breaking news
Bollywood
-
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.గ్లిజరిన్ లేకుండా..ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. నాకంటూ ఎవరూ లేరు'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్గా స్లిప్ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తానంది. నేను చనిపోతే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య -
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్ ఫోటోలు చూశారా..?
-
టైంకి సెట్ కి రాడు..! సల్మాన్ పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు..!
-
కచ్చా బాదమ్ సాంగ్ ఫేమ్.. ఇప్పుడేంటి ఇలా బార్ డ్యాన్సర్గా!
'కచ్చా బాదామ్' సాంగ్తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా. ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో ది లవ్ ఈజ్ ఫరెవర్, దివాళియాన్, డెలియాన్ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు.తాజాగా అంజలి అరోరా థాయ్లాండ్లోని ఓ పబ్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కాగా... అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి. ఒకప్పుడు స్టార్గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.Anjali Arora, Insta dancers ki ‘role model’, Pattaya ke club mein apni ‘talent’ dikhate hue dikhin full jhatka thumka mode on. Wah, reel se deal tak ka asli startup model shayad isi ko kehte hain. pic.twitter.com/2FSwGAQ8QV— NoLawForMen (@MenTooRHuman) August 21, 2025Kacha Badam fame Anjali Arora seems to have made dancing in posh clubs her career.Here she is dancing in a club in Pattaya, Thailand.It is better to earn money than to ask for money. pic.twitter.com/6WzMFJUJrd— Param Choudhary (@Param_117_) August 21, 2025Anjali Arora of Kachcha Badam fame has taken up dancing in posh clubs as a career it seems.Here she is dancing at a Club in Pattaya, Thailand. pic.twitter.com/RXgWZit44Z— Sensei Kraken Zero (@YearOfTheKraken) August 21, 2025 -
బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో ఆయన్ను వైల్డ్ కార్డ్గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!వైల్డ్ కార్డ్గా..పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్లో బిగ్బాస్ హౌస్లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.తెలుగు సినిమాలో..కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు -
ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.అందుకే దత్తత ఆలోచననేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. అలాంటి పెళ్లయితే చేసుకోనుఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్తో జాస్మిన్కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ చాలామంది ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి గియా మానెక్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సాత్ నిభాన సాథియా', 'జీనీ ఔర్ జుజు' సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ జైన్ను పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.గియా తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆ దేవుడు, మా గురువుల దయతో, మీరు కురిపించిన ప్రేమతో మేము ఈ రోజు వివాహాబంధంలోకి అడుగుపెట్టాము. మేము ఇద్దరు స్నేహితులం.. కానీ ఈ రోజు చేయి చేయి కలిపి హృదయపూర్వకంగా మేము భార్యాభర్తలం అయ్యాం. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన మా ప్రియమైన వారందరి ప్రేమ, ఆశీర్వాదాలకు మా కృతజ్ఞతలు. ఎల్లప్పుడు నవ్వుతూ మిస్టర్ అండ్ మిసెస్గా జీవితాంతం కలిసి ఉండటానికి ఇదే మా మొదటి అడుగు." అంటూ పోస్ట్ చేసింది.కాగా.. గియా మానెక్, వరుణ్ జైన్ జంటగా తేరా మేరా సాత్ రహే సీరియల్లో నటించారు. అప్పుడు సహనటులుగా ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు భార్యాభర్తలుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోపైపు గియా మానెక్ సీరియల్స్కతో పాటు సినిమాల్లోనూ నటించింది. కామ్ చాలు హై, నా గర్ కే.. నా ఘాట్ కే లాంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Gia Manek (@gia_manek) -
బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్గా సీమంతం వేడుక!
బాలీవుడ్ భామ గౌహర్ ఖాన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది ప్రారంభంవో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. తాజాగా సీమంతం వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వేడుకను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఆ తర్వాత ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్
ప్రతి ఆడపిల్లకు ఓ వయసు రాగానే నెలసరి ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాలిక కౌమార దశలోకి అడుగుపెడుతుంది. అయితే తన ఫ్రెండ్స్ కంటే తాను ఆలస్యంగా మెచ్యూర్ అయ్యానని, దానికే అమ్మ కోప్పడిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకున్నారు. ఎటు చూసినా రక్తమే..కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరికీ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి మధ్యలోనే పీరియడ్స్ మొదలయ్యాయి. నా ఫ్రెండ్స్ మెచ్యూర్ అవుతుంటే నేనింకా బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పటికే నెలసరి రావట్లేదని కంగారుపడుతూ ఉంటే నేనేమో ఇలా బొమ్మలతో ఆడుకుంటున్నానని అమ్మ కోప్పడింది. ఆ బొమ్మల వల్లే ఇంకా పీరియడ్స్ రావడం లేదేమోనని కోపంతో వాటన్నింటినీ బయట పడేసింది. ఒకరోజు నేను నిద్రలేచేసరికి బెడ్షీట్ అంతా రక్తం.. ఎటు చూసినా రక్తమే కనిపించడంతో భయపడిపోయాను. కానీ, అమ్మ మాత్రం నాకు నెలసరి మొదలైందని సంతోషపడింది అని పేర్కొన్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. 2006లో గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఏక్ నిరంజన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చివరగా ఎమర్జెన్సీ మూవీలో నటించారు. ఈ సినిమాలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి స్వయంగా కంగనాయే దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.చదవండి: స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్.. -
బిగ్బాస్ రియాలిటీ షో.. స్పెషల్ గెస్ట్గా స్టార్ హీరోయిన్!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ఈ షోకు ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. -
సల్మాన్తో అంత ఈజీ కాదు.. డైరెక్టర్ మురుగదాస్
ఏఆర్ మురుగదాస్.. ఈ పేరు చెప్పగానే గజిని, తుపాకీ, కత్తి లాంటి హిట్ సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో చిరంజీవి, మహేశ్ బాబుతో స్టాలిన్, స్పైడర్ తదితర చిత్రాలు చేసిన అనుభవముంది. అప్పట్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గానీ గత కొన్నాళ్లలో మాత్రం తీసినవన్నీ ఘోరమైన ఫ్లాప్స్. ఈ ఏడాది బాలీవుడ్లో 'సికిందర్' తీస్తే భారీ డిజాస్టర్ అయింది. ఈ మూవీ వచ్చి చాలా నెలలే అయిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి దాని గురించి మాట్లాడాడు. సల్మాన్ ఖాన్ వల్ల ఆ సినిమా రిజల్ట్ అలా జరిగింది అన్నట్లు మురుగదాస్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు కూతురికి తప్పని 'ఫేక్' కష్టాలు)'ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు. పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి. కానీ అతడు మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే సెట్స్కి వస్తాడు. కాబట్టి మేం రాత్రి మాత్రమే చిత్రీకరణ చేయాల్సి వచ్చేది. మేం తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఓ సీన్లో నలుగురు పిల్లలుంటే.. వాళ్లు స్కూల్ నుంచి తిరిగొస్తున్న సీన్ తీయాలన్నా సరే వేకువజామున 2 గంటలకు షూటింగ్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి ఆ పిల్లలు నిద్రపోతారు' అని మురుగదాస్ చెప్పుకొచ్చాడు.అలానే 'సికిందర్' షూటింగ్ టైంలో చాలామంది జోక్యం చేసుకోవడం కూడా సినిమా వైఫల్యానికి కారణమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. గతంలో విజయ్, సూర్య, ఆమిర్ ఖాన్, చిరంజీవి, మహేశ్ బాబు.. ఇలా చాలామంది స్టార్లతో మురుగదాస్ పనిచేశాడు. కానీ ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్పై మాత్రమే ఎందుకు కామెంట్స్ చేస్తున్నాడా అనేది సస్పెన్స్. మురుగదాస్ తీసిన 'మదరాసి'.. సెప్టెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై కూడా ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవ్. మరి ఈ మూవీతో హిట్ కొట్టి మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్.. రూ.50 కోట్లు తిరిగిచ్చేశాడు: డిస్ట్రిబ్యూటర్) -
దెయ్యంగా రష్మిక.. 'వరల్డ్ ఆఫ్ థామా' చూశారా?
ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో టాప్లో దూసుకుపోతున్న రష్మిక.. వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె హిందీలో చేసిన లేటెస్ట్ మూవీ 'థామా'. 'స్త్రీ' యూనివర్స్లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకుముందు భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు 'థామా' పేరుతో ఈ మూవీలో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. తాజాగా టీజర్ని 'వరల్డ్ ఆఫ్ థామా' పేరుతో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి అనసూయ.. ఇదిగో క్లారిటీ)గతంలో రష్మిక చెప్పినట్లు అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా 'థామా' తీశారు. టీజర్లో రష్మిక.. ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి పాత్రలో కనిపించింది. బోల్డ్గా కనిపిస్తూనే భయపెట్టింది కూడా. ఇందులో రష్మిక, దెయ్యంగానూ యాక్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోట్దర్ దర్శకుడు. హారర్ స్టోరీ అయినప్పటికీ.. ప్రేమకథని కూడా చూపించబోతున్నారు. ఈ దీపావళికి మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు యంగ్ హీరో.. భార్యకు సీమంతం) -
భార్యతో ఉంటూనే మరో మహిళతో బిడ్డను కన్నాడు.. నటుడిపై సంచలన ఆరోపణ
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిరోజులుగా ఆమిర్పై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 1990 నాటి సంఘటనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఫైసల్ ఖాన్ చేసిన కామెంట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో ఆమిర్ రిలేషన్ షిప్ ఉన్నాడని ఫైసల్ అన్నారు. వారిద్దరికి జన్మించిన ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి భార్య రీనాతో కలిసి ఉన్నప్పుడే జెస్సికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆమిర్పై సంచలన ఆరోపణ చేశారు. రీనాతో విడాకులు తీసుకున్న ఆమిర్.. ఎక్కువగా జెస్సికాతోనే ఉండేవాడన్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోలేదని కేవలం లివింగ్ రిలేషన్లో ఉన్నారని చెప్పారు. అయితే, కొంతకాలం తర్వాత కిరణ్ రావును ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ కూడా జెస్సికాతో టచ్లో ఉండేవాడని చెప్పుకొచ్చారు.1990లలో, ఆమిర్ ఖాన్, జెస్సికా హైన్స్ కలిసి ఉన్నారని, వారి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని కొన్ని మీడియా కథనాలు చాలారోజుల క్రితమే పేర్కొన్నాయి. జెస్సికా హైన్స్కు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు జాన్ (Jaan) అని ఆ కథనాలు తెలిపాయి. కానీ, ఆమిర్ ఖాన్ ఈ విషయాన్ని ఎక్కడా కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, జెస్సికా మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని పరోక్షంగా సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె కూడా స్పష్టంగా ఈ రిలేషన్ గురించి ఏమీ చెప్పలేదు. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) -
అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే?
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (42) జూన్ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది. వెడ్డింగ్ యానివర్సరీఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు. ప్రేమకు పదేళ్లు 'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్ సింగ్ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది. View this post on Instagram A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi) చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు, సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్గా నిలిచాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.రాఖ్ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు. JUSTICE will rise from the ashes 🔥#RaakhOnPrime, New Original Series, Coming 2026#AliFazal #SonaliBendre @prosit_roy @EndemolShineIND @anusha_nkumar #AyushTrivedi #AamirBashir @sandeepsaket83 @deepak30000 @NegiR @sunandagj @BhaDiPa pic.twitter.com/mLulmaXj8X— prime video IN (@PrimeVideoIN) August 18, 2025 -
'ప్రతి రోజు చెబుతా'.. ట్రోలర్స్కు జాన్వీకపూర్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఇక సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా ఉట్టికొట్టే సమయంలో భారత్ మాతా కీ జై అంటూ నినాదం చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఇదేమీ ఇండిపెండెన్స్ డే కాదంటూ జాన్వీని ట్రోల్ చేశారు.తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్కు జాన్వీ కపూర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఉన్నవారంతా నాకంటే ముందు భారత్ మాతాకీ జై అని అన్నారని తెలిపింది. ఆ తర్వాత నేను కూడా చెప్పానని.. వారి వీడియోను కట్ చేసి నా మాటలను మాత్రమే వైరల్ చేస్తున్నారని ట్రోలర్స్కు కౌంటరిచ్చింది. నా దేశాన్ని పొగిడేందుకు ప్రత్యేకంగా రోజంటూ లేదని రాసుకొచ్చింది. శ్రీ కృష్ణా జన్మాష్టమి నాడు మాత్రమే కాదు.. ప్రతిరోజూ భారత్ మాతాకీ జై అని చెబుతా అని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మరాఠీలో మాట్లాడిన జాన్వీ కపూర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రంలో కేరళ అమ్మాయిగా జాన్వీ కనిపించనుంది. ఢిల్లీ అబ్బాయితో ప్రేమలో పడిన మలయాళీ అమ్మాయి కథగా పరమ్ సుందరిని తెరకెక్కించారు.. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కూడా కీలక పాత్రలు పోషించారు. -
ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్న ఆమె బాలీవుడ్లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్తో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు. -
తండ్రి వేదన... తనయుడి ఆవేదన
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సర్ జమీన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనవాడు అనేవాడు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు. పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకుని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే... అదే ‘సర్ జమీన్’ సినిమా. ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. దర్శకుడు కాయోజీ ఇరానీ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులుగా మలయాళ నటుడు పృథ్వీరాజ్, బాలీవుడ్ నటి కాజోల్, నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ నటించారు. నాలుగు ముఖ్యపాత్రలు, రెండున్నర గంటల నిడివితో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపథ్యంలో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ప్లేతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించారు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓసారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. అతనికి హర్మన్ అనే కొడుకుంటాడు. దేశమా,ప్రాణమా అంటే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం విజయ్. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. పైగా తను భయస్తుడు కూడా. ఓసారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని... లేదంటే నీ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, అతని భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కానీ తీవ్రవాదులు హర్మన్కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ని తీవ్రవాదిగా తయారు చేసి, మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్, అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా? లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా? అన్నది హాట్ స్టార్లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ
సినిమా సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, రిలేషన్ లాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదా అనే సందేహం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన మూడేళ్లకే విడిపోయారు లాంటివి వింటూనే ఉంటాం. అలానే లేటు వయసులోనూ కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అని హింట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు 'కెవ్వు కేక' బ్యూటీ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ గబ్బర్ సింగ్ సినిమాలో 'కెవ్వు కేక' పాటలో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతానికి సినిమాలేం చేయట్లేదు గానీ వ్యక్తిగత విషయాల్లో ఏదో ఒకలా వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తనకు రెండో పెళ్లిపై ఆసక్తి ఉందని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా, మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. 'నేను చాలా రొమాంటిక్ మనిషిని. ప్రేమపై నాకు ఎంతో నమ్మకముంది. సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చింది. అలానే ప్రస్తుతం వివాహం చేసుకుంటున్న యువత.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిందని, అయితే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనని అందరూ స్వార్థపరురాలిగా చూశారని, కానీ విడాకుల తీసుకోవడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నానని మలైకా చెప్పుకొచ్చింది.హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని మలైకా అరోరా.. 1998లో పెళ్లి చేసుకుంది. అయితే దాదాపు 19 ఏళ్ల పాటు సంసారం చేసిన తర్వాత వీళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేసింది. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మరి ఏమైందో ఏమో గానీ అర్జున్-మలైకా విడిపోయారు. ఈమెకు అర్హాన్ ఖాన్ అని 22 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు రెండో పెళ్లిపై మనసు మళ్లడం చూస్తుంటే.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) -
ఈ హీరోయిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? వీడియో వైరల్
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా అందంగా ముస్తాబైంది. అయితే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు. కానే కాదు, ఫ్లూట్తో అద్భుతంగా ఓ పాట ట్యూన్ వినిపించింది. ఇది చూసిన అభిమానులు.. మీరు మల్టీటాలెంటెడ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా అదా శర్మ.. లాక్డౌన్లో ఫ్లూట్ నేర్చుకుంది.సినిమాల విషయానికి వస్తే..అదా శర్మ.. 1920 అనే హారర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, సీ.డీ: క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. ద కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ అయిన అదా చివరగా తుమ్కో మేరీ కసమ్ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు. మొదట్లో బాగానే ఉన్న దంపతులు తర్వాత దూరంగా ఉండటం మొదలుపెట్టారు. 2017లో విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లాడి బాధ్యతను మాత్రం ఇద్దరూ తీసుకున్నారు. అనంతరం మలైకా.. నటుడు అర్జున్ కపూర్తో ప్రేమలో పడింది. దంపతులుగా విడిపోయినా..ఏళ్ల తరబడి రిలేషన్లో ఉన్న వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని అంతా అనుకున్నారు. అంతలోనే ఈ ప్రేమప్రయాణానికి ఫుల్స్టాప్ చెప్తూ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా మలైకా కో పెరింటింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లాడి కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాం. ఇప్పుడు వాడికి 22 ఏళ్లు. తల్లి దగ్గర ఏం మాట్లాడాలి? తండ్రి దగ్గర ఎలా ఉండాలి? అనేది బాగా తెలుసు. కోరుకున్నవన్నీ జరగవుకాబట్టి ఇప్పుడు పరిస్థితులు అంత జటిలంగా లేవు. ఎవరి హద్దుల్లో వాళ్లం ఉన్నాం. విడాకుల వల్ల నా కొడుకు ఎఫెక్ట్ అవకూడదనుకున్నాను. అందుకే ఇద్దరం బాధ్యతలు తీసుకున్నాం. కానీ విడాకులు ప్రకటించగానే చాలామంది ఇలా చేస్తావా? ఇలా ఉండకూడదు అంటూ నాకు నీతులు చెప్పారు. నేనేమంటానంటే కొన్నిసార్లు బంధాలనేవి జటిలంగా ఉంటాయి. నా వివాహబంధం కొనసాగాలనే కోరుకున్నాను. కానీ, అది జరగలేదు. దానికి నేనేం చేయగలను?అమ్మ కష్టాలుఅలా అని నేను ప్రేమపై విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఏదో ఘోర తప్పిదం చేశాననీ కాదు. అందరూ తప్పంతా నాదే అన్నట్లు నావైపే వేలు చూపించారు. సెల్ఫిష్గా ఆలోచించానన్నారు. మీకలా అనిపించుండొచ్చు. కానీ, నేను ఆనందంగా ఉండాలనుకున్నాను. అందుకే ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇకపోతే నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. అమ్మ రోజంతా పని చేస్తూ బిజీగా ఉండేది. మాకోసం అహర్నిశలు శ్రమించింది. తన దగ్గరున్న వస్తువులమ్మేసి మరీ స్కూల్ ఫీజు కట్టేది. డబ్బు విలువ బాగా తెలుసుఅప్పుడు చెల్లిని నేనే చూసుకునేదాన్ని. కుటుంబం కోసం 17 ఏళ్లకే పని చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. ఫ్రెండ్స్తో పార్టీలంటూ బయటకు వెళ్లేదాన్ని కాదు. ఇప్పటికీ డబ్బు విషయంలో నేనలాగే ఉంటాను. ప్రతి ఖర్చు పుస్తకంలో రాసుకుంటాను. మరీ ఖరీదైనవాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. కాగా 'చయ్య చయ్య' పాటతో ఫేమస్ అయిన మలైకా.. రాత్రైనా నాకు ఓకే (అతిథి), కెవ్వు కేక (గబ్బర్ సింగ్) పాటలతో టాలీవుడ్కు దగ్గరైంది.చదవండి: అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే! -
స్వామీజీకి కిడ్నీ దానం.. మానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారా?
మంచి చేయాలనుకుంటే అందులో కూడా చెడే చూస్తున్నారంటున్నాడు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రా (Raj Kundra). స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న ఈయన స్వామికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.కరుణ కూడా పీఆర్ స్టంటా?అయితే చాలామంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తున్నారు. తనపై ఉన్న కేసులను కప్పిపుచ్చడానికే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్పై రాజ్ కుంద్రా అసహనం వ్యక్తం చేశాడు. ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసం నా కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. పీఆర్ స్టంట్ అని తీసిపారేస్తున్నారు. ఇలాంటి వింత ప్రపంచంలో ఉంటున్నాం! కరుణ, జాలి అనేవి స్టంట్ అయితే.. ప్రపంచమంతా అది వ్యాపించాలి. వీలైతే ప్రేమించండిమానవత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. మానవత్వాన్ని స్ట్రాటజీ అని భావిస్తుంటే.. మీరందరూ దాన్ని ఫాలో కావాలి. మీ మెప్పు పొందడం కోసమైతే నేనలా మాట్లాడలేదు. మీ మాటలు, విమర్శలతో నా వ్యక్తిత్వం మారదు. వీలైతే ప్రేమించండి, అంతేకానీ, చులకనగా మాట్లాడకండి.. అప్పుడే ఇతరుల జీవితాల్లో మీరూ వెలుగులు నింపగలరు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.కిడ్నీ ఆఫర్.. తిరస్కరించిన స్వామీజీకాగా ప్రేమానంద్ మహారాజ్ దశాబ్దకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. బృందావన్ ఆశ్రమంలో స్వామీజీని కలిసిన రాజ్కుంద్రా.. నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే అంటూ అవయవదానానికి ఆఫర్ ఇచ్చాడు. కానీ స్వామీజీ అందుకు నిరాకరించారు. రాజ్కుంద్రా కిడ్నీ ఆఫర్ చేసిన సమయంలో శిల్పా శెట్టి భర్త పక్కనే కూర్చుంది.చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్ -
బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్..
-
రకుల్ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీలు ఎవరంటే?
కాదేదీ సినిమాకు అనర్హం అన్నట్లుగా ప్రపంచంలో, సమాజంలో ఉన్న ప్రతీది ఓ కథా వస్తువే! కల్పితాలతో పాటు రియల్ స్టోరీలను కూడా వెండితెరపై చూపిస్తూ ఉంటారు. అలా దేశాన్ని సరిహద్దులో ఉండి కాపాడుతున్న సైనికుల పోరాటాలు, జీవన విధానాలు తెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ కొందరు సైనికులుగా సేవ చేస్తే మరికొందరు సెలబ్రిటీలకేమో మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో మిలటరీ నేపథ్యం ఉన్న తారలెవరో ఓసారి చూసేద్దాం..రకుల్, అనుష్క పేరెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ఆర్మీ అధికారి. అక్షయ్ కుమార్ (Akshya Kumar) తండ్రి హరి ఓం భాటియా విశ్రాంత ఆర్మీ అధికారి. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలోనూ భాగమయ్యారు. అనుష్క విద్యాభ్యాసమంతా బెంగళూరులోని ఆర్మీ స్కూల్లోనే జరిగింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు మధు - అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. నటి లారా దత్తా తండ్రి ఎల్కే దత్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా పని చేశారు. ఉగ్రదాడిలో వీరమరణంసుష్మితా సేన్ తండ్రి శుభీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్గా సేవలందించారు. నిమ్రత్ కౌర్ తండ్రి, ఆర్మీ అధికారి మజోర్ భూపిందర్ సింగ్.. 1994లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ కూడా ఓ జవానే! తెలుగు నటి గాయత్రి గుప్తా తాతయ్య సైతం ఆర్మీలో పని చేశాడు. బ్రిటీష్ వారి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శ్రద్ధా శ్రీనాథ్ తండ్రి కూడా ఆర్మీ అధికారే!దిశా పటానీ సోదరి కూడా..నేహా ధూపియా తండ్రి ప్రదీప్ సింగ్ ఇండియన్ నేవీలో కమాండర్గా పని చేశారు. మానుషి చిల్లర్ తండ్రి మిత్ర బసు చిల్లర్ డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఫిజీషియన్గా పని చేశారు. గుల్ పనగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ పనగ్.. మిలిటరీలో అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట్ సేవా పురస్కారం అందుకున్నారు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో మేజర్గా సేవలందిస్తున్నారు.చదవండి: బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు.. -
'నా కిడ్నీల్లో ఒకటి మీదే'.. స్వామిజీకి హీరోయిన్ భర్త బంపరాఫర్!
బాలీవుడ్లో ఎప్పుడు వివాదాల్లో ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లే. ఆ కపుల్ మరెవరో కాదు.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. గతంలో ఓ కేసుతో సంచలనంగా మారిన రాజ్ కుంద్రా.. మరో కేసులో చిక్కుకున్నారు. తనను రూ.60 కోట్ల మోసం చేశారంటూ రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్కు ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని రాజ్ కుంద్రా మాటిచ్చారు. ఇది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను ప్రేమానంద్ భజన్ మార్గ్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుంద్రాకు ప్రేమానంద్ ధన్యవాదాలు తెలిపారు. మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని శిల్పాశెట్టి దంపతులు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వీడియో బయటకి రావడం విశేషం.రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'నేను గత రెండేళ్లుగా మిమ్మల్ని అనుసరిస్తున్నా. నాకు ఏవైనా సందేహాలు, భయాలకు మీ వీడియోలు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాయి. ఇప్పుడు నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. మీరు అందరికీ ప్రేరణ. మీ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే నేను సహాయం చేయగలిగితే నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే." అని అన్నారు.అయితే ప్రేమానంద్ మహారాజ్కు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుంద్రా కిడ్నీ ఆఫర్ చేశారు. ఈ నిర్ణయం శిల్పాశెట్టిని ఆశ్చర్యానికి గురిచేసింది. -
స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ దూకుడు
-
బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు..
పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్న తారలకు సెల్యూట్ చేద్దాం..కెప్టెన్ రాజు80's, 90'sలో విలన్గా రాణించిన కెప్టెన్ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.సునీల్ శెట్టిసునీల్ శెట్టి సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్ కల్నల్గా ఆర్మీలో సేవలందించారు.నానా పటేకర్నానాపటేకర్ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.సంజయ్ దత్1947లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాల్గొన్నాడు.అచ్యుత్ పోట్దార్నటుడు అచ్యుత్ చదువు పూర్తవగానే ఆర్మీలో చేరారు. ఆ తర్వాత సినిమాల్లో రంగప్రవేశం చేశారు.బిక్రంజీత్ కన్వర్పాల్బిక్రంజీత్ నటుడు కాకముందు ఒక జవాన్.. మేజర్గా ఉన్నప్పుడే ఆర్మీ నుంచి వైదొలిగారు.గుఫి పైంటల్మహాభారతం సీరియల్లో శకునిగా నటించిన గుఫి ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. భారత్-చైనా సరిహద్దులో జవాన్గా విధులు నిర్వర్తించారు.మహ్మద్ అలీ షాతండ్రి బాటలోనే నడుస్తూ అలీ షా కూడా సైన్యంలో చేరాడు. ఆర్మీలో మేజర్గా పని చేశారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.రుద్రశిష్ ముజందార్చిచోరే, జెర్సీ ఫేమ్ రుద్రశిష్ ముజందార్ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నారు.మనోజ్ బాజ్పాయ్సత్య నటుడు మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee)కు ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్గా నటించాడు.చదవండి: ‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే? -
'ఇదేం మీ ఇల్లు కాదు.. ముందు బయటికి వెళ్లండి'.. ఆలియా భట్ ఆగ్రహం
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఈ ఏడాది అల్ఫా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది వచ్చిన జిగ్రా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్లకు కాస్తా విరామం దొరకడంతో ఆలియా భట్ ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తోంది. ముంబయిలోని తన నివాసం వద్ద పాడిల్ బాల్ ఆడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అయితే అంతకుముందే పాడిల్ బాల్ ఆడేందుకు వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఆమెను ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు. ఏకంగా ఆలియాతో పాటే బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆలియా భట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపలికి రావొద్దు.. దయచేసి బయటికి వెళ్లండి.. ఇది మీ భవనం కాదు అంటూ మండిపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయినా సెలబ్రిటీలను ఫోటోల కోసం ఇలా వెంటపడి వేధించడం సరికాదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారికి పర్సనల్ లైఫ్ ఉంటుందని.. ఇలా ఇబ్బంది పెట్టపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా చేసేవారికి కొంతైనా కామన్ సెన్స్ ఉండాలని.. సెలబ్రిటీలను బాధపెట్టడం సరికాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు.Alia Bhatt spotted playing Padel #AliaBhatt #padel pic.twitter.com/NPwpzi7iQ8— Aristotle (@goLoko77) August 14, 2025కాగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేయనుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.దేశవ్యాప్తంగా దాదాపు రూ.52.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 29 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.23.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. -
సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరోస్
దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్ హీరోస్’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... యుద్ధానికి కొత్త నిర్వచనం‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని యూనిట్ పేర్కొంది.అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు సల్మాన్ ఖాన్. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై సల్మాన్ ఖాన్ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. మేజర్ షైతాన్ సింగ్ మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్ వార్ డ్రామా ‘120 బహదూర్’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్ స్క్రీన్పై షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. రాజ్పాల్ పునియా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్ను రాజ్పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. ఆపరేషన్ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్ ది ఇండియన్ ఆర్మీస్ మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్’ బుక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్ హక్కులను రణ్దీప్ హుడా ఫిల్మ్స్, రాహుల్ మిత్రా ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. బోర్డర్లో వార్ భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్ లీడ్ రోల్ చేయగా, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్’ (1977) సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. గూఢచారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా 2018లో విడుదలై, సూపర్హిట్గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ది ఇండియా హౌస్ దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్ సవార్కర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక్కీస్ పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్ ఖేత్రపాల్గా అగస్త్య నంద (అమితాబ్బచ్చన్ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
గ్యాంగ్స్టర్ ప్రేయసి
షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్స్టర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. 1990 నేపథ్యంలో ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మాఫియాతో పాటుగా ప్రేమ సన్నివేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయని బాలీవుడ్ సమాచారం. ఇందుకు తగ్గట్లుగా విశాల్ భరద్వాజ్ నటీనటుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలోని హీరోయిన్స్ పాత్రల కోసం త్రిప్తి దిమ్రి, దిశా పటానీలను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి జోడీగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో విక్రాంత్ మెస్సే, రణ్దీప్ హుడా, నానా పటేకర్, అవినాష్ తివారి నటించనున్నారని సమాచారం. షాహిద్ కపూర్, విక్రాంత్ మెస్సే, రణ్దీప్ హుడా వంటి పాపులర్ హీరోలు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడుతున్నాయి. -
కాలేజీ క్యాంపస్ డ్రామాకి సై
నటిగా సూపర్ హిట్ అయిన ఆలియా భట్ నిర్మాతగా మాత్రం ఇంకా హిట్ స్టేటస్ను సాధించలేక పోతున్నారు. ఎటర్నల్ సన్షైన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థనుప్రారంభించిన ఆలియా భట్, ‘డార్లింగ్’, జిగ్రీస్’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆలియా భట్ లీడ్ రోల్ చేశారు. కానీ ఈ రెండు చిత్రాలూ హిట్ కాలేక పోయాయి. ఇప్పుడు ఆలియా భట్ మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం.అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన శ్రీతీ ముఖర్జీ ఓ కాలేజీ క్యాంపస్ డ్రామా కథను సిద్ధం చేసి, ఈ కథను ఆలియా భట్కు వినిపించారట. ఆలియాకు ఈ కథ నచ్చడంతో నిర్మించేందుకు ఓకే అన్నారట. అయితే కాలేజ్ క్యాంపస్ డ్రామా కాబట్టి తాను నటించకుండా, నూతన నటీనటులకు చాన్స్ ఇవ్వాలని ఆలియా భావిస్తున్నారని, ఆ దిశగా ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్ స్టార్ట్ కానుందని బాలీవుడ్ టాక్. మరోవైపు నటిగా ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిసస్తున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లోని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. -
నవ్వుల జాలీ
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘జాలీ ఎల్ఎల్బీ’ నుంచి రానున్న తాజా చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ 3’. ఈ సినిమాలో అక్షయ్కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రధారులుగా నటించారు. సౌరభ్ శుక్లా, హ్యూమా ఖురేషీ, అమ్రితా రావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాష్ కపూర్ దర్శకత్వంలో అలోక్ జైన్, అజిత్ అంథారే నిర్మించిన ఈ చిత్రంసెప్టెంబరు 19న విడుదల కానుంది.ఈ చిత్రంలో లాయర్ జగదీశ్వర్ జాలీ మిశ్రా పాత్రలో అక్షయ్ కుమార్, లాయర్ జగదీష్ జాలీ త్యాగి పాత్రలో అర్షద్ వార్షి, జడ్జ్ పాత్రలో సౌరభ్ శుక్లా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ అక్షయ్, అర్షద్ల మధ్య గొడవలు, కోర్ట్ రూమ్లో జరిగే కామెడీ డ్రామాగా సాగుతుంది. -
నటి శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు
-
జాన్వీ కపూర్ పరమ్ సుందరి.. అక్కడ రొమాన్స్ ఏంటి?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా కనిపించనుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందోట్రైలర్లో చూపించారు.అయితే పరమ్ సుందరి ట్రైలర్తోనే ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ ట్రైలర్లో చర్చిలో వచ్చే సీన్పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని.. ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వాచ్డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సన్నివేశాన్ని సినిమా వెంటనే తొలగించాలని లేఖలో కోరింది.ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్స్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఉందని వాచ్డాగ్ ఫౌండేషన్కు చెందిన న్యాయవాది గాడ్ఫ్రే పిమెంటా అన్నారు. చర్చి ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలమని.. దానిని అసభ్యకరమైన కంటెంట్కు వేదికగా చిత్రీకరించవద్దని లేఖలో పేర్కొన్నారు. ఇలా చేయడం తమ ఆధ్యాత్మిక పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా కాథలిక్ సమాజాన్ని కించపరచడమేనని లేఖలో వివరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరమ్ సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం.. కోటీ రూపాయలు మిస్ చేసుకున్న యువతి!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్పతి' షోతో బిజీగా ఉన్నాపు. ప్రస్తుతం 17వ సీజన్కు ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయల ప్రశ్న వరకు దూసుకొచ్చింది. అయితే ఒక్క సమాధానం చెబితే కోటి రూపాయలు యువతి సొంతమయ్యేవి. కానీ ఊహించని విధంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే రూ.50 లక్షల ప్రైజ్మనీతోనే సరిపెట్టుకుంది. ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.తాజా ఎపిసోడ్లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతి కశీష్ సింఘాల్ రూ. 50 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఈ డబ్బుతో తన తండ్రి చేసినరూ. 15 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ యువతి సమాధానం చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో చూసేద్దాం.ప్రశ్న: విసిగోత్ రాజ్యానికి చెందిన ఏ రాజు రోమ్ నగరంపై దాడి చేయకుండా ఉండేందుకు మిరియాలు డిమాండ్ చేశాడు?ఎ) లుడోవిక్, బి) ఐమెరిక్, సి) అలారిక్ డి) థియోడోరిక్ ఆప్షన్స్ ఇవ్వగా.. కశీష్ సింఘాల్ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి..అలారిక్ అంటూ అమితాబ్ చెప్పారు. రూ.50 లక్షలు గెలిచిన ఆమె తన జర్నీని పంచుకని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ రియాలిటీ షో సోనీటీవీతో పాటు సోనీలివ్ ఓటీటీలోనూ ప్రసారమవుతోంది. -
ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన హీరోయిన్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు హీరో ధనుష్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో నిలిచిన ఆమె ఇటీవలే దానికి ఫుల్స్టాప్ పెట్టింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే హీరోయిన్ బిపాసా బసు (Bipasha Basu) గురించి ఆమె గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఆ హీరోయిన్ మగాడిలా కనిపిస్తుందినేను బిపాసా కంటే అందంగా ఉంటాను. ఆమె కండలు తిరిగిన దేహంతో మగాడిలా కనిపిస్తుంది. ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అని కామెంట్స్ చేసింది. ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో బిపాసా బసు.. మృణాల్కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పేరును ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.మృణాల్కు కౌంటర్?బలమైన మహిళలు ఎల్లప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు. అందమైన స్త్రీలకు ఆ మజిల్స్ అవసరం. ఎందుకంటే.. మహిళలెప్పుడూ బలంగా, ధృడంగా ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. స్త్రీలు స్ట్రాంగ్గా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలను బద్ధలు కొట్టండి అని బిపాసా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: మహేశ్ బాబు మరదలికి తృటిలో తప్పిన ప్రమాదం -
తిరుమలేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా
-
'ఛావా' లాంటి సినిమా అస్సలు చేయను: స్టార్ హీరో
బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ఘోరంగానే ఉంది. స్టార్ హీరోలు వరసగా మూవీస్ చేస్తున్నారు కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటిది ఈ ఏడాది 'ఛావా' అనే చిత్రం అనుహ్యమైన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ అబ్బురపరిచింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తన లైఫ్లో అస్సలు చేయనని, ఇలాంటి తీయడం సరికాదు అని బాలీవుడ్కి చెందిన హీరో జాన్ అబ్రహం చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా)జాన్ అబ్రహం లేటెస్ట్ సినిమా 'టెహ్రాన్'.. ఆగస్టు 14న నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్లో పాల్గొన్న జాన్.. ఓ ఇంగ్లీష్ వెబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఛావా', 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' తదితర చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జీవితంలో అలాంటి చిత్రాలు చేయనని తెగేసి చెప్పాడు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు.'ప్రేక్షకులు మనతో మంచిగా ఉంటారు. కాబట్టి అందుకు తగ్గ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్పై ఉంది. నేను రైట్ వింగ్ లేదా లెఫ్ట్ వింగ్కి చెందినవాడిని కాదు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే రైట్ వింగ్కి చెందిన కొన్ని సినిమాలు.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం చూస్తుంటే ఆందోళనగా ఉంది. ప్రేక్షకులకు నచ్చాయని తెలుసు కానీ నేను ఇప్పటివరకు 'ఛావా', 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలు నేను చూడలేదు. ఇలాంటి మూవీస్ ఎప్పటికీ చేయను. ఓ వర్గం ప్రజల్ని ఇవి ప్రభావితం చేయడం చూస్తుంటే నాకు భయమేస్తోంది' అని జాన్ అబ్రహం తన అభిప్రాయాన్ని చెప్పాడు.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?) -
ఓటీటీకి వచ్చేస్తోన్న రూ.500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవలే విడుదలై లవ్ బర్డ్స్ను తెగ ఏడిపించేసిన సినిమా సయారా. జూలై 18న థియేటర్లలోకి వచ్చిన ఈ బాలీవుడ్ రొమాంటిక్ ఫీల్ గుడ్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రేమకథ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటివరకు సయారా చిత్రానికి దాదాపు రూ.500 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్లో అయితే ఏకంగా విక్కీ కౌశల్ ఛావా వసూళ్లు దాటేసింది. అంతలా సూపర్ హిట్గా ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రివీల్ చేశారు. అహాన్ పాండే, అనీత్ పద్దా నటించిన ఈ రొమాంటిక్ చిత్రం వచ్చేనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ సైతం అఫీషియల్గా ప్రకటించే అవకాశముంది.కాగా.. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సయారాను తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన రొమాంటిక్ చిత్రంగా సయారా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. భారతదేశంలో రూ. 320 కోట్లు వసూలు చేసింది. -
'తెలుగులో అల్లు అర్జున్'.. జాన్వీ కపూర్ పరమ్ సుందరి ట్రైలర్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. కేరళ అమ్మాయితో ఢిల్లీకి చెందిన అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రెంజీ పనీకర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ సంగీతమందించారు.#ParamSundariTrailer features the iconic "JHUKEGA NAHI" reference of our Icon Star. 🔥Wishing #JanhviKapoor, @SidMalhotra and @MaddockFilms all the best for Param Sundari on behalf of all Allu Arjun fans. ♥️ pic.twitter.com/wmGYQCi5ir— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 12, 2025 -
కపిల్ శర్మ టార్గెట్.. ఇంటి వద్ద భారీ భద్రత!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మరోసారి కెనడాలోని ఆయన కేఫ్పై కాల్పులు జరగడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కపిల్ శర్మ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.కాగా.. ఆగస్టు 8న కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్ కాప్స్ కేఫ్పై కాల్పులు జరిగాయి. నెలలోపే ఇది రెండవ ఘటన కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలోనే జూలై 10న ఇదే తరహాలో దాడి జరిగింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.రెండోసారి దాడి తర్వాత బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ నుంచి ఆడియో సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ నెట్ఫ్లిక్స్ షో ప్రీమియర్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించడమే దీనిని కారణమని ఆడియో సందేశంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేసే వారిని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా పని చేస్తుందని ఆడియోలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబయి పోలీసులు ఓషివారాలోని కపిల్ శర్మ నివాసాన్ని సందర్శించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి. ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్లో కెరీర్ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
యానిమల్, మార్కోను మించిన వయొలెన్స్.. ఆ ఏజ్ వాళ్లకు మాత్రమే టీజర్!
గతంలో వచ్చిన యానిమల్, మార్కో మోస్ట్ వయొలెంట్ చిత్రాలుగా పేరు సంపాదించుకున్నాయి. ఈ సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ ఉందంటూ కొందరు విమర్శించారు. అంతలోనే అంతకు మించిన వయొలెన్స్తో మరో మూవీ రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే మరి ఇంత వయొలెన్స్ ఏంట్రా సామీ అనాల్సిందే. ఈ టీజర్ కేవలం 18 ఏళ్లు మించినవాళ్లకు మాత్రమే.బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో వస్తోన్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ చిత్రం 'బాఘి 4'. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో మోస్ట్ వయొలెంట్ విజువల్స్ ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. మార్కో, యానిమల్ చిత్రాలను మించిపోయేలా టీజర్ విజువల్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తున్నాయి.ఈ చిత్రంలో హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ తన మోస్ట్ వయొలెంట్ పాత్రలో రోనీగా కనిపించనున్నారు. ఈ టీజర్లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉంది. ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా కథ అందించగా.. ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సోదరి సమీక్షా పెడ్నేకర్ (Samiksha Pednekar)తో కలిసి బ్యాక్బే అనే బ్రాండ్ స్థాపించి ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే తన లక్ష్యం అని చెప్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. భూమి ఇంకా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్లో సొంతంగా ఓ ప్లాంట్ స్థాపించాం. అందుకు మాకెంతో గర్వంగా ఉంది. ప్లాస్టిక్ వాడకుండా..అక్కడ మహిళలే పని చేస్తున్నారు. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్స్తో లభ్యం అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ను వాడలేదు. బాటిల్ క్యాప్ భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. ఇలా పర్యావరణ స్పృహతో పనిచేస్తున్న వాటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మాది మాత్రమే! అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, రూ.750 ml వాటర్ బాటిల్ ధర రూ.200గా నిర్ణయించాం. రూ.200కే మంచినీరుఅందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజుల్లో అందరూ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీళ్లు. మా బాటిల్లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. 15 ఏళ్లలో ప్రతి ఇంట్లో మా బాటిల్ కనిపించాలని ఆశపడుతున్నాం.పెట్టుబడి ఎలా?17 ఏళ్ల వయసులో నా సంపాదన మొదలైంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో పనిచేసినప్పుడు నాకు ఇచ్చిన తొలి పారితోషికం రూ.7 వేలు. అప్పటినుంచే నాకు పొదుపు చేయడం అలవాటు. అలా నా సంపాదనలో కొంతభాగాన్ని కూడబెడుతూ వచ్చాను. ఆ డబ్బుతోనే బ్యాక్బే ప్రారంభించగలిగాం అని చెప్పుకొచ్చింది. భూమి పెడ్నేకర్ చివరగా మేరే హజ్బెండ్ కి బివి సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) చదవండి: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే! -
బిగ్బాస్ కొత్త సీజన్లో పహల్గామ్ బాధితురాలు?
కొన్నాళ్ల క్రితం కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గుర్తుండే ఉంటుంది. హనీమూన్ కోసం అక్కడికి అదేరోజు వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్.. ఉగ్రవాదుల్లో కాల్పుల్లో మరణించాడు. ఇతడి పక్కనే రోదిస్తున్న భార్య హిమాన్షి నర్వాల్ ఫొటో అప్పుడు తెగ వైరల్ అయింది. ఆమెకు చాలామంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 'బిగ్బాస్'.ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. దీనిలో ఎవరెవరు పాల్గొంటారు అనే విషయమై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే భర్త, ఉగ్రదాడిలో చనిపోయి ఎన్నిరోజులు కాలేదు అలాంటిది ఈమె షోలో పాల్గొంటుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్కి పెళ్లి.. ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ)బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి బిగ్బాస్ షో నిర్వహకులు.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్ని కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం లేదని మరికొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం అని.. అసలు నిర్వహకులు ఈమెని సంప్రదించలేదని, షోలో పాల్గొనే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.హిమాన్షి కథ వెనకున్న విషాదం చాలామంది భారతీయుల్ని కదిలించింది. ఎందుకంటే పెళ్లి చేసుకుని కొన్నిరోజులకే హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా.. అక్కడ ఈ దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఈమె భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. హిమాన్షి క్షేమంగా బయటపడింది. ఘటన స్థలంలోనే నిర్జీవంగా ఉన్న భర్త పక్కన ఈమె కన్నీళ్లు పెడుతున్న ఫొటోలు.. దేశవ్యాప్తంగా చాలామందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి టాలీవుడ్ లేడీ సింగర్ సమీర భరద్వాజ్.. ఫొటోలు) -
అనుపమ్ ఖేర్కు వింత అనుభవం.. టాయిలెట్ గుర్తులు చూసి ఆవేదన!
కశ్మీర్ ఫైల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. నటనతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్షన్లో వచ్చిన తన్వి ది గ్కేట్ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. కాగా.. అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'తన్వి ది గ్రేట్' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాజాగా అనుపమ్ ఖేర్కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. ఇది కాస్తా సిల్లీగా అనిపించినా ఆయనకు మాత్రం పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. టాయిలెట్ ప్రదేశాల్లో బయట ఉండే ఆడ, మగ గుర్తులను చూసి కన్ఫ్యూజ్ అయ్యానని ఏకంగా వీడియోను పంచుకున్నారు. ఇలా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అని ఫ్యాన్స్ను అడిగారు. టాయిలెట్ బయట సింపుల్గా లేడీస్, జెంట్స్ అని రాస్తే సరిపోతుంది కదా? ఈ బొమ్మలు వేసి ఎందుకింత అయోమయానికి గురి చేస్తున్నారని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో నాకు అర్థం కాని విషయం.. గతంలో ఉన్నంత సరళంగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.ఇదంతా ఫన్నీగా అనిపించినా వయస్సు పెరిగే కొద్ది చూపు కూడా తగ్గుతుంది. బహుశా అందువల్లే గుర్తు పట్టలేక తన బాధను ఇలా అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా అందరూ సులభంగా గుర్తు పట్టేలా బొమ్మలతో పాటు పేర్లు కూడా రాస్తే సులభంగా ఉంటుందని నెటిజన్స్ సలహాలిస్తున్నారు.కాగా.. అనుపమ్ దర్శకత్వం వహించిన తన్వీ ది గ్రేట్ చిత్రం ఆటిజంతో బాధపడుతున్న ఓ యువతి తండ్రి స్ఫూర్తిలో భారత సైన్యంలో చేరాలని కలలు కంటుంది. ఆ యువతి స్ఫూర్తిదాయకమైన కథనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్తో పాటు శుభంగి దత్, బోమన్ ఇరానీ, కరణ్ ట్యాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. అనుపమ్ ఖేర్ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించిన 'తన్వి ది గ్రేట్' కేన్స్, న్యూయార్క్, హ్యూస్టన్, లండన్లో జరిగిన చలనచిత్రోత్సవాలలో అంతర్జాతీయంగానూ గుర్తింపును తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
నేను నీ డైపర్లు మారిస్తే నువ్వేమో.. అమ్మతనంపై కియారా పోస్ట్
బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)- కియారా అద్వాణీ (Kiara Advani) పట్టలేనంత సంతోషంలో ఉంది. కారణం.. వీరికి ఈ ఏడాది జూలైలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అప్పటినుంచి పసిపాపతోనే వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారు. తొలిసారి మాతృత్వాన్ని అనుభవిస్తున్న కియారాకు అమ్మతనం కొత్తగానూ, తన్మయత్వంగానూ ఉంది. ఈ డీల్ బాగుంది..తన ఫీలింగ్స్ను సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది.. నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావు. ఈ డీల్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది. దీనికి కళ్లలో నీళ్లు తిరుగుతున్న ఎమోజీ, చేతితో హార్ట్ సింబల్ చూపిస్తున్న ఎమోజీని జత చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. 2021లో వచ్చిన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2023లో వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమారెండేళ్లకే పాప పుట్టడంతో ఆనందంలో తేలియాడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కియారా చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అలాగే యశ్ టాక్సిక్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. సిద్దార్థ్ విషయానికి వస్తే ఇతడు ప్రస్తుతం పరమ్ సుందరి మూవీ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది.చదవండి: రాఖీ పండగరోజు ప్రభాస్ చెల్లి ఇలా చేసిందేంటి? -
అతిలోక సుందరిలా జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. మనసు దోచేసే అందం (ఫొటోలు)
-
ప్రముఖుల ‘బయోపిక్స్’
మిస్సైల్ మేన్ అబ్దుల్ కలామ్ జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు చూడాలని ఎవరికి ఉండదు? ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? కొందరు లెజెండ్స్ జీవితాలు అందరికీ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అందుకే వారి జీవితాలకు వెండితెర రూపం ఇస్తే... ఆ బయోపిక్కి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం బాలీవుడ్లో పలువురు లెజెండ్స్ జీవితాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ప్రముఖుల ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం.మిస్సైల్ మేన్లా... భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ‘కలామ్’ చిత్రం రూపొందనుంది. ఈ మిస్సైల్ మేన్ పాత్రను ధనుష్ పోషించనున్నారు. ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని ఈ ఏడాది మేలో ఫ్రాన్స్లో జరిగిన కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. ‘ది మిస్సైల్ మేన్ ఆఫ్ ఇండియా’ అనేది ‘కలాం’ సినిమా టైటిల్కి ట్యాగ్లైన్గా నిర్ణయించింది యూనిట్.అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు అబ్దుల్ కలాం చేసిన సేవను ఈ చిత్రంలో చూపించనున్నారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు కలాం స్ఫూర్తిదాయక జీవితాన్ని ప్రపంచానికి చూపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.యువర్ హానర్... లాయర్గా కోర్టులో ఎలా వాదించాలో శిక్షణ తీసుకుంటున్నారు రాజ్కుమార్ రావ్. ఎందుకంటే ‘యువర్ హానర్’ అంటూ అసలు సిసలైన లాయర్గా ఒదిగి పోవడానికి. భారతదేశ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. ఉజ్వల్ నికమ్ కెరీర్లో అత్యంత కీలకమైన ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కసబ్పై జరిగిన విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.అవినాష్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఎంతో పేరు, ప్రతిష్ఠలు ఉన్న ఉజ్వల్ నికమ్ పాత్రలో తన నటన గౌరవప్రదంగా ఉండటానికి రాజ్కుమార్ రావ్ ప్రత్యేకంగా వర్క్షాప్కి హాజౖరై, శిక్షణ తీసుకుంటున్నారట. ఈ చిత్రం షూటింగ్ని అక్టోబరులో ఆరంభించాలనుకుంటున్నారు. ‘‘ఉజ్వల్ నికమ్లాంటి గౌరవప్రదమైన న్యాయవాదికి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. మరాఠా యోధుడు శివాజీ జీవితంతో... డ్రీమ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు రితేష్ దేశ్ముఖ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని, శివాజీ పాత్రను తానే చేయాలనీ రితేష్కి కొంత కాలంగా ఉన్న కల. ఆ కల నెరవేర్చుకుంటున్నారు. ‘రాజా శివాజీ’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రితేష్ నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మూడు నాలుగు నెలల క్రితం విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన లభించింది. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న విడుదల చేయనున్నారు.మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఛత్రపతి శివాజీకి గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు... లక్షలాది మంది హృదయాలలో నివసించే భావోద్వేగం. ఆయన అసాధారణ జీవిత కథలో ఒక భాగాన్ని చెప్పగలగడం గౌరవం, గొప్ప బాధ్యత’’ అని రితేష్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. మేజర్ షైతాన్ సింగ్ పరమ వీర చక్ర పురస్కారగ్రహీత మేజర్ షైతాన్ సింగ్గా ఒదిగి పోవడానికి ఓ నటుడిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. ఎందుకంటే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టంతో రూపొందిస్తున్న ‘120 బహదూర్’లో షైతాన్ సింగ్ భాటీ పాత్ర పోషిస్తున్నారు ఫర్మాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య జరిగిన యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.ఈ ఘటన ప్రధానాంశంగా రూపొందుతున్న చిత్రం ‘120 బహదూర్’. ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ‘‘ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. 62 ఏళ్ల వయస్కురాలిగా యామీ 62 ఏళ్ల వయసులో తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం కోరుకుంటుంది షా బానో. అయితే అతను ససేమిరా అంటాడు. చేసేదేం లేక ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కుతుంది. భరణం కోసం న్యాయ పోరాటం చేస్తుంది. 1985లో జరిగిన ఈ కేసు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 62 ఏళ్ల వృద్ధురాలు షా బానో పాత్రను యామీ గౌతమ్ చేశారు.ఆమె భర్త అహ్మద్ ఖాన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. ఈ పాత్ర యామీకి ఓ సవాల్ లాంటిది. ఎందుకంటే మూడు పదుల వయసులో ఉన్న యామీ అంతకు రెండింతలు వయసు ఉన్న మహిళగా ఒదిగి పోవడం అంటే ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫార్మ్ కావాలి... అలాగే ప్రోస్థెటిక్ మేకప్కి ఎక్కువ సమయం కేటాయించారు. నటనపరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.ఆపరేషన్ ఖుక్రి యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత 75 రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ని రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. 2000లో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆపరేషన్ ఖుక్రి’. రాజ్పాల్ పునియా పాత్రను రణ్దీప్ హుడా పోషిస్తున్నారు.‘ఆపరేషన్ ఖుక్రి: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రణ్దీప్ హుడా ఓ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘‘నా హృదయాన్ని చాలా బలంగా తాకిన కథ ఇది’’ అని రణ్దీప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఆగిందనే టాక్ వినిపిస్తోంది. చిత్రదర్శకుడు అమిత్ శర్మ ఈ సినిమాని వదిలి, వేరే ప్రాజెక్ట్స్ చేపట్టడమే దీనికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అగస్త్య నందాకి భలే చాన్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు (అమితాబ్ కుమార్తె శ్వేత కుమారుడు) అగస్త్య నందాకి నటుడిగా రెండో సినిమాకే మంచి అవకాశం దక్కింది. ‘ఆర్చీస్’ (2023) చిత్రంతో నటుడిగా కెరీర్ ఆరంభించారు అగస్త్య. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక రెండో చిత్రంగా ‘ఇక్కీస్’ చిత్రానికి అవకాశం వచ్చింది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.ఈ చిత్రంలో అరుణ్ ఖేత్రపాల్ పాత్రను అగస్త్య చేశారు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన పరమ వీర చక్ర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ శౌర్యం, త్యాగాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇవే కాదు... ఇంకొందరు ప్రముఖుల జీవితాలతో కొన్ని బయోపిక్స్ రూపొందుతున్నాయి. – డి.జి. భవాని -
అమీర్ ఖాన్పై సంచలన ఆరోపణలు చేసిన సోదరుడు
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్పై తన సోదరుడు ఫైసల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. 2000 ఏడాదిలో విడుదలైన 'మేళా' సినిమాలో అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్ కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత తమ మధ్య సంబంధాలు తెగిపోయాయని ఫైసల్ ఖాన్ చెప్పారు. ఆ సమయం నుంచి తామిద్దరం వేరుగానే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఆమీర్పై ఫైసల్ తరచుగా షాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. 2007లో అమీర్ తనను ఒక సంవత్సరం పాటు ఇంట్లోనే బంధించాడని తన గత జీవితం గురించి ఫైసల్ గుర్తు చేసుకున్నాడు.ప్రస్తుతం ముంబైలో ఒంటరిగానే ఫైసల్ నివసిస్తున్నాడు. తనతో కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడరని చెప్పాడు. తన తల్లి, సోదరుడితో విభేదాల తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయానని గుర్తచేసుకున్నాడు. తనకు మానసిక వ్యాధి ఉందంటూ కుటుంబ సభ్యులే నమ్మించే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. గతంలో తనకు ఏవో కొన్ని మందులు బలవంతంగా ఇచ్చేవారని ఇలా తెలిపాడు. ' 2007 సమయంలో నాకు పిచ్చి పట్టిందంటూ ఒక ఏడాది పాటు ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. నేను సమాజానికి హాని చేస్తానంటూ చెప్పేవారు. ఆమీర్ స్నేహితుల వల్లే మా మధ్య దూరం పెరిగింది. వారందరు కలిసి నా సోదరుడి బ్రెయిన్ వాష్ చేశారు. ఆమీర్ ఎంటో నాకు తెలుసు. అతను చాలా మంచివాడు. కానీ, అతని స్నేహితుల వల్లే ఇలా చేశాడనిపిస్తుంది.' అని ఫైసల్ చెప్పాడు.ఫైసల్ ఖాన్ బాలీవుడ్ నటుడు, గాయకుడు కూడా.. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, - 2007లో ఫైసల్ ఖాన్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయనను పూణేలో గుర్తించి వైద్య పరీక్షలు చేయించారు. -
అవకాశాల్లేవంటున్న బ్యూటీ.. బాస్ పాటతోనైనా కలిసొచ్చేనా?
'నాగిని' సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' అనే హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది. అంచనాలు తలకిందులుఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీఅందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.నా జర్నీని తక్కువ చేయలేనుఎందుకంటే నా కెరీర్ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్ ఉంటుంది. విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్ టెస్ట్కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ -
అందరిముందే తిట్టిన ప్రేయసి.. నటుడి సలహాతో బ్రేకప్ చెప్పిన బిగ్బీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)- జయ బచ్చన్ పెళ్లి చేసుకుని 50 ఏళ్లు పైనే అవుతోంది. అయితే జయను ప్రేమించి పెళ్లాడటానికి ముందు బిగ్బీ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట! ఈ విషయాన్ని నటుడు, రచయిత హనిఫ్ జవేరీ వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనిఫ్ మాట్లాడుతూ.. అమితాబ్ ముంబైకి రావడానికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తన పేరు మాయ. బ్రిటీష్ ఎయిర్వేస్లో పనిచేసేది. సినిమాల్లోకి రాకముందే లవ్స్టోరీ..అమితాబ్ తనను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కూడా ఆయన్ను అంతే ఇష్టపడింది. సినిమాల్లో పని వెతుక్కుందామని అమితాబ్ ముంబై వచ్చేశాడు. ముంబైలోని జుహులో.. తల్లి తేజ్ బచ్చన్ స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడు. తరచూ మాయ ఆ ఇంటికి వచ్చి అతడిని పలకరిస్తూ ఉండేది. అయితే బిగ్బీ తల్లి స్నేహితురాలు కూడా అదే ఇంట్లో ఉండేది. దీంతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని అమితాబ్ చాలా భయపడ్డాడు.తొలి సినిమా షూటింగ్లో..ఆ ఇంటి నుంచి వచ్చేసి బయటెక్కడైనా రెంట్కు ఉండాలనుకున్నాడు. అప్పుడు అమితాబ్ తన ఫస్ట్ మూవీ సాట్ హిందుస్తానీ సినిమా చేస్తున్నాడు. ఇందులో నటుడు అన్వర్ అలీ (Anwar Ali)తో కలిసి నటించాడు. తన బాధను అన్వర్తో చెప్పుకున్నాడు. విషయం అర్థమైన అన్వర్.. బిగ్బీని తన ఇంట్లోనే ఉండమన్నాడు. అలా అన్వర్ అపార్ట్మెంట్లో బిగ్బీ, మాయ చాలాకాలంపాటు కలిసున్నారు. బహుశా వాళ్లు పెళ్లి కూడా చేసుకునుండొచ్చు. అందరి ముందు అవమానించేదికానీ ఆ సమయంలో అమితాబ్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అమితాబ్కు మొహమాటం ఎక్కువ. మాయ మాత్రం కన్నింగ్గా ఉండేది. నోటికొచ్చినట్లు మాట్లాడేది. కొన్నిసార్లు అమితాబ్ పక్కన ఎవరున్నారన్నది కూడా చూసుకోకుండా తిట్టేసేది. అమితాబ్ స్నేహితులకు ఆమె పద్ధతి అస్సలు నచ్చేది కాదు. అతడు కూడా ప్రియురాలు అవమానించడంతో సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఒకసారి గోవాకు షూటింగ్కు వెళ్లినప్పుడు మాయకు బ్రేకప్ చెప్పమని అన్వర్ సలహా ఇచ్చాడు. ఫస్ట్ సినిమా రిలీజ్కు ముందే బ్రేకప్సినిమాల్లో ఇంకా పైస్థాయికి వెళ్లేకొద్దీ సమస్యలు ఎక్కువవుతాయని హెచ్చరించాడు. అమితాబ్కు కూడా అది నిజమేననిపించింది. తమ బంధంలో ఏదో సరిగా లేదని ఎన్నాళ్లుగానో అతడు అసంతృప్తిగా ఫీలవుతున్నాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అమితాబ్ తొలి చిత్రం సాట్ హిందుస్తానీ 1969లో రిలీజైంది. హీరోయిన్ జయను 1973లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శ్వేత బచ్చన్, అభిషేక్ బచ్చన్ సంతానం.చదవండి: ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు! -
ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు!
కొన్ని ఆడిషన్స్ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత సిద్ధమై వచ్చినా సరే ఊహకందని పనులు చేయిస్తారు. అలా తనకు జరిగిన ఓ విచిత్ర ఆడిషన్ను గుర్తు చేసుకుంది బాలీవుడ్ నటి ఇషా తల్వార్ (Isha Talwar). ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిలింస్ సంస్థకు చెందిన కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశాను. నాకు ముంబై వెర్సోవాలో ఓ రెస్టారెంట్లో సీన్ ఉందన్నారు. అక్కడికి వెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు.రెస్టారెంట్లో ఏడవమన్నారునటి ఎటువంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పకూడదన్నారు. షనూ, తన అసిస్టెంట్లతో కలిసి రెస్టారెంట్లో నా ముందే కూర్చుంది. అందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్లో అందరికీ వినబడేలా గట్టిగా ఏడ్వాలని చెప్పేసరికి అంతా అయోమయంగా అనిపించింది. అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఒక అమ్మాయిని ఇలా పదిమందిలో ఏడిపించడం దేనికో నాకస్సలు అర్థం కాలేదు. ఇదేం ఆడిషన్?ఆఫీస్లో ఆడిషన్ పెట్టుకుంటారు కానీ, ఇలా జనం మధ్యలోనా? పోనీ.. సహజంగా రావాలంటే ఏదైనా రెస్టారెంట్ను కాసేపటికి అద్దెకు తీసుకుని ఆడిషన్ చేయాలి!ఏదేమైనా ఇది దాదాపు పదేళ్ల కిందట జరిగిన సంఘటన. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఎవరూ ఒత్తిడికి గురి కాకండి. నేనైతే అలా రెస్టారెంట్లో ఏడవనని చెప్పేశాను, దీంతో సదరు సినిమాలో అవకాశం కూడా దక్కలేదు. కానీ, ఛాన్సుల కోసం ఇలా రెస్టారెంట్లో అస్సలు ఏడవలేను అని చెప్పుకొచ్చింది. ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరంటే?ఇషా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్, ఆర్టికల్ 15 చిత్రాల్లో నటించింది. కాగా ఈ సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ షనూ.. బాలీవుడ్కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసింది. వారిలో రణ్వీర్ సింగ్, భూమి పడ్నేకర్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ మధ్యే సయ్యారా మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.చదవండి: ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని -
'పరమ్ సుందరి'గా జాన్వీ కపూర్.. వర్షంలో రొమాంటిక్ సాంగ్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.బీగీ శారీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో సిద్ధార్థ్- జాన్వీల కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో చేసిన ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ అద్భుతమైన సాంగ్ను శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఆలపించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. సచిన్ జిగర్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
ఒక్క ఎపిసోడ్కు నా రెమ్యునరేషన్ ఎంతంటే..: స్మృతి ఇరానీ
కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ బుల్లితెరపై కనిపించారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్ గత నెల నుంచే ప్రసారం అవుతుంది. అయితే, ఈ సిరీయల్ కోసం తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది తాజాగా స్మృతి ఇరానీ పంచుకున్నారు. తాను ఫుల్టైమ్ రాజకీయనాయకురాలు అని, పార్ట్టైమ్ యాక్టర్ అని ఆమె ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2 సీరియల్తో తులసి విరానీగా స్మృతి ఇరానీ తిరిగొచ్చారు. అయితే,తాను ఈ సిరీయల్ నటించేందుకు ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 14 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా CNN-News18తో ఆమె మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. నిరంతరం మనం ఏదో పనిలో ఉంటూనే ముందుకు వెళ్లాలని చెప్పారు. కేవలం ఆదాయం కోసమే పనిచేస్తే అనుకున్నది సాధించడం కష్టమని స్మృతి తెలిపారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సీరియల్ నటిగా స్మృతి ఇరానీ రికార్డ్ క్రియేట్ చేశారు. హిందీలో బాగా పాపులర్ అయిన 'అనుపమ' సీరియల్ కోసం రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్కు రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆ రికార్డ్ను స్మృతి ఇరానీ దాటేశారు. మరో నటి హీనా ఖాన్ కూడా ఎపిసోడ్కు రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు.సుమారు 25 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ'. ఈ సీరియల్తో స్మృతి ఇరానీకి మంచి గుర్తంపు దక్కింది. 2000 ఏడాదిలో మొదలైన ఈ ధారావాహిక 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. అందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ప్రేక్షకుల ఆదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. దానికి సీక్వెల్గానే 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' జులై 29 నుంచి ప్రసారం అవుతుంది. -
నటి సోదరుడిపై కత్తులతో దాడి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు ఆసిఫ్ ఖురేషీ దారుణ హత్యకు గురైయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను (పీటీఐ) షేర్ చేసింది. ఇద్దరు యువకులు ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేయడంతో గొడవ మొదలైంది. దీంతో ఆయుధాలతో అతనిపై ఆ యువకులు తెగబడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. నటి హుమా ఖురేషికి మృతుడు ఆసిఫ్ సోదరుడు వరస అవుతాడు.ఘటన జరిగిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. ఆసిఫ్, అతని పొరుగువారి మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. చాలా ధారుణంగా అతనిపై తెగబడ్డారు. బలంగా కొట్టడంతో పాటు పదునైనా ఆయుధాలతో దాడి చేసినట్లు వీడియోతో అర్థం అవుతుంది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 103(1) హత్య, 3(5) సాధారణ ఉద్దేశ్యం కింద ఉజ్వల్ (19) మరియు గౌతమ్ (18)పై నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యువకులు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం.VIDEO | Actor Huma Qureshi's cousin, Asif Qureshi, was stabbed to death following a dispute over parking in southeast Delhi's Bhogal area on Thursday. Two teenagers have been apprehended in connection with the incident. CCTV visuals of the incident.#DelhiNews(Viewers… pic.twitter.com/DJrXqd3vwX— Press Trust of India (@PTI_News) August 8, 2025 -
ప్రముఖ నటి 'హుమా ఖురేషి' సోదరుడు హత్య
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు దారుణ హత్యకు గురైయ్యారు. ఆమెకు సోదరుడి వరుస అయ్యే ఆసిఫ్ ఖురేషీని ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం వద్ద పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు అతనిపై గొడవకు దిగారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'ఆసిఫ్ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేశారు. దీంతో వాహనాలను తొలగించాలని ఆసిఫ్ కోరడంతో వారిద్దరూ గొడవకు దిగారు. ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ తర్వాత నిందితులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దాడి తర్వాత, ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.' అని పేర్కొన్నారు.ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఇదే పార్కింగ్ విషయంలో వారిద్దరు తనతో గొడవ పడ్డారని ఆమె చెప్పింది. గురువారం రాత్రి ఆఫీస్ నుంచి తన భర్త ఇంటికి వచ్చాడని ఆ సమయంవలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని కోరినందుకు గొడవకు దిగారని ఆమె తెలపింది. అయితే, పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.హుమా ఖురేషి నటిగా, నిర్మాతగా, రచయితగా కూడా రాణిస్తున్నారు. కాలా, వలిమై,జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలతో పాటు మహారాణి వెబ్ సిరీస్లలో నటించి తెలుగువారికి కూడా బాగా పరిచయం అయింది. -
కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు. మరుగుజ్జుగా నటించడం కష్టంఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.ప్రతీది నిశితంగా గమనించి..కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్గా కనిపించాడు.కమల్ను కాపీ కొట్టావ్నువ్వు (షారూఖ్) వీఎఫ్ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
పుష్ప -2 రికార్డ్స్ అన్ని ఎగిరిపోతాయి
-
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్తో ఉన్న బిల్బోర్డ్ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్బోర్డ్ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
కాజోల్ బర్త్ డే.. ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరోయిన్ (ఫొటోలు)
-
వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న చిత్రం.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. -
మాట నిలబెట్టుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన రియల్ హీరో
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మరణించారు. కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. పూర్తి గా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఫిష్ వెంకట్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో మంది ఆర్థికసాయం అందించినప్పటికీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సైతం ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సాయంగా లక్షన్నర రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు. అంతే కాకుండా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలుస్తానని కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఇవాళ హైదరాబాద్కు సోనూ సూద్ వచ్చారు. అనంతరం అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్లో కనిపించాడు. -
రజినీకాంత్ కూలీ.. అమిర్ ఖాన్ మేకోవర్ వీడియో చూశారా?
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమిర్ ఖాన్ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అమిర్ ఖాన్ మేకోవర్ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు అమిర్ ఖాన్. శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు సైతం చేతి నిండా పచ్చబొట్టుతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025 -
నా ఐటమ్ సాంగ్ చూస్తూ పిల్లలు భోంచేస్తున్నారు: తమన్నా
తమన్నా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు హీరోయిన్గా చేసిన సినిమాలు గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే మాత్రం ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే 'కావాలయ్యా', 'ఆజ్ కీ రాత్' తదితర గీతాలతో తెగ వైరల్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్, నార్త్లో ఈ తరహా సాంగ్స్ చేయడం వల్ల తనకొచ్చిన క్రేజ్ గురించి మాట్లాడింది. ఎంతోమంది పిల్లలు తన పాటలు చూస్తూ అన్నం తింటున్నారని చెప్పుకొచ్చింది.'ఓ పిల్లాడు నా పాట చూస్తూ తింటుంటే అలానే చూడనివ్వండి' అని తమన్నా చెప్పింది. మీరు ఏ సాంగ్ గురించి మాట్లాడుతున్నారని హోస్ట్ అడగ్గా.. 'స్త్రీ 2 మూవీలో ఆజ్ కీ రాత్ గురించి' అని తమన్నా బదులిచ్చింది. అలానే 'ఎందరో తల్లులు నాకు ఫోన్ చేసి, మా బిడ్డ మీ పాట వింటూ, చూస్తే తప్పితే భోజనం చేయట్లేదు అని చెప్పారో లెక్కలేదు. పిల్లలకు నచ్చింది కనిపిస్తే అలానే చేస్తుంటారుగా' అని తన ఆనందాన్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)తమన్నా కామెంట్స్పై స్పందించిన హోస్ట్.. ఇది తల్లులు చింతించాల్సిన విషయమే అని అన్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చిన తమన్నా.. 'తమ పిల్లలు సరిగా తింటున్నారా లేదా అని తల్లులు చింతించాలి. అదే వాళ్లకు ముఖ్యం. అంతే కానీ ఏ సాంగ్ వింటున్నారనేది కాదు. అయినా ఏడాది పిల్లలకు లిరిక్స్ ఏం అర్థమవుతాయి? వాళ్లు సంగీతం మాత్రమే ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం కూడా సినిమాల్ని మర్చిపోతాం కానీ పాటలు గుర్తుంచుకుంటాగా. అలానే ఇది' అని చెప్పింది.తమన్నా చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో మంచి బీట్ ఉన్న పాటలంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్సే ఉంటాయి. వాటిని చూపిస్తూనే చాలామంది తల్లలు.. పిల్లలకు అన్నం తినిపిస్తున్నారేమో? ఇకపోతే తమన్నా కెరీర్ విషయానికొస్తే.. చివరగా తెలుగులో 'ఓదెల 2' సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో మూడు మూవీస్ చేస్తోంది. గతేడాది వరకు నటుడు విజయ్ వర్మతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. కొన్నాళ్ల క్రితం వీళ్లకు బ్రేకప్ అయింది. ప్రస్తుతానికైతే తమన్నాకు సినిమాలే ప్రపంచం.(ఇదీ చదవండి: ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు) -
ఏఐ మాయ.. పాపం బాలీవుడ్ స్టార్స్ను ఇలా చేశారేంటి?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే. అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా.. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు. చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.#SalmanKhan rocked 😅Watch till the end pic.twitter.com/ryhgna8fbQ— Adil Hashmi👁🗨 (@X4SALMAN) August 2, 2025 -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
పాతికేళ్ల తర్వాత...!
పాతికేళ్ల క్రితం విడుదలైన ‘లగాన్’ సినిమా లొకేషన్స్కు వెళ్లారు బాలీవుడ్ నటుడు, దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్. ఆయన హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా, ఆమిర్ ఖాన్ నిర్మించారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లు సాధించి, సూపర్హిట్గా నిలిచింది.ఈ ఆగస్టు 1 నుంచి ‘ఆమిర్ ఖాన్ టాకీస్–జనతా కా థియేటర్’ యూట్యూబ్ చానల్లో పే పర్ వ్యూ విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాను గుజరాత్లోని భుజ్ నగరానికి దగ్గర్లో ఉన్న కునారియా గ్రామ ప్రజలకు ఉచితంగా ప్రదర్శించారు ఆమిర్ ఖాన్. వారితో కలిసి ప్రేక్షకుడిగా ఆమిర్ ఖాన్ ఈ సినిమాను చూసి, స్క్రీనింగ్ అనంతరం మాట్లాడారు. అలాగే అక్కడి లొకేషన్స్లో ‘లగాన్’ సినిమా చిత్రీకరించిన విషయాలను ఆమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. అలాపాతికేళ్ల తర్వాత ‘లగాన్’ సినిమాను చిత్రీకరించిన లొకేషన్స్కు వెళ్లి ఆమిర్ ఖాన్ నాటి విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకోవడం విశేషం. -
గర్భంతో ఉండగా తల్లింట్లో.. విడాకుల వార్తలపై నటి ఏమందంటే?
యువికా చౌదరి (Yuvika Chaudhary).. మొదట్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత సహాయనటిగా యాక్ట్ చేసింది. హిందీతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. ఈ షోలోనే నటుడు ప్రిన్స్ నరూలాతో ప్రేమలో పడింది. షో తర్వాత కూడా వీరిద్దరూ ఆ ప్రేమను కొనసాగించారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా 2024లో కూతురికి జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో యువికా తల్లింట్లోనే ఉంది. దీంతో యువికా- ప్రిన్స్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.నా మనసంతా అదేఈ ప్రచారం గురించి ఇన్నాళ్లకు పెదవి విప్పింది యువికా చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను గర్భం దాల్చినప్పుడు నా మెదడులో, మనసులో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. పనికిరాని రూమర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదనుకున్నాను. అందుకే వాటిని లైట్ తీసుకున్నాను. ఈ పుకార్లు లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే అప్పుడు రాదుగా.. అందుకే రూమర్స్ను పట్టించుకోలేదు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినప్పటికీ పరిస్థితి చక్కబడటం కాదుకదా.. దాన్ని మరింత రచ్చ చేస్తారని భావించాను. మా మధ్య మనస్పర్థలు నిజమేఅయినా మౌనంగా ఉన్నా కూడా దాన్ని ఇంకా సాగదీశారు. ఏదేమైనా నాకు నా బిడ్డే ముఖ్యం. తనను నేను బాగా చూసుకోవాలి. తనకోసం మరింత స్ట్రాంగ్గా నిలబడాలి.. ఇవే నా మనసులో మెదిలేవి. నిజానికి ప్రిన్స్ నాకెంతో సపోర్ట్ చేస్తాడు. కాకపోతే అందరిలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. లైఫ్లో ఇది కూడా ఓ ఫేజ్ అని, అదెంతో కాలం ఉండదని నాకు బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో సడన్గా సంతోషంగా ఉంటాం. అంతలోనే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మనపక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ మా ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటంతో ప్రిన్స్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తల్లికంటే ఎక్కువ ఎవరు చూసుకోగలరు?మరోవైపు షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో నేను మా అమ్మ దగ్గర ఉండటమే మంచిదని భావించాడు. తల్లికంటే బాగా ఎవరూ చూసుకోలేరని పుట్టింటికి పంపించాడు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మానాన్నతో కలిసి ఉండటం పాపమేమీ కాదు, అదందరూ చేసేదే! అది అర్థం చేసుకోలేనివాళ్లు పిచ్చి పుకార్లు సృష్టించారు. కానీ ప్రిన్స్ మా విడాకుల రూమర్స్ విని బాధపడ్డాడు. నేను పుట్టింట్లో.. తనేమో నాకు దూరంగా ఉండేవాడు. ఏదేమైనా ఆ ఫేజ్ దాటేశాం. హ్యాపీగా ఉన్నాం అని యువికా చౌదరి చెప్పుకొచ్చింది.చదవండి: కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్ -
జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) అవార్డులు కొల్లగొట్టారు. అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..వారికి బంగారు పతకం2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు, యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్ కుమార్.. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.బేబీ సింగర్కు రూ.2 లక్షలు‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా... పాటకు పీవీఎస్ఎన్ రోహిత్కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.బేబీ డైరెక్టర్కు రూ.1 లక్ష ప్రైజ్మనీబెస్ట్ స్క్రీన్ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్మనీని సమానంగా పంచుకోనున్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది -
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్నే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
National Film Awards: హనుమాన్కు జాతీయ అవార్డు.. ఉత్తమ చిత్రంగా..!
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (71st National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం వరించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. సుకుమార్ కూతురికి పురస్కారంమిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. గాంధీ తాత చెట్టు చిత్రానికిగానూ సుకుమార్ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ విభాగంలో సామ్ బహదూర్ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి ఈ విజేతలను ఎంపిక చేసింది.71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితా..(ఫీచర్ ఫిలిం కేటగిరిలో..)ఉత్తమ సహాయ నటుడువిజయరాఘవన్ - పోక్కాలమ్ మలయాళ చిత్రంముధుపెట్టయి సోము భాస్కర్ - పార్కింగ్ తమిళ చిత్రంఉత్తమ సహాయ నటిఊర్వశి - ఉళ్లోళుక్కు మలయాళ చిత్రంజంకీ బోడివాల - వశ్ గుజరాతీ చిత్రంబెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్సుకృతి వేణి బండ్రెడ్డి - గాంధీ తాత చెట్టుకబీర్ ఖాండరి - జిప్సీ మరాఠి మూవీత్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ - నాల్ 2 మరాఠీ మూవీఉత్తమ దర్శకుడుసుదీప్తో సేన్ -ద కేరళ స్టోరీఉత్తమ డెబ్యూ దర్శకుడుఆశిశ్ బెండె- ఆత్మపాంప్లెట్బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్పీవీఎన్ ఎస్ రోహిత్ - (ప్రేమిస్తున్నా.. బేబీ మూవీ)బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్శిల్పరావు (చెలియా.. జవాన్ మూవీ)బెస్ట్ సినిమాటోగ్రఫీప్రసంతను మొహపాత్ర - ద కేరళ స్టోరీబెస్ట్ లిరిక్స్ఊరు, పల్లెటూరు సాంగ్.. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ (బలగం)బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)నందు, పృథ్వి (హనుమాన్)బెస్ట్ స్క్రీన్ప్లేఉత్తమ స్క్రీన్ప్లే రచయితసాయిరాజేశ్ నీలం (బేబీ)రాంకుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్)డైలాగ్ రచయితదీపక్ కింగక్రాని (సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై)ఉత్తమ చిల్డ్రన్స్ ఫిలిం: నాల్ 2 (మరాఠి మూవీ)బెస్ట్ కొరియోగ్రఫీ: దిండోరా బాజ్ రె పాట.. కొరియోగ్రాఫర్: వైభవి మర్చంట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్ (సాంగ్స్) - (వాతి), హర్షవర్ధన్ రామేశ్వర్ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)- (యానిమల్)బెస్ట్ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్)బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సచిన్ లోవలేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: మోహన్దాస్ (2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో)బెస్ట్ ఎడిటింగ్: మిధున్ మురళి (పొక్కలాం- మలయాళ చిత్రం)బెస్ట్ సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరణ్- హరిహరణ్ మురళీధరన్ (యానిమల్)బెస్ట్ పాపులర్ ఫిలిం (హోల్సమ్ ఎంటర్టైన్మెంట్) - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానిఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్ఉత్తమ పంజాబీ చిత్రం - గొడ్డే గొడ్డే చాఉత్తమ మరాఠి చిత్రం - శ్యాంచీ ఆయ్ఉత్తమ మలయాళ చిత్రం - ఉల్లొళుఉత్తమ కన్నడ చిత్రం - కందిలుఉత్తమ హిందీ చిత్రం: కాథల్ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్ఉత్తమ ఒడియా చిత్రం- పుష్కరఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్ఉత్తమ అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982స్పెషల్ మెన్షన్యానిమల్ (రీరికార్డింగ్ మిక్సర్) - ఎమ్ఆర్ రాజకృష్ణన్నాన్ ఫీచర్ ఫిలిం విజేతల జాబితాబెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ) బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)బెస్ట్ స్క్రిప్ట్: సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) - కథారచయిత- చిదానంద నాయక్బెస్ట్ వాయిస్ ఓవర్: ద సేక్రడ్ జాక్: ఎక్స్ప్లోరింగ్ ద ట్రీ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్) - (వాయిస్ ఓవర్: హరికృష్ణన్ ఎస్)బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిలిం -హిందీ)బెస్ట్ ఎడిటింగ్: నీలాద్రి రాయ్ (మూవింగ్ ఫోకస్)బెస్ట్ సౌండ్ డిజైన్: శుభరుణ్ సేన్గుప్తా (దుండగిరి కె పూల్)బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ చిత్రం) - శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్బెస్ట్ ఫిలిం క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామీస్)బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)ఉత్తమ షార్ట్ ఫిలిం: గిద్ ద స్కావెంజర్బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం (సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్): ద సైలెంట్ ఎపిడమిక్ (హిందీ)బెస్ట్ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యుమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిలిం: టైమ్లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్ రికన్స్ట్రక్షన్ ఫిలిం: మా బో, మా గాన్ (ఒడియా చిత్రం), లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ద ఈస్టర్న్ హారిజన్ (ఇంగ్లీష్ చిత్రం)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శిల్పిక బోర్డొలాయ్ (మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ- మిజోరాం చిత్రం)స్పెషల్ మెన్షన్1. నేకల్: క్రోనికల్ ఆఫ్ ద పాడీ మ్యాన్ (మలయాళం)2. ద సీ అండ్ సెవన్ విలేజెస్ (ఒడియా)చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
సన్నాఫ్ సర్దార్-2 ప్రీమియర్ షో.. సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
యోగి ఆదిత్యనాథ్పై బయోపిక్.. విడుదలకు అడ్డుగా సెన్సార్ బోర్డ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి'.. దర్వకుడు రవీంద్ర గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్డుచెప్పింది. దీంతో చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించడాన్ని సెన్సార్ను తప్పుబడుతూ వారు కోర్టులో సవాలు చేశారు.'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' చిత్రంలో యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో చిత్ర నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దీంతో ఇదే విధంగానే న్యాయస్థానం కూడా సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకంపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఎందుకు వస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని CBFCకి కోర్టు నోటీసు జారీ చేసింది. -
నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్గా నటి దీప్తి సాధ్వానీ
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్కట్లు డైట్లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్తో ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె. తాను ఎలాంటి క్రాష్ డైట్లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. ఇవి మంచివేనా అంటే..కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
'ఛావా' రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా
చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం) -
బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఆయన తరచూ సాయం చేస్తుంటారనే విషయం తెలిసిందే. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' పేరుతో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో మంచి పనులు ఆయన చేస్తుంటారు. రైతులు, విద్యార్థులు, వైద్యం, దుస్తులు, ఆహారం ఇలా ఒక్కటేంటి లెక్కలేనన్ని సామాజిక సాయం చేయడంలో ఆయన ముందుంటారు. అయితే, తాజాగా వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సోనూ గొప్ప మనసు చాటుకున్నారు.జులై 30న సోనూసూద్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలని ఆయన ముందుకు వచ్చారు. 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టకున్నట్లు ప్రకటించారు. వృద్ధులు ఒంటరిగా ఉండకుండా, ప్రేమతో, గౌరవంతో జీవించేందుకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆశ్రమాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు మంచి ఆహారం ఆపై చివరి రోజుల్లో వారికి మానసిక శాంతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అయితే, ఎక్కడ నిర్మించనున్నారనేది ఆయన తెలుపలేదు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు గతంలో ఆయన ఒకసారి ప్రకటించారు. -
నా జీవిత అనుభవాలతో...
‘‘నేను రాసిన పుస్తకాలు నా జీవిత అనుభవాల నుంచి వచ్చాయి. అవి నాకు నేర్పిన పాఠాలనే నా పుస్తకాల్లో పొందుపరిచాను’’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన విలక్షణమైన నటుడే కాదు.. మంచి రచయిత కూడా అనే సంగతి తెలిసిందే. ఆయన రాసిన పుస్తకాల్లో ఇప్పటికే మూడు బుక్స్ని రిలీజ్ చేశారాయన. తాజాగా ‘డిఫరెంట్ బట్ నో లెస్’ అనే నాలుగో పుస్తకాన్ని ఆవిష్కరించారు అనుపమ్ ఖేర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘నా నిజ జీవిత ఘటనలతో రాసిన ఈ పుస్తకం నాకు చాలా ప్రత్యేకం. ఇందులో నేను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ సినిమా కథ, షూటింగ్లో ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న విధానాన్ని ప్రస్తావించాను. నేను బాక్సాఫీస్ వసూళ్ల గురించి పెద్దగా పట్టించుకోను. మా సినిమా ఎప్పటికైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరణ్ టాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి నటించిన ‘తన్వి ది గ్రేట్’ ఈ నెల 18న విడుదలైన సంగతి తెలిసిందే. -
ప్రేమకథ ఆలస్యం
హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్లో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కార్తీక్ ఆర్యన్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని దర్శకుడు అనురాగ్ బసు వెల్లడించారు.‘‘ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. కార్తీక్ ఆర్యన్ మా సినిమాతోపాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కార్తీక్ డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తాడు. ఈ లుక్స్ పరంగా ఇబ్బందులున్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబరులో మా సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభిస్తాం.అయితే ‘సయారా’ సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని, దీంతో స్క్రిప్ట్లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది మా చిత్రం రిలీజ్ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు. ‘సయారా’ కథకు, మా సిని మాకు సంబంధం లేదు’’ అన్నారు అనురాగ్ బసు. ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా కానుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉస్తాద్ భగత్సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు. -
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా.. అమిర్ ఖాన్ నిర్మించారు. గతనెల 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలైన అమిర్ ఖాన్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఓటీటీకి ఇచ్చేది లేదన్న అమిర్..అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోనని అమిర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ముందుగానే ప్రకటించినట్లు యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రూ. 100 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చని తెలిపారు. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ అధికారిక యూట్యూబ్ ఛానల్.. ఆమిర్ ఖాన్ టాకీస్: జనతా కా థియేటర్లో రూ. 100కు అందుబాటులో ఉండనుంది. -
ఫ్యాషన్ ఈవెంట్లో దేవకన్యలా మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
'కోట్ల రూపాయల అభిమానం.. చనిపోయే ముందు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చింది'
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. సంజయ్ దత్కు కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు.. దక్షిణాదిలోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో ది రాజాసాబ్, అఖండ-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్లో దురంధర్, కన్నడలో కెడి - ది డెవిల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు సంజయ్ దత్.అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సంజయ్ దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ అభిమాని తనకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిందని వెల్లడించారు. ఓ మహిళా అభిమాని తాను చనిపోయేముందు తన ఆస్తినంతా నా పేరుమీద రాసిందని పంచుకున్నారు. అయితే ఆ డబ్బుతో తాను ఏమి చేశాడో కూడా వెల్లడించారు. ఆ ఆస్తి మొత్తాన్ని మహిళ కుటుంబానికి తిరిగి ఇచ్చానని సంజయ్ దత్ తెలిపారు.కాగా..సంజయ్ దత్ 1981లో రాకీ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విధాత, నామ్, సాజన్, ఖల్ నాయక్, వాస్తవ్ లాంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ సినిమాల్లో అలరిస్తున్నారు. -
అమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు.. ఎందుకు వచ్చారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో అభిమానులను అలరించారు. గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2018లో రిలీజైన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే.. అమిర్ ఖాన్ ఇంటికి ఐపీఎస్ అధికారులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అమిర్ ఇంటికి ఐపీఎస్ అధికారులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారని ఆరా తీస్తున్నారు. అంతమంది ఐపీఎస్ అధికారులు రావడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ టీమ్ స్పందించింది. ఐపీఎస్ అధికారుల ఆకస్మికంగా అమిర్ ఇంటికి రావడంపై కచ్చితమైన వివరాలు తెలియవని అమిర్ టీమ్ తెలిపింది. మేము కూడా అమిర్ ఖాన్ సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఐపీఎస్ శిక్షణార్థులు ఆమిర్ ఖాన్తో సమావేశం అయ్యారని సమాచారం. వారందరికీ హీరో తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆ బృందంలోని ఒక సభ్యుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఆ హీరో నిజంగానే నా పీక కోశాడు: బాలీవుడ్ నటుడు
నెగెటివ్ పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నటుల ప్రాణాలకే ప్రమాదం.. కొన్ని యాక్షన్ సీన్లలో అయితే వీరు చావు చివరి అంచులవరకు కూడా వెళ్లి వస్తుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఏర్పడిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అశోక్ సరఫ్ (Ashok Saraf). ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే అలరించిన ఈయన జాగృతి (1992) మూవీలో విలన్గా నటించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. నా మెడపై కత్తిపెట్టి..జాగృతి చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను అశోక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సల్మాన్ (Salman Khan) నా పీకపైన కత్తిపెట్టాల్సిన సన్నివేశం అది! ఆయన నిజమైన కత్తి పట్టుకున్నాడు. ఇద్దరం డైలాగ్స్ చెప్తున్నాం. ఆయన చాలా గట్టిగా కత్తిని అదిమిపట్టుకున్నాడు. అది నా మెడకు గుచ్చుకుంటోంది. అతడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలనిపించింది. ఆ కత్తిని కిందపడేయమన్నాను. కానీ సల్మాన్.. కత్తి కిందపడేయకుండా కెమెరా మనవైపే ఉంది. ఏం చేయమంటావని అడిగాడు. ఓపక్క రక్తం కారుతున్నా..కెమెరా నావైపే ఉన్నట్లర్థమై సీన్ కంటిన్యూ చేశాం. ఇద్దరం డైలాగ్స్ చెప్పాం. తర్వాత చూసుకుంటే నా మెడ కట్ అయింది. కాస్త లోతైన గాయం ఏర్పడి రక్తం కారుతోంది. ఏమాత్రం నరాలు కట్ అయినా నా చాప్టర్ అక్కడే క్లోజ్ అయ్యేది. మరి సల్మాన్కు ఈ సంఘటన గుర్తుందో, లేదో? అయినా ఇలాంటివాటిని ఎవరూ గుర్తుపెట్టుకోరు, అక్కడే మర్చిపోతారు అని చెప్పుకొచ్చాడు.సినిమాసల్మాన్, అశోక్.. జాగృతి చిత్రంతో పాటు కరణ్ అర్జున్, ప్యార్ కియా తో డర్నా క్యా, బంధన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇకపోతే సల్మాన్ చివరగా సికందర్ చిత్రంలో కనిపించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఇతడు.. కిక్ సీక్వెల్తో పాటు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్ -
కుమార్తె గ్రాడ్యుయేషన్... ఏఆర్ రెహమాన్ పోస్ట్ వైరల్!
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పట్టభద్రురాలైందని వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో తన విద్య పూర్తి చేసుకుందని తెలిపారు. హాస్పిటాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ కోర్సులో రహీమా మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ఆనందంగా వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.కాగా.. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో తన వండర్మెంట్ టూర్లో బిజీగా ఉన్నారు. మరోవైపు రెహమాన్కు సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. ఈ జంటకు రహీమాతో పాటు ఖతీజా, అమీన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బానుతో విడిపోయారు. గతేడాది నవంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్ -
తండ్రైన ఛావా నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ తండ్రైనట్లు ప్రకటించారు. ఈనెల 24న బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తన భార్య రుచిరా గర్భంతో ఉన్నారని శుభవార్త చెప్పారు. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు. ఈ విషయం తెలుసుకున్న 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే అభినందనలు తెలిపారు. మీ చిన్నారిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ తెలిపారు.కాగా.. వినీత్ కుమార్ సింగ్ ముక్కాబాజ్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈ ఏడాది ఛావా మూవీతో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో చందోగమాత్య కవి కలష్ పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్బాజ్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. View this post on Instagram A post shared by Viineet Kumar Siingh (@vineet_ksofficial) -
అది వారి వ్యక్తిగత విషయం.. మనకు అవసరం లేదు: కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు జంటగా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్.. మెహర్ అనే పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. అలాంటి వారిని మనం జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు. ఇది కేవలం జెండర్కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు. -
సన్నగా అవ్వాలని తిండి మానేశా.. ఆ వ్యాధి వచ్చింది!
ఫేమస్ అవడానికి ఏదైనా చేస్తారు సినీతారలు. ఒక్కసారి పాపులర్ అయ్యాక దాన్ని కాపాడుకునేందుకు కూడా చాలా కష్టపడుతుంటారు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) కూడా అదే చేసింది. చిత్రవిచిత్ర వేషధారణతో సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉండే ఈ బ్యూటీ.. మరింత అందంగా కనిపించాలని గతంలో లిప్ ఫిల్లర్స్ వేయించుకుంది. ఈ మధ్య వాటిని తీసేయించుకోవడానికి చాలా కష్టపడింది. తిండి మానేశా..ఆ ట్రీట్మెంట్ వల్ల పెదాలు, ముఖం అంతా ఉబ్బిపోయి అందవిహీనంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నగా కనిపించాలని తిండి మానేశానని చెప్తోంది. ఉర్ఫీ జావెద్ మాట్లాడుతూ.. నేను చాలాసార్లు కడుపుమాడ్చుకునేదాన్ని. తిండి తినకపోయేదాన్ని. చాలా సన్నగా కనిపించాలని నానాతిప్పలు పడ్డాను. దీంతో నాలుగేళ్ల క్రితం నాకు బాడీ డిస్మార్ఫిక్ అనే వ్యాధి వచ్చింది. నాలుగు పీసులు తినేదాన్నంతే!(అందంగా కనిపించడం లేదేమోనని కంగారుపడటం, శరీరంలో ఏదో ఒకటి బాగోలేదని బాధపడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు) మూడు లేదా నాలుగు చికెన్ ముక్కలు తిని రోజంతా ఖాళీ కడుపుతో ఉండేదాన్ని. వర్కవుట్స్ చేయకపోయేదాన్ని కానీ పరిగెత్తేదాన్ని. ఒంట్లో ఎక్కువ శక్తి లేకపోయేసరికి మైండ్ సరిగా పనిచేసేది కాదు. ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని, చిరాకుపడేదాన్ని. ఎవరైనా నన్ను పలకరించినా సరే నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్? అనుకునేదాన్ని. .బక్కచిక్కిపోవాల్సిన అవసరం లేదుఅయితే తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. మరీ బక్కచిక్కిపోయి స్లిమ్గా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాను. ఈ మధ్యే జిమ్కు వెళ్లడం మొదలుపెట్టాను. బరువులు ఎత్తుతున్నాను. బాగా తింటున్నాను. కచ్చితంగా సన్నగా ఉండాల్సిందేనని ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావెద్.. బుల్లితెరపై పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ తొలి సీజన్లో పాల్గొంది. ఫాలో కర్లో యార్ వెబ్ సిరీస్లో నటించింది. ఇటీవల ద ట్రైటర్స్ ఇండియా అనే షోలో పాల్గొని విజేతగా నిలిచింది.చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ -
బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు.. ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు
-
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి!
భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆమాత్రం అర్థం చేసుకోకపోతే సంబంధాలు ఎలా నిలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలకు బొత్తిగా ఓపిక ఉండట్లేదు. పెళ్లి అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే.. పెళ్లంటే ఒకరికోసం మరొకరు జీవించడం. భార్య పిల్లల్ని చూసుకోవాలిమీకు పిల్లలు ప్టుటారే అనుకోండి.. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కెరీర్ కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి పిల్లల బాధ్యత తీసుకోవాలి. భర్త కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు, వారికి అండగా నిలబడతాడు. కానీ ఈరోజుల్లో ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అన్నింటినీ ఒత్తిడిలా ఫీలవుతున్నారు. పైగా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే! పెద్దవాళ్లను చూసి నేర్చుకోండితల్లి ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి. వాటితో ఇంట్లో వాళ్లను పోలుస్తూ.. నా భాగస్వామి ఇలా లేదేంటని బాధపడతారు. ఏదైనా సరే అనుభవాల నుంచి నేర్చుకుంటేనే మంచిది, లేదంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క, వదినలు.. వీరిని చూసి కూడా ఎంతోకొంత నేర్చుకోవచ్చు. వారిలో మీకు పనికొచ్చే లక్షణాలను ఎంపిక చేసి ఆచరించండి. పనికిరానివి వదిలేయండి. కానీ అవన్నీ ఇప్పుడెవరు చేస్తున్నారు. అలా పెళ్లయిందో లేదో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.ఫస్ట్ సినిమాకు ముందే 40 చిత్రాలుసినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. నా తొలి సినిమా రిలీజవ్వడానికి ముందే నా చేతిలో 40 చిత్రాలున్నాయి. అందులో ఏవి ఆడతాయి? ఏవి ఫ్లాప్ అవుతాయి? అని నేను పెద్దగా ఆలోచించలేదు. అప్పట్లో మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ అన్న పదాలే మాకు తెలియవు. కాస్త బాధపడుకుంటూ ఉన్నా సరే అమ్మ వచ్చి తిట్టగానే అదెటో వెళ్లిపోయేది. బాధపడుతూ కూర్చునేంత టైం ఇచ్చేవాళ్లు కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం దిగజారుతున్న నేపథ్యంలో 2023లో సునీల్ శెట్టి లెట్స్ గెట్ హ్యాపీ అనే హెల్త్ యాప్ రిలీజ్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో అనేక చిత్రాలు సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు, గని మూవీస్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
సినీ నిర్మాత, హీరోను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు, నిర్మాత మాన్ సింగ్ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. 'సో లాంగ్ వ్యాలీ' అనే హిందీ చిత్రాన్ని మాన్ సింగ్ దర్శత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఆపై ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జులై 25న చిత్ర యూనిట్తో కలిసి ముంబైలోని సినీపోలిస్ థియేటర్కు మాన్ సింగ్ వచ్చారు. ఆ సమయంలో నటి రుచి గుజ్జర్ ఆవేశంతో తనకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలంటూ చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిర్మాత, నటుడు మాన్ సింగ్ తనకు రూ. 25 లక్షలు బాకీ ఉన్నాడని రుచి గుజ్జర్ పేర్కొంది. ఆ డబ్బు ఇవ్వాలంటూ అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఈ క్రమంలో చెప్పు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నం చేయగా.. ఆమెను నిలువరించేందుకు చిత్ర సహ నిర్మాత కరణ్ అడ్డుపడ్డాడు. ఆ చిత్ర నిర్మాతలు గాడిదలపై కూర్చున్నట్లు చిత్రీకరించబడిని కొన్ని ప్లకార్డులను ఆమె ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలంగా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని మాన్ సింగ్పై పోలీసులకు రుచి గుజ్జర్ ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ ఆల్బమ్లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.నటి రుచి గుజ్జర్ ప్రధానంగా మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించిన ఆమెకు పాపులారిటీ వచ్చింది. 2023 మిస్ హర్యానాగా నిలిచిన ఈ బ్యూటీ ఈ ఏడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. View this post on Instagram A post shared by Bollywood News (@bolly_newssss) View this post on Instagram A post shared by SpotlightBollywood (@spotlightbolly) -
పుష్కరం తరువాత అక్షయ్ కుమార్ రాయల్ కమ్ బ్యాక్ (ఫొటోలు)
-
ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ కావడంతో ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ ఇచ్చింది. -
చిన్నపిల్లలు.. వాళ్లకేమైందని? మీ పిచ్చి సలహాలు..: నటి ఆగ్రహం
పిల్లల్ని ప్రేమతో చూడాలి కానీ, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు అంటూ కలర్ గురించి మాట్లాడటమేంటి? అని అసహనానికి లోనైంది బుల్లితెర నటి రుబీనా దిలైక్ (Rubina Dilaik). తనకు ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలున్నారు. తమ ఇంటికి వచ్చినవారు పిల్లల రంగు గురించి మాట్లాడటం నటికి ఏమాత్రం నచ్చలేదు. నా కూతుర్లకేమైందని..దీని గురించి రుబీనా మాట్లాడుతూ.. నాకు పుట్టిన అమ్మాయిల్లో ఒకరు ఫెయిర్గా ఉంటే మరొకరు కాస్త డస్కీగా ఉంటారు. మా ఇంటికి వచ్చినవాళ్లు అదే విషయం పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకరితో మరొకర్ని కంపేర్ చేస్తున్నారు. అది నాకస్సలు నచ్చలేదు. రంగు గురించి మాట్లాడొద్దు, నా కూతుర్లిద్దరూ అందంగా ఉన్నారని వాళ్లకు గట్టిగా ఆన్సరిచ్చేదాన్ని. ఇంకోసారి నా ఇంట్లో.. పిల్లల మధ్య పోలిక తేవొద్దని వార్నింగ్ ఇచ్చాను. మా బంధువులైతే.. పాపకు మంచి రంగు రావడం కోసం శనగపిండితో స్నానం చేయించమనేవారు. అసలు ఆ విషయం గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని బదులిచ్చాను. చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నా..నా పిల్లలకేమైందని.. వారెంతో అందంగా ఉన్నారు. అలాగే ఇద్దరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నాను. అర్థం చేసుకోవడానికి వారిది చాలా చిన్నవయసు కానీ, ఇప్పటినుంచి నేర్పిస్తేనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు అని చెప్పుకొచ్చింది. రుబీనా- అభినవ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నారు. రుబీనా ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్లకు రుబీనా గర్భం దాల్చింది. 2023లో కవల కూతుర్లు ఏధ, జీవాకు జన్మనిచ్చింది.చదవండి: గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్ -
అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆనాటి సంగతులను నెమరేసుకున్నాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఆరోజుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని ప్రత్యేక విభాగాలు అప్పుడు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్సే అన్నీ చూసుకోవాలి! దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేను సహాయ దర్శకుడిగా పని చేశాను.అన్ని పనులు ఒక్కరే..డైలాగులు రాసి నటీనటులకు ఇవ్వడం, వారిని చూసేందుకు వచ్చిన జనాల్ని అదుపు చేయడం మా పని. కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు మేకప్మ్యాన్ కూడా మేమే అవుతాం. స్విట్జర్లాండ్లో సీన్స్ షూట్ చేసేందుకు మొత్తం 21 మందిమి వెళ్లాం. అందరం ఒకే బస్లో కూర్చునేవాళ్లం. బస్లో వెళ్తుండగా ఎక్కడైనా లొకేషన్ బాగుందనిపించగానే వెంటనే దిగిపోయి షూట్ చేసేవాళ్లం. హీరోహీరోయిన్లు కూడా..సరైన వసతులు లేనిచోట హీరోయిన్ కాజోల్ (Kajol) ఓ చెట్టు వెనక్కు వెళ్లి చీర మార్చుకునేది. షారూఖ్ ఖాన్ ఎక్కడపడితే అక్కడే డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేవాడు. ఎత్తైన కొండలపై షూటింగ్ ఉందంటే అందరూ సామాన్లు పట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! షారూఖ్, కాజోల్ కూడా కొంత సామాను పట్టుకుని నడిచేవారు. అందరం ఒక టీమ్గా ముందుకు కదిలేవాళ్లం. మాకు సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. హీరోయిన్ డ్రెస్, జ్యువెలరీ కూడా తక్కువ రేటులో తీసుకునేవాళ్లం. హీరోయిన్ జుట్టు సరిచేశాడబ్బు ఎక్కువ లేకపోయేసరికి రైల్వే స్టేషన్ బయట అతి చవకైన ఆభరణాలు కొనుక్కొచ్చేవాడిని. కానీ ఇప్పుడంతా ఎలా మారిపోయిందో చూస్తున్నారుగా.. హీరో వానిటీ వ్యాన్లో కనీసం ఎనిమిది మందైనా ఉంటున్నారు. అప్పట్లో మేనేజర్, పీఆర్ అని ఎవరూ లేరు. హీరోయిన్ వెంట ఆమె తల్లి మాత్రమే ఉండేది. ఒకసారి కాజోల్ మేకప్మ్యాన్ లేకపోయేసరికి నేనే తన జుట్టు సరి చేశా. ఆమె తల్లి ముఖానికి మేకప్ వేసింది. ఆరోజుల్లో అంతా చాలా సరదాగా ఉండేది, ఇప్పుడంతా బోరింగ్గా మారిపోయింది అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.సినిమాదిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1995లో రిలీజైంది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ విషయానికి వస్తే.. ఆయన బ్యానర్లో తెరకెక్కిన ధడక్ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు.చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్ -
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్లో కనిపించాడు. -
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ
రీసెంట్ టైంలో బాలీవుడ్లో ఓ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సయారా'. జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీలో చూసినా సరే లవ్ బ్యాక్డ్రాప్ మూవీస్ పెద్దగా రావట్లేదు. అందరూ హారర్, యాక్షన్, పీరియాడికల్ అంటూ పాన్ ఇండియా ట్రెండ్ వెంటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సింపుల్ ప్రేమకథ, మనసుకు హత్తుకునే పాటలతో వచ్చిన హిందీ సినిమానే 'సయారా'. ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో ఒకలాంటిదే ఇది కూడా. స్టోరీ పరంగా కొత్తగాం ఏం ఉండదు. చాలాసార్లు చూసేశాం అనిపిస్తుంది. కాకపోతే స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.పెళ్లి బట్టలతో వాణి బత్రా.. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లిన సీన్తో సినిమా మొదలవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దీంతో కొన్నాళ్ల పాటు బాధతో ఇంటికే పరిమితమవుతుంది. అలా ఆరు నెలల తర్వాత తిరిగి బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతుంది. రైటర్గా ఓ చోట జాబ్లో జాయిన్ అవుతుంది. అదే రోజు తన ఆఫీస్కి వచ్చి ఒకడ్ని కొడుతున్న సింగర్ క్రిష్ కపూర్ని ఈమె చూస్తుంది. అలా అక్కడ వీళ్లిద్దరికీ మొదలైన పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.హిందీ ఆడియెన్స్ ఈ సినిమా చూసి తెగ ఎమోషనల్ అయిపోతున్నారు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఓకే ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్గానే అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా గతం మర్చిపోయిన వాణి ముఖంలో అమాయకత్వం చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలానే పాటలు కూడా దేనికవే బాగుంటాయి. మరీ సూపర్ అని చెప్పాం గానీ ఓ మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారు?క్రిష్ కపూర్గా చేసిన అహన్ పాండే, వాణిగా చేసిన అనీత్ పడ్డాకి ఇదే తొలి సినిమా. కానీ అద్భుతంగా చేశారు. అదిరిపోయే కెమిస్ట్రీ పండించారు. కొన్ని క్లోజప్ షాట్స్లో హీరోయిన్ని చూస్తుంటే మనల్ని కూడా ఇలాంటి అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతా బాగుంటుంది మరి. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ మోహిత్ సూరి.. తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్లో మరో మంచి మూవీ తీశాడు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో, అది కూడా హిందీలో మాత్రమే ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు, ప్రేమలో విఫలమైనోళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశముంది. ఒకవేళ బిగ్ స్క్రీన్పై చూస్తే ఆసక్తి లేదంటే కొన్నాళ్లు ఆగితే నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
సైయారా దెబ్బకు ఖాన్స్ రికార్డ్స్ అవుట్
-
ఆజ్ కీ రాత్ రీమిక్స్లో..?
షారుక్ ఖాన్తో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను తెరకెక్కించి, హిట్స్ అందుకున్నారు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. తాజాగా ఫర్హాన్ డైరెక్షన్లోనే ‘డాన్ 3’ రానుంది. అయితే ‘డాన్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా చేయడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్గా కియారా అద్వానీని ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్పైకి రాలేదు. కాగా ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చారు కియారా. దీంతో కియారా సెట్స్కు రావడం కుదరదని, ఆమె ప్లేస్లో మేకర్స్ కృతీ సనన్ను హీరోయిన్గా తీసుకున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఓ దశలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ప్రియాంకా చోప్రా ‘డాన్ 3’లోనూ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రణ్వీర్ సింగ్. డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించారు. దీంతో ముందుగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనుకుంటున్నారు రణ్వీర్.ఆ విధంగా ‘డాన్ 3’ చిత్రీకరణ వాయిదా పడింది. జనవరిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు మేకర్స్. ఎలాగూ ‘డాన్ 3’ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ముందుగా ప్రకటించినట్లుగానే హీరోయిన్గా కియారా అద్వానీనే నటింపజేయాలనుకుంటున్నారట. ఇక ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ పాట ఉన్న విషయం తెలిసిందే. ఈ పాపులర్ సాంగ్ను ‘డాన్ 3’లో రీమిక్స్ చేసి, ఈ స్పెషల్ సాంగ్లో కృతీ సనన్తో డ్యాన్స్ చేయిస్తే బాగుంటుందని, ఈ సాంగ్లో ప్రియాంకా చోప్రా గెస్ట్గా కనిపిస్తే బాగుంటుందని ఫర్హాన్ భావిస్తున్నారట. ఆ దిశగా కృతీతో చర్చలు జరుపుతోందట ‘డాన్ 3’ టీమ్. మరి... ‘ఆజ్ కీ రాత్’ సాంగ్లో రణ్వీర్తో కలిసి కృతీ సనన్ స్టెప్పులేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు సంగీతం అందించిన శంకర్–ఇషాన్–లాయ్ త్రయమే ‘డాన్ 3’కీ సంగీతం అందించనున్నారు. -
నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు
రేసుగర్రం విలన్ రవికిషన్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించారు. సినిమాల మీద ఆసక్తితో రూ.500 నోటుతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన రానురానూ తన టాలెంట్తో గుర్తింపు సంపాదించారు. భోజ్పురి, హిందీ చిత్రపరిశ్రమలో టాప్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.కటిక పేదరికంతాజాగా రవికిషన్ (Ravi Kishan) ఓ పాడ్కాస్ట్లో తన బాల్యంలోని బాధల్ని చెప్పుకొచ్చారు. నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని అసహ్యించుకునేవాడిని. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం. చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. ఒక్కోసారి ఒకరిపై మరొకరం నిద్రించేవాళ్లం.ఆరోజే అనుకున్నాపేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి చాలామంది వెక్కిరించారు. నా తండ్రిని ఎవరూ హేళన చేయకూడదని, ఆ స్థాయికి నేను చేరుకోవాలని చిన్నతనంలోనే బలంగా నిశ్చయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే! అంతేకానీ పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా అనామకులుగా చనిపోతే ఏం లాభం? కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా! మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు దానంతటదే వస్తుందని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చారు.డబ్బు లేకపోతే..ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. ప్రతిరోజు జిమ్కు వెళ్లండి, అంత డబ్బు లేదంటే రోడ్డుపై పరిగెత్తండి. కనీసం 3-5 కి.మీ అయినా పరిగెత్తండి, 200 పుషప్స్ చేయండి. శనగలను రాత్రంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లను తాగండి, శనగలను తినండి. మీరు పేదవాళ్లయినప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే నిత్యావసర సరుకులను ఇలా వాడుకోవచ్చు. కనీసం సూర్యోదయానికి ముందు లేవడమైనా అలవాటు చేసుకోండి అని సూచించారు.సినిమాపీతాంబర్ (1992) సినిమాతో రవికిషన్ సినీప్రయాణం ఆరంభమైంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, హీరో, 90 ఎమ్ఎల్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.చదవండి: మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..! -
మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..!
మనసుకు నచ్చినవారు దూరమైతే తట్టుకోలేం. అందులోనూ కన్నవారు ఒకరివెంట మరొకరు మనల్ని వీడి వదిలి వెళ్లిపోతే ఆ బాధను భరించలేము. కానీ, అంతకు మించిన బాధనే భరించాల్సి వచ్చింది సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు! 2022 జనవరిలో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. అదే ఏడాది సెప్టెంబర్లో తల్లి ఇందిరా దేవి, నవంబర్లో తండ్రి కృష్ణ చనిపోయారు. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి తీవ్ర బాధలో కూరుకుపోయాడు.ఎన్నో కష్టాలుఆ విషయాన్ని మహేశ్ మరదలు, ఒకప్పటి హీరోయిన్ శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ మానవుల్లో మహేశ్ బావ ఒకరు. ఫ్యామిలీ కోసం ధృడంగా నిలబడతాడు. కానీ, తను చాలా కష్టాలు చూశాడు. కుటుంబాన్ని (తల్లిదండ్రులు, సోదరుడు)ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తనను అభిమానించేవారికోసం చిరునవ్వుతో కనిపించేవాడు. మా పేరెంట్స్ను కోల్పోయినప్పుడు అక్కకు మహేశ్, నాకు నా భర్త అండగా నిలబడి ఓదార్చారు. వీళ్లిద్దరూ మాకోసం ఎంతో చేశారు అని చెప్పుకొచ్చింది.తనకు చంటిబిడ్డనయ్యానమ్రత గురించి మాట్లాడుతూ.. నమ్రత నాకంటే పెద్దది. కానీ సినిమాల్లోకి నేనే ముందు వచ్చాను, నాకే ఫస్ట్ పెళ్లయింది, నాకే ముందు పాప పుట్టింది. దీంతో అందరూ నన్నే పెద్దదాన్ని అనుకుంటారు. నాకు పెళ్లయ్యాకే నమ్రతకు మరింత క్లోజయ్యాను. మా పేరెంట్స్ చనిపోయాక నేను తనకు చంటిబిడ్డగా మారిపోయాను. తన కన్నబిడ్డల కంటే నా గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క నాపై అంత ప్రేమ చూపిస్తుంది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా -
తొలి సినిమాకే రూ.150 కోట్ల కలెక్షన్స్.. అయినా సింపుల్గా..
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయింది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా (Aneet Padda). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా (Saiyaara Movie). అహాన్ పాండే (అనన్య పాండే కజిన్) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్టాక్తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వీడియో వైరల్ఇదిలా ఉంటే తాజాగా అనీత్ పడ్డా ముంబైలోని ఓ సెలూన్కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్ ధరించిన అనీత్.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అనీత్ పడ్డా.. గతేడాది అమెజాన్ ప్రైమ్లో రిలీజైన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala)చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న హీరోయిన్ -
కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: హీరోయిన్
అవకాశాలిస్తాం.. మరి మాకేంటి? ఒకానొక దశలో ఈ మాటలు వినీవినీ విసిగిపోయానంటోంది హీరోయిన్ సుర్వీన్ చావ్లా (Surveen Chawla). కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ధైర్యంగా నిలబడ్డానంది. సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జూలై 25 నుంచి ప్రసారం కానుంది.అసహ్యంగా అనిపించిందిఈ సిరీస్ ప్రమోషన్స్లో సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేయాలన్నా మాకేంటి? అని చెండాలంగా మాట్లాడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు బయటకు వెళ్లాలంటే కూడా అసహ్యంగా అనిపించేది. అసలు ఇవన్నీ నాకు అవసరమా? అని తిట్టుకునేదాన్ని. యాక్టింగ్ మానేయాలన్నంత కోపం వచ్చేది. వాళ్లు అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు చేజారాయి. చివరకు రోడ్డుమీద పడ్డట్లు అనిపించింది. వెబ్ సిరీస్లతో టాప్..ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దీనికోసమేనా? అని నిరాశచెందేదాన్ని. నా వల్ల కాదు, సినిమాలు మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. సుర్వీన్ చావ్లా.. రాజు మహారాజు అనే తెలుగు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీలో అగ్లీ, హేట్ స్టోరీ 2 వంటి మూవీస్ చేసింది. ఓటీటీలో సేక్ర్డ్ గేమ్స్, రానా నాయుడు, క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ వెబ్ సిరీస్లు చేసింది.చదవండి: ధనుష్ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..? -
69 ఏళ్ల ఏజ్లో స్లిమ్ అండ్ ట్రిమ్గా : ఈ సిక్రెట్ వెనకాల ‘జగదేక సుందరి’ (ఫొటోలు)
-
హీరోలతో సమాన అవకాశాలు మాకెక్కడివి? ఆఖరికి వాష్రూమ్కు వెళ్లాలన్నా..
హీరోలతో సమానంగా తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎంతోమంది హీరోయిన్లు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తాజగా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) కూడా అదే మాట అంటోంది. హీరోలను ఒకలా.. తమను మాత్రం మరోలా ట్రీట్ చేస్తారని వాపోయింది. కొన్నిసార్లు తమకు కనీస వసతులు కూడా ఉండవని పేర్కొంది.హీరోలతో సమానంగా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నుష్రత్ బరుచ మాట్లాడుతూ.. ఒక హీరో హిట్టు కొట్టగానే అతడికి కనీసం ఐదు సినిమా ఆఫర్లయినా వస్తాయి. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు. ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. ప్యార్ కా పంచనామా (2011) సినిమా టైం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా..! ఎవరైనా సినిమాతో సక్సెస్ అందుకున్నాక ఇంకేం కోరుకుంటారు? మరిన్ని మంచి ప్రాజెక్టులు రావాలని ఎదురుచూస్తారు. హీరోలు అలా వచ్చినవాటిలో బెస్ట్ ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తారు. మాకంత అదృష్టం లేదు. వారికి వచ్చినన్ని అవకాశాలు మాకు రావు.వాష్రూమ్కు వెళ్లేందుకు కూడా..అంతెందుకు? సెట్లో కూడా ఏదైనా అత్యవసరమైతే హీరో వానిటీ వ్యాన్ను ఐదు నిమిషాలు వాడుకోవచ్చా? అని అడగాల్సిన పరిస్థితి కూడా ఫేస్ చేశాను. అది కూడా సెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే.. వాష్రూమ్ కోసం ఆ వ్యాన్లోకి వెళ్తానని అడిగేదాన్ని. అప్పుడు హీరోకు ఉన్నన్ని వసతులు, సౌకర్యాలు నాకు అందించలేదేంటని గొడవ చేయలేదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని మాత్రమే బలంగా కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది. నుష్రత్ చివరగా చోరీ 2 అనే హారర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తెలుగులో శివాజీ తాజ్మహల్ మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ -
బాలీవుడ్ సాంగ్కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!
సోషల్మీడియాలో ఒక ఇంట్రస్టింగ్ వీడియో హల్చల్ చేస్తోంది. రష్యాకు చెందిన చిన్నారులు బాలీవుడ్ సూపర్స్టార్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అడింకా మాండరింకా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 2.4 కోట్ల వీక్షణలను సంపాదించింది.అమీర్ ఖాన్ , కాజోల్ నటించిన ఫనా (2006) చిత్రం నుండి 'చందా చమ్కే' పాటకు రష్యాకు చెందిన చిన్నారులు అద్భుతంగా స్టెప్పులేశారు. చక్కటి హావభావాలు, అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అందమైన ఎరుపు లెహంగాలు ధరించిన చిన్నారుల బృందం పాటలోని ప్రతి బీట్ను క్యాచ్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు. సో క్యూట్ ఎంత బాగా చేశారో, మంచి డ్యాన్సర్లు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! View this post on Instagram A post shared by Adinka Mandarinka (@adina_madikyzy)అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చిన్నారుల డ్యాన్స్ వీడియోను రికార్డ్ చేసిన 'కెమెరామెన్' పై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. అతని కెమెరా యాంగిల్స్పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. చక్కటి వీడియోను పాడు చేసేశాడు అంటూ కమెంట్ చేశారు.ఇవీ చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్ పొంగల్లో పురుగు : మరో వివాదంలో రామేశ్వరం కెఫే -
బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ కవచం.. తన కోసం కాదన్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సికందర్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్బాస్ సీజన్కు హోస్ట్గా చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గాల్వాన్ లోయలో 2020లో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో వస్తోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంలో సల్మాన్ నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.అయితే సల్మాన్ ఖాన్కు పలుసార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడిన కేసు తర్వాత సల్మాన్ను చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు. దీంతో ముంబయిలోని తన ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను నివాసముండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని బాల్కనీలో బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ ఉంటారు.అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయడంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. అయితే ఇది తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని.. నా అభిమానులు కొందరు బాల్కనీ పైకి ఎక్కకుండా.. వారిని తన ఇంట్లోకి రాకుండా నివారించేందుకేనని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ బాల్కనీ పైకి ఎక్కి నిద్రిస్తున్నారని సల్మాన్ ఖాన్ వివరించారు.అయితే ఇటీవల సల్మాన్ నివాసం వెలుపల ప్రత్యక్షంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా కారులో బాంబు పెడతామని కూడా బెదిరించారు. కొంతకాలంగా సల్మాన్ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్కు భద్రత కల్పించారు. -
నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ బోరున ఏడ్చేసింది హీరోయిన్ తనుశ్రీదత్తా. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన అభిమానులు, నెటిజన్లు.. హీరోయిన్కు ఏమైందని కంగారుపడ్డారు. తను క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.పబ్లిసిటీ స్టంటా?అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే తనుశ్రీ దత్తా.. తను మామూలుగా ఉన్న వీడియోలు షేర్ చేసింది. ఇది చాలామందికి మింగుడుపడలేదు. అప్పుడే ఏడ్చింది, ఇంతలోనే మళ్లీ నార్మల్గా వీడియోలు పెడుతోంది.. తన బాధ నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే.. నేను తనుశ్రీ మేడమ్కు అభిమానిని. కానీ, ఈసారి తననిలా చూస్తుంటే లైమ్లైట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు, కానీ చూడటానికి మాత్రం అలాగే ఉంది. మీ వీడియో చూస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అని రాసుకొచ్చాడు. నాటకాలు ఆపేయ్అందుకు తనుశ్రీ స్పందిస్తూ.. అవునా? ఇప్పుడే నీ ప్రొఫైల్ చెక్ చేశా! ఈ రోజే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశావ్.. ఈ కామెంట్ పెట్టడానికేనా? అని కౌంటర్ ఇచ్చింది. పనికిమాలిన వ్యక్తుల కోసం ఎన్నిరోజులు ఏడుస్తూ కూర్చోవాలని ప్రశ్నించింది. మరో వ్యక్తి.. మీ నాటకాలు ఆపండి. మీ డ్రామా చూసీచూసీ విసిగిపోయాం. నిజంగా మీరన్నట్లు ముంబై మీకు సురక్షితం కాకపోతే అమెరికాకు వెళ్లిపోవచ్చుగా.. తెలిసి తెలిసి ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టడం? నానా పటేకర్ మంచి మనిషి, బాలీవుడ్లో బెస్ట్ యాక్టర్. అతడి పరువు తీయడానికి ప్రయత్నించకండి. ఇకనైనా డ్రామాలు ఆపేయండి, మాకు నిజమేంటో తెలుసు. మీరెంత చేసినా బాలీవుడ్లో మీకు సినిమాలు రావు అని కామెంట్ పెట్టాడు.నానా పటేకర్, తనుశ్రీ దత్తాహీరో, నటుడు కలిసే..నెగెటివ్ కామెంట్లతో విసిగిపోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta).. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.పిచ్చిదాన్ని కాదుమధ్యలో సల్మాన్ ఎందుకు వచ్చాడో అర్థం కాక తలపట్టుకున్న నెటిజన్లు.. ఆమెను మంచి సైకియాట్రిస్ట్ను కలవమని సలహా ఇచ్చారు. అందుకు తనుశ్రీ.. నేనేమీ పిచ్చిదాన్ని కాదు. వాళ్ల బండారం బయటపెట్టినందుకు పిచ్చిదాన్ని చేస్తారా? నాలాగా టార్చర్ ఫేస్ చేస్తున్న అందరూ ఇలాగే ఆడియో, వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడుకానీ వారి ఆటలు సాగవు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతలోనే తనను వారి నుంచి కాపాడమంటూ అభ్యర్థించింది.అసలేం జరిగింది?మీటూ ఉద్యమంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపులను బయటపెడుతూ సంచలనాలకు తెరలేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్ (Nana Patekar) తనను లైంగికంగా వేధించాడంటూ 2018లో మీడియా ముందుకు వచ్చింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న సమయంలో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. కాగా హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన తనుశ్రీ.. తెలుగులో 'వీరభద్ర' మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)చదవండి: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా? -
ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా?
బయోపిక్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందుకు ఛావా సినిమానే నిదర్శనం. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఛావా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ నటప్రభంజనానికి ఫుల్ మార్కులు పడ్డాయి.బయోపిక్ లేనట్లే?అయితే ఛత్రపతి శివాజీరాజా బయోపిక్ (Chhatrapati Shivaji Biopic) కూడా వస్తోందంటూ అప్పట్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్.. షాహిద్ కపూర్ను శివాజీగా చూపించనున్నాడని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ మూవీ అటకెక్కిందట! ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. అమిత్ రాయ్ మాట్లాడుతూ.. సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. నేను డైరెక్ట్ చేసిన ఓమైగాడ్ 2 మూవీ రూ.180 కోట్లు సాధించింది. ఎలా పనిచేస్తా?అయినప్పటికీ.. నా పనితనం నిరూపించుకోవడానికి ఇది సరిపోదట! నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్, మేనేజ్మెంట్.. ఇలాంటి వ్యవస్థల కింద నలుగుతూ ఒక దర్శకుడు ఎలా పని చేయగలడు? ఐదేళ్ల జీవితాన్ని ఒక కథకు అంకితం చేస్తే.. కొందరు సడన్గా వచ్చి అందులో ఇది తప్పు, అది తప్పు అని ప్రతిదానికి వంకపెడితే ఎంత బాధగా అనిపిస్తుంది అంటూ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసినట్లు చెప్పకనే చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొందరు హీరోలు కేవలం బాక్సాఫీస్ లెక్కల్నే చూస్తారు. హీరోలకు లవ్స్టోరీలే కావాలిమరికొందరు మాత్రం నిజాయితీగా కథల్ని మాత్రమే నమ్ముతారు. కానీ, చాలామంది సమాజంలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపించే సినిమాల్లో భాగమవడానికి బదులుగా ప్రేమకథా చిత్రాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అమిత్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ విషయానికి వస్తే.. ఈయన చివరగా దేవా చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.చదవండి: మంచు లక్ష్మి గొప్ప మనసు.. అన్నింటికంటే ఆ దానమే -
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి' అని ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలు.. ట్రెండింగ్లో #BoycottHHVM)బిహార్కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.అయితే 2018లో మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్కి క్లీన్ చిట్ దక్కింది. మరోవైపు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్, సుకుమార్ని ఫిదా చేసిన హిందీ సినిమా.. ఏంటి దీని స్పెషల్?) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
కోట్లు కొల్లగొడుతున్న చిన్న సినిమా.. నార్త్ యూత్ ని ఏడిపించేస్తుంది
-
ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?.. చాహల్ ప్రియురాలి పోస్ట్ వైరల్!
గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఆర్జే మహ్వశ్. ఆమె టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ చాహల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి.తాజాగా ఇంగ్లాండ్లో ఈ జంట సందడి చేశారు. ఓకే లోకేషన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో మరోసారి మహ్వశ్-చాహల్ డేటింగ్పై వార్తలొచ్చాయి. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ సైతం ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ ప్రేమజంట వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ నెల అంటే జూలై 31 తన పెళ్లి జరగనుందని ఓ ఛానెల్లో వార్తలొచ్చాయి. ఈ ఫోటోలు కూడా నా పెళ్లికి సంబంధించినవే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పారిపోయాడు.. మరి ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫన్నీగా పోస్ట్ చేసింది. తాజాగా తీసుకున్న ఫోటోషూట్ పిక్స్ను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. అయితే తన క్యాప్షన్లో జూలై 31 బదులు జూన్ 31 అని రాయడం మరింత నవ్వులు తెప్పిస్తోంది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
మేఘాలయ హనీమూన్ ఎపిసోడ్పై సినిమా.. అమిర్ ఖాన్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలై హిట్గా నిలిచిన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మరో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అమిర్ ఖాన్ ప్రకటించలేదు.అయితే ఇటీవల మేఘాలయలో సోనమ్ హనీమూన్ ఎపిసోడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై అమిర్ ఖాన్ సినిమా చేయనున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అమిర్ సేకరిస్తున్నారని బీటౌన్లో వైరలవుతోంది. ఈ సినిమాపై తన సన్నిహితులతో చర్చిస్తున్నారని.. తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందన్న వార్త హాట్టాపిక్గా మారింది.అమిర్ ఖాన్ రియాక్షన్..ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న వార్తలపై అమిర్ ఖాన్ స్పందించారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై సినిమాను రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలను అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. తనపై వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇలాంటి రూమర్స్ ఎలాంటి వాస్తవ ఆధారం లేకుండానే వస్తాయని.. దీనివల్ల అభిమానులు అనవసరమైన గందరగోళానికి గురవుతారని అమిర్ ఖాన్ అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్లో తాను నటించబోనని స్పష్టం చేశారు. ఈ కథనాలు ఎక్కడ, ఎలా మొదలవుతాయే నిజంగా తనకు తెలియదన్నారు.మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసురాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. -
సన్నగా ఉన్నావు.. ఆ పాత్రకు పనికిరావు అనేవారు: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి వాణికపూర్ ప్రస్తుతం క్రేజీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈనెల 25 నుంచి సందడి చేయనుంది. ఈ సిరీస్లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు.తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా వాణి కపూర్ కెరీర్ ప్రారంభంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సవాళ్లను ప్రస్తావించింది. తాను కూడా బాడీ షేమింగ్కు గురైనట్లు వెల్లడించింది. తన స్కిన్ టోన్ కారణంగా ఓ సినిమాలో పాత్రకు రిజెక్ట్ చేశారని తెలిపింది. తాను చాలా సన్నగా ఉండటం వల్ల తరచుగా బాడీ షేమింగ్కు గురయ్యానని పేర్కొంది.తాజా ఇంటర్వ్యూలో వాణి కపూర్ మాట్లాడుతూ.. 'కెరీర్ మొదట్లో తనను రిజెక్ట్ చేయడం.. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒక చిత్రనిర్మాత ఒకసారి నేను పాత్రకు న్యాయం చేయలేదని అన్నారు. తనను 'మిల్కీ వైట్'ని కాదని అన్నారు. ఆ విషయాన్ని తాను నేరుగా కాకపోయినా.. ఇతరుల ద్వారా తెలుసుకున్నా. తనపై ఎలాంటి కామెంట్స్ చేసినా తన గుర్తింపు, సామర్థ్యాలపై తనకు పూర్తిగా నమ్మకముంది. తాను సన్నగా ఉన్నానని.. బరువు పెరగాలని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ నేనేంటో నాకు తెలుసు. నాలా ఉండటమే నాకిష్టం' అంటూ బాలీవుడ్ భామ చెప్పుకొచ్చింది. కాగా.. మండల మర్డర్స్ సిరీస్లో సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్కర్, జమీల్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
మహేశ్, సుకుమార్ని ఫిదా చేసిన సినిమా.. ఏంటి దీని స్పెషల్?
బాలీవుడ్ అనగానే చాలామందికి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే ఆ తరహా సినిమాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. అప్పట్ల 'ఆషికి 2' ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అదే మూవీ తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి నుంచి 'సయారా' అనే మూవీ వచ్చింది. గత వీకెండ్లో థియేటర్లలో రిలీజైంది. నార్త్ యువత అంతా తెగ ఫీలైపోతున్నారు.(ఇదీ చదవండి: వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్)అంతెందుకు మన స్టార్ హీరో మహేశ్ బాబు, 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఎంత నచ్చిందో ఏమోగానీ మహేశ్ ట్వీట్ చేయగా.. సుక్కు తన ఇన్ స్టా స్టోరీలో సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశాడు. మరి సినిమా అంత బాగుందా? ఇంతకీ మూవీ కథేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.'సయారా' విషయానికొస్తే.. ప్రేమలో విఫలమైన హీరోయిన్(అనీత్ పడ్డా) ఓ రైటర్. అయితే ఓ అప్ కమింగ్ సింగర్(అహన్ పాండే)ని ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకు దేవుడు పెద్ద అవాంతరం కలిగిస్తాడు. హీరోయిన్కి అల్జీమర్స్ వ్యాధి వచ్చి ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరోయిన్ పాత ప్రేమికుడు తిరిగొచ్చి ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు కెరీర్లో ఎదగడానికి ఎంతో ప్రయత్నిస్తున్న హీరో.. కెరీర్ని కావాలనుకున్నాడా? ప్రేమని కోరుకున్నాడా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)అరే ఈ స్టోరీ లైన్ చూడగానే ఏదో తెలుగు సినిమా గుర్తొస్తుందే అనిపించిందా? అవును మీరు అనుకున్నది నిజమే. స్వయానా ఈ మూవీ తీసిన మోహిత్ సూరి 'ఆషికి 2' ఛాయలతో పాటు తెలుగు సినిమాలైన 'పడిపడి లేచే మనసు', 'అర్జున్ రెడ్డి' ఛాయలు కూడా గట్టిగానే కనిపిస్తాయి. మన ఆడియెన్స్ 'బేబి' రిలీజైనప్పుడు ఎంతలా ఫీలయ్యారో.. ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ కూడా అలానే తెగ ఎమోషనల్ అయిపోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతానికైతే బాలీవుడ్లో 'సయారా' కాస్త గట్టిగానే సౌండ్ చేస్తోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే హీరోహీరోయిన్ ఇద్దరు కొత్తోళ్లే. అహన్ పాండే.. హీరోయిన్ అనన్య పాండేకి అన్నయ్య. అంటే పెదనాన్న కొడుకు. ఇతడు చూడటానికి అందంగా, ఫ్రెష్గా ఉన్నాడు. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ అనీత్ పడ్డా కూడా గ్లామరస్గా భలే ఉంది. మోహిత్ సూరి ఎప్పటిలానే తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్ కథతో అదరగొట్టేశాడు. దానికి తోడు హిందీ ఇండస్ట్రీలోని డ్రై పీరియడ్ కూడా దీనికి కాస్త గట్టిగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఐదు పాటలు ఇచ్చారు. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అది ఇంకో ప్లస్. అలా అన్ని ప్లస్సులు కలిసి 'సయారా'ని సూపర్ హిట్ చేసినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో) -
మేఘాలయ హనీమూన్ కేసుపై సినిమా ప్లాన్ చేస్తున్న హీరో!
పెళ్లంటే ఆషామాషీయా? బోలెడంత ఖర్చు, కట్నకానుకలు, విందుభోజనాలు.. అబ్బో ఇలా చాలానే ఉంటాయి. భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుంటూ గాల్లో తేలిపోతుంటారు వధూవరులు. కానీ ఈ మధ్య పెళ్లి పేరెత్తితే సంతోషం కన్నా భయం, అనుమానాలే ఎక్కువవుతున్నాయి. నిండు నూరేళ్లు కాదు కదా నెల తిరిగేలోపే జీవిత భాగస్వామి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ అందుకు నిలువెత్తు ఉదాహరణ! హత్యోదంతంపై సినిమాఈ హత్య ఉదంతంపై సినిమా రానుందని తెలుస్తోంది. బీటౌన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మేఘాలయ హనీమూన్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాడట! ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడట! తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట! తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.మేఘాలయ హనీమూన్ మర్డర్ కథేంటి?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. బలవంతంగా పెళ్లితమ వర్గానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా పెళ్లి చేస్తే తర్వాత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ బెదిరించినా పేరెంట్స్ లెక్కచేయలేదు. రాజా రఘువంశీతో ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమైన మూడు రోజులకే సోనమ్.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. మేఘాలయలో దాన్ని ఆచరణలో పెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్స్ను మాట్లాడి భర్తను చంపించి, దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించింది. అనుమానం రాకుండా ఉండటం కోసం.. ఏడు జన్మలవరకు మనం ఇలాగే కలిసుండాలి అంటూ రాజా ఫేస్బుక్ అకౌంట్లో తనే స్వయంగా పోస్ట్ పెట్టింది.భర్త అంత్యక్రియల్లో ప్రియుడుఅక్కడి నుంచి ఇండోర్కు పారిపోయింది. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలనుకుంది. కానీ పోలీసులు సోనమ్ను అనుమానించడంతో ఆమె లొంగిపోయింది. ఆమె చాట్స్ చూడగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేలిపోయింది. అయితే రాజ్ కుష్వాహ ఏమీ తెలియనట్లుగా రాజా రఘువంశీ అంత్యక్రియలకు వెళ్లి అతడి తండ్రిని ఓదార్చాడు. హత్యలో తన ప్రమేయం ఉందన్న విషయం బయటపడకుండా ఉండేందుకే అలా నటించాడు. పోలీసులు సోనమ్, రాజ్ కుష్వాహతో పాటు సుపారీ గ్యాంగ్ను సైతం అరెస్టు చేశారు.చదవండి: షాపింగ్మాల్లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే? -
అంద విహీనంగా మారిపోయిన నటి ముఖం
తెరపై కనిపించే నటీనటులు చాలామంది చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. కాకపోతే ఆ విషయాన్ని చెప్పుకొనేందుకు పెద్దగా ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో మాత్రం వాటి గురించి చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్కి చెందిన ఉర్ఫి జావేద్ ముఖం కూడా ఇంతలా ఉబ్బిపోయింది. పెదాలు ఎర్రగా కందిపోయి కనిపించింది. దీంతో ఈమెకి ఏమైంది? ఎందుకిలా మారిపోయిందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ కోసం ప్రయత్నించింది. అయితే అప్పుడు అది వికటించడంతో పెదవుల రూపు మారిపోయి కాస్త ఉబ్బిపోయి కనిపించాయి. ఇప్పటికి అవి సెట్ అయ్యాయని ఉర్ఫి చెప్పుకొచ్చింది. లిప్ ఫిల్లర్స్ విషయంలో తాను కృత్రిమ పద్ధతిని ఉపయోగించి తప్పు చేశానని, అప్పుడు తన రూపు చూసుకుని తాను ఎంతగానో నవ్వుకున్నానని చివరకు తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్)ఇన్నాళ్లకు సదరు లిప్ ఫిల్లర్లని కరిగించుకున్నానని ఉర్ఫి చెప్పింది. అయితే ఎవరూ కూడా తనలా ఈ తప్పు చేయొద్దని, ఒకవేళ లిప్ ఫిల్లింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా అనుభవం ఉండే డాక్టర్ దగ్గరకు మాత్రమే వెళ్లాలని చెబుతూ సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఉర్ఫికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో పెదలు ఉబ్బిపోయి, ముఖంతా ఎర్రగా మారిపోయి కనిపించింది.ఉర్ఫి కెరీర్ విషయానికొస్తే.. హిందీ బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఇది కాకుండా ఎప్పటికప్పుడు విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ, ఆ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసేది. రీసెంట్ టైంలో ఒకటి రెండు ఓటీటీ రియాలిటీ షోల్లోనూ కనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)Uorfi Javed dissolves lip fillers after years, shares painful, swollen aftermath in new video😱😳📸: @urf7i #urfijaved #lipfillersdissolving #painful #buzzzookascrolls pic.twitter.com/0H6QYsdP0l— Buzzzooka Scrolls (@Buzzz_scrolls) July 21, 2025 -
ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు కోపమొచ్చింది. అభిమాని చేసిన ఓ దుందుడుకు చర్యకు తిక్కరేగింది. కోపం అణుచుకోలేక వెంటనే తన అభిమానికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే అక్షయ్ కుమార్ లండన్ వీధుల్లో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనపాటికి తను ప్రశాంతంగా వెళ్తుంటే ఓ అభిమాని అతడిని వెంబడించాడు. అక్షయ్కు కోపమొచ్చిందిహీరో అనుమతి తీసుకోకుండా అక్షయ్ను వీడియో తీశాడు. ఇది గమనించిన అక్షయ్ కుమార్కు కోపమొచ్చింది. వెంటనే అభిమానివైపు నడుచుకుంటూ వచ్చి వీడియో ఎందుకు తీస్తున్నావని తిట్టాడు. వెంటనే కెమెరా ఆఫ్ చేయమంటూ బెదిరించాడు. అభిమాని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా వీడియో తీసిన ఫ్యాన్.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రశాంతంగా బతకనివ్వరా?అయితే ఇందులో మొదట కోప్పడ్డ అక్షయ్.. చివరకు అభిమానికి నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు. నా ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అక్షయ్ నన్ను తాకాడు. అద్భుతమైన అనుభవం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. వాళ్ల బతుకేదో వాళ్లను బతకనివ్వండి. ప్రశాంతంగా బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా వాళ్లకు లేదా? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝙃𝙖𝙧𝙧𝙮𝙮🚀✨ (@iamharryy24) చదవండి: బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప -
బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంటుంది. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి, ప్రాజెక్టుల గురించి ఎన్నో ఊహాగానాలు వస్తుంటాయి. అయితే కొందరు మరీ హద్దు మీరుతూ.. తారలు బతికుండగానే చనిపోయారనే గాసిప్స్ కూడా సృష్టిస్తుంటారు. అయితే ఇలాంటి గాసిప్ తనమీద కూడా వచ్చిందని చెప్తోంది బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).చనిపోయానని పుకారుతాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్ప శిరోద్కర్ మాట్లాడుతూ.. 1995లో నేను రఘువీర్ సినిమా చేశాను. ఆ మూవీ షూటింగ్ కోసం టీమ్ అంతా కులుమనాలీ వెళ్లాం. ఓ పత్రికలో నేను చనిపోయానని వార్త వచ్చిందట! ఆ విషయం నాకు తెలిదు. అప్పుడు మా దగ్గర సెల్ఫోన్స్ లేవు. నేను షూటింగ్ లొకేషన్లో ఉండగా మా నాన్న హోటల్కు పలుమార్లు ఫోన్ చేశాడు. సునీల్ శెట్టితో కలిసి ఓ సీన్లో నటిస్తుంటే అక్కడున్న అందరూ కూడా నేను శిల్పాశెట్టియేనా? లేదా మరో వ్యక్తినా? అన్నట్లు కాస్త విచిత్రంగా చూస్తున్నారు. 25 మిస్డ్ కాల్స్అప్పటికే అందరూ పత్రికలో నా మరణ వార్త చదివేశారు. నేను హోటల్ గదికి వెళ్లేసరికి దాదాపు 25 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. పేపర్లో నేను చనిపోయానన్న వార్త చూసి అమ్మానాన్న చాలా కంగారుపడిపోయారు. అయితే ఈ గాసిప్ను సృష్టించింది బయటవాళ్లు కాదు, సినీ నిర్మాత గుల్షన్ కుమార్ (Gulshan Kumar). అప్పట్లో పీఆర్ స్టంట్లు ఏవీ లేవు. మా మూవీ బజ్ కోసం ఇలా నేను చనిపోయానని కథలు అల్లేశారు. కనీసం అందుకు నా అనుమతి కూడా తీసుకోలేదు. నాకు చెప్పకుండా..అంతా అయిపోయాక అసలు విషయం బయటపెట్టారు. సినిమా వర్కవుట్ అయింది కాబట్టి వాళ్లపై కోపం రాలేదు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసిన శిల్ప శిరోద్కర్ తెలుగులో బ్రహ్మ అనే ఏకైక సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో సుధీర్బాబు 'జటాధర' మూవీలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది.చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్ -
ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఇక లేరు
ఇండస్ట్రీలో మరో విషాదం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర బరోట్(86) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దర్శకుడికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్కి ఝలక్.. ట్వీట్ వైరల్)అమితాబ్ హీరోగా వచ్చిన 'డాన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తీసింది ఈయనే. అలా 'డాన్' దర్శకుడిగా చాలా ఫేమస్ అయిపోయారు. దీని తర్వాత ప్యార్ బరా దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. దర్శకత్వం వహించడానికి ముందు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ తదితర మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్) -
క్యాన్సర్.. బతకడం కష్టమన్నారు.. ఆస్పత్రిపై నుంచి దూకి..
నాకు క్యాన్సర్ అని తెలియగానే నిశ్చేష్టుడినయ్యాను. బతికే అవకాశాలు తక్కువ అని చెప్పడంతో ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను అని చెప్తున్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, యాక్షన్ డైరెక్టర్ శామ్ కౌశల్ (Sham Kaushal). తాజాగా ఓ పాడ్కాస్ట్లో శామ్ కౌశల్ మాట్లాడుతూ.. 2003లో ఓ సర్జరీ చేయించుకున్నాను. ఆ సమయంలో నాకు క్యాన్సర్ ఉందన్న విషయం బయటపడింది. బతకడం కష్టమే అని డాక్టర్స్ చెప్పగానే నాతో ఉన్నవారి ముఖాలు వాడిపోయాయి.చావంటే భయం లేదుహాస్పిటల్లోని మూడో అంతస్తు నుంచి దూకి చనిపోవాలనుకున్నాను. ఎలాగో చావు తప్పదన్నాక ఇంకా దేనికి బతికుండటం? అని భావించాను. కానీ అప్పటికే సర్జరీ జరగడం వల్ల నొప్పితో కదల్లేకయ్యాను. లేచి నడిచేందుకు ఒంట్లో సత్తువ లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. క్యాన్సర్ వల్ల మరణిస్తానని తెలిశాక చావంటే భయం లేకుండా పోయింది. జీవితాన్ని చూసే విధానమే మారిపోయింది. ఏడాది పాటు పలు టెస్టులు, సర్జరీలు చేశారు. ఏదైతే అదయిందని నేను ధైర్యంగా నిలబడ్డాను. పదేళ్ల ఆయుష్షు కోరితే..అదృష్టవశాత్తూ క్యాన్సర్ నా శరీరమంతా వ్యాపించలేదు. అప్పుడు ఆ భగవంతుడిని మరో పదేళ్ల జీవితం ప్రసాదించమని వేడుకున్నాను. కానీ క్యానర్ను జయించి 22 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎంతోమంది మంచివాళ్లను కలిశాను, నా పిల్లలు కెరీర్లో రాణిస్తున్నారు. నేనూ జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాను అని చెప్పుకొచ్చాడు. శామ్ మొదట్లో స్టంట్మ్యాన్గా పని చేశాడు. 1990లో ఇంద్రజలం అనే మలయాళ చిత్రంతో యాక్షన్ డైరెక్టర్గా మారాడు. సినిమాలునాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, భాగ్ మిల్కా భాగ్, పీకే, పద్మావత్, సంజు, సింబా వంటి పలు చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆస్కార్ విన్నింగ్ మూవీ స్లమ్ డాగ్ మిలియనీర్కు సైతం పని చేశాడు. ఆయన కుమారులు విక్కీ కౌశల్, సన్నీ కౌశల్.. ఇద్దరూ బాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు.చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే.. -
గర్భంతో ఉన్నా యాక్షన్ సీన్స్.. మొదటిసారే మిస్క్యారేజ్
పిల్లల కోసం ఉద్యోగాలను త్యాగం చేస్తున్నారు కొందరు మహిళలు. ఏడాది నిండని కూతురు ఉన్నందున సెట్లో ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేయలేనంది దీపికా పదుకొణె. ఈ విషయంలో భేదాభిప్రాయలు రావడంతోనేగా.. స్పిరిట్ నుంచి తప్పుకుంది. అయితే తాను మాత్రం పిల్లల కోసం ఉద్యోగాల్ని పక్కన పెట్టలేనంటోంది బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్.ఊహించలేదుతాజాగా ఓ పాడ్కాస్ట్లో గౌహర్ ఖాన్ (Gauhar Khan) మాట్లాడుతూ.. 36 ఏళ్ల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. ఏడాదికే పిల్లల కోసం ప్లానింగ్ మొదలుపెట్టాం. తల్లినవడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఒకసారి గర్భస్రావం కూడా జరిగింది. దాన్నుంచి కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. ఎందుకంటే అంతా మంచే జరుగుతుంది, నా చేతుల్లోకి చిన్ని బాబు/పాప రానుందన్న సంతోషంతోనే గడిపాను. ఇలా ఓ బిడ్డను కోల్పోవాల్సి వస్తుందని ఊహించం కదా! ఆ బాధ నుంచి అంత సులువుగా బయటకు రాలేకపోయాను.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?ఆ తర్వాతే నాకు కొడుకు జెహాన్ పుట్టాడు. ఇప్పుడు నేను 40 దాటేశాను. ఇప్పుడు రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ కనలేను. నా ఫస్ట్ , సెకండ్ ప్రెగ్నెన్సీల సమయంలో నేను షూటింగ్కు వెళ్లేదాన్ని. యాక్షన్ రోల్లో నటించాను. ఇప్పుడు మూడో ప్రెగ్నెన్సీ సమయంలో ఫౌజీ 2 సీరియల్లో బాంబ్ బ్లాస్టింగ్ సీన్లో యాక్ట్ చేశాను. ప్రాజెక్టు ఒప్పుకున్నాక దాన్ని అర్ధాంతరంగా వదిలేయలేను. నటిగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అదేంటో కానీ, గర్భం దాల్చినప్పుడే క్లిష్టమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తోంది అని గౌహర్ చెప్పుకొచ్చింది. ఆ పాటతో టాలీవుడ్లో ఫేమస్గౌహర్.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన జైద్ దర్బార్ను 2020లో పెళ్లి చేసుకుంది. 2023లో వీరికి బాబు పుట్టాడు. త్వరలోనే మరోసారి తల్లి కాబోతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్లో నా పేరే కాంచనమాల అనే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. బాలీవుడ్లో గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాల్లో నటించింది. తాండవ్ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగానూ నిలిచింది.చదవండి: పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు -
హీరోయిన్ ఫామ్హౌస్లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం!
బాలీవుడ్ హీరోయిన్ సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani) ఫామ్హౌస్లో దొంగతనం జరిగింది. మహారాష్ట్ర.. పుణెలోని మావల్లో ఉన్న ఫామ్ హౌస్కు నాలుగు నెలల తర్వాత వెళ్లిన సంగీత.. అక్కడి పరిస్థితి చూసి షాకైంది. తన ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసమవడాన్ని చూసి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వస్తువులు ధ్వంసంతన ఫామ్హౌస్లోకి ఎవరో అక్రమంగా చొరబడి కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారని, మరికొన్నింటిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పై అంతస్తులో బెడ్స్, ఫ్రిజ్ నాశనం చేశారని, విలువైన వస్తువులు కనిపించడం లేదని తెలిపింది. సీసీటీవీని కూడా ధ్వంసం చేశారని వాపోయింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతకాలంగా ఫామ్హౌస్కు రాలేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పర్సనల్ లైఫ్సంగీత.. త్రిదేవ్, ఇన్స్పెక్టర్ ధనుష్, యోధ, ఇజ్జత్, శివరామ్, లక్ష్మణరేఖ, విష్ణుదేవ.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఇటీవలే ఆమె 65వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బాంద్రాలోని తన నివాసంలో జరిగిన ఈ బర్త్డే పార్టీకి సంగీత మాజీ ప్రియుడు, ప్రస్తుత స్నేహితుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు. నిజానికి సంగీత, సల్మాన్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని పత్రికలు కూడా అచ్చువేయించుకున్నారు. కానీ పెళ్లి పీటలు ఎక్కకముందే ఆ వివాహం రద్దయింది. అనంతరం సంగీత 1996లో మహ్మద్ అజారుద్దీన్ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: గుడి ముందు భిక్షాటన చేసిన ప్రముఖ నటి నళిని -
గాయపడిన షారుఖ్ ఖాన్.. అమెరికాకు ప్రయాణం!
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గాయపడ్డారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా 'కింగ్' షూటింగ్లో ఆయన ప్రమాదానికి గురైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో కింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం అతిపెద్ద సెట్ వేశారు. యాక్షన్ సీన్ చిత్రీకరణలో భాగంగానే షారుఖ్ గాయపడ్డారని చెబుతున్నారు. అయతే, గాయం గురించి ఖచ్చితమైన వివరాలను అధికారికంగా వెళ్లడించలేదు. కానీ, షారుఖ్ తన టీమ్తో కలిసి అత్యవసర వైద్య సహాయం కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కండరాలకు తీవ్రంగా గాయం అయినట్లు సమాచారం. అయతే, అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. షారుఖ్ గతంలోనే కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డారు. అందుకోసం చికిత్స కూడా తీసుకున్నారు.2023లో పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. 2024లో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, 'కింగ్' సినిమా ప్రకటించి ఆయన మళ్లీ బిజీ అయ్యారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. గతంలో వారిద్దరూ పఠాన్తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. -
రియల్ హీరో అంటే మీరే!
వెండితెరపై మంచి పనులు చేసి, హీరో అనిపించుకుంటారు స్టార్స్. అది ‘రీల్ హీరో’. అదే తెర వెనుక మంచి పనులు చేస్తే ‘రియల్ హీరో’ అనిపించుకుంటారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ని అందరూ ‘రియల్ హీరో అంటే మీరే’ అంటున్నారు. మరి... 650 మంది స్టంట్మెన్, ఉమెన్కి బీమా చేయిస్తే ఆ మాత్రం అభినందించాల్సిందే కదా. ఇటీవల తమిళ చిత్రం ‘వేట్టువం’ షూటింగ్లో స్టంట్ మేన్ రాజు గుండెపోటుతో మరణించారు. ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కారుతో స్టంట్స్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.మామూలుగా ఫైట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు కూడా ప్రమాదాలకు గురై, స్టంట్ వర్కర్స్ మరణిస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అక్షయ్ కుమార్ తాజాగా 650 మంది స్టంట్ మెన్, ఉమెన్కి బీమా చేయించారు. ఈ విషయం గురించి బాలీవుడ్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ – ‘‘మీరు (అక్షయ్ని ఉద్దేశించి) చేసిన ఈ మంచి పని వల్ల బాలీవుడ్లో 650 మంది స్టంట్ వర్కర్స్ బీమా పరిధిలోకి వచ్చారు.ఈ ఇన్సూరెన్స్ పాలసీలో రూ. 5 లక్షల నుంచి 5.50 లక్షల వరకూ నగదురహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంది. అది షూటింగ్ సెట్లో అయినా విడిగా అయినా. మీకెలా ధన్యవాదాలో చె΄్పాలో తెలియడంలేదు అక్షయ్ సార్’’ అని పేర్కొన్నారు. -
హీరోయిన్లు ఎక్కువసేపు కనిపించొద్దట, ఐటం సాంగ్ చాలట! హీరోలపై ఫైర్
హీరోలు వారి స్వార్థం కోసం సంగీతాన్ని చంపేస్తున్నారు అంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి (Kunal Kohli). ఐటం సాంగ్స్ ఉంటే చాలని ఫీలవుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కథానాయకుల తీరును ఎండగట్టాడు. అదే సమయంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా డెబ్యూ సినిమా 'సైయారా'కి పాటల వల్లే మంచి బజ్ వస్తుండటంపై ప్రశంసలు కురిపించాడు.ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టా?'ఈ రోజుల్లో హీరోయిన్ల పాత్రలను తగ్గించడం కోసం హీరోలు సంగీతాన్ని చంపేస్తున్నారు. కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే హిట్టు పాటలని ఫీలవుతున్నారు. ఇలాంటి తరుణంలో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. నేడు (జూలై 18న సైయారా మూవీ రిలీజ్) ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక గొప్ప రోజు. మంచి సినిమాలు, వినసొందపైన సంగీతం తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఆల్బమ్స్కు మంచి రోజులు రానున్నాయ్.హీరోలకు హక్కు లేదుసినిమా గురించి, అందులోని పాటల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సింది హీరోలు, వారి మేనేజర్లు కాదు.. కేవలం దర్శకనిర్మాతలకు మాత్రమే ఆ హక్కు ఉంది! సరికొత్త మార్పునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అన్నాడు. బాలీవుడ్లో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన కునాల్ తెలుగులో నెక్స్ట్ ఏంటి? మూవీ తీశాడు.పాటలతోనే మంచి బజ్సైయారా మూవీ విషయానికి వస్తే ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. తనిష్క్ బగ్చి, అర్స్లన్ అబ్దుల్లా, ఫహీం నిజామి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ మూవీకి విపరీతమైన బజ్ తీసుకొచ్చింది. సంగీతంతోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. All have had HIT music. Today’s heroes have killed music by wanting to reduce the role of heroines and thinking that item songs are hit songs. Tmrw is a legendary day in indian cinema. The change has begun. Good films. Good music are back. Albums. Complete albums. Filmmakers not… https://t.co/vyPNqyioZ2— kunal kohli (@kunalkohli) July 17, 2025 చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే? -
హీరామండి నటికి అరుదైన గౌరవం.. అదేంటంటే?
చాలా ఏళ్ల తర్వాత లస్ట్ స్టోరీస్తో గ్రాండ్గా రీ ఎంట్రీ సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. యూకేకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ను అందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మనీషా కొయిరాలా. తాను డాక్టరేట్ స్వీకరించిన వీడియోను షేర్ చేసింది. తన జీవితంలో సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా ఈ స్థానానికి చేరుకోలేదని చెప్పింది.కాగా.. నటి మనీషా కొయిరాలా ఇంగ్లాండ్లోని బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకుంది. ఈ గుర్తింపు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత ఎక్కువ అని తెలిపింది. నా కృషి, వైఫల్యాలను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని పేర్కొంది. మన ప్రయాణం ఎక్కడ మొదలైనా.. చివరికీ ఎక్కడికి చేరుకున్నామనేది ముఖ్యమని మనీషా తన పోస్ట్లో ప్రస్తావించింది. తనను గుర్తించిన బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ధన్యవాదాలు అంటూ పోస్టే చేసింది.మనీషా తన ఇన్స్టాలో రాస్తూ.. 'బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యూకే సిటీ ఆఫ్ కల్చర్-2025 ఏడాదిలో అందుకోవడం మరో విశేషం. క్రియేటివ్ డైరెక్టర్, ప్రతిభావంతులైన డేనియల్ లీతో కలిసి ఈ గుర్తింపును పంచుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. 2025కు అభినందనలు.. నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది'పోస్ట్ చేసింది.ఇక సినిమాల విషయానికొస్తే మనీషా కొయిరాలా సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1942: ఎ లవ్ స్టోరీ , బాంబే , అగ్ని సాక్షి , గుప్త్: ది హిడెన్ ట్రూత్ , దిల్ సే, కంపెనీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన మనీషా చాలా కాలం తర్వాత లస్ట్ స్టోరీస్ (2018) తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (2024) లో నటించింది. ఇందులో మల్లికాజాన్ అనే వేశ్య పాత్రను పోషించింది. విభజనకు ముందు కాలంలో లాహోర్లోని హీరా మండిలో నవాబులు, బ్రిటిష్ అధికారులతో వేశ్యల జీవితాలు ఎలా ఉన్నాయనే కోణంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manisha Koirala (@m_koirala) -
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
నమ్రత- శిల్ప శిరోద్కర్.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్గా రాణించినవారే! హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన నమ్రత 'వంశీ', 'అంజి' చిత్రాలతో తెలుగులో హీరోయిన్గా అలరించింది. సూపర్స్టార్ మహేశ్బాబును పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. శిల్ప శిరోద్కర్ కూడా అంతే! బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'బ్రహ్మ' అనే ఏకైక చిత్రంలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత వెండితెరకు టాటా చెప్పేసి న్యూజిలాండ్లో సెటిలైంది. 2010 తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది.ఆ ఆలోచనే లేదుఅందుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar) మాట్లాడుతూ.. సినిమా అవకాశాల కోసం నేను భారత్కు తిరిగిరాలేదు. అప్పుడు నా మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్నాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కనీసం అక్క (నమ్రత)కు దగ్గరగానైనా ఉండొచ్చనే న్యూజిలాండ్ నుంచి వచ్చేశాను. మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. 2010లో ఇక్కడికి వచ్చిన నేను ఎవరినీ పని కోసం అర్థించలేదు, ఎటువంటి ఫోటోషూట్లూ చేయలేదు. పైగా ఈ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) స్టంట్ల గురించి ఏమాత్రం అవగాహన లేదు. తట్టుకోలేకపోయా..నా మనసులో ఉన్నదల్లా ఒక్కటే.. నేను ఎక్కడికీ వెళ్లను, మా అక్కకు వీలైనంత దగ్గరగా ఉండాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. నిజానికి అప్పుడు అపరేశ్ (శిల్ప భర్త) ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అనుష్క (కూతురు) స్కూలుకు వెళ్తోంది, తనకంటూ స్నేహితులను సంపాదించుకుంది. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అమ్మానాన్న ఒకరితర్వాత ఒకరు తక్కువ కాల వ్యవధిలోనే చనిపోయారు. నేను తట్టుకోలేకపోయాను. ఎప్పుడూ ఏడుస్తూనే..ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కాదు. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. ఒక రోబోలా తయారయ్యాను. బరువు పెరిగాను, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఎక్కడికీ వెళ్లేదాన్ని కాదు, ఏం చేసేదాన్నీ కాదు. కేవలం నా కూతుర్ని స్కూల్లో దింపిరావడం, స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడం.. ఈ ఒక్కటే చేసేదాన్ని. ఇంట్లో ఎవరితోనూ సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఒక్కోసారి నా తలను గోడకేసి బాదుకోవాలనిపించేది. జీవితంపై విరక్తి వచ్చింది.కూతుర్ని కొట్టా..డాక్టర్ను కలిశా.. యాంటీ డిప్రెసంట్స్ మందులు వాడాను. భర్తపై, కూతురిపై అరిచేదాన్ని.. ఒక్కోసారి ఆవేశంతో కూతుర్ని కొట్టేదాన్ని కూడా! కానీ, మా అక్కతో మాత్రం బాగా మాట్లాడేదాన్ని. తను మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకునేది. తనకు దగ్గరగా ఉండాలనుకున్నాను. ఏదేమైనా ఇండియాకు వచ్చేయాలనుకున్నాను, వచ్చేశాను. నాకోసం నా భర్త న్యూజిలాండ్లో మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి వచ్చాడు అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: 'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే? -
బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు
డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్ రోడ్, ఈ రోడ్ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విశాల్ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్ క్లబ్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.‘ముంబై, మంచ్ అండ్ మార్కెట్ విత్ చింతన్ వాసని‘ పేరిట ఇన్స్ట్రాగామ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్ ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్ రిచ్ల‘ డొమైన్గా పెడ్డర్ రోడ్ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్ రోడ్ సొసైటీలు తరచుగా బాలీవుడ్ నటులను తమకు పెద్ద న్యూసెన్స్లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్డన్ క్లబ్ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో పేరొందిన ‘బిగ్ బుల్‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్డన్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్ రోడ్లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్ రిచ్‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రా–ఎక్స్క్లూజివ్ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్ రోడ్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. View this post on Instagram A post shared by Chintan Vasani️ (@chintanvasani) -
నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
సారా అలీ ఖాన్ (Sara Ali Khan) సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సారా తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకుంది. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్లో పట్టా పొందింది. ఆతరువాత నటనా రంగంలోకి అడుగు పెట్టి బస్టర్ హిట్స్ తో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 'కేదార్నాథ్' 'అత్రంగి రే', ఇంకా వెబ్సిరీస్లతో అదరగొట్టేసింది. సారా అలీ ఖాన్ కొత్త చిత్రం మెట్రో... ఇన్ దినోం మంచి పేరే తెచ్చుకుంది. అయితే సినిమాల్లోకి రావడానికి ముందు 96 కిలోల బరువు, PCOS సమస్యలతో బాధపడిన డైట్, వర్కౌట్స్తో 47 కిలోలకి తగ్గింది. ఈ జర్నీకి సంబంధించిన వివరాలు తాజాగా పంచుకుంది.సారా అలీ ఖాన్ కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా 91 కిలోల నుండి 46 కిలోలకు తన బరువును తగ్గించుకుంది. ముఖ్యంగానో-షుగర్ ,నో-మిల్క్ డైట్ ప్లస్ కార్డియోతో తాను 45 కిలోల బరువు తగ్గానని వెల్లడించింది. సినిమాలు, నటన పట్ల ప్రేమతో నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో సారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకు సహాయపడే కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంది. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా PCOS ఉన్న అమ్మాయిలు- హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే, అధిక బరువుతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో హార్మోన్ల కారణంగా బరువు తగ్గడం చాలా కష్టతరం అయినప్పటికీ సారాదృఢ సంకల్పం, అంకితభావంతో కృషి చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం, కార్డియో, కఠిన వ్యాయామాల మిశ్రమంతో దాదాపు 45 కిలోల బరువు తగ్గింది. అలా 96 కిలోల నుండి 51 కిలోలకు చేరుకోవడం విశేషం.సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ జర్నీరణవీర్ అల్లాబాడియా అకా బీర్బైసెప్స్తో జరిగిన ఇంటర్వ్యూలో, సారా అలీ ఖాన్ తన బరువు తగ్గడం గురించి తెలిపింది. సినిమాలలో నటించాలంటే దర్శకుడు కరణ్ జోహార్ 'సగం' బరువు తగ్గించమని కోరాడని అదే తనకు ప్రేరణ అని తెలిపింది. అమెరికాలో బాగా జంక్ ఫుడ్కు అలవాటు పడిన సారా షుగర్, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన స్నాక్స్ పూర్తిగా దూరం పెట్టేసింది. ఇంటి,హెల్తీ ఫుడ్కే ప్రాధాన్యత ఇచ్చింది. చక్కెర, పాలు, కార్బోహైడ్రేట్లు లేని ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేది. రోజంతా హైడ్రేటెడ్గా ఉండేలా నీళ్లు, ముఖ్యంగా జీలకర్ర, కొత్తిమీర నీళ్లు వంటివి తాగేది.వ్యాయామాల్ని కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది. ఇందులో యోగా ,డ్యాన్స్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఆమె గంటకుపై ట్రైనింగ్ తీసుకునేది. ఒక విధంగా చెప్పాలంటే వ్యాయామాన్ని ఒక పనిగా కాకుండా అదే రోజువారీ ప్రాధాన్యతగా మార్చుకుంది. ఇంత బరువు తగ్గినా ఇప్పటికీ తన బరువుతో సమస్యలను ఎదుర్కొంటున్నానని చెప్పింది. బాడీ పెరుగుతోంది. ముఖం పెద్దగా మారింది.. ఏమి తింటున్నానో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువుతో అదుపులో ఉంచుకోవడం ఉండటం తనకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించి బరువు తగ్గడం కెరీర్ కోసం మాత్రమేకాదు, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం కూడా. PCOSను తగ్గించుకోవడం, తన ఆత్మవిశ్వాసానికి, జీవితంలో స్పష్టత రావడానికి బరువు తగ్గడం అనేది చాలా సాయపడిందని వెల్లడించింది. -
అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. 650 కుటుంబాలకు సాయం
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. దేశవ్యాప్తంగా 650 మంది స్టంట్మ్యాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్లో స్టంట్మ్యాన్ రాజు (52) మృతి చెందిన విషయం తెలిసిందే. దర్శకుడు పా.రంజిత్ (pa ranjith) తెరకెక్కిస్తున్న వేట్టువం సినిమాలో భాగంగా కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటు రావడం వల్ల మరణించారు. ఈ వార్త తెలుసుకున్న తర్వాత తాను చలించిపోయినట్లు నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు.సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ స్టంట్స్ కోసం స్టంట్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అక్షయ్ అన్నారు. వారి కష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. 'ఒక్కోసారి ప్రమాదం జరిగితే వారి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది. అందువల్ల వారు వైద్య బీమాను భరించలేరు. ' అని ఆయన అన్నారు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్ల ఆరోగ్య బీమాను చెల్లించాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నారు. ఆరోగ్య కవరేజ్తో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి కొంత డబ్బు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుందని చెప్పారు. -
థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు
భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలెన్నో.. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనను నానామాటలు అన్నారని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal).ఎందుకీ సినిమా చేశావ్?తాజాగా అలీ ఫజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie) నేనింతవరకు చూడలేదు. కానీ చాలామంది ఈ మూవీ ఎందుకు చేశావని తిట్టారు. దానికి ఒకే ఒక్క కారణం మణిరత్నం సర్. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మూవీలో నటించాను. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దాంతో నా స్నేహితులు, అభిమానులు ఎందుకీ సినిమా చేశావ్? అవసరమా నీకిది? అని కోప్పడ్డారు. వారందరికీ మరేం పర్వాలేదని బదులిచ్చాను.అది ముగిసిన చాప్టర్మణిరత్నం సర్ విజన్ను ప్రశ్నించేంత పెద్దవాడిని కాదు. వారు సినిమా కోసం కష్టపడ్డారు. కానీ షూటింగ్ జరిగేకొద్దీ కథలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయినా థగ్ లైఫ్ చాప్టర్ ముగిసిపోయింది. భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా మణిరత్నం డైరెక్షన్లో నటిస్తాను అని అలీ ఫజల్ చెప్పుకొచ్చాడు.థగ్ లైఫ్మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం థగ్ లైఫ్. గతంలో వీరి కాంబినేషన్లో నాయకుడు మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తరహాలోనే థగ్ లైఫ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో! -
మళ్లీ వచ్చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి'.. అమితాబ్ పారితోషికం ఎంతంటే?
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి 17వ సీజన్తో అలరించనున్నాడు. ఈ షో ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో ఈసారి కూడా అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు.25 ఏళ్ల క్రితం మొదలు..ఈ క్రమంలో బిగ్బీ పారితోషికం ఎంత ఉండొచ్చు? అని నెటిన్లు చర్చించుకుంటున్నారు. బీటౌన్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమితాబ్.. ఒక్క ఎపిసోడ్కు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట! 25 ఏళ్ల క్రితం కౌన్ బనేగా కరోడ్పతి షో (Kaun Banega Crorepati Show) మొదలైంది. బిగ్బీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారు రూ.1 కోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి సెలబ్రిటీలను కాకుండా సామాన్యులనే పార్టిసిపెంట్లుగా ఎంపిక చేసుకుంటారు. అందుకే ఈ షోకు ఎక్కువ క్రేజ్!తెలుగులోనూ..బిగ్బీ హోస్టింగ్, కోటి రూపాయల ప్రైజ్మనీతో.. రియాలిటీ షోలలోనే కేబీసీ సరికొత్త సంచలనంగా నిలిచింది. ఇదే షో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట ప్రారంభమైంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగో సీజన్ చిరంజీవి, ఐదో సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. తర్వాతేమైందో కానీ తెలుగులో ఈ షోను కొనసాగించలేదు. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సెక్షన్ 84 మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు బిగ్బీ చేతిలో.. బ్రహ్మాస్త్ర 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి: నా భార్య గర్భం దాల్చినా.. అందుకే పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్ -
నా భార్య గర్భం దాల్చింది.. అయినా పిల్లలు లేరు: అనుపమ్ ఖేర్
కెరీర్ పీక్లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆరాటపడ్డాడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని తాపత్రయపడ్డాడు. మంచి కథలను ఎంపిక చేసుకుని నటించేవాడు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు. అనుపమ్ ఖేర్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగా కొంతకాలానికే విడిపోయారు. 1985లో నటి కిరణ్ ఖేర్ (Kirron Kher)ను పెళ్లాడాడు. కిరణ్కు కూడా ఇది రెండో పెళ్లి! కొడుకున్న నటితో రెండో పెళ్లిగతంలో ఆమె వ్యాపారవేత్త గౌతమ్ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్ను పెళ్లాడింది. అయితే అనుపమ్- కిరణ్ జంటకు సంతానం లేదు. గతంలో ఈ విషయాన్ని తలుచుకుని బాధపడ్డాడు నటుడు. ఎంతైనా ఓ కొడుకు ఉంటే, వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరేలా ఉండేదని ఫీలయ్యాడు. గర్భం దాల్చినా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి గుండెలోని వెలితిని వెల్లడించాడు. నేను స్థాపించిన స్వచ్ఛంద సంస్థలో ఎంతోమంది పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సే నా సమ్థింగ్ టు అనుపమ్ అంకుల్ అని వారితో ఓ షో చేసేవాడిని. ఇది చిన్నారుల షో! కన్నకొడుకు లేనందుకు ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. మా పెళ్లయిన మొదట్లో కిరణ్ ప్రెగ్నెంట్ అవలేదు. తీరా గర్భం దాల్చినప్పుడు లోపల శిశువు ఎదుగుదల సరిగా లేదు. అప్పుడేదీ మిస్ అవలేదునేను కెరీర్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అయినా నాకు సికిందర్ చాలు. కిరణ్ను పెళ్లి చేసుకున్నప్పుడు అతడికి నాలుగేళ్లు. తను నా జీవితంలోకి వచ్చాక నేనేదీ మిస్ అవుతున్నట్లు అనుకోలేదు. 60 దాటాక మాత్రమే నాకంటూ కన్న కొడుకుంటే బాగుండని కొన్నిసార్లు అనిపించింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ కీలక పాత్రలో నటించిన తన్వి ద గ్రేట్ మూవీ జూలై 18న విడుదల కానుంది. అలాగే హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది.చదవండి: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. రాజమౌళి బెస్ట్ ఫిల్మ్ ఇదేనట! -
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)
-
కౌంట్ డౌన్ స్టార్ట్
‘‘వెండితెరపై యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 రోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసానికి ‘వార్ 2’’ సిద్ధం అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్గా విడుదల కానుంది.‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా తాజాగా ఓపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీపాత్రల్ని చూపించేలా డిజైన్ చేశారు. ‘‘యాక్షన్ ఓరియంటెడ్ స్పై డ్రామాగా రూపొందిన చిత్రం ‘వార్ 2’’ అని చిత్రబృందం పేర్కొంది. -
శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే?
సినిమాను విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. బాల శూర్పణఖగా..రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ఎవరీ దిశిత సెగల్?నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Dishita Sehgal🧿 (@cutiepiedishita) చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్ -
స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు
బాలీవుడ్లో మరో జంట గుడ్ న్యూస్ చెప్పేశారు. తెలుగులో 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాల్లో హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి ఆడపిల్ల పుట్టింది. మంగళవారం రాత్రి బిడ్డకు జన్మనివ్వగా.. బుధవారం కియారా-సిద్ధార్థ్ జంట తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. ఇప్పుడు అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ పరిచయమయ్యారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2022లో హీరో రణ్బీర్ కపూర్ని పెళ్లి చేసుకోగా అదే ఏడాది కూతురు రహాకి జన్మనిచ్చింది. కూతురితో ఆలియా ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూనే ఉంటుంది. ఈమె కూతురికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.వరుణ్ ధావన్ విషయానికొస్తే నటాషా దలాల్ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్లో ఇతడికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా కూతురే పుట్టంది. దీంతో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'లో హీరోహీరోయిన్లు అయిన ముగ్గురికీ ఆడపిల్లనే పుట్టిందని నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది: నాగవంశీ) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
వాణీ కపూర్ ‘మండల మర్డర్స్’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
ఆస్పత్రిలో పంచాయత్ వెబ్ సిరీస్ నటుడు.. జీవితం చాలా చిన్నదంటూ పోస్ట్!
పంచాయత్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జీవితం చాలా చిన్నది అంటూ ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.‘మీర్జాపూర్ వెబ్సిరీస్తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చిన ఆసిఫ్ ఖాన్ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పంచాయత్, పాతాళ్ లోక్ వంటి వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా రెడీ, టాయిలెట్, అగ్నిపథ్, పాగ్లైట్, కాకుడా హిందీ సినిమాల్లో నటించారు. అయితే ఆసిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం అయితే గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బాగానే ఉన్నారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడని తెలుస్తోంది.ఆసిఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేస్తూ.. "గత 36 గంటలుగా దీన్ని చూసిన తర్వాత జీవితం చిన్నది. ఏ రోజును తేలికగా తీసుకోకండి, ప్రతిదీ ఒక్క క్షణంలో మారవచ్చు., మీ దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మీకు ఎవరు ఎక్కువ ముఖ్యమైనవారో గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వారిని గౌరవించండి. జీవితం ఒక బహుమతి' అని రాసుకొచ్చారు. కాగా.. పంచాయత్' వెబ్ సిరీస్లో ఆసిఫ్ ఖాన్.. గణేష్ పాత్రను పోషించాడు. -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు మరణించగా.. ఆ తర్వాత మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా కన్నుమూశారు. ఇవాళ మరో ప్రముఖ నటుడు మృతి చెందారు. బాలీవుడ్ నిర్మాత అయిన ధీరజ్ కుమార్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.కాగా.. ధీరజ్ కుమార్ 1965లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తన కెరీర్లో సినిమాలతో పాటు సీరియల్స్లోనూ నటించారు. 1970- 1984 మధ్య దాదాపు 21 పంజాబీ చిత్రాలలో నటించాడు. 'ఓం నమః శివాయ్' వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా 'స్వామి', 'హీరా పన్నా' 'రాతోన్ కా రాజా' వంటి లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆ తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ (1974), సర్గం (1979), క్రాంతి (1981) వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ధీరజ్ కుమార్ కొనసాగారు. ధీరజ్ కుమార్ మరణ వార్తను ధృవీకరించిన ఆయన కుటుంబం.. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటివద్దకు తరలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విలే పార్లే వెస్ట్లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
నటిపై దారుణ ట్రోల్స్.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం!
బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్స్పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ఈ ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. ఈ రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ఉద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. -
ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా చేశా.. కానీ ఒక్కరోజు ముందే..!
ప్రముఖ బిగ్బాస్ బ్యూటీ, బుల్లితెర నటి సంభావన సేత్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. 2016లో అవినాశ్ ద్వివేదిని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. గతేడాది ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చగా.. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటనను వివరించింది.గతేడాది డిసెంబర్లో జరిగిన తనకు గర్భస్రావమైందని సంభావన సేత్ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అంతా బాగానే ఉందని వైద్యుడు మాకు హామీ ఇస్తూనే ఉన్నాడని తెలిపింది. కానీ ఆ తర్వాత గర్భంలో తన బిడ్డ హృదయ స్పందన 15 రోజుల ముందే ఆగిపోయిందని తాను గుర్తించానని వెల్లడించింది. మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాలని ప్రీ-మెటర్నిటీ షూట్ కూడా నిర్వహించామని సంభావన పేర్కొంది. ఈ సంతోషకర విషయాన్ని చెప్పేందుకు ఒక రోజు ముందే తనకు బ్లీడింగ్ మొదలైందని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.అయితే దాదాపు 15 రోజుల ముందే అనారోగ్యంతో ఉన్నానని వైద్యుడికి సమాచారం ఇచ్చా.. కానీ నాకు ఆర్థరైటిస్ సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థరైటిస్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్లగా అలాంటిదేం లేదని చెప్పారు.. ఇది గర్భస్రావానికి సంకేతమని డాక్టర్ అన్నారు. కానీ మేము సంప్రదించిన డాక్టర్ మాత్రం ఎలాంటి టెస్టులు చేయకుండా అంతా నార్మల్గానే ఉందని చెప్పారని గుర్తు చేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తనకు గర్భస్రావం అయిందని తెలుసొచ్చిందని సంభావన వివరించింది. అంతేకాకుండా మీకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ తనదే తప్పు అన్నట్లుగా మాట్లాడిందని తన బాధను వ్యక్తం చేసింది -
లార్డ్స్లో లవ్ బర్డ్స్.. బాయ్ఫ్రెండ్తో ఆదిపురుష్ భామ సందడి!
ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ ప్రస్తుతం లండన్లో వాలిపోయింది. ఇంగ్లాండ్లో జరుగుతున్న టీమిండియా మ్యాచ్లో తళుక్కున మెరిసింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియా కూడా కనిపించారు. ఇద్దరు జంటగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.కృతి-కబీర్ డేటింగ్ రూమర్స్అయితే ఈ జంట ఇలా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. అప్పట్లో వీరిద్దరు కలిసి వచ్చిన ఓ వీడియో నెట్టంట వైరలైంది. ఈ పెళ్లిలో కృతి సనన్- కబీర్ చాలా సన్నిహితంగా కనిపించారు. లండన్కు చెందిన వ్యాపారవేత్త అయినా కబీర్తో కలిసి చాలాసార్లు విహారయాత్రల్లోనూ కృతి కనిపించింది. అయితే వీరిద్దరికీ దాదాపు ఎనిమిదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఇదే మ్యాచ్లో పలువురు బాలీవుడ్ తారలు కూడా హాజరై సందడి చేశారు. హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా సైతం లార్డ్స్ టెస్ట్ మ్యాచ్కు హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మ్యాచ్ను వీక్షించారు.Kriti Sanon at the Lord's. #AkshayKumar sabke sb pauch gye 😐 waha lanka lagi hui hai Jadeja 🥳 khel jao #INDvsENG #JHOPE #TestCricket #INDVsENGLive pic.twitter.com/umWT58y0DG— Karan Visible (@Visibleindustry) July 14, 2025 -
బాలీవుడ్కు వస్తానంటున్న స్క్విడ్ గేమ్ హీరో
ఛాన్స్ ఇస్తే ఇండియన్ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్ గేమ్ హీరో లీ జంగ్ జే (Lee Jung Jae). నెట్ఫ్లిక్స్ బ్లాక్బస్టర్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు లీ జంగ్ జే. ప్లేయర్ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్ జే భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!సినిమా- సిరీస్దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్ జే.. ఎన్ ఎఫైర్, సిటీ ఆఫ్ ద రైజింగ్ సన్, ఓ బ్రదర్స్, ఓవర్ ద రైన్బో, లాస్ట్ ప్రజెంట్, బిగ్ మ్యాచ్, ద ఫేస్ రీడర్, డెలివర్ అజ్ ఫ్రమ్ ఈవిల్ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.చదవండి: 'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా! -
అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) యూట్యూబ్లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?(ఇదీ చదవండి: రేణు దేశాయ్కు సర్జరీ.. అసలేమైంది?) View this post on Instagram A post shared by Ashish Chanchlani (@ashishchanchlani)