breaking news
Bollywood
-
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్ -
ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పిన కరీనా కపూర్
ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 అయినప్పటికీ వారం రోజుల ముందే సందడి మొదలవుతుంది. రోజ్డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే.. అంటూ ఫిబ్రవరి 7 నుంచే రోజుకో రకమైన సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. ఈ క్రమంలో బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తమలో ఎవరు ముందుకుగా ప్రపోజ్ చేశారో వెల్లడించారు.నగలు బహుమతివీరిద్దరూ జంటగా వోగ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కరీనా కపూర్ మాట్లాడుతూ నా బర్త్డే, పెళ్లిరోజుకు సైఫ్ జ్యువెలరీ గిఫ్ట్గా ఇస్తుంటాడు అంది. ఇంతలో సైఫ్ కలగజేసుకుంటూ ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు కూడా తనకు బహుమతులిస్తుంటాను అని చెప్పాడు.నాకైతే గుర్తు లేదుఐ లవ్యూ ఎవరు ముందుగా చెప్పారన్న ప్రశ్నకు.. కరీనా అది నేనే అయ్యుంటుంది. అతడు నన్ను ఇబ్బంది పెట్టకూడదనే చూస్తాడు. కాబట్టి నేనే సాహసం చేసి చెప్పుంటాను అంది. అందుకు సైఫ్.. ఇది నిజంగా బాగుంది, నాకైతే ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న విషయం అసలు గుర్తేలేదు అన్నాడు.పెళ్లిసైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2008లో వచ్చిన తషాన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారులు తైమూర్, జే సంతానం. కాగా సైఫ్ అలీ ఖాన్కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో సైఫ్.. అమృత సింగ్ను పెళ్లి చేసుకోగా వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఈ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2004లో విడిపోయారు.చదవండి: అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న హీరోలు -
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది. దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ హీరో
'హోంబౌండ్' సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. నవరోజ్ అపార్ట్మెంట్లోని 14వ నెంబర్ ఫ్లాట్ను తన సొంతం చేసుకున్నాడు. దీని విలువ రూ.29.37 కోట్లు అని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కింద అదనంగా రూ.1.76 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.సినిమాఇషాన్ ఖట్టర్ చిన్న వయసులోనే ఇల్లు సొంతం చేసుకోవడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- రాజేశ్ ఖట్టర్ ఇద్దరూ కూడా యాక్టర్సే కావడం విశేషం! ఇషాన్ ఖట్టర్.. గతంలో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశాడు. బియాండ్ ద క్లౌడ్స్, ధడక్, ఖాలీ పీలి ఫోన్ బూత్, పిప్పా వంటి పలు హిందీ సినిమాలు నటించాడు.ఆస్కార్ రేసు నుంచి అవుట్గతేడాది రిలీజైన హోంబౌండ్ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సత్తా చాటింది. అంతేకాదు ఆస్కార్ రేసులో అడుగుపెట్టి అంచనాలు పెంచేసింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి హోంబౌండ్ మూవీ అధికారికంగా ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 15 సినిమాలను షార్ట్ లిస్ట్ చేయగా అందులో స్థానం సంపాదించుకుంది. జనవరి 22న మరోసారి షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మాత్రం హోంబౌండ్ ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో ఆస్కార్ నుంచి నిరాశగా వెనుదిరిగింది.చదవండి: తెలుగులో ఏకైక సినిమా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? -
తెలుగులో ఏకైక మూవీ.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోయిన్గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడం సహజం. కథానాయికగా అలరించినవారే తర్వాత అమ్మ, అత్త, వదిన పాత్రల్లో అలరిస్తుంటారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి వెండితెరకు దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటారు. నటి డాలీ మిన్హాస్ మొదటి కోవకు చెందినది. నేడు (ఫిబ్రవరి 8న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై ఈ ప్రత్యేక కథనం..మోడలింగ్ నుంచి సినిమాలవైపుడాలీ మిన్హాస్ అసలు పేరు డాలీ మాట్యూ. తనొక మోడల్. 1988లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. 1989లో మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పోటీ చేసింది. అలా మోడలింగ్ నుంచి సినిమాల్లో వచ్చింది. డాలీ కథానాయికగా నటించిన మొదటి మూవీ దస్తూర్ (1991). సినిమాలుమిస్టర్ బాండ్, క్షత్రియ, గేమ్, ప్యార్ మే ట్విస్ట్, గుడ్ లక్, దిల్ దడక్కనే దో వంటి పలు సినిమాలు చేసింది. హిందీతో పాటు పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమాన్ బ్రహ్మచారి అని ఒకే ఒక్క సినిమా చేసింది. 1992లో వచ్చిన ఈ సినిమాలో సురేశ్ హీరోగా నటించాడు. చివరగా కబీర్ సింగ్ (2019) మూవీలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.సీరియల్స్కు షిఫ్ట్తొలి సినిమా దర్శకుడు అనిల్ మాట్యూతో ప్రేమలో పడిన డాలీ అతడినే పెళ్లి చేసుకుంది. రానురానూ సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. ఇస్ ప్యార్కో క్యా నామ్ ధూ?, ఏక్ బార్ ఫిర్, చోటీ సర్దామి వంటి పలు సీరియల్స్లో నటించింది. మహాయోధ, శక్తిమాన్ సీరియల్స్లో నెగెటివ్ పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రేమ్ లీలా సీరియల్ చేస్తోంది. అలా ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన డాలీ ఇప్పుడు బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.చదవండి: జీవితంలో సంతోషంగా లేను.. దమ్ము శ్రీజ -
దాంపత్యం బానే ఉందా? బిగ్బాస్ విన్నర్ భార్య కౌంటర్!
హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ షోలో నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలవగా, నటి ఫర్హానా భట్ రన్నరప్గా నిలిచింది. ఫర్హానా అభిమానులు మాత్రం తమ కంటెస్టెంటే అసలైన విన్నర్ అని, గౌరవ్ కాదని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు గౌరవ్ భార్య, నటి ఆకాంక్ష చమోలాను ట్రోల్ చేస్తున్నారు.డ్యాన్స్ వీడియోలపై ట్రోలింగ్ఆకాంక్ష ఇటీవలే తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా కున్వర్ అమర్, అలీ హసన్తో కలిసి డ్యాన్స్ చేసింది. మరో వీడియోలో అవీజ్ దర్బార్తో కలిసి స్టెప్పులేసింది. ఇది చూసిన జనాలు.. తన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లున్నాయి, అందుకే ఎప్పుడు చూసినా వేరేవాళ్లతోనే కనిపిస్తుందని విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్పై ఇన్ఫ్లుయెన్సర్ జయతి ఘాటుగా స్పందించింది. ప్రజలు తమ పనులన్నీ వదిలేసి ఆకాంక్షపై పడ్డారని మండిపడింది.ఆకాంక్షపై ఇంత ద్వేషం ఎందుకు?గౌరవ్ గెలుపు ఆకాంక్షకు ఎందుకు సమస్యగా మారిందో అర్థం కావడం లేదంది. తను ఏం చేసినా జడ్జ్ చేస్తున్నారని, సహనటులతో డ్యాన్స్ చేస్తుంటే కూడా తప్పుపడుతున్నారంది. అనుపమ సీరియల్లో గౌరవ్ సహనటులతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినప్పటికీ అతడినెవరూ ప్రశ్నించలేదని, కానీ ఆకాంక్ష తన పని తాను చేసుకుపోతుంటే కూడా వేలెత్తి చూపిస్తున్నారని మండిపడింది. వాళ్లు యాక్టర్స్ అని.. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడింది.నిజాయితీగా ఉన్నా..ఈ వీడియోను ఆకాంక్ష తిరిగి షేర్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన యువతిని మెచ్చుకుంది. అలాగే తన వైవాహిక బంధం గురించి మాట్లాడుతూ ఒకరినొకరు మోసం చేసుకోకుండా నిజాయితీగా ఉండటం అవసరం. అది చాలా సర్వసాధారణమైన విషయం. మంచి భార్యగా ఉంటూనే వృత్తిపరంగా నా పని నేను చేసుకుంటున్నాను అని పేర్కొంది. ఆకాంక్ష నటించిన దిల్ ఢోకా ఔర్ డిజైర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న షెమారోమి ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతోంది.చదవండి: అలా అన్నందుకు బాధేసింది: అమితాబ్ బచ్చన్ -
నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశాన్ని ఓ విదేశీ జర్నలిస్ట్ అలా అని పిలవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక దేశంలో ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైనప్పుడు అక్కడి స్థానిక అభిమానుల నుండి తనకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. విమానంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తనను జాగ్రత్తగా హోటల్కు తీసుకెళ్లారని వెల్లడించారు. ఇటీవల టీమ్ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.అమితాబ్ మాట్లాడుతూ.. "ఒక దేశం నన్ను ఫిల్మ్ ఫెస్టివల్కు ఆహ్వానించింది(ఆ దేశం పేరు వెల్లడించను). దీనికి నేను వెళ్లడానికి అంగీకరించా. ఆ దేశానికి వెళ్లినప్పుడు విమానంలో ఓ వార్తాపత్రికను చూశా. అందులో నా సినిమాలలో ఒక చిత్రం ఉంది. ఆ దేశ భాష అర్థం కాక అందులో ఏమి రాశారని నేను ఎయిర్ హోస్టెస్ను అడిగా. అది ఒక భారతీయ సినిమా పోస్టర్ అని.. ఆ దేశానికి చెందిన నటుడు ఇక్కడికి వస్తున్నాడని పత్రికలో రాశారని ఆమె చెప్పింది" అని అన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ తనను అభిమానుల గుంపు చుట్టుముట్టడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ దేశంలో మన సినిమాల పట్ల ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. విమానం దిగిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ వరకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డా. పరిస్థితి ఎంత గందరగోళంగా మారిందంటే పోలీసులు వచ్చి నన్ను కారులో ఎక్కించి నా హోటల్కు తీసుకుని వెళ్లారు. నా జీవితంలో మొదటిసారిగా నా ఇమ్మిగ్రేషన్ హోటల్లో జరిగిందని' అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.విదేశీ జర్నలిస్ట్ కామెంట్స్..అయితే తనకు ఆత్మీయ స్వాగతం లభించినప్పటికీ.. ఓ విదేశీ జర్నలిస్ట్ తనపై రాసిన కథనం చూసి బాధపడ్డానని తెలిపారు. మూడవ ప్రపంచ దేశానికి చెందిన ఈ మూడో రకం నటుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారని కథనంలో రాసుకొచ్చాడని వెల్లడించారు. అయితే తనను మూడో రకం నటుడు అన్నందుకు బాధలేదని.. నా భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశం అని పిలవడం బాధ కలిగించిందని తెలిపారు.అందుకే తాజాగా తనకెదురైన అనుభవాన్ని క్రికెట్తో ముడిపెట్టి ట్వీట్ చేశారు. అండర్-19 క్రికెట్ ఇండియా.. ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా వరల్డ్లోనే మొదటి స్థానంలో ఉన్నాం.. మనం మూడో ప్రపంచం కాదు.. మనం మొదటి ప్రపంచం.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు. అంధులు, స్త్రీలు, పురుషులు, ఇప్పుడు 19ఏళ్ల వయస్సు క్రికెటర్స్ కూడా ఈ విషయాన్ని నిరూపించారని ట్విటర్లో పంచుకున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించింది. T 5649 - U19 Cricket INDIA .. WORLD CHAMPIONS !ठोक दिया दुश्मन को !!Blind , Women's , Mens Cricket ALL world Champions .. we are NUMBER 1 .. ONE .. on top , FIRST in World ..We are NOT 3rd World .. we are FIRST World !!BHARAT MATA KI JAI 🇮🇳 🇮🇳🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) February 7, 2026 -
డేట్ ఫిక్స్
ఈ వేసవిలో ‘భూత్ బంగ్లా’ తలుపులు తెరుచుకుంటాయని అంటున్నారు అక్షయ్ కుమార్. హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఈ చిత్రంలో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత మే 15న రిలీజ్ చేయనున్న ట్లుగా ప్రకటించారు.రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా మార్చి 19న రిలీజ్కు సిద్ధమైన కారణంగానే, ఏప్రిల్ 2 నుంచి మే 15కు అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సినిమా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. అయితే తాజాగా ‘భూత్ బంగ్లా’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మరి... మరోసారి కూడా ‘భూత్ బంగ్లా’ విడుదల తేదీ మారుతుందా? లేక ఏప్రిల్ 10నే ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుందా? అనేది చూడాలి. ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వస్తున్న ఈ ‘భూత్ బంగ్లా’ సినిమాపై బాలీవుడ్లో అంచనాలు ఏర్పడ్డాయి. -
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోనే 'షరారత్' అంటూ సాగే ఐటమ్ సాంగ్లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్పైనా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు ఈమెని.. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్తో ఫేమస్ అయిన తమన్నా, నోరా ఫతేహితో పోలుస్తున్నారు. తనని వాళ్లతో పోల్చడం నచ్చలేదని ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'తమన్నా, నోరా ఫతేహితో నన్ను పోలుస్తున్నా రీల్స్.. సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. కానీ అది నాకు నచ్చట్లేదు. వాళ్లిద్దరూ అద్భుతమైన మహిళలు. నోరా స్టేజీ ఫెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. తను చేసిది నేను ఎప్పటికీ చేయలేను' అని నోరా గురించి మాట్లాడింది. తమన్నా గురించి కూడా మాట్లాడిన ఆయేషా ఖాన్.. 'తమన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమెని చూసి నేను ఫిదా అయిపోయా. ఇండస్ట్రీకి నేను కొత్త. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పుకొచ్చింది.'ధురంధర్'లో ఐటమ్ సాంగ్లో కలిసి చేసిన క్రిస్టల్తో మనస్పర్థలు అని వస్తున్న పుకార్లపైనా ఆయేషా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్సే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా.. తెలుగులోనూ ముఖచిత్రం, ఓం బీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ 'ధురంధర్' మూవీ ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. -
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్బస్టర్ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. ధురంధర్: ద రివేంజ్ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్ఇదిలా ఉంటే ధురంధర్ సినిమా సెట్లో రణ్వీర్ సింగ్ ఏకంగా మూడు కేరవాన్స్ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్లో షూట్ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్ డిమాండ్ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్ కోసం రణ్వీర్ సింగ్ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్ -
వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)
-
లుక్స్పై ట్రోలింగ్.. నేనూ హర్ట్ అవుతా: హీరోయిన్
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంది. తన ఫేస్ కట్ సరిగా లేదని, దవడకు సర్జరీ చేయించుకోవాలని.. ఇలా చాలామంది నానామాటలు అన్నారు. కొన్నిసార్లు ఈ విమర్శల వల్ల బాధపడ్డప్పటికీ వీలైనన్ని సార్లు ఈ కామెంట్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడానికే ప్రయత్నిస్తున్నానంటోంది షనయా.పాజిటివ్గా తీసుకుంటా..జూమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షనయా కపూర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో చాలారకాల కామెంట్లు వస్తుంటాయి. నా పని గురించి కావొచ్చు, లేదంటే నా డ్యాన్స్, యాక్టింగ్ ఎలా ఉందని చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు కాస్త కఠినంగా చెప్పినప్పటికీ దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. వాళ్ల అభిప్రాయాలు వింటాను. వాళ్ల విమర్శలు కొంత బాధపెట్టవచ్చేమో కానీ చాలా విషయాలు తెలియజేస్తాయి.వాటిని లెక్కచేయనువాళ్లు ఏది కోరుకుంటున్నారో తెలుసుకునే కదా ముందడుగు వేయాలి. వాటిని పట్టించుకోకపోతే ఎలా? కానీ, నా లుక్స్ గురించి, ఫేస్ గురించి, శరీర సౌష్ఠవం గురించి కామెంట్స్ చేస్తే మాత్రం లెక్కచేయను. వాటిని లైట్ తీసుకుంటాను. ఈ ట్రోలింగ్ వల్ల కొన్నిసార్లు బాధనిపిస్తుంది. అప్పుడు అమ్మ(నటి మహీప్ కపూర్)తో నా బాధ చెప్పుకుంటాను. ఎందుకంటే తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.సినిమాషనయా.. 'ఆంఖోన్ కీ గుస్తాఖియన్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ప్రస్తుతం షనయా 'తు యా మే' మూవీ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: చాలామంది మోసం చేశారు: యాక్షన్ కింగ్ అర్జున్ -
బ్యాక్ టు బాలీవుడ్?
బ్యాక్ టు బాలీవుడ్ అంటున్నారట హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ‘వైట్ టైగర్, లవ్ ఎగైన్, హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్, జడ్జ్మెంట్ డే ’వంటి వరుస ఇంగ్లిష్ చిత్రాల తర్వాత ఇటీవల తెలుగు మూవీ ‘వారణాసి’ ఒప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. అయితే హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ చిత్రం రానుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని భోగట్టా. ‘క్రిష్ 3, క్రిష్ 4’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా నటించారు. దీంతో ‘క్రిష్ 4’లో కూడా ఆమె నటిస్తే బాగుంటుందని హృతిక్ రోషన్ భావిస్తున్నారట. ‘క్రిష్ 4’ చిత్రానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 2019లో వచ్చిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం తర్వాత ప్రియాంకా చోప్రా హిందీలో అంగీకరించే చిత్రం ఇదే అవుతుంది. మరి... ‘క్రిష్ 4’తో ప్రియాంక బ్యాక్ టు బాలీవుడ్ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
ప్రేమకు వయసుతో పని లేదన్న నటి! భర్త చనిపోయాక..
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లితెర నటి సుజానే బెర్నెర్ట్. లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది. సుజానె భర్త, నటుడు అఖిల్ మిశ్రా 2023లో మరణించాడు. ఆ తర్వాత బాధలో కూరుకుపోయిన ఆమెకు అర్జున్ హర్దాస్ అనే వ్యక్తి బాసటగా నిలిచాడు.రెండేళ్ల ప్రేమఢిల్లీకి చెందిన ఇతడి సాన్నిహిత్యంలో త్వరగానే బాధ నుంచి బయటపడింది సుజానె. వీరిద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అలా రెండేళ్లుగా కలిసుంటున్నారు. ఈ విషయం గురించి సుజానె మాట్లాడుతూ.. ప్రేమకు వయసుతో పనేంటి? ఈ ఫలానా వయసువరకే ప్రేమలో పడొచ్చు అని ఎక్కడా రాసిలేదే.. స్వచ్ఛమైన ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.ప్రేమికుల రోజు కోసం వెయిటింగ్ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. నాకు ఎప్పుడెప్పుడు కానుకలు ఇవ్వాలా? అని తాపత్రయపడుతున్నాడు. అలా అని ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకోవడం లేదు. కేవలం మా ఆనందాన్ని పంచుకుంటామంతే! అని చెప్పుకొచ్చింది. సుజానె (Suzanne Bernert)- అఖిల్ మిశ్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. 2023లో అఖిల్ మిశ్రా కన్నుమూశాడు. ఆ తర్వాత పరిచయమైన అర్జున్తో సుజానె ప్రేమలో పడగా అప్పటినుంచి వీరిద్దరూ కలిసుంటున్నారు. సీరియల్స్, సినిమాసుజానె.. ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్, యే రిష్తా క్యా కెహ్లాతా హై, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. వెండితెరపై నో ప్రాబ్లమ్, లవ్ రెసిపీ, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తీర్పు వంటి పలు సినిమాలు చేసింది. చివరగా యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను పోషించింది. View this post on Instagram A post shared by Suzanne Bernert (@suzannebernert) చదవండి: హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన పుష్ప నటుడు -
ఓటీటీలో స్వలింగ సంపర్కుల స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. Between rituals of loss and moments of connection, a new sense of belonging emergesWatch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv— Netflix India (@NetflixIndia) February 6, 2026 -
ఈ ఐటం సాంగ్ బ్యూటీ నటిగా సక్సెస్ అయ్యేనా?
నోరా ఫతేహి ఐటం సాంగ్ స్పెషలిస్ట్. దిల్బర్ సాంగ్తో సెన్సేషన్ సృష్టించింది. శరీరాన్ని రబ్బర్లా సాగదీస్తూ, విల్లులా వంచుతూ స్టెప్పులేయడంలో ఆమె దిట్ట. తన ఎనర్జీకి, అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 6న) ఆమె 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..కెరీర్నోరా ఫతేహి కెనడా నటి. కెనడాలోని టోర్నటోలో పుట్టిపెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. రోర్ (2014) సినిమాతో నటిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా.. అనే ప్రత్యేక పాటలో అదరగొట్టింది. అక్కడినుంచే తన ఐటం సాంగ్స్ జర్నీ మొదలైంది. బాహుబలి మూవీలో 'మనోహరి..' అంటూ ప్రభాస్ను చుట్టుముట్టేసే సాంగ్తో మరింత ఆదరణ పొందింది.నటిగా కలిసిరాని అదృష్టంతెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఐటం సాంగ్స్ చేసింది. అయితే తనకు నటిగా కనిపించాలన్న కోరిక ఎక్కువ. అలా రెండేళ్లుగా ఐటం సాంగ్స్పై ఫోకస్ తగ్గించేసి యాక్ట్రెస్గా సినిమాలు చేస్తోంది. తెలుగులో మట్కా సినిమా చేయగా ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడే కాదు హిందీలోనూ తను నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో నటిగా బ్రేక్ రావడం లేదు. దీంతో మళ్లీ గతేడాది చివర్లో థామా మూవీలో స్పెషల్ సాంగ్లో కాలు కదిపింది. బిగ్బాస్ షోలోనూ..నోరా డ్యాన్సర్, నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రస్తుతం నోరా ఫతేహి.. కన్నడలో కేడీ: ద డెవిల్, తమిళంలో కాంచన 4 సినిమాలు చేస్తోంది. మరి వీటితోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి! నోరా ఫతేహి.. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. డ్యాన్స్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ జలక్ దిక్లాజా 9వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇదే షోకి జడ్జిగా వ్యవహరించడం విశేషం. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
అడ్జస్ట్మెంట్ తప్పదు.. అమ్మతో చెప్పేసరికి!: స్పైడర్ నటి
మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్ మూవీలో విలన్ తల్లిగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.అంత ఈజీ కాదుఅయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు. అమ్మతోనూ అదేమాటకొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.సినిమాకని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్ సూప్, పోచర్, నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది.చదవండి: నా కొడుకు దుబారా ఖర్చు చేస్తున్నాడా? బిల్లు చూపించు: సునీల్ శెట్టి -
నా కొడుకు భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడా? ఏదీ బిల్లు తీసుకురా..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "సంకీ". సాజిద్ నజియావాలా నిర్మించిన ఈ సినిమా 2025లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ, ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి హీరో అహాన్ శెట్టియే కారణమంటూ రూమర్స్ మొదలయ్యాయి. అతడి మితిమీరిన ఖర్చుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సినిమాను అర్ధాంతరంగా ఆపేశాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ను సునీల్ శెట్టి ఖండించాడు. బిల్లు చూపించండిఆయన మాట్లాడుతూ.. నా కొడుక్కి అతడి పరిమితులేంటో తెలుసు. దాన్ని దాటి ఎప్పుడూ ఖర్చు చేయడదు. ఇదంతా ఉట్టి ప్రచారమే.. ఒకవేళ అహాన్ భారీగా ఖర్చు చేస్తున్నాడంటే నిర్మాత అందుకు సంబంధించిన బిల్లును తీసుకురమ్మనండి. దాని సంగతేంటో నేనూ చూస్తాను. వారి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు అహాన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంటి నుంచే భోజనంనేను సెట్కు వెళ్లినప్పుడు కూడా నా భోజనం, నీళ్లు నేనే తెచ్చుకుంటాను. నా సిబ్బందిని సెట్లో పెట్టిన ఆహారమే తినమని చెప్తాను. ఒకవేళ బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానంటే ఆ బిల్లు నేనే కడతాను, నిర్మాత కాదు! నా సిబ్బందే కాదు అహాన్ స్టాఫ్ (మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, ఇతరత్రా) కూడా ఇదే పాటిస్తారు. వాడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటివాడిపై కావాలనే ఇలాంటి నిందలేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహాన్ శెట్టి 2021లో వచ్చిన తడప్ సినిమాతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. అతడు నటించిన రెండో చిత్రమే సంకీ. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. అహాన్ చివరగా బోర్డర్ 2 సినిమాలో నటించాడు. -
నా ఫస్ట్ మూవీ తెలుగులో.. ఇంతవరకు రిలీజవ్వలేదు
తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్ నటుడు నకుల్ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్ మొదలైంది. హైదరాబాద్ వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. అప్పుడు హీరోయిన్ శ్రియా పేరు బాగా వినిపించింది. ఖాళీగానే ఉన్న సమయంలో తన సినిమాలు చూసేవాడిని. నా సినిమా ముందుకు కదల్లేదుతన కెరీర్ కూడా అప్పుడప్పుడే మొదలైంది. కానీ ఆరంభం నుంచే సక్సెస్ఫుల్గా రాణించింది. నా సినిమా మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో నేను మళ్లీ ముంబై వచ్చేసి యాడ్స్ చేసుకుంటూ నా దారి నేను చూసుకున్నాను. నటుడినవ్వాలన్న కోరిక మొదట్లో అంత బలంగా లేదు. కాకపోతే నా చుట్టూ ఉంండేవారంతా నన్ను యాక్టింగ్ వైపు వెళ్లమని చెప్పేవారు. నాక్కూడా అందరినీ ఎంటర్టైన్ చేయడం అంటే ఇష్టం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా..అలా తెలుగు సినిమాలో అవకాశం రాగానే ఒప్పుకున్నాను. కానీ ఆ భాష నాకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు సరిగా ఉంటే అన్నీ సర్దుకుపోవచ్చనిపించింది. ఈ అనుభవం నాకు బాగానే పనికొచ్చింది. కెమెరా ముందు నటించడాన్ని మరింత ప్రేమించాను. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు నావంతు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అదే సక్సెస్శ్రియా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఎంతో సక్సెస్ను చూసింది, స్టార్డమ్ను సంపాదించుకుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. నా దృష్టిలో సక్సెస్ అంటే జనం మనల్ని ప్రేమించడమే! కాగా నకుల్.. ఇష్క్బాజ్ సీరియల్తో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో అభిమాని (2005) సినిమాలో యాక్ట్ చేశాడు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫుల్ యాక్టివ్గా కనిపిస్తున్నాడు. చివరగా స్పేస్ జెన్: చంద్రయాన్ అనే సిరీస్లో యాక్ట్ చేశాడు.చదవండి: ధురంధర్ 2లో దర్శకుడి సతీమణి -
50వ పుట్టినరోజు: రూమర్స్కు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్
ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిషేక్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఐశ్వర్య, “Happy HAPPY 50th Birthday dearest Babyyy-Papa with lots of love, peace, happiness, contentment and best health. God Blesssss. Stay Golden… Shine on Love” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్కు అభిమానులు భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఇదే సందర్భంగా సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. “అభిషేక్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అతనికి మరింత ధైర్యం, శక్తి ఇస్తాయి” అని పేర్కొన్నారు.అభిషేక్ బచ్చన్కు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నటుడు జాకీ ష్రాఫ్ వీడియో సందేశం ద్వారా “Big Hugs” అంటూ అభినందనలు తెలిపారు. రితేష్ దేశ్ముఖ్, “నువ్వు నాకు అన్నయ్యలాంటివాడివి. నీకు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం కలగాలి” అంటూ భావోద్వేగ సందేశం పంపారు. అజయ్ దేవగన్ మాత్రం హాస్యంగా, “Happy Birthday Abbas Ali… I mean @bachchan” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. “మా వివాహంపై వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలు. వాటిని కావాలని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఆమెకు నా గురించి తెలుసు, నాకు ఆమె గురించి తెలుసు. మేము ప్రేమతో, స్థిరమైన కుటుంబంగా ముందుకు సాగుతాం.. అదే ముఖ్యమైనది” అని స్పష్టం చేశారు. దీంతో వారి జంటపై వస్తున్న రూమర్స్కు వీరిద్దరూ మరోసారి చెక్ పెట్టారు.మొత్తంగా అభిషేక్ బచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, సినీ ప్రముఖులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. -
యానిమల్ సినిమా.. ఒప్పుకోవాలంటే భయమేసింది: హీరో
సందీప్రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్సింగ్గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.భయపడ్డా..ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్లో రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్బీర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలే చేశాను. యానిమల్ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్విజయ్ పాత్ర భయంకరంగా ఉంటుంది. అది బాగా నచ్చిందికాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకొచ్చాడు.ఎప్పుడో ఫిక్సయ్యా..సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్బీర్కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్బీర్ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్కు సీక్వెల్గా యానిమల్ పార్కింగ్ 2028లో రానుంది. -
మళ్లీ యాక్ట్ చేస్తాననుకోలేదు: రియా ఎమోషనల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి కెరీర్, జీవితం చిన్నాభిన్నమైంది. సుశాంత్ మృతి, డ్రగ్స్ కేసులో రియా అరెస్టయి జైలు జీవితం కూడా గడిపొచ్చింది. 5 ఏళ్లపాటు ఎన్నో నిందలు మోసింది. చివరకు సుశాంత్ మృతి కేసుకు, రియాకు ఎటువంటి సంబంధం లేదని 2025లో సీబీఐ కేసు క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. రీఎంట్రీకానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన కెరీర్ క్లోజ్ అయినట్లేనని రియా ఎంతో దిగులుచెందింది. అలాంటి సమయంలో నెట్ఫ్లిక్స్ నుంచి పిలుపొచ్చింది. ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్లో నటించే అవకాశం అందుకుంది. రెండు రోజుల క్రితమే సిరీస్ టీజర్ వదిలారు. తన రీఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రియా. 7 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను.కెరీర్ ముగిసిందనుకున్నా అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ అవ్వాలని 17 ఏళ్ల వయసులో బలంగా అనుకున్నాను. నా జర్నీ మొదలుపెట్టాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనకు చరమగీతం పాడక తప్పదనుకున్నాను. ఇంతలోనే మళ్లీ యాక్ట్ చేసే అవకాశం.. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు. అయినా ఇదెంత బాగుందో అని చెప్పుకొచ్చింది.నా జీవితంలో రెండో చాప్టర్ ఈ వీడియోకు సెట్కు వెళ్లి ఏడేళ్లవుతోంది. నటి అవ్వాలన్న కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇది నా జీవితంలో ఇది రెండో చాప్టర్. నా ప్లాన్స్లో నేనుంటే జీవితం నన్నిలా సర్ప్రైజ్ చేసింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగ్రాచ్యులేషన్స్, నీకు అంతా శుభమే జరగాలి అని కామెంట్లు చేస్తున్నారు.సినిమారియా చక్రవర్తి వీడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, జిలేబి వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. రియా చివరగా 2019లో వచ్చిన చెహ్రె మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఏడ్చేసిన భూమిక -
నెట్ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)
-
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ది ఇండియా హౌస్తో ఎంట్రీ
నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కంపోజర్ శాశ్వత్ సచ్దేవ్ ‘ది ఇండియా హౌస్’ ద్వారా తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘ధురంధర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370’ చిత్రాలతో పాపులర్ అయిన శాశ్వత్ సచ్దేవ్ మా సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదు ఆకట్టుకునే పాటలను కంపోజ్ చేశారాయన. 1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ‘ది ఇండియా హౌస్’ విప్లవం, ప్రేమ, త్యాగం.. వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్ సింఘానియా, కెమెరా: కేకే సెంథిల్ కుమార్. -
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్బీర్ కెరీర్లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్బీర్కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్గా యానిమల్ పార్క్ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్లో మరో స్టార్ జోడీ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్వీర్ కెరీర్కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్బస్టర్!టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్కు మళ్లీ బ్లాక్బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్ను గెస్ చేస్తే రూ.50 లక్షలు! -
15 ఏళ్లకే రోడ్డుపైకి.. ఎన్నో అవమానాలు: అమాల్ మాలిక్
సినిమా బ్యాక్గ్రౌండ్ వల్ల కెరీర్ తొలినాళ్లలో తనను ఉద్యోగం నుంచి పీకేశారంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్. ఇతడి తండ్రి డబూ మాలిక్ సంగీత దర్శకుడిగా, సింగర్గా బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న కొడుకు, సింగర్ అర్మాన్ మాలిక్ కూడా తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెద్ద కొడుకు అమాల్ మాలిక్ మాత్రం ఆ స్థాయి గుర్తింపు అందుకోలేకపోయాడు. 15 ఏళ్లకే..ఇటీవలే ఇతడు హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొన్నాడు. తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమాల్ మాలిక్ మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు రోడ్డుపైకి వచ్చి పని వేట మొదలుపెట్టాను. దాదాపు 10 ఏళ్లు ఎంతో కష్టపడ్డాను. అసిస్టెంట్గా పని చేశాను. పోస్ట్ ప్రొడక్షన్లో ఉండే సినిమాల హార్డ్ డిస్కులు తీసిపెట్టుకునేవాడిని. తర్వాత దానితో డబ్బు సంపాదించొచ్చన్నది నా ఆశ.అవమానంఅయితే నా పేరు పక్కన మాలిక్ ఉందన్న విషయం తెలియగానే వెంటనే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేవారు. ఇతడు ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఒకవేళ మన సినిమాలోని మ్యూజిక్ను బయటవాళ్లకు అమ్మేసినా అమ్మేస్తాడు అని అవమానించి మరీ పక్కనపెట్టేవారు. దానివల్ల నాకు, తమ్ముడికి సరిగా పని దొరక్కపోయేది. మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మా జర్నీలో కష్టాలే లేవని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని చెప్పుకొచ్చాడు.సంగీత దర్శకుడిగా..అమాల్ మాలిక్.. సల్మాన్ ఖాన్ జై హో సినిమాతో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఏక్ పహేలీ లీలా, హీరో, క్యాలెండర్ గర్ల్స్, హేట్ స్టోరీ 3, ఎయిర్లిఫ్ట్, బాఘీ, బద్రీనాథ్ కీ దుల్హానియా వంటి పలు చిత్రాల్లో పాటలు కంపోజ్ చేశాడు.చదవండి: 50 మంది సెలబ్రిటీలతో గేమ్ షో -
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్వన్గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.ఈ మూవీని పాకిస్తాన్కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్లోనూ ఈ మూవీ నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్లో నెట్ఫ్లిక్స్లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్గా ట్రెండింగ్లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. -
50 మంది సెలబ్రిటీలతో కొత్త రియాలిటీ షో..
మన దేశంలో రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. సినిమాల్లో, టీవీలో, సోషల్ మీడియాలో కనిపించే సెలబ్రిటీలు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? తెలుసుకోవాలని అభిమానులు తెగ తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం ఎన్నో గేమ్ షోలు, రియాలిటీ షోలు పుట్టుకొచ్చాయి. తాజాగా ద 50 గేమ్ షో మొదలైంది. అసలు ఆ షో ఏంటి? దాని స్పెషాలింటీ ఏంటి? అన్నది ఓసారి చూసేద్దాం..50 మంది సెలబ్రిటీలుబిగ్బాస్ షోలో 20 మందికి అటుఇటుగా సెలబ్రిటీలను హౌస్లోకి పంపిస్తారు. వందరోజులపాటు టాస్కులు, గేమ్స్ ఇస్తారు. చివర్లో ఒకరిని విజేతగా ప్రకటించి రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇస్తారు. ద 50 షో కూడా ఇంచుమించు ఇలాంటిదే! కాకపోతే ఇక్కడ సెలబ్రిటీలు పది మందో ఇరవైమందో కాదు, ఏకంగా 50 మంది ఉన్నారు. వీళ్లందర్నీ ఒక పెద్ద రాజభవనంలాంటి మహల్లో ఉంచుతారు. దీన్నే లయన్ హౌస్ అంటారు.ప్రైజ్మనీ ఎవరికంటే?సమయానుసారం టాస్కులు ఆడిస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడుపడితే అప్పుడు ఎందుకంటే ద 50 అనేది కేవలం యాభై రోజుల గేమ్ షో. మరి అన్నీ దాటుకుని చివరిదాకా వచ్చినవారికేమైనా ఉంటుందా? అంటే ఇప్పటికైతే అలాంటి ప్రైజ్మనీ ఏమీ ప్రకటించలేదు. కాకపోతే ఎవరు గెలుస్తారో గెస్ చేసిన అభిమాని/ ప్రేక్షకులకు మాత్రం ప్రైజ్మనీ దక్కుతుంది. అది కూడా అక్షరాలా రూ.50 లక్షల రూపాయలు.నో హోస్ట్లెస్ సింక్వాంటె (సింక్వాంటె అంటే 50 అని అర్థం) అనే ఫ్రెంచ్ షో ఆధారంగా 'ద 50' రియాలిటీ షోని డిజైన్ చేశారు. అయితే మాతృకలో ఉన్న అనేక నిబంధనలను ఇక్కడ కాస్త సడలించారు. ఈ షోకి హోస్ట్ అంటూ ఎవరూ ఉండరు. బిగ్బాస్లో ఎలాగైతే కనిపించని వ్యక్తి ఆదేశాలు ఇస్తాడో.. ఇక్కడ కూడా సింహం మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడిస్తాడు, ఛాలెంజ్లు విసురుతాడు, ఎలిమినేట్ చేస్తాడు. ఫిబ్రవరి 1న ఈ షో మొదలైంది. ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుండగా.. కలర్స్ టీవీలో రాత్రి 10.30కి ప్రసారమవుతోంది.కంటెస్టెంట్లు వీళ్లే..తేజస్వి మదివాడ (తెలుగమ్మాయి), కరణ్ పటేల్, ఊర్వశి ఢోలకియా, రజత్ దలాల్, మిస్టర్ ఫైజు, దివ్య అగర్వాల్, మోనాలిసా, విక్రాంత్ సింగ్ రాజ్పుత్, శినీ దోశి, రిది డోగ్రా, దుశ్యంత్ కుక్రేజా, శివ్ ఠాక్రే, నీలం గిరి, చాహత్ పాండే, హమీద్ బర్క్జీ, డింపాల్ సింగ్, మాక్స్టర్న్, సుమైరా షైఖ్, లవ్కేశ్ కటారియా, సివెత్ తోమర్, నేహాల్ చుదసమ, కృష్ణ ష్రాఫ్, సప్న చౌదరి, నిక్కీ తంబోలి, అర్బాజ్ పటేల్, వన్హాజ్ సింగ్, ప్రిన్స్ నరౌలా, యువికా చౌదరి, అర్చనా గౌతమ్, బేబికా ధుర్వె, జాన్వీ కిల్లెకర్, యంగ్ సామీ, అద్నాన్ షైఖ్, లక్షయ్ కౌశిక్, అర్చిత్ కౌశిక్, దిగ్విజయ్ రాతే, నటాలియా జన్జోజ్సెక్, ఖన్జాదీ, ఫైజ్ బలోచ్, రచిత్ రోజా, సిద్దార్థ్ భరద్వాజ్, డినో జేమ్స్, ఆర్య జదావో, సౌరభ్ గాడ్గె, మనీషా రాని, ఆరుశి చావ్లా, రిద్దిమా పండిట్, శ్రుతికా అర్జున్, భవ్య సింగ్, ఇమ్మోర్టల్ కాక.. పార్టిసిపెంట్లుగా లయన్ హౌస్లో అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: ఎక్కువ పారితోషికం.. సినిమాను నాశనం చేస్తున్నారు: నటుడు -
రూ.70 కోట్ల పారితోషికం.. అది తెలివితక్కువ పని: నటుడు
సినిమాలు ఆడినా, ఆడకపోయినా పారితోషికం మాత్రం పైసా తగ్గకుండా ఖతాలో పడాల్సిందే! అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు స్టార్ హీరోలు. కనీసం సినిమా బడ్జెట్ను కూడా పరిగణనలోకి తీసుకోకుండా భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్.స్టార్ హీరోల కెపాసిటీఇతడు నటించడంతో పాటు సహనిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం 'బ్రేక్ కే బాద్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమా బడ్జెట్ను బట్టి హీరోలను ఎంపిక చేసేవారు. అది చాలా మంచి పద్ధతి. స్టార్ హీరోకు ఎక్కువమంది జనాల్ని థియేటర్కు రప్పించే సత్తా ఉంది. కొందరు నటులకు అంత కెపాసిటీ ఉండదు.బాధ్యత కనిపించట్లే..కాబట్టి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా తీస్తున్నప్పుడు స్టార్ హీరోలను ఎంపిక చేసుకోవడంలో తప్పు లేదు. అయితే నా ముందున్న తరాలు సినిమా కోసం ఎంతో కష్టపడేవి. అలా అని వారి జేబులో నుంచి డబ్బు తీసి పెట్టేవారు కాదు. కాకపోతే సినిమా కోసం బాధ్యతగా పనిచేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోలే సినిమాను చంపేస్తున్నారు. ఉదాహరణకు ఒక సినిమా బడ్జెట్ రూ.30 కోట్లు అనుకుందాం. సినిమా గురించి ఆలోచించరా?నేను మాత్రం అదేం పట్టించుకోకుండా నా రెమ్యునరేషన్ రూ.40 కోట్లు తీసుకుంటే అప్పుడు బడ్జెట్ ఒక్కసారిగా రూ.70 కోట్లు అవుతుంది. ఇదెంతవరకు కరెక్ట్? సినిమా బడ్జెట్ను కచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని డీసెంట్గా ఉండే సినిమాలకు అంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఆమిర్ ఖాన్.. మూవీ రిలీజయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి దాంట్లో వాటా తీసుకుంటాడు. అది తెలివితక్కువ పనిఅంతే తప్ప.. నేను స్టార్ హీరోని, రూ.60 కోట్లు ఇవ్వు, రూ.75 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేయడు. అలా చేస్తే అంతకంటే తెలివితక్కువపని మరొకటి ఉండదు. సినిమాను మీరే దెబ్బతీసినవాళ్లవుతారు. సినిమాను నాశనం చేసి మీరు మాత్రం ఎదిగినవాళ్లవుతారు. ఇదెలా ఉంటుందంటే.. మీరెలాంటి చెత్త సినిమా తీస్తున్నారో ఎవరికి తెలుసు? నా డబ్బులైతే నాకిచ్చేయండి. సినిమా ఎటు పోతే నాకేంటి? అని గాలికొదిలేసినట్లుగా ఉంటుంది అని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: కూతురే నా సర్వస్వం.. నా బ్యాగ్లో ఏముందో తెలుసా?: దీపికా -
కూతురే నా లోకం.. నా బ్యాగులో ఏముందంటే?: దీపికా
తల్లయ్యాక ప్రతి మహిళలో ఒక మార్పు కచ్చితంగా వస్తుంది. అప్పటివరకు ఉన్న ప్రాధాన్యతలు పక్కనపెట్టి కన్నబిడ్డే సర్వస్వంగా బతుకుతుంది. ఆ బిడ్డ కంటే ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదంటుంది. అందుకు ఇండియన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా అతీతురాలు కాదు. పాప పుట్టాక తనే ప్రపంచంగా బతికేస్తున్నానంటోంది. తనే నా సర్వస్వంతాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె మాట్లాడుతూ.. ఇప్పుడు దువా (దీపికా కూతురి పేరు)యే నా ప్రపంచం. తనకు ఆకలేస్తే తినడానికి ఏదైనా ఫుడ్ నా బ్యాగ్లో ఉంటుంది. ఈ మధ్యే తను తిని వదిలేసిన తెప్లా (ఒకరకమైన చపాతీ) ముక్క బ్యాగ్లో అలాగే ఉండిపోయింది. రెండు రోజుల తర్వాత దాన్ని చూసి పారేశాను. పాపకు వీలైనన్నిసార్లు ఐ లవ్యూ చెప్తూనే ఉన్నాను. తనతో హెడ్, షోల్డర్, నీస్, టూస్.. అంటూ పాటలు పాడుతున్నాను అని చెప్పుకొచ్చింది.సినిమాఇక తాను హీరోయిన్ అవకపోయుంటే ఇంటీరియర్ డిజైనర్ అయ్యేదాన్ని అని దీపికా పేర్కొంది. అయితే తన భర్త, హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నేను మంచి లాయర్ అవాల్సింది అని అంటుంటాడని తెలిపింది. దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2024లో కూతురు దువా జన్మించింది. ప్రస్తుతం దీపికా.. కింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రణ్వీర్ సింగ్ ఇటీవలే ధురంధర్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు.చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ -
ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?
స్వతహాగా బాలీవుడ్ నటి అయినప్పటికీ.. 'సీతారామం' సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకుర్. ఈమె మంచి యాక్టరే. కానీ రీసెంట్ టైంలో హీరో ధనుష్ని ఈమె పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై మృణాల్ టీమ్ కూడా కొన్నిరోజుల క్రితం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈమె కూడా ఈ విషయమై స్పందించినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)'నా పని మాత్రమే నాకు గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటాను. గాసిప్స్ కాదు. కానీ ఇప్పుడు నా ప్రమేయం లేని కొన్నింటిలో నా పేరు వినిపిస్తోంది. 'సో కాల్డ్ పెళ్లి కాంట్రవర్సీ' సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ధనుష్ నాకు సోదరుడు లాంటోడు. మా మధ్య గౌరవం, ప్రొఫెషనలిజం మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఇంకేం లేవు. అసలు జనాలు.. ఓ అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు పుకార్లు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇన్నాళ్లు ఏం మాట్లాడలేదు అంటే ఏదో దాచిపెడుతున్నానట్లు కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదని అర్థం. ఇన్నేళ్ల కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. రూమర్స్ దాన్ని తగ్గించాలని చూడొద్దు. లైక్స్, షేర్స్ వల్ల ఇబ్బంది ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ వాటి వల్ల జీవితాలపై గట్టి ప్రభావమే పడొచ్చు' అని మృణాల్ చెప్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.ట్విటర్ అకౌంట్ చూస్తే మృణాల్ ఠాకుర్దే అనుకుంటున్నారు గానీ అది ఫ్యాన్ పేజీలా అనిపిస్తుంది. బహుశా ఈమె టీమ్ వైపు నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. మృణాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'దో దివానే షెహర్ మైన్'.. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. ఈమె నటించిన తెలుగు మూవీ 'డెకాయిట్'.. మార్చి 19న రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ) -
ఇంత సెన్సేషన్ ఊహించలేదు, ఇకనైనా అవకాశాలొస్తే బాగుండు!
'రంభ హో హోహో..' ఈ పాట ఒకప్పుడు చాలా ఫేమస్. ధురంధర్ సినిమాలో ఈ సాంగ్ను వాడుకోవడంతో మరోసారి వైరల్ అయింది. అయితే ఈ పాటకు 70 ఏళ్ల నటి కల్పనా అయ్యర్ హుషారుగా స్టెప్పులెయ్యడం అంతకంటే ఎక్కువ వైరలవుతోంది. 1981లో వచ్చిన అర్మాన్ సినిమాలోని పాటే రంభ హో హో. ఈ డిస్కో సాంగ్లో కల్పనా అయ్యర్ స్టెప్పులేసింది. పెళ్లిలో డ్యాన్స్దాదాపు 45 ఏళ్ల తర్వాత మరోసారి ఈ పాటపై కాలు కదిపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కల్పనా అయ్యర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ కుమారుడి పెళ్లికి వెళ్లాను. అతడిని నా కొడుకులాగే భావిస్తాను. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లికి హాజరయ్యాను. అందరూ డ్యాన్స్ చేయమని కోరితే అప్పటికప్పుడు స్టెప్పులేశా.. అదేమీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు.చాలా స్పెషల్ఆ వీడియోను సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఇంకేముంది, కొద్ది గంటల్లోనే చాలా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే వీడియో కనిపిస్తోంది. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నాలుగు దశాబ్దాల కిందట డ్యాన్స్ చేసిన పాట మరోసారి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరింత స్పెషల్గా అనిపిస్తోంది. అవకాశాలు వస్తే అంతే చాలుఈ సాంగ్ను ధురంధర్ మూవీలో వాడారని విన్నాను. అందుకు దర్శకుడు ఆదిత్య ధర్కు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే! ఆయన వల్లే ఇప్పటి జెనరేషన్ ఆ పాటను మళ్లీ పాడుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని చాలా మిస్ అయ్యాను. ఈ వైరల్ పాపులారిటీ మూలాన అవకాశాలు వస్తే కెమెరా ముందు నటిస్తాను అంటోంది. మరి కల్పనా కోరిక నెరవేరుతుందా? మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాలి! వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన కల్పనా.. చివరగా హమ్ సాత్ సాత్ హై (1999) మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by RISE & INSPIRE 💫 (@rise_and_inspire_org) చదవండి: కవలలు పుట్టాక రామ్చరణ్ ఫస్ట్ పోస్ట్. -
ఆడవాళ్లపై ఇలాంటి ట్రోల్సా? చెండాలం: యాంకర్ ఫైర్
ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని రూమర్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, యాంకర్ షెఫాలి బగ్గా డిన్నర్కు వెళ్లడంతో వీరు లవ్లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పోస్టర్ వైరలవుతోంది.యాంకర్ ఫైర్ఇందులో చాహల్ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్ అని కౌంటరిచ్చింది.పెళ్లి- విడాకులుఇకపోతే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్ ఆర్జే మహవశ్తో కొంతకాలం రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్గా ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. బిగ్బాస్తో ఫేమస్అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్ ఇచ్చిన కౌంటర్తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్ యాంకర్. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో పార్టిసిపేట్ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.చదవండి: అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ -
ఎప్స్టీన్ ఫైల్స్లో మీరా నాయర్
న్యూయార్క్: జెఫ్రీ ఎప్స్టీన్పై అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన దర్యాప్తు పత్రాల్లో బాలీవుడ్ దర్శకురాలు, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు సైతం ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ప్రియురాలు మాక్స్వెల్ ఇచ్చిన విందుకు మీరా నాయర్ హాజరైనట్లు ఓ ఈమెయిల్ సందేశాన్ని ఈ పత్రాల్లో ప్రస్తావించారు. మాక్స్వెల్ ఇంట్లో జరిగిన ఓ సినిమా ప్రదర్శనకు, ఆ తర్వాత జరిగిన విందులో ఆమె పాల్గొన్నట్లు ఇందులో ఉంది. 2009 అక్టోబర్ 21న ఈ ఈమెయిల్ను అమెరికన్ ప్రచురణకర్త పెగ్గీ సీగెల్ మరొకరికి పంపించారు. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా హాజరైనట్లు మెయిల్లో పోస్టుచేశారు. ఈ సినిమా మహిళలకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. అయితే, అది ఏ సినిమా అన్నది మెయిల్లో స్పష్టంగాలేదు. అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే అది ‘అమెలియా’అనే చిత్రం. మీరా నాయర్ దర్శకత్వం వహించారు. అమెరికా పైలట్ అమెలియా ఇయర్హర్ట్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిల్లరీ స్వాంక్, రిచర్డ్ గెరే నటించారు. విమానంలో ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ప్రయత్నంలో అమెలియా 1937లో పసిఫిక్ సముద్రంపై ఉండగా అదృశ్యమయ్యారు. అయితే, ఎప్స్టీన్ పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంపై మీరా నాయర్ ఇంకా స్పందించలేదు. -
వీర జవాన్గా సల్మాన్.. ఇది రొమాంటిక్ లుక్ కాదు!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. గతకొంతకాలంగా ఆయన చేసిన సినిమాలేవీ విజయాన్ని సాధించడం లేవు. దీంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న "బ్యాటిల్ ఆఫ్ గల్వాన్" సినిమాపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ వదిలారు. అందులో ఓ సన్నివేశంలో సల్మాన్ లుక్, యాక్టింగ్పై ట్రోల్స్ వచ్చాయి.సల్మాన్పై విమర్శలుసైనికుడు చూపించే ధైర్యసాహసాలు అతడి ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి సల్మాన్ తాజాగా కౌంటరిచ్చాడు. ఈ మేరకు ఐఎస్పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) ఈవెంట్లో మాజీ క్రికెటర్, యాంకర్ మహ్మద్ కైఫ్తో సల్మాన్ సంభాషిస్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో కైఫ్.. సల్మాన్ను బ్యాటిల్ ఆఫ్ గల్వాన్లో ఎలా పోజిచ్చాడో అలా ఓ లుక్కివ్వమన్నాడు. నేను కల్నల్నిఅప్పుడు సల్మాన్.. ఇప్పుడు కొంతమంది ఇది రొమాంటిక్ లుక్ అనుకుంటారు.. కానీ, ఇది కల్నల్ పోజ్. తన జట్టును, సైనికులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాగా తెలిసిన కల్నల్ ఇలాగే ఉంటాడు అంటూ ట్రోలర్స్కు చురకలంటించాడు . బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా విషయానికి వస్తే.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిత్రాంగద సింగ్, అభిలాష్ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్బాబు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశభక్తి మూవీ ఏప్రిల్ 17న విడుదల కానుంది. LATEST: Salman Khan Hits back at all the trolls regarding Battle of Galwan teaser!"Mai colonel hu movie me, Mujhe Calm rehna parega. Kuch log bs faltu ka troll karte. Mai chila bhi sakta hu, but suit ni karega" #SalmanKhan #BattleOfGalwan pic.twitter.com/MY1PY3LgeA— Being ADARSH⚡ (@IBeingAdarsh_) January 31, 2026చదవండి: ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతంటే? -
ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా?
బాలీవుడ్లో రిచెస్ట్ హీరోయిన్, అందాలరాశి ఎవరంటే ముందు ఐశ్వర్యరాయ్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు సినిమా రంగాన్ని ఏలిన ఐష్ ఆస్తి విలువ దాదాపు రూ.900 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్న ఐశ్వర్య తొలి సంపాదన ఎంతో చూసేద్దాం..తొలి సంపాదన ఎంతంటే?బాలీవుడ్ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఐశ్వర్యరాయ్ను తొలిసారి చూసినప్పుడు ఆమెకు 18 లేదా 19 ఏళ్లు ఉంటాయనుకుంటా.. ఐదువేల రూపాయలకే మూడు యాడ్స్లో నటించింది. అలా మొదలైందిఒకదాంట్లో అయితే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఉందంతే! కానీ ఐశ్వర్య లుక్స్ అందరినీ ఆకర్షించేవి. దాంతో వాణిజ్య ప్రకటనలో నటించమని ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలా అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈయన ఫిరాఖ్, ఫిర్ మిలేంగే, పేజ్ 3 వంటి పలు సినిమాలు నిర్మించాడు.జర్నీ1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. జీన్స్ అనే తమిళ చిత్రంతో అందరి కంట్లో పడింది. దేవదాస్, జోధా అక్బర్, ఏ దిల్ హై ముష్కిల్, హమ్ దిల్దే చుకే సనం వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్గా మారింది. కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ డ్యాన్స్తో అద్భుతః అనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చివరగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో యాక్ట్ చేసింది. 2009లో కేంద్రం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయాలనుకున్నా: ఆలియా -
సోషల్ మీడియా డిలీట్ చేయాలనుకున్నా: ఆలియా
అమ్మ అన్న పిలుపుతో ఆడదాని లోకమే మారిపోతుందంటారు. హీరోయిన్ ఆలియా భట్ కూడా అందుకు అతీతురాలు కాదు. తల్లయ్యాక తన ప్రపంచమే మారిపోయిందంటోంది ఆలియా. మాతృత్వం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గర్భిణీగా ఉన్న తొమ్మిది నెలల్లో చాలా మార్పులొస్తాయి. శరీరమే కాదు మన ఆలోచన విధానాలు కూడా మారుతుంటాయి. డిలీట్ చేయాలన్న ఆలోచనఎప్పుడైతే కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డను కళ్లారా చూస్తామో అప్పుడు పూర్తిగా మనల్ని మనమే మర్చిపోతాం. తనే ప్రపంచంగా మనకే తెలియనంతగా మారిపోతాం. మళ్లీ ఒకప్పటిలా ఉండాలనుకున్నా అది అసాధ్యం. చాలాసార్లు సోషల్ మీడియా డిలీట్ చేయాలనిపించేది. కానీ నా కెరీర్ ప్రారంభం నుంచి నన్ను సపోర్ట్ చేసినవారితో బంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక ఆ ఆలోచన విరమించుకున్నాను. కొన్నిసార్లు నా వ్యక్తిగత విషయాల్ని అందరితో పంచుకోవాలనిపించడం లేదు. నేను కూడా ట్రై చేయాలిఅది నా పర్సనల్ అని నా అభిప్రాయం. నా ఫోన్లో మొత్తం రాహా ఫోటోలే ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఫోటోలు దిగడానికి ప్రయత్నించాలి అని చెప్పుకొచ్చింది. ఆలియా భట్- రణ్బీర్ కపూర్ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం ఆలియా, రణ్బీర్.. లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నారు. నిర్మాతగా డోంట్ బీ షై సినిమా చేస్తోంది.చదవండి: సినిమాలు వర్కవుట్ కాకపోతే సీరియల్స్? చంద్రహాస్ ఏమన్నాడంటే? -
బేబీ బంప్తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)
-
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్టైమ్.. అసలు కారణలేంటి?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్ మూవీని కట్ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.రన్టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో 3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్ఫ్లిక్స్లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.నెట్ఫ్లిక్స్తో పాటు ఇతర ప్లాట్ఫారమ్కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు నిర్మాతలు అందించిన వర్షన్ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. -
ఒకప్పుడు తాగుడుకు బానిసనయ్యా..: హృతిక్ రోషన్ సోదరి
అలవాట్లకు బానిసవడం ఈజీయేమో కానీ దాన్ని వదిలించుకుని బయటకు రావడం కష్టం. కానీ, ఆ కష్టాన్ని తను జయించానంటోంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్. మద్యపానం అనే వ్యసనం నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలను తాజాగా గుర్తు చేసుకుంది.అదే పెద్ద విషయంసునయన మాట్లాడుతూ.. సమస్యను అంగీకరించడం అన్నింటికంటే పెద్ద విషయం. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామని గుర్తించామంటే అక్కడే మార్పు మొదలవుతుంది. తిండి, మద్యపానం.. ఇతరత్రా ఎన్నో అలవాట్లు వ్యసనంగా మారుతుంటాయి. మనం అందులో పూర్తిగా మునిపోతున్నామన్నది మనకే అర్థం కాదు. నేను తాగుడుకు బానిసయ్యాను. తర్వాత ఒకానొక సమయంలో స్వీట్లు, జంక్ ఫుడ్ ఎక్కువ లాగించడం మదలుపెట్టాను. ఒక్క అడుగువాటన్నింటినీ వదిలించుకోవడం, దూరం పెట్టడం అంత ఈజీ కాదు. ధృడ సంకల్పం, మనచుట్టూ ఉండేవారి సపోర్ట్తోనే వ్యసనాల నుంచి బయటకు రాగలం. ఒక్క అడుగు ముందుకేసి వాటిని జయించొచ్చు. భయపడకుండా ముందడుగు వేయండి. ఓపెన్గా మాట్లాడండి అని ఓ వీడియో షేర్ చేసింది. ఈ పోస్ట్కు హృతిక్ రోషన్ స్పందిస్తూ లవ్యూ దీదీ అని కామెంట్ పెట్టాడు. తండ్రి రాకేశ్ రోశన్ సైతం నువ్వొక ఇన్స్పిరేషన్ అని కామెంట్ చేశాడు.వ్యసనంగా..గతంలోనూ సునయన తన తాగుడు వ్యసనం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కొద్దిగా మొదలైన తాగుడు తర్వాత తీవ్రంగా మారిందని తెలిపింది. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగడం ఒకటే పనిగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే మద్యపానం సేవించడం వల్ల తాను ఏం చేస్తున్నాననే విషయాలను కూడా మర్చిపోతున్నట్లు తెలిపింది. డీ అడిక్షన్ సెంటర్కు కూడా వెళ్లానని, చివరకు ఈ వ్యసనంపై విజయం సాధించానంది.చదవండి: ఫలక్నుమాదాస్.. విశ్వక్తో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే? -
అమ్మానాన్న ఏడ్చేశారు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా
ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ బాలీవుడ్ మూవీ 'ధురంధర్'తో హీరోయిన్గా మారింది. యలీనా జమైల్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.ఆరోజు మర్చిపోలేనుసినిమా ప్రమోషన్స్లో భాగంగా సారా అలీ ఖాన్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్ అయ్యాక పేరెంట్స్ రియాక్షన్ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాను. ధురంధర్అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ధురంధర్ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి మూవీ.. ఎక్కడంటే? -
స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!
బాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ అర్జిత్సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఇటీవల అందరినీ ఆశ్చర్య పరిచారు. కరియర్ పీక్లో ఉండగా సంగీత ప్రపంచానికి వీడ్కోలు పలకడం, ప్లేబ్యాక్ సింగర్ ఇకపై కొత్త ప్రాజెక్టులను తీసుకోనని అర్జిత్సింగ్ ప్రకటించి సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేశాడు. ఇప్పటికే ఉన్న కమిట్మెంట్లను నెరవేరుస్తానని, స్వతంత్రంగా సంగీతాన్ని కొనసాగిస్తానన ప్రకటించాడు. ప్లే బ్యాక్ సింగింగ్ నుండి వైదొలగాలనే అతని నిర్ణయం తర్వాత, అతని తదుపరి అడుగుపై ఊహాగానాలు మొదలయ్యాయి.అర్జిత్సింగ్ త్వరలోనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 2026 ఎన్నికలకు ముందు కాకుండా, తొలుత అతను క్షేత్రస్థాయిలో ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నాడట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికలలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఎన్డిటివి నివేదిక పేర్కొంది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగం కాకపోవచ్చని ఆ నివేదిక తెలిపింది. బెంగాలీ చిత్ర పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ, సింగ్ మొదట క్షేత్రస్థాయిలో ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఆలోచించవచ్చని ఆ నివేదిక పేర్కొంది. కెరీర్ను రాజకీయ రంగంలోకి మార్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాడని సన్నిహిత వర్గాల సమాచాం.పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా, జియాగంజ్కు చెందినవాడు అర్జిత్ సింగ్. 2005లో “ఫేమ్ గురుకుల్” అనే రియాలిటీ షోలో పోటీదారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే పోటీ నుండి మధ్యలోనే నిష్క్రమించాడు. రియాలిటీ షో తర్వాత, అతను కొన్ని సంవత్సరాలు ప్రీతమ్కు సంగీత సహాయకుడిగా పనిచేసి, ఆ తర్వాత 2011లో ప్లేబ్యాక్ గాయకుడిగా అరంగేట్రం చేశారు.గత కొన్నేళ్లుగా ఎన్నో హిట్ సాంగ్స్కు అదీ ప్రేమగీతాలకు మారుపేరుగా నిలిచాడు. బాలీవుడ్ నుండి వచ్చిన దాదాపు ప్రతి పెద్ద హిట్ చిత్రంలో సింగ్ పాడిన కనీసం ఒక పాట తప్పనిసరిగా ఉంటుంది. బాలీవుడ్ లెజెండ్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్.రణబీర్ కపూర్ వంటి ప్రముఖ తారలకు ప్లేబ్యాక్ సింగర్గా తన సత్తా చాటుకున్నాడు. 38 ఏళ్ల అర్జిత్సింగ్ తన రాజకీయ జీవితంపై వస్తున్న ఊహాగానాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
దురంధర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. అదొక్కటే నిరాశ
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్ వెర్షన్ రన్టైమ్ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్కట్ వెర్షన్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా రన్టైమ్ తగ్గడం ఆడియన్స్ను నిరాశకు గురి చేస్తోంది.కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. It’s official! 🔒🔥Dhurandhar drops on Netflix TONIGHT! pic.twitter.com/gsAGMURqj7— Fozzy (@fozzywrites) January 29, 2026 -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు ఆదరణ పెరిగిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీ ముందు వచ్చేస్తోంది. ఇప్పటికే రిలీజై క్రేజ్ దక్కించుకున్న కొహరా వెబ్ సిరీస్ సీజన్-2 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సిరీస్లో మోనా సింగ్, బరున్ సోబ్తి కీలక పాత్రల్లో నటించారు.ఈ నేపథ్యంలోనే కొహరా సీజన్-2 ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హత్యల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మర్డరీ మిస్టరీ సిరీస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లు ఇష్టపడేవారు కొహరా చూసేయండి. -
దురంధర్ అరుదైన రికార్డ్.. పుష్ప-2, బాహుబలి-2 తర్వాత..!
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది.తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్-2 చిత్రాన్ని దాటేసింది. పుష్ప-2, బాహుబలి-2 సినిమాల తర్వాత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇండియాలో రూ.1002 కోట్ల వసూళ్లు సాధించింది. మనదేశంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ మూవీగా అవతరించింది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(రూ.760) పేరిట ఉన్న ఈ రికార్డ్ను తుడిచిపెట్టేసింది.అరుదైన రూ.1000 కోట్ల క్లబ్రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' మూవీతో పాటు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి. ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'(రూ.1,471 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి- 2: ది కన్క్లూజన్ (రూ.1417 కోట్లు) రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో మూడో చిత్రంగా దురంధర్(రూ.1002) నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2(రూ.1001) కోట్లతో నాలుగో ప్లేస్ దక్కించుకుంది.కాగా.. ఈ స్పై థ్రిల్లర్కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇందులో రణ్వీర్ ప్రధాన పాత్రలో నటించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సీక్వెల్గా ధురందర్ -2 మార్చిలో విడుదల కానుంది.భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు1 పుష్ప 2 -రూ.1471 కోట్లు2 బాహుబలి 2- రూ.1417 కోట్లు3 ధురందర్- రూ.1002 కోట్లు4 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.1001 కోట్లు5 ఆర్ఆర్ఆర్- రూ.916 కోట్లు6 కల్కి 2898 ఏడీ- రూ.767 కోట్లు7 జవాన్- రూ.760 కోట్లు8 కాంతార చాప్టర్ 1- రూ.741 కోట్లు9 ఛావా- రూ.716 కోట్లు10 స్త్రీ 2- రూ.713 కోట్లు -
ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)
-
ఆ కారణాల వల్లే సినిమాలకు అర్జిత్ సింగ్ గుడ్బై
తన గాత్రంతో ప్రేమ పల్లకిలో ఊరేగిస్తాడు.. అంతలోనే అలక తెప్పిస్తాడు. సడన్గా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అలా అర్జిత్ సింగ్ గొంతు పలికించే భావాలకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో వందలాది పాటలు పాడాడు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ ప్రతిభ చూపిన ఆయన సడన్గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశాడు.సడన్గా ఎందుకిలా?అయితే ఉన్నపళంగా సినిమా పాటలకు విరామం ప్రకటించడం వెనక కారణాలేమై ఉంటాయని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఇంతలో అతడే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. ఇప్పటివరకు సినిమా పాటల రూపంలో అలరించిన అర్జిత్ సింగ్ మరో రూపంలో ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలని..ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్కు ఒక్క కారణమంటూ లేదు. చాలా అంశాలు భాగమై ఉన్నాయి. చాలారోజులుగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ధైర్యం కూడదీసుకుని మీతో పంచుకున్నాను. నాకు పాటల్ని ఒకేలా పాడటం ఇష్టముండదు. అందుకే వేదికలపై దాన్ని కాస్త మార్చి పాడుతుంటాను. నేను ఇండస్ట్రీలో చాలా త్వరగా ఎదిగాను. ఇక్కడే ఆగిపోకుండా ఇంకా డిఫరెంట్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. ఇండిపెండెంట్ సంగీతంపై దృష్టి సారిస్తాను.పూర్తి చేస్తా..మరో విషయం ఏంటంటే.. కొత్త గాయకుల పాటలు వినాలనుంది. వాళ్లు తమ టాలెంట్తో నాకు స్ఫూరిస్తున్నారు. కాబట్టి వారిని ప్రోత్సహించాలన్నది కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఒప్పుకున్న పాటల్ని మధ్యలో వదిలేయనని.. వాటిని పూర్తి చేసి తీరతానని వెల్లడించాడు.సినిమాఅర్జిత్ సింగ్.. హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ.. ఇతర భాషల్లోనూ పాటలు పాడాడు. కనులను తాకే ఓ కల.. (మనం), అదేంటి ఒక్కసారి.. (స్వామి రారా), దేవ.. దేవ.. (బ్రహ్మాస్త్ర) ఇలా ఎన్నో సాంగ్స్ ఆయన పాడినవే! సంగీతరంగంలో అతడు అందించిన సేవలకు గానూ అర్జిత్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. సినిమా పాటలు ఇకపై పాడనన్న అర్జిత్.. ఇండిపెండెంట్ సింగర్గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడన్నమాట!చదవండి: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్ -
నేనే హీరో.. నేనే విలన్: రణ్బీర్ కపూర్
‘యానిమల్:పార్క్’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిప్రారంభం అవుతుందని తెలిపారు బాలీవుడ్ నటుడు రణ్బీర్కపూర్. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్కపూర్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘యానిమల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా, బాబీడియోల్ విలన్ గా, ఓ కీలక పాత్రలో త్రిప్తి దిమ్రీ నటించారు. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ చివర్లో ‘యానిమల్’ చిత్రానికి సీక్వెల్గా ‘యానిమల్:పార్క్’ రానున్నట్లుగా మేకర్స్ తెలిపారు.తాజాగా ఈ ‘యాని మల్’ సినిమా సీక్వెల్పై ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్కపూర్ స్పందించారు. ‘‘సందీప్రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాను ఓ ఫ్రాంచైజీలా మూడు భాగాలుగా తీయాలని నాతో అన్నారు. తొలిభాగం ఆల్రెడీ వచ్చేసింది. రెండోభాగం ‘యానిమల్: పార్క్’ సినిమా చిత్రీకరణను 2027లో స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. హీరోగా నటించడంతో పాటుగా, విలన్ గానూ కనిపిస్తాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రణ్బీర్కపూర్. ప్రస్తుతం రణ్బీర్ కపూర్ ‘రామాయణ: పార్టు 1, రామాయణ: పార్టు 2’ చిత్రాలతో పాటుగా, ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ దీపావళికి ‘రామాయణ: పార్టు 1, వచ్చే దీపావళికి రామాయణ:పార్టు 2’ చిత్రాలు రిలీజ్ కానున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘లవ్ అండ్ వార్’ చిత్రం 2027లో రిలీజ్ కానుంది.రాణీముఖర్జీ గొప్ప నటి: రణ్బీర్ కపూర్నటిగా బాలీవుడ్ హీరోయిన్ రాణీముఖర్జీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయంపై కూడా రణ్బీర్కపూర్ స్పందించారు. ‘‘భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో రాణీముఖర్జీ ఒకరు. నా తొలి చిత్రం ‘సావరియా’లో రాణీతో కలిసి నటించాను నేను. కష్టపడి నటించాలని నాకు చెబుతూ, నన్నుప్రోత్సహించిన తొలి వ్యక్తి తనే. ఆ సినిమా చిత్రీకరణ సమయం లో ఆమెతో నాకు జరిగిన సంభాషణలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాణీముఖర్జీ 30 ఏళ్ళ సినీ జర్నీని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా అద్భుతం. ఇప్పటికీ ఆమె ఎంచుకునే పాత్రలు, సినిమాలు సిల్వర్స్క్రీన్ పై మహిళలను గొప్పగా చూపించేలా ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ఇక రాణీముఖర్జీ నటించిన ‘మర్దానీ 3’ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. -
ప్రముఖ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ రిటైర్మెంట్ ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ సింగర్ తన కెరీర్కు గుడ్ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్బై చెప్పిన అర్జిత్ ఇండిపెండెంట్ సింగర్గా కొనసాగుతారని సమాచారం. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsingh) -
ప్రెగ్నెన్సీ.. మహిళ ఒక ఆవులా కనిపిస్తుంది: శ్రియ
ప్రెగ్నెన్సీ జర్నీలో భార్యకు భర్త తోడుండాలంటోంది హీరోయిన్ శ్రియా శరణ్. ఆ సమయంలో భర్త తోడు ఎక్కువ కావాలనిపిస్తుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా మాట్లాడుతూ.. మహిళ గర్భం దాల్చినప్పుడు తన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటోందంటే అదొక అద్భుతమైన అనుభవం. అతడిదే బాధ్యతకానీ ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపులో ఉండవు. కడుపులో ఓ బిడ్డను మోస్తూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు నీలాగే కనబడవు. ఆ సమయంలో ఆడవారి శరీరం ఒక ఆవులా కనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే! నేను గర్భం దాల్చినప్పుడు ఎక్కువ బాధగా అనిపించేది. నా భర్త నాతో ఎక్కువసేపు ఉంటే బాగుండనిపించేది. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పనికి వెళ్లాలనిపించేది. ఇలా నా ఎమోషన్స్ అదుపులో ఉండేవి కాదు అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రియా.. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్ను 2018లో పెళ్లి చేసుకుంది. 2021లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు రాధా శరణ్ కొశ్చీవ్ జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను, ఛత్రపతి, మనం వంటి పలు సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కొన్ని ఐటం సాంగ్స్లోనూ తళుక్కుమని మెరిసింది. చివరగా మిరాయ్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం హిందీ దృశ్యం 3లో నటిస్తోంది.చదవండి: తరుణ్ భాస్కర్తో డేటింగ్? తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్ -
బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నా: బాలీవుడ్ హీరో
కష్టాలు దాటుకుని సక్సెస్ను ఆస్వాదిస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే ఒకరు. చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఈయన తాజాగా వాటిని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. అప్పటివరకు కాఫీ షాప్లో పని చేశాను. రోజులో 16 గంటలు పనినా చదువు ముందుకు సాగాలంటే ఆ ఉద్యోగం చేయడం తప్పనిసరి. ముంబైలోని ఓ రెస్టారెంట్లో కూడా పని చేశాను. అదే సమయంలో ఓ డ్యాన్స్ గ్రూప్కు అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశాను. ప్రతిరోజు నాలుగు లోకల్ ట్రైన్స్ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని. పార్లీజీ బిస్కెట్, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. తర్వాత నేనొక షో చేశాను. దానికోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను. డబ్బు కూడా సగమే..తీరా ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. ఇలాంటి సమస్యలు యాక్టర్స్కు చివరి నిమిషం వరకు తెలియవు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను అని గుర్తు చేసుకున్నాడు.సీరియల్, సినిమావిక్రాంత్ మాస్సే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్ హై వంటి సీరియల్స్లో యాక్ట్ చేశాడు. సినిమాల్లో రాణించాలన్న ఆశతో బుల్లితెరకు గుడ్బై చెప్పాడు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో సినిమా చేస్తున్నాడు. షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.చదవండి: ఫ్లాప్ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే: చిరంజీవి కౌంటర్? -
పనిమనిషిపై పదేళ్లుగా అత్యాచారం.. 'ధురంధర్' నటుడు అరెస్ట్
బాలీవుడ్ హిట్ సినిమా ధురంధర్తో పాపులర్ అయిన నటుడు నదీమ్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్లుగా తన ఇంటి పనిమనిషిపై అత్యాచారం, లైంగిక దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాదితురాలే స్వయంగా మాల్వాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ధురంధర్లో అక్షయ్ ఖన్నా (రెహమాన్ దకైత్) వంటవాడిగా అఖ్లాక్ పాత్రతో నదీమ్ కనిపించాడు. నదీమ్ తనను మానసిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పేర్కొంది. తనపై భయంతోనే ఈ విషయాన్ని ఇన్నేళ్లు దాచినట్లు ఆమె తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అనేకసార్లు నేను కోరడంతో దాటవేస్తూ వచ్చాడని ఆమె పేర్కొంది. నదీమ్ మిమి (2021), వాధ్ (2022), మై లడేగా (2024) వంటి చిత్రాల్లో కూడా నటించాడు. అమితాబ్ బచ్చన్తో కలిసి కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్లో కూడా నదీమ్ పాల్గొన్నాడు. -
బాలీవుడ్పై ప్రకాశ్ రాజ్ విమర్శలు
సౌత్ టు నార్త్.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్ రాజ్. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్లో కేరళ లిటరేటర్ ఫెస్టివల్కు ప్రకాశ్ రాజ్ హాజరయ్యాడు. సహజత్వం లేదుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్లా ఉంటుంది.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. ఫోకస్ అంతా దానిపైనేదళితుల సమస్యలను తమిళ యంగ్ డైరెక్టర్స్ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్లు వచ్చాక బాలీవుడ్ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్, రీల్స్, ప్రమోషన్స్.. వీటిపైనే ఫోకస్ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్ ఇచ్చిన నటి -
విడాకులు.. కొత్త కారు కొన్న బుల్లితెర నటి
బుల్లితెర నటి మహి విజ్ ఇటీవలే వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టింది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలుకుతూ భర్త జే భానుషాలితో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆమె కొత్త కారు కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మినీ కూపర్ ఇంటికి తీసుకొచ్చామంటూ మహి వీడియో షేర్ చేసింది. దానిపై జే స్పందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు.కూతురికి గిఫ్ట్ఇకపోతే తారకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మినీ కూపర్ కావాలని అడిగింది. అప్పుడు అంత అవసరం, స్థోమత లేక కొనలేదు. కానీ ఇప్పుడు తన కోరిక నెరవేర్చే సమయం వచ్చిందంటోంది మహి. అందుకే తనకెంతో ఇష్టమైన కూపర్ కారును గిఫ్టుగా ఇచ్చానంటోంది. మహి.. తెలుగు సినిమా తపనలో హీరోయిన్గా నటించింది. సినిమాల్లో అదృష్టం కలిసిరాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయింది. సీరియల్స్జే భానుషాలి.. మూవీస్ చేయడంతోపాటు సీరియల్స్ చేశాడు. హిందీ బిగ్బాస్ 15వ సీజన్లోనూ పాల్గొన్నాడు. జే- మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ జంటగా నాచ్ బలియే డ్యాన్స్ షో 5వ సీజన్లో పాల్గొని ట్రోఫీ గెలిచారు. ఈ జంటకు కూతురు తార సంతానం. బాబు రాజ్వీర్, పాప ఖుషిల బాధ్యతను కూడా ఈ దంపతులే చూసుకుంటున్నారు. గతేడాది చివర్లో ఇద్దరూ విడిపోయారు. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: బిగ్బాస్ సోనియా బారసాల ఫంక్షన్ -
ఇంట్లో అందరూ హీరోయిన్సే.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్. తెలుగులోనూ ఒక సినిమా చేసింది. ఈమె అక్క, తల్లి, అమ్మమ్మ అందరూ హీరోయిన్సే కావడం విశేషం. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తనే రియా సేన్. ఈరోజు ఆమె 45వ పుట్టినరోజు(జనవరి 24). ఈ సందర్భంగా తన కెరీర్ను ఓసారి చూసేద్దాం.ఫ్యామిలీ మొత్తం..రియా సేన్ది బెంగాలీ కుటుంబం. ఆమె తల్లి మూన్మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్ ఇద్దరూ పేరున్న నటీమణులే. ఆ రక్తమే తనలో, తన అక్క రైమా సేన్లో ప్రవహించింది. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీనే ఎంచుకున్నారు. హీరోయిన్స్గా రాణించారు. రియా సేన్ ఐదేళ్ల వయసులోనే తన తల్లి సినిమాలో కూతురిగా యాక్ట్ చేసింది. అక్కాచెల్లెళ్లకు అచ్చిరాని టాలీవుడ్టీనేజ్కు రాగానే తాజ్మహల్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా మారింది. తమిళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక మూవీ 'నేను మీకు తెలుసా?'. ఈ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఇక్కడ అవకాశాలే రాలేదు. దాంతో టాలీవుడ్కు గుడ్బై చెప్పి బాలీవుడ్లోనే సెటిలైంది. ఈమె అక్క రైమా సేన్ కూడా తెలుగులో ధైర్యం అని ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం!సినిమా, పెళ్లిరియా బాలీవుడ్లో స్టైల్, ఝంకార్ బీట్స్, ఖయామత్, అప్న సప్న మనీ మనీ, లవ్ కిచిడీ.. ఇలా అనేక సినిమాలు చేసింది. మధ్యలో ఐటం సాంగ్స్లోనూ తళుక్కుమని మెరిసింది. ఓటీటీలో రాగిని ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్, పాయిజన్, మిస్మ్యాచ్ 2, కాల్ మీ బే వెబ్ సిరీస్లలో కనిపించింది. 2017లో వ్యాపారవేత్త శివం తివారిని రియా సేన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. అయితే ఆ తర్వాత మాత్రం తన పెళ్లి గురించి రియా ఎప్పుడూ ఓపెన్ అవలేదు. View this post on Instagram A post shared by Raima Sen Dev Varma (@raimasen) చదవండి: స్టార్ హీరోకు తల్లిగా అడిగారు.. అయిష్టంగానే చేశా: మీనా -
ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్
యాక్టర్సే కాదు సింగర్స్ కూడా లక్షల్లో ఏకంగా కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే అందరి పరిస్థితి అలా లేదంటున్నాడు బాలీవుడ్ సింగర్ కృష్ణ బ్యూరా. ఇతడు చక్దే ఇండియాలో మౌలా మేరే లేలే మేరీ జాన్, ఆషిక్ బనాయా ఆప్నేలో ఆప్కీ కాశిశ్ వంటి పలు సాంగ్స్ ఆలపించాడు. తనకు సరైన పారితోషికం ఇవ్వలేదని చెప్తున్నాడు.సరైన పారితోషికం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్లో సింగర్స్ కోసం ఎటువంటి విధివిధానాలు లేవు. ఆర్టిస్ట్కు ఒకరోజుకు ఇంత అని ఎలా ఇస్తారో.. సింగర్ను స్టూడియోకు పిలిపించినప్పుడు కనీసం రూ.10 వేలయినా ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఆప్ కీ కాశిశ్ పాటకు నాకు రూ.10 వేలిచ్చారు. అందులో రూ.900 టీడీఎస్ కట్ అయింది. చక్దే ఇండియాలో ఒక పాట పాడినందుకు మళ్లీ అంతే ఇచ్చారు.పైసా రాలేరాజ్ మూవీలోని సోనియా ఓ సోనియా పాటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోకో కహా దుండెరే బండె, మేరా ఇంతకం దేకేగి పాటలకు పైసా పారితోషికం ఇవ్వలేదు. నా 23 ఏళ్ల కెరీర్లో సినిమా పాటలు పాడి పెద్దగా సంపాదించిందే లేదు. మేము బయట షోలు, కచేరీల ద్వారా బాగా సంపాదిస్తామని ఇక్కడ నిర్మాతలు అనుకుంటారు. డిమాండ్ ఉంటేనేపోనీ, మొమహమాటం పక్కనపెట్టి డబ్బు అడిగామనుకో.. నెక్స్ట్ టైం నీకు పాడే ఛాన్స్ ఇవ్వరు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కొందరు పాటకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకుంటారు. ఒక్క సాంగ్కు రూ.50 లక్షలు, రూ.3 కోట్ల వరకు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. సింగర్స్కు డిమాండ్ ఉంటేనే వారు అడిగినంత ఇస్తారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లికి పిలిచి అవమానించాలా? అసభ్యంగా ఫోటోలు, వీడియోలు: నటి ఆగ్రహం -
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!
యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పాటు బయట ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. నటి మౌనీ రాయ్ కూడా అలాంటి ప్రోగ్రామ్స్కు తరచూ వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హర్యానాలోని కర్నాల్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్కు హాజరైంది. అయితే ఆ కార్యక్రమం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నడుముపై చేయి వేసిన అంకుల్స్'కర్నాల్లో ఓ ఈవెంట్కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పరిస్థితి మరింత ఘోరంఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్ చెండాలమైన కామెంట్స్ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు.తలుచుకుంటనే భయంగాఅవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు వచ్చిన కళను నమ్ముకుని మేము బతుకుతున్నాం. వీళ్ల కూతురితోనో, అక్కాచెల్లితోనే వేరేవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా? మగవాళ్లమన్న అహంకారమా?కొంచెమైనా సిగ్గుండాలి! ఇంకో విషయం.. స్టేజీ కాస్త హైట్లో ఉంది. దాంతో ఈ అంకుల్స్.. లో యాంగిల్లో వీడియోలు తీశారు. కొందరు అది చూసి వీడియోలు షూట్ చేయడం ఆపమని చెప్పినందుకు వారిపైనే అరిచారు. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని దీవించేందుకు ఈ ప్రోగ్రామ్స్కు పిలుస్తారు, రివర్స్లో మాకు జరిగేది ఇలాంటి వేధింపులు, అవమానం!' అని మౌనీరాయ్ ఆవేదన వ్యక్తం చేసిందిద.సీరియల్స్, సినిమాలుమౌనీరాయ్.. క్యూంకీ సాస్భీ కబీ బహుతీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. పలు సీరియల్స్లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. జర నచ్కే దిఖా 1 సీజన్ విన్నర్గా నిలిచింది. నాగిని సీరియల్తో ఫుల్ ఫేమస్ అయింది. గోల్డ్, మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, ద భూతిని సినిమాల్లో నటించింది. కేజీఎఫ్ 1లో స్పెషల్ సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: చెట్ల మందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి -
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ) -
కాల్పుల ఘటనలో సినీ నటుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.. కొద్దిరోజుల క్రితం ముంబైలో ఓ నివాసంలో కాల్పులు జరిగిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది కమల్ రషీద్ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి కమల్ను అంధేరీ పోలీసులు అరెస్ట్ చేశారు.కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. తనకు తానుగా సినీ విమర్శకుడిగా ఆయన చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే, రచయిత-దర్శకుడు నీరజ్ కుమార్ మిశ్రా నివసించే అంధేరీలోని ఒక నివాస భవనంపై కమల్ రషీద్ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 18న తన లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు అతను అంగీకరించాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని.. తన గన్ను శుభ్రం చేసిన తర్వాత ఫారెస్ట్ వైపు కాల్పులు జరిపానన్నారు. పొరపాటున బుల్లెట్లు ఆ భవనం వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. గతంలో నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన ఖాన్, ఎవరికీ హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల వెనుక గల ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అదే భవనం నాలుగో అంతస్తులో మోడల్ ప్రతీక్ నివసిస్తుండటం గమనార్హం. -
ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్ చేస్తాడంతే!
బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించింది రిమి సేన్. ఇప్పుడు మాత్రం సినిమాలకు గుడ్బై చెప్పేసి దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తోంది. ఇండియాలో ఏజెంట్లను ఏదో తప్పుపనిచేసేవారిలా చూస్తారు, కానీ అక్కడ దర్జాగా బతుకుతున్నానని చెప్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లోని ఓ టాప్ హీరోకు యాక్టింగ్ రాదని గాలి తీసింది. అదే సమయంలో అతడి తెలివితేటల్ని మెచ్చుకుంది.యాక్టింగ్ రాదన్న కామెంట్స్ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం. రిమి సేన్ మాట్లాడుతూ.. జాన్ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతడు మొదట్లో మోడల్గా పని చేశాడు. యాక్టింగ్ అనేదే రాదు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుతుంటే అతడు పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్కు బదులుగా స్టైలిష్గా, స్క్రీన్పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే ఎంచుకునేవాడు. ఉదాహరణకు యాక్షన్ సినిమాలు. తెలివైనవాడుఆ సినిమాల్లో అతడు బాగా కనిపించేవాడు, అప్పుడు జనాలు అతడేం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా అతడు చాలా తెలివైన నటుడు. అయితే పాపులారిటీ పెరుగుతూ ఉండేసరికి అతడే నెమ్మదిగా యాక్టింగ్ నేర్చుకున్నాడు. పదేపదే కెమెరా ముందుకు వస్తూ ఉంటే అది మనకు ఎంతో కొంత అనుభవం నేర్పుతుంది కదా. అలా తనపై తనకు నమ్మకం ఏర్పడ్డాక నటనకు అవకాశమున్న పాత్రల్ని ఎంచుకున్నాడు. రానురానూ..తన పరిధులేంటో తనకు బాగా తెలుసు కాబట్టే మొదట్లో యాక్షన్.. రానురానూ పర్ఫామెన్స్కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే అతడిని తెలివైనవాడని చెప్తుంటాను. తర్వాత నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు, బిజినెస్మెన్గా రాణించాడు అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. జాన్ అబ్రహం, రిమి సేన్.. ధూమ్, గరం మసాలా, హ్యాట్రిక్ సినిమాల్లో కలిసి నటించారు. జాన్ అబ్రహం సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా టెహ్రాన్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.చదవండి: కీర్తి సురేశ్ హోంటూర్.. ఇల్లులాగే లేదు -
ప్రియుడితో ప్రముఖ బుల్లితెర నటి ఎంగేజ్మెంట్..!
ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది.కాగా.. 'అనుపమ' సీరియల్లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్తో జనవరి 25న ఫామ్హౌస్లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది. ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది. -
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్గ్రీన్ స్టార్స్గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్ షారూఖ్ ఖాన్ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..అక్కడ మొదలైందిసౌదీ అరేబియాలోని రియాద్లో ఇటీవలే జాయ్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్ వంటి పలువురు హాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్ నటి హండె ఎర్సెల్ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్.. షారూఖ్తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్ ఖాన్కు పెద్ద అభిమాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీశారు.ఎవరీ అంకుల్?ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్ను చూపిస్తూ ఎవరీ అంకుల్ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్షాట్ తెగ వైరలయింది.అది ఫేక్దీంతో నెటిజన్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్షాట్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్ అనైతే అనలేదు అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్.. ఇంటాక్సికేటెడ్ బై లవ్, చేజింగ్ ద విండ్ అని రెండు టర్కిష్ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్లోనూ యాక్ట్ చేస్తానంది.ఫేక్ స్క్రీన్షాట్ (ఫోటోలో ఎడమవైపు)చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్ -
'యాక్టర్స్ అందరూ వేశ్యలు.. నువ్వూ అదే చేస్తానంటే చస్తా!'
సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్ నటి సయాని గుప్తా.మంచి జీతంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్ను వేశ్యలు అని పిలిచేది. అమ్మ సపోర్ట్ లేదునేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్టీఐఐ (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో చేరాను. సినిమాఅప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్ఎల్బీ 2, ఆక్సన్, పాగలైట్, ఆర్టికల్ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్లో కనిపించింది.చదవండి: పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి -
ఎవరు మీరంతా? కూతురి ముఖం దాచేసిన బిపాసా!
హీరోయిన్ బిపాసా బసు- నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ దంపతులు కూతురు దేవిని తీసుకుని బయటకు వెళ్లారు. సెలబ్రిటీలు ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పాపరాజీ(ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు) బిపాసా దంపతులను ఫాలో అయ్యారు. హీరోయిన్ను, ఆమె కూతురు దేవిని ఫోటోలు తీశారు. దీంతో బిపాసా కాస్త అసహనానికి లోనైంది. వెంటనే కూతురు ముఖాన్ని దాచేసింది. అసలు ఎవరు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా కోపంతోనే ఓ బిల్డింగ్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.చిగురించిన లవ్ స్టోరీ2015లో వచ్చిన ఎలోన్ సినిమా షూటింగ్లో కరణ్ సింగ్- బిపాసా కలుసుకున్నారు. వెండితెరపై జంటగా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడింది. ఏడాదిపాటు ప్రేమకబుర్లు చెప్పుకున్న వీరు 2016 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2022లో కూతురు దేవి జన్మించింది. సినిమాసినిమాల విషయానికి వస్తే.. తెలుగులో టక్కరిదంగ సినిమాలో నటించింది. బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన బిపాసా కొంతకాలంగా మూవీస్కు దూరంగా ఉంటోంది. చివరగా డేంజరస్ వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో ఆమె భర్త కరణ్ సింగ్ కూడా నటించాడు. ఇతడు చివరగా ఫైటర్ మూవీలో యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Bollywood Reporter (@bollywoodreporter.in) చదవండి: ఓటీటీలో మోగ్లీ మూవీ.. ఎక్కడంటే? -
ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్ బంప్స్ ట్రైలర్
'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సుమారు ఏడేళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మరో సినిమా మయసభ.. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జావేద్ జాఫేరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీణా జామ్కర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ దర్శకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తీసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్’ (Mayasabha: The Hall Of Illusion)' చిత్రాన్ని పికల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పిస్తుండగా.. జిర్కాన్ ఫిల్మ్స్ పీ లిమిటెడ్ నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బంగారం కోసం వేట.. అందులో దాగిన రహస్యంతో పాటు భ్రమలతో కూడిన ఓ కొత్త ప్రపంచాన్ని ఇందులో చూపించనున్నారు. ఒక థియేటర్లో టన్నుల కొద్ది బంగారం దాచి మరిచిపోయారనే ఆసక్తికర డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి. -
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్పై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. The wait ends on January 30.Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026 -
భారత్లో ఈజీ కాదు, అందుకే దుబాయ్ చెక్కేశా..
ఒకప్పుడు హిట్ సినిమాల హీరోయిన్.. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్. భారత్ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్గా లైమ్ లైట్లోకి వచ్చింది. తనే హీరోయిన్ రిమీ సేన్.భారత్లో అలా లేదుహీరోయిన్ రిమీ సేన్ మాట్లాడుతూ.. దుబాయ్ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్లో లేదు. భారత్లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.అనుకూలంగా లేదుదీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.సినిమారిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్లో హంగామా, ధూమ్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్ 2, ధూమ్ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్బై చెప్పేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) చదవండి: ఇంకా నిద్రపోతున్నారా? హీరోకు అవమానకర ప్రశ్న -
సూపర్స్టార్ ఇంట్లో 'గోల్డెన్ టాయిలెట్'.. నటుడి సెల్ఫీ వైరల్
స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వాటిని రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన వాటికి కూడా డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ ప్రముఖ నటుడు బాత్రూంలో కమోడ్ని బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు దాంతో ఓ నటుడు సెల్ఫీ దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)తెలుగులో 'ఎమ్సీఏ' సినిమాలో విలన్గా చేసిన విజయ్ వర్మ.. ప్రస్తుతం హిందీలో మూవీస్, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కొన్నాళ్ల ముందు వరకు హీరోయిన్ తమన్నాతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఇతడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్తో సెల్ఫీ దిగాడు. అయితే ఈ సెల్ఫీని 2016లో తీసుకున్నాడు. రీసెంట్ వైరల్ ట్రెండ్ దృష్టా.. ఇప్పుడు ఆ ఫొటోని పోస్ట్ చేశాడు.2016 నాకు మైలురాయి లాంటిది. బిగ్ బీ, సుజిత్ సర్కార్లతో 'పింక్' సినిమా చేశాను. నా దేవుడు సచిన్ని కలిశాను. బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్తో సెల్ఫీ దిగాను అని విజయ్ వర్మ రాసుకొచ్చాడు. అలానే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ని తన అభిమాన హీరోగానూ వర్ణిస్తూ ఆయనతో దిగిన ఫొటోను కూడా విజయ్ వర్మ షేర్ చేశాడు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?) View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) -
40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోల్స్ లెక్క చేయను
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ 'ధురంధర్' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్కు జంటగా నటించింది 20 ఏళ్ల సారా. దీంతో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్. అదే నమ్ముతా..ఆమె మాట్లాడుతూ.. నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగా లేను. కాబట్టి అక్కడేం జరుగుతుందనేది నాకు పెద్దగా తెలీదు. ఈ ఏజ్ గ్యాప్ గొడవంతా సోషల్ మీడియాలోనే జరుగుతోందనుకుంటా.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుందని భావిస్తాను. ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. కాబట్టి ఏజ్ గ్యాప్ నచ్చకపోవడమనేది వారి సమస్య. అది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు. అలాంటివి నేను లెక్క చేయను. సినిమా కథేంటో నాకు తెలుసు. ఆ కథకు అనుగుణంగానే అందరూ నడుచుకున్నారు. అంతే..కో స్టార్పై ప్రశంసలుఇకపోతే రణ్వీర్ సింగ్ లాంటి నటులను నేను చూడలేదు. ఎంతో అంకితభావంతో పని చేస్తాడు. సెట్లో ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. సినిమా తీయడం అనేది దర్శకనిర్మాతల పని మాత్రమే కాదు.. సమిష్టి కృషి అని నమ్ముతాడు. సెట్ డిజైన్ దగ్గరి నుంచి అన్నింట్లోనూ పాలుపంచుకుంటాడు. అందర్నీ ఏకం చేసి ముందుకు నడిపిస్తాడు అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమా 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్బస్టర్ టాక్తో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: రేణూ దేశాయ్ శాపనార్థాలు -
హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి (ఫొటోలు)
-
కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!
ప్రస్తుతం ఎవరితో మాట్లాడినా సరే ఆరోగ్యం ఉండండి, డైట్ పాటించండి అని చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. స్క్రీన్ పై కనిపించాలి, గ్లామర్గా ఉండాలంటే మన తినే చాలా ఆహార పదార్థాలకు వాళ్లు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఇప్పుడు అదే చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్నెస్ కోచ్గా చేసిన ఈయన ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రైనర్ వినోద్ చన్నా.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, డైట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో చెప్పాడు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. 'జాన్ పాటిస్తున్న డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయింది. జాన్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. నాలుగు ఫుడ్స్ తినమని చెబితే అవి మాత్రమే తింటాడు. వేరే వాటిని అస్సలు ముట్టుకోడు. అంత కఠినంగా ఉంటాడు'(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)'ఓసారి సినిమా షూటింగ్లో జాన్ ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె వచ్చారు. డైనింగ్ టేబుల్పై ఉన్న ఫుడ్ అంతా అయిపోయిందని నాతో చెప్పింది. కానీ జాన్ ఆ ఆహారాన్ని అస్సలు టచ్ చేయడని, ఆ విషయంలో నాకు వంద శాతం నమ్మకం ఉందని ఆమెతో చెప్పాను. షుగర్(చక్కెర)కు జాన్ చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతైనా తీసుకోమని చెప్పాను. అయినా సరే నో చెప్పాడు''పొరపాటున జాన్ గనుక చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అతడికి దగ్గు వచ్చే అవకాశముంది. ఎన్నో ఏళ్లుగా కఠినమైన డైట్ పాటించడం వల్ల ఇప్పుడు జాన్.. బెండకాయ, వంకాయ లాంటివి తినలేడు. ఒకవేళ తీసుకున్నా సరే అతడి కడుపు వాటిని జీర్ణించుకోలేకపోతోంది. శరీరం ఓ నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే అకస్మాత్తుగా వచ్చే మార్పులని తీసుకోలేదు. జీర్ణ సమస్యలు వస్తాయి' అని వినోద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయంలో ఫిట్నెస్, డైట్ పాటించే వాళ్లమధ్య హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్) -
భారీ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ మేకింగ్.. ప్రధాని బయోపిక్ విశేషాలివే..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేయనున్నారు.ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్లో ప్రారంభం కానుంది. -
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)రహమాన్ డకాయిత్గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ
నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ. కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్పాత్పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం. సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే చదువుక పుల్స్టాప్ పెట్టేసి 17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు. ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా అనేక కష్టాలు పడ్డాడు.ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి దారి చూపించింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్పాత్పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో రూ.50 లకు అమ్మేవాడు. నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు. అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ప్రేరణ నిచ్చిన సినిమా ముంబైలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్పాత్పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది. అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్వేర్ బిజినెస్ ప్రారంభించాడు. బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్తో రాజా నాయక్ వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్, వాటర్ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే. అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది. ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో భార్య అనిత తోడుగారాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. చదువు మానేసి, 16 ఏళ్లవయసులో ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100 కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు. -
మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తెగ ట్రెండ్ అయిపోయింది. తమిళ హీరో ధనుష్ని వాలంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోనుందనే పుకార్లే దీనికి కారణం. ఒకటి రెండు రోజుల పాటు అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు. ఇదంతా ఫేక్ అని మృణాల్ టీమ్ ఇదంతా ఫేక్ అని చెప్పడంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇదలా ఉండగానే ఓ రొమాంటిక్ మూవీని మృణాల్ రెడీ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)'దో దివానే షెహర్ మైన్' పేరుతో తీసిన ఈ రొమాంటిక్ సినిమాలో మృణాల్ సరసన సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. ఫిబ్రవరి 20న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. సిద్ధాంత్-మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి? ఎందుకంటే ఈమె గత రెండు చిత్రాలు.. సన్నాఫ్ సర్దార్ 2, ద ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే) -
నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ
జెనరేషన్ మారుతోంది. మొన్నటి తరంలా నిన్నటి తరం లేదు, నిన్నటి తరంలా నేటితరం లేదు. ఇప్పుడంతా హైటెక్ స్పీడ్.. అయితే ఇదే కొన్నిసార్లు తనను భయానికి గురి చేస్తోందంటోంది బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాన్న (రామ్ ముఖర్జీ) ఉన్నప్పుడు నా సినిమాలు చూసి పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పేవాడు. ఆయన వెళ్లిపోయాక ఫీడ్బ్యాక్ పొందడమే కష్టమైపోయింది. నా కూతురు తట్టుకోలేదుకానీ భగవంతుడు నాన్నను కోల్పోయిన లోటును కూతురితో భర్తీ చేశాడు. అయితే నా కూతురు నా సినిమాలు ఎక్కువగా చూడదు. ఎందుకంటే నేను ఏడ్చే సన్నివేశాలను చూసి తను తట్టుకోలేదు.. అదే సంతోషంతో డ్యాన్స్ చేసే సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. నేను నటించిన హిచ్కి, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, బంటీ ఔర్ బబ్లీ సినిమాలు చాలా ఇష్టపడుతుంది.మేకప్ వేసుకున్నా బాధేకుచ్ కుచ్ హోతాహై మూవీ మాత్రం చూడలేదు. ఎందుకంటే అందులో నేను మొదటి సన్నివేశంలోనే చనిపోతాను. అది తను తట్టుకోలేదు. అలాగే నేను మేకప్ వేసుకుంటే కూడా తనకు నచ్చదు. నువ్వు నా అమ్మలా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. మేకప్ తీసేయగానే ఇప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్తుంది. ఎంతైనా తను జెన్ ఆల్ఫా (2010 - 2024 మధ్య జన్మించినవారు) కిడ్. అదే నా చిన్నతనంలో..ఒక్కోసారి కోపంతో నాపై అరిచేస్తుంటుంది. అప్పుడు తను చెప్పేది నేను ఓపికగా వినాల్సిందే! అదే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చెంపదెబ్బలు కొట్టేది. అదే పని నేను చేశాననుకోండి, నా కూతురు తిరిగి కొట్టినా కొట్టొచ్చు. తను చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తనకు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.సినిమారాణీ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కూతురు అధీర జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగానూ రాణీ ముఖర్జీ.. ఉత్తమ నటిగా గతేడాది జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం మర్దానీ 3 మూవీ చేస్తోంది.చదవండి: కోహ్లితో రిలేషన్? స్పందించిన బిగ్బాస్ కంటెస్టెంట్ సంజనా -
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డేకి అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. ఈమె నటించిన 'జన నాయగణ్' లెక్క ప్రకారం ఈ పాటికే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు. పాన్ ఇండియా హీరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే, అతడిని లాగిపెట్టి కొట్టానని చెప్పంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే.. ఓ స్టార్ హీరోతో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 'నా కెరీర్ మొదట్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ టైంలో ఓ రోజు.. ఆ హీరో, అనుమతి లేకుండా నా క్యారవాన్లోకి వచ్చేశాడు. అసభ్యంగానూ ప్రవర్తించాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను. వెంటనే సదరు హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఆ హీరోతో నటించడానికి నేను ఇష్టపడలేదు. దీంతో నా సీన్స్ అన్నీ డూపుని పెట్టి తీశారు' అని పూజ చెప్పుకొచ్చింది.మరి పూజా హెగ్డేని ఇబ్బంది పెట్టిన ఆ పాన్ ఇండియా హీరో ఎవరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కెరీర్ ప్రారంభంలో అంటే హృతిక్ రోషన్ 'మొహంజదారో'లో ఈమె నటించింది. దక్షిణాదిలోనూ ఈ మూవీ రిలీజైంది. నాలుగేళ్ల క్రితం ప్రభాస్ 'రాధేశ్యామ్'లో నటించింది. పూజా చేసిన పాన్ ఇండియా మూవీస్ అంటే ఇవే. మరి వీరిద్దరిలో ఎవరైనా పూజతో అసభ్యంగా ప్రవర్తించారా? లేదంటే ఈమె ఏమైనా కట్టుకథ చెబుతోందా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఇకపోతే పూజా చేతిలో ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా, ఓ హిందీ మూవీ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?) -
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.అదే కారణంఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.ఒక్కసారి కాదు, రెండుసార్లుచాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. చేయిదాటిపోయిందినాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన -
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్బాస్ విజేతలు.. మరో సర్ప్రైజ్ ఏంటంటే? -
నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్
కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా పవర్ షిఫ్ట్ నెలకొందని, సృజనాత్మక లేనివారే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మతపరమైన అంశం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రెహమాన్. అర్థం చేసుకున్నారుఅంతేకాకుండా ఆ ప్రభావం తనపై పడినట్లు తనకు అనిపించలేదు కానీ, పడిందన్నట్లుగా కొందరు గుసగుసలాడుకున్నట్లు తెలిసిందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు తప్పుపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నాకు స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. బాధ పెట్టాలనుకోలేదుకానీ, నా ఆలోచన మాత్రం ఎప్పుడూ సంగీతం గౌరవించబడటమే.. సంగీతానికి సేవ చేయడమే.. అలాగే నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోవడం లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో నేను భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. కృతజ్ఞతతో ఉంటా..అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేవ్స్ సమ్మిట్ -2025లో ఝాలా ప్రదర్శన, రూహ్- ఎ-నూర్, సన్ షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్వకత్వం వహించడం, ఇండియాస్ ఫస్ట్ మల్టీకల్చరల్ వర్చ్యువల్ బ్యాండ్ 'సీక్రెట్ మౌంటైన్'ను బిల్డ్ చేయడం, హన్స్ జిమ్మర్తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందిస్తుండటం.. ఇలా ప్రతీది నా జర్నీని బలోపేతం చేస్తుందనుకుంటున్నాను. ఈ దేశానికి కృతజ్ఞతతో ఉంటాను. జై హింద్, జయహో.. అంటూ వీడియోలో మాట్లాడారు రెహమాన్. మా తుఝే సలామ్, వందేమాతరం అంటూ ఓ స్టేడియంలో ఆడియన్స్ పాడుతున్న విజువల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. View this post on Instagram A post shared by AR Rahman: Official Updates (@arrofficialupdates) చదవండి: 20 ఏళ్ల వయసులో తమన్నాకు చేదు అనుభవం -
నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్
-
హీరో కూతురికి నామకరణం.. సాక్షాత్తూ అమ్మవారి పేరు!
బాలీవుడ్ జంట రాజ్కుమార్ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు. తాజాగా తమ ఇంట్లోకి సంతోషాల మూటను తీసుకొచ్చిన చిన్నారి చేతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాపకు "పార్వతి పాల్ రావు" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట! ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 2021లో పెళ్లిరాజ్ కుమార్ రావు- పాత్రలేఖ ఇద్దరూ సినిమా యాక్టర్సే. 2014లో సిటీలైట్స్ సినిమా షూటింగ్లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ రానురానూ మరింత బలపడింది. పెద్దలు కూడా వారి ప్రేమాయణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2021 నవంబర్ 15న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది న్యూజిలాండ్ ట్రిప్లో ఉన్నప్పుడు పాత్రలేఖకు తాను గర్భవతిని అన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే భారత్ తిరిగొచ్చేసిది. అయితే బిడ్డ పుట్టాక మళ్లీ న్యూజిలాండ్ ట్రిప్కు వెళ్లి ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టేస్తానంటోంది.సినిమారాజ్ కుమార్ రావు.. 2010లో సినీ జర్నీ మొదలుపెట్టాడు. రణ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, స్త్రీ. తలాష్, లవ్ సోనియా, హిట్, శ్రీకాంత్, భేడియా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. పాత్రలేఖ విషయానికి వస్తే.. ఈమె లవ్ గేమ్స్, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రెహమాన్పై కంగనా ఫైర్
లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.మీలాంటి మనిషిని చూడలేఈ మేరకు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. ప్రియమైన ఏర్ రెహమాన్.. నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయినా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.చీరలో వెళ్లేందుకు నోతన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్ రెహమాన్ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.చదవండి: ఒక్కడు మూవీలో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా? -
ధురంధర్ సునామీ.. 9 ఏళ్ల బాహుబలి రికార్డు బద్దలు
-
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాలీవుడ్
-
2016.. నా జీవితమే నరకప్రాయం: కంగనా రనౌత్
2026కి వెల్కమ్ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.2016ని ఎందుకు మిస్ అవుతున్నారో?వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందరూ సడన్గా 2016ని ఎందుకు మిస్ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్ నోటీసులు పంపాడు.సంచలనంఅది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్సైడర్స్, ఔట్సైడర్స్ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.ఏమిటా వివాదం?గతంలో కంగనా రనౌత్- హృతిక్ రోషన్ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్ రోషన్ను ఎక్స్గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్ చేసింది. దీంతో హృతిక్.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో యాక్ట్ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్ ఏమందంటే?
ఒకప్పుడు గ్లామర్తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్బై చెప్పేసింది. 2020 అక్టోబర్లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్పై సనాఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతం వల్లేనేమో! -
8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతంవల్లేనేమో!
సంగీత ప్రపంచంలోనే అగ్రజుడు ఏఆర్ రెహమాన్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించాడు. పుట్టుకతోనే హిందూ అయిన ఇతడు తర్వాత ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్ల బాలీవుడ్లో సరైన అవకాశాలు రాలేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఔట్ సైడర్తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. రోజా, బాంబే, దిల్సే వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్లో ఔట్సైడర్ (ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి)లానే ఫీల్ అయ్యేవాడిని. కానీ తాల్ సినిమా పాటలు అందరి ఇంట్లోకి చేరాయి. ఇప్పటికీ ఎంతోమంది ఉత్తరాదివాళ్లు ఆ మూవీ పాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది.8 ఏళ్లుగా తగ్గిన అవకాశాలుఅప్పుడు నాకు పంజాబీ సంగీతంపై మరింత ఆసక్తి కలిగింది. అలా సుక్వీందర్ సింగ్ను కలిశాను. తనతో కలిసి చేసిన 'చయ్య చయ్య', 'జై హో..' పాటలు ఎంత ఆదరణ పొందాయో మీ అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిదేళ్లుగా నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. బహుశా దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్ ఒక కారణమైతే.. నా మతం కూడా మరో కారణం కావొచ్చు. ఏదేమైనా నాకు నా కుటుంబానితో గడిపేందుకు సమయం దొరికిందనుకుంటాను. అవే నా దగ్గరకు..అయినా పనికోసం నేను పాకులాడటం లేదు. పనే నా దగ్గరకు రావాలని అనుకుంటాను. నా వృత్తిపట్ల నాకున్న నిబద్ధతే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదని పలువురు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రామాయణం మూవీలో ఛాన్స్ నీ మతం చూసే ఇచ్చారా? అని మండిపడుతున్నారు. చదవండి: ధనుష్తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? -
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్లో అవకాశాలు దక్కాలంటే ఘర్వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు... హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.ఓ ప్రముఖ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్సైడర్లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు. మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్మేకర్ రెహమాన్ వ్యాఖ్యలను చీప్ అని పేర్కొన్నారు. అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
'టాక్సిక్' కోసం 'ధురంధర్ 2' వాయిదా? డైరెక్టర్ క్లారిటీ...
ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్తోనే బ్లాక్బస్టర్ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.అదేరోజు టాక్సిక్ రిలీజ్ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్ టాక్సిక్ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్ ఫుల్స్టాప్ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ క్లారిటీధురంధర్ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) డైరెక్టర్, ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.చదవండి: మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లో ఓటీటీలోకి.. -
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. పోస్టర్తోనే విపరీతంగా ట్రోల్స్..!
భామ.. తమిళం, మలయాళంలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్కు షిఫ్ట్ అయిన సాయిపల్లవి.. రామాయణతో పాటు ఏక్ దిన్ అనే మూవీలో కనిపించనుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.తాజాగా సంక్రాంతి కానుకగా ఏక్ దిన్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏక్ దిన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ కాస్తా విమర్శలకు దారి తీసింది. ఇది చూస్తుంటే 2016లో వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ డేను పోలి ఉందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆ మూవీని కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.పేరుతో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ చిత్రం రీమేక్ చేయనున్నారా? లేదా కొత్త స్టోరీనా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే కాపీ కంటెంట్ అనే విమర్శలొస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్నారు. సునీల్ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో మే 1న రిలీజ్ చేయనున్నారు. Amir Khan Production: Sai Pallavi’s Bollywood debut #EkDin is the remake of Thai Film #OneDay.Of late Why Amir Khan is behind remakes🤔#LalSinghChadha - Flop#Loveyapa - Flop#SithareZameenPar - Decent#EkDin - 🤞 pic.twitter.com/W0IuZ7bbZZ— Christopher Kanagaraj (@Chrissuccess) January 16, 2026 -
ఇండో-పాక్ వార్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బోర్డర్-2 ట్రైలర్
గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన వార్ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటించారు. -
అల్లుడు సెంచరీ.. మామయ్య ఫుల్ ఖుషీ..!
అల్లుడు కేఎల్ రాహుల్పై మామయ్య సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ కొట్టడంతో బాలీవుడ్ నటుడు కొనియాడారు. విభిన్నమైన స్థానం.. అదే ప్రశాంతత.. అదే వ్యక్తిత్వం అంటూ అల్లుడిని ఆకాశానికెత్తేశారు. ఆ స్కోర్ బోర్డ్లో ఈ సెంచరీ ప్రత్యేకంగా గుర్తుంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న క్షణాలను సంయమనాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సునీల్ శెట్టి పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన కేఎల్ ఫ్యాన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. కేఎల్ రాహుల్.. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కుతూరు కూడా జన్మించింది. వీరి పెళ్లి వేడుకను సునీల్ తన ఫామ్ హౌస్లోనే గ్రాండ్గా నిర్వహించారు. ఈ పెళ్లి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు సందడి చేశారు. కాగా.. కేఎల్ సతీమణి అతియా శెట్టి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. View this post on Instagram A post shared by Suniel Shetty (@suniel.shetty) -
తట్టుకోలేకపోయా, గదిలో కూర్చుని ఏడ్చా..: షారూఖ్ కూతురు
కింగ్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా 'ద ఆర్చీస్' మూవీతో సినీప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడేకంగా తండ్రితో కలిసి నటించబోతోంది. షారూఖ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ చిత్రంలో సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఆసక్తే ఉండేది కాదని, రానురానూ తన ఆలోచన మారిందని చెప్తోంది.ఒంటరిగా ఏడ్చా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో నాటకాల్లో పాల్గొనాలంటే అస్సలు ఇంట్రస్ట్ ఉండేది కాదు. కానీ, తర్వాత సడన్గా నాకు దానిపై ఆసక్తి పెరిగింది. ఓసారి స్కూల్లో వేయబోయే ఒక నాటకం కోసం ఆడిషన్ ఇచ్చాను, కానీ నేను కోరుకున్న పాత్రలో నన్ను సెలక్ట్ చేయలేదు. ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. చాలా బాధపడ్డాను. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. కింగ్ సినిమాలో..అప్పుడు నాకు యాక్టింగ్పై ఎంత ఇష్టం ఉందనేది తెలిసింది. స్టేజీపై పర్ఫామ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ఆ ప్యాషన్ ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కింగ్ సినిమా విషయానికి వస్తే.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా షారూఖ్ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. 'కింగ్' షారూఖ్తో దీపికా నటిస్తున్న ఆరో సినిమా కావడం విశేషం! గతంలో వీరిద్దరూ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాల్లో కలిసి నటించారు.చదవండి: 37 ఏళ్ల తర్వాత మొదటి హీరోను కలిసిన స్టార్ హీరోయిన్ -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్గా, వేశ్యగా..
ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బాలీవుడ్లో అనేక సక్సెస్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.చిన్నతనంలోనే..చిన్నప్పుడు మహారాజు గెటప్ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సినిమాతక్కువకాలంలోనే స్టార్ హీరోయి్గా మారింది. 1942: ఎ లవ్స్టోరీ, అకేలే, హమ్ అకేలే తుమ్, ఖామోషి: ద మ్యూజికల్, దిల్సే, కంపెనీ, తాజ్ మహల్, భూత్ రిటర్న్స్ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్ (భారతీయుడు), ముదల్వన్ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్ మూవీ చేసింది.క్యాన్సర్పై పోరాటంమనీషా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్లో మల్లికాజాన్ అనే వేశ్యపాత్రలో యాక్ట్ చేసింది. గతేడాది లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది.చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్గా విడాకులు: బాలీవుడ్ నటి -
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం..: నటి
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్ హగ్పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకులు..సెప్టెంబర్ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్ హగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్మాల్ రిటర్న్స్, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్ చేసింది. -
దురంధర్ దూకుడు.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రిలీజై 39 రోజులైనా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1300 కోట్ల మార్క్కు చేరువలో ఉంది.ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డును తన సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డ్ను ధురంధర్ తుడిచిపెట్టేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల కలెక్షన్ రాబట్టింది. అంతకుముందు బాహుబలి-2 20.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత తొమ్మిది ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.కాగా.. ఇప్పటికే ఈ మూవీ భారత్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి ఆదిత్య ధార్ ధర్శకత్వం వహించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. -
ధనశ్రీ- చాహల్ మళ్లీ కలవబోతున్నారా?.. క్రికెటర్ రియాక్షన్ ఇదే..!
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. గతేడాది అఫీషియల్గా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ వర్క్ లైఫ్తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విడిపోయిన జంటపై నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట మరోసారి కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్- ధనశ్రీ వర్మ ది -50 అనే రియాలిటీ షోలో కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్రికెటర్ చాహల్ స్పందించారు.అయితే తామిద్దరు కలుస్తామన్న వార్తలను చాహల్ కొట్టిపారేశారు. తమ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని క్రికెటర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెటర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు. అయితే ఈ రూమర్స్పై ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. కాగా.. ది -50 అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు చిత్రనిర్మాత ఫరా ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
గ్రాండ్గా సిస్టర్ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్పూర్లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్ను పెళ్లాడింది. ఉదయపూర్లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026 -
పవర్ఫుల్ పాత్రలో...
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా లీడ్ రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఇ.ఫ్లవర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా సఫియా ఓక్లీ–గ్రీన్, టెమ్యూరా మారిసన్ ఇతర పాత్రలు పోషించారు. ఏజీబీవో, సినీస్టార్ పిక్చర్స్, బిగ్ ఇండీ పిక్చర్స్, పర్పుల్ పెబుల్ పిక్చర్స్పై జో రుస్సో,ఆంటోనీ రుస్సో, ఏంజెలా రుస్సో–ఓట్సా్టట్, మైఖేల్ డిస్కో, ప్రియాంకా చోప్రా, సిలీ సల్దానా, మరియల్ సల్దానా నిర్మించారు.ప్రియాంకా చోప్రా పవర్ ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ టీజర్ని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్ను ప్రియాంకా చోప్రా షేర్ చేశారు. ఇదిలా ఉంటే... లాస్ఏంజిల్స్లోని బెవర్లీ హిల్టన్ వేదికగా 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకి భర్త నిక్ జోనస్తో కలిసి రెడ్ కార్పెట్పై గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్ పాటించి, వర్కవుట్స్ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడాడు.సరైన సమయం దొరక్క..కరణ్ జోహార్ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్ ఉండవు. అర్జంట్ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నాననేవారు. అమ్మ తిట్టేదిఅమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. కళ్లు తిరిగి పడిపోయా..అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్రూమ్లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాటి వల్లే బరువు తగ్గా..కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్ చేశాను. గేమ్స్ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్ జోహార్ చెప్పుకచ్చాడు.చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్ చూశారా? -
ప్రేమపై నాకు నమ్మకం ఉంది!
మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకపాటల్లో తనదైన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారామె. మహేశ్బాబు ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే..’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక...’పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్తో 1998లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మలైకా. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. అర్జున్ కపూర్తో ప్రేమలో ఉండటం వల్లే అర్బాజ్ ఖాన్కి మలైకా విడాకులిచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత అర్జున్ కపూర్– మలైకా అరోరా కూడా రిలేషన్ షిప్కి బ్రేకప్ చెప్పారు. తాజాగా తన విడాకులు, రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు మలైకా అరోరా. ‘‘నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత విడిపోయాను. అనంతరం రిలేషన్షిప్లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనేది తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నా విషయంలో సెట్ కాలేదు అంతే. అయినప్పటికీ ప్రేమ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అనేది నాకు చాలా ఇష్టం. అది దక్కాలంటే అదృష్టం ఉండాలి’’ అని పేర్కొన్నారు మలైకా ఆరోరా. -
గోశాలకు సోనూసూద్ రూ.11 లక్షలు విరాళం
మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.గోశాలకు విరాళంఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.సినిమాసోనూసూద్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్.. ఇలా అనేక సినిమాల్లో విలన్గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా.. -
ప్రియుడిని పెళ్లాడిన 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, కథానాయిక నుపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. వారం రోజుల క్రితమే ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శనివారం (జనవరి 10న)నాడు ప్రియుడిని వివాహం చేసుకుంది. రాజస్తాన్లో ఉదయ్పూర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.పెళ్లి చేసుకున్న హీరోయిన్ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఒకే ఒక్క మూవీనుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Bollywood (@lifestyleofbollywood)Finally its here ✨5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ— G (@kixtr1KSanon) January 10, 2026 View this post on Instagram A post shared by Stebin Ben (@stebinben) -
సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ.. ఈ నెలలోనే మూడో పార్ట్
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "మర్దానీ 3". దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ను ఓ నెల ముందుకు జరిపారు.సినిమామర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీరాయ్గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. 'ద రైల్వేమెన్' ఫేమ్ ఆయుష్ గుప్తా కథ అందించాడు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) చదవండి: ఇలా జరుగుతుందనుకోలేదు.. సారీ: రాజాసాబ్ డైరెక్టర్ -
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ధురంధర్ హీరో సరసన..ధురంధర్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ప్రళయ్' (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కల్యాణి యాక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.అన్నీ నాకే కావాలి!మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.ప్రళయ్ సినిమా!ప్రళయ్ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్ హిందీ సినిమా ప్రళయ్ అవుతుంది.చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్ నిర్మాత భావోద్వేగం -
క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)
-
హోటల్లో 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్ ఆర్యన్ డేటింగ్ గురించి బాలీవుడ్లో బిగ్ న్యూస్ వైరల్ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అతను సోషల్మీడియాలో ఆమెను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది.35ఏళ్ల కార్తిక్ ఆర్యన్ టీనేజ్ అమ్మాయితో గోవా బీచ్లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం. సోషల్మీడియాలో వారు షేర్ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్ అమ్మాయితో డేటింగ్ చేయడం ఏంటి అంటూ కార్తిక్ ఆర్యన్కు మెసేజ్లు పెడుతున్నారు.బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది. కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు కామెంట్స్ను ఆపేసింది. కానీ, కార్తిక్ ఆర్యన్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. -
బంగ్లా నుంచి కబురు వచ్చింది
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. టబు, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, వామికా గబ్బి, జిస్సు సేన్ గుత్తా ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే మే 15న రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘బంగ్లా నుంచి కొత్త కబురు వచ్చింది. మే 15న బంగ్లా డోర్స్ తెరుచుకుంటాయి (న్యూ రిలీజ్ డేట్ని ఉద్దేశించి)’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే!
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తను డైరెక్ట్ చేసిన సినిమాలు అవార్డులు గెలిచాయి కానీ ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. తాజాగా భారత జాతీయ సినీ అకాడమీ (NICA) ప్రెస్మీట్కు హాజరైన రోహిత్ శెట్టి ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.యాంకరింగ్ చేయమని..ఆయన మాట్లాడుతూ.. నాకు, అవార్డులకు మధ్య సంబంధమే లేదు. ఇప్పటివరకు 17 సినిమాలు తీశాను. అవార్డు ఫంక్షన్కు పిలుస్తుంటారు, కానీ హోస్ట్గా చేయమని మాత్రమే ఇన్విటేషన్ వస్తుంటుంది. అలా అవార్డుల ఫంక్షన్లో యాంకర్గా మాత్రమే కనిపించాను అన్నాడు.ఎప్పుడో మొదలైందినార్త్ వర్సెస్ సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సినిమా రిలీజైతే పండగ చేసుకోవాలి. సినిమా అనేది మొదలైనప్పటినుంచే ఇక్కడి వాళ్లు దక్షిణాదిలో.. దక్షణాదివాళ్లు బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. 1950 నుంచే ఇదంతా జరుగుతోంది. మనం ప్రాంతీయ బేధాలు చూడకుండా సినిమా సెలబ్రేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా వల్ల ప్రపంచమే చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అందరూ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేసి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పుకొచ్చాడు.సినిమారోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.చదవండి: హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ -
కొడుక్కి నామకరణం.. ఆ పేరుతో విక్కీకి ప్రత్యేక అనుబంధం!
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. 2025 నవంబర్ 7న ఈ జంటకు కొడుకు పుట్టాడు. బాబు పుట్టి రెండు నెలలైన సందర్భంగా అతడికి నామకరణం చేశారు. విక్కీ, కత్రినా చేతిలో కొడుకు చేయి పెట్టిన ఫోటో షేర్ చేస్తూ "విహాన్ కౌశల్" అని పరిచయం చేశారు.పేరు వెనక ప్రత్యేకతవిహాన్ పేరుకు విక్కీ కౌశల్కు విడదీయరాని అనుబంధం ఉంది. 'ఉరిః ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో హీరో విక్కీ కౌశల్ పోషించిన పాత్ర పేరు మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్. ఆ పాత్రకు గుర్తుగానే కొడుక్కి విహాన్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉరి సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విక్కీ.. విహాన్ పాత్రకు వెండితెరపై ప్రాణం పోస్తే... ఇప్పుడు చిన్న విహాన్ అతడి చేతిలో జీవం పోసుకున్నాడు.. జీవితమంటేనే ఒక సర్కిల్ కదా! అని కామెంట్ చేశాడు. కాగా 2019లో వచ్చిన 'ఉరి' మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
చావు తప్ప మరో దారి లేదు.. విడాకులిచ్చా: నటి
ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది. రెండు పెళ్లిళ్లుకానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది. ఎన్నో దారుణాలుషెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు. చావు తప్ప..చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.రిస్క్ చేశాఅవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఛాన్సులు కూడా -
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ -
టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది
టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ని అధికారికంగా మూసివేసింది. మైఖేల్ జాక్సన్ లాంటి పాప్ సింగర్లని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానెల్ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం!1981 ఆగస్టు 1న ప్రారంభమైంది. పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ.. సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు.. పాశ్చాత్య సంగీతం నుంచి పాప్ కల్చర్ వరకు మైఖేల్ జాక్సన్ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానెల్... క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80స్, 90స్, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ అనే ఛానెళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానెళ్లన్నింటినీ ఇప్పుడు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.1981లో తొలిసారి ఎంటీవీలో ప్రసారమైన "వీడియో కిల్డ్ ది రేడియో స్టార్" అనే పాటనే.. 2025 డిసెంబర్ 31న చివరిసారి ప్రసారం చేసి తన ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానెల్ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి, ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణమనే సందేశాన్నిచ్చింది.ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానెల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ ఛానెల్తో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యాజిక్ మూసివేసినప్పటికీ ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ప్లాట్ఫార్మ్లపై దృష్టి పెట్టనున్నట్లు సదరు ఛానెల్ ప్రకటించింది.ఎంటీవీ ఛానెల్కు సంబంధించిన ప్రధాన ఘట్టాలు1981లో అప్పటి వరకు మ్యూజిక్ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది.1983లో థ్రిల్లర్ ఆల్బమ్లోని బిల్లీ జీన్, బీట్ ఇట్ వీడియోలు ఎంటీవీలో ప్రసారం అవడంతో మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్స్టార్గా మారాడు.1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్ అవార్డ్స్ ప్రారంభించడంతో... క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతోమంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది.1985లో ఎంటీవీని వయాకామ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది.1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్గా మారాయి. నిర్వానా, ఎరిక క్లాప్టన్ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి.1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తరువాత కాలంలో ఎంటీవీ దశను, దిశను మార్చేసింది.2000లో రియాల్టీ షోస్ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్, లాగునా బీచ్, ది హిల్స్ వంటి వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానెల్ నుండి ఎంటర్టైన్మెంట్ ఛానెల్గా మార్చాయి.2025 డిసెంబర 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ను నిలిపి వేసింది. చివరి ప్రసారం 'వీడియో కిల్డ్ ది రేడియో స్టార్'తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది. -
దీపికా పదుకోణె బర్త్డే స్పెషల్.. వైరల్ ఫోటోలు ఇవే
-
చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా తీసుకోలే: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్ పంచుకున్నాడు. కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్గా యాక్ట్ చేసింది. పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్, అనన్య పాండే 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.సినిమాకార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా? -
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్వీర్లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్ సీఎం అవుతాడు: నటుడు సుమన్ -
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్సానియత్కే దుష్మన్' అప్పుడే రిలీజైంది. చున్నీ లాగే సీన్..ఆ మూవీ చూడమని మా పేరెంట్స్కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. చెడామడా తిట్టారుఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు. నెగెటివ్ రోల్స్ వల్లే..నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్. -
ప్రియురాలితో స్టార్ హీరో మేనల్లుడి ఎంగేజ్మెంట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అయాన్ అగ్నిహోత్రి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు టీనా రిజ్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. ఇవీ కాస్తా వైరల్ కావడంతో అయాన్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ మేనల్లుడు సంగీతకారుడు అయాన్ అగ్నిహోత్రి సింగర్, మ్యూజిషియన్గా రాణిస్తున్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సల్మాన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నారు. View this post on Instagram A post shared by Agni (@ayaanagnihotri) -
అది నా అదృష్టం!
‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ).. ఈ రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షో అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్. 17 సీజన్లుగా ఈ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘కేబీసీ’ సీజన్ 17 గ్రాండ్ ఫినాలే శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో ఆరంభంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ–‘‘25 ఏళ్లుగా ‘కేబీసీ’ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నాను.నా జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే వెచ్చించాను. సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు వీక్షకులు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. మీరు ఇలా తోడుగా ఉన్నంత వరకు ఈ గేమ్ షో ఇలానే కొనసాగుతుంది. థ్యాంక్యూ’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అమితాబ్. -
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
సల్మాన్ ఖాన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతలోనే దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఆసక్తికర పనిచేసి చర్చనీయాంశమయ్యాడు. తన సవతి చెల్లిపై అంతులేని ప్రేమ చూపించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: సింగర్తో యంగ్ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన)సల్మాన్ ఖాన్కి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. పాన్వెల్ అనే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటుంటాడు. కొన్నిరోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫౌమ్ హౌస్కే తన సవతి చెల్లి అర్పితా పేరుని పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నప్పటికీ.. తెచ్చి పెంచుకున్న అర్పితాపై ఎక్కువ మమకారం చూపిస్తుంటాడు.చిన్నప్పటి నుంచి అర్పితాని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఆమె కొడుకుల్ని కూడా ముద్దు చేస్తుంటాడు. ఇప్పుడు ఈమె పేరుని తన ఫౌమ్ హౌస్కి పెట్టాడంటే రాబోయే రోజుల్లో ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌమ్ హౌస్ ప్రస్తుత విలువ రూ.80 కోట్ల పైనే ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
పోకిరి విలన్కు యాక్సిడెంట్.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.యాక్సిడెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమాఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
రోడ్డుకు అడ్డొచ్చిందని.. మామ ఇంటినే కూల్చేశా: నితిన్ గడ్కరీ
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు విస్తరణ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అనే విధంగా రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు గడ్కరీ స్వయంగా వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో, నెటిజన్లు స్పందిస్తూ.. నితిన్ గడ్కరీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్ తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్లో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ వంటమనిషి దిలీప్.. నితిన్ గడ్కరీకి ఒక విజ్ఞప్తి చేశారు. తన ఊరిలో రోడ్డు వేయమని గడ్కరీని కోరగా.. ఫరా తమాషాగా దిలీప్ ఇంటి మీద నుంచే రోడ్డు వేయండి సార్ అని ఫన్నీ కామెంట్స్ చేశారు. దీనిపై గడ్కరీ భార్య కాంచన్ స్పందిస్తూ.. అప్పుడు దిలీప్కు ఇల్లు ఉండదు.. మా నాన్నగారికి జరిగినట్లే జరుగుతుంది అని గుర్తుచేశారు.ఇంతలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు తెలిపారు. అనంతరం, ఫరా స్పందించి.. మరి ఆయనకు కొత్త ఇల్లు కట్టించారా? అని ప్రశ్నించగా.. ‘లేదు, కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం మాత్రమే ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.ఇదే సమయంలో గడ్కరీ మరో ఉదంతం గురించి మాట్లాడారు. తాను ఇటీవల కోల్కతా వెళ్లినప్పుడు ఒక రెస్టారెంట్లో చైనీస్ ఫుడ్ ఆయనకు బాగా నచ్చింది. ఆ వంటకాన్ని తన వ్యక్తిగత చెఫ్కు నేర్పించమని ఆయన కోరగా.. అది తమ పాలసీకి విరుద్ధమని రెస్టారెంట్ యాజమాన్యం తిరస్కరించింది. అప్పుడు గడ్కరీ..‘ఈ రెస్టారెంట్ ఎవరి భూమిలో ఉందో తెలుసా?. ఇది కోల్కతా పోర్ట్ ట్రస్ట్ భూమి.. నేను షిప్పింగ్ మంత్రిని. మీరు నేర్పించకపోతే మీ లీజు రద్దు చేస్తాను’ అని సరదాగా హెచ్చరించడంతో వారు దిగొచ్చారని చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
సింగర్తో యంగ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్ ఓ ఇంటిది కాబోతుంది. గత కొన్నాళ్లు వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ సింగర్ స్టెబిన్ బెన్ని ఈమె పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)కృతి సనన్ మొదట తెలుగు సినిమాలు చేసి ఆపై బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. చెల్లి నుపుర్ సనన్ కూడా అలానే చేయాలనుకుంది. మొదటగా టాలీవుడ్లో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఒకటిరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. కెరీర్ పరంగా వెనకబడినప్పటికీ లైఫ్లో ముందడుగు వేసింది. పెళ్లికి సిద్ధమైంది.ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ని నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 11న ఈ శుభకార్యం జరగనుందని ఇదివరకే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు గానీ తేదీ లాంటివి ఏం ప్రకటించలేదు. నుపుర్కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
నాతోపాటు నవ్వారు, ఏడ్చారు.. బిగ్బీ భావోద్వేగం
సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్బీ అమితాబ్ బచ్చన్ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్బీ భావోద్వేగానికి లోనయ్యాడు.అంతా నిన్ననే..కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.థాంక్యూ సో మచ్నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @sonytvofficial చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
హిందీలో డియర్ కామ్రేడ్? దాని జోలికే వెళ్లనన్న హీరో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో 'కబీర్ సింగ్'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్ పాత మూవీ 'డియర్ కామ్రేడ్' ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.రీమేక్స్ జోలికి వెళ్లనుతాజాగా ఈ రూమర్స్పై సిద్దాంత్ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు.అంతా గందరగోళంఅటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.సినిమాసిద్దాంత్ చతుర్వేది చివరగా 'ధడక్ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్ పెరుమాల్' (2018)కి రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్ కామ్రేడ్' విషయానికి వస్తే.. ఇందులో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. -
విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి
నెల క్రితం సమంత రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈమె అనే కాదు గతంలోనూ పలువురు హీరోయిన్లు విడాకులు తీసుకున్న కొన్నేళ్లకు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో బ్యూటీ చేరింది. కొత్త ఏడాది సందర్భంగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి వీడియోని కూడా పంచుకుంది.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)యాడ్స్లో నటించి కెరీర్ ప్రారంభించిన కీర్తి కల్హారీ.. తర్వాత బాలీవుడ్లోనూ పింక్, ఉరి, షైతాన్, మిషన్ మంగళ్ తదితర సినిమాలు చేసింది. క్రిమినల్ జస్టిస్, హ్యుమన్, ఫోర్ మోర్ షాట్స్ తదితర వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు చేసి పేరు సొంతం చేసుకుంది. ఈమెనే ఇప్పుడు తన ప్రియుడిని పరిచయం చేసింది. 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్లో తన సహనటుడు రాజీవ్ సిద్ధార్థ్తోనే ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని అధికారికం చేసేశారు.కీర్తి కల్హారీ గతంలో సాహిల్ సెహగల్ అనే నటుడిని 2016లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న కీర్తి ఇప్పుడు రాజీవ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. చూస్తుంటే త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారనిపిస్తోంది. కొత్త జంటకు తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్ చివరి సీజన్ గత నెల 19న స్ట్రీమింగ్ అయింది. ఆ సిరీస్ ఇలా అయిపోయిందో లేదు వీళ్లు తమ బంధాన్ని బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) -
సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?
సాయిపల్లవి.. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్. గతేడాది ఫిబ్రవరిలో 'తండేల్'తో ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. బయట కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఈమె హిందీలో 'రామాయణ' అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇది రాబోయే దీపావళికి థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. దీనికంటే ముందో ఓ హిందీ రొమాంటిక్ మూవీతో రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కావాల్సినప్పటికీ.. స్టార్ హీరో వల్లే ఆలస్యమవుతోందని మాట్లాడుకుంటున్నారు.సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. హిందీలో చేసిన తొలి సినిమా 'మేరే రహో'. సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. ఈ మూవీ షూటింగ్ గతేడాది ఏప్రిల్లోనే పూర్తయిపోయింది. లెక్క ప్రకారం అయితే డిసెంబరు రెండో వారంలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ 'ధురంధర్' దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. కొడుకు చిత్రం మార్కెటింగ్ అంతా చూసుకుంటున్న ఆమిర్ ఖాన్.. కావాలనే ఈ మూవీ రిలీజ్ వాయిదా వేశాడు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ బాలీవుడ్లో బోర్డర్ 2, ధురంధర్ 2, బ్యాటల్ ఆఫ్ గాల్వాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇంత పోటీలో వస్తే తమ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావని భయపడ్డాడో ఏమో గానీ ఆమిర్ ఖాన్.. 'మేరే రహో' చిత్రాన్ని జూలైలో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. 'రామాయణ' రిలీజ్కి కొద్ది రోజుల ముందే సాయిపల్లవి హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి బజ్ లేదు.ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇప్పటికే ఓటీటీలో ఓ మూవీ, థియేటర్లలో ఓ సినిమా(లవ్ టుడే రీమేక్) చేశాడు. రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సాయిపల్లవితో చేసిన చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి? -
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్కు వెళ్లినా, ఫంక్షన్కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్బాస్ హౌస్కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్బాస్ హౌస్లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
కుప్పలుతెప్పలు వద్దు.. ఒక్క సినిమానే చేస్తా!: ఆలియా భట్
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమె చివరగా జిగ్రా (2024) సినిమాలో కనిపించింది. 2025లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ మూవీస్ చేస్తోంది.అర్థం చేసుకోగలిగా..తాజాగా ఆలియా భట్ మాట్లాడుతూ.. నేను హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా చేశాను. కానీ అందులో నా పాత్రకు మరీ ఎక్కువ స్టంట్ సీన్లు లేవు. కానీ ఆల్ఫా మూవీలో ఎక్కువ యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. పాప పుట్టాక ఇలాంటి సీన్లలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నా శరీరం ఇటువంటి సన్నివేశాల్లో నటించేందుకు ఏమేరకు సహకరిస్తుందనేది అర్థం చేసుకోగలిగాను.అదే నేర్చుకున్నా..లవ్ అండ్ వార్ మూవీ అయితే నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించలేదు. సంజయ్ లీలా భన్సాలీతో పని చేయడం అందమైన అనుభవాలను మిగిల్చింది. సెట్లో ఎంతగానో నేర్చుకున్నాను. గంగూభాయ్ కతియావాడి సెట్లో మైండ్లో ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా.. ఖాళీ మైండ్తో ముందుకు వెళ్లాలని నేర్చుకున్నాను. అప్పుడే అన్నింటినీ పరిశీలించొచ్చు, గమనించి నేర్చుకోవచ్చు.రెండూ బ్యాలెన్స్ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒక్కసారి ఒక ప్రాజెక్టులో మాత్రమే నటించాలనుకుంటున్నాను. ఓ పక్క కూతురు రాహాను చూసుకుంటూ మరోపక్క ఏదైనా ఒక సినిమాలో మాత్రమే లీనమవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: మురారి క్లైమాక్స్.. కాస్త తేడా కొట్టినా నన్ను చంపేవాళ్లే: దర్శకుడు -
బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!
-
దానాలతో ఇల్లు గుల్ల.. ఇంటింటికీ తిరిగి షాంపూలు అమ్మా!
చాలా హిందీ సినిమాల్లో నవ్వులు పంచిన అర్షద్ వార్సీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశాడు. 16 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవితంలో నిలదొక్కుకునేందుకు, బతుకు బండి సాగించేందుకు నానా అగచాట్లు పడ్డాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.బంగారు లైటర్అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. నా తండ్రి పేరు అహ్మద్ అలీ ఖాన్. తను హార్మోనియం వాయించేవాడు. ఉర్దూలో షాయరీలు రాసేవాడు. చిన్నప్పుడు నన్ను హాస్టల్లో వేశారు. సెలవులకు మాత్రమే ఇంటికొచ్చేవాడిని. ఓసారి ఆయన తనదగ్గరున్న గోల్డ్ లైటర్ను వేరేవాళ్లకు బహుమతిగా ఇచ్చేశాడు. మా ఇంట్లో పెద్ద కారు కూడా ఉండేది. మా అంకుల్ ఆ కారు మీద మనసు పారేసుకోవడంతో ఆయనకు గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఉన్నదంతా పోయిందిఇలా ఉన్నదంతా ఇచ్చుకుంటూ ఏమీ మిగలదని చిన్న వయసులోనే అర్థమైంది. మా ఇంటికి జగదీప్, యునుస్ పర్వీజ్ వంటి సెలబ్రిటీలు వచ్చి మాతో కలిసి భోజనం చేసేవారు. మా నాన్నకు ముంబైలో రెండు భవంతులు ఉండేవి. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువకాలం అద్దెకు ఉండేవాళ్లు ఆ ఇంటి యజమానులవుతారు అని కోర్టు ప్రకటించింది. అన్నీ మానేశా..దీంతో నాన్న వెంటనే ప్రాపర్టీని కొందరి పేరు మీదకు బదిలీ చేశారు. తర్వాత వాళ్లు తిరిగిచ్చేస్తారనుకున్నాడు. కానీ అది జరగలేదు. సుమారు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాను. అప్పటిదాకా గాలికి తిరుగుతున్న నేను ఒక్కసారిగా పెద్దవాడినైపోయాను. ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీలకు వెళ్లడం.. అన్నీ మానేశాను. సినిమాఅన్నీ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాను. ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాను. నాలుగు రాళ్లు సంపాదించాను. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. అర్షద్ వార్సీ.. మున్నా భాయ్ ఎంబీబీఎస్, హల్చల్, సలాం నమస్తే, జాలీ ఎల్ఎల్బీ, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఢమాల్ 4, కింగ్, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.చదవండి: 25 ఏళ్లకే పెళ్లా? ఆ తప్పు చేయొద్దంటున్న బాలీవుడ్ బ్యూటీ -
25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయొద్దు!
అమ్మాయిలు.. మీకు చాలా లైఫ్ ఉంది.. వెంటనే పెళ్లి చేసుకోకండి అంటోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. తనకు 25వ ఏటనే పెళ్లయిందని, ఆ తప్పు మరెవరూ చేయకూడదంటోంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి.. దయచేసి ఆ తప్పు చేయకండి. నేను అదే తప్పు చేశాను. కాకపోతే నా వైవాహిక జీవితంలో జరిగిన ఓ అందమైన విషయం ఏంటంటే బిడ్డను కనడం. వర్కవుట్ కాలేదుఅయినప్పటికీ నేను చెప్పేది ఒక్కటే ముందు లైఫ్ను ఆస్వాదించండి.. స్థిరపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవండి అని సలహా ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి అనే సాంప్రదాయాన్ని నేను బలంగా నమ్ముతాను. కానీ ఎందుకో మరి నా విషయంలో వర్కవుట్ కాలేదు. విడిపోయాం.. నేను అక్కడే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగాను. ప్రేమను పొందడం ఇష్టంకొందరితో ప్రేమలో పడ్డాను. కానీ ఎన్నడూ విసుగుచెందలేను. ఇప్పటికీ నా లైఫ్ను నేను ఆస్వాదిస్తున్నాను. ప్రేమ అనే ఆలోచన నాకెంతో ఇష్టం. ప్రేమను పంచడం, పొందడం భలే ఇష్టం. అలా అని ఇప్పుడు నేను ప్రేమ కోసం ఎదురుచూడటం లేదు. ఒకవేళ అది నా ఇంటి తలుపు తడితే దాన్ని కాదనలేను, తప్పకుండా ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చింది.పెళ్లి- విడాకులుచయ్య చయ్య, కెవ్వు కేక వంటి ఐటం సాంగ్స్తో పాపులర్ అయిన మలైకా అరోరా.. 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. కొంతకాలానికి మలైకా - అర్బాజ్ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడిపోయారు. తర్వాత అర్బాజ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను వివాహం చేసుకున్నాడు. మలైకా.. హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపింది, కానీ వీరి బంధం పెళ్లి పట్టాలెక్కేలోపు బ్రేకప్ చెప్పుకున్నారు.చదవండి: చెప్పలేనంత బాధ.. భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నా: బండ్ల గణేశ్ -
సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.ఓ ఈవెంట్ సందర్భంగా ఎవరైనా క్రికెటర్తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది. సూర్యకుమార్ యాదవ్ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్ యాదవ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.కోల్కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్ కూడా అయిన ఖుషి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్తో కలిసి హార్ట్ అటాక్.. ఆకాశ్తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది.సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్ల సిరీస్లో 3-1 తేడాతో విజయం సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్కప్ల కోసం టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్.. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. -
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది' -
నీలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం: చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్గా, సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.హ్యాపీ బర్త్డేనా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.ఎంజాయ్ చెయ్నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు. Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025 చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలు -
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ -
ధురంధర్ కలెక్షన్ల విధ్వంసం
-
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్, మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేశ్ బాబు 'వన్-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. తర్వాత తెలుగులో మరో మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా హిట్స్ అందుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్కి పెళ్లి కానుంది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)కృతిసనన్ ఫ్యామిలీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో సింగర్ స్టెబిన్ బిన్ కూడా కనిపించాడు. కృతి చెల్లి నుపుర్కి కాబోయే భర్త ఇతడే. గాయకుడిగా స్టెబిన్ బాగానే ఫేమ్ ఉంది. నుపుర్ కూడా హీరోయిన్గా తెలుగులోనే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో పరిచయమైంది. ఇది ఘోరమైన ఫ్లాప్ కావడంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.కొత్త ఏడాదిలో జరిగే సెలబ్రిటీ పెళ్లిలో నుపుర్దే మొదటిది అని చెప్పొచ్చు. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా జనవరి 11న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.(ఇదీ చదవండి: ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్) -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)


