక పేర్కొంది. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నేరుగా ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ కర్తవ్య. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్పై రూమర్స్ రాగా.. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాని విధి వర్సెస్ కర్మ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీసు అధికారి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. #Kartavya 🔥#SaifAliKhan in a gripping tale of duty vs conscience ⚖️Directed by Pulkit 🎬Streaming on Netflix from May 15 ✅ pic.twitter.com/wSQiOCnuss— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 30, 2026 -
రూ. 30 వేల కోట్ల ఆస్తి : సీనియర్ నటి పిల్లలకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జూన్లో లండన్లో మరణించిన సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన రూ. 30,000 కోట్ల ఆస్తులను పరిరక్షించాలని హైకోర్టు ఆదేశించింది. సంజీవ్ భార్య ప్రియా కపూర్ వాటిని అమ్మకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అతని బ్యాంకు ఖాతాల కార్యకలాపాలను కూడా కోర్టు పరిమితం చేసింది.వారసత్వంపై ఆయన కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.సంజయ్ కపూర్, కరిష్మా పిల్లలైన కియాన్, సమైరా కపూర్లకు, ఆయన మూడో భార్య ప్రియా సచ్దేవా కపూర్కు మధ్య నెలకొన్న తీవ్రమైన, కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వసంజయ్ కపూర్ విదేశాల్లో ఉన్నప్పుడు ఫోర్జరీ చేసిన వీలునామాను ప్రియా కపూర్ సృష్టించారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో ఖరీదైన పోలో గుర్రాలు, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీలు, విలువైన పెయింటింగ్స్ మరియు స్థిరాస్తులను కావాలనే దాచి పెట్టారని వారు వాదించారు.వీరి పిటిషన్ను విచారించిన కోర్టు సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకుండా ప్రియా కపూర్పై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆస్తులు కరిగిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా కోర్టు నిలిపివేసింది.వీలునామాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రియా కపూర్పైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వీలునామా నకిలీదని తేలితే, అప్పటికే ఆస్తులు చేతులు మారి ఉంటే అది అన్యాయం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం పిల్లలతోనే కాకుండా, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, సోదరి మందిరా కపూర్ కూడా ప్రియా కపూర్తో వివాదంలో ఉన్నారు. గతంలో ఈ వివాదాన్ని ఉద్దేశించి "మురికి బట్టలను బహిరంగంగా ఉతకవద్దు" అని కోర్టు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: 34 ఏళ్ల మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్ బంగ్లాలో ఎముకలుకాగా 53 ఏళ్ల వయసులోనే సంజయ్ కపూర్ గత ఏడాది జూన్ 12న లండన్లో పోలో ఆడుతూ అకస్మాత్తుగా కన్నుమూయడం దిగ్భ్రాంతి రేపింది. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తొలుత భావించారు. తన కొడుకు మరణంలో ఏదో అతని తల్లి అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. అయితే, ఆగస్టులో బ్రిటీష్ వైద్య అధికారులు ఆయన సహజ కారణాల వల్లే (గుండె సంబంధిత వ్యాధి) మరణించారని ధృవీకరించారు.ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు! -
సరోగసీ ప్రెగ్నెన్సీ ప్రకటించిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ, నటి సంభావన సేథ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సరోగసీ ద్వారా తమ బిడ్డను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సంభావన సేథ్, ఆమె భర్త అవినాష్ ద్వివేది తెలిపారు.కాగా.. ఈ జంట చాలాసార్లు ఐవీఎఫ్ ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాకపోవడంతో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. 2024లో సంభావనకు మొదటి త్రైమాసికంలోనే ఓసారి గర్భస్రావం జరిగింది. ఆ టైమ్లో తాను శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించింది. అప్పుడు మూడు నెలల వ్యవధిలో తాను 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అది చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. సినీ కెరీర్ పరంగా చూస్తే సంభావన సేత్ 2025లో వచ్చిన 'మండల మర్డర్స్' చిత్రంలో చివరిసారిగా కనిపించింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) -
ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్తో రణ్వీర్–ఆదిత్య ధర్ ?
దురంధర్ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్వీర్ సింగ్, దర్శకుడు ధర్ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ వెంటనే మరో చిత్నాన్ని చేయబోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇటీవల ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ ఇద్దరూ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్వీర్కు చెప్పాడట. కథ నచ్చడంతో రణ్వీర్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్ను ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్వీర్తో సినిమా చేయాలని నిర్ణయించారు. -
లక్ష రూపాయల పందెం.. హై హీల్స్తో స్టార్ హీరో డ్యాన్స్..!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన డ్యాన్స్తో అదరగొట్టేశారు. హౌస్ఫుల్ 5 చిత్రంలోని 'లాల్ పరి' పాటకు తన డ్యాన్స్తో మెప్పించారు. అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తోన్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫినాలే ఎపిసోడ్లో స్టెప్పులతో వేదికపై అలరించారు. అయితే ఈ వేడుకలో హై హీల్స్తో అక్షయ్ డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా అక్షయ్ కుమార్ చిన్న పరీక్ష పెట్టింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. హైహీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ విసిరింది. ఒకవేళ అక్షయ్ డ్యాన్స్ మధ్యలో ఆగిపోతే.. ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలని చిన్న పందెం కాసింది. దీంతో అక్షయ్ హై హీల్స్తో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో అక్షయ్తో పాటు ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ సైతం కాలు కదిపారు. ఒక నిమిషం డ్యాన్స్ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసిన అక్షయ్ను ఫరా ఖాన్ అభినందించారు.కాగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు ఫరా ఖాన్, భూమి అతిథులుగా హాజరయ్యారు. హైహీల్స్లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత అక్షయ్ సరదాగా మహిళలకు సెల్యూట్ చేశారు. హైహీల్స్లో నడవడం, డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తనకు అర్థమైందన్నారు.బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే భూత్ బంగ్లా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ 'వెల్కమ్ టు ది జంగిల్' అనే మూవీతో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది. Akshay dancing in heels wasn’t on my 2026 bingo card… probably not in Akshay Kumar’s plan either 😭 https://t.co/AL7S5ck2s9 pic.twitter.com/6rCnNQOVrm— PintuX (@pintya_348) April 28, 2026 -
గుడ్ న్యూస్ చెప్పిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్ హిట్ ఫిల్మ్ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఆమిర్ ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్’. రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. తాజాగా ‘3 ఇడియట్స్’ సినిమా సీక్వెల్ పనులు మొదలయ్యాయని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ సీక్వెల్ గురించి ఓ ఆంగ్ల మీడియాతో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘3 ఇడియట్స్’కి సీక్వెల్ చేయనున్నాం... కథ విన్నాను. నాకు నచ్చింది. మొదటి భాగంలో ఉన్న ప్రధాన పాత్రధారుల జీవితాల్లో పదేళ్లు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది? అనే అంశంతో సీక్వెల్ కథ ఉంటుంది. అలాగే తొలి భాగంలోని కామెడీ కంటిన్యూ అవుతుంది. దర్శకుడు రాజ్ ప్రస్తుతం స్క్రిప్ట్కు మెరుగులు దిద్దుతూ, స్క్రీన్ప్లేను సెట్ చేసే పనిలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు. -
20 వంద కోట్ల హిట్స్.. అక్షయ్ కుమార్ అరుదైన ఘనత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 2012లో హౌస్ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్లు కూడా 100 కోట్ల క్లబ్లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. -
దీప్వీర్ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్
బాలీవుడ్ నటుడు, రణవీర్, దీపికా పడుకోన్ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో తన పెర్ఫామెన్స్తో దీప్వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్ సినిమా భారీ హిట్ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్కు దువా తన టాలెంట్తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్. 'ధురందర్' స్టార్ రణ్వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్ చేశారు. షో అనంతరం, రణవీర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్కు హాజరైందని రణ్వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.Ranveer talks about watching Cocomelon Live at the NMACC with Dua and Deepika 🥰🥰♥️♥️ #deepveer #RanveerSingh #DeepikaPadukone Ranveer: It is extra special for us because this is our Dua baby's first show 💖 pic.twitter.com/9REtUmny44— DeepVeer Fanclub (@DeepVeer_FC) April 26, 2026 కాగా దీపికా, రణవీర్లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు. -
"సర్కే చునార్" వివాదం : సంజయ్ దత్ క్షమాపణలు, దిద్దుబాటు చర్య
ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు. ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయంఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్ దత్ కమిషన్కు హామీ ఇచ్చారు.ఈ విచారణ సందర్భంగా ఎన్సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు కూడా ఎన్సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్ను కోరారు.కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
దురంధర్-2 ఓటీటీ డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. #Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026 -
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్
ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో వచ్చిన వార్-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్ను తీర్చిదిద్దడంలో షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్, వాణి కపూర్ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్ ఇషాక్జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది. అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్గా సేవలందించారు. గతేడాది రిలీజైన సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా మారింది. View this post on Instagram A post shared by Shanoo Sharma🌻 (@shanoosharmarahihai) -
సుశాంత్ సింగ్ కేసు.. ప్రియురాలికి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మిస్టరీ డెత్ కేసులో వీరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.కాగా.. 2020లో హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతి తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
జైలులో ఉన్నప్పుడే సీక్వెల్ ఆలోచన వచ్చింది: సంజయ్ దత్
‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటున్నారు సంజయ్ దత్. సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఖల్ నాయక్’. 1993లో విడుదలైన, ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలోని బలరామ్ ప్రసాద్ అలియాస్ భల్లు పాత్రలో సంజయ్ దత్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ‘ఖల్ నాయక్’ సినిమా సీక్వెల్ను ప్రకటించారు సంజయ్ దత్. ప్రతి స్టోరీకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేసింది. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అంటూ ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు సంజయ్ దత్(Sanjay Dutt). అలాగే ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ను ముంబైలో నిర్వహించారు. ఈ వేడుకలో సంజయ్ దత్ మాట్లాడుతూ–‘‘నేను జైలులో ఉన్నప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా ఆలోచన వచ్చింది. ఆ సమయంలో జైలులో ఉన్న దాదాపు 4వేల మంది ఖైదీలతో ‘ఖల్ నాయక్’ సినిమా గురించి మాట్లాడాను. ఈ సినిమా వారికి నచ్చిందా? సీక్వెల్ గురించి ఆసక్తిగా ఉన్నారా? అన్న విషయాలను తెలియజేయాలని పేపర్స్ ఇచ్చాను. వారు తిరిగి ఇచ్చిన లెటర్స్ను నేను చదివాను.‘ఖల్ నాయక్’ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చాలా మంది పేర్కొన్నారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ‘ఖల్ నాయక్’ సీక్వెల్ గురించి సుభాష్గారితో మాట్లాడాను. ఆయన సీక్వెల్కి స్కోప్ ఉందని చెప్పారు. ఇలా ఇప్పుడు ‘ఖల్ నాయక్’ సినిమా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సంజయ్ దత్. ఈ ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ సినిమాను అస్పెట్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్ సంస్థల అసోసియేషన్తో సంజయ్ దత్ నిర్మించనున్నారు. అయితే దర్శకుడు ఎవరు? అన్నది తెలియాలి. -
ఈద్కి ఫిక్స్
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్వీసీ 63’ (వర్కింగ్ టైటిల్) సినిమా విడుదల ఖరారైంది. 2027 ఈద్కి (రంజాన్ పండగ) ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ముంబైలో ఆరంభమైంది.ఈ చిత్రాన్ని 2027 ఈద్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హీరో సల్మాన్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎస్వీసీ 63’ విడుదలకు చాలా రోజులు ఉందని మీరు నిరాశపడకండి. మీ ఎదురు చూపులకు తగినట్లుగానే ఈ చిత్రం ఉంటుంది’’ అని పేర్కొన్నారు సల్మాన్ ఖాన్. -
'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా'
ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. -
నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.ఇక సిట్యుయేషన్షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh 'situationship' 😳😱“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026 -
మృణాల్ ఠాకుర్ గ్లామర్ షో.. వీడియో సాంగ్ రిలీజ్
మృణాల్ ఠాకుర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలు, అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్లే గుర్తొస్తాయి. అంతెందుకు ఈ నెల ప్రారంభంలోనే రిలీజైన 'డెకాయిట్'లోనూ సరస్వతి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మూవీ ఓకే ఓకే అనిపించుకుంది గానీ మృణాల్ యాక్టింగ్ని అందరూ మెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)అయితే తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న మృణాల్.. బాలీవుడ్లో మాత్రం పూర్తిగా గ్లామరస్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు కూడా వరుణ్ ధావన్తో 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేసింది. ఇందులో మృణాల్తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్గా చేసింది.వచ్చే నెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టీజర్ కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేయగా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ట్రయాంగిల్ లవ్-ఫ్యామిలీ తరహా రొటీన్ స్టోరీనే అని చాలామంది పెదవి విరిచారు. కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో పక్కనబెడితే గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉంది. తాజాగా 'వావ్' పేరిట మూవీలోని వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో మృణాల్ అదిరిపోయే గ్లామర్ షో చేసింది. పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్) -
చాలా అసౌకర్యంగా అనిపించింది.. నో చెప్పాలనుకున్నా కానీ
'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోయిన్ కాజోల్.. తర్వాత హీరో అజయ్ దేవగణ్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయినా సరే ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తోంది. మరోవైపు 'ద ట్రయల్' అనే సిరీస్తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ముద్దు సీన్లలో నటించకూడదనే పాలసీ పెట్టుకున్న ఈమె.. ఓటీటీ సిరీస్ కోసం దాన్ని పక్కనబెట్టేసింది. సహ నటుడితో కిస్ సీన్ చేసింది. ఇన్నాళ్లకు సదరు సన్నివేశం గురించి స్పందించింది. చేస్తున్నప్పుడే చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు)రీసెంట్గా ఓ యూట్యాబర్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న కాజోల్.. తాను ముద్దు సన్నివేశంలో నటించడానికి గల కారణాల్ని బయటపెట్టింది. 'అది కేవలం కిస్ సీన్ మాత్రమే కాదు. ఆ పాత్ర భావోద్వేగాలకు, ఆలోచనలకు ఎంతో కీలకం. దాన్ని తీసేస్తే పాత్రలోని డెప్త్ తగ్గిపోతుంది. కానీ ఆ సీన్ తీస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. స్టోరీ చెప్పినప్పుడు ఓకే చెప్పాను గానీ సెట్స్కి వెళ్లినప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది. చివరి నిమిషంలో 'ఇది చేయను' అని చెప్పాలనిపించింది. కానీ ఇది పూర్తిగా ప్రొఫెషనల్ నిర్ణయం అని భావించి చేశాను' అని చెప్పుకొచ్చింది.'ద ట్రయల్' సిరీస్లో కాజోల్ లాయర్ పాత్ర చేసింది. ఇందులోనే ఓ సీన్లో భర్తగా నటించిన జీషూ సేన్ గుప్తాతో ముద్దు సీన్ చేసింది. అయితే 1992లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కిస్ సీన్ చేయకూడదని కాజోల్ తనకు తానుగా రూల్ పెట్టుకుంది. కానీ ఈ సిరీస్ కోసం చేసేసరికి అంతా ఆశ్యర్యపోయారు. ఈ సిరీస్ రెండో సీజన్ కూడా త్వరలో రిలీజ్ కానుంది.కాజోల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. హీరో అజయ్ దేవగణ్ని ప్రేమించి 1999లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలున్నారు.(ఇదీ చదవండి: బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్) -
బ్లాక్బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్
గత నెలలో రిలీజైన 'ధురంధర్ 2' సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ మూవీ గురించి మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో నటించిన రాకేశ్ బేడీ.. నిర్మాతల నుంచి రూ.కోటి గిఫ్ట్ అందుకోవడమే దీనికి కారణం. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ)'ధురంధర్' మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా తనదైన యాక్టింగ్తో ఆకట్టుకోగా.. గత నెలలో రిలీజైన రెండో భాగంలో హీరో రణ్వీర్ సింగ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే చివరలో రాకేశ్ బేడీ చేసిన జమీల్ జమాలీ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. అప్పటివరకు పాక్ రాజకీయ నాయకుడి పాత్రనే అని అంతా అనుకున్నారు. కానీ ఇతడు కూడా భారతదేశ్ గూఢచారి అనేది సర్ప్రైజింగ్గా అనిపించింది. హీరో, విలన్ తదితరులని ఎంతలా మెచ్చుకున్నారో.. రాకేశ్ బేడీకి కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.రెండు భాగాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించిన రాకేశ్ బేడీకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ అని ముందే మాట్లాడుకున్నారు. అది చెల్లించేశారు కూడా. కానీ ఇప్పుడు సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకనిర్మాత ఆదిత్యధర్.. ఈయనకు అదనంగా రూ.కోటి రూపాయల చెక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. 'ధురంధర్ 2' కలెక్షన్స్ ప్రస్తుతం రూ.1800 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు) -
కొత్త బ్యూటీతో విజయ్ డేటింగ్.. ఎవరీ అలియా?
సినీ తారలకు ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో.. బ్రేకప్, విడాకులు కూడా అంతే కామన్. ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడతారో..ఎందుకు విడిపోతారో తెలియదు. ఇలా ప్రేమ విషయాన్ని బయటపెట్టి..అలా బ్రేకప్ చెప్పుకుంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి.. కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందటారు. అలా విడిపోయి సడెన్ షాక్ ఇచ్చిన వారిలో విజయ్ వర్మ-తమన్నా జంట ఒకటి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. కొన్నాళ్ల క్రితం విడిపోయి అందరికి షాకిచ్చింది. తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా సనాతో ప్రేమలో పడ్డాడనే వార్తకు కూడా వినిపించాయి. కానీ ఫాతిమా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాత విజయ్ మరో యంగ్ బ్యూటీతో రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వాలెంటైన్స్ డే రోజు ఓ అమ్మాయి చేతిలో చేయి వేస్తున్న ఫోటోని షేర్ చేసి..దానికి లవ్ ఎమోజీనీ జోడించాడు. ఈ పోస్ట్ని ఖుషి అహుజా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు.తాజాగా ఆ బ్యూటీ పేరు బయటకు వచ్చింది. విజయ్ వర్మ ప్రస్తుతం నటి అలియా ఖురేషితో రిలేషనల్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఇద్దరూ రిలేషన్లో ఉన్నరానే పుకార్లు బయటకు వచ్చాయి.ఎవరీ ఖురేషీ?షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్లో ‘జాన్వి’పాత్రలో మెరిసిన బ్యూటీనే అలియా ఖురేషి. నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. ప్రముఖ మ్యూజికల్ సిరీస్ 'బందిష్ బాండిట్స్' రెండవ సీజన్లో అనన్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇభ్రహీం అలీఖాన్, ఖుషీ కపూర్ల ‘ నదానియన్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో ఉన్నారా? లేక జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. Vijay Varma was spotted with rumoured girlfriend Alia Qureshi at Mizu Restaurant in Bandra, sparking fresh dating buzz.#VijayVarma #AliaQureshi #CelebSpotted #Bollywood #DatingRumours #Mumbai pic.twitter.com/aMnpXoolNq— The Daily Jagran (@TheDailyJagran) April 21, 2026 -
ఆదా శర్మ.. మరో సెన్సేషనల్ సినిమా
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్గా నిలిచింది.తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. My next ❤️GOVERNOR releasing in cinemas on 12th June, 2026.We are a world power todaybecause an unsung hero fought an untold war.GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026 -
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపికపై రకరకాల రూమర్స్ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఆమె ఒప్పుకున్న ‘రాకా’ మూవీ నుంచి కూడా తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ప్రెగ్నెంట్తో ఆమె షూటింగ్లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ‘రాకా’ టీమ్ స్పందించింది. దీపికను తొలగించారనే వార్తల్లో నిజం లేదని టీమ్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన తర్వాత ఆమె పాత్ర నిడివిని తగ్గించారనే ప్రచారాన్ని కూడా టీమ్ ఖండించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో దీపిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్ సీన్స్ చేసేందుకు దీపిక ఒప్పుకుందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపికతో పాటు రష్మిక, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇప్పటికే విలన్ లుక్ రిలీజ్ అయింది. త్వరలోనే హీరో పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరో పాత్రలో బన్నీ స్టైలీష్గా కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తారలెందరో...తాగుబోతులు కొందరే..
సినిమా సెలబ్రిటీల్లో మద్యపానం చాలా సార్లు ‘‘సోషల్ ఫన్’’గా మొదలై, ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. షూటింగ్ల మధ్య రిలాక్స్ కావడానికి లేదా ఫ్రెండ్స్తో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి సాకుగా మొదలయే డ్రింకింగ్, తర్వాత తర్వాత పలు సందర్భాల్లో కంట్రోల్ తప్పే పరిస్థితులు తీసుకువస్తుందని పెద్ది హీరోయిన్ జాన్వీకపూర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం అవసరం అంటారామె‘‘లైఫ్లో బ్యాలెన్స్ చాలా ముఖ్యం’’ అన్నదే ఆమె మెసేజ్. ‘‘మద్యం అలవాటు గురించి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు’’ అని చెప్పింది. ఆమె సందేశం స్పష్టంగా ఉంది ‘‘అడిక్షన్ అంటే తప్పు కాదు అది ఒక సమస్య. దానికి పరిష్కారం అవసరం. అంటూ అమహ అనే స్వఛ్చంద సంస్థతో కలిసి ఇటీవలే ఆమె ఆఫ్ ద రాక్స్ పేరుతో మద్యపానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నేపధ్యంలో మద్యం తాగి పడిపోయి మృతి చెందారని తన తల్లి శ్రీదేవి మరణం గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా మహానటి సావిత్రి సహా అనేక మంది స్టార్ల జీవితాలను మద్యం మహమ్మారి పొట్టన బెట్టుకున్న కధలూ మనకు తెలుసు. సినీ ప్రముఖుల్లో కొందరు ఆ అలవాటుకే జీవితాన్ని అర్పించుకుంటే మరికొందరు మాత్రం తొలుత మత్తు కోరల్లో చిక్కినప్పటికీ ఆ తర్వాత దాని నుంచి విజయవంతంగా తప్పించుకోగలుగుతారు. అలాంటి వారే యువ తారలకు స్ఫూర్తిగా నిలుస్తారు. సీసా వదిలేశాకే....సీన్ మారింది...‘‘బాటిల్ నుంచి బయటపడిన తర్వాతే నిజమైన నన్ను తిరిగి పొందాను’’అంటూ చెప్పారు నటి, దర్శకురాలు పూజా భట్. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మద్యం అలవాటుపై ఓపెన్ గా మాట్లాడారు యుక్త వయసులో మద్యానికి అలవాటు పడిన తాను 45 ఏళ్ల వయసులో దాని నుంచి బయటపడాలనే కీలక నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. ‘‘నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడే మద్యం వదలేయాలి అనిపించింది. లేదంటే అదే నన్ను నాశనం చేసేస్తుందని అర్ధమైంది’’ అని అన్నారామె.తన జీవితంలో మద్యం ఒక ‘బ్యాండ్ఎయిడ్’లా (ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే దానికి చేసే ప్రాధమిక చికిత్స) మారిపోయిందని, ప్రతీసారీ తన బాధను మర్చిపోవడానికి దానిని ఉపయోగించేదానినని ఆమె పంచుకుంది.‘‘చెడు సంబంధం, మద్యం ఇవి రెండూ నన్ను బాధ నుంచి తప్పించడానికి నేను వాడుకున్న సాధనాలే,’’ అని ఆమె చెప్పింది. అయితే చివరకు తనను తాను అర్థం చేసుకుని, జీవితంలో ఎదురైన ఖాళీని ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పింది. ‘‘నేను బాటిల్ను పూర్తిగా వదిలేశాను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా సోబర్గా ఉన్నాను,’’ అని ఆమె సగర్వంగా ప్రకటించింది.నమ్మించి నాశనం చేస్తుంది‘‘మద్యం నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చింది. ఒక దశలో దానివల్ల నా జీవితం తలకిందులైంది, ఈ అలవాడు మొదట మనకు ఎంతో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాతే దాని వల్ల మనం నాశనం అవుతున్నాం అనేది తెలుస్తుంది. అది నిజానికి ఏ సమస్యకు పరిష్కారం కాదు’’ అంటారు ఒకనాటి అందాల తార మనీషా కొయిరాలా.. హౌ కేన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్ పేరిట తను రాసిన పుస్తకంలో ఆమె తన జీవితానుభవాల్లో మద్యం వ్యసనం గురించి వివరించారు. ‘‘ సంబంధాలు కావచ్చు, మద్యం లాంటి అలవాట్లు కావచ్చు జీవితంలో ఏదైనా పరే... మనమే నియంత్రించాలి. లేదంటే మనమే బాధితులం అవుతాం,’’ అని స్పష్టంగా చెబుతారు.విస్కీ నుంచి విముక్తి...‘‘ఒకప్పుడు విస్కీకి బాగా అలవాటు పడిపోయాను ఓ రకంగా చెప్పాలంటే విస్కీకి బానిసయ్యాను’’ అంటూ గుర్తు చేసుకుంటారు శృతిహాసన్. క్రమక్రమంగా దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్... ఇంకా ఎన్నో చుట్టుముట్టాయని తాను గుర్తించానని తెలిపారు. మద్యం తన జీవితాన్ని నియంత్రిస్తున్నదని గ్రహించి దాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా నైట్ పార్టీలు, మద్యం ఉప్పోంగే విందు వినోదాల వాతావరణానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. ‘‘ఇప్పుడు వ్యసనం నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించింది. దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది,’’ అని సంతోషం వ్యక్తం చేశారు. -
'మా ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే': అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గతేడాది కాళిధర్ లపట్టా, హౌస్ఫుల్-5 చిత్రాలతో మెప్పించారు. అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బచ్చన్.. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఉండగానే నటి ఐశ్వర్య రాయ్ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 21న బాలీవుడ్ జంట తమ 19 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్.. ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఐశ్వర్యతో రిలేషన్, ప్రేమ ఎలా మొదలైందన్న సీక్రెట్ను అభిషేక్ పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్లో ఐశ్వర్యను మొదటిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు మా మధ్య రిలేషన్ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేదన్నారు. అప్పుడు తనతో లవ్ అనే ఆలోచనే నాకు రాలేదన్నారు. కానీ 2006లో 'ఉమ్రావ్ జాన్' సినిమా చిత్రీకరణ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించిందని అభిషేక్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు' సినిమా టైమ్లో మా బంధం మరింత బలపడిందన్నారు. దర్శకుడు మణిరత్నం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన ఒక స్నేహితుడిగా మాత్రమే కాదు.. గాడ్ఫాదర్ అని ప్రశంసించారు. తమ కూతురు ఆరాధ్యను సరైన విలువలతో పెంచిన పూర్తి ఘనత ఐశ్వర్యకే దక్కుతుందన్నారు. ఐశ్వర్య కేవలం నా కూతురికి తల్లి మాత్రమే కాదు.. నా సోల్మేట్ కూడా అని కొనియాడారు. కాగా.. న్యూయార్క్లో జరిగిన 'గురు' ప్రీమియర్లోనే అభిషేక్, ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు. ఇది వారి లైఫ్లో ఓ అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. నిశ్చితార్థం తర్వాత ఏప్రిల్ 2007లో వీరిద్దరి వివాహం జరిగింది. -
విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్ల నటి మృతి
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో హర్యానా నటి దివ్యాంక శిరోహి(30) మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఘజియాబాద్లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమెకు సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు. జస్మీత్ ఉన్నారు. 1996 నవంబర్ 19న జన్మించిన దివ్యాంక.. మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ, సిక్కింలో ఎంబీఏ డిగ్రీని పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేశారు. 50కి పైగా హర్యానా పాటలలో నటించడమే కాదు, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్తకియా, కేడీ వంటి ప్రముఖులతో కలిసి తెరను పంచుకున్నారు.టిక్టాక్తో ఫేమస్..టిక్టాక్తో ఫేమస్ అయిన నటి దివ్యాంక. పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక చేసిన టిక్టాక్ బాగా వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్టాక్లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. View this post on Instagram A post shared by Divyanka (@divyankaasirohi) -
ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్ నాటక్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.కాగా.. ఈ చిత్రంలో మోల్శ్రీ, శివంగ్ రాజ్పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్లో దొంగతనం చేస్తూ ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. Hindi LGBTQ Movie #NukkadNaatak (Hindi) streaming from April 24 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/7wt7ZEVEmO— OTT Trackers (@OTT_Trackers) April 20, 2026 -
నెల రోజులైనా తగ్గేదేలే.. దురంధర్-2 మరో రికార్డ్
నెల రోజులు దాటినా కూడా దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రిలీజైన 34 రోజుల్లోనే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్ రికార్డ్ను అధిగమించింది. తాజా వసూళ్లతో యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దురంధర్-2 నిలిచింది.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ యూకేలో 34 రోజుల్లోనే రూ. 55.55 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న పఠాన్ మూవీ రికార్డ్ను(రూ.55.40 కోట్లు) దాటేసింది. ఆ తర్వాత వరుసగా జవాన్, సైయారా, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, దిల్వాలే, పద్మావత్, చెన్నై ఎక్స్ప్రెస్ ఈ జాబితాలో ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే దురంధర్-2 అంతర్జాతీయంగా రూ. 422 కోట్లకు పైగా వసూలు చేసింది. చైనా మినహా పలు దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,761.88 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కంటే బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే ముందున్నాయి.కాగా.. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్లో రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. -
వాచ్మెన్గా పనిచేశా.. బిచ్చగాడిగా కూడా సెట్ కాదన్నారు: నటుడు
సినిమా నటులు అనగానే కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్ అనుకుంటారు. నిజమే అలానే బతుకుతారు. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడతారు. ఇప్పుడు స్టార్స్గా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటుడు వినోద్ సూర్యవంశీ ఒకరు. అక్షయ్ కుమార్ ‘ఎల్ఎల్బి 3’, పంచాయత్ లాంటి సిరీస్తో బాలీవుడ్లో మంచి గుర్తించు తెచ్చకున్న ఈ నటుడు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. రూ. 500 కోసం సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్లో మంచి నటుడిగా స్థిరపడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ తన సినిమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.(చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు)వాచ్ మెన్గా పనిచేశా..చిన్నప్పుడు నా జీవితం చాలా ఘోరంగా ఉండేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పండగలు వస్తే.. భయపడిపోయేవాళ్లం. అమ్మ-నాన్నల కష్టం చూడలేక.. కొన్నాళ్ల పాటు లిఫ్ట్ మ్యాన్గా పని చేశారు. ఆ తర్వాత వాచ్మెన్గా చేశా. ఆ సమయంలో దాదాపు 12 గంటల పాటు నిలబడి ఉండేవాడిని. వర్షం వస్తే.. షూలోకి నీళ్లుపోయి..తీవ్రమైన నొప్పి వచ్చేవి.రూ. 500 కోసం.. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. వాచ్మెన్గా చేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చి షూటింగ్లో నిలబడితే రూ. 500 ఇస్తారని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అలా జూనియర్ ఆర్టిస్ట్గా నా కెరీర్ ప్రారంభం అయింది. అప్పట్లో రోజుకు రూ. 500 ఇచ్చేవాళ్లు. టిఫిన్, లంచ్ పెట్టేవాళ్లు. అప్పటికే అది నాకు చాలా గొప్పది. వాన్మెన్గా 12 గంటలు పని చేస్తే నెలకు రూ. 8000 మాత్రమే వచ్చేవి. కానీ జూనియర్ ఆర్టిస్ట్గా రూ. 12000 సంపాదించా.తింటుంటే లేపేశారుఅలా అని జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ గొప్పగా ఉంటుందని నేను చెప్పను. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తున్నప్పుడు ఓ సారి నేను సెట్లో భోజం చేస్తున్నాను. కొంతమంది వచ్చి..నన్ను పక్కకు వెళ్లమన్నారు. దూరంలోని నిలబడి తనమన్నారు. ఎందుకంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ని అని. అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నా. నన్ను గౌరవించాలంటే.. నేను కూడా యాక్టర్ని కావాలనుకున్నా. చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.బిచ్చగాడి పాత్రకు కూడా సెట్ కాదన్నారుకెరీర్ ప్రారంభంలో నేను చాలా కష్టాలు అనుభవించా. చాలా పాత్రలకు నన్ను రిజెక్ట్ చేశారు. కొన్ని పాత్రలు అయితే షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆగిపోయాయి. సెట్లోకి వెళ్లిన తర్వాత.. నల్లగా ఉన్నావని చెప్పి రిజెక్ట్ చెశారు. చివరకు బిచ్చగాడి పాత్రకి కూడా రిచ్ లుక్ లేదని నన్ను పక్కన పెట్టారు. ఇలా మొదట్లో నాకు చాలా అవమానాలు జరిగాయి’ అని సూర్య చెప్పుకొచ్చాడు. -
ఒంటిపై నీళ్లు పోసుకొని, పెదాలు ఆడించిన సింగర్, ఇదేం లైవ్?
ఈ మధ్య సంగీత కచేరీకి ప్రాధాన్యత పెరిగింది. స్టార్ సింగర్స్ అంతా.. మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తుండడంతో.. మ్యూజిక్ లవర్స్ ఆ ఈవెంట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం లైవ్ కాన్సర్ట్ అని చెప్పి..రికార్డింగ్ పాటను ప్లే చేయడం ఇప్పుడు సంగీత ప్రియులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ధురంధర్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ కూడా బ్యాగ్రౌండ్లో ప్లే అవుతున్న పాటకు లిప్ సింక్ ఇచ్చి.. లైవ్లో పాడుతున్నట్లుగా మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.లైవ్ కాన్సర్ట్ కానీ.. ధురంధర్ సినిమా రిలీజ్ తర్వాత సింగర్ జాస్మిన్ సాండ్లాస్ మరింత ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో ఆమె ఆలపించిన షరారత్, మై ఔర్ తూ, ఆరీ ఆరీ పాటలు సూపర్ హిట్ అవ్వడం.. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో జాస్మిన్ పేరు మారుమోగిపోయింది. ఆ ఫేమ్ని సొమ్ము చేసుకునేందుకు జాస్మిన్ రెడీ అయింది. అందులో భాగంగా ఏప్రిల్ 19న గుజరాత్లోని ఆహ్మదాబాద్లో సంగీత కచేరి నిర్వహించింది. ధురంధర్ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్ అని తెలియడంతో వందలాది మంది సంగీత ప్రియులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్కి వెళ్లారు. జాస్మిన్ కూడా వారిని నిరాశపరచకుండా తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేసింది.పాడడం కోసమా లేదా యాక్టింగ్ కోసమా?ఈవెంట్కి వచ్చినవారిని మరింత ఉత్సాహపరిచేందుకు ధురంధర్ పాటను ఆలపిస్తూ..తలపై నీళ్లు పోసుకుంది. అంతేకాదు పాటతో పాటు డ్యాన్స్ కూడా చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ వీడియో క్లిప్ పరిశీలిస్తే.. జాస్మిన్ పాట పాడలేదు. బ్యాగ్రౌండ్లో ప్లే అవుతున్న పాటకి పెదాలను కదిపారు అంతే. ఇది గమనించిన నెటిజన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు తలపై నీళ్లు పోసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ‘లైవ్ కాన్సర్ట్ అని చెబుతారు.. కానీ లైవ్లో పాట పాడరు’, ‘ఆమెను పాట పాడడానికి పిలిపించారా లేదా నటించడానికి పిలిపించారా?’, ‘తలపై పోసుకున్న నీళ్లు సరిపోలేదు..ఇంకో బకెట్ నీళ్లు పోసుకోవాల్సింది’అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @exclusive.celebs -
ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు
హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, 'పంచాయత్' సిరీస్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ సూర్యవంశీ.. ఇప్పటికీ తన కుటుంబం కర్ణాటకలోని తన సొంతూరిలో కుల వివక్ష ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చాడు. ప్రముఖ యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్తో జరిగిన సంభాషణలో భాగంగా ఈ ఆశ్చర్యకర సంగతి చెప్పి షాకిచ్చాడు. పేదరికం కారణంగా తను ఇప్పటివరకు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నాడో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. చనిపోయిన ప్రముఖ దర్శక నిర్మాత)'మా ఊరిలో ఇప్పటికీ అగ్ర కులాలు, బలహీన వర్గాల కోసం వేర్వేరు ప్రాంతాలున్నాయి. దళితులు నివసించే ప్రాంతం గ్రామానికి దూరంగా ఉంటుంది. నాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నతో కలిసి ఊరి లోపలికి వెళ్లినప్పుడు ఓ హోటల్లో తిన్నాం. కానీ తర్వాత మేమే ప్లేట్లు కడగాల్సి వచ్చింది. అలానే ఇప్పటికీ ఊరిలోని దేవాలయంలోకి మాకు అనుమతి లేదు' అని వినోద్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.ఇక చిన్నప్పటి కష్టాలు గుర్తుచేసుకున్న వినోద్.. పండగలు వచ్చాయంటే సంతోషం కంటే మాకు బాధే ఎక్కువగా ఉండేది. దీపావళి ఎందుకు వస్తుందా అనిపించేంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇస్తే మాత్రమే మేం పండగ జరుపుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కుటుంబం విషయానికొస్తే.. నా తల్లి ఇళ్లలో పనిచేసేది. నాన్న మేస్త్రీ. ఆయనకు రోజూ పని దొరికేది కాదు. పనిలేకపోతే తాగొచ్చి అమ్మని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ఆయనంటే కోపం లేదు కానీ ఎందుకనో నాన్న ప్రవర్తన నచ్చేది కాదని అన్నాడు.సినిమా కెరీర్ గురించి చెబుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో పనులు చేశాను. మొదటి లిఫ్ట్ మ్యాన్గా నెలకు రూ.1600 జీతానికి పనిచేశా. తర్వాత ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేశాను. గార్డ్గా పనిచేసినప్పుడు 12 గంటలు నిలబడి పనిచేయాల్సి వచ్చేది. వర్షం పడితే చెప్పుల్లోకి నీళ్లు చేరి గాయాలయ్యేవి. కొందరు అకారణంగా తిట్టేవారని వినోద్ గుర్తుచేసుకున్నాడు. ఏ పని చిన్నది కాదంటారు గానీ నిజానికి మనిషిని అతడు చేసే పనిబట్టి అంచనా వేస్తారు. పని పెద్దదైతేనే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుందని వినోద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. హిందీలో పంచాయత్ సిరీస్తో పాటు జాన్వర్, థామా, సత్యమేవ జయతే, జాలీ ఎల్ఎల్బీ 3 తదితర సినిమాల్లో వినోద్ సూర్యవంశీ నటించాడు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా) -
ఆలియా ఆగమనం నిజమేనా?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. ఆ తర్వాత ఆలియా భట్ హీరోయిన్గా చేయనున్నారంటూ కొన్ని పెద్ద తెలుగు సినిమాల పేర్లు వినిపించినప్పటికీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. తాజాగా ఆలియా భట్ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. కానీ హీరోయిన్గా కాదు... కథలో ఓ కీలక పాత్ర కోసం ఆలియా భట్ను సంప్రదించారట. ఎవరంటే...‘డ్రాగన్’ సినిమా (ప్రచారంలో ఉన్న టైటిల్) టీమ్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’.ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారని తెలిసింది. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ (రామ్చరణ్ మరో హీరో) సినిమాలో హీరో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.మరి... మరోసారి ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? టాలీవుడ్కు మరోసారి ఆలియా ఆగమనం నిజమేనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుంది. -
ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్కి వస్తాడు. ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు. -
రాజా శివాజీ ట్రైలర్ రిలీజ్.. జెనీలియా దంపతుల కన్నీళ్లు..!
బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ జెనీలియా. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ రితేశ్ దేశ్ముఖ్ను పెళ్లాడింది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న జెనీలియా.. గతేడాది సితారే జమీన్ పర్, జూనియర్ చిత్రాల్లో మెరిసింది.జెనీలియా సంగతి పక్కన పెడితే ఆమె భర్త రితేశ్ దేశ్ముఖ్ చారిత్రక మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజా శివాజీ పేరుతో వస్తోన్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రితేశ్ దేశ్ముఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా రితేశ్ తన తండ్రి విలాస్రావ్ దేశ్ముఖ్ను గుర్తుచేసుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వేదికపైనే చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రితేష్ దేశ్ముఖ్, జెనీలియా కన్నీళ్లు..చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'రాజా శివాజీ' ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా తన కల సాకారం చేసుకోవడంలో సాయపడిన చిత్ర బృందానికి రితేశ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రితేశ్ ఎమోషనల్ కావడంతో.. జెనీలియా దేశ్ముఖ్ భావోద్వేగానికి గురైంది. ఈ మాటలు విన్న సంజయ్ దత్ సైతం ఎమోషనల్గా కనిపించారు. ఈ కథను తీసుకురావడంలో తనకు మద్దతుగా నిలిచిన జెనీలియాకు సైతం రితేశ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ లాంటి స్టార్స్ హాజరయ్యారు. వీరంతా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'రాజా శివాజీ' చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు, ఆయన జీవ మహాల అనే పాత్రను పోషించారు. ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ మూవీ మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. #RiteishDeshmukh and #GeneliaDeshmukh share a heartfelt moment during a press interaction 🥺❤️#pinkvilla pic.twitter.com/Ixsxjc4p1m— Pinkvilla (@pinkvilla) April 20, 2026 -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు
సినిమా, రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధముంది. నటీనటులుగా రాణించిన వాళ్లు చాలామంది ప్రస్తుతం పాలిటిక్స్లోనూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరామె? ఏంటా సినిమా?(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ట్రాన్స్జెండర్ తమన్నా)గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేస్తున్న ఆనందీ బెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయానా నటిగా పరచయమవుతోంది. మే 7న తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న 'కృష్ణావతారం పార్ట్ 1'లో శ్రీ కృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా, రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటించారు. ఈ మూవీ మొత్తం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండనుంది.ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంస్కృతి జయానా.. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా రాణిస్తోంది. లండన్, అమెరికాలోని ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేసిన ఈమె.. 16 ఏళ్ల వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. మరి ఇప్పుడు సత్యభామ పాత్రలో నటిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా) -
రూ.4500 జీతానికి పని చేస్తున్న స్టార్ హీరో కొడుకు
ఆ యువకుడి తండ్రి ఓ స్టార్ హీరో. కోట్ల ఆస్తి ఉంది. సినిమాల్లోకి వస్తానంటే.. దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఇవన్నీ వదులుకోని ఓ సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అరవ్ భాటియా. 24 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడు.. అనుకుంటే ఈ పాటికే హీరో అయిపోయేవాడు. కానీ నటన అంటే ఆయనకు ఇష్టం లేదు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనేది ఆయన కల. అందుకే ప్రస్తుతం ఆ ఫీల్డ్లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ వెల్లడించారు.‘అరవ్కి పని చేయడం ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్లాన్స్ లేవు కానీ ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ ఫీల్డ్లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతూ ఫ్యాషన్పై అధ్యయనం చేస్తున్నాడు. హీరో కొడుకునని ఎక్కడ చెప్పుకోడు. నేను కూడా వాడిని సినిమాల్లోకి రావాలని ఫోర్స్ చేయను. తనకు నచ్చిన పని చేసుకోమని చెబుతాను. తండ్రిగా వాడికి ఎలాంటి క్లాసులు తీసుకోని కానీ.. ‘ఎవరికీ హానీ చేయొద్దు.. బాధ పెట్టొద్దు’ అని మాత్రం చెబుతాను’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
రూ.10 కోట్లతో అపార్ట్మెంట్ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!
సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఆ అపార్ట్మెంట్ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉంటుందట. ఆ వెంచర్లో మొత్తం 2 టవర్స్ ఉన్నాయట. ఒక్కో టవర్ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్, స్వీమ్మింగ్ పూల్తో పాటు రెండు కార్లు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటి శివాలికా ఒబెరాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త, డైరెక్టర్ అభిషేక్ పాఠక్తో కలిసి ఈ శుభవార్త పంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. మా ఇంటికి చిన్నారి లక్ష్మీ దేవి ఈ శుభ దినాన మా జీవితంలోకి అడుగుపెట్టింది.. ఇది స్వచ్ఛమైన రూపంలో లభించిన ఒక వరం' క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. శివాలికా తాను గర్భవతి అయిన విషయాన్ని గతేడాది డిసెంబర్లో రివీల్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నటి శివాలికా, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. 2020లో 'ఖుదా హాఫిజ్' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరు మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మించగా.. శివాలికా హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఈ జంట టర్కీలో నిశ్చితార్థం చేసుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య శివాలికాకు అభిషేక్ ప్రపోజ్ చేశారు.కాగా.. కిక్, హౌస్ఫుల్-3 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా శివాలికా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యే సాలీ ఆషికి (2019) చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఖుదా హఫీజ్ చిత్రంలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. ఇక అభిషేక్ పాఠక్ హిందీలో దృశ్యం -2, ఉజ్డా చమన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ప్యార్ కా పంచ్నామా, ఖుదా హాఫిజ్, సెక్షన్ 375 లాంటి ప్రాజెక్టులను నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) -
గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ
దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి దీపికా ప్రెగ్నెన్సీతో ఉందన్న శుభవార్తను పంచుకున్నారు. ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ముద్దుల కూతురు దువా పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు.కాగా.. వీరిద్దరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకు దువా అని నామకరణం చేశారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న దీపికా, రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలో ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే రణ్వీర్ ప్రస్తుతం 'ధురందర్ 2' మూవీతో మరో బ్లాక్బస్టర్ అందుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఇకపోతే దీపిక సైతం చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆమె ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన 'కింగ్' చిత్రంలో నటించనుంది. అంతేకాకుండా అల్లు అర్జున్తో రాకా మూవీలోనూ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
బాక్సాఫీస్ వద్ద దురంధర్-2 హవా.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 వసూళ్లను అధిగమించింది. విడుదలైన 31 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1,749.01 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.'ధురంధర్ 2: ది రివెంజ్' ఇండియా వ్యాప్తంగా రూ.1329.31 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.419.70 కోట్ల వసూలు చేసింది. ఈ వసూళ్లతో రూ.1,742 కోట్లు సాధించిన 'పుష్ప 2' చిత్రాన్ని అధిగమించింది. ఓవరాల్గా దురంధర్-2 ఇండియాలో అత్యధిక వసూళ్ల జాబితాలో మూడోస్థానం సొంతం చేసుకుంది. తొలి స్థానంలో అమిర్ ఖాన్ దంగల్ ఉండగా.. రెండో ప్లేస్లో రాజమౌళి బాహుబలి-2 కొనసాగుతోంది. దురంధర్-2 వసూళ్లు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బాహుబలి-2 రికార్డ్ సైతం బ్రేకయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాకిస్తాన్ స్పై నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, మానవ్ గోహిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. -
హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం..!
హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్లోని వానిటీ వ్యాన్లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.ఈ చోరీతో మూవీ సెట్స్లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్లతో కనిపించనుంది. -
పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. ఇంకా ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 రిలీజై నెల రోజులవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మార్చి 19న విడుదలైన దురంధర్-2 వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఇప్పటికే రెండు పార్టులు కలిపి రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాలు ఇండియన్ సినిమా గతినే మార్చేశాయి. తాజాగా దురంధర్-2 మూవీ అరుదైన రికార్డ్పై కన్నేసింది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 అల్ టైమ్ వసూళ్ల రికార్డ్కు అతి చేరువగా వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,742.10 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ దురంధర్ రూ. 1,737.74 కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. అంటే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనకంజలో ఉంది. ఈ మూవీ 5 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే పుష్ప-2 రికార్డ్ను బ్రేక్ చేయనుంది. ఈ జాబితాలో అమిర్ ఖాన్ దంగల్, రాజమౌళి బాహుబలి-2, పుష్ప-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వసూళ్లు ఇలాగే కొనసాగితే దురంధర్-2 త్వరలోనే పుష్ప-2ను వెనక్కి నెట్టనుంది.కాగా..ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేసిన సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్తో తీస్తున్న సినిమా సెట్స్పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. -
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్గా నటిస్తోంది. -
'దురంధర్-2 ఫెయిల్ కావడమే వాళ్లందరి కోరిక': కోహ్లీ సంచలన కామెంట్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మాట్లాడారు. ధురందర్: ది రివెంజ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారని వెల్లడించారు. అలా కోరుకున్న వారిలో స్టార్ డైరెక్టర్స్ సైతం ఉన్నారని కునాల్ కోహ్లా సంచలన కామెంట్స్ చేశారు. దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతమే ఫెయిల్ అవుతుందని ఊహల్లో తేలియాడారని అన్నారు. కానీ వారి అంచనాలకు విరుద్ధంగా ఈ మూవీ రాణించిందని పంచుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్ల వేటతో అదరగొట్టేసింది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వెయ్యి కోట్లు వసూళ్లు చేసి సత్తా చాటింది.కునాల్ కోహ్లీ మాట్లాడుతూ..'బాలీవుడ్ పరిశ్రమ మొత్తం సినిమాకు మద్దతు ఇవ్వకపోయినా ఆడుతోంది. ధురందర్కు బాలీవుడ్లో ఎవరూ కూడా మద్దతు ఇవ్వలేదు. అగ్రశ్రేణి దర్శకులు సైతం ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. మొదటి సోమవారం నుంచే దురంధర్-2 ప్రదర్శన ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సోమవారం నుంచే వసూళ్లపరంగా మరింత దూసుకెళ్లింది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. బోర్డర్- 2కు సైతం ఎవరూ మద్దతు ఇవ్వలేదు. కానీ అది బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు" అన్నారు.అలాగే ఎవరీ మద్దతు లేకపోయినా తన 'హమ్ తుమ్' (2004) మూవీ కమర్షియల్గా సక్సెస్ అయిందన్నారు. ఈ చిత్రంతో తనకు ఎదురైన అనుభవాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారు నా చిత్రాన్ని మెచ్చుకునే అవకాశం లేదని.. ప్రీమియర్ షో హాజరుకావద్దని ఆదిత్య చోప్రా తనకు సలహా ఇచ్చారని ఆయన పంచుకున్నారు. కానీ సినిమాకు నేను వెళ్లానని.. అక్కడ వచ్చిన స్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు.. చాలా నిరాశతో ఆదిత్య చోప్రాకు ఫోన్ చేశా.. ఇది వాళ్లకు నచ్చే రకం సినిమా కాదని నాకు తెలుసు.. అందుకే నిన్ను వెళ్లవద్దని చెప్పానని అన్నాడు. అంటే పరిశ్రమలోని 99 శాతం మంది మీరు విజయం సాధించాలని కోరుకోరని కునాల్ కోహ్లీ స్పష్టం చేశారు. తన తొలి చిత్రం 'ముఝ్సే దోస్తీ కరోగే!' (2002) సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. స్వయంగా ఫోన్ చేసి అభినందించిన రాకేష్ రోషన్ను కోహ్లీ ప్రశంసించారు. -
టాక్సిక్ గ్యాంగ్స్టర్ సినిమా కాదు.. యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్లో ఓ గ్యాంగ్స్టర్ కథ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్ జోనర్ మూవీ అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్ రిలీజ్ తర్వాత అందరూ ఇది గ్యాంగ్స్టర్ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్స్టర్ సినిమా కాదు. యాక్షన్ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అలాగే యశ్ రావణుడిగా, రణ్బీర్ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్బీర్తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్బీర్ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది. -
అదేం పెద్ద సమస్య కాదు.. 'రామాయణ'పై యష్ కామెంట్స్
భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా పరిమిత బడ్జెట్తో తీశారు. కానీ రూ.4000 కోట్ల బడ్జెట్తో తాము రామాయణాన్ని తీస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పేసరికి అంతా షాకయ్యారు. కానీ కొన్నిరోజుల క్రితం రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా.. చెప్పిన బడ్జెట్కి చూపించిన విజువల్కి అస్సలు సంబంధం లేదే అనే కామెంట్స్ వినిపించాయి. ఆ విషయాలన్నీ పక్కనబెడితే ఇందులోనే రావణుడిగా చేస్తున్న యష్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సంగతులు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్న యష్.. ఈ చిత్రం నిర్మాణంలోనూ భాగమయ్యాడు. తాజాగా అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్కి నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి హాజరయ్యాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ గురించి చెప్పుకొచ్చాడు. రణ్బీర్ కపూర్, తనకు మధ్య తొలి భాగంలో సీన్స్ ఏం లేవని క్లారిటీ ఇచ్చాడు. అంటే రాముడు-రావణుడి మొదటి భాగంలో అస్సలు కలిసే అవకాశం లేదు.కలిసి సీన్స్ లేనప్పటికీ రణ్బీర్ కపూర్ని తాను పలుమార్లు కలిశానని చెప్పిన యష్.. అతడు ఓ అద్భుతమైన నటుడు అని ప్రశంసించాడు. తమ ఆలోచనలు కలిశాయని, కాబట్టి తామిద్దరి కెమిస్ట్రీ అనేది పెద్ద సమస్య కాదని యష్ అన్నాడు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి చేస్తోంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి వస్తారా లేదంటే అన్ని పాన్ ఇండియా సినిమాల్లానే వాయిదా వేస్తారా అనేది చూడాలి?యష్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'రామాయణ' తొలి భాగంలో రాముడి, అతడి రాజ్యానికి సంబంధించిన సీన్స్.. మరోవైపు రావణుడు, అతడి రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలు చూపించనున్నారు. బహుశా రాముడు, సీత వనవాసానికి వచ్చే ఎపిసోడ్తో తొలి భాగాన్ని ముగిస్తారేమో అనిపిస్తుంది. రాముడు-రావణుడి మధ్య వైరం, యుద్ధం తదితర అంశాలన్ని సీక్వెల్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ని వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.(ఇదీ చదవండి: పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు)#Yash confirms he and #RanbirKapoor won’t share screen space in #Ramayana Part 1.He praised Ranbir as a brilliant actor and said their vision matches, so chemistry won’t be an issue. 🔥 pic.twitter.com/g4PSkHzBjw— Filmyscoops (@Filmyscoopss) April 15, 2026 -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్టైమ్ కలెక్షన్స్ను దాటేశాయి. దురంధర్, దురంధర్-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2: ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్ దాటలేదు. ఈ విషయంలో దురంధర్ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.మంజులిక అనుకొని.. 2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.అదే తేడాభూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్
రీసెంట్ టైంలో భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందంటే చాలు.. తమ చిత్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)ని ఉపయోగించలేదని హీరోలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అవసరాన్ని బట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త మూవీ కోసం ఏఐని అధికారికంగా వాడేశాడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా అందులో ఈ టెక్నాలజీతో చేసిన ఔట్పుట్ దర్శనమిచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'హే జవానీ తో ఇష్క్ హోనా హై'. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లని ప్రేమించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. సదరు హీరోయిన్లకు పుట్టిన పిల్లలిద్దరూ మాట్లాడుకునే సీన్స్ అన్ని ఏఐలో సృష్టించారు. వాటినే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోలో చూపించారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ, తెలుగు, పాన్ ఇండియా చిత్రాల్లో ఈ టెక్నాలజీని అధికారికంగానే ఉపయోగించేయనున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?) -
'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.ప్రియా కపూర్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.నటి ప్రియా సచ్దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు. మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్కు కరిష్మా కపూర్తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Priya S Kapur (@priyasunjaykapur) -
అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యారు. ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్షాట్లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా.. ఆదివారం ఏప్రిల్ 12న లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Athiya Shetty gone mad She uploaded a picture of Lata Mangeshkar instead of Asha Bhosle. 😭 pic.twitter.com/bKCZPBAjjG— Mohit (@Warlockmohit) April 12, 2026 Athiya Shetty Is Beauty Without Brains She posted a story with photo of Late Lata Mangeshkar instead of Late Asha Bhosle.Nepo kids just want to be relevant somehow, without hardwork or struggle and that's why their movies flop and they make such blunders. https://t.co/hy3KvJwUUo pic.twitter.com/4TXjZ0SJJ3— Vidhi (@vidhisharmx) April 12, 2026 -
రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle) అనారోగ్య కారణాలతో 92 ఏళ్ల వయసులో (ఏప్రిల్ 12, 2026న) కన్నుమూశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు, సంగీతాభిమానులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని దర్శించి , తుది నివాళులర్పించేందుకు వేలాదిగా అభిమానులు ముంబైలోని లోయర్ పరేల్లో ఉన్న ఆమె నివాసం 'కాసా గ్రాండే'కు తరలి వచ్చారు. వీరితోపాటు, ప్రధాని మోదీ సహా, పలువురు రాజకీయ, సినీ రంగాలప్రతినిధులు, ఇతర సెలబ్రిటీలు ఆశామరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె వారసురాలు, గాయని జానై భోంస్లే (Zanai Bhosle) వార్తల్లోనిలిచారు. భారతీయ సినీ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే. తన నాన్నమ్మలా ఈమె గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన కథక్ నర్తకి , రచయిత్రి, నటి కూడా. ఈమె ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కుమార్తె. ఆమె లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మేనకోడలు కూడా. ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. సంగీతం , కళల పట్ల ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదంనాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జానై శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాయనిగా రాణించారు. వివిధ స్టేజ్ షోలలో తన నాయనమ్మ ఆశా భోంస్లేతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మ్యూజిక్ బ్యాండ్ "6-ప్యాక్ బ్యాండ్" (6-Pack Band) లో పాటలు పాడారు. 2022 సెప్టెంబర్ 8న, ఆశా 89వ పుట్టినరోజు సందర్భంగా జానై భోస్లే, మంచి కవితను పోస్ట్ చేశారు.సినిమా రంగ ప్రవేశంజానై భోంస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. రిషబ్ శెట్టి సరసన బాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) అనే భారీ పీరియడ్ డ్రామాతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంస్లే పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.వ్యాపారవేత్తగాసోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జునై గాయనిగా, నటి మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. ముంబైలో ఆమెకు సొంతంగా యాపిల్ ఐఫోన్ (Apple iPhone) రిటైల్ స్టోర్ ఉంది, ఆశా భోంస్లే స్వయంగా తన మనవరాలి గురించి చాలా సార్లు ప్రస్తావించేవారు. జునై చాలా ప్రతిభావంతురాలని, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని పలు సందర్భాల్లో ప్రశంసించారు.సిరాజ్తో షికార్లు అంటూ పుకార్లు2025 ప్రారంభంలో జానై భోస్లే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ల మధ్య ఉన్న సంబంధం గురించిన పుకార్లు షికార్లు చేశాయి. అయితే, రక్షాబంధన్ రోజున సిరాజ్కు రాఖీ కట్టిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ ఈ పుకార్లకు ఇద్దరూ చెక్ పెట్టారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)దివంగత ఆశాకు కడసారి నివాళి అర్పించేందుకు క్రికెటర్ సిరాజ్ ముంబైలోని ఆమె నివాసానికి వచ్చారు. సిరాజ్ను చూడగానే జానై భోస్లే భోరున విలపించింది. సిరాజ్ ఆమెను ఓదారుస్తూ అక్కున చేర్చుకోవడం విశేషం. -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
ధురంధర్ నటుడికి రూ.1 కోటి? అసలు నిజమిదే!
గత ఐదు నెలలుగా 'ధురంధర్' సినిమా పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బ్లాక్బస్టర్ కాగా రెండో భాగం అంతకు మించిన ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు లభించింది.రూ.1 కోటి రెమ్యునరేషన్ఈ క్రమంలో 'ధురంధర్'లో హైజాకర్ జహూర్ మిస్త్రీగా యాక్ట్ చేసిన నటుడు వివేక్ సిన్హ గురించి ఓ వార్త వైరలవుతోంది. అతడు ఈ చిత్రానికిగానూ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్పై తాజాగా వివేక్ సిన్హ స్పందించాడు. 'తమ్ముళ్లూ.. నాకు రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, ఏకంగా రూ.1 కోటి ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఒట్టేసి చెప్తున్నా, నాకంత డబ్బు ఇవ్వలేదు. అనవసరంగా ఏదేదో ప్రచారం చేయకండి.ఎప్పుడో ఖర్చయిందిఅలా అని నాకు మొత్తానికే డబ్బు ఇవ్వలేదని కాదు. నేను అనుకున్నంత పారితోషికం ఇచ్చారు. కానీ మీరనుకునేంత కాదు. నాకు ఇచ్చినదంతా ఎప్పుడో ఖర్చు పెట్టేశాను కూడా! నేను ముంబైలో ఉంటాను కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువే.. కాబట్టి ఎవరికీ సాయం చేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఇలాగే మంచి అవకాశాలు రావాలని కోరుకోండి. అప్పుడు నేను బాగా సంపాదించగలను.. మీకు తిరిగి సాయం చేయగలను' అని వివేక్ సిన్హ తెలిపాడు. View this post on Instagram A post shared by vivek sinha (ज़हूर मिस्त्री) (@viveksinhaactor)చదవండి: సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్? క్లారిటీ ఇచ్చిన నటి -
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్తో పాటు మూవీస్లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. -
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026 -
తనను తాను గాయపర్చుకున్న హీరో.. కదల్లేని స్థితిలో ఆస్పత్రికి..
'ధురంధర్' సినిమాతో హీరో రణ్వీర్ సింగ్ పేరు మారుమోగిపోతోంది. అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం, నటన గురించి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. అయితే అతడు మొదటినుంచి అంతే డెడికేషన్తో పని చేసేవాడంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్. రణ్వీర్ సింగ్ హీరోగా, అనురాగ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం లూటేరా. ఇది రణ్వీర్ నటించిన మూడో చిత్రం. అనురాగ్ సినిమా నిర్మించడంతో పాటు డైలాగ్స్ అందించాడు.రణ్వీర్ ఎప్పుడూ ఇంతే..ఆ మూవీ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఆయన మాట్లాడుతూ.. 'ధురంధర్ మూవీకోసం రణ్వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ఎంత కష్టపడ్డారు? ఎన్ని గాయాలు తగిలించుకున్నారు? అని మనమంతా మాట్లాడుకుంటున్నాం. తమ పాత్రలకు న్యాయం చేయడం కోసం వాళ్లు ఎంతదూరమైనా వెళ్తారు. వారి కష్టానికి ప్రతిఫలంగా సినిమా కూడా అద్భుతంగా ఆడుతోంది, మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కానీ రణ్వీర్ సింగ్ ఇప్పుడే కాదు, మొదటినుంచి కూడా ఇలాగే ఉండేవాడు. తన కెరీర్ మొదట్లో చేసిన లూటేరా సినిమా గురించి చెప్తాను. గాయం చేసుకునిఈ మూవీ క్లైమాక్స్లో రణ్వీర్పై కాల్పులు జరుగుతాయి. ఆ నొప్పి అనుభవించడం కోసం అతడు తన పొట్టపై గాయం చేసుకున్నాడు. కనీసం మాకెవరికీ ఒక మాటైనా చెప్పలేదు. సహజత్వం కోసం అంతగా తపించాడు. నొప్పితో బాధపడుతున్నా సరే మాతో పంచుకోలేదు. చివరకు అతడు కదల్లేని స్థితిలో ఉండటంతో ఏమైందని చూడగా పొట్టపై గాయం ఉంది. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదీ అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం! కానీ ఆ మూవీ ధురంధర్లా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. మొదటి భాగం 2025 డిసెంబర్లో విడుదలవగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో భాగం ఈ ఏడాది మార్చి 19న రిలీజవగా ఇప్పటివరకు రూ.1600 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: లావుగా ఉందని నా భార్యపై ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే: విశ్వ -
మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే..: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలం క్రితమే గౌరీ స్ప్రాట్ను తన ప్రియురాలిగా అందరికీ పరిచయం చేశాడు. తనతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకుల గురించి ఓపెనయ్యాడు. ఆమిర్ మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను మద్యానికి దూరంగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నా మొదటి భార్య రీనాతో విడాకులయ్యాయో నేను పూర్తిగా మారిపోయాను. నియంత్రించుకోలేకపోయా..తను పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలేసిన రోజు తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాను. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. మందు ముట్టని నేను తాగుబోతుగా మారిపోయాను. అతిథుల కోసం ఇంట్లో మద్యం బాటిళ్లు ఉంటే వాటిని ఖాళీ చేయడం మొదలుపెట్టాను. ఏడాదిన్నరపాటు ప్రతిరోజు రాత్రి ఒక బాటిల్ తాగేశాను. మందుకు దూరంగా ఉండే నేను బాటిల్ ఖాళీ చేసే స్థాయికి దిగజారిపోయాను' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా ఆమిర్ ఖాన్.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్, కూతురు ఇరా ఖాన్ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో ఆమిర్.. దర్శకురాలు కిరణ్రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్ జన్మించాడు. ఆమిర్-కిరణ్ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని 2025లో తన బర్త్డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు!
చిరయ్యా.. ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సిరీస్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో నటుడు సిద్దార్థ్ షా ప్రధాన పాత్రలో నటించాడు. భార్య వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిప్రాయానికి విలువ ఇవ్వని భర్తగా కనిపించాడు. అయితే ఈ సిరీస్ రిలీజయ్యాక తనను ప్రజలు ఎంతగానో ద్వేషిస్తున్నారంటున్నాడు నటుడు సిద్దార్థ్ షా. అతడు మాట్లాడుతూ.. 'జనం నన్ను బ్లూ డ్రమ్లో పెట్టి చంపుదామన్నంత కసితో ఉన్నారు. బండబూతులుముఖ్యంగా మహిళలే ఈరకంగా వయొలెంట్గా ఆలోచిస్తున్నారు. పురుషులేమో బండబూతులు తిడుతున్నారు. చాలాచోట్ల ఇదే జరుగుతోందని, ఇప్పుడు ఈ సిరీస్ చూసి పురుష సమాజం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయిందని పలువురూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఈ ద్వేషాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆ కోపంలోనూ ప్రేమే కనిపిస్తోంది. బెడ్రూమ్ సీన్స్నాపై పీకలదాకా కోపం ఉందంటే నాకిచ్చిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశానన్నమాట! అయితే ఇంటిమేట్ (బెడ్రూమ్) సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు మాత్రం నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. మొదటిరోజే బెడ్రూమ్ సీన్స్ షూట్ చేశారు. ఫస్ట్ సీన్ తీయడానికి ముందే ఐదునిమిషాల పాటు గట్టిగా ఏడ్చేశాను. దీంతో కాసేపు చిత్రీకరణ నిలిపివేశారు. అందరూ నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఆ సీన్స్ షూట్ చేసేటప్పుడు టెన్షన్తో బిగుసుకుపోయాను. తీవ్ర సంఘర్షణనా శరీరం ముందుకు కదల్లేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆరు నెలలపాటు ఈ సిరీస్ నుంచి నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అవి ప్రేమ సన్నివేశాలు కావు, భార్యపై జరిగే అత్యాచార సీన్స్. హనీమూన్ సీన్ తర్వాత అయితే తీవ్ర సంఘర్షణకు లోనయ్యాను. ఇకపోతే ఆ సన్నివేశాలను నా కుటుంబం ధైర్యంగా తెరపై చూడలేకపోయింది' అని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు.చదవండి: అత్తామామకు సర్ప్రైజ్ ఇచ్చిన నయనిక రెడ్డి -
సాయిపల్లవి సినిమా.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్
సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఏక్ దిన్ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.పట్టు కోల్పోలేదుతాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్గా చెప్తానన్నాను.మేము ఒప్పుకోలేదుఉదాహరణకు.. ఏక్ దిన్ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్ క్లిప్స్ చూసిన ఆమిర్.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్కే సపోర్ట్ చేశాను. అప్పుడు ఆమిర్ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్కు పంపించేస్తాను అన్నాడు.క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్తర్వాత పూర్తి సాంగ్ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్ సీన్పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్ దిన్ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్ ఖాన్ గతంలో ఆమిర్ఖాన్ హీరోగా 'ఖయామత్ సే ఖయామత్ టక్', 'జో జీతా వొహి సికందర్' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచాయి.చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం -
అసలు మీరేం మాట్లాడుతున్నారు?.. గంగూలీకి నటి స్ట్రాంగ్ కౌంటర్..!
మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఇటీవల భోలేబాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్ షూటింగ్లో నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇదంతా షూటింగ్ కోసమే అయినా.. అతను నీటిలోకి ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.బాధలో ఉన్న ఆ కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని సౌరవ్ గంగూలీని స్వాస్తిక బెనర్జీ తప్పుపట్టింది. తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఆయన మాటలు తమ వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తమ పని విలువను తగ్గిస్తాయని స్వాస్తిక ముఖర్జీ అన్నారు.అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వాస్తిక పేర్కొన్నారు. గంగూలీ లాగా.. రాహుల్ లాంటి వాళ్లకు మద్దతు లభించదన్నారు. ఒకవేళ రాహుల్ నీటిలోకి దిగకపోయి ఉంటే.. అతని స్థానంలో మరో నటుడు వచ్చేవారని ఆమె తెలిపారు. ప్రస్తుత ఘటన చూస్తుంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను వేలేత్తి చూపుతోందన్నారు. కాగా.. బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతితో ఏప్రిల్ 7 నుంచి సినీ పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది. -
'దురంధర్-2 స్క్రిప్ట్ కాపీ కొట్టారు'.. డైరెక్టర్కు బిగ్ రిలీఫ్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.స్క్రిప్ట్ కాపీ కొట్టారు..దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్ తనదేనని.. ఆదిత్య ధర్ నా స్క్రిప్ట్ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆదిత్య ధర్ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆదిత్య ధర్ పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్కు ఉపశమనం లభించింది.కాగా.. 'ధురందర్ 2' రిలీజ్ తర్వాత తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రియుడితో హీరోయిన్ బ్రేకప్.. ఏడాదికే ఎండ్ కార్డ్..!
అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా. ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ టోస్టర్, సుందర్ పూనమ్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. అయితే వీరిద్దరి రిలేషన్పై ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్కు గుడ్ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్ రిలేషన్ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు. -
గుండె పగిలింది : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ హీరోయిన్, జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు. దీంతో జరీన్ శోకసంద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు,సహనటులు ఆమెకు సానుభూతి ప్రకటించారు.తన దుంఖాన్ని నటి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పెంపుడు పిల్లి రాంబోను కోల్పోయిన జరీనా తల్లిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తరచు తన తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది జరీనా. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు."మా ప్రియ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో ఈ విషాద సమయంలో ఆమెకు సానుభూతిని, అండను తెలియజేస్తూ సందేశాలు పంపుతున్నారు.హిందీ మూవీ 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ మరణం చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికి గురిచేసింది. టాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హీరో గోపీచంద్ సరసన చాణక్య మూవీలో కనిపించింది జరీన్ ఖాన్. అలాగే రామ్గోపాల్ దర్శకత్వంలో 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్ నటించింది. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్ చివరి సినిమా 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే'.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు! -
ఆ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా.. నా సక్సెస్కు అతడే కారణం: మృణాల్
తెరపై అవకాశాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్ రావడానికి కొందరికి ఏళ్లకు యేళ్లు పడుతుంది. మరికొందరికి వెంటనే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందులోనూ బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్ను దాటుకుని బుల్లితెర నటి అన్న ట్యాగ్ నుంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ నుంచి సినిమాల్లోకి..2012లో ముజ్సే కుచ్ కేటి.. యే ఖామోషియాన్ సీరియల్లో నటించింది. తర్వాత అర్జున్, కుంకుమ భాగ్య సీరియల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మరాఠిలో ఒకే ఏడాది (2014) మూడు సినిమాలు చేసింది. అయినా మృణాల్ ఠాకూర్కు బ్రేక్ రాలేదు. మళ్లీ సినిమా చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఓ హీరోతో చేసిన యాడ్ వల్ల తన కెరీర్ మలుపు తిరిగిందంటోంది మరాఠి బ్యూటీ.ఆ హీరో వల్లే..మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెకాయిట్. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. హీరో రణ్వీర్ సింగ్ నా లక్కీ చార్మ్. నేను చిత్రపరిశ్రమలో ఉండటానికి ఆయనే కారణం. కెరీర్ తొలినాళ్లలో మోడల్గా ఆయనతో కలిసి ఓ హెయిర్బ్రాండ్ యాడ్లో నటించాను. ఆ వాణిజ్య ప్రకటన రిలీజైన తర్వాతే చాలామంది దర్శకనిర్మాతలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనే ఇస్తాను. ఆయన నాకెంతో సాయం చేశారు. తనెప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటాడు. సినిమాధురంధర్ మూవీలో అయితే నాకు రణ్వీర్ కనిపించలేదు, హంజా మాత్రమే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. ఆయన ఇలాంటి బ్లాక్బస్టర్స్ మరెన్నో అందుకోవాలి అని చెప్పుకొచ్చింది. కాగా రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవగా.. ఈ ఏడాది మార్చి 19న దానికి సీక్వెల్ వచ్చింది. అదే ధురంధర్: ద రివేంజ్. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.చదవండి: అల్లు అర్జున్- అట్లీ సినిమా టైటిల్ ఇదే.. గుండుతో కనిపించిన బన్నీ -
దురంధర్ కలెక్షన్స్.. బాహుబలి-2 రికార్డ్పై గురి..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.దురంధర్-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్-2 ఈ రికార్డ్కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్-2 నిలవనుంది.ఇక కర్ణాటక బాక్సాఫీస్ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2' తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్
తమన్నా మాజీ బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్కు సైరత్' లాంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్లో కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. -
అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో అద్భుతమైన హిట్స్ అందుకున్నప్పటికీ.. గత కొన్నాళ్లుగా చాలా వెనకబడిపోయాడు. వరస సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ అనేది పెద్దగా దక్కట్లేదు. దీంతో తనకు గతంలో 'హేరా ఫేరీ' లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్తో కలిసి తీసిన మూవీ 'భూత్ బంగ్లా'. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ట్రైలర్ బట్టి చూస్తే ఓ బంగ్లా, అందులో వధాసుర్ అనే రాక్షసుడు, సిట్చూయేషనల్ కామెడీ ఇలా బాగానే ఉందనిపించింది. కాకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా నడుస్తోంది. లెక్క ప్రకారం ఈ శుక్రవారమే 'భూత్ బంగ్లా' థియేటర్లలోకి రావాలి. కానీ ధురంధర్ వల్లే వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పుడైనా హిట్ అవుతుందా అనేది ఇక్కడ సందేహంగా మారింది. హారర్ మూవీ జనాలని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? -
ధురంధర్: ది రివెంజ్ @ 1622 కోట్లు
‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ధురంధర్’. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్ పాండే, లోకేష్ థర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్: ది రివెంజ్) విడుదలైంది.గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టిందని యూనిట్ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్’ వేదికగా జియో స్టూడియోస్ సంస్థ తెలిపింది.ఇండియాలో రూ.1041 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్: ది రివెంజ్’ క్రియేట్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే నార్త్ అమెరికాలో ‘బాహుబలి: ది కన్క్లూజన్’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో పాతిక మిలియన్ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్ను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచిందని మేకర్స్ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వన్ మిలియన్ యూరోలు సాధించి సత్తా చాటింది. -
'అశ్వత్థామ'గా రామ్చరణ్.. ఆదిత్య ధర్తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు.తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్ను పంచుకున్నారు.ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్కపూర్ అంతకుముందు క్రౌడ్ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు. 15 Friends. 1 Party. 1 Mysterious Murder.But the real question is - who wanted him dead?Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026 -
'అశ్లీల సైట్లో నా ఫోటోలు.. బాయ్స్ చూసేవారు'
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది. అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్ తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్లైన్లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. -
లైట్స్... కెమెరా... క్రికెట్
బ్యాట్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్లోకి దిగారు బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు. గంగూలీలా మారిపోయారు. ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సౌరభ్ గంగూలీపాత్రలో రాజ్కుమార్ రావు నటిస్తున్నారు.విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ‘‘లైట్స్... కెమెరా... క్రికెట్... ‘దాదా’ చిత్రీకరణ మొదలైపోయింది’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా యూనిట్ తెలియజేసింది. షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.గంగూలీ క్రికెట్ లైఫ్నే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. ఇక దాదాపు రెండు దశాబ్దాలపాటు క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన గంగూలీ, 2008లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బిసీసీఐ ప్రెసిడెంట్గా సౌరభ్ గంగూలీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్గా పాకిస్థాన్లో అడుగుపెడతాడని, కొత్త గెటప్లో పాకిస్టాన్లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
రాముడిగా రణ్బీర్ సెట్ కాలేదు.. బాలీవుడ్ నటుడు కీలక వ్యాఖ్యలు!
దర్శకుడు నితీశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాపై నటుడు సునీల్ లహ్రీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాముడిగా పాత్రకి రణ్బీర్ కపూర్ అంతగా సెట్ అవ్వలేదన్నాడు. రాముడి పాత్రకు ఉండాల్సిన మృదు స్వభావం రణ్బీర్లో కనిపించలేదన్నాడు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘రామాయణ’టీజర్ చూశాను. అందులో నేను ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు కనిపంచలేదు. రాముడిగా రణ్బీర్ చూడడానికి బాగానే ఉన్నాడు. కానీ అతనిలో సున్నితం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. తన నటనతో అయినా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘రణ్బీర్ రాముడి పాత్ర కాకుండా లక్ష్మణుడు లేదా భరతుడి పాత్రలు పోషిస్తే బాగా సెట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న ‘రామాయణం’ సీరియల్లో లక్ష్మణుడు పాత్రని సునీల్ లహ్రీ పోషించాడు. ‘రామాయణ’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై రూ. 4000 భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదల కానుంది. -
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్ అవొద్దని అంటుంటారు. కానీ, తాను అదే స్కిప్ చేస్తానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. ఛావా, ధురంధర్ సినిమాలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయాడు అక్షయ్. అతడి యాక్టింగ్కు ప్రేక్షక జనం ఫిదా అయింది. చిన్నవయసులోనే బట్టతలతో బాధపడినప్పటికీ, దాన్నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్నాడు. లుక్స్తో కాకుండా టాలెంట్తో సమాధానం చెప్పాలనుకున్నాడు. ఆచితూచి పాత్రలు ఎంచుకుంటూ పోతూ తన సత్తా చూపించాడు. కెరీర్లో ఫుల్ బిజీగా మారిన ఈ నటుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఓసారి చూసేద్దాం.. నో స్నాక్స్అక్షయ్ ఖన్నా కేవలం రెండుపూటలే భోజనం చేస్తాడు. ఉదయం అల్పాహారం జోలికి వెళ్లడు. మధ్యాహ్నం, రాత్రిపూట మాత్రం తనకు నచ్చింది తినేస్తాడు. అలా అని మధ్యలో ఖాళీ దొరికితే బిస్కెట్లు, సాండ్విచ్లు తినే టైపు కాదు, కేవలం ఛాయ్ తాగుతాడంతే! ఎక్కువగా ఇంటి భోజనాన్నే ఇష్టపడతాడు. అన్నం, పప్పు, కూరగాయలు, చికెన్, చేపలు, ఏదైనా నాన్వెజ్.. ఇవే ఆయన మెనూలో తరచూ కనిపిస్తుంటాయి. రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీ ఆరగిస్తాడు.మంచి నిద్ర ముఖ్యంతేలికగా జీర్ణమయ్యే ఆహారానికే మొదటి ప్రాధాన్యతనిస్తాడు. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా ఇవే ఆహారపద్ధతులను కొనసాగిస్తుంటాడు. బెండకాయ, లిచీ పండ్లు, కేక్స్ తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా చెప్పాడు. అన్నింటికన్నా మంచి నిద్ర అవసరం అంటుంటాడు. రోజుకు 10 గంటలు నిద్రపోతాడు. అలసిన శరీరం, మనసుకు ఊరటనిచ్చేది నిద్రేనంటాడు. మరీ నోరు కట్టేసుకోకుండా సింపుల్ డైట్తోనే ఐదు పదుల వయసులోనూ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటున్నాడు అక్షయ్.చదవండి: మతిస్థిమితం కోల్పోయిన భానుప్రియ? స్పందించిన చెల్లెలు -
ధురంధర్లో విలన్గా.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్
కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా బాగా ఎలివేట్ అవుతుంటాయి. అలా ధురంధర్ మూవీలో కథానాయకుడు రణ్వీర్ సింగ్తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్గా అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డకైత్ పాత్ర అయితే విపరీతంగా హైలైట్ అయింది. అక్షయ్ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్.. ఇలా అన్నీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విలన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు పలువురు నటీనటులను సంప్రదించగా నిరభ్యంతరంగా తిరస్కరించారట! ముగ్గురు రిజెక్ట్ఈ విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా వెల్లడించాడు. బాలీవుడ్ హంగామాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. డకైత్ పాత్రను ముగ్గురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటుడు కాగా మరో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్. వాళ్లు చెప్పిన కారణమేంటంటే.. ఇందులో చాలా ఎక్కువమంది యాక్టర్స్ పని చేస్తున్నారు. పైగా ఇది పూర్తిగా రణ్వీర్ సినిమా అని ఆఫర్ను తిరస్కరించారు. ఆయన తప్ప అందరూ..వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్లో నటించేందుకు మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్.మాధవన్ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు, మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్: ద రివేంజ్ ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.చదవండి: ఐశ్వర్య ఇంట్లో ఉండాలి.. అంత ఇగో లేదు: అభిషేక్ బచ్చన్ -
ఐశ్వర్య ఇంటికే పరిమితం..నేనలాంటి వ్యక్తిని కాదు: అభిషేక్
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తనకు భార్య అవడానికి ముందు మంచి స్నేహితురాలు అంటున్నాడు హీరో అభిషేక్ బచ్చన్. పెళ్లయ్యాక తను పని చేయకూడదని ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అమ్మానాన్న పెళ్లి చేసుకునే సమయానికి నాన్న కంటే అమ్మనే పెద్ద స్టార్. అయినా వాళ్లు చక్కగా కలిసున్నారు. అందులో అసహజంగా ఏదీ కనిపించలేదు. వారి దాంపత్యాన్ని కళ్లారా చూశాను. కెరీర్ ప్రారంభంలోనే..ఆడవారి కన్నా మగవారే ఎక్కువ డామినెంట్గా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. నా రెండో సినిమా తనతో కలిసే చేశాను. నాతో కలిసి ఎక్కువసార్లు నటించిన హీరోయిన్ కూడా తనే! ఆ సమయంలో మేము ప్రేమలో లేము. మంచి ఫ్రెండ్స్లా కలిసున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. అలాంటి వ్యక్తిని కానునా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం మామధ్య లేదు. 'నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకో'వంటి చర్చ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అలాగే నా ఎదుగుదల కోసం ఎవరినీ వాడుకోను. ఇండస్ట్రీలో నటుడిగా నన్ను మా నాన్న లాంచ్ చేయలేదు, నాకోసం ఒక్క సినిమా కూడా తీయలేదు. పైగా నేనే నిర్మాతగా మారి ఆయన సినిమా చేశాను, అందుకు నేను చాలా సంతోషిస్తాను. పెళ్లిఈరోజు నేను సాధించిన విజయాలన్నీ నా కష్టం, ప్రయత్నం ద్వారా అందుకున్నవే! అని చెప్పుకొచ్చాడు. కాగా అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అభిషేక్- ఐశ్వర్య చాలా అరుదుగా జంటగా కనిపిస్తారు. దీంతో చాలాసార్లు వీళ్లు విడిపోయారంటూ ప్రచారం జరగడం, దాన్ని దంపతులు కొట్టిపారేయడం పరిపాటిగా మారింది.చదవండి: నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ -
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.టీజర్లో ఇది గమనించారా?హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. అలా వదిలేశారేంటి?34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.సినిమారామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026 చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా -
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
లైంగిక వేధింపుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకానంటోంది బుల్లితెర నటి, హిందీ బిగ్బాస్ 13వ కంటెస్టెంట్ ఆర్తి సింగ్. అప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్లేనని చెప్తోంది. చిన్న వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. అప్పుడు నాకు 13 ఏళ్లు. మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. చేతులు జోడించి బతిమాలినా..నేను మంచి నిద్రలో ఉండగా నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. నా గదిలోకి ఎందుకు వచ్చావని గొడవపడ్డాను. నాపైకి వస్తుంటే నువ్వు నా అన్నయ్యవి కదా, ప్లీజ్ వెళ్లిపో అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను. అతడు నా మాట వినలేదు. నేను బయట వరండా వైపు చూస్తే తలుపులు తాళం వేసి ఉన్నాయి. అమ్మ పొలానికి వెళ్లింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..అక్కడ వాతావరణం భయానకంగా మారింది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను వెంటనే అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేశాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాపై ఏ అఘాయిత్యం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అంది. ఆర్తి సింగ్.. గృహస్తి, పరిచయ్, ఉత్తరన్, దేవోన్ కే దేవ్.. మహాదేవ్, వారిస్, విక్రమ్ బేతాళ్కీ రహస్య గాథ వంటి పలు హిందీ సీరియల్స్లో నటించింది. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో నాలుగో రన్నరప్గా నిలిచింది.చదవండి: పెళ్లయిన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక పోస్ట్ -
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.టీజర్పై సీత ప్రశంసలుఈ టీజర్పై రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది. అప్పుడేమో విరక్తి'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!సీరియల్- సినిమాఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ సీరియల్లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: వెండితెరపై వీరుల పోరాటం -
దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్పాల్ యాదవ్, జిషు సేన్గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. -
'రామాయణ' టీజర్ రిలీజ్.. అయోధ్య నుంచి అరణ్యం వరకు!
చలనచిత్రపరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవిగా సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు.. దాన్ని సరిచేసేందుకు ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. 5 వేల ఏళ్లుగా మన హృదయాల్లో కొలువై, మనల్ని రక్షిస్తున్న నాయకుడు, పురాణ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు రాముడు అంటూ టీజర్లో పేర్కొన్నారు. టీజర్ రిలీజ్ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. రాముడు శివధనస్సు విల్లు ఎత్తినట్లుగా, వనవాసం చేసినట్లు, యుద్ధం చేసినట్లుగా.. పలు ఘట్టాలను క్లుప్తంగా చూపించారు. అంటే అయోధ్య నుంచి అరణ్యం వైపు సాగిన ప్రయాణాన్ని, రాక్షసులతో జరిగిన యుద్ధాన్ని కూడా చూపించారు. ఇందులో కేవలం రాముడి పాత్రను మాత్రమే రివీల్ చేశారు. రావణుడు, సీతల పాత్రలను చూపించలేదు. కేవలం 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాచివర్లో రావణుడి ఫేస్ రివీల్ కాకుండా ఆయన ఆహార్యాన్ని వెనక నుంచి చూపించారు. అది ఈ గ్లింప్స్కి హైలైట్గా నిలిచింది. మొత్తానికి వీడియో అదిరిందని, తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించిందని సినీప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న రామాయణ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
ఒకేసారి 20 సినిమాలు.. ఆయన అన్న ఒక్కమాట వల్ల..!
ఐదు పదుల వయసుకి దగ్గర్లో ఉన్న బాలీవుడ్ నటి దివ్య దత్తా పెళ్లికి మాత్రం దూరంగా ఉంది. కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్గానే బతికేస్తానంటోంది. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ఆచితూచి సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె తన సినీప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ మొదలుపెట్టాను. నా కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం వీర్ జారా. ఆ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో నాకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. నాలో ఆలోచన2007లో అనుకుంటా.. ఒకేసారి దాదాపు 20 సినిమాలకు సంతకం చేశాను. ఒకరోజు దర్శకనిర్మాత ఆదిత్య చోప్రాను కలవడానికి వెళ్లాను. చాయ్ తాగుతూ మాట్లాడుకున్నాం. నేను 20 సినిమాలకు సంతకం చేశానని సంతోషంగా చెప్పాను. అతడి వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ఇంతమంచి వార్త చెప్తే నీలో చలనం లేదేంటి? అని అడిగాను. నీకు డబ్బు అవసరం అంతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? అని అడిగాడు. లేదన్నాను. అలాంటప్పుడు ఒకేసారి అన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు. నువ్వు మంచి నటివి, ఆచితూచి అడుగులు వేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.సినిమాఆయన మాట వినాలా? వద్దా? అనేది నా ఛాయిస్. నేను ఇంటికెళ్లి ఆలోచించాను. నేను సంతకం చేసిన సినిమాలనుంచి తప్పుకున్నాను. ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కిచ్చేశాను. అప్పటినుంచి నాకు నిజంగా నచ్చిన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పుకొచ్చింది. కాగా దివ్య దత్త 2017లో వచ్చిన ఇరాడా మూవీకి గానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఈమె భాగ్ మిల్కా భాగ్, బద్లాపూర్, ఛావా వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా చిరైయా అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: ఫిబ్రవరి, మార్చి పాయే.. ఏప్రిల్ ఏమవుతుందో? -
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’) -
కీర్తి ‘శాశ్వత్’ o చేసిన ధురంధర్!
నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం కుదుపుని ఇస్తుంది కెరీర్కు మలుపును అందిస్తుంది. రాత్రికి రాత్రే తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్ ’ధురందర్’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్ను అనూహ్యమైన కుదుపుని అందించింది.వీరందరిలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ధురందర్ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్బస్టర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.గతంలో ఆదిత్య ధర్తో కలిసి ’ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ పనిచేశారు తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్ చిత్రంతో, తాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. «అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్ పాటల్ని జోడిస్తూ దురందర్ చిత్రాల్లో.. శాశ్వత్ చేసిన కొత్త ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్ హిట్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఆయన వ్యూహం అద్భుతంగా ఫలించింది.కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట దిల్ పే జఖ్మ్ ఖతే హై (1977), దిల్ (1990) నుంచి హమ్ ప్యార్ కర్నే వాలే (1990), తానేదార్ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.రణ్వీర్ సింగ్ తన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్లో టాప్లో నిలిచాడు. ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను బాలీవుడ్లో తదుపరి పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం. -
ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు
పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ లైఫ్టైమ్ కలెక్షన్స్ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్.కష్టపడి కథ రాసుకున్నా..ఆయన మాట్లాడుతూ.. ధురంధర్ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 2023లోనే రిజిస్టర్ చేయించా..అందుకే జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్ కపూర్ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్లోనే ఈ కథ రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్ 2 మూవీ యూనిట్పై కేసు వేయాలనుకుంటున్నాను.అదే బాధగా ఉందివాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్ కుమార్.. క్యాంపస్ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్ రాబిన్హుడ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునేంత సీన్ ఉందా? నటి ఆవేదన -
రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్బీర్ కపూర్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు.రిజెక్ట్ చేశా..అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్బీర్ కపూర్. న్యూయార్క్లో రామాయణ దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్కు హాజరయ్యాడు రణ్బీర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.కీలకమైన మలుపునేను ఆ పాత్రకు సెట్ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రామాయణ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా -
పూనమ్ పాండే ప్రెగ్నెంట్? నిజమా.. లేక?
పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో నటి పూనమ్ పాండేను మించినవారు లేరు. 2019లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. తీరా భారత్ కప్పు గెలవగా.. ఆమె అన్నంత పని చేయకుండా బీసీసీఐ పూనమ్ను అడ్డుకుంది. రెండేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించినట్లు తనపై తనే రూమర్ సృష్టించింది. అది నిజమేనని నమ్మిన జనం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో క్షమించండి, కేవలం అవగాహన కోసమే ఇలా చనిపోయినట్లు నాటకమాడానంది. మరో డ్రామా?ఇప్పుడు మరో స్టంట్ చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. తను గర్భవతిని అని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అదేంటి, భర్తతో విడిపోయిన పూనమ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అని డౌట్ పడుతున్నారు. అంతలోనే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలని తేల్చేశారు. ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ కింద ఇది ఏఐతో చేసిన ఫోటో అని స్పష్టంగా రాసుంది. అంటే అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ఇలా తాను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.సినిమాకాగా పూనమ్ పాండే బాలీవుడ్లో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో కథానాయికగా నటించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు.🤰🍼👶👼 pic.twitter.com/6UUAAc9rKj— Poonam Pandey (@iPoonampandey) March 31, 2026 చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్ -
గుడిలో గిన్నెలు శుభ్రం చేసిన 'వారణాసి' హీరోయిన్.. వీడియో వైరల్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్కు వెళ్లిపోయినా తన మూలాలను మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుకు నెట్టింట వైరల్గా మారిన వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. మంగళవారం నాడు ఆమె అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించింది. సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లిన ఆమె అక్కడున్నవారిని నవ్వుతూ పలకరించింది. ఆలయ సిబ్బంది సెల్ఫీ అడిగితే కాదనుకుండా ఓపికగా ఫోటోలు దిగింది. అనంతరం ఆలయసేవలో పాల్గొంది.వీడియో వైరల్గుడిలో వాడిన పాత్రలను కొందరు మహిళలు శుభ్రం చేస్తుంటే తను కూడా వారికి సాయం చేసింది. తలపై దుపట్టా కప్పుకుని గిన్నెలు కడిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ప్రియాంక అమెరికాలో సెటిలైనప్పటికీ తనలో భారతీయత ఉట్టిపడుతోందని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికినీ.. ఇలా సేవ చేయడాన్ని తను ఏమాత్రం చిన్నతనంగా భావించడం లేదు, నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు.సినిమాఇకపోతే ప్రియాంక చోప్రా చివరగా 'ద బ్లఫ్' అనే హాలీవుడ్ మూవీ చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రం 'వారణాసి'లో యాక్ట్ చేస్తోంది. మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Uptodate ਪੰਜਾਬੀ (@uptodatepunjabi) View this post on Instagram A post shared by Amritsar Paparazzi 📸 (@amritsar.paparazzi)చదవండి: అప్పుడే చనిపోవాలనుకున్నా: కోన వెంకట్ -
సినిమాల కంటే పుస్తకాలకే ప్రాధాన్యం: ఆమిర్ ఖాన్
సాధారణంగా నటీనటులు, దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు... ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా సినిమాలకే మా తొలి ప్రాధాన్యం అంటుంటారు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాత్రం ‘నేను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి, అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ‘‘నేను చాలా సంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న ఎంతో క్రమశిక్షణతో పెంచారు.సినిమాలు చూసే విషయంలో కఠినంగా ఉండేవారు. కేవలం దూరదర్శన్ లో వచ్చే పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా వారాంతంలో సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను సరే అంటే ఓకే... లేదంటే లేదు. అయితే రొమాంటిక్ లేదా కమర్షియల్ సినిమాలు చూడటానికి అనుమతించేవారు కాదు. దీంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. ఈ కారణంగా చిన్నతనం నుంచే పుస్తకాలతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే 18 ఏళ్లకే నేను అసిస్టెంట్గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత హీరోగా మారాను. కానీ నేను ఇప్పటికీ పెద్దగా సినిమాలు చూడను. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం.. మరికొందరికి చూడటం ఇష్టం. నేను ఆడే రకం. సినిమాలు చేస్తాను కానీ చూడను’’ అని చెప్పా రు ఆమిర్ ఖాన్. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న ‘ఏక్ దిన్’ మే 1న, ‘లాహోర్ 1947’ ఆగస్టు 13న విడుదల కానున్నాయి. -
నయనతార.. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇంతకుముందు షారూక్ ఖాన్తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం. ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది. -
దురంధర్-2ను వదలని పైరసీ.. యూట్యూబ్లో ప్రింట్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్ను తొలగించాలని యూట్యూబ్ను కోరింది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్ను ట్యాగ్ చేశారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. -
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి: సోనమ్కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 29న సోనమ్ కపూర్ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సోనమ్. ‘‘ప్రేమతో నిండిన మా హృదయాలతో మా బాబు రాకను మేం ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి.వాయు(పెద్ద కుమారుడు) తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. నలుగురు ఉన్న కుటుంబంగా మా జీవితాల్లో మేం ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. అందరికీ కృతజ్ఞతలు.. ప్రేమతో సోనమ్, ఆనంద్, వాయు’’ అన్న నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనమ్ కపూర్. సోనమ్కపూర్ (నటుడు– నిర్మాత అనిల్ కపూర్ కుమార్తె) వివాహం వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజ తో 2018లో జరిగింది. ఈ దంపతులకు 2022లో కుమారుడు ‘వాయు’ జన్మించిన సంగతి తెలిసిందే. -
ప్రభాస్, మహేశ్, తారక్ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆజాద్ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్తో ఇరగదీసి సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.సౌత్ సినిమాలంటే ఇష్టంఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.హీరోయిన్స్ కూడా..హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే! -
ఫస్ట్ది అట్టర్ ఫ్లాప్.. అందుకే హిందీలో సినిమా చేయట్లేదా? చై ఆన్సరిదే!
టాలీవుడ్ హీరో నాగచైతన్య చివరగా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన లాల్ సింగ్ చద్దా (2022) మూవీతో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమా ట్రై చేయలేదు చై.కారణమంటూ ఏం లేదుబాక్సాఫీస్ వైఫల్యం వల్లే అతడు మళ్లీ హిందీ సినిమా చేయడానికి భయపడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిపై నాగచైతన్య తాజాగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే! మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్లో యాక్ట్ చేస్తాను. లాల్ సింగ్ చద్దా వైఫల్యం వల్ల మాత్రం నేను వెనకడుగు వేయలేదు. చాలా ఎంజాయ్ చేశాఆ మూవీ షూటింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అక్కడి జనం దగ్గరినుంచి ఎంతో నేర్చుకున్నాను, వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. ఇక సినిమా రిజల్ట్ అంటారా? బాక్సాఫీస్ వద్ద ఒడిదుడుకులు సహజం అని అర్థం చేసుకునేంత పరిణతి మాకుందని భావిస్తున్నాను. ఈ ఫలితాలు మా లక్ష్యసాధనను ఏమాత్రం అడ్డుకోలేవు. సక్సెస్, ఫెయిల్యూర్ నా మైండ్సెట్ను మార్చలేవు అని నాగచైతన్య పేర్కొన్నాడు.చదవండి: అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ -
విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా?
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్ తన గ్లామర్తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.ప్రస్తుతం సారా నటించిన దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఫేవరేట్ హీరో..గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సారా అర్జున్ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ డియర్ కామ్రేడ్లో నటించడం వల్లే సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. -
సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్ ఖాన్
తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు. అమ్మ అనుమతితోనే..దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్ చూసేవాడిని.సినిమాలు చూడనుఅయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.సినిమాఇకపోతే ఆమిర్ చివరగా సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్, లాహోర్ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్ దిన్లో.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్ డే అనే థాయ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ఏక్ దిన్ మే 1న విడుదల కానుంది.చదవండి: ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2 -
విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్ షూటింగ్ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. బీచ్లో విషాదంఅది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు.ఇండస్ట్రీకి తీరని లోటుహీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సినిమారాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.చదవండి: ఓపక్క షూటింగ్.. మరోపక్క భార్య కోసం ఆరాటం -
దురంధర్-2 మరో రికార్డ్.. కేవలం 11 రోజుల్లోనే బ్రేక్..!
బాలీవుడ్ మూవీ దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 11 రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది రిలీజైన దురంధర్ ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1013.15 కోట్లు రాగా.. ఓవర్సీస్లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్గా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 847.87 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,307.35 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురందర్: ది రివెంజ్' నిలిచింది. దీనికంటే ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) రూ. 2,070 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి- 2 (2017) రూ. 1,788 కోట్లతో ఉంది. అల్లు అర్జున్ పుష్ప- 2 (2024) రూ. 1,742 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ దురంధర్ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీస్లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
నాలుగు పదుల వయస్సులో తల్లైన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.వ్యాపారవేత్తతో పెళ్లి..ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
ఓపక్క షూటింగ్స్.. మరోపక్క భార్య కోసం హీరో ఆరాటం!
ఒక సినిమా హిట్టయిందంటే.. దానికి సీక్వెల్గా వచ్చేదానిపై భారీ అంచనాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ పరీక్షను ఈజీగా నెగ్గేసింది ధురంధర్ టీమ్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చిన మూడు నెలల్లోపే సీక్వెల్ కూడా రెడీ చేసి వదిలాడు దర్శకుడు ఆదిత్య ధర్.గర్భిణి అయిన భార్య కోసం..రెండో భాగం కూడా ప్రేక్షకుల మనసు గెల్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డు తిరగరాస్తోంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్, డెడికేషన్కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. ధురంధర్ మొదటి భాగం చిత్రీకరణ సమయంలో అతడి భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గర్భిణీ అన్న విషయం తెలిసిందే! ఓపక్క బిజీ షెడ్యూల్లో పని చేస్తూనే మరోపక్క భార్య కోసం సమయం కేటాయించాడట! ఈ విషయాన్ని ధురంధర్ మూవీ నటుడు అభయ్ అరోరా వెల్లడించాడు.నిజంగా అద్భుతంరణ్వీర్ షూటింగ్ మధ్యలో మూడు, నాలుగు రోజులు గ్యాప్ దొరికినా సరే.. వెంటనే విమానం ఎక్కి ఇంట్లో వాలిపోయేవాడు. భార్యను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాస్తంత సమయం దొరికినా కుటుంబం కోసం సమయం కేటాయించేవాడు. అతడు ఫ్యామిలీని చూసుకునే విధానం నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్లీలా సినిమా (2013) సెట్లో ప్రేమలో పడ్డారు. 2015లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు దువా జన్మించింది.చదవండి: ఈవారం ఓటీటీల్లో బోలెడన్ని సినిమాలు.. ఏమేం ఉన్నాయంటే? -
జోడీ కుదిరింది
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని, ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించడం దాదాపు ఖరారైయిందని, కథ నచ్చి ఆమె ఒప్పుకున్నారని సమాచారం.ఈ జోడీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్ చివర్లో ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్బాస్-18 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
దురంధర్-2పై విమర్శలు.. దెబ్బకు సోషల్ మీడియా ఖాతా డిలీట్...!
మార్చి నెల అంతా దురంధర్ పేరే వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటేసింది. వసూళ్ల పరంగా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. పార్ట్-1 రిలీజైన మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి నుంచే భారీ అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్స్ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.అయితే ఈ మూవీ ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. విమర్శలు సైతం అదేస్థాయిలో చేస్తున్నారు. ప్రాపగండ అనే ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్ సీక్వెల్పై విమర్శలు చేసింది. ఈ సినిమా 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా చిత్రీకరించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదంతో ఊహించని విధంగా ఆమె ఇన్స్టా ఖాతా డిలీట్ చేసేసింది. మొదట ప్రైవేట్గా ఉంచిన రీత్ పడ్డా.. ఆ తర్వాత ఏకంగా ఖాతానే తొలగించింది. ప్రస్తుతం ఇన్స్టాలో ఆమె ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈ వివాదం తర్వాత ఆమె లింక్డ్ఇన్ ఖాతాను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ధురందర్తో సహా ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాలను రీత్ విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై నెట్టింట పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో ఏకంగా సోషల్ మీడియా ఖాతానే మూసేయాల్సి వచ్చింది.అంతేకాకుండా రీత్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆన్లైన్లో ట్రోల్స్ వచ్చాయి. ఫాజిల్ అహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తమపై వస్తున్న ట్రోల్స్పై రీత్ గానీ, అనీత్ పడ్డా గానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు నటి అనీత్ పడ్డా మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. -
సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్
ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో మెప్పించింది. కానీ పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరమైంది. అందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను సాంప్రయదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చాను. ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేయాలని మా నాన్న ఆలోచన. అలాగే 40, 50 ఏళ్లుచ్చేవరకు మహిళలు పని చేయకూడదని అనుకుంటాడు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని..మా ఇంట్లో అందరూ నాకు త్వరగా పెళ్లి చేయాలనే అనుకున్నారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడే నా భర్త కుటుంబం గురించి తెలుసు. వాళ్లు మా పొరిగింట్లోనే ఉండేవారు. అలా వాళ్ల గురించి పూర్తిగా తెలుసు గనకే నన్ను ఆ ఇంటికి పంపించారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అమ్మ మరీమరీ చెప్పింది. అత్తింట్లో బాగా చూసుకుంటారని ధైర్యం ఇచ్చింది. నేనెప్పుడూ ఇంట్లో వాళ్ల మాట కాదనలేదు. నాకు ఇంకొంతకాలం సినిమాలు చేయాలన్న ఆశయితే ఉండేది. నా భర్త ఓపికగా ఎదురుచూశాడుకానీ, ఇంట్లో వాళ్లను నొప్పించలేక మయూర్ను పెళ్లి చేసుకున్నాను. అతడు భారత్లో ఉండేవాడు కాదు, ఇంగ్లాండ్లో చదువుకునేవాడు. అతడి కుటుంబం ఉగాండాలో బిజినెస్ చేస్తుండేది. వారిది మంచి ఉన్నత కుటుంబం. అయితే పెళ్లయ్యాక వెంటనే సినిమాలు మానేయలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్లో పాల్గొన్నాను. దాదాపు రెండేళ్లలో షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాను. అప్పటివరకు నా భర్త ఎంతో ఓపికగా ఎదురుచూశాడు అంది.చాలా చిన్నదాన్నినటుడు షమ్మీ కపూర్తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. పైగా షమ్మీ తండ్రి పృథ్వీరాజ్ కపూర్.. తనకు కాబోయే కోడలు పని చేయకూడదని కండీషన్ పెట్టాడు. నాకంటూ అప్పుడు చాలా కలలు, కోరికలున్నాయి. అందుకే పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నాను. పర్సనల్ లైఫ్ఆయన పెట్టిన కండీషన్ వల్లే షమ్మీ భార్య గీతా బాలాజీ కూడా పెళ్లవగానే సినిమాలు మానేసింది అని చెప్పుకొచ్చింది. కాగా ముంతాజ్.. షమ్మీ కపూర్ను పెళ్లాడేందుకు రెడీ అయింది. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అనంతరం ఉంగాడాలో బిజినెస్ చేసే మయూర్ మాధ్వానిని 1974లో పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.చదవండి: నా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదు: మెరీనా వార్నింగ్ -
రెండు వారాలుగా బెడ్పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?
క్రిష్, వార్ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. గత నాలుగేళ్లుగా షబా ఆజాద్ అనే నటి, సింగర్తో రిలేషన్లో ఉన్నాడు. గతంలో సుస్సానే ఖాన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చేసి షబాతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈమెకు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. స్వయంగా దాని గురించి ఈమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)'సైక్లోస్పోరా కయోటానెన్సిస్' అనే పారాసైట్(పరాన్నజీవి) వల్ల కలిగే వ్యాధిని 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులు తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనకున్న కారణం తెలిసి షబా షాకయ్యింది. ఎప్పుడూ ఇంటిలో వండిందే తింటానని, బయటకెళ్లినా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్తానని, ఇంత శుభ్రత పాటించినా ఈ పరాన్నజీవి తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్(ప్రియుడు) తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. నా మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫొటోని షబా షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్) View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) -
హనుమాన్ జయంతికి రామ గ్లింప్స్
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా శుక్రవారం (మార్చి 27) శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ‘రామ’ గ్లింప్స్ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘‘రామాయణం మన అందరికీ చెందిన కథ.‘రామాయణ’ చిత్రాన్ని నిజమైన స్ఫూర్తితో, అత్యంత చిత్తశుద్ధితో తెరపైకి తీసుకురావడానికి మేము వేసే ప్రతి అడుగుకూ అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలే మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా మేం చేసిన కృషిని ఫ్యాన్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నాం. ఆ క్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నమిత్ మల్హోత్రా ‘ఎక్స్’లో షేర్ చేశారు. అయితే ‘రామ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ అమెరికాలో జరగనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్.


