breaking news
Bollywood
-
హాలీవుడ్ బ్యూటీకి జాక్పాట్.. ఏకంగా రూ.530 కోట్లా?
సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్ స్టార్స్ ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్కు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్ సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి ఈ బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె ఈ డీల్ అంగీకరిస్తే బాలీవుడ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని ఓ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ బిగ్ డీల్కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఆ తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Sydney Sweeney (@sydney_sweeney) -
బాక్సాఫీస్ మాత్రమే కాదు.. ఓటీటీలోనూ సంచలనమే!
ఈ ఏడాది సూపర్ హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. ఈ చిత్రం ద్వారా అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్ చేసింది. కేవలం మౌత్ టాక్ పవర్తో బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్లో అనేక చిత్రాల కలెక్షన్స్ను దాటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా ఛావా రికార్డ్ను కూడా దాటేసింది.ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మనోజ్ భాజ్పాయ్ నటించిన 'ఇన్స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది. -
జాన్వీ కపూర్ లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హాలీవుడ్ చిత్రనిర్మాత మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.హౌమ్ బౌండ్ కథేంటంటే..నార్త్ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్ బౌండ్’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
అదంతా పీఆర్ స్టంట్.. నోరు విప్పుతానని చాహల్ భయపడ్డారు: ధనశ్రీ వర్మ
ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్వశ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్లో భాగంగానే చేశారని విమర్శించింది. ఓ ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ అర్బాజ్ పటేల్ చాహల్ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు. అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్వశ్తో రిలేషన్పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది. -
ఐశ్వర్య అంటే ఆ హీరోకి పిచ్చి.. ఆమె ఇంటిముందు సీన్ క్రియేట్ చేసేవాడు
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందానికి మంత్రముగ్ధులు కానివారు ఉండరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆమెను ఆరాధించారు. కొందరు ఆమెతో ప్రేమలో పడ్డారు, ఒకరిద్దరు ఆమె ప్రేమను తిరిగి పొందారు. వారిలో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఒకప్పుడు సల్మాన్ - ఐశ్వర్య ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. 2002లో వీరి బ్రేకప్ స్టోరీ బీటౌన్లో సంచనలంగా మారింది. సల్మాన్తో బ్రేకప్తాజాగా దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్.. ఐష్- సల్మాన్ల బ్రేకప్ గురించి మాట్లాడారు. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్తో బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టింది. అప్పుడు తను చాలా బాధపడింది. వీటి గురించి పట్టించుకోవద్దని ఆమెకు ధైర్యం చెప్పేవాడిని. సల్మాన్ కోసం ఇండస్ట్రీ తనను వెలేయడం తట్టుకోలేకపోయింది. అయితే బ్రేకప్ తర్వాతే తను కాస్త ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే తను అతి ప్రేమ, కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేవాడు. తల గోడకేసి బాదుకునేవాడునేనూ అదే అపార్ట్మెంట్లో ఉండేవాడిని కాబట్టి తను వచ్చివెళ్లేది కనిపిస్తూ ఉండేది. అతడి ప్రవర్తన చూశాక.. ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావ్? అని అడిగాను. అతడు ఐశ్వర్య కోసం ఆమె ఇంటికి వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. తల గోడకేసి బాదుకునేవాడు. అధికారికంగా ప్రకటించే సమయానికంటే ముందే వీళ్లిద్దరూ విడిపోయారు అని చెప్పుకొచ్చారు. కాగా 2007వ సంవత్సరంలో ఐశ్వర్య.. బిగ్బీ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఆరాధ్య సంతానం.చదవండి: ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు! -
Sai Pallavi: బాలీవుడ్లో బుజ్జి తల్లి బిజీ టాలీవుడ్ లో మాత్రం..
-
కిక్ ఇచ్చేలా 'దిశా పటాని' ఫోజులు.. ట్రెండింగ్లో (ఫోటోలు)
-
'పురుషులు, మహిళలు ఓకే బెడ్పై.. బిగ్బాస్పై నటి షాకింగ్ కామెంట్స్'
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్లో ఎప్పటికీ బిగ్బాస్లో పాల్గొనని చెప్పింది.తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్బాస్ మేకర్స్లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్పై పడుకుంటారు. అదే ప్లేస్లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్బాస్కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. -
ఏడాదిగా డేటింగ్.. సీక్రెట్గా హీరోయిన్ నిశ్చితార్థం?
మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది. బాలీవుడ్కి హ్యుమా ఖురేషి.. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏడాది నుంచి ఓ యాక్టింగ్ కోచ్తో ఈమె రిలేషన్లో ఉందని, రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా వెళ్లొచ్చారని, ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? హ్యుమా కాబోయే భర్త ఎవరు?(ఇదీ చదవండి: నేను ధనుష్ని వెన్నుపోటు పొడవలేను: జీవీ)'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపుర్' సినిమాలతో నటిగా పరిచయమైన హ్యుమా ఖురేషి.. 2012 నుంచి హిందీలో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. మలయాళంలో వైట్, తమిళంలో అజిత 'వలిమై', రజినీకాంత్ 'కాలా' చిత్రాల్లోనూ హీరోయిన్గా చేసింది. 'మహారాణి' వెబ్ సిరీస్తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. గత ఏడాది నుంచి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారని, అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.రీసెంట్గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా హ్యుమా-రచిత్ వెళ్లొచ్చారు. ఇప్పుడు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని బాలీవుడ్లో వినిపిస్తుంది. ఇది నిజమే అయినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని సన్నిహితుల మాట. హ్యుమాకి ప్రస్తుతం 39 ఏళ్లు. రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్కి చెందిన కుర్రాడు. మోడలింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. 2016లో ముంబై వచ్చేసిన తర్వాత యాక్టింగ్ కోచ్గా మారిపోయి సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి హ్యుమా-రచిత్.. తమ నిశ్చితార్థం నిజం ఎప్పుడు చెబుతారో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?) -
వచ్చే నెలలో కత్రినా కైఫ్ గుడ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ను పెళ్లాడింది. 2021లో వీరిద్దరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఈ జంటపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కత్రినా గర్భంతో ఉన్నారని చాలాసార్లు కథనాలొచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.అయితే ఈసారి ఏకంగా ఈ జంటపై మరో ప్రచారం మొదలైంది. వచ్చేనెలలోనే కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోది. ప్రస్తుతం ఆమె మూడో త్రైమాసికంలో ఉన్నారని.. వచ్చేనెల లేదా నవంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. కత్రినా ప్రసవం తర్వాత సుదీర్ఘంగా విరామం తీసుకోవాలని యోచిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.రెండు నెలల క్రితం కత్రినా కైఫ్ ఓవర్సైజ్ షర్ట్లో కనిపించడంతో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వినిపించాయి. ఆ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తమపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై గతంలోనే విక్కీ కౌశల్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని.. ఏదైనా ఉంటే తామే స్వయంగా చెబుతామన్నారు. అంతేకాకుండా 'బ్యాడ్ న్యూజ్' ట్రైలర్ సమయంలో కూడా కత్రినా గర్భం ధరించారని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో కూడా ఇలాంటి వార్తల్ని ఆయన ఖండించారు. అయినప్పటికీ ఈ జంటపై పలు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే కత్రినా తన కాస్మెటిక్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ మరోసారి ఆమె గర్భవతి అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా వస్తోన్న కథనాలపై కత్రినా, విక్కీ కౌశల్ క్లారిటీ ఇస్తే కానీ ప్రెగ్నెన్సీ రూమర్స్కు చెక్ పడేలా కనిపించడం లేదు.మరోవైపు విక్కీ కౌశల్ ఈ ఏడాది ఛావాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. విక్కీ ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియా భట్తో కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నారు.We got #VickyKaushal - #KatrinaKaif content today, but wait a minute….. are they expecting 👩🍼? pic.twitter.com/QrhZ1z5Xnf— Bollywood Talkies (@bolly_talkies) July 30, 2025 -
ఐశ్వర్య-అభిషేక్ బాటలో ప్రముఖ నిర్మాత!
ఇటీవల బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వినియోగించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఐశ్వర్య, అభిషేక్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తన పేరుతో నిధులను సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిటిషన్ వేశారు. ఈ మేరకు కరణ్ తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతి లేకుండా తన ఫోటోలు వినియోగిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో కరణ్ పేరుతో అనధికార పేజీలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. -
మాజీ లవర్ పెళ్లికి వెళ్లి మరొకరితో ప్రేమలో.. ఫన్నీగా ట్రైలర్
ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్.. ఓ హిందీ మూవీని విడుదలకు సిద్ధం చేసింది. 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' పేరుతో తీసిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబరు 2న సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)ట్రైలర్ బట్టి చూస్తే ఇదో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సన్నీ(వరుణ్ ధావన్).. అనన్య (సన్య మల్హోత్రా)ని ప్రేమిస్తాడు. ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె ఇతడిని రిజెక్ట్ చేసి విక్రమ్(రోహిత్ షరాఫ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. మరోవైపు విక్రమ్.. తన ప్రియురాలు తులసి(జాన్వీ కపూర్)కి బ్రేకప్ చెప్పేస్తాడు. దీంతో సన్నీ-తులసి కలిసి విక్రమ్-అనన్య పెళ్లికి వెళ్తారు. నానా హంగమా చేస్తారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్) -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
30 ఏళ్లకే తల్లి పాత్రలా?.. ఛావా నటి ఆవేదన
ఈ ఏడాది ఛావా, ఆజాద్ చిత్రాలతో మెప్పించిన బాలీవుడ్ డయానా పెంటీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలను ట్రీట్ చేసే విధానంపై స్పందించారు. ఇండస్ట్రీలో మహిళలను సామర్థ్యం కంటే.. కేవలం బాహ్య రూపానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. కేవలం 30 ఏళ్ల వయసులేనే ఎంతోమంది పిల్లలకు తల్లిగా నటించే పాత్రలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డయానా మహిళా నటుల పట్ల చిత్ర పరిశ్రమ వైఖరిని ప్రశ్నించింది.డయానా మాట్లాడుతూ.. 'ఉదాహరణకు ఒక వేదికపై మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు.. మీ అందం మీరు అద్భుతం ప్రశంసిస్తారు. ప్రజలు మర్యాదగా ప్రవర్తిస్తూ మీ రూపాన్ని ప్రశంసించడం చాలా బాగుంది. కానీ ఒక మహిళగా అది అంతకు మించి ఉంటుందని ఆశిస్తారు. ఒక నటిగా కేవలం అందం మాత్రమే కాకుండా.. నైపుణ్యం, నటనతో ప్రసిద్ధి చెందగలమని ఆశిస్తాం. అది మాకు చాలా అవసరం కూడా. మహిళ నటులను కేవలం బ్యూటీఫుల్, అద్భుతం అని పిలవడం మంచిదే.. కానీ అది సరిపోదు. ఇది ఒక పోరాటం కాదు. కొంతకాలంగా ఒక ఈ పద్ధతిని అంగీకరించడం ప్రారంభించారు. నేను అలాంటి దానిలో భాగం కావాలా వద్దా అనేది నా సొంత నిర్ణయం. దీన్ని ఎదుర్కోవడానికి అదే ఉత్తమ మార్గం. ఇది నాకు మాత్రమే కాదు.. అందరికీ వర్తిస్తుంది' అని పంచుకున్నారు.కాగా.. డయానా ప్రస్తుతం 'డు యు వాన్నా పార్టనర్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో తమన్నా భాటియా, జావేద్ జాఫెరి, నకుల్ మెహతా, శ్వేతా తివారీ, నీరజ్ కబీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్కు కోలిన్ డి'కున్హా, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సహ నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం డు యు వన్నా పార్టనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
తమన్నా లాంటి భార్య దొరికిందని అతడు ఆనందపడాలి
దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటోంది.అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు) -
మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్తో పాటు రణ్బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
రైల్లో నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.కదులుతున్న రైలు నుంచి దూకేశా'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్గేట్కు వెళ్దామనుకున్నాను. స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. సినిమాఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్లో నటించింది. రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ కేసులో హీరోయిన్ హన్సికకు షాక్..!
హీరోయిన్ హన్సిక సినిమాల కంటే వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయి. తన ఇన్స్టా అకౌంట్ నుంచి హన్సిక పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా సోహెల్కు రెండో పెళ్లి కావడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని మరో టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ చూస్తుంటే తనకు నవ్వొస్తుందని హన్సిక కొట్టిపారేసింది.ఈ సంగతి అటుంచితే గతంలో హన్సికతో ఆమె తల్లి జ్యోతిలపై సోదరుడి భార్య ముస్కాన్ గృహ హింస కేసు పెట్టారు. తనను వేధింపులకు గురి చేశారని బుల్లితెర నటి ముస్కాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే హన్సిక, ఆమె తల్లికి ముంబయి సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ కేసును క్వాష్ చేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా హన్సిక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. హన్సిక దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ కేసులో నిరాశే ఎదురైంది. కాగా.. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ ఫిర్యాదు చేసింది. -
నేషనల్ అవార్డ్ విన్నర్ కొత్త సినిమా.. రేపే రిలీజ్
తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్ రెడ్డి. ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్- నేపాల్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్ బాజ్పాయ్, ప్రియాంక బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత గునీత్ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు. -
జాన్వీ కపూర్ సినీ కెరీర్ లో కొత్త మలుపు!
-
సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) గురించి ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా అవీ కూడా ఓటీటీల్లోనే నేరుగా రిలీజయ్యాయి. ఈ ఏడాది హౌస్ఫుల్ -5, కాళీధర్ లపత్తా లాంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవలే అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఏఐ- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య ప్రస్తావించారు.అదే బాటలో అభిషేక్ బచ్చన్..అయితే తన భార్య పిటిషన్ వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కొన్ని వెబ్సైట్లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ అనధికారికంగా ఫోటోలను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఆయన అభ్యర్థించారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దయచేసి ఆ వెబ్సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు. ఒక రోజు సమయం ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. కొందరు వ్యక్తులు ఏఐతో అభిషేక్ ఫొటోలు క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్కు ఉపయోగించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. -
చిన్నారికి అరుదైన వ్యాధి.. హీరోయిన్ ఆపన్నహస్తం
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులోని బాబు తల బెలూన్లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్ (Hydrocephalus) అని పిలుస్తారు. అరుదైన వ్యాధిఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్ పెట్టాడు. మంచి మనసుకాగా జాక్వెలిన్ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్.. వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hussain Mansuri (@iamhussainmansuri) చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్మ్యాన్ -
ఫిల్మ్ఫేర్ గ్లామర్ అవార్డ్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ (ఫొటోలు)
-
మా తండ్రి ఆస్తుల్లో వాటా ఇవ్వాలి.. కోర్టుకెక్కిన కరిష్మా కపూర్ పిల్లలు
న్యూఢిల్లీ: తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం ప్రారంభించారు. తండ్రి ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటా దక్కేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. సంజయ్ కపూర్కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మరణానికి ముందు ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఆయన రాసినట్లు చెబుతున్న విల్లు నకిలీదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు ఆరో పించారు.ఆస్తులు మొత్తం కొట్టేయడానికి తమ సవతి తల్లి ప్రియా కపూర్(ప్రియా సచ్దేవ్) కుట్ర చేస్తోందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఎస్టేట్ మొత్తం ప్రియా కపూర్ కు దక్కేలా సంజయ్ కపూర్ విల్లు రాసినట్లు సమాచారం. అయితే, ఆ విల్లును కుట్ర పూరితంగా సృష్టించారని, అది నిజమైన విల్లు కాదని కరిష్మా కపూర్ కుమార్తె, కుమారుడు తేల్చిచెప్పారు. దాని గురించి తమ తండ్రి సంజయ్ కపూర్ కానీ, సవతి తల్లి ప్రియా కపూర్ కానీ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రియా కపూర్ దురుద్దేశంతోనే హఠాత్తుగా నకిలీ విల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. సంజయ్ కపూర్కు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టేలా ప్రియా కపూర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు.ఏమిటీ వివాదం? ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్ కపూర్ 2003లో కరిష్మా కపూర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే.లండన్లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది. దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సంజయ్ తల్లి రాణి కపూర్ యూకే ప్రభుత్వాన్ని కోరారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తులపై వివాదం మొదలైంది. రెండో భార్య సంతానం, మూడో భార్య మధ్య పోరాటం సాగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రియా సచ్దేవ్గానే ఉన్న మూడో భార్య ఇటీవలే తన పేరును ప్రియా కపూర్గా మార్చుకోవడం గమనార్హం. అంతేకాకుండా తన అత్త రాణి కపూర్పై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు ప్రియా కపూర్పై ఆరోపణలు వస్తున్నాయి. -
రూ.80 కోట్ల మోసం.. ఆ డెరెక్టర్ పెద్ద మోసగాడు: ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు. -
రూ.30 వేల కోట్లు కొట్టేసే ప్లాన్.. సవతి తల్లిపై హీరోయిన్ పిల్లలు ఆరోపణ
బాలీవుడ్లో మరో ఆస్తి వివాదం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. తమకు సవతి తల్లి ఫేక్ వీలునామా ఇచ్చిందని ఈ పిల్లలిద్దరూ ఆరోపణ చేస్తున్నారు. తండ్రి ఆస్తిలో తమ వాటా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరుగుతోంది?బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. 2003లో సంజయ్ కపూర్ అనే బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటికే అతడికి ఓసారి పెళ్లయి విడాకులు తీసుకున్నాడు. అంటే కరిష్మా రెండో భార్య. దాదాపు 13 ఏళ్ల పాటు ఈమెతో కలిసున్న సంజయ్.. 2016లో విడాకులు ఇచ్చేశాడు. వీళ్లకు సమైరా, కియాన్ అని ఇద్దరు పిల్లలు. కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్.. ప్రియ సచ్దేవ్ని వివాహమాడాడు.(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్నా.. ఇంత విషం ఇవ్వండి: హీరో దర్శన్)ఈ ఏడాది జూన్లో సంజయ్ కపూర్.. గుండెపోటుతో చనిపోయాడు. అప్పటినుంచి తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు అంటున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ మీటింగ్లోనూ నకిలీ వీలునామా చూపించిందని, తండ్రి మరణానంతరం ఆస్తి వివరాలు చెప్పేందుకు గానీ సంబంధిత డాక్యుమెంట్స్ చూపించేందుకు గానీ ఆమె నిరాకరిస్తోందని పేర్కొన్నారు. చట్టపరంగా ఆస్తిలో తమకు రావాల్సిన వాటాని ఇప్పించాలని కోర్టుని ఆశ్రయించారు.సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామా దాచిపెట్టి నకిలీది సవతి తల్లి ప్రియ తమకు చూపించిందనేది కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ. మరోవైపు ప్రియ సచ్దేవ్తో పాటు పలువురు వ్యక్తులు బలవంతంగా తమ తల్లి నుంచి సంతకాలు తీసుకున్నారని సంజయ్ సోదరి మందిర కపూర్ మీడియాకు చెప్పింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంజయ్ మరణించే నాటికి అతడి ఆస్తి విలువ దాదాపు రూ.30 వేల కోట్లు అని సమాచారం.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న యువ హీరోయిన్) -
అతని కోసం రూ.70 లక్షలు వదులుకున్న శ్రీదేవి: బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించింది. వెండితెరపై తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ ఊహించని విధంగా 2018లోనే ఓ హోటల్లో మరణించింది. ఆమె చివరిసారిగా నటించిన చిత్రం మామ్. ఆమె భర్త బోనీ కపూర్ నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మామ్ కోసం శ్రీదేవి చాలా కష్టపడిందని అన్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వర్షన్స్కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని తెలిపారు. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ సైతం వదులుకుందని వెల్లడించారు.బోనీ మాట్లాడుతూ.. "మామ్ షూటింగ్ సమయంలో మేము ఏఆర్ రెహమాన్ను తీసుకోవాలనుకున్నాం. కానీ అతనికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంత ఖర్చు మేం భరించలేకపోయా. శ్రీదేవి రెమ్యునరేషన్ కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టాం. కానీ ఆమె నాకు బ్యాలెన్స్ డబ్బులేవీ వద్దు. ఆ మిగిలిన మొత్తం రూ.70 లక్షలు రెహమాన్కు ఇచ్చిన తీసుకురావాలని చెప్పిందని' గుర్తు చేసుకున్నారు.అంతేకాకుండా మామ్ షూటింగ్ సమయంలో తనతో గది పంచుకోవడానికి కూడా శ్రీదేవి నిరాకరించిందని బోనీ కపూర్ వెల్లడించారు. సినిమా పట్ల అంత నిబద్ధతగా పనిచేసిందని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో.. ఆ తర్వాత జార్జియాలో చిత్రీకరించామన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కాలంలో శ్రీదేవి ఎప్పుడూ గది పంచుకోలేదని వివరించారు. తన మైండ్సెట్ డైవర్ట్ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమె ఆ పాత్ర పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిందని పంచుకున్నారు.కాగా.. ఇటీవల ఐఫా రజతోత్సవ వేడుకల సందర్భంగా బోనీ కపూర్.. మామ్ మూవీకి సీక్వెల్ను ప్రకటించారు. ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశముందని బోనీ అన్నారు. కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కూడా నటించారు. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్లు వసూలుచేసింది. -
హీరో కుటుంబంతో కలిసి శ్రీలీల పండగ సెలబ్రేషన్స్
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈమెపై రూమర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ఈమె డేటింగ్లో ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్లు పలుమార్లు కలిసి కనిపించడం పుకార్లకు ఊతమిస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?శ్రీలీల ఇప్పటివరకు పలువురు హీరోలతో కలిసి పనిచేసింది. కానీ కార్తిక్ ఆర్యన్తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఆర్యన్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కనిపించారు. అలానే కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కార్తిక్ తల్లి.. తమకు డాక్టర్ చదువుకొన్న కోడలు రావాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. కార్తిక్ తల్లి ఈమె గురించి మాట్లాడిందా అనేది క్వశ్చన్ మార్క్.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్)ఇకపోతే ఇప్పుడు ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ జరగ్గా.. శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా హాజరైంది. అయితే ఇది పార్టీ గెదరింగ్ లేదంటే తమ రిలేషన్ని కార్తిక్-శ్రీలీల పరోక్షంగా బయటపెడుతున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వీళ్లిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తీస్తున్నారు. వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానుంది. మరి కార్తిక్ ఆర్యన్-శ్రీలీలది ఫ్యామిలీ బాండింగా లేదంటే డేటింగ్ అనేది తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు నోరు విప్పాలి.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా) -
జపనీస్ అమ్మాయిలా రష్మిక.. ముంబై స్క్రీనింగ్లో
యనిమే అభిమానుల కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంయుక్తంగా 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్' సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ముంబైలో యనిమే అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. హీరోయిన్ రష్మిక, హీరో టైగర్ ష్రాఫ్ కూడా సందడి చేశారు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)రష్మిక.. టాంజిరో, నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక జపనీస్ డ్రస్సులో కనిపించింది. రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో 'అకాజా vs గియు మరియు టాంజిరో' ఫైట్ సీక్వెన్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. మన దేశంలో దాదాపు 750కి పైగా స్క్రీన్స్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఓ యనిమే మూవీకి ఇంతలా రిలీజ్ దక్కుతుండటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్తోనూ ఈ మూవీ ఉండనుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
పిల్ల తెమ్మెర... హోరు గాలి ఆశా భోస్లే స్వరం!
'ఓ హసీన్దర్ద్దేదో జిసే మై గలే లగా లూ' అంటారు ఆశా భోస్లే ఓ పాటలో. ఆ పాట సందర్భం ఏదైనా ‘హసీన్ దర్ద్’ అనే మాట ఎంత బావుందో కదా. అది ఆశాజీ స్వరానికి చక్కగా సరిపోతుంది. ఆవిడ తన పాటతో మనందరికి అలాంటి అందమైన బాధనే కదా పుట్టిస్తారు. ఇంకో పాటలో 'దిల్చీజ్క్యా హై ఆప్మేరీ జాన్లీజియే' అంటారు. నిజమే ఆవిడ గొంతుక అంటే పడి చచ్చేవాళ్లంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇది మీ కోసం మా గుండెలే కాదు ప్రాణాలు కూడా ఇచ్చేస్తామని! ఈ పాట ఆశ పాడిన గొప్ప పాటల్లో ఒకటి. షహరయార్ రచన, ఖయ్యాం సంగీతం, రేఖ అభినయం ఒక ఎత్తు అయితే ఆశా భోంస్లే స్వరం ఒక్కటే ఒక ఎత్తు. అందుకే ఈ పాట ఆశాజీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. దీంతో పాటు ఆవిడ మరో పాటకు కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పాట చాలా విలక్షణమైనది సాహిత్యపరంగా, సంగీతపరంగాను!అదే 'మేరా కుఛ్ సామాన్... తుమ్హారే పాస్ పడా హై' సాంగ్ గుల్జార్ దర్శకత్వం వహించిన ఇజాజత్ సినిమాలోనిది. ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారని వేరే చెప్పాలా? ఇజాజత్ 1987లో రిలీజైంది. ఆర్డీ బర్మన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఓరోజు గుల్జార్ ఒక పాటకి లిరిక్స్ రాసి రికార్డింగ్కి పట్టుకెళ్లారు. ఆ లిరిక్స్ చూసి బర్మన్ దా ఇది పాట సాహిత్యమా లేక న్యూస్ పేపరా అని అడిగారు. గుల్జార్ మౌనంగా ఉండిపోయారు. ఆ పాట పాడాల్సిన ఆశా భోస్లే లిరిక్స్ చేతికి తీసుకుని మెల్లగా హమ్ చేస్తూపోయారు. అది వింటున్న బర్మన్ దాకి ఏదో స్ఫురించింది. అంతే! పదిహేను నిముషాల్లో బాణీ కట్టేశారు. అలా పుట్టిందే మేరా కుఛ్ సామాన్ అనే పాట!ఈ పాట లిరిక్స్నిజంగానే పైకి ప్లెయిన్గా కనిపిస్తాయి. కానీ తరచి చూస్తే ఆ పదాల్లో ఎంతటి అర్థం దాగుందో తెలుస్తుంది. సుతిమెత్తగా ఉన్నట్లు కనిపించినా ఈ పాట బాణీ చాలా కష్టమైంది. ఆలాపన మొదలుకొని చివరి దాకా ఒక ప్రవాహంలాగా సాగిపోతుంది. పల్లవి, చరణం లాంటి సంప్రదాయ పద్ధతులు కనిపించవు. ఈ పాట పాడ్డం అప్పట్లో ఆశా భోస్లేకి పెద్ద సవాలుగా తోచింది. మాధుర్యం చెడకుండా మంద్రస్థాయి నుంచి తారస్థాయికి.. అక్కడి నుంచి మళ్లీ మధ్యమస్థాయి, మంద్రస్థాయులకు ప్రయాణిస్తూ ఆశా ఈ పాటకు పూర్తి న్యాయం చేశారు. మధ్యమధ్యలో మాటలు, విరక్తి నవ్వులు కూడా వినిపించారు. ఇంత బాగా పాడినందుకు ఆవిడకు, అంత విభిన్నంగా రాసినందుకు గుల్జార్కి 1988 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులు దక్కాయి. ఈ పాట విన్నప్పుడల్లా ఆర్డీ బర్మన్తో గడిపిన రోజులే గుర్తొస్తాయని ఆశా భోస్లే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే ఈ పాటంటే ఆవిడకి ప్రాణమట!1933లో సెప్టెంబర్ 8న పుట్టిన ఆశా భోస్లే అక్క లతా మంగేష్కర్సాయంతో సినిమాల్లో పాడడం మొదలుపెట్టినా తొందరలోనే తనకంటూ ఒక స్టైల్ క్రియేట్చేసుకున్నారు. మత్తుగా, గమ్మత్తుగా పలికే ఆమె స్వరానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ఉంది. ‘ఆయియే మెహర్బాన్’ అంటూ ఒక పాటలో కవ్విస్తే ‘ఓ మేరే సోనారే’ అంటూ మరో పాటలో మురిపిస్తారు. ‘హరే రామ హరే కృష్ణ’లోని ‘దమ్మారో దమ్’ అనే రాక్ నంబర్ పాడినా ‘ఉమ్రావ్జాన్లోని ‘ఇన్ఆంఖోంకీ మస్తీ కే’ అనే ఘజల్ ఆలపించినా ఆశా స్టైల్ దేనికదే ప్రత్యేకం. హెలెన్కోసం ‘పియా తూ అబ్తో ఆజా’ మొదలుకొని చాలా పాటలే పాడారూ ఆశాజీ. ఆ పాటలన్నీ ఎవర్గ్రీన్హిట్సే! ఏ మేరా దిల్ యార్కా దివానా, ఓ హసీనా జుల్ఫోవాలీ లాంటి డాన్స్నంబర్స్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు? 90స్ తర్వాత ఎ. ఆర్. రహమాన్ ఆశా భోస్లేకి మంచి హిట్స్ ఇచ్చారు. రంగీలా టైటిల్ సాంగ్, ‘తన్హా తన్హా’ పాటలు ఆవిడ వర్సటాలిటీకి అద్దం పడతాయి. ఇక 2001లో విడుదలైన ‘లగాన్’లోని ‘రాధ కైసే న జలే’ అనే పాటయితే జనం గుండెల్లో అలా నిలిచిపోయింది.అన్నట్లూ ఆశాజీ మన తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. 1988లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిన్ని కృష్ణుడు’ సినిమాలోని ‘జీవితం సప్త సాగర గీతం’ అన్న ఆర్డీ బర్మన్ కంపోజిషన్ ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. ఇక ‘చందమామ’ సినిమా కోసం కె.ఎం. రాధాకృష్ణన్పాడించిన ‘నాలో ఊహలకు’ అనే పాట ఎంత హాయిగా, లయబద్ధంగా సాగిపోతుందో వేరే చెప్పాలా? ఆశా భోస్లే స్వరం మెత్తగా లాలించే పిల్ల తెమ్మెరే కాదు గుండెను పట్టి కుదిపేసే హోరుగాలి కూడా, మెల్లగా సాగే సెలయేరే కాదు, ఉవ్వెత్తున దూకే జలపాతం కూడా. ఆ స్వర ప్రవాహంలో తడిసి ముద్దవడం తప్ప సామాన్య శ్రోతలుగా మనమింకేం చేయగలం?-శాంతి ఇశాన్ -(సెప్టెంబర్ 8 ఆశా భోస్లే పుట్టినరోజు సందర్భంగా) -
సల్మాన్ ఖాన్ ఓ గూండా.. బాలీవుడ్ దర్శకుడు సంచలన కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఇతడు సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. అలాంటిది ఇతడిపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్ ఓ గుండా, అతడికి నటన అంటే అసలు ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదా కోసమే మూవీస్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)తెలుగులో 'గబ్బర్ సింగ్' మూవీ పెద్ద హిట్. దాని ఒరిజినల్ చిత్రం 'దబంగ్'. 2010లో రిలీజైన ఈ హిందీ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకుడు. ఇతడు అనురాగ్ కశ్యప్కి అన్నయ్య. అయితే సల్మాన్తో ఈ మూవీ చేసిన తర్వాత అభినవ్.. ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయాడు. అయితే దీనికి సల్మాన్, అతడి కుటుంబమే కారణమని గతంలోనే అభినవ్ ఆరోపించాడు. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు.'2010లో 'దబంగ్' సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నో చెప్పాను. అప్పటినుంచి నాపై పగ పెంచుకున్నారు. సల్మాన్కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతడు నటించడం లేదు. సెలబ్రిటీగా ఉండటానికే సెట్కి వస్తాడు. అతడొక గూండా. పగ-ప్రతీకారంతో రగిలిపోయే ఓ అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదంటే వెంటాడి మరీ వేధిస్తాడు. వారందరూ రాబందులు. సల్మాన్ మాత్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటోడే. నా తమ్ముడు అనురాగ్తో బోనీ అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతడి సినిమా నుంచి అనురాగ్ బయటకొచ్చేశాడు. ఈ రాబందుల గురించి ముందే నా తమ్ముడు చెప్పాడు' అని అభినవ్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా) -
పోటీకి సై
వచ్చే ఈద్ పండక్కి బాక్సాఫీస్ ఫైట్కి సై అంటున్నారు అజయ్ దేవగణ్, రణ్బీర్ కపూర్. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాల్ 4’. రితేష్ దేశ్ముఖ్, సంజయ్ మిశ్రా, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకరియా నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక మరోవైపు ‘లవ్ అండ్ వార్’ సినిమాను ఈద్ పండగ సందర్భంగా 2026 మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలోనే వెల్లడించారు ఈ చిత్రదర్శక–నిర్మాత సంజయ్లీలా భన్సాలీ. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరి... బాక్సాఫీస్ వద్ద వచ్చే ఈద్కి రణ్బీర్ది పై చేయి అవుతుందా? లేక అజయ్ దేవగణ్ హిట్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పేరుకే ఫ్రాంచైజీ.. అన్నీ మన రీమేక్లే
ఒకప్పుడు రీమేక్ అంటే బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత బాగా తీసినా సరే జనాలు.. ఒరిజినల్తో పోల్చి చూస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లలో పలు భాషల్లో వచ్చిన, వస్తున్న రీమేక్స్ అన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం హిందీలోనూ 'బాఘీ 4' పేరుతో ఓ మూవీ రిలీజైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం కూడా రీమేక్ అనే సంగతి బయటపడింది.(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?)ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా టైగర్ ష్రాప్.. ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'హీరో పంతి' అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇది యావరేజ్ అనిపించుకుంది. టైగర్ యాక్ట్ చేసిన తొలి మూవీ ఓ రీమేక్. అల్లు అర్జున్ 'పరుగు' చిత్రమే ఇది. అలానే టైగర్ ష్రాఫ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 'బాఘీ' ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఇందులో నాలుగు మూవీస్ రిలీజ్ కాగా అవన్నీ దక్షిణాది చిత్రాల ఆధారంగా తీసిన రీమేక్స్. కాకపోతే ఎక్కడా అధికారికంగా ఇది దీని రీమేక్ అని టీమ్ చెప్పలేదు.బాఘీ.. ప్రభాస్ 'వర్షం' రీమేక్, బాఘీ 2.. అడివి శేష్ 'క్షణం' రీమేక్, బాఘీ 3.. తమిళ చిత్రం 'వెట్టై' రీమేక్, తాజాగా రిలీజైన బాఘీ 4.. తమిళ మూవీ 'ఐతు ఐతు ఐతు'కి రీమేక్. ఇలా పేరుకే యాక్షన్ ఫ్రాంచైజీ అని పెట్టుకున్నారు కానీ నచ్చిన రీమేక్స్ని ఇష్టమొచ్చినట్లు మార్చేసి తీసిపడేస్తున్నారు. మొదటి భాగానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే వరసగా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు. తాజాగా రిలీజైన నాలుగో భాగానికి కూడా ఏ మాత్రం పాజిటివ్ రివ్యూలు రాలేదు. టాప్ ఇంగ్లీష్ వెబ్ సైట్స్ అన్నీ 1 రేటింగ్ ఇచ్చాయి. మరి ఇప్పటికైనా టైగర్.. బాఘీ ఫ్రాంచైజీని ఆపుతాడా? లేదంటే త్వరలో ఐదో పార్ట్తో వస్తాడా? అనేది చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?) -
బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ హఠాన్మరణం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ (55) హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఆయన మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానం ప్రారంభించిన ఆశిష్ పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు.అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’, అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం’, రాణీ ముఖర్జీ లీడ్ రోల్ పోషించిన ‘మర్దానీ’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘ఏక్ విలన్’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ వారంగ్. హిందీ సినిమాల్లోనే కాదు... మరాఠీ చిత్రాల్లోనూ నటించారాయన. ఆశిష్ వారంగ్ మృతిపై పలువురు నటీనటులు, దర్శకులు, సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే... ఆయన మృతికి కారణం ఏంటి? అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. -
దృశ్యం నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇక లేరు. హిందీలో దృశ్యం, సూర్యవంశి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన శుక్రవారం మరణించారు. నటుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆశిష్ (Actor Ashish Warang) మరణ వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు షాకవుతున్నారు. దర్శకనిర్మాత అరిణ్ పాల్ సోషల్ మీడియా వేదికగా నటుడి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. మృదుస్వభావిఆశిష్ చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించినందుకు గర్వంగా ఉంది. ఆయన మృదుస్వభావి, కళపట్ల అంకితభావంతో మెదిలేవాడు. ప్రతి సీన్లోనూ ప్రాణం పెట్టి యాక్ట్ చేసేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఆశిష్.. అక్షయ్కుమార్ 'సూర్యవంశీ', అజయ్ దేవ్గణ్ 'దృశ్యం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాణి ముఖర్జీ 'మర్దానీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arin Paul (@arinpaul) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే! -
రాజమౌళిపై బాలీవుడ్ నిర్మాత అంతమాట అనేశాడేంటి..!
-
అమ్మాయిలూ.. ప్రెగ్నెంట్ అవడం ఈజీ!: బాలీవుడ్ నటి
అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? కష్టసుఖాల్నే కాదు ఇంటిపనినీ సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. భార్యకు అన్నివిధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రాజ్కుమార్ భార్య, నటి పాత్రలేఖ (Patralekha) జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ (అండాలను) భద్రపరిచింది.ప్రెగ్నెన్సీయే సులువుఈ విషయం గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను. కానీ, ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను. నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది. ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకెటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డల్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే.. అమ్మాయిలూ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవడానికి ట్రై చేయండి. కిట్లో నెగెటివ్ రిజల్ట్నేను సహజంగా గర్భం దాల్చాను. నిజానికి ప్రెగ్నెన్సీ కిట్లో కూడా నెగెటివ్ ఫలితమే చూపించింది. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. మూడు నెలలవరకైనా ఈ విషయం బయటకు చెప్పకూడదనుకున్నాం. కానీ గతేడాది డిసెంబర్లో ఓ ఈవెంట్కు వస్తామని రాజ్, నేను ఓ ఈవెంట్కు మాటిచ్చాం. సడన్గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్లో ఆ ఈవెంట్కు వెళ్లాం. దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే! -
లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే!
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ ఫ్లాట్ అమ్మేసింది. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెలలో విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మలైకా అరోరా చయ్య చయ్య పాటతో సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్లో తళుక్కుమన్న ఆమె తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.థామాలో స్పెషల్ సాంగ్ప్రస్తుతం రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న థామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మ్యాడ్డాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్లో నాలుగో చిత్రంగా ‘థామా’ తెరకెక్కుతోంది.చదవండి: అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత -
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
'రాజమౌళి సార్ మాస్టర్ అయితే.. మేమంతా విద్యార్థులం'.. నిర్మాత కామెంట్స్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్ మార్క్ అని అన్నారు. ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజమౌళి అంటే నాకు గౌరవమని కరణ్ జోహార్ వెల్లడించారు. ఒక సినిమాను మరో మూవీతో పోల్చవద్దన్నారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్కు హాజరైన ఆయన.. దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సార్ ఒక మాస్టర్ అయితే.. మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులమని కరణ్ జోహార్ అన్నారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో విజువల్ వండర్ మూవీ మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. -
రెండో భర్తతో విడాకులు.. ఆ విషయంలో వదిలిపెట్టేది లేదన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ బుల్లితెర నటి దల్జీత్ కౌర్ చెప్పాల్సిన పనిలేదు. సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదటి భర్తతో విడిపోయినా ఆమె.. రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు. వ్యాపారవేత్త నిఖిల్ పటేల్ను రెండో పెళ్లి చేసుకోగా.. ఆతర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు. 2023లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కగా కొన్ని నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దల్జీత్ కౌర్ తన విడాకులపై మరోసారి మాట్లాడింది. తన మాజీ భర్త నిఖిల్ పటేల్పై విమర్శలు చేసింది. విడిపోయాక తన లైఫ్లో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను పంచుకుంది. ఈ విషయంలో నిఖిల్ పటేల్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ విషయంలో మాత్రం తాను మౌనంగా ఉండనని స్పష్టం చేసింది. అతను క్షమాపణ చెప్పేవరకు పోరాటం చేస్తానని దల్జీత్ కౌర్ తెలిపింది.దల్జీత్ కౌర్ మాట్లాడుతూ.. 'పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా లైఫ్లో మళ్లీ ఇలా జరగడం చాలా కోపం తెప్పించింది. ఈ విషయంలో తాను మౌనంగా ఉండనన్న విషయం నిఖిల్ తెలుసుకోవాలి. అతను నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ విషయంలో నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతా. నాకు అతని వద్ద నుంచి క్షమాపణ రావాలి. దానికోసం ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్తా ' అని అన్నారు.కాగా.. నిఖిల్తో పెళ్లి తర్వాత కెన్యా వెళ్లిన ఆమె కేవలం పది నెలలకే ఇండియాకు తిరిగొచ్చింది. తన కుమారుడితో సహా వచ్చిన తర్వాత అతనిపై తీవ్ర విమర్శలు చేసింది. నిఖిల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. అతనికి మరొకరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని..తనను మానసిక వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత నిఖిల్ తన స్నేహితురాలు సఫీనా నాజర్తో కూడా ముంబయిలో కనిపించారు.2009లో మొదటి పెళ్లి..కాగా చూపులు కలిసిన శుభవేళ (ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూ) ఫేమ్ దల్జీత్.. 2009లో నటుడు షాలిన్ బానోత్ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా జైడన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత జంట మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఓ పార్టీలో నిఖిల్ అనే వ్యక్తిని కలిసింది. ఇతడు కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్పై భారతీయ ఫిల్మ్మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్చరణ్కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్లోనూ రామ్చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
అనురాగ్ కశ్యప్ నిశాంచి.. ఆసక్తిగా ట్రైలర్
ఐశ్వరి థాకరే హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం నిశాంచి. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీని జార్ పిక్చర్స్ బ్యానర్పై అజయ్ రాయ్, రంజన్ సింగ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రసూన్ మిశ్రా, రంజన్ చండేల్, అనురాగ్ కశ్యప్ కథ అందించారు.ట్రైలర్ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2000వ దశకంలో సాగిన ఈ కథలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య థాకరే కవలలుగా ద్విపాత్రాభినయం సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో వేదిక పింటో, మోనిక పన్వర్, మొహమ్మద్ జీషాన్ ఆయుబ్, కుముద్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. -
పరమ్ సుందరిలో యూత్ కలల రాణి.. షాకవుతున్న ఫ్యాన్స్!
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. కేరళ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పరమ్ సుందరి ట్రైలర్ రిలీజ్ తర్వాత చర్చిలో ఓ వివాదాస్పద సీన్తో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ సీన్ మార్చడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా ఈ మూవీలో నటించడానికి మీకు కేరళ నటి ఒక్కరు కూడా దొరకలేదా అంటూ మేకర్స్ను కొందరు విమర్శించారు. కేరళ అమ్మాయి పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మలయాళీ నటులకు టాలెంట్ లేదా? అని మేకర్స్ను ప్రశ్నించారు.ఇదిలా పక్కనపెడితే పరమ్ సుందరిలో మలయాళీ ముద్దుగుమ్మ నటించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఒక్క కనుచూపుతో ఓవర్నైట్ స్టార్గా ఎదిగిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఇందులో ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా కనిపించడంతో ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు.జాన్వీకపూర్ కంటే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా తీసుకుంటే బాగుండని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఓరు అదార్ లవ్ మూవీలో ఒక్క కన్నగీటుతో యూత్ కలల రాణిగా ఫేమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా కనిపించనుంది. ఇక పరమ్ సుందరి విషయానికొస్తే బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 34.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. -
మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి హెచ్చరిక
ప్రేమలో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్ అనే ఓ డేటింగ్ యాప్లో ఉన్నట్లు తెలిపాడు. రణ్వీర్ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి. ప్రేమలో ఇన్వెస్ట్?నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్ బాగోలేదు. కాబట్టి లవ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది. మార్కెట్ బాగోలేదుఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్ మార్కెట్ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్పై ఫోకస్ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్వీర్ షోరే.. గతంలో పూజా భట్ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి2010లో నటి కొంకణసేన్ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్వీర్ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్లో కనిపించాడు. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
15 ఏళ్ల వివాహ బంధానికి బుల్లితెర నటి గుడ్ బై..!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్గా అయిపోయింది. కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న జంటలు అభిమానులకు సడన్గా ఇలాంటి షాక్లు ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ తన వివాహా బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 15 ఏళ్ల తర్వాత తన భర్త, వ్యాపారవేత్త రాహుల్ లూంబాతో విడిపోతున్నట్లు ప్రకటించింది.(ఇది చదవండి: చెఫ్గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?)భర్తతో విడాకులపై సింపుల్ కౌల్ మాట్లాడుతూ.. "అవును మేమిద్దరం ఇటీవలే విడిపోయాం. మేము పరస్పరం చాలా పరిణతి చెందిన మనుషులం. నా జీవితంలో చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నా. ఇకపై మేమిద్దరం పరస్పర నిర్ణయంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపింది. గత ఇంటర్వ్యూలో సింపుల్ కౌల్ మాట్లాడుతూ.."అతను విదేశాల్లో ఎక్కువ రోజులు ఉంటారు. కొన్నిసార్లు నేను అతనిని మిస్ అవుతూ ఉంటా. కానీ మా మధ్య మంచి అవగాహన ఉంది. మా బంధం చాలా బలంగా ఉంటుంది. అందుకే మా జీవితాన్ని సమతుల్యంగా చేసుకున్నా. ఆయన లేనప్పుడు నా కెరీర్పై కూడా దృష్టి పెట్టగలుగుతున్నా. మా ఇద్దరికీ సంతోషకరమైన పనితో పాటు జీవితంలో సమానంగా ఎదుగుతున్నాం" అని తెలిపింది.కాగా.. సింపుల్ కౌల్, రాహుల్ లూంబా 2010లో వివాహం చేసుకున్నారు. కుస్సుమ్తో తన కెరీర్ ప్రారంభించిన సింపుల్ కౌల్ పలు బాలీవుడ్ సీరియల్స్లో మెప్పించింది. అంతేకాకుండా 'శరరత్', 'తారక్ మెహతా కా ఊల్తా చాష్మా', 'యే మేరీ లైఫ్ హై' వంటి అనేక ప్రముఖ రియాలిటీ షోలలో కనిపించింది. సింపుల్ కౌల్ చివరిసారిగా 2022లో జిద్ది దిల్ మానే నా అనే సీరియల్లో కనిపించారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. View this post on Instagram A post shared by Simple Kaul (@simplekaul) -
అతియా శెట్టి- కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం.. పూజలు చేసిన దంపతులు!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం చేశారు. తమ సొంతింటిలో పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఏడాదిలోనే ఈ జంటకు కూతురు పుట్టింది. మార్చి నెలలో అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వీరి ముద్దుల కూతురికి ఈవారా విపుల రాహుల్ అని పేరు పెట్టారు.(ఇది చదవండి: కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!)కాగా.. 2019లో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని ఓ ఫామ్హౌస్లో గ్రాండ్గా జరిగింది. ఈ వివాహా వేడుకలో సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. కాగా.. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురని దాదాపు అందరికీ తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా లైంగిక వేధింపులు లాంటివి ఏదో మూల వినిపిస్తూనే ఉంటాయి. ఈ విషయమై అప్పుడప్పుడు పలువురు కథానాయికలు స్పందిస్తూనే ఉంటారు. తమ అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ కృతి సనన్ అలాంటి ఓ విషయం గురించి మాట్లాడింది. హీరోయిన్లని చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.'సౌకర్యాల విషయంలోనే కాదు.. గౌరవించడంలోనూ చిన్నచూపు చూస్తుంటారు. హీరోలకు పెద్దకార్లు, లగ్జరీ రూమ్స్ ఇస్తారు. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు. కానీ అలా ఎందుకు చేస్తారని బాధపడుతుంటాను. కేవలం కార్లు, సౌకర్యాల గురించే కాదు మహిళలని తక్కువ చేసి చూడటం గురించి నేను మాట్లాడుతున్నాను. హీరోలతో సమానంగా గౌరవించడానికి మేం కూడ అర్హులమే. షూటింగ్ విషయంలోనూ ఇలానే జరుగుతోంది' (ఇదీ చదవండి: పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్)'హీరోలు సెట్స్కి ఆలస్యంగా వస్తారు. కానీ హీరోయిన్లు మాత్రం టైమ్ కంటే ముందే వెళ్లి వారి కోసం ఎదురుచూస్తూ ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్లు నన్ను ముందే సెట్స్కి రావాలని పిలుస్తారు. హీరోలకు మాత్రం ఆ మాట చెప్పలేరు. ఇలాంటి ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి' అని కృతి సనన్ తన ఆవేదన బయటపెట్టింది.కృతి సనన్కి ఏయే సినిమాలు, హీరోలతో ఇలాంటి అనుభవం ఎదురైందో గానీ ధైర్యంగా బయటకు చెప్పింది. మిగతా హీరోయిన్లు మాత్రం కొందరు ఇలాంటి వాటికి సర్దుకుపోతూ ఉంటారు. 2023లో 'ఆదిపురుష్' మూవీతో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని పలకరించిన కృతి సనన్.. తర్వాత ఓ నాలుగు చిత్రాలు చేసింది గానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అవికూడా అప్ కమింగ్ హీరోలతో చేస్తున్నావే. ఈమె స్టార్ హీరోలతో పనిచేసే చాలాకాలమైపోయింది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్గా మొదలుపెట్టేశారు) -
బిపాసా బసు వివాదం.. మరో స్టార్ హీరోయిన్పై మృణాల్ ఠాకూర్ కామెంట్స్!
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ నటి బిపాసా బసును ఉద్దేశించి గతంలో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో మృణాల్ ఠాకూర్పై నెటిజన్స్తో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు సినీస్టార్స్ సైతం స్పందించారు. ఆ తర్వాత ఆ వయసులో తెలియక అలా మాట్లాడానని.. ఎవరినైనా బాధపెట్టి ఉండే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. దీంతో ఆ వివాదానికి అక్కడితో ఫుల్స్టాప్ పడింది.అయితే మృణాల్ ఠాకూర్ సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్లో తాను నటించాల్సిన సినిమా గురించి అందులో మాట్లాడింది. ఆ మూవీని తాను తిరస్కరించినట్లు మృణాల్ తెలిపింది. ఒకవేళ నేను ఆ చిత్రంలో చేసి ఉంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని అంటూ కామెంట్స్ చేసింది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నా స్థానంలో నటించిన ఆమెకు స్టార్డమ్ను తీసుకొచ్చిందని మృణాల్ ఠాకూర్ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలు చేయట్లేదని పేర్కొంది.ఆ సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ నెటిజన్స్ మాత్రం మృణాల్ ఠాకూర్పై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా గురించే మాట్లాడారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్గా అనుష్క శర్మ నటించారని.. ఆమెను అవమానపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్స్ మరోసారి ఫైరవుతున్నారు. ఆ సినిమాలో చేసినందుకు ఇప్పుడు అనుష్క శర్మ నటించడం లేదని.. ఆమెను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇటీవలే బిపాసా బసుపై కామెంట్స్తో వివాదానికి కారణమైన సీతారామం బ్యూటీ.. మరోసారి బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. -
పోలీస్ స్టేషన్లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్
కెరీర్ మొదట్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma). తర్వాత ట్రాక్ తప్పి అన్నీ ఫ్లాపులే తీశాడు. ఇటీవలే తన తప్పు తెలుసుకున్న ఆర్జీవీ.. ఇకపై మంచి సినిమాలే చేస్తానని శపథం చేశాడు. అప్పుడే సిండికేట్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ తర్వాత సిండికేట్ గురించి మళ్లీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దాన్ని పక్కనపెట్టి ఓ హారర్ సినిమా చేస్తున్నాడు. అదే పోలీస్ స్టేషన్ మే భూత్. యు కాంట్ అరెస్ట్ ద డెడ్ అన్నది క్యాప్షన్!కాంబినేషన్ రిపీట్బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది! ఇందులో జెనీలియా హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా పోస్టర్ గ్లింప్స్ను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరి వల్లయినా మనకు భయం వేస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం.. మరి పోలీసులే భయపడితే వాళ్లెక్కడికి పరుగుతీస్తారు? అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ గ్లింప్స్ ఏఐ వీడియో అని తెలుస్తోంది.కథ అదేనా?పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమా విషయానికి వస్తే.. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ చనిపోతారు. వాళ్లందరూ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్స్టర్స్ పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే సినిమా కథ అని తెలుస్తోంది! A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot pic.twitter.com/eMOyusT8iy— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025 చదవండి: జున్ను కాలికి ఫ్రాక్చర్.. అర్ధరాత్రి నొప్పితో ఏడుపు.. చూడలేకపోయా! -
సీక్రెట్గా పెళ్లి.. తొలిసారి భర్తతో మీడియా ముందుకు హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony Beig)ను పెళ్లాడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో వివాహ తంతు పూర్తి చేసుకుని అట్నుంచటే కొత్త దంపతులు స్విట్జర్లాండ్ వెళ్లారు. అయితే తనకు మ్యారేజ్ అయిందని నర్గీస్ ఎక్కడా చెప్పలేదు, అలాగే పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయలేదు. ఇంతవరకు జంటగా కనిపించిందీ లేదు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తొలిసారి భర్తతో కనిపించిందీ బ్యూటీ. ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఆగస్టు 30న జరిగిన ఓ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది.పెళ్లయ్యాక తొలిసారి..వీరితో కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) కూడా జత కలిసింది. రెడ్ కార్పెట్పై నర్గీస్, ఫరా ఖాన్ జంటగా ఫోటోలు దిగారు. అనంతరం ఫరా.. నీ భార్య పక్కన వచ్చి నిల్చో అంటూ టోనీని పిలిచింది. దీంతో వారిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. నర్గీస్ ఫక్రి.. మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్ఫుల్ 3, అమావాస్... తదితర సినిమాల్లో నటించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ అలరించింది. చివరగా హౌస్ఫుల్ 5 మూవీలో కనిపించింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.288 కోట్లు రాబట్టింది. View this post on Instagram A post shared by Buzzzooka Prime (@buzzzookaprime) -
మా ఇంట్లో ఎవరూ బీఫ్ తినరు: సల్మాన్ ఖాన్ తండ్రి
మా ఇంట్లో ఎవరమూ బీఫ్ తినము అని చెప్తున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, రచయిత సలీమ్ ఖాన్. ఫ్రీ ప్రెస్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీం ఖాన్ మాట్లాడుతూ.. మేము ఎన్నడూ బీఫ్ తినలేదు. మా ఇంట్లో ఎవరికీ ఆ అలవాటు లేదు. ఆవుపాలు తల్లిపాలవంటివి అని మా ప్రవక్త బోధనల్లో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వాటిని సంహరించకూడదు.ఘనంగా సెలబ్రేషన్స్హిందూ సాంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా గల్లీలలో హిందూ పండగలను గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. చిన్నపెద్ద తేడా లేకుండా అందరూ ఆ వేడుకల్లో పాల్గొనేవాళ్లు. సుశీలతో పెళ్లికి కూడా మా కుటుంబం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మేము అన్ని పండగలను సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నింటినీ గౌరవిస్తాం. అందుకే 60 ఏళ్లుగా సంతోషంగా కలిసున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజించుకున్నాం అని తెలిపాడు.గణపతి పూజకాగా ఇటీవల సల్మాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ఇంట్లో గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో సల్మాన్, అతడి పేరెంట్స్ సలీం- సల్మా (సుశీల) గణనాథుడికి హారతిచ్చారు. ఈ పూజా కార్యక్రమానికి సల్మాన్ కుటుంబసభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. pic.twitter.com/qfa76sFxCj— Salman Khan (@BeingSalmanKhan) August 27, 2025 చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య -
ధనుష్ కంటే గొప్ప నటులెవరున్నారు?: ఆదిపురుష్ డైరెక్టర్
తమిళ స్టార్ ధనుష్ (Dhanush).. ఎలాంటి పాత్రలోనైనా జీవించేయగలడు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగలడు. అందుకే రెండుసార్లు (ఆడుకాలం, అసురన్ సినిమాలకుగానూ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ చేస్తున్నాడు. ఆదిపురుష్ ఫేం ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు.కలాం బయోపిక్ఈ సినిమాకు కలాం: ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా (Kalam: The Missile Man of India Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. మే నెలలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఓం రౌత్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను కలాంను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన గురించి వెండితెరపై చెప్పినప్పుడు మరెంతో మంది ఇన్స్పైర్ అవుతారు.ధనుష్ ఎందుకంటే?ధనుష్ అద్భుతమైన యాక్టర్. ఆయనకంటే గొప్ప నటుడు మరొకరు లేరు. కలాం బయోపిక్లో నటించేందుకు ధనుష్ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్, టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.సినిమాధనుష్ విషయానికి వస్తే ఇటీవలే శేఖర్ కమ్ముల 'కుబేర'తో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అతడి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై రిలీజ్కు రెడీ అవుతోంది. ఓం రౌత్ విషయానికి వస్తే.. బయోపిక్తోనే దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. బాలగంగాధర్ తిలక్ బయోపిక్ 'లోకమాన్య: ఏక్ యుగపురుష్' మూవీతో దర్శకుడిగా మారాడు. తానాజీ, ఆదిపురుష్ సినిమాలు తెరకెక్కించాడు.చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి! -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ సహనటి మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి ప్రియా మరాఠే(38) కన్నుమూసింది. పలు టీవీ సీరియల్స్లో నటించిన ఆమె చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో ఆమె బాధపడుతోంది. సుదీర్ఘకాలం క్యాన్సర్ పోరాటం చేసిన ప్రియా మరాఠే మీరా రోడ్లోని తన నివాసంలోనే మరణించింది.మరాఠీకి చెందిన నటి ప్రియా మరాఠే 1987 ఏప్రిల్ 23న ముంబయిలో జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. అనంతరం మరాఠీ సీరియల్ 'యా సుఖనోయ'తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ సీరియల్స్లో నటించింది. బాలీవుడ్లో పవిత్ర రిష్టా సీరియల్తో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సుశాంత్ రాజ్పుత్, అంకిత లోఖాండే కీలక పాత్రల్లో నటించారు. ప్రియా చివరిసారిగా మరాఠీ సీరియల్ తుజెచ్ మి గీత్ గాత్ ఆహేలో కనిపించింది. కాగా.. ప్రియా 2012లో నటుడు శంతను మోఘేను వివాహం చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ లేదు. చివరిసారిగా ఆగస్టు 11, 2024న పోస్ట్ చేసింది. నటి తన భర్తతో జైపూర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.ప్రియా మరాఠే తన కెరీర్లో చార్ దివాస్ ససుచే, కసమ్ సే, పవిత్ర రిష్టా, ఉత్తరన్, తూ తిథే మీ, భాగే రే మన్, సాథ్ నిభానా సాథియా, స్వరాజ్యరక్షక్ సంభాజీ, జయస్తుతే, భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్ లాంటి సీరియల్స్తో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా హిందీలో హమ్నే జీనా సీఖ్ లియా చిత్రంలో కనిపించారు. మరాఠీ చిత్రం 'తి అని ఇటార్'లోనూ నటించారు. ఈ విషాద వార్త విన్న ప్రియా మరాఠే అభిమానులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
'మంచి ఫుడ్ తిన్నా క్యాన్సర్.. షోఆఫ్ చేయకు' ట్రోలర్పై నటి ఫైర్
బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal) ఒకప్పుడు క్యాన్సర్ను జయించింది. ఆరోగ్యంగా ఉండేందుకు తను ప్రయత్నిస్తుంటే ఓ వ్యక్తి ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అది చూసిన చవీ మిట్టల్కు ఒళ్లు మండిపోయింది. సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆమె సరదాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో తను స్వీట్ పొటాటోస్ తింటోంది. అవతలి వ్యక్తి ఫ్రై చేసిన స్నాక్స్ ఇస్తుంటే వద్దని తిరస్కరించింది. అయినా క్యాన్సర్ వచ్చిందిగా!ఈ వీడియో కింద ఓ వ్యక్తి.. నువ్వు ఆరోగ్యానికి మంచివైనవాటిని ఏరికోరి ఎంచుకుని తింటున్నా సరే క్యాన్సర్ (Cancer) వచ్చింది. నీ మీద నువ్వే జోక్ వేసుకున్నట్లు ఉంది. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకో, కానీ షో ఆఫ్ చేయకు. ఎవరినీ ఎగతాళి చేయకు. హెల్తీ ఫుడ్ తింటావో, తినవో అది నీ ఇష్టం. కొంచెం అన్హెల్తీ ఫుడ్ తినమని ఎవరైనా అడిగినప్పుడు దాన్ని మరీ సీరియస్గా తీసుకోనక్కర్లేదు.క్యాన్సర్ అంటే జోకా?సలహాలు అసలే ఇవ్వనక్కర్లేదు అని కామెంట్ చేశాడు. దానిపై చవీ తీవ్రంగా స్పందించింది. క్యాన్సర్ అంటే జోక్ కాదు అని మండిపడింది. మంచి ఆహారపు అలవాట్లు పాటించినప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, క్యాన్సర్ వారియర్స్కు ఈ నెగెటివ్ కామెంట్ పెట్టిన వ్యక్తి తరపున నేను క్షమాపణలు చెప్తున్నా.. ఇలాంటి నెగెటివ్ మనుషుల వల్ల మీ ఆలోచనలు, పద్ధతులు మార్చుకోకండి. నష్టపోతే వదిలేస్తామా?అనారోగ్యం, క్యాన్సర్ అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండదు. మనం చేయాల్సిందల్లా మన జాగ్రత్తలో మనం ఉండటం! వ్యాపారంలో కూడా కొన్నిసార్లు నష్టపోతాం, అలా అని దాన్ని వదులుకోం కదా! ఇదీ అంతే! ఆరోగ్యంగా ఉండేందుకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు విజయం సాధించలేకపోయినంత మాత్రాన వెనకడుగు వేయకూడదు అని రాసుకొచ్చింది. క్యాన్సర్ను జయించిన నటిచవీ మిట్టల్.. 2022 ఏప్రిల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ప్రారంభదశలోనే మహమ్మారిని గుర్తించి వెంటనే చికిత్స మొదలుపెట్టింది. ఆపరేషన్ కూడా చేయించుకుంది. తర్వాత క్యాన్సర్ను జయించినట్లు ప్రకటించింది. మరుసటి ఏడాది కాస్టోకోన్డ్రైటిస్ వ్యాధి బారిన పడింది. ఈమె ఏక్ వివాహ్.. ఐసా భీ, పల్ పల్ దిల్కే సాత్ వంటి చిత్రాల్లో నటించింది. సీరియల్స్బుల్లితెరపై ఘర్కీ లక్ష్మి బేటియా, నాగిన్, బందిని, ఏక్ చుట్కీ ఆస్మన్, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్లో యాక్ట్ చేసింది. రచయిత, నిర్మాతగానూ గుర్తింపు పొందింది. డైరెక్టర్ మోహిత్ హుస్సేన్ను 2004లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు అరీజా, కుమారుడు అర్హం సంతానం. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, రామ్చరణ్.. వీడియో -
బాలీవుడ్ బ్రిడ్జ్లో..
యూకేలో పదేళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తె కోసం ఇంకా వెతుకుతున్నారట మాధవన్. కానీ ఇది రియల్ లైఫ్లో కాదు... రీల్ లైఫ్లో. మాధవన్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో హిందీలో ‘బ్రిడ్జ్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం రూ పొందిందని సమాచారం. ఈ చిత్రంలో మాధవన్, రాశీ ఖన్నా భార్యాభర్తలుగా నటించారని తెలిసింది. నిధీ సింగ్ ధర్మ, నాగరాజ్ దివాకర్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఆల్రెడీ ‘బ్రిడ్జ్’ చిత్రీకరణ పూర్తయిందని, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. యూకేలో పదేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమార్తె కోసం దంపతులు చేసే ప్రయత్నాలు? ఆ అమ్మాయి ఎలా తప్పిపోతుంది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టాక్. -
ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్
పిల్లలంటే ఇష్టం.. కానీ ప్రెగ్నెన్సీ అంటే అస్సలు ఇష్టం లేదంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone). ఈ మాట ఊరికే అనలేదు. ఎన్నోసార్లు ఐవీఎఫ్కు వెళ్లి ఫెయిల్ అవడం, అనారోగ్యం బారిన పడటంతో ఆమెకు గర్భం దాల్చాలంటేనే విసుగొచ్చింది. అందుకే దత్తత ద్వారా ఓ అనాథకు తల్లిగా మారింది. అలాగే సరోగసి ద్వారా మరో ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది.ఆరోజే దత్తత తీసుకోవాలని..తాజాగా సన్నీలియోన్.. నటి సోహా అలీ ఖాన్ పాడ్కాస్ట్కు హాజరైంది. ఈమేరకు ఓ ట్రైలర్ విడుదల చేశారు. అందులో సన్నీలియోన్ మాట్లాడుతూ.. పిల్లల్ని దత్తత తీసుకోవాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఐవీఎఫ్ ఫెయిలైనరోజు దత్తత కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్పుడే ఓ పాపను ఎంచుకున్నాం. సరోగసికి ఎందుకు వెళ్లానంటే.. గర్భం దాల్చి పిల్లల్ని కడుపున మోయడం నాకిష్టం లేదు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాను. చాలా డబ్బు ఖర్చు చేశాంసరోగసి కోసం ఎంచుకున్న మహిళకు వారానికి ఒకసారి డబ్బు చెల్లించేవాళ్లం. ఆమె భర్తకు కూడా మనీ ఇచ్చాం. చాలా ఖర్చు చేశాం. ఆ డబ్బుతో ఆమె పెద్ద ఇల్లు కొనుక్కుంది. మరోసారి ఘనంగా పెళ్లి చేసుకుంది అని తెలిపింది. కాగా సన్నీలియోన్ నటుడు డేనియల్ వెబర్ను 2011లో పెళ్లి చేసుకుంది. 2017లో వీరు రెండేళ్ల పాపా నిషాను దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసి ద్వారా నోవా, ఆషర్ జన్మించారు. View this post on Instagram A post shared by Soha (@sakpataudi) చదవండి: 'నాకు పెళ్లయింది, అతడే నా భర్త..': జాన్వీ కపూర్ -
'నాకు పెళ్లయింది, అతడే నా భర్త..': జాన్వీ కపూర్
ప్రేమిస్తున్నానని ఎవరైనా వెంటపడినప్పుడు కొందరు తమకు ఆల్రెడీ పెళ్లయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. అలా తను కూడా ఈ అబద్ధం చెప్పానంటోంది దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా తనతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తే పెళ్లి అనే ఒక్కమాటతో గండం గట్టెక్కానంటోంది.జాన్వీకపూర్, ఓరీపెళ్లయిందని చెప్పా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు పెళ్లయిందని చాలాసార్లు అబద్ధమాడాను. అయితే ఇండియాలో కాదు.. అమెరికా లాస్ ఏంజిల్స్లో ఉన్నప్పుడు కొందరు వెయిటర్లు వారి ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. నేను ఏదీ ఆర్డర్ చేయకముందే వారు ఏదైనా వంటకాలు తెచ్చి నా ముందుంచేవారు. అలా ఒకసారి ఓరీతో ఉన్నప్పుడు.. అతడినే నా భర్తగా పరిచయం చేసి తప్పించుకున్నాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. సినిమాజాన్వీకి ఇంకా పెళ్లవలేదు కానీ, శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మోడల్ ఓరీ.. జాన్వీకి మంచి స్నేహితుడు. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన పరమ సుందరి నేడు (ఆగస్టు 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. ప్రస్తుతం సన్నీ సంస్కారికీ తులసి కుమారి మూవీ చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, సాన్య మల్హోత్రా, రోహిత్ సరఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: 8 ఏళ్లుగా భార్య సంపాదనతో బతుకుతున్నా..: డైరెక్టర్ -
'నేను బాహుబలిని కాదు..' నవ్వులు తెప్పిస్తోన్న టీజర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన పరమ్ సుందరి ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది. అంతే కాకుండా వరుణ్ ధావన్తో కలిసి సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలో జాన్వీకపూర్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోటీజర్ చూస్తే ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలో బాహుబలి గెటప్తో ప్రారంభమైంది. బాహుబలి ప్రభాస్ గెటప్లో వరుణ్ ధావన్ లుక్ అదిరిపోయింది. నేను అచ్చం బాహుబలిలానే ఉన్నానని వరుణ్ ధావన్ చెప్పడంతో.. నిన్ను చూస్తే రణ్వీర్ సింగ్ ధోతిని.. ప్రభాస్ ధరించినట్లు ఉందంటూ చెప్పే డైలాగ్ తెగ నవ్వులు పూయిస్తోంది. ఈ టీజర్ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రోహిత్ షరఫ్, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజీమ్ దయాని సంగీతమందిస్తున్నారు. -
సుశాంత్తోనే ఈ సినిమా తీయాలనుకున్నా.. కానీ: డైరెక్టర్ అనురాగ్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం నిషాంచి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో ఐశ్వర్య థాకరే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దర్శకుడు ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీని ఎంఎస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో చేయాలని అనుకున్నానని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను 2016లోనే ప్రకటించామని తెలిపారు. అయితే అప్పటికే సుశాంత్ ధర్మ ప్రొడక్షన్స్తో రెండు సినిమాలకు సంతకం చేశారని గుర్తు చేసుకున్నారు. అందువల్లే మా సినిమాకు అతను రెస్పాండ్ కాలేదని అనురాగ్ పంచుకున్నారు.అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.." అప్పట్లో సుశాంత్ (సింగ్ రాజ్పుత్)తో చేయాలనుకున్న సినిమా ఇది. అప్పటికే అతనికి 'దిల్ బెచారా', 'డ్రైవ్' అనే రెండు పెద్ద సినిమాలు ఆఫర్ వచ్చాయి. అవి రెండూ కూడా ధర్మ ప్రొడక్షన్స్లోనివే. దీంతో అప్పుడు నా సినిమా ఆగిపోయింది. మా సినిమాకు ఓకే చెప్పేందుకు అతను స్పందించడం మానేశాడు. అందుకే నేను కూడా దూరంగా వెళ్లిపోయా. మొదట 2016లో సుశాంత్ హీరోగానే మూవీని ప్రకటించా" అని అన్నారు.అంతేకాకుండా తన నిర్మాణ సంస్థలో వచ్చిన 'హసీతో ఫసీ' సినిమా నుంచి సుశాంత్ తప్పుకున్న విషయాన్ని కూడా కశ్యప్ వెల్లడించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF), ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్లు రావడంతో సుశాంత్ మా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వివరించారు. YRF నిర్మాణ సంస్థ 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాకు సంతకం చేసిన సుశాంత్.. హసీ తో ఫసీ మూవీని వదులుకున్నాడని కశ్యప్ అన్నారు. అతని నిర్ణయంపై తనకు ఎలాంటి పగ లేదని కశ్యప్ తెలిపారు.నిషాంచి సినిమా చేసేందుకు చాలామంది నటులు ఆసక్తి చూపించారని అనురాగ్ కశ్యప్ తెలిపారు. కానీ 2016లో MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ విడుదలకు ముందే సుశాంత్ను సంప్రదించానని వెల్లడించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, సుశాంత్ తన వద్దకు తిరిగి రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2013లో 'కై పో చే!' సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'పీకే', 'కేదార్నాథ్', 'చిచ్చోరే' లాంటి చిత్రాలలో కనిపించాడు. 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' బయోపిక్లో మహేంద్ర సింగ్ ధోని పాత్రలో మెప్పించాడు. కానీ ఊహించని విధంగా..34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. -
'ఆ దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని విడదీయలేడు'.. విడాకులపై గోవిందా భార్య
గత కొంతకాలంగా బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా ఆయన భార్యతో విడిపోతున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చినా.. ఆయన భార్య సునీతా వాటిని కొట్టిపారేసింది. ఇటీవల మరోసారి ఈ జంట విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత వీటిని గోవిందా తరఫు లాయర్ ఖండించారు. వీరిద్దరి విడాకులకు సంబంధించి ఏ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయలేదని అభిమానులకు వెల్లడించారు.ఇవాళ వినాయక చవితి సందర్భంగా తమపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు గోవిందా దంపతులు. గణనాథునికి సతీసమేతంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా గోవిందా భార్య సునీతా అహుజా తమపై వస్తున్న విడాకుల రూమర్స్పై స్పందించారు. ఆ దేవుడు కూడా తమను వేరు చేయలేడంటూ కామెంట్స్ చేసింది. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న డివోర్స్ రూమర్స్కు ఇక చెక్ పడినట్లే.విడాకుల వార్తలపై సునీతా మాట్లాడుతూ.. "ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం కాదు. మా మధ్య మరింత దూరం ఉండేది. పై నుంచి దేవుడు దిగి వచ్చినా మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. నా గోవిందా నా వాడు మాత్రమే, మరెవరికి ఆయన హృదయంలో స్థానం లేదు. కాదు. మేము నోరు తెరిచి చెప్పే వరకు దయచేసి మా గురించి వచ్చే వార్తలను నమ్మొద్దు" అని హితవు పలికింది. కాగా.. గోవింద భార్య సునీతా అహుజా తన యూట్యూబ్ ఛానెల్లో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేయడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. సునీత ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.కాగా.. గోవిందా కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, హసీనా మాన్ జాయేగి, హద్ కర్ ది ఆప్నే, జోడి నంబర్ 1 లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా 'రంగీలా రాజా' అనే చిత్రంలో కనిపించారు. #WATCH | Mumbai | Denying rumours of filing for divorce from husband actor Govinda, Sunita Ahuja says, "If something had happened, then we would have been so close today. There would have been a distance between us. No one can separate us, not even if God comes from above... My… pic.twitter.com/Aj5NmlbGNV— ANI (@ANI) August 27, 2025 -
ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో
ప్రముఖ నటీనటులు.. ఇల్లు, అపార్ట్మెంట్ లాంటివి కొనడం, అమ్మడం, అద్దెకు ఇవ్వడం లాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. తెలియని వాళ్లకు ఇచ్చేందుకు హిందీ సెలబ్రిటీస్ పెద్దగా ఆసక్తి చూపించరు. దీంతో తోటి యాక్టర్స్కి అద్దెకు ఇస్తుంటారు. దీని ద్వారా మంచి మొత్తమే అందుకుంటూ ఉంటారు. కానీ 'వార్ 2'తో రీసెంట్గా వచ్చిన హృతిక్ రోషన్ మాత్రం తన ప్రియురాలికి తన ఫ్లాట్ రెంట్కి ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)క్రిష్, ధూమ్ 2 లాంటి సినిమాలతో చాన్నాళ్ల క్రితమే తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్.. చాలా గ్యాప్ తర్వాత 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ ఇందులో మరో హీరోగా నటించడం విశేషం. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది. సరే ఈ సంగతి పక్కనబెడితే గతంలో సుస్సానే ఖాన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న హృతిక్.. కొన్నేళ్ల క్రితం ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. నటి షబా ఆజాద్తో రిలేషన్లో ఉన్నాడు.హృతిక్ ప్రస్తుతం షబా ఆజాద్తో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ఫ్లాట్ని హృతిక్.. తన ప్రియురాలికే అద్దెకిచ్చాడు. ఇందుకుగానూ నెలకు రూ.75 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. సాధారణంగా మార్కెట్లో లక్షల్లో అద్దె ఉంటే.. ప్రియురాలికి మాత్రం తక్కువ ధరకే ఇచ్చేశాడట. అంటే డిస్కౌంట్ అనమాట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్) -
కోట్లు విలువ చేసే కారు కొన్న 'కేజీఎఫ్' విలన్
టాలీవుడ్లో స్టార్స్ వ్యక్తిగత విషయాల్ని ఆచితూచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. బాలీవుడ్లో స్టార్స్.. ఇల్లు లేదా కారు లాంటివి కొన్న వెంటనే ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే సీనియర్ నటుడు కమ్ దక్షిణాది చిత్రాల్లో విలన్గా చేస్తున్న సంజయ్ దత్ ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇంతకీ ఆ కారు సంగతేంటి? దాని రేటు ఎంత?(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ)అప్పట్లో హీరోగా ఎన్నో హిందీ సినిమాలు చేసిన సంజయ్ దత్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ టైంలో అయితే కేజీఎఫ్ 2, లియో, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న రోల్స్ చేశాడు. కాకపోతే వీటిలో 'కేజీఎఫ్' సీక్వెల్లో ఈయన చేసిన పాత్ర బాగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం హిందీలో పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సంజయ్ దత్ ఇప్పుడు మెర్సిడెజ్ కంపెనీకి చెందిన మేబాచ్ జీఎల్ఎస్ మోడల్ కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్లో దీని ధర రూ.4 కోట్ల వరకు ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ) -
మిల్కీ బ్యూటీ తమన్నా లేటేస్ట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది ఓదెల-2 మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. అంతకుముందు ఒకట్రెండు స్పెషల్ సాంగ్స్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైన తమన్నా ఆసక్తికర వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ 'డూ యు వన్నా పార్టనర్'. ఈ సిరీస్కు అర్చిత్ కుమార్, కాలిన్ డికున్హా దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగా కానుందని వెల్లడించారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ సొంత ఆల్కహాల్ వెంచర్ను స్థాపించాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్లో జావేద్ జాఫ్రే, నకుల్ మెహతా, సూఫీ మోతీవాలా, నీరజ్ కబీ, శ్వేతా తివారీ, రణ్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటించారు.raising a toast because they’re here with something brew-tiful 🍺#DoYouWannaPartnerOnPrime, New Series, September 12 pic.twitter.com/NM9tLCKPRG— prime video IN (@PrimeVideoIN) August 25, 2025 -
వినాయక చవితికి దూరంగా బాలీవుడ్ బ్యూటీ.. కారణం ఏంటంటే?
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రతి ఏడాది గ్రాండ్గా సెలబ్రేట్ ఈ పండుగను జరుపుకోవడం లేదని తెలిపింది. తమ కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది.శిల్ప తన ఇన్స్టాగ్రామ్లో రాస్తూ.. "ప్రియమైన స్నేహితులారా బాధతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా. మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ సంవత్సరం మేము మా గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. మా సంప్రదాయం ప్రకారం 13 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలి. అందుకే పండుగలు, ఉత్సవాలకు దూరంగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది.శిల్పా శెట్టి కెరీర్..ఇక శిల్పా శెట్టి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్- 5 లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిసారిగా అమిత్ సాధ్, దిల్నాజ్ ఇరానీ, కుషా కపిల, పవ్లీన్ గుజ్రాల్ నటించిన సుఖీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం శిల్పా శెట్టి కెడి: ది డెవిల్ అనే కన్నడ చిత్రంలో నటించింది. ఈ మూవీతో దాదాపు 18 సంవత్సరాల తర్వాత కన్నడలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో సత్యవతి పాత్రలో అలరించనుంది. ఈ చిత్రంలో ధ్రువ సర్జాతో పాటు సంజయ్ దత్, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు. -
బిగ్ బాస్ షో.. అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ ఎవరంటే?
బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్బాస్. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ బిగ్బాస్ సీజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆదివారం హిందీ బిగ్బాస్ సీజన్-19 గ్రాండ్గా మొదలైంది. ఈ సీజన్లో పలువురు కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.బిగ్బాస్ మొదలైందంటే చాలు అందరి దృష్టి కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఉంటుంది. అంతేకాకుండా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే గతంలో నాలుగో సీజన్లో అడుగుపెట్టిన హాలీవుడ్ బ్యూటీ పమేలా అండర్సన్ పారితోషికంపై తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ సీజన్లోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న కంటెస్టెంట్గా నిలిచింది. హౌస్లో హాలీవుడ్ గ్లామర్ తీసుకొచ్చిన పమేలా.. బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె స్పెషల్ గెస్ట్గా హౌస్లో అడుగుపెట్టింది.కళ్లు చెదిరే రెమ్యునరేషన్..అయితే హిందీ బిగ్బాస్ నాలుగో సీజన్లో బిగ్బాస్లో అడుగుపెట్టిన పమేలా అండర్సన్ ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు రోజులు మాత్రమే హౌస్లో ఉన్న పమేలా ఒక్కో రోజుకు దాదాపు రూ.83 లక్షలుగా తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్గా నిలిచింది. కాగా.. హాలీవుడ్కు చెందిన పమేలా అండర్సన్ 1990ల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బార్బ్ వైర్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్, సిటీ హంటర్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. -
తన పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు: ఆశిష్ విద్యార్థి
పోకిరి మూవీతో తెలుగులో ఫేమస్ అయిన నటుడు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్గా వచ్చిన ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోకు పాల్గొన్న ఆయన.. ప్రముఖ ఇన్ఫ్లూయన్సర్ అపూర్వ ముఖిజా తనను అగౌరవపరిచేలా మాట్లాడారన్న కామెంట్స్పై స్పందించారు. ఆమెతో తన సంభాషణ చాలా ఉత్తేజకరంగా సాగిందని అభివర్ణించాడు. అయితే ఈ షో ముగిశాక తనకు ఆమె క్షమాపణలు చెప్పిందని ఆశిష్ విద్యార్థి తెలిపారు.ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.."ఆ షో ముగిసిన మరుసటి రోజే తను నాకు వాట్సాప్ సందేశం పంపింది. సర్, నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మేసేజ్ చేసింది. నేను వెంటనే ఆమెకు ఫోన్ చేసి అపూర్వ, నేను అక్కడ కూడా మీతో మాట్లాడాను. మీరు చాలా అద్భుతమైన మనిషి. అంతా బాగానే ఉందని చెప్పా. ఆ చర్చ పట్ల నేను సంతోషంగా ఉన్నా. ఆమె ఒక రోజు నాతో భోజనం చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. కుదిరితే భవిష్యత్తులో ఆమెతో కలిసి డిన్నర్ చేస్తా. తనపట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదని" వెల్లడించారు.కాగా.. ఆశిష్ విద్యార్థి ఇటీవల ‘ది సీక్రెట్ ఆఫ్ ది శిలేదార్స్’ అనే వెబ్ సిరీస్లో కనిపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం జియోహాట్స్టార్లో ప్రసారం అవుతోంది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, సాయి తమంహర్కర్ కూడా నటించారు. -
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. బాలీవుడ్ అది మర్చిపోయి..: సిమ్రాన్
హీరోయిన్ సిమ్రాన్ (Simran) ఇండస్ట్రీకి వచ్చి నేటి(ఆగస్టు 25)కి 30 ఏళ్లు పూర్తవుతుంది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్. బాలీవుడ్లో కన్నా సౌత్లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో నేను గుల్మొహర్ అనే సినిమా చేశాను. ఆ మూవీ టీమ్ అంతా కూడా చాలామంచివారు. అదే సమయంలో మరో ప్రాజెక్ట్ కూడా చేశాను. కానీ, అక్కడ ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోయాను.వీడియో క్లిప్స్ పంపాలా?పైగా ఇక్కడ పాత్రకు నేను సూట్ అవుతానా? లేదా? అని లుక్ టెస్ట్ చేస్తుంటారు. అందుకు నేను అభ్యంతరమేమీ చెప్పను. ఓకే కానీ, కొందరు నాగురించి తెలియక.. పాత్రకు సరిపోతానో? లేదోనని వీడియో చేసి పంపించమంటారు. అంతేకాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్లో పదో వంతు మాత్రమే చెల్లిస్తారు. అందుకే నా గురించి పూర్తిగా తెలుసుకున్నవారి దగ్గరే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు లేవ్టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత చిన్న, మధ్య తరహా సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అందులోనూ మహిళా ప్రాధాన్యత ఉన్న స్క్రిప్టులే ఎక్కువ! కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, బడా దర్శకనిర్మాతల నుంచి మాత్రం ఒక్క ఆఫర్ కూడా రాలేదు. నా కెరీర్లో చాలా హిట్లు ఉన్నాయి. ఎంతోమంది యంగ్ టాలెంట్ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.సినిమాఈ ఏడాది సిమ్రాన్ ఫుల్ బిజీ. శబ్ధంతో అలరించిన ఆమె గుడ్ బ్యాడ్ అగ్లీలో అతిథి పాత్రలో మెరిసింది. టూరిస్ట్ ఫ్యామిలీతో సూపర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం ద లాస్ట్ వన్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. విక్రమ్ సరసన నటించిన ధ్రువ నక్షత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ. -
పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అంతటా ఇదే చర్చ!
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) 2018లో నటుడు అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. సీక్రెట్గా డేటింగ్ చేసిన వీరిద్దరూ తమ ప్రేమవిషయాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు. అలాంటిది సడన్గా వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లయిన ఆరు నెలలకే ఈ జంటకు మెహర్ అనే కూతురు జన్మించింది. కానీ.. మ్యారేజ్కు ముందే నేహా ప్రెగ్నెంట్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.ఇదే రచ్చతాజాగా ఈ ట్రోలింగ్ గురించి నేహా ధూపియా మాట్లాడుతూ.. నేను అంగద్ను పెళ్లాడిన ఆరు నెలలకే పాప పుట్టింది. పెళ్లయిన ఆరు నెలలకే పాప ఎలా పుట్టింది? అలా ఎలా జరుగుతుంది? అని చర్చ మొదలుపెట్టారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన మహిళా నటుల గురించి ఇప్పటికీ స్టోరీలు వస్తూ ఉంటాయి. వాటిని నేను కూడా చూస్తూ ఉంటాను.ఆ లిస్టులో ఉన్నా..నీనా గుప్తా, ఆలియా భట్ల జాబితాలో నేను ఉన్నాను. కానీ దీన్ని ఇంతలా హైలైట్ చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. కాగా నీనా గుప్తా.. క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. వీరి అనురాగానికి గుర్తుగా మసాబా గుప్తా జన్మించింది. బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్- రణ్బీర్ కపూర్.. 2018 నుంచి ప్రేమించుకున్నారు. 2022 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా జన్మించింది.చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ.. -
బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2023లో ప్రణవ్ బగ్గాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే నెలలో గర్భం ధరించిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా తమకు పాప పుట్టిందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. 2001లో బాలీవుడ్లో హిట్ అయిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది మాల్వికా రాజ్. అంతేకాకుండా రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడిన మాల్వికా రాజ్ కొన్ని నెలల డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలోని బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలకు పలువురు సినీతారలు హాజరయ్యారు. తెలుగులో 'జయదేవ్' అనే చిత్రంలో కనిపించింది. ఇటీవలే క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ 'స్వైప్ క్రైమ్'లోనూ నటించింది. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ..
బాలీవుడ్ నటి తనిష్టా చటర్జీ (Tannishtha Chatterjee) క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇదే వ్యాధి కారణంగా తండ్రిని కోల్పోయిన ఆమె ఇప్పుడదే మహమ్మారితో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన జర్నీని సోషల్ మీడియాలో పంచుకుంది. గత 8 నెలలు ఎంతో కష్టంగా సాగాయి. క్యాన్సర్తో తండ్రిని కోల్పోయాను. ఇప్పుడదే మహమ్మారి నాకూ వచ్చింది. ఒలిగో మెటాస్టాటిక్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు 8 నెలల క్రితం తేలింది. ఇద్దరికి నేనే ఆధారంనా బాధ చెప్పుకోవడానికి ఈ పోస్ట్ చేయడం లేదు. ప్రేమ, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడేందుకు పోస్ట్ చేశాను. నాపై 70 ఏళ్ల తల్లి ఆధారపడి ఉంది. నాకు తొమ్మిదేళ్ల కూతురుంది(తనిష్టాకు పెళ్లవలేదు, పాపను దత్తత తీసుకుంది). ఇద్దరికీ అన్నీ నేనే! వారిని చూసుకోవాల్సిన నేను క్యాన్సర్తో పోరాడుతున్నా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి కష్టసమయంలో వారి ప్రేమే నాకు సాంత్వననిస్తోంది. ఒంటరితనం దరిచేరనీయకుండా నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎల్లప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. నా పెదాలపై చిరునవ్వును చెరిగిపోనివ్వడం లేదు.ఏదీ రీప్లేస్ చేయలేదుప్రపంచమంతా ఏఐ, రోబోలంటూ పరుగులు తీస్తోంది. కానీ నన్ను కాపాడుతున్న మానవుల ప్రేమను ఏదీ రీప్లేస్ చేయలేదు. వారి కరుణ, ప్రేమ, ఉనికి.. మానవత్వం.. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉంది అంటూ తన స్నేహితులను ట్యాగ్ చేసింది. ఓ ఫోటోను కూడా జత చేసింది. అందులో నటి దివ్య దత్త, లారా దత్తా, విద్యా బాలన్, షబానా అజ్మీ, కొంకణ సేన్ శర్మ తదితరులున్నారు. సినిమాతనిష్టా చటర్జీ.. రోడ్- మూవీ, దేఖ్ ఇండియన్ సర్కస్, గులాబ్ గ్యాంగ్, సన్రైజ్, ఐ లవ్ న్యూఇయర్, పార్చ్డ్, డాక్టర్ రక్మంభాయి, ఝల్కి, జోరమ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. బీబర్ అనే బెంగాలీ మూవీ, బ్రిక్ లేన్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ యాక్ట్ చేసింది. చివరగా ద స్టోరీటెల్లర్ చిత్రంలో కనిపించింది. ఓటీటీలో కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై, స్కూప్ సిరీస్లలో మెరిసింది. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ -
ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్లో కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ మూవీని అలానే స్ట్రీమింగ్కి సిద్ధం చేశారు. 'ఆదిపరుష్' దర్శకుడు ఓం రౌత్.. మరో ఇద్దరితో కలిసి నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్పాయ్.. 'ఇన్స్పెక్టర్ జెండే' పేరుతో తీసిన ఈ చిత్రంలో పోలీసుగా నటించాడు. ముంబైకి చెందిన పోలీస్ అధికారి మాధవ్ జెండే జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 1970-80ల్లో మాధవ్ జెండే పనిచేస్తున్న టైంలో ఛార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్గా వార్తల్లో నిలిచాడు. అయితే మాధవ్.. శోభరాజ్ని రెండుసార్లు పట్టుకున్నాడు. 1971లో తొలిసారి అరెస్ట్ చేయగా 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మళ్లీ గోవాలో అదుపులోకి తీసుకున్నారు.ఇప్పుడు ఈ స్టోరీని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్గా తీశారు. డైరెక్టర్ ఓం రౌత్.. దీనికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్లో సెప్టెంబరు 05 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే మంచి మూవీ చూడబోతున్నామనే ఫీల్ అయితే కలిగించారు. ఇది తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో ఛార్లెస్ శోభరాజ్ పాత్రలో 'కుబేర' ఫేమ్ జిమ్ షర్బ్ నటించడం విశేషం.(ఇదీ చదవండి: విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత) -
బేబీ ఆన్ ద వే.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన స్టార్ హీరోయిన్
మరో హీరోయిన్ తల్లి కాబోతుంది. 2023లో రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఓవైపు సినిమాలు చేస్తోంది. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)చోప్రాస్ ఫ్యామిలీ నుంచి పరిణీతి.. 2012 నుంచి బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా తదితర చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. చెప్పాలంటే సెన్సేషనల్ హిట్ 'యానిమల్'లోనూ ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఛాన్స్ రష్మికని వరించింది.ఓ సినిమా, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని పరిణీతి బయటపెట్టింది. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 సెప్టెంబరులో వీళ్లిద్దరూ ఒకటి కాగా.. ఇప్పుడు రెండేళ్లు ముగేసరికి తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఎంతో బాధ అనుభవించా.. పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు: ఉపాసన) View this post on Instagram A post shared by @parineetichopra -
మీకెంత ధైర్యం అలా చేయడానికి?.. బాడీ షేమింగ్పై నటి ఆగ్రహం
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ను బాడీ షేమింగ్ చేయడాన్ని మరో నటి, టీవీ హోస్ట్ మిని మాథుర్ తప్పుపట్టింది. ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్లో కాజోల్ వీడియోను పోస్ట్ చేయడంపై మండిపడింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి నీకెంత ధైర్యం..తాను ఎలా కనిపించాలనేది తన ఇష్టమని.. మీరేలా డిసైడ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజోల్ వీడియోను జూమ్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోపై మిని మాథుర్ ఈ విధంగా స్పందించింది.కాగా.. బాలీవుడ్ నటి కాజోల్ తన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండో సీజన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు, ఇందులో ఆమె నోయోనికా సేన్గుప్తా అనే లాయర్ పాత్రను పోషించారు. ముంబై జరిగిన ఈ ఈవెంట్లో కాజోల్ బ్లాక్ స్కర్ట్ డ్రెస్లో కనిపించింది. దీంతో వెంటనే డ్రెస్పై నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇది చూసిన నటి మిని మాథుర్ అలాంటి వారికి ఇచ్చిపడేసింది. అయితే తనపై వచ్చిన బాడీ-షేమింగ్ వ్యాఖ్యలపై కాజోల్ ఇంకా స్పందించలేదు.మరోవైపు ది ట్రయల్ వెబ్ సిరీస్కు మొదటి సీజన్కు ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్లో మరోసారి కాజోల్ న్యాయవాది నోయోనికా సేన్గుప్తాగా అలరించనుంది. ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా ఆమె భర్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2023లో విడుదలైంది. ఇందులో సోనాలి కులకర్ణి, షీబా చద్దా, అలీ ఖాన్, కుబ్రా సైట్, గౌరవ్ పాండే, కరణ్వీర్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సీజన్ సెప్టెంబర్ 19, 2025న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Sunilkumar Gol (Photographer) (@goley.sunil_) -
సీక్రెట్గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలంటూ ఎగబడిపోతుంటారు. వారు హడావుడిలో ఉన్నా, వద్దని చెప్తున్నా వినిపించుకోరు. కొందరైతే స్టార్స్కు తెలియకుండా వారిని ఫాలో చేసి సీక్రెట్గా ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) విషయంలో ఇప్పుడదే జరిగింది. కూతురు దువాతో కలిసి బయటకు వెళ్లిన దీపికను ఓ అభిమాని ఫాలో అయ్యాడు. దీపికా అసహనంముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వాళ్లను సీక్రెట్గా కెమెరాలో చిత్రీకరించాడు. ఇది దీపికా కంట పడటంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఇలా చేయడం తప్పని మందలించింది. వీడియో డిలీట్ చేయమని కోరింది. ఇప్పటివరకు దీపికా జంట.. కూతురి ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్) కూడా స్టార్స్ విన్నపం మేరకు దువా ఫోటోలను క్లిక్ చేయకుండా సహకరించారు.మందలించినా వినకుండా..దీపికా-రణ్వీర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే సదరు అభిమాని మాత్రం ఇలా వీడియో తీయడం.. అది వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పేరెంట్స్ అనుమతి లేకుండా దువా ఫేస్ను రివీల్ చేశాడని ఆగ్రహిస్తున్నారు. ఆమె వద్దని చెప్పినా వినకుండా వీడియో పోస్ట్ చేయడం తప్పని మందలించారు. ఆన్లైన్లో కూతురి ఫోటో ప్రత్యక్షం కావడంపై దీపికా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.దువాకాగా దీపికా, రణ్వీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్ 8న కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన పాపాయికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్.. ధురంధర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది. అలాగే డాన్ 3 సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు. దీపికా.. అల్లు అర్జున్- అట్లీ మూవీలో నటించనుంది. deepika herself requested not to click or post pictures or videos of dua yet people are still doing it please out of basic respect and privacy stop this behaviour— 🎀 (@mecoreeee) August 23, 2025baby dua is the cutest omggg 😭😭😭🤍🤍🤍🤍 i won't share the vid, dp is clearly bothered by whoever filmed it. it their choice to protect their daughter's privacy until they feel like sharing it with us. BUT BABYGIRL IS JUST TOO ADORABLE 🥹🫶🏼 bless her 🤍— srkdp (@srkdeepikaholic) August 23, 2025DELETE THE VIDEO, STOP SHARING AND SPREADING IT. It’s a breach of privacy, Deepika was asking the person to stop recording. They didn’t consent to Dua being clicked or recorded.— nikita💫 (@nikita1372) August 23, 2025 చదవండి: సిద్దిపేట మోడల్కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష! -
ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా హాలీవుడ్ రేంజ్ లో రామాయణం
-
పదిహేడేళ్ల తర్వాత...
పదిహేడేళ్ల తర్వాత హీరోలు అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ సినిమా కోసం మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, తెస్పియన్ ఫిల్మ్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారం కొచ్చిలో ఆరంభ మైంది.ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరపుకోనుంది. ఇక విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలోని హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు. -
టాలీవుడ్కి రాషా రాక...
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖారారు అయిందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్బాబు తనయుడు) హీరోగా ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లో ఓ సినిమా రానుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలోని హీరోయిన్పాత్రకు రాషా తడానీని మేకర్స్ సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారని సమాచారం. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయని, అక్టోబరు నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందని టాక్. మరోవైపు అజయ్ దేవగన్ హిందీ చిత్రం ‘అజాద్’లో ఓ కీలకపాత్రలో నటించి, మెప్పించారు రాషా. ఈ యంగ్ బ్యూటీ నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. -
ఆ సీన్ కోసం 28 టేకులు.. ఇప్పటికీ మర్చిపోలేను: విద్యాబాలన్
'పరిణీత' చిత్రంతో విద్యాబాలన్ (Vidya Balan) కెరీర్ మొదలైంది. ఈ సినిమా 2005 జూన్ 10న విడుదలైంది. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఇంత పరిచయమా? నాకు తెలీదుఈ సందర్భంగా విద్యాబాలన్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నాకు బాగా గుర్తు.. సైఫ్ అలీ ఖాన్ తల్లి, బాలీవుడ్ స్టార్ షర్మిల ఠాగూర్ (Sharmila Tagore) ఓరోజు సెట్కు వచ్చింది. తనను చూసేందుకు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మామధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్.. ఓహ్, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకింతవరకు తెలీదు అని సరదాగా జోక్ చేశాడు. ఎప్పుడు గుర్తు చేసుకున్నా..వెంటనే నేను నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని బదులిచ్చాను. సైఫ్ సరదాగా ఉంటూ ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. దాదా(ప్రదీప్ సర్కార్) వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్నవిషయాన్ని కూడా గుర్తించి సీన్ మళ్లీ చేయిస్తాడు. అవసరమైతే వంద టేకులైనా తీసుకుంటాడు.కన్నీటి చుక్క సరిగ్గా రావాలని..కేవలం మా పర్ఫామెన్స్ కోసమే కాదు, వెనకాల పావురాలు ఎగిరే క్షణాలు కూడా సరిగ్గా రావాలనుకుంటాడు. అన్నీ సరిగ్గా కుదరాలని భావిస్తాడు. ఒక పాటలో నేను ఏడవాల్సి ఉంటుంది. ఆ పాటలోని ఓ లైన్ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రదీప్ సర్కార్.. అనారోగ్యంతో 2023లో కన్నుమూశారు. -
రెండు బ్రేకప్స్.. మగవాడి తోడు అవసరం లేదు: హీరోయిన్
గతంలో రెండు బ్రేకప్స్ జరిగాయంటోంది బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా (Daisy Shah). అందులో తనను బాగా ఇబ్బంది పెట్టిన రిలేషన్షిప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ అబ్బాయితో చాలా ఏళ్లు రిలేషన్లో ఉన్నాను. మొదటి నాలుగేళ్ల సమయంలో అసలు పెళ్లి ఆలోచనే రాలేదు. తర్వాత నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడు. ఏడో సంవత్సరంలో ఉండగా.. నేను సంతోషంగా లేనన్న విషయాన్ని గ్రహించి బ్రేకప్ చెప్పాను. రెండో రిలేషన్లో పరిస్థితి మరీ దారుణం. నేనెక్కడికి వెళ్తున్నా?.. అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నానా? ఇలా ప్రతీది గుచ్చిగుచ్చి అడిగేవాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేంటంటే.. అతడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం పార్టీలో ఉన్నాం. ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇంతలో ఒకరు నా వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగి తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు.నా తప్పేముంది?అందులో తప్పేముంది? దానికి నాపై కోప్పడాల్సిన అవసరం లేదుకదా! కానీ అతడు మాత్రం వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ తనను అర్థం చేసుకోమన్నాడు. అతడి పద్ధతి నాకు చిరాకు తెప్పించేది. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు. దానివల్ల మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు. అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. పైగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా పోషణ కోసం ఒక మగవాడి తోడు అవసరం లేదు. అయితే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరిచాను అని చెప్పుకొచ్చింది.కెరీర్డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టింది. భద్ర అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా మారింది. సల్మాన్ ఖాన్తో చేసిన 'జై హో' మూవీతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె చివరగా మిస్టరీ ఆఫ్ ద టాటూ మూవీ చేసింది. గతేడాది వచ్చిన రెడ్ రూమ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25న) డైసీ షా 41వ వయసులోకి అడుగుపెట్టనుంది.చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్రాజ్ అనే స్విమ్సూట్ కిల్లర్గా కనిపించనున్నాడు.ఓటీటీలోబాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్గా నటించి మెప్పించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: 'ఇంద్ర' నటుడి ఆగ్రహం
సోషల్ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రజా మురద్ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్ ప్రచారం చేపట్టారు. యాక్టర్ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్పై రజా మురద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీరియస్ మ్యాటర్రజా మురద్ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్ డెత్ డెట్ కూడా ఆ పోస్ట్లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్.చెప్పీచెప్పీ గొంతెండిపోయిందినేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక చాలుబతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్.. జోధా అక్బర్, గోలియాకీ రాస్లీల రామ్లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో.. ఇంద్ర, జానీ, సుభాస్ చంద్రబోస్, రుద్రమదేవి చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్లో నటించాడు.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ -
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.గ్లిజరిన్ లేకుండా..ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. నాకంటూ ఎవరూ లేరు'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్గా స్లిప్ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తానంది. నేను చనిపోతే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య -
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్ ఫోటోలు చూశారా..?
-
టైంకి సెట్ కి రాడు..! సల్మాన్ పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు..!
-
కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్ డ్యాన్సర్గా!
'కచ్చా బాదామ్' సాంగ్తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.తాజాగా అంజలి అరోరా థాయ్లాండ్లోని ఓ పబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.Anjali Arora, Insta dancers ki ‘role model’, Pattaya ke club mein apni ‘talent’ dikhate hue dikhin full jhatka thumka mode on. Wah, reel se deal tak ka asli startup model shayad isi ko kehte hain. pic.twitter.com/2FSwGAQ8QV— NoLawForMen (@MenTooRHuman) August 21, 2025Kacha Badam fame Anjali Arora seems to have made dancing in posh clubs her career.Here she is dancing in a club in Pattaya, Thailand.It is better to earn money than to ask for money. pic.twitter.com/6WzMFJUJrd— Param Choudhary (@Param_117_) August 21, 2025Anjali Arora of Kachcha Badam fame has taken up dancing in posh clubs as a career it seems.Here she is dancing at a Club in Pattaya, Thailand. pic.twitter.com/RXgWZit44Z— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 21, 2025 -
బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో ఆయన్ను వైల్డ్ కార్డ్గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!వైల్డ్ కార్డ్గా..పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్లో బిగ్బాస్ హౌస్లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.తెలుగు సినిమాలో..కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు -
ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.అందుకే దత్తత ఆలోచననేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. అలాంటి పెళ్లయితే చేసుకోనుఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్తో జాస్మిన్కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్గా సీమంతం వేడుక!
బాలీవుడ్ భామ గౌహర్ ఖాన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది ప్రారంభంవో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. తాజాగా సీమంతం వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వేడుకను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఆ తర్వాత ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్
ప్రతి ఆడపిల్లకు ఓ వయసు రాగానే నెలసరి ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాలిక కౌమార దశలోకి అడుగుపెడుతుంది. అయితే తన ఫ్రెండ్స్ కంటే తాను ఆలస్యంగా మెచ్యూర్ అయ్యానని, దానికే అమ్మ కోప్పడిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకున్నారు. ఎటు చూసినా రక్తమే..కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరికీ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి మధ్యలోనే పీరియడ్స్ మొదలయ్యాయి. నా ఫ్రెండ్స్ మెచ్యూర్ అవుతుంటే నేనింకా బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పటికే నెలసరి రావట్లేదని కంగారుపడుతూ ఉంటే నేనేమో ఇలా బొమ్మలతో ఆడుకుంటున్నానని అమ్మ కోప్పడింది. ఆ బొమ్మల వల్లే ఇంకా పీరియడ్స్ రావడం లేదేమోనని కోపంతో వాటన్నింటినీ బయట పడేసింది. ఒకరోజు నేను నిద్రలేచేసరికి బెడ్షీట్ అంతా రక్తం.. ఎటు చూసినా రక్తమే కనిపించడంతో భయపడిపోయాను. కానీ, అమ్మ మాత్రం నాకు నెలసరి మొదలైందని సంతోషపడింది అని పేర్కొన్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. 2006లో గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఏక్ నిరంజన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చివరగా ఎమర్జెన్సీ మూవీలో నటించారు. ఈ సినిమాలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి స్వయంగా కంగనాయే దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.చదవండి: స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్.. -
బిగ్బాస్ రియాలిటీ షో.. స్పెషల్ గెస్ట్గా స్టార్ హీరోయిన్!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ఈ షోకు ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. -
సల్మాన్తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్
ఏఆర్ మురుగదాస్.. ఈ పేరు చెప్పగానే గజిని, తుపాకీ, కత్తి లాంటి హిట్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో చిరంజీవి, మహేశ్ బాబుతో స్టాలిన్, స్పైడర్ తదితర చిత్రాలు చేసిన అనుభవముంది. అప్పట్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గానీ గత కొన్నాళ్లలో మాత్రం తీసినవన్నీ ఘోరమైన ఫ్లాప్స్. ఈ ఏడాది బాలీవుడ్లో 'సికిందర్' తీస్తే భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ వచ్చి చాలా నెలలే అయిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి దాని గురించి మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ వల్ల ఆ సినిమా రిజల్ట్ అలా జరిగింది అన్నట్లు మురుగదాస్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు)'ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి. కానీ అతడు మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే సెట్స్కి వస్తాడు. కాబట్టి మేం రాత్రి మాత్రమే చిత్రీకరణ చేయాల్సి వచ్చేది. మేం తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఓ సీన్లో నలుగురు పిల్లలుంటే.. వాళ్లు స్కూల్ నుంచి తిరిగొస్తున్న సీన్ తీయాలన్నా సరే వేకువజామున 2 గంటలకు షూటింగ్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఆ పిల్లలు నిద్రపోతారు' అని మురుగదాస్ చెప్పుకొచ్చాడు.అలానే 'సికిందర్' షూటింగ్ టైంలో చాలామంది జోక్యం చేసుకోవడం కూడా సినిమా వైఫల్యానికి కారణమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. గతంలో విజయ్, సూర్య, ఆమిర్ ఖాన్, చిరంజీవి, మహేశ్ బాబు.. ఇలా చాలామంది స్టార్లతో మురుగదాస్ పనిచేశాడు. కానీ ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్పై మాత్రమే ఎందుకు కామెంట్స్ చేస్తున్నాడా అనేది సస్పెన్స్. మురుగదాస్ తీసిన 'మదరాసి'.. సెప్టెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై కూడా ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవ్. మరి ఈ మూవీతో హిట్ కొట్టి మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్) -
దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం) -
భార్యతో ఉంటూనే మరో మహిళతో బిడ్డను కన్నాడు.. నటుడిపై సంచలన ఆరోపణ
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఆమిర్పై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 1990 నాటి సంఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫైసల్ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో ఆమిర్ రిలేషన్ షిప్ ఉన్నాడని ఫైసల్ అన్నారు. వారిద్దరికి జన్మించిన ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆమిర్పై సంచలన ఆరోపణ చేశారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్.. ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవాడన్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్పారు. అయితే, కొంతకాలం తర్వాత కిరణ్ రావును ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ కూడా జెస్సికాతో టచ్లో ఉండేవాడని చెప్పుకొచ్చారు.1990లలో, ఆమిర్ ఖాన్, జెస్సికా హైన్స్ కలిసి ఉన్నారని, వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు చాలారోజుల క్రితమే పేర్కొన్నాయి. జెస్సికా హైన్స్కు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జాన్ (Jaan) అని ఆ కథనాలు తెలిపాయి. కానీ, ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, జెస్సికా మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని పరోక్షంగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కూడా స్పష్టంగా ఈ రిలేషన్ గురించి ఏమీ చెప్పలేదు. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) -
అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే?
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (42) జూన్ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది. వెడ్డింగ్ యానివర్సరీఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు. ప్రేమకు పదేళ్లు 'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్ సింగ్ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది. View this post on Instagram A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi) చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
'ప్రతి రోజు చెబుతా'.. ట్రోలర్స్కు జాన్వీకపూర్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఇక సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టికొట్టే సమయంలో భారత్ మాతా కీ జై అంటూ నినాదం చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఇదేమీ ఇండిపెండెన్స్ డే కాదంటూ జాన్వీని ట్రోల్ చేశారు.తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కు జాన్వీ కపూర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఉన్నవారంతా నాకంటే ముందు భారత్ మాతాకీ జై అని అన్నారని తెలిపింది. ఆ తర్వాత నేను కూడా చెప్పానని.. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్స్కు కౌంటరిచ్చింది. నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీ కృష్ణా జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. ప్రతిరోజూ భారత్ మాతాకీ జై అని చెబుతా అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మరాఠీలో మాట్లాడిన జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుంది. ఢిల్లీ అబ్బాయితో ప్రేమలో పడిన మలయాళీ అమ్మాయి కథగా పరమ్ సుందరిని తెరకెక్కించారు.. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు. -
ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్న ఆమె బాలీవుడ్లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్తో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు. -
తండ్రి వేదన... తనయుడి ఆవేదన
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సర్ జమీన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనవాడు అనేవాడు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు. పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకుని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే... అదే ‘సర్ జమీన్’ సినిమా. ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. దర్శకుడు కాయోజీ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్, బాలీవుడ్ నటి కాజోల్, నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించారు. నాలుగు ముఖ్యపాత్రలు, రెండున్నర గంటల నిడివితో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపథ్యంలో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ప్లేతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించారు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓసారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. అతనికి హర్మన్ అనే కొడుకుంటాడు. దేశమా,ప్రాణమా అంటే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం విజయ్. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. పైగా తను భయస్తుడు కూడా. ఓసారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని... లేదంటే నీ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, అతని భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కానీ తీవ్రవాదులు హర్మన్కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ని తీవ్రవాదిగా తయారు చేసి, మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్, అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా? అన్నది హాట్ స్టార్లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
ఈ హీరోయిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? వీడియో వైరల్
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా అందంగా ముస్తాబైంది. అయితే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు. కానే కాదు, ఫ్లూట్తో అద్భుతంగా ఓ పాట ట్యూన్ వినిపించింది. ఇది చూసిన అభిమానులు.. మీరు మల్టీటాలెంటెడ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా అదా శర్మ.. లాక్డౌన్లో ఫ్లూట్ నేర్చుకుంది.సినిమాల విషయానికి వస్తే..అదా శర్మ.. 1920 అనే హారర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, సీ.డీ: క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. ద కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ అయిన అదా చివరగా తుమ్కో మేరీ కసమ్ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు. మొదట్లో బాగానే ఉన్న దంపతులు తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. అనంతరం మలైకా.. నటుడు అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. దంపతులుగా విడిపోయినా..ఏళ్ల తరబడి రిలేషన్లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే ఈ ప్రేమప్రయాణానికి ఫుల్స్టాప్ చెప్తూ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మలైకా కో పెరింటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లాడి కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు. తల్లి దగ్గర ఏం మాట్లాడాలి? తండ్రి దగ్గర ఎలా ఉండాలి? అనేది బాగా తెలుసు. కోరుకున్నవన్నీ జరగవుకాబట్టి ఇప్పుడు పరిస్థితులు అంత జటిలంగా లేవు. ఎవరి హద్దుల్లో వాళ్లం ఉన్నాం. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ అవకూడదనుకున్నాను. అందుకే ఇద్దరం బాధ్యతలు తీసుకున్నాం. కానీ విడాకులు ప్రకటించగానే చాలామంది ఇలా చేస్తావా? ఇలా ఉండకూడదు అంటూ నాకు నీతులు చెప్పారు. నేనేమంటానంటే కొన్నిసార్లు బంధాలనేవి జటిలంగా ఉంటాయి. నా వివాహబంధం కొనసాగాలనే కోరుకున్నాను. కానీ, అది జరగలేదు. దానికి నేనేం చేయగలను?అమ్మ కష్టాలుఅలా అని నేను ప్రేమపై విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఏదో ఘోర తప్పిదం చేశాననీ కాదు. అందరూ తప్పంతా నాదే అన్నట్లు నావైపే వేలు చూపించారు. సెల్ఫిష్గా ఆలోచించానన్నారు. మీకలా అనిపించుండొచ్చు. కానీ, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇకపోతే నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ రోజంతా పని చేస్తూ బిజీగా ఉండేది. మాకోసం అహర్నిశలు శ్రమించింది. తన దగ్గరున్న వస్తువులమ్మేసి మరీ స్కూల్ ఫీజు కట్టేది. డబ్బు విలువ బాగా తెలుసుఅప్పుడు చెల్లిని నేనే చూసుకునేదాన్ని. కుటుంబం కోసం 17 ఏళ్లకే పని చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్తో పార్టీలంటూ బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇప్పటికీ డబ్బు విషయంలో నేనలాగే ఉంటాను. ప్రతి ఖర్చు పుస్తకంలో రాసుకుంటాను. మరీ ఖరీదైనవాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. కాగా 'చయ్య చయ్య' పాటతో ఫేమస్ అయిన మలైకా.. రాత్రైనా నాకు ఓకే (అతిథి), కెవ్వు కేక (గబ్బర్ సింగ్) పాటలతో టాలీవుడ్కు దగ్గరైంది.చదవండి: అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే! -
స్వామీజీకి కిడ్నీ దానం.. మానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారా?
మంచి చేయాలనుకుంటే అందులో కూడా చెడే చూస్తున్నారంటున్నాడు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రా (Raj Kundra). స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ఈయన స్వామికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.కరుణ కూడా పీఆర్ స్టంటా?అయితే చాలామంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తున్నారు. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చడానికే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్పై రాజ్ కుంద్రా అసహనం వ్యక్తం చేశాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసం నా కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. పీఆర్ స్టంట్ అని తీసిపారేస్తున్నారు. ఇలాంటి వింత ప్రపంచంలో ఉంటున్నాం! కరుణ, జాలి అనేవి స్టంట్ అయితే.. ప్రపంచమంతా అది వ్యాపించాలి. వీలైతే ప్రేమించండిమానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. మానవత్వాన్ని స్ట్రాటజీ అని భావిస్తుంటే.. మీరందరూ దాన్ని ఫాలో కావాలి. మీ మెప్పు పొందడం కోసమైతే నేనలా మాట్లాడలేదు. మీ మాటలు, విమర్శలతో నా వ్యక్తిత్వం మారదు. వీలైతే ప్రేమించండి, అంతేకానీ, చులకనగా మాట్లాడకండి.. అప్పుడే ఇతరుల జీవితాల్లో మీరూ వెలుగులు నింపగలరు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.కిడ్నీ ఆఫర్.. తిరస్కరించిన స్వామీజీకాగా ప్రేమానంద్ మహారాజ్ దశాబ్దకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. బృందావన్ ఆశ్రమంలో స్వామీజీని కలిసిన రాజ్కుంద్రా.. నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే అంటూ అవయవదానానికి ఆఫర్ ఇచ్చాడు. కానీ స్వామీజీ అందుకు నిరాకరించారు. రాజ్కుంద్రా కిడ్నీ ఆఫర్ చేసిన సమయంలో శిల్పా శెట్టి భర్త పక్కనే కూర్చుంది.చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్ -
బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్..
-
రకుల్ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీలు ఎవరంటే?
కాదేదీ సినిమాకు అనర్హం అన్నట్లుగా ప్రపంచంలో, సమాజంలో ఉన్న ప్రతీది ఓ కథా వస్తువే! కల్పితాలతో పాటు రియల్ స్టోరీలను కూడా వెండితెరపై చూపిస్తూ ఉంటారు. అలా దేశాన్ని సరిహద్దులో ఉండి కాపాడుతున్న సైనికుల పోరాటాలు, జీవన విధానాలు తెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ కొందరు సైనికులుగా సేవ చేస్తే మరికొందరు సెలబ్రిటీలకేమో మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో మిలటరీ నేపథ్యం ఉన్న తారలెవరో ఓసారి చూసేద్దాం..రకుల్, అనుష్క పేరెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ఆర్మీ అధికారి. అక్షయ్ కుమార్ (Akshya Kumar) తండ్రి హరి ఓం భాటియా విశ్రాంత ఆర్మీ అధికారి. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలోనూ భాగమయ్యారు. అనుష్క విద్యాభ్యాసమంతా బెంగళూరులోని ఆర్మీ స్కూల్లోనే జరిగింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు మధు - అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. నటి లారా దత్తా తండ్రి ఎల్కే దత్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా పని చేశారు. ఉగ్రదాడిలో వీరమరణంసుష్మితా సేన్ తండ్రి శుభీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా సేవలందించారు. నిమ్రత్ కౌర్ తండ్రి, ఆర్మీ అధికారి మజోర్ భూపిందర్ సింగ్.. 1994లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ కూడా ఓ జవానే! తెలుగు నటి గాయత్రి గుప్తా తాతయ్య సైతం ఆర్మీలో పని చేశాడు. బ్రిటీష్ వారి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శ్రద్ధా శ్రీనాథ్ తండ్రి కూడా ఆర్మీ అధికారే!దిశా పటానీ సోదరి కూడా..నేహా ధూపియా తండ్రి ప్రదీప్ సింగ్ ఇండియన్ నేవీలో కమాండర్గా పని చేశారు. మానుషి చిల్లర్ తండ్రి మిత్ర బసు చిల్లర్ డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఫిజీషియన్గా పని చేశారు. గుల్ పనగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ పనగ్.. మిలిటరీలో అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట్ సేవా పురస్కారం అందుకున్నారు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో మేజర్గా సేవలందిస్తున్నారు.చదవండి: బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు.. -
'నా కిడ్నీల్లో ఒకటి మీదే'.. స్వామిజీకి హీరోయిన్ భర్త బంపరాఫర్!
బాలీవుడ్లో ఎప్పుడు వివాదాల్లో ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లే. ఆ కపుల్ మరెవరో కాదు.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. గతంలో ఓ కేసుతో సంచలనంగా మారిన రాజ్ కుంద్రా.. మరో కేసులో చిక్కుకున్నారు. తనను రూ.60 కోట్ల మోసం చేశారంటూ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్కు ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని రాజ్ కుంద్రా మాటిచ్చారు. ఇది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను ప్రేమానంద్ భజన్ మార్గ్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రాకు ప్రేమానంద్ ధన్యవాదాలు తెలిపారు. మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని శిల్పాశెట్టి దంపతులు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వీడియో బయటకి రావడం విశేషం.రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'నేను గత రెండేళ్లుగా మిమ్మల్ని అనుసరిస్తున్నా. నాకు ఏవైనా సందేహాలు, భయాలకు మీ వీడియోలు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాయి. ఇప్పుడు నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. మీరు అందరికీ ప్రేరణ. మీ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే నేను సహాయం చేయగలిగితే నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే." అని అన్నారు.అయితే ప్రేమానంద్ మహారాజ్కు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుంద్రా కిడ్నీ ఆఫర్ చేశారు. ఈ నిర్ణయం శిల్పాశెట్టిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ దూకుడు
-
బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు..
పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్న తారలకు సెల్యూట్ చేద్దాం..కెప్టెన్ రాజు80's, 90'sలో విలన్గా రాణించిన కెప్టెన్ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.సునీల్ శెట్టిసునీల్ శెట్టి సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్ కల్నల్గా ఆర్మీలో సేవలందించారు.నానా పటేకర్నానాపటేకర్ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.సంజయ్ దత్1947లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాల్గొన్నాడు.అచ్యుత్ పోట్దార్నటుడు అచ్యుత్ చదువు పూర్తవగానే ఆర్మీలో చేరారు. ఆ తర్వాత సినిమాల్లో రంగప్రవేశం చేశారు.బిక్రంజీత్ కన్వర్పాల్బిక్రంజీత్ నటుడు కాకముందు ఒక జవాన్.. మేజర్గా ఉన్నప్పుడే ఆర్మీ నుంచి వైదొలిగారు.గుఫి పైంటల్మహాభారతం సీరియల్లో శకునిగా నటించిన గుఫి ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. భారత్-చైనా సరిహద్దులో జవాన్గా విధులు నిర్వర్తించారు.మహ్మద్ అలీ షాతండ్రి బాటలోనే నడుస్తూ అలీ షా కూడా సైన్యంలో చేరాడు. ఆర్మీలో మేజర్గా పని చేశారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.రుద్రశిష్ ముజందార్చిచోరే, జెర్సీ ఫేమ్ రుద్రశిష్ ముజందార్ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నారు.మనోజ్ బాజ్పాయ్సత్య నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee)కు ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్గా నటించాడు.చదవండి: ‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే? -
'ఇదేం మీ ఇల్లు కాదు.. ముందు బయటికి వెళ్లండి'.. ఆలియా భట్ ఆగ్రహం
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఈ ఏడాది అల్ఫా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది వచ్చిన జిగ్రా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్లకు కాస్తా విరామం దొరకడంతో ఆలియా భట్ ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తోంది. ముంబయిలోని తన నివాసం వద్ద పాడిల్ బాల్ ఆడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అయితే అంతకుముందే పాడిల్ బాల్ ఆడేందుకు వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఆమెను ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు. ఏకంగా ఆలియాతో పాటే బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆలియా భట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపలికి రావొద్దు.. దయచేసి బయటికి వెళ్లండి.. ఇది మీ భవనం కాదు అంటూ మండిపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయినా సెలబ్రిటీలను ఫోటోల కోసం ఇలా వెంటపడి వేధించడం సరికాదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారికి పర్సనల్ లైఫ్ ఉంటుందని.. ఇలా ఇబ్బంది పెట్టపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా చేసేవారికి కొంతైనా కామన్ సెన్స్ ఉండాలని.. సెలబ్రిటీలను బాధపెట్టడం సరికాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు.Alia Bhatt spotted playing Padel #AliaBhatt #padel pic.twitter.com/NPwpzi7iQ8— Aristotle (@goLoko77) August 14, 2025కాగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేయనుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.దేశవ్యాప్తంగా దాదాపు రూ.52.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 29 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.23.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. -
సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్
దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... యుద్ధానికి కొత్త నిర్వచనం‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని యూనిట్ పేర్కొంది.అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మాన్ ఖాన్ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మేజర్ షైతాన్ సింగ్ మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా ‘120 బహదూర్’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్ స్క్రీన్పై షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. రాజ్పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. ఆపరేషన్ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్ ది ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్ హక్కులను రణ్దీప్ హుడా ఫిల్మ్స్, రాహుల్ మిత్రా ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. బోర్డర్లో వార్ భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ (1977) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. గూఢచారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కీస్ పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్ ఖేత్రపాల్గా అగస్త్య నంద (అమితాబ్బచ్చన్ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
గ్యాంగ్స్టర్ ప్రేయసి
షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్స్టర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. 1990 నేపథ్యంలో ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మాఫియాతో పాటుగా ప్రేమ సన్నివేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయని బాలీవుడ్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగా విశాల్ భరద్వాజ్ నటీనటుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలోని హీరోయిన్స్ పాత్రల కోసం త్రిప్తి దిమ్రి, దిశా పటానీలను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి జోడీగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో విక్రాంత్ మెస్సే, రణ్దీప్ హుడా, నానా పటేకర్, అవినాష్ తివారి నటించనున్నారని సమాచారం. షాహిద్ కపూర్, విక్రాంత్ మెస్సే, రణ్దీప్ హుడా వంటి పాపులర్ హీరోలు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడుతున్నాయి. -
కాలేజీ క్యాంపస్ డ్రామాకి సై
నటిగా సూపర్ హిట్ అయిన ఆలియా భట్ నిర్మాతగా మాత్రం ఇంకా హిట్ స్టేటస్ను సాధించలేక పోతున్నారు. ఎటర్నల్ సన్షైన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థనుప్రారంభించిన ఆలియా భట్, ‘డార్లింగ్’, జిగ్రీస్’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆలియా భట్ లీడ్ రోల్ చేశారు. కానీ ఈ రెండు చిత్రాలూ హిట్ కాలేక పోయాయి. ఇప్పుడు ఆలియా భట్ మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం.అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన శ్రీతీ ముఖర్జీ ఓ కాలేజీ క్యాంపస్ డ్రామా కథను సిద్ధం చేసి, ఈ కథను ఆలియా భట్కు వినిపించారట. ఆలియాకు ఈ కథ నచ్చడంతో నిర్మించేందుకు ఓకే అన్నారట. అయితే కాలేజ్ క్యాంపస్ డ్రామా కాబట్టి తాను నటించకుండా, నూతన నటీనటులకు చాన్స్ ఇవ్వాలని ఆలియా భావిస్తున్నారని, ఆ దిశగా ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్ స్టార్ట్ కానుందని బాలీవుడ్ టాక్. మరోవైపు నటిగా ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిసస్తున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లోని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
నవ్వుల జాలీ
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘జాలీ ఎల్ఎల్బీ’ నుంచి రానున్న తాజా చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ 3’. ఈ సినిమాలో అక్షయ్కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రధారులుగా నటించారు. సౌరభ్ శుక్లా, హ్యూమా ఖురేషీ, అమ్రితా రావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాష్ కపూర్ దర్శకత్వంలో అలోక్ జైన్, అజిత్ అంథారే నిర్మించిన ఈ చిత్రంసెప్టెంబరు 19న విడుదల కానుంది.ఈ చిత్రంలో లాయర్ జగదీశ్వర్ జాలీ మిశ్రా పాత్రలో అక్షయ్ కుమార్, లాయర్ జగదీష్ జాలీ త్యాగి పాత్రలో అర్షద్ వార్షి, జడ్జ్ పాత్రలో సౌరభ్ శుక్లా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అక్షయ్, అర్షద్ల మధ్య గొడవలు, కోర్ట్ రూమ్లో జరిగే కామెడీ డ్రామాగా సాగుతుంది. -
నటి శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు
-
జాన్వీ కపూర్ పరమ్ సుందరి.. అక్కడ రొమాన్స్ ఏంటి?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా కనిపించనుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందోట్రైలర్లో చూపించారు.అయితే పరమ్ సుందరి ట్రైలర్తోనే ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ ట్రైలర్లో చర్చిలో వచ్చే సీన్పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వాచ్డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సన్నివేశాన్ని సినిమా వెంటనే తొలగించాలని లేఖలో కోరింది.ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఉందని వాచ్డాగ్ ఫౌండేషన్కు చెందిన న్యాయవాది గాడ్ఫ్రే పిమెంటా అన్నారు. చర్చి ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలమని.. దానిని అసభ్యకరమైన కంటెంట్కు వేదికగా చిత్రీకరించవద్దని లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా కాథలిక్ సమాజాన్ని కించపరచడమేనని లేఖలో వివరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం.. కోటీ రూపాయలు మిస్ చేసుకున్న యువతి!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్పతి' షోతో బిజీగా ఉన్నాపు. ప్రస్తుతం 17వ సీజన్కు ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయల ప్రశ్న వరకు దూసుకొచ్చింది. అయితే ఒక్క సమాధానం చెబితే కోటి రూపాయలు యువతి సొంతమయ్యేవి. కానీ ఊహించని విధంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే రూ.50 లక్షల ప్రైజ్మనీతోనే సరిపెట్టుకుంది. ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.తాజా ఎపిసోడ్లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతి కశీష్ సింఘాల్ రూ. 50 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఈ డబ్బుతో తన తండ్రి చేసినరూ. 15 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ యువతి సమాధానం చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో చూసేద్దాం.ప్రశ్న: విసిగోత్ రాజ్యానికి చెందిన ఏ రాజు రోమ్ నగరంపై దాడి చేయకుండా ఉండేందుకు మిరియాలు డిమాండ్ చేశాడు?ఎ) లుడోవిక్, బి) ఐమెరిక్, సి) అలారిక్ డి) థియోడోరిక్ ఆప్షన్స్ ఇవ్వగా.. కశీష్ సింఘాల్ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి..అలారిక్ అంటూ అమితాబ్ చెప్పారు. రూ.50 లక్షలు గెలిచిన ఆమె తన జర్నీని పంచుకని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ రియాలిటీ షో సోనీటీవీతో పాటు సోనీలివ్ ఓటీటీలోనూ ప్రసారమవుతోంది. -
ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన హీరోయిన్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు హీరో ధనుష్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో నిలిచిన ఆమె ఇటీవలే దానికి ఫుల్స్టాప్ పెట్టింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే హీరోయిన్ బిపాసా బసు (Bipasha Basu) గురించి ఆమె గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఆ హీరోయిన్ మగాడిలా కనిపిస్తుందినేను బిపాసా కంటే అందంగా ఉంటాను. ఆమె కండలు తిరిగిన దేహంతో మగాడిలా కనిపిస్తుంది. ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అని కామెంట్స్ చేసింది. ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో బిపాసా బసు.. మృణాల్కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పేరును ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.మృణాల్కు కౌంటర్?బలమైన మహిళలు ఎల్లప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు. అందమైన స్త్రీలకు ఆ మజిల్స్ అవసరం. ఎందుకంటే.. మహిళలెప్పుడూ బలంగా, ధృడంగా ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. స్త్రీలు స్ట్రాంగ్గా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలను బద్ధలు కొట్టండి అని బిపాసా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: మహేశ్ బాబు మరదలికి తృటిలో తప్పిన ప్రమాదం -
తిరుమలేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా
-
'ఛావా' లాంటి సినిమా అస్సలు చేయను: స్టార్ హీరో
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ఘోరంగానే ఉంది. స్టార్ హీరోలు వరసగా మూవీస్ చేస్తున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటిది ఈ ఏడాది 'ఛావా' అనే చిత్రం అనుహ్యమైన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ అబ్బురపరిచింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తన లైఫ్లో అస్సలు చేయనని, ఇలాంటి తీయడం సరికాదు అని బాలీవుడ్కి చెందిన హీరో జాన్ అబ్రహం చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా)జాన్ అబ్రహం లేటెస్ట్ సినిమా 'టెహ్రాన్'.. ఆగస్టు 14న నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్లో పాల్గొన్న జాన్.. ఓ ఇంగ్లీష్ వెబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఛావా', 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' తదితర చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జీవితంలో అలాంటి చిత్రాలు చేయనని తెగేసి చెప్పాడు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు.'ప్రేక్షకులు మనతో మంచిగా ఉంటారు. కాబట్టి అందుకు తగ్గ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్పై ఉంది. నేను రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్కి చెందినవాడిని కాదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే రైట్ వింగ్కి చెందిన కొన్ని సినిమాలు.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ప్రేక్షకులకు నచ్చాయని తెలుసు కానీ నేను ఇప్పటివరకు 'ఛావా', 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీస్ ఎప్పటికీ చేయను. ఓ వర్గం ప్రజల్ని ఇవి ప్రభావితం చేయడం చూస్తుంటే నాకు భయమేస్తోంది' అని జాన్ అబ్రహం తన అభిప్రాయాన్ని చెప్పాడు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
ఓటీటీకి వచ్చేస్తోన్న రూ.500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్గా ప్రకటించే అవకాశముంది.కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది. -
'తెలుగులో అల్లు అర్జున్'.. జాన్వీ కపూర్ పరమ్ సుందరి ట్రైలర్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. కేరళ అమ్మాయితో ఢిల్లీకి చెందిన అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రెంజీ పనీకర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ సంగీతమందించారు.#ParamSundariTrailer features the iconic "JHUKEGA NAHI" reference of our Icon Star. 🔥Wishing #JanhviKapoor, @SidMalhotra and @MaddockFilms all the best for Param Sundari on behalf of all Allu Arjun fans. ♥️ pic.twitter.com/wmGYQCi5ir— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 12, 2025 -
కపిల్ శర్మ టార్గెట్.. ఇంటి వద్ద భారీ భద్రత!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మరోసారి కెనడాలోని ఆయన కేఫ్పై కాల్పులు జరగడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కపిల్ శర్మ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.కాగా.. ఆగస్టు 8న కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్ కాప్స్ కేఫ్పై కాల్పులు జరిగాయి. నెలలోపే ఇది రెండవ ఘటన కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలోనే జూలై 10న ఇదే తరహాలో దాడి జరిగింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.రెండోసారి దాడి తర్వాత బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ నుంచి ఆడియో సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ నెట్ఫ్లిక్స్ షో ప్రీమియర్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించడమే దీనిని కారణమని ఆడియో సందేశంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేసే వారిని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా పని చేస్తుందని ఆడియోలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబయి పోలీసులు ఓషివారాలోని కపిల్ శర్మ నివాసాన్ని సందర్శించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి. ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్లో కెరీర్ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
యానిమల్, మార్కోను మించిన వయొలెన్స్.. ఆ ఏజ్ వాళ్లకు మాత్రమే టీజర్!
గతంలో వచ్చిన యానిమల్, మార్కో మోస్ట్ వయొలెంట్ చిత్రాలుగా పేరు సంపాదించుకున్నాయి. ఈ సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ ఉందంటూ కొందరు విమర్శించారు. అంతలోనే అంతకు మించిన వయొలెన్స్తో మరో మూవీ రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే మరి ఇంత వయొలెన్స్ ఏంట్రా సామీ అనాల్సిందే. ఈ టీజర్ కేవలం 18 ఏళ్లు మించినవాళ్లకు మాత్రమే.బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో వస్తోన్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ చిత్రం 'బాఘి 4'. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో మోస్ట్ వయొలెంట్ విజువల్స్ ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. మార్కో, యానిమల్ చిత్రాలను మించిపోయేలా టీజర్ విజువల్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తున్నాయి.ఈ చిత్రంలో హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ తన మోస్ట్ వయొలెంట్ పాత్రలో రోనీగా కనిపించనున్నారు. ఈ టీజర్లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉంది. ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా కథ అందించగా.. ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సోదరి సమీక్షా పెడ్నేకర్ (Samiksha Pednekar)తో కలిసి బ్యాక్బే అనే బ్రాండ్ స్థాపించి ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే తన లక్ష్యం అని చెప్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. భూమి ఇంకా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్లో సొంతంగా ఓ ప్లాంట్ స్థాపించాం. అందుకు మాకెంతో గర్వంగా ఉంది. ప్లాస్టిక్ వాడకుండా..అక్కడ మహిళలే పని చేస్తున్నారు. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్స్తో లభ్యం అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ను వాడలేదు. బాటిల్ క్యాప్ భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. ఇలా పర్యావరణ స్పృహతో పనిచేస్తున్న వాటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మాది మాత్రమే! అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, రూ.750 ml వాటర్ బాటిల్ ధర రూ.200గా నిర్ణయించాం. రూ.200కే మంచినీరుఅందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజుల్లో అందరూ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీళ్లు. మా బాటిల్లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. 15 ఏళ్లలో ప్రతి ఇంట్లో మా బాటిల్ కనిపించాలని ఆశపడుతున్నాం.పెట్టుబడి ఎలా?17 ఏళ్ల వయసులో నా సంపాదన మొదలైంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో పనిచేసినప్పుడు నాకు ఇచ్చిన తొలి పారితోషికం రూ.7 వేలు. అప్పటినుంచే నాకు పొదుపు చేయడం అలవాటు. అలా నా సంపాదనలో కొంతభాగాన్ని కూడబెడుతూ వచ్చాను. ఆ డబ్బుతోనే బ్యాక్బే ప్రారంభించగలిగాం అని చెప్పుకొచ్చింది. భూమి పెడ్నేకర్ చివరగా మేరే హజ్బెండ్ కి బివి సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) చదవండి: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే! -
బిగ్బాస్ కొత్త సీజన్లో పహల్గామ్ బాధితురాలు?
కొన్నాళ్ల క్రితం కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గుర్తుండే ఉంటుంది. హనీమూన్ కోసం అక్కడికి అదేరోజు వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్.. ఉగ్రవాదుల్లో కాల్పుల్లో మరణించాడు. ఇతడి పక్కనే రోదిస్తున్న భార్య హిమాన్షి నర్వాల్ ఫొటో అప్పుడు తెగ వైరల్ అయింది. ఆమెకు చాలామంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 'బిగ్బాస్'.ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. దీనిలో ఎవరెవరు పాల్గొంటారు అనే విషయమై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే భర్త, ఉగ్రదాడిలో చనిపోయి ఎన్నిరోజులు కాలేదు అలాంటిది ఈమె షోలో పాల్గొంటుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్కి పెళ్లి.. ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ)బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి బిగ్బాస్ షో నిర్వహకులు.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్ని కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం లేదని మరికొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం అని.. అసలు నిర్వహకులు ఈమెని సంప్రదించలేదని, షోలో పాల్గొనే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.హిమాన్షి కథ వెనకున్న విషాదం చాలామంది భారతీయుల్ని కదిలించింది. ఎందుకంటే పెళ్లి చేసుకుని కొన్నిరోజులకే హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా.. అక్కడ ఈ దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఈమె భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. హిమాన్షి క్షేమంగా బయటపడింది. ఘటన స్థలంలోనే నిర్జీవంగా ఉన్న భర్త పక్కన ఈమె కన్నీళ్లు పెడుతున్న ఫొటోలు.. దేశవ్యాప్తంగా చాలామందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి టాలీవుడ్ లేడీ సింగర్ సమీర భరద్వాజ్.. ఫొటోలు) -
అనుపమ్ ఖేర్కు వింత అనుభవం.. టాయిలెట్ గుర్తులు చూసి ఆవేదన!
కశ్మీర్ ఫైల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. నటనతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్షన్లో వచ్చిన తన్వి ది గ్కేట్ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. కాగా.. అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'తన్వి ది గ్రేట్' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాజాగా అనుపమ్ ఖేర్కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. ఇది కాస్తా సిల్లీగా అనిపించినా ఆయనకు మాత్రం పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. టాయిలెట్ ప్రదేశాల్లో బయట ఉండే ఆడ, మగ గుర్తులను చూసి కన్ఫ్యూజ్ అయ్యానని ఏకంగా వీడియోను పంచుకున్నారు. ఇలా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని ఫ్యాన్స్ను అడిగారు. టాయిలెట్ బయట సింపుల్గా లేడీస్, జెంట్స్ అని రాస్తే సరిపోతుంది కదా? ఈ బొమ్మలు వేసి ఎందుకింత అయోమయానికి గురి చేస్తున్నారని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో నాకు అర్థం కాని విషయం.. గతంలో ఉన్నంత సరళంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.ఇదంతా ఫన్నీగా అనిపించినా వయస్సు పెరిగే కొద్ది చూపు కూడా తగ్గుతుంది. బహుశా అందువల్లే గుర్తు పట్టలేక తన బాధను ఇలా అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా అందరూ సులభంగా గుర్తు పట్టేలా బొమ్మలతో పాటు పేర్లు కూడా రాస్తే సులభంగా ఉంటుందని నెటిజన్స్ సలహాలిస్తున్నారు.కాగా.. అనుపమ్ దర్శకత్వం వహించిన తన్వీ ది గ్రేట్ చిత్రం ఆటిజంతో బాధపడుతున్న ఓ యువతి తండ్రి స్ఫూర్తిలో భారత సైన్యంలో చేరాలని కలలు కంటుంది. ఆ యువతి స్ఫూర్తిదాయకమైన కథనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్తో పాటు శుభంగి దత్, బోమన్ ఇరానీ, కరణ్ ట్యాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. అనుపమ్ ఖేర్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించిన 'తన్వి ది గ్రేట్' కేన్స్, న్యూయార్క్, హ్యూస్టన్, లండన్లో జరిగిన చలనచిత్రోత్సవాలలో అంతర్జాతీయంగానూ గుర్తింపును తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
నేను నీ డైపర్లు మారిస్తే నువ్వేమో.. అమ్మతనంపై కియారా పోస్ట్
బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)- కియారా అద్వాణీ (Kiara Advani) పట్టలేనంత సంతోషంలో ఉంది. కారణం.. వీరికి ఈ ఏడాది జూలైలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అప్పటినుంచి పసిపాపతోనే వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారు. తొలిసారి మాతృత్వాన్ని అనుభవిస్తున్న కియారాకు అమ్మతనం కొత్తగానూ, తన్మయత్వంగానూ ఉంది. ఈ డీల్ బాగుంది..తన ఫీలింగ్స్ను సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది.. నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావు. ఈ డీల్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది. దీనికి కళ్లలో నీళ్లు తిరుగుతున్న ఎమోజీ, చేతితో హార్ట్ సింబల్ చూపిస్తున్న ఎమోజీని జత చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. 2021లో వచ్చిన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2023లో వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమారెండేళ్లకే పాప పుట్టడంతో ఆనందంలో తేలియాడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కియారా చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అలాగే యశ్ టాక్సిక్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. సిద్దార్థ్ విషయానికి వస్తే ఇతడు ప్రస్తుతం పరమ్ సుందరి మూవీ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది.చదవండి: రాఖీ పండగరోజు ప్రభాస్ చెల్లి ఇలా చేసిందేంటి? -
అతిలోక సుందరిలా జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. మనసు దోచేసే అందం (ఫొటోలు)
-
ప్రముఖుల ‘బయోపిక్స్’
మిస్సైల్ మేన్ అబ్దుల్ కలామ్ జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు చూడాలని ఎవరికి ఉండదు? ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? కొందరు లెజెండ్స్ జీవితాలు అందరికీ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అందుకే వారి జీవితాలకు వెండితెర రూపం ఇస్తే... ఆ బయోపిక్కి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం బాలీవుడ్లో పలువురు లెజెండ్స్ జీవితాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ప్రముఖుల ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం.మిస్సైల్ మేన్లా... భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ‘కలామ్’ చిత్రం రూపొందనుంది. ఈ మిస్సైల్ మేన్ పాత్రను ధనుష్ పోషించనున్నారు. ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని ఈ ఏడాది మేలో ఫ్రాన్స్లో జరిగిన కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. ‘ది మిస్సైల్ మేన్ ఆఫ్ ఇండియా’ అనేది ‘కలాం’ సినిమా టైటిల్కి ట్యాగ్లైన్గా నిర్ణయించింది యూనిట్.అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు అబ్దుల్ కలాం చేసిన సేవను ఈ చిత్రంలో చూపించనున్నారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు కలాం స్ఫూర్తిదాయక జీవితాన్ని ప్రపంచానికి చూపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.యువర్ హానర్... లాయర్గా కోర్టులో ఎలా వాదించాలో శిక్షణ తీసుకుంటున్నారు రాజ్కుమార్ రావ్. ఎందుకంటే ‘యువర్ హానర్’ అంటూ అసలు సిసలైన లాయర్గా ఒదిగి పోవడానికి. భారతదేశ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. ఉజ్వల్ నికమ్ కెరీర్లో అత్యంత కీలకమైన ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కసబ్పై జరిగిన విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.అవినాష్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఎంతో పేరు, ప్రతిష్ఠలు ఉన్న ఉజ్వల్ నికమ్ పాత్రలో తన నటన గౌరవప్రదంగా ఉండటానికి రాజ్కుమార్ రావ్ ప్రత్యేకంగా వర్క్షాప్కి హాజౖరై, శిక్షణ తీసుకుంటున్నారట. ఈ చిత్రం షూటింగ్ని అక్టోబరులో ఆరంభించాలనుకుంటున్నారు. ‘‘ఉజ్వల్ నికమ్లాంటి గౌరవప్రదమైన న్యాయవాదికి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. మరాఠా యోధుడు శివాజీ జీవితంతో... డ్రీమ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు రితేష్ దేశ్ముఖ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని, శివాజీ పాత్రను తానే చేయాలనీ రితేష్కి కొంత కాలంగా ఉన్న కల. ఆ కల నెరవేర్చుకుంటున్నారు. ‘రాజా శివాజీ’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రితేష్ నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మూడు నాలుగు నెలల క్రితం విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన లభించింది. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న విడుదల చేయనున్నారు.మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఛత్రపతి శివాజీకి గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు... లక్షలాది మంది హృదయాలలో నివసించే భావోద్వేగం. ఆయన అసాధారణ జీవిత కథలో ఒక భాగాన్ని చెప్పగలగడం గౌరవం, గొప్ప బాధ్యత’’ అని రితేష్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. మేజర్ షైతాన్ సింగ్ పరమ వీర చక్ర పురస్కారగ్రహీత మేజర్ షైతాన్ సింగ్గా ఒదిగి పోవడానికి ఓ నటుడిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. ఎందుకంటే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టంతో రూపొందిస్తున్న ‘120 బహదూర్’లో షైతాన్ సింగ్ భాటీ పాత్ర పోషిస్తున్నారు ఫర్మాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య జరిగిన యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.ఈ ఘటన ప్రధానాంశంగా రూపొందుతున్న చిత్రం ‘120 బహదూర్’. ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ‘‘ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. 62 ఏళ్ల వయస్కురాలిగా యామీ 62 ఏళ్ల వయసులో తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం కోరుకుంటుంది షా బానో. అయితే అతను ససేమిరా అంటాడు. చేసేదేం లేక ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కుతుంది. భరణం కోసం న్యాయ పోరాటం చేస్తుంది. 1985లో జరిగిన ఈ కేసు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 62 ఏళ్ల వృద్ధురాలు షా బానో పాత్రను యామీ గౌతమ్ చేశారు.ఆమె భర్త అహ్మద్ ఖాన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. ఈ పాత్ర యామీకి ఓ సవాల్ లాంటిది. ఎందుకంటే మూడు పదుల వయసులో ఉన్న యామీ అంతకు రెండింతలు వయసు ఉన్న మహిళగా ఒదిగి పోవడం అంటే ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫార్మ్ కావాలి... అలాగే ప్రోస్థెటిక్ మేకప్కి ఎక్కువ సమయం కేటాయించారు. నటనపరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.ఆపరేషన్ ఖుక్రి యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత 75 రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ని రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. 2000లో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆపరేషన్ ఖుక్రి’. రాజ్పాల్ పునియా పాత్రను రణ్దీప్ హుడా పోషిస్తున్నారు.‘ఆపరేషన్ ఖుక్రి: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రణ్దీప్ హుడా ఓ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘‘నా హృదయాన్ని చాలా బలంగా తాకిన కథ ఇది’’ అని రణ్దీప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఆగిందనే టాక్ వినిపిస్తోంది. చిత్రదర్శకుడు అమిత్ శర్మ ఈ సినిమాని వదిలి, వేరే ప్రాజెక్ట్స్ చేపట్టడమే దీనికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అగస్త్య నందాకి భలే చాన్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు (అమితాబ్ కుమార్తె శ్వేత కుమారుడు) అగస్త్య నందాకి నటుడిగా రెండో సినిమాకే మంచి అవకాశం దక్కింది. ‘ఆర్చీస్’ (2023) చిత్రంతో నటుడిగా కెరీర్ ఆరంభించారు అగస్త్య. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక రెండో చిత్రంగా ‘ఇక్కీస్’ చిత్రానికి అవకాశం వచ్చింది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.ఈ చిత్రంలో అరుణ్ ఖేత్రపాల్ పాత్రను అగస్త్య చేశారు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన పరమ వీర చక్ర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ శౌర్యం, త్యాగాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇవే కాదు... ఇంకొందరు ప్రముఖుల జీవితాలతో కొన్ని బయోపిక్స్ రూపొందుతున్నాయి. – డి.జి. భవాని -
అమీర్ ఖాన్పై సంచలన ఆరోపణలు చేసిన సోదరుడు
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. 2000 ఏడాదిలో విడుదలైన 'మేళా' సినిమాలో అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్ కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత తమ మధ్య సంబంధాలు తెగిపోయాయని ఫైసల్ ఖాన్ చెప్పారు. ఆ సమయం నుంచి తామిద్దరం వేరుగానే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఆమీర్పై ఫైసల్ తరచుగా షాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. 2007లో అమీర్ తనను ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే బంధించాడని తన గత జీవితం గురించి ఫైసల్ గుర్తు చేసుకున్నాడు.ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఫైసల్ నివసిస్తున్నాడు. తనతో కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడరని చెప్పాడు. తన తల్లి, సోదరుడితో విభేదాల తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయానని గుర్తచేసుకున్నాడు. తనకు మానసిక వ్యాధి ఉందంటూ కుటుంబ సభ్యులే నమ్మించే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. గతంలో తనకు ఏవో కొన్ని మందులు బలవంతంగా ఇచ్చేవారని ఇలా తెలిపాడు. ' 2007 సమయంలో నాకు పిచ్చి పట్టిందంటూ ఒక ఏడాది పాటు ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. నేను సమాజానికి హాని చేస్తానంటూ చెప్పేవారు. ఆమీర్ స్నేహితుల వల్లే మా మధ్య దూరం పెరిగింది. వారందరు కలిసి నా సోదరుడి బ్రెయిన్ వాష్ చేశారు. ఆమీర్ ఎంటో నాకు తెలుసు. అతను చాలా మంచివాడు. కానీ, అతని స్నేహితుల వల్లే ఇలా చేశాడనిపిస్తుంది.' అని ఫైసల్ చెప్పాడు.ఫైసల్ ఖాన్ బాలీవుడ్ నటుడు, గాయకుడు కూడా.. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, - 2007లో ఫైసల్ ఖాన్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయనను పూణేలో గుర్తించి వైద్య పరీక్షలు చేయించారు. -
అవకాశాల్లేవంటున్న బ్యూటీ.. బాస్ పాటతోనైనా కలిసొచ్చేనా?
'నాగిని' సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' అనే హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది. అంచనాలు తలకిందులుఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీఅందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.నా జర్నీని తక్కువ చేయలేనుఎందుకంటే నా కెరీర్ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్ ఉంటుంది. విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్ టెస్ట్కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ -
అందరిముందే తిట్టిన ప్రేయసి.. నటుడి సలహాతో బ్రేకప్ చెప్పిన బిగ్బీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)- జయ బచ్చన్ పెళ్లి చేసుకుని 50 ఏళ్లు పైనే అవుతోంది. అయితే జయను ప్రేమించి పెళ్లాడటానికి ముందు బిగ్బీ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట! ఈ విషయాన్ని నటుడు, రచయిత హనిఫ్ జవేరీ వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనిఫ్ మాట్లాడుతూ.. అమితాబ్ ముంబైకి రావడానికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తన పేరు మాయ. బ్రిటీష్ ఎయిర్వేస్లో పనిచేసేది. సినిమాల్లోకి రాకముందే లవ్స్టోరీ..అమితాబ్ తనను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కూడా ఆయన్ను అంతే ఇష్టపడింది. సినిమాల్లో పని వెతుక్కుందామని అమితాబ్ ముంబై వచ్చేశాడు. ముంబైలోని జుహులో.. తల్లి తేజ్ బచ్చన్ స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడు. తరచూ మాయ ఆ ఇంటికి వచ్చి అతడిని పలకరిస్తూ ఉండేది. అయితే బిగ్బీ తల్లి స్నేహితురాలు కూడా అదే ఇంట్లో ఉండేది. దీంతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని అమితాబ్ చాలా భయపడ్డాడు.తొలి సినిమా షూటింగ్లో..ఆ ఇంటి నుంచి వచ్చేసి బయటెక్కడైనా రెంట్కు ఉండాలనుకున్నాడు. అప్పుడు అమితాబ్ తన ఫస్ట్ మూవీ సాట్ హిందుస్తానీ సినిమా చేస్తున్నాడు. ఇందులో నటుడు అన్వర్ అలీ (Anwar Ali)తో కలిసి నటించాడు. తన బాధను అన్వర్తో చెప్పుకున్నాడు. విషయం అర్థమైన అన్వర్.. బిగ్బీని తన ఇంట్లోనే ఉండమన్నాడు. అలా అన్వర్ అపార్ట్మెంట్లో బిగ్బీ, మాయ చాలాకాలంపాటు కలిసున్నారు. బహుశా వాళ్లు పెళ్లి కూడా చేసుకునుండొచ్చు. అందరి ముందు అవమానించేదికానీ ఆ సమయంలో అమితాబ్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అమితాబ్కు మొహమాటం ఎక్కువ. మాయ మాత్రం కన్నింగ్గా ఉండేది. నోటికొచ్చినట్లు మాట్లాడేది. కొన్నిసార్లు అమితాబ్ పక్కన ఎవరున్నారన్నది కూడా చూసుకోకుండా తిట్టేసేది. అమితాబ్ స్నేహితులకు ఆమె పద్ధతి అస్సలు నచ్చేది కాదు. అతడు కూడా ప్రియురాలు అవమానించడంతో సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఒకసారి గోవాకు షూటింగ్కు వెళ్లినప్పుడు మాయకు బ్రేకప్ చెప్పమని అన్వర్ సలహా ఇచ్చాడు. ఫస్ట్ సినిమా రిలీజ్కు ముందే బ్రేకప్సినిమాల్లో ఇంకా పైస్థాయికి వెళ్లేకొద్దీ సమస్యలు ఎక్కువవుతాయని హెచ్చరించాడు. అమితాబ్కు కూడా అది నిజమేననిపించింది. తమ బంధంలో ఏదో సరిగా లేదని ఎన్నాళ్లుగానో అతడు అసంతృప్తిగా ఫీలవుతున్నాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అమితాబ్ తొలి చిత్రం సాట్ హిందుస్తానీ 1969లో రిలీజైంది. హీరోయిన్ జయను 1973లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శ్వేత బచ్చన్, అభిషేక్ బచ్చన్ సంతానం.చదవండి: ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు! -
ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు!
కొన్ని ఆడిషన్స్ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత సిద్ధమై వచ్చినా సరే ఊహకందని పనులు చేయిస్తారు. అలా తనకు జరిగిన ఓ విచిత్ర ఆడిషన్ను గుర్తు చేసుకుంది బాలీవుడ్ నటి ఇషా తల్వార్ (Isha Talwar). ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిలింస్ సంస్థకు చెందిన కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశాను. నాకు ముంబై వెర్సోవాలో ఓ రెస్టారెంట్లో సీన్ ఉందన్నారు. అక్కడికి వెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు.రెస్టారెంట్లో ఏడవమన్నారునటి ఎటువంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పకూడదన్నారు. షనూ, తన అసిస్టెంట్లతో కలిసి రెస్టారెంట్లో నా ముందే కూర్చుంది. అందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్లో అందరికీ వినబడేలా గట్టిగా ఏడ్వాలని చెప్పేసరికి అంతా అయోమయంగా అనిపించింది. అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఒక అమ్మాయిని ఇలా పదిమందిలో ఏడిపించడం దేనికో నాకస్సలు అర్థం కాలేదు. ఇదేం ఆడిషన్?ఆఫీస్లో ఆడిషన్ పెట్టుకుంటారు కానీ, ఇలా జనం మధ్యలోనా? పోనీ.. సహజంగా రావాలంటే ఏదైనా రెస్టారెంట్ను కాసేపటికి అద్దెకు తీసుకుని ఆడిషన్ చేయాలి!ఏదేమైనా ఇది దాదాపు పదేళ్ల కిందట జరిగిన సంఘటన. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఎవరూ ఒత్తిడికి గురి కాకండి. నేనైతే అలా రెస్టారెంట్లో ఏడవనని చెప్పేశాను, దీంతో సదరు సినిమాలో అవకాశం కూడా దక్కలేదు. కానీ, ఛాన్సుల కోసం ఇలా రెస్టారెంట్లో అస్సలు ఏడవలేను అని చెప్పుకొచ్చింది. ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరంటే?ఇషా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్, ఆర్టికల్ 15 చిత్రాల్లో నటించింది. కాగా ఈ సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ షనూ.. బాలీవుడ్కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసింది. వారిలో రణ్వీర్ సింగ్, భూమి పడ్నేకర్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ మధ్యే సయ్యారా మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.చదవండి: ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని -
'పరమ్ సుందరి'గా జాన్వీ కపూర్.. వర్షంలో రొమాంటిక్ సాంగ్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.బీగీ శారీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో సిద్ధార్థ్- జాన్వీల కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో చేసిన ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ అద్భుతమైన సాంగ్ను శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఆలపించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. సచిన్ జిగర్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
ఒక్క ఎపిసోడ్కు నా రెమ్యునరేషన్ ఎంతంటే..: స్మృతి ఇరానీ
కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ బుల్లితెరపై కనిపించారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్ గత నెల నుంచే ప్రసారం అవుతుంది. అయితే, ఈ సిరీయల్ కోసం తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది తాజాగా స్మృతి ఇరానీ పంచుకున్నారు. తాను ఫుల్టైమ్ రాజకీయనాయకురాలు అని, పార్ట్టైమ్ యాక్టర్ అని ఆమె ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2 సీరియల్తో తులసి విరానీగా స్మృతి ఇరానీ తిరిగొచ్చారు. అయితే,తాను ఈ సిరీయల్ నటించేందుకు ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 14 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా CNN-News18తో ఆమె మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. నిరంతరం మనం ఏదో పనిలో ఉంటూనే ముందుకు వెళ్లాలని చెప్పారు. కేవలం ఆదాయం కోసమే పనిచేస్తే అనుకున్నది సాధించడం కష్టమని స్మృతి తెలిపారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సీరియల్ నటిగా స్మృతి ఇరానీ రికార్డ్ క్రియేట్ చేశారు. హిందీలో బాగా పాపులర్ అయిన 'అనుపమ' సీరియల్ కోసం రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్కు రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆ రికార్డ్ను స్మృతి ఇరానీ దాటేశారు. మరో నటి హీనా ఖాన్ కూడా ఎపిసోడ్కు రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు.సుమారు 25 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ'. ఈ సీరియల్తో స్మృతి ఇరానీకి మంచి గుర్తంపు దక్కింది. 2000 ఏడాదిలో మొదలైన ఈ ధారావాహిక 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. అందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ప్రేక్షకుల ఆదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. దానికి సీక్వెల్గానే 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' జులై 29 నుంచి ప్రసారం అవుతుంది. -
నటి సోదరుడిపై కత్తులతో దాడి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు ఆసిఫ్ ఖురేషీ దారుణ హత్యకు గురైయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను (పీటీఐ) షేర్ చేసింది. ఇద్దరు యువకులు ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేయడంతో గొడవ మొదలైంది. దీంతో ఆయుధాలతో అతనిపై ఆ యువకులు తెగబడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. నటి హుమా ఖురేషికి మృతుడు ఆసిఫ్ సోదరుడు వరస అవుతాడు.ఘటన జరిగిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. ఆసిఫ్, అతని పొరుగువారి మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. చాలా ధారుణంగా అతనిపై తెగబడ్డారు. బలంగా కొట్టడంతో పాటు పదునైనా ఆయుధాలతో దాడి చేసినట్లు వీడియోతో అర్థం అవుతుంది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 103(1) హత్య, 3(5) సాధారణ ఉద్దేశ్యం కింద ఉజ్వల్ (19) మరియు గౌతమ్ (18)పై నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యువకులు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం.VIDEO | Actor Huma Qureshi's cousin, Asif Qureshi, was stabbed to death following a dispute over parking in southeast Delhi's Bhogal area on Thursday. Two teenagers have been apprehended in connection with the incident. CCTV visuals of the incident.#DelhiNews(Viewers… pic.twitter.com/DJrXqd3vwX— Press Trust of India (@PTI_News) August 8, 2025 -
ప్రముఖ నటి 'హుమా ఖురేషి' సోదరుడు హత్య
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు దారుణ హత్యకు గురైయ్యారు. ఆమెకు సోదరుడి వరుస అయ్యే ఆసిఫ్ ఖురేషీని ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం వద్ద పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు అతనిపై గొడవకు దిగారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'ఆసిఫ్ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేశారు. దీంతో వాహనాలను తొలగించాలని ఆసిఫ్ కోరడంతో వారిద్దరూ గొడవకు దిగారు. ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ తర్వాత నిందితులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దాడి తర్వాత, ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.' అని పేర్కొన్నారు.ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఇదే పార్కింగ్ విషయంలో వారిద్దరు తనతో గొడవ పడ్డారని ఆమె చెప్పింది. గురువారం రాత్రి ఆఫీస్ నుంచి తన భర్త ఇంటికి వచ్చాడని ఆ సమయంవలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని కోరినందుకు గొడవకు దిగారని ఆమె తెలపింది. అయితే, పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.హుమా ఖురేషి నటిగా, నిర్మాతగా, రచయితగా కూడా రాణిస్తున్నారు. కాలా, వలిమై,జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలతో పాటు మహారాణి వెబ్ సిరీస్లలో నటించి తెలుగువారికి కూడా బాగా పరిచయం అయింది. -
కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు. మరుగుజ్జుగా నటించడం కష్టంఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.ప్రతీది నిశితంగా గమనించి..కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్గా కనిపించాడు.కమల్ను కాపీ కొట్టావ్నువ్వు (షారూఖ్) వీఎఫ్ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
పుష్ప -2 రికార్డ్స్ అన్ని ఎగిరిపోతాయి
-
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్తో ఉన్న బిల్బోర్డ్ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్బోర్డ్ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
కాజోల్ బర్త్ డే.. ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరోయిన్ (ఫొటోలు)
-
వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న చిత్రం.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. -
మాట నిలబెట్టుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన రియల్ హీరో
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మరణించారు. కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. పూర్తి గా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఫిష్ వెంకట్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో మంది ఆర్థికసాయం అందించినప్పటికీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సైతం ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సాయంగా లక్షన్నర రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు. అంతే కాకుండా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలుస్తానని కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఇవాళ హైదరాబాద్కు సోనూ సూద్ వచ్చారు. అనంతరం అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్లో కనిపించాడు. -
రజినీకాంత్ కూలీ.. అమిర్ ఖాన్ మేకోవర్ వీడియో చూశారా?
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమిర్ ఖాన్ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అమిర్ ఖాన్ మేకోవర్ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు అమిర్ ఖాన్. శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు సైతం చేతి నిండా పచ్చబొట్టుతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025 -
నా ఐటమ్ సాంగ్ చూస్తూ పిల్లలు భోంచేస్తున్నారు: తమన్నా
తమన్నా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు హీరోయిన్గా చేసిన సినిమాలు గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే మాత్రం ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే 'కావాలయ్యా', 'ఆజ్ కీ రాత్' తదితర గీతాలతో తెగ వైరల్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్, నార్త్లో ఈ తరహా సాంగ్స్ చేయడం వల్ల తనకొచ్చిన క్రేజ్ గురించి మాట్లాడింది. ఎంతోమంది పిల్లలు తన పాటలు చూస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది.'ఓ పిల్లాడు నా పాట చూస్తూ తింటుంటే అలానే చూడనివ్వండి' అని తమన్నా చెప్పింది. మీరు ఏ సాంగ్ గురించి మాట్లాడుతున్నారని హోస్ట్ అడగ్గా.. 'స్త్రీ 2 మూవీలో ఆజ్ కీ రాత్ గురించి' అని తమన్నా బదులిచ్చింది. అలానే 'ఎందరో తల్లులు నాకు ఫోన్ చేసి, మా బిడ్డ మీ పాట వింటూ, చూస్తే తప్పితే భోజనం చేయట్లేదు అని చెప్పారో లెక్కలేదు. పిల్లలకు నచ్చింది కనిపిస్తే అలానే చేస్తుంటారుగా' అని తన ఆనందాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)తమన్నా కామెంట్స్పై స్పందించిన హోస్ట్.. ఇది తల్లులు చింతించాల్సిన విషయమే అని అన్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన తమన్నా.. 'తమ పిల్లలు సరిగా తింటున్నారా లేదా అని తల్లులు చింతించాలి. అదే వాళ్లకు ముఖ్యం. అంతే కానీ ఏ సాంగ్ వింటున్నారనేది కాదు. అయినా ఏడాది పిల్లలకు లిరిక్స్ ఏం అర్థమవుతాయి? వాళ్లు సంగీతం మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం కూడా సినిమాల్ని మర్చిపోతాం కానీ పాటలు గుర్తుంచుకుంటాగా. అలానే ఇది' అని చెప్పింది.తమన్నా చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో మంచి బీట్ ఉన్న పాటలంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్సే ఉంటాయి. వాటిని చూపిస్తూనే చాలామంది తల్లలు.. పిల్లలకు అన్నం తినిపిస్తున్నారేమో? ఇకపోతే తమన్నా కెరీర్ విషయానికొస్తే.. చివరగా తెలుగులో 'ఓదెల 2' సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో మూడు మూవీస్ చేస్తోంది. గతేడాది వరకు నటుడు విజయ్ వర్మతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కొన్నాళ్ల క్రితం వీళ్లకు బ్రేకప్ అయింది. ప్రస్తుతానికైతే తమన్నాకు సినిమాలే ప్రపంచం.(ఇదీ చదవండి: ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు) -
ఏఐ మాయ.. పాపం బాలీవుడ్ స్టార్స్ను ఇలా చేశారేంటి?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే. అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా.. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు. చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.#SalmanKhan rocked 😅Watch till the end pic.twitter.com/ryhgna8fbQ— Adil Hashmi👁🗨 (@X4SALMAN) August 2, 2025