హిందీలో స్పై థ్రిల్లర్ సినిమాలంటే గతేడాది నవంబరు ముందు వరకు యష్ రాజ్ సంస్థ నిర్మించిన మూవీసే గుర్తొచ్చేవి. ఎప్పుడైతే 'ధురంధర్' వచ్చిందో వీటిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అంతలా 'ధురంధర్' ఫ్రాంచైజీ ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి కొత్త మూవీ రిలీజ్కి సిద్ధమైంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?)
యష్ రాజ్ స్పై యూనివర్స్లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, వార్ 2 తదితర చిత్రాలు వచ్చాయి. చివరగా వచ్చిన 'వార్ 2'లో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ నటించాడు. కానీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా'. ఆలియా భట్, శర్వారీ లీడ్ రోల్స్ చేశారు. వచ్చే నెల 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు.
యష్ రాజ్ స్పై యూనివర్స్లో ఇప్పటివరకు భారత్-పాక్ కాన్సెప్ట్తో మూవీస్ వచ్చాయి. 'ఆల్ఫా'లో మాత్రం స్టోరీ మారినట్లు కనిపిస్తుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. పసిపాపగా ఉన్నప్పుడే ఆలియాని విలన్ ఎత్తుకొచ్చేశాడు. ఆమెని ఆయుధంలా తయారు చేసి, భారత ఆర్మీపై ప్రయోగిస్తాడు. ఈ క్రమంలోనే ఆలియా అలియాస్ ఆల్ఫాకు తన గతం ఎలా తెలిసింది? ఇందులో మరో హీరోయిన్ శర్వారీ, ఆర్మీ అధికారి అనిల్ కపూర్ పాత్రలేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆలియా కూడా ఫైట్స్ గట్టిగానే చేసినట్లు కనిపిస్తుంది. మరి 'ధురంధర్' చూసిన కళ్లతో ఆడియెన్స్.. 'ఆల్ఫా'ని ఆదరిస్తారా అనేది పెద్ద క్వశ్చన్.
(ఇదీ చదవండి: స్టార్ హీరోతో ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు, ప్రియురాలు)


