breaking news
Bollywood
-
ఇంట్లో అందరూ హీరోయిన్సే.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ బాలీవుడ్ హీరోయిన్. తెలుగులోనూ ఒక సినిమా చేసింది. ఈమె అక్క, తల్లి, అమ్మమ్మ అందరూ హీరోయిన్సే కావడం విశేషం. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తనే రియా సేన్. ఈరోజు ఆమె 45వ పుట్టినరోజు(జనవరి 24). ఈ సందర్భంగా తన కెరీర్ను ఓసారి చూసేద్దాం.ఫ్యామిలీ మొత్తం..రియా సేన్ది బెంగాలీ కుటుంబం. ఆమె తల్లి మూన్మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్ ఇద్దరూ పేరున్న నటీమణులే. ఆ రక్తమే తనలో, తన అక్క రైమా సేన్లో ప్రవహించింది. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీనే ఎంచుకున్నారు. హీరోయిన్స్గా రాణించారు. రియా సేన్ ఐదేళ్ల వయసులోనే తన తల్లి సినిమాలో కూతురిగా యాక్ట్ చేసింది. అక్కాచెల్లెళ్లకు అచ్చిరాని టాలీవుడ్టీనేజ్కు రాగానే తాజ్మహల్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా మారింది. తమిళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక మూవీ 'నేను మీకు తెలుసా?'. ఈ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఇక్కడ అవకాశాలే రాలేదు. దాంతో టాలీవుడ్కు గుడ్బై చెప్పి బాలీవుడ్లోనే సెటిలైంది. ఈమె అక్క రైమా సేన్ కూడా తెలుగులో ధైర్యం అని ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం!సినిమా, పెళ్లిరియా బాలీవుడ్లో స్టైల్, ఝంకార్ బీట్స్, ఖయామత్, అప్న సప్న మనీ మనీ, లవ్ కిచిడీ.. ఇలా అనేక సినిమాలు చేసింది. మధ్యలో ఐటం సాంగ్స్లోనూ తళుక్కుమని మెరిసింది. ఓటీటీలో రాగిని ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్, పాయిజన్, మిస్మ్యాచ్ 2, కాల్ మీ బే వెబ్ సిరీస్లలో కనిపించింది. 2017లో వ్యాపారవేత్త శివం తివారిని రియా సేన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. అయితే ఆ తర్వాత మాత్రం తన పెళ్లి గురించి రియా ఎప్పుడూ ఓపెన్ అవలేదు. View this post on Instagram A post shared by Raima Sen Dev Varma (@raimasen) చదవండి: స్టార్ హీరోకు తల్లిగా అడిగారు.. అయిష్టంగానే చేశా: మీనా -
ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్
యాక్టర్సే కాదు సింగర్స్ కూడా లక్షల్లో ఏకంగా కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే అందరి పరిస్థితి అలా లేదంటున్నాడు బాలీవుడ్ సింగర్ కృష్ణ బ్యూరా. ఇతడు చక్దే ఇండియాలో మౌలా మేరే లేలే మేరీ జాన్, ఆషిక్ బనాయా ఆప్నేలో ఆప్కీ కాశిశ్ వంటి పలు సాంగ్స్ ఆలపించాడు. తనకు సరైన పారితోషికం ఇవ్వలేదని చెప్తున్నాడు.సరైన పారితోషికం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్లో సింగర్స్ కోసం ఎటువంటి విధివిధానాలు లేవు. ఆర్టిస్ట్కు ఒకరోజుకు ఇంత అని ఎలా ఇస్తారో.. సింగర్ను స్టూడియోకు పిలిపించినప్పుడు కనీసం రూ.10 వేలయినా ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఆప్ కీ కాశిశ్ పాటకు నాకు రూ.10 వేలిచ్చారు. అందులో రూ.900 టీడీఎస్ కట్ అయింది. చక్దే ఇండియాలో ఒక పాట పాడినందుకు మళ్లీ అంతే ఇచ్చారు.పైసా రాలేరాజ్ మూవీలోని సోనియా ఓ సోనియా పాటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోకో కహా దుండెరే బండె, మేరా ఇంతకం దేకేగి పాటలకు పైసా పారితోషికం ఇవ్వలేదు. నా 23 ఏళ్ల కెరీర్లో సినిమా పాటలు పాడి పెద్దగా సంపాదించిందే లేదు. మేము బయట షోలు, కచేరీల ద్వారా బాగా సంపాదిస్తామని ఇక్కడ నిర్మాతలు అనుకుంటారు. డిమాండ్ ఉంటేనేపోనీ, మొమహమాటం పక్కనపెట్టి డబ్బు అడిగామనుకో.. నెక్స్ట్ టైం నీకు పాడే ఛాన్స్ ఇవ్వరు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కొందరు పాటకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకుంటారు. ఒక్క సాంగ్కు రూ.50 లక్షలు, రూ.3 కోట్ల వరకు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. సింగర్స్కు డిమాండ్ ఉంటేనే వారు అడిగినంత ఇస్తారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లికి పిలిచి అవమానించాలా? అసభ్యంగా ఫోటోలు, వీడియోలు: నటి ఆగ్రహం -
నడుముపై చేయి వేసి.. అవమానంతో చచ్చిపోయా!
యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పాటు బయట ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. నటి మౌనీ రాయ్ కూడా అలాంటి ప్రోగ్రామ్స్కు తరచూ వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హర్యానాలోని కర్నాల్లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్కు హాజరైంది. అయితే ఆ కార్యక్రమం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నడుముపై చేయి వేసిన అంకుల్స్'కర్నాల్లో ఓ ఈవెంట్కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పరిస్థితి మరింత ఘోరంఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్ చెండాలమైన కామెంట్స్ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు.తలుచుకుంటనే భయంగాఅవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు వచ్చిన కళను నమ్ముకుని మేము బతుకుతున్నాం. వీళ్ల కూతురితోనో, అక్కాచెల్లితోనే వేరేవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా? మగవాళ్లమన్న అహంకారమా?కొంచెమైనా సిగ్గుండాలి! ఇంకో విషయం.. స్టేజీ కాస్త హైట్లో ఉంది. దాంతో ఈ అంకుల్స్.. లో యాంగిల్లో వీడియోలు తీశారు. కొందరు అది చూసి వీడియోలు షూట్ చేయడం ఆపమని చెప్పినందుకు వారిపైనే అరిచారు. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని దీవించేందుకు ఈ ప్రోగ్రామ్స్కు పిలుస్తారు, రివర్స్లో మాకు జరిగేది ఇలాంటి వేధింపులు, అవమానం!' అని మౌనీరాయ్ ఆవేదన వ్యక్తం చేసిందిద.సీరియల్స్, సినిమాలుమౌనీరాయ్.. క్యూంకీ సాస్భీ కబీ బహుతీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. పలు సీరియల్స్లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. జర నచ్కే దిఖా 1 సీజన్ విన్నర్గా నిలిచింది. నాగిని సీరియల్తో ఫుల్ ఫేమస్ అయింది. గోల్డ్, మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, ద భూతిని సినిమాల్లో నటించింది. కేజీఎఫ్ 1లో స్పెషల్ సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: చెట్ల మందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి -
సల్మాన్ దేశభక్తి సినిమా.. మాతృభూమి సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ) -
కాల్పుల ఘటనలో సినీ నటుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.. కొద్దిరోజుల క్రితం ముంబైలో ఓ నివాసంలో కాల్పులు జరిగిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది కమల్ రషీద్ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి కమల్ను అంధేరీ పోలీసులు అరెస్ట్ చేశారు.కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. తనకు తానుగా సినీ విమర్శకుడిగా ఆయన చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే, రచయిత-దర్శకుడు నీరజ్ కుమార్ మిశ్రా నివసించే అంధేరీలోని ఒక నివాస భవనంపై కమల్ రషీద్ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 18న తన లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు అతను అంగీకరించాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని.. తన గన్ను శుభ్రం చేసిన తర్వాత ఫారెస్ట్ వైపు కాల్పులు జరిపానన్నారు. పొరపాటున బుల్లెట్లు ఆ భవనం వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. గతంలో నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన ఖాన్, ఎవరికీ హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల వెనుక గల ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అదే భవనం నాలుగో అంతస్తులో మోడల్ ప్రతీక్ నివసిస్తుండటం గమనార్హం. -
ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్ చేస్తాడంతే!
బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించింది రిమి సేన్. ఇప్పుడు మాత్రం సినిమాలకు గుడ్బై చెప్పేసి దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తోంది. ఇండియాలో ఏజెంట్లను ఏదో తప్పుపనిచేసేవారిలా చూస్తారు, కానీ అక్కడ దర్జాగా బతుకుతున్నానని చెప్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లోని ఓ టాప్ హీరోకు యాక్టింగ్ రాదని గాలి తీసింది. అదే సమయంలో అతడి తెలివితేటల్ని మెచ్చుకుంది.యాక్టింగ్ రాదన్న కామెంట్స్ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం. రిమి సేన్ మాట్లాడుతూ.. జాన్ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతడు మొదట్లో మోడల్గా పని చేశాడు. యాక్టింగ్ అనేదే రాదు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుతుంటే అతడు పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్కు బదులుగా స్టైలిష్గా, స్క్రీన్పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే ఎంచుకునేవాడు. ఉదాహరణకు యాక్షన్ సినిమాలు. తెలివైనవాడుఆ సినిమాల్లో అతడు బాగా కనిపించేవాడు, అప్పుడు జనాలు అతడేం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా అతడు చాలా తెలివైన నటుడు. అయితే పాపులారిటీ పెరుగుతూ ఉండేసరికి అతడే నెమ్మదిగా యాక్టింగ్ నేర్చుకున్నాడు. పదేపదే కెమెరా ముందుకు వస్తూ ఉంటే అది మనకు ఎంతో కొంత అనుభవం నేర్పుతుంది కదా. అలా తనపై తనకు నమ్మకం ఏర్పడ్డాక నటనకు అవకాశమున్న పాత్రల్ని ఎంచుకున్నాడు. రానురానూ..తన పరిధులేంటో తనకు బాగా తెలుసు కాబట్టే మొదట్లో యాక్షన్.. రానురానూ పర్ఫామెన్స్కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే అతడిని తెలివైనవాడని చెప్తుంటాను. తర్వాత నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు, బిజినెస్మెన్గా రాణించాడు అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. జాన్ అబ్రహం, రిమి సేన్.. ధూమ్, గరం మసాలా, హ్యాట్రిక్ సినిమాల్లో కలిసి నటించారు. జాన్ అబ్రహం సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా టెహ్రాన్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.చదవండి: కీర్తి సురేశ్ హోంటూర్.. ఇల్లులాగే లేదు -
ప్రియుడితో ప్రముఖ బుల్లితెర నటి ఎంగేజ్మెంట్..!
ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది.కాగా.. 'అనుపమ' సీరియల్లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్తో జనవరి 25న ఫామ్హౌస్లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది. ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది. -
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్గ్రీన్ స్టార్స్గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్ షారూఖ్ ఖాన్ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..అక్కడ మొదలైందిసౌదీ అరేబియాలోని రియాద్లో ఇటీవలే జాయ్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్ వంటి పలువురు హాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్ నటి హండె ఎర్సెల్ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్.. షారూఖ్తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్ ఖాన్కు పెద్ద అభిమాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీశారు.ఎవరీ అంకుల్?ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్ను చూపిస్తూ ఎవరీ అంకుల్ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్షాట్ తెగ వైరలయింది.అది ఫేక్దీంతో నెటిజన్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్షాట్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్ అనైతే అనలేదు అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్.. ఇంటాక్సికేటెడ్ బై లవ్, చేజింగ్ ద విండ్ అని రెండు టర్కిష్ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్లోనూ యాక్ట్ చేస్తానంది.ఫేక్ స్క్రీన్షాట్ (ఫోటోలో ఎడమవైపు)చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్ -
'యాక్టర్స్ అందరూ వేశ్యలు.. నువ్వూ అదే చేస్తానంటే చస్తా!'
సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్ నటి సయాని గుప్తా.మంచి జీతంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్ను వేశ్యలు అని పిలిచేది. అమ్మ సపోర్ట్ లేదునేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్టీఐఐ (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో చేరాను. సినిమాఅప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్ఎల్బీ 2, ఆక్సన్, పాగలైట్, ఆర్టికల్ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్లో కనిపించింది.చదవండి: పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి -
ఎవరు మీరంతా? కూతురి ముఖం దాచేసిన బిపాసా!
హీరోయిన్ బిపాసా బసు- నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ దంపతులు కూతురు దేవిని తీసుకుని బయటకు వెళ్లారు. సెలబ్రిటీలు ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పాపరాజీ(ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు) బిపాసా దంపతులను ఫాలో అయ్యారు. హీరోయిన్ను, ఆమె కూతురు దేవిని ఫోటోలు తీశారు. దీంతో బిపాసా కాస్త అసహనానికి లోనైంది. వెంటనే కూతురు ముఖాన్ని దాచేసింది. అసలు ఎవరు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా కోపంతోనే ఓ బిల్డింగ్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.చిగురించిన లవ్ స్టోరీ2015లో వచ్చిన ఎలోన్ సినిమా షూటింగ్లో కరణ్ సింగ్- బిపాసా కలుసుకున్నారు. వెండితెరపై జంటగా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడింది. ఏడాదిపాటు ప్రేమకబుర్లు చెప్పుకున్న వీరు 2016 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2022లో కూతురు దేవి జన్మించింది. సినిమాసినిమాల విషయానికి వస్తే.. తెలుగులో టక్కరిదంగ సినిమాలో నటించింది. బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన బిపాసా కొంతకాలంగా మూవీస్కు దూరంగా ఉంటోంది. చివరగా డేంజరస్ వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో ఆమె భర్త కరణ్ సింగ్ కూడా నటించాడు. ఇతడు చివరగా ఫైటర్ మూవీలో యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Bollywood Reporter (@bollywoodreporter.in) చదవండి: ఓటీటీలో మోగ్లీ మూవీ.. ఎక్కడంటే? -
ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఏడేళ్ల తర్వాత 'తుంబాడ్' దర్శకుడి కొత్త సినిమా.. గూస్ బంప్స్ ట్రైలర్
'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సుమారు ఏడేళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మరో సినిమా మయసభ.. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జావేద్ జాఫేరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీణా జామ్కర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ దర్శకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తీసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్’ (Mayasabha: The Hall Of Illusion)' చిత్రాన్ని పికల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పిస్తుండగా.. జిర్కాన్ ఫిల్మ్స్ పీ లిమిటెడ్ నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బంగారం కోసం వేట.. అందులో దాగిన రహస్యంతో పాటు భ్రమలతో కూడిన ఓ కొత్త ప్రపంచాన్ని ఇందులో చూపించనున్నారు. ఒక థియేటర్లో టన్నుల కొద్ది బంగారం దాచి మరిచిపోయారనే ఆసక్తికర డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి. -
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్పై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. The wait ends on January 30.Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026 -
భారత్లో ఈజీ కాదు, అందుకే దుబాయ్ చెక్కేశా..
ఒకప్పుడు హిట్ సినిమాల హీరోయిన్.. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్. భారత్ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్గా లైమ్ లైట్లోకి వచ్చింది. తనే హీరోయిన్ రిమీ సేన్.భారత్లో అలా లేదుహీరోయిన్ రిమీ సేన్ మాట్లాడుతూ.. దుబాయ్ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్లో లేదు. భారత్లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.అనుకూలంగా లేదుదీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.సినిమారిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్లో హంగామా, ధూమ్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్ 2, ధూమ్ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్బై చెప్పేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) చదవండి: ఇంకా నిద్రపోతున్నారా? హీరోకు అవమానకర ప్రశ్న -
సూపర్స్టార్ ఇంట్లో 'గోల్డెన్ టాయిలెట్'.. నటుడి సెల్ఫీ వైరల్
స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వాటిని రకరకాలుగా ఖర్చు పెడుతుంటారు. కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన వాటికి కూడా డబ్బులు పెట్టేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ ప్రముఖ నటుడు బాత్రూంలో కమోడ్ని బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు దాంతో ఓ నటుడు సెల్ఫీ దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)తెలుగులో 'ఎమ్సీఏ' సినిమాలో విలన్గా చేసిన విజయ్ వర్మ.. ప్రస్తుతం హిందీలో మూవీస్, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కొన్నాళ్ల ముందు వరకు హీరోయిన్ తమన్నాతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఇతడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్తో సెల్ఫీ దిగాడు. అయితే ఈ సెల్ఫీని 2016లో తీసుకున్నాడు. రీసెంట్ వైరల్ ట్రెండ్ దృష్టా.. ఇప్పుడు ఆ ఫొటోని పోస్ట్ చేశాడు.2016 నాకు మైలురాయి లాంటిది. బిగ్ బీ, సుజిత్ సర్కార్లతో 'పింక్' సినిమా చేశాను. నా దేవుడు సచిన్ని కలిశాను. బచ్చన్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్తో సెల్ఫీ దిగాను అని విజయ్ వర్మ రాసుకొచ్చాడు. అలానే దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ని తన అభిమాన హీరోగానూ వర్ణిస్తూ ఆయనతో దిగిన ఫొటోను కూడా విజయ్ వర్మ షేర్ చేశాడు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?) View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) -
40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోల్స్ లెక్క చేయను
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ 'ధురంధర్' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్కు జంటగా నటించింది 20 ఏళ్ల సారా. దీంతో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్. అదే నమ్ముతా..ఆమె మాట్లాడుతూ.. నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగా లేను. కాబట్టి అక్కడేం జరుగుతుందనేది నాకు పెద్దగా తెలీదు. ఈ ఏజ్ గ్యాప్ గొడవంతా సోషల్ మీడియాలోనే జరుగుతోందనుకుంటా.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుందని భావిస్తాను. ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. కాబట్టి ఏజ్ గ్యాప్ నచ్చకపోవడమనేది వారి సమస్య. అది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు. అలాంటివి నేను లెక్క చేయను. సినిమా కథేంటో నాకు తెలుసు. ఆ కథకు అనుగుణంగానే అందరూ నడుచుకున్నారు. అంతే..కో స్టార్పై ప్రశంసలుఇకపోతే రణ్వీర్ సింగ్ లాంటి నటులను నేను చూడలేదు. ఎంతో అంకితభావంతో పని చేస్తాడు. సెట్లో ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. సినిమా తీయడం అనేది దర్శకనిర్మాతల పని మాత్రమే కాదు.. సమిష్టి కృషి అని నమ్ముతాడు. సెట్ డిజైన్ దగ్గరి నుంచి అన్నింట్లోనూ పాలుపంచుకుంటాడు. అందర్నీ ఏకం చేసి ముందుకు నడిపిస్తాడు అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమా 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్బస్టర్ టాక్తో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: రేణూ దేశాయ్ శాపనార్థాలు -
హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జయంతి (ఫొటోలు)
-
కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!
ప్రస్తుతం ఎవరితో మాట్లాడినా సరే ఆరోగ్యం ఉండండి, డైట్ పాటించండి అని చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. స్క్రీన్ పై కనిపించాలి, గ్లామర్గా ఉండాలంటే మన తినే చాలా ఆహార పదార్థాలకు వాళ్లు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫేమస్ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఇప్పుడు అదే చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్నెస్ కోచ్గా చేసిన ఈయన ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రైనర్ వినోద్ చన్నా.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, డైట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో చెప్పాడు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. 'జాన్ పాటిస్తున్న డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయింది. జాన్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. నాలుగు ఫుడ్స్ తినమని చెబితే అవి మాత్రమే తింటాడు. వేరే వాటిని అస్సలు ముట్టుకోడు. అంత కఠినంగా ఉంటాడు'(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)'ఓసారి సినిమా షూటింగ్లో జాన్ ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె వచ్చారు. డైనింగ్ టేబుల్పై ఉన్న ఫుడ్ అంతా అయిపోయిందని నాతో చెప్పింది. కానీ జాన్ ఆ ఆహారాన్ని అస్సలు టచ్ చేయడని, ఆ విషయంలో నాకు వంద శాతం నమ్మకం ఉందని ఆమెతో చెప్పాను. షుగర్(చక్కెర)కు జాన్ చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతైనా తీసుకోమని చెప్పాను. అయినా సరే నో చెప్పాడు''పొరపాటున జాన్ గనుక చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అతడికి దగ్గు వచ్చే అవకాశముంది. ఎన్నో ఏళ్లుగా కఠినమైన డైట్ పాటించడం వల్ల ఇప్పుడు జాన్.. బెండకాయ, వంకాయ లాంటివి తినలేడు. ఒకవేళ తీసుకున్నా సరే అతడి కడుపు వాటిని జీర్ణించుకోలేకపోతోంది. శరీరం ఓ నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే అకస్మాత్తుగా వచ్చే మార్పులని తీసుకోలేదు. జీర్ణ సమస్యలు వస్తాయి' అని వినోద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయంలో ఫిట్నెస్, డైట్ పాటించే వాళ్లమధ్య హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్) -
భారీ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ మేకింగ్.. ప్రధాని బయోపిక్ విశేషాలివే..!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేయనున్నారు.ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్లో ప్రారంభం కానుంది. -
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)రహమాన్ డకాయిత్గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ
నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ. కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్పాత్పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం. సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే చదువుక పుల్స్టాప్ పెట్టేసి 17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు. ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా అనేక కష్టాలు పడ్డాడు.ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి దారి చూపించింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్పాత్పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో రూ.50 లకు అమ్మేవాడు. నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు. అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ప్రేరణ నిచ్చిన సినిమా ముంబైలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్పాత్పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది. అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్వేర్ బిజినెస్ ప్రారంభించాడు. బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్తో రాజా నాయక్ వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్, వాటర్ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే. అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది. ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో భార్య అనిత తోడుగారాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. చదువు మానేసి, 16 ఏళ్లవయసులో ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100 కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు. -
మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తెగ ట్రెండ్ అయిపోయింది. తమిళ హీరో ధనుష్ని వాలంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోనుందనే పుకార్లే దీనికి కారణం. ఒకటి రెండు రోజుల పాటు అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు. ఇదంతా ఫేక్ అని మృణాల్ టీమ్ ఇదంతా ఫేక్ అని చెప్పడంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇదలా ఉండగానే ఓ రొమాంటిక్ మూవీని మృణాల్ రెడీ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)'దో దివానే షెహర్ మైన్' పేరుతో తీసిన ఈ రొమాంటిక్ సినిమాలో మృణాల్ సరసన సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. ఫిబ్రవరి 20న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. సిద్ధాంత్-మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి? ఎందుకంటే ఈమె గత రెండు చిత్రాలు.. సన్నాఫ్ సర్దార్ 2, ద ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో?(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే) -
నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ
జెనరేషన్ మారుతోంది. మొన్నటి తరంలా నిన్నటి తరం లేదు, నిన్నటి తరంలా నేటితరం లేదు. ఇప్పుడంతా హైటెక్ స్పీడ్.. అయితే ఇదే కొన్నిసార్లు తనను భయానికి గురి చేస్తోందంటోంది బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాన్న (రామ్ ముఖర్జీ) ఉన్నప్పుడు నా సినిమాలు చూసి పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పేవాడు. ఆయన వెళ్లిపోయాక ఫీడ్బ్యాక్ పొందడమే కష్టమైపోయింది. నా కూతురు తట్టుకోలేదుకానీ భగవంతుడు నాన్నను కోల్పోయిన లోటును కూతురితో భర్తీ చేశాడు. అయితే నా కూతురు నా సినిమాలు ఎక్కువగా చూడదు. ఎందుకంటే నేను ఏడ్చే సన్నివేశాలను చూసి తను తట్టుకోలేదు.. అదే సంతోషంతో డ్యాన్స్ చేసే సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. నేను నటించిన హిచ్కి, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, బంటీ ఔర్ బబ్లీ సినిమాలు చాలా ఇష్టపడుతుంది.మేకప్ వేసుకున్నా బాధేకుచ్ కుచ్ హోతాహై మూవీ మాత్రం చూడలేదు. ఎందుకంటే అందులో నేను మొదటి సన్నివేశంలోనే చనిపోతాను. అది తను తట్టుకోలేదు. అలాగే నేను మేకప్ వేసుకుంటే కూడా తనకు నచ్చదు. నువ్వు నా అమ్మలా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. మేకప్ తీసేయగానే ఇప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్తుంది. ఎంతైనా తను జెన్ ఆల్ఫా (2010 - 2024 మధ్య జన్మించినవారు) కిడ్. అదే నా చిన్నతనంలో..ఒక్కోసారి కోపంతో నాపై అరిచేస్తుంటుంది. అప్పుడు తను చెప్పేది నేను ఓపికగా వినాల్సిందే! అదే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చెంపదెబ్బలు కొట్టేది. అదే పని నేను చేశాననుకోండి, నా కూతురు తిరిగి కొట్టినా కొట్టొచ్చు. తను చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తనకు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.సినిమారాణీ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కూతురు అధీర జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగానూ రాణీ ముఖర్జీ.. ఉత్తమ నటిగా గతేడాది జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం మర్దానీ 3 మూవీ చేస్తోంది.చదవండి: కోహ్లితో రిలేషన్? స్పందించిన బిగ్బాస్ కంటెస్టెంట్ సంజనా -
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
హీరోయిన్ పూజా హెగ్డేకి అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి. ఈమె నటించిన 'జన నాయగణ్' లెక్క ప్రకారం ఈ పాటికే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు. పాన్ ఇండియా హీరో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే, అతడిని లాగిపెట్టి కొట్టానని చెప్పంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే.. ఓ స్టార్ హీరోతో తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 'నా కెరీర్ మొదట్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ టైంలో ఓ రోజు.. ఆ హీరో, అనుమతి లేకుండా నా క్యారవాన్లోకి వచ్చేశాడు. అసభ్యంగానూ ప్రవర్తించాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ హీరోని లాగిపెట్టి కొట్టాను. వెంటనే సదరు హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఆ హీరోతో నటించడానికి నేను ఇష్టపడలేదు. దీంతో నా సీన్స్ అన్నీ డూపుని పెట్టి తీశారు' అని పూజ చెప్పుకొచ్చింది.మరి పూజా హెగ్డేని ఇబ్బంది పెట్టిన ఆ పాన్ ఇండియా హీరో ఎవరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కెరీర్ ప్రారంభంలో అంటే హృతిక్ రోషన్ 'మొహంజదారో'లో ఈమె నటించింది. దక్షిణాదిలోనూ ఈ మూవీ రిలీజైంది. నాలుగేళ్ల క్రితం ప్రభాస్ 'రాధేశ్యామ్'లో నటించింది. పూజా చేసిన పాన్ ఇండియా మూవీస్ అంటే ఇవే. మరి వీరిద్దరిలో ఎవరైనా పూజతో అసభ్యంగా ప్రవర్తించారా? లేదంటే ఈమె ఏమైనా కట్టుకథ చెబుతోందా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఇకపోతే పూజా చేతిలో ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా, ఓ హిందీ మూవీ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?) -
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.అదే కారణంఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.ఒక్కసారి కాదు, రెండుసార్లుచాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. చేయిదాటిపోయిందినాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన -
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్బాస్ విజేతలు.. మరో సర్ప్రైజ్ ఏంటంటే? -
నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్
కొన్నిసార్లు మన అభిప్రాయాలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్లుగా పవర్ షిఫ్ట్ నెలకొందని, సృజనాత్మక లేనివారే క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు మతపరమైన అంశం కూడా కారణం కావొచ్చని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు రెహమాన్. అర్థం చేసుకున్నారుఅంతేకాకుండా ఆ ప్రభావం తనపై పడినట్లు తనకు అనిపించలేదు కానీ, పడిందన్నట్లుగా కొందరు గుసగుసలాడుకున్నట్లు తెలిసిందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు తప్పుపట్టారు. తాజాగా ఈ వివాదంపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. భారతదేశం నా ఇల్లు.. నా గురువు.. నాకు స్ఫూర్తి. కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నాను. బాధ పెట్టాలనుకోలేదుకానీ, నా ఆలోచన మాత్రం ఎప్పుడూ సంగీతం గౌరవించబడటమే.. సంగీతానికి సేవ చేయడమే.. అలాగే నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోవడం లేదు. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో నేను భారతీయుడిగా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. కృతజ్ఞతతో ఉంటా..అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వేవ్స్ సమ్మిట్ -2025లో ఝాలా ప్రదర్శన, రూహ్- ఎ-నూర్, సన్ షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్వకత్వం వహించడం, ఇండియాస్ ఫస్ట్ మల్టీకల్చరల్ వర్చ్యువల్ బ్యాండ్ 'సీక్రెట్ మౌంటైన్'ను బిల్డ్ చేయడం, హన్స్ జిమ్మర్తో కలిసి రామాయణ సినిమాకు సంగీతం అందిస్తుండటం.. ఇలా ప్రతీది నా జర్నీని బలోపేతం చేస్తుందనుకుంటున్నాను. ఈ దేశానికి కృతజ్ఞతతో ఉంటాను. జై హింద్, జయహో.. అంటూ వీడియోలో మాట్లాడారు రెహమాన్. మా తుఝే సలామ్, వందేమాతరం అంటూ ఓ స్టేడియంలో ఆడియన్స్ పాడుతున్న విజువల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. View this post on Instagram A post shared by AR Rahman: Official Updates (@arrofficialupdates) చదవండి: 20 ఏళ్ల వయసులో తమన్నాకు చేదు అనుభవం -
నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్
-
హీరో కూతురికి నామకరణం.. సాక్షాత్తూ అమ్మవారి పేరు!
బాలీవుడ్ జంట రాజ్కుమార్ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు. తాజాగా తమ ఇంట్లోకి సంతోషాల మూటను తీసుకొచ్చిన చిన్నారి చేతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాపకు "పార్వతి పాల్ రావు" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట! ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 2021లో పెళ్లిరాజ్ కుమార్ రావు- పాత్రలేఖ ఇద్దరూ సినిమా యాక్టర్సే. 2014లో సిటీలైట్స్ సినిమా షూటింగ్లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ రానురానూ మరింత బలపడింది. పెద్దలు కూడా వారి ప్రేమాయణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2021 నవంబర్ 15న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది న్యూజిలాండ్ ట్రిప్లో ఉన్నప్పుడు పాత్రలేఖకు తాను గర్భవతిని అన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే భారత్ తిరిగొచ్చేసిది. అయితే బిడ్డ పుట్టాక మళ్లీ న్యూజిలాండ్ ట్రిప్కు వెళ్లి ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టేస్తానంటోంది.సినిమారాజ్ కుమార్ రావు.. 2010లో సినీ జర్నీ మొదలుపెట్టాడు. రణ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, స్త్రీ. తలాష్, లవ్ సోనియా, హిట్, శ్రీకాంత్, భేడియా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. పాత్రలేఖ విషయానికి వస్తే.. ఈమె లవ్ గేమ్స్, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రెహమాన్పై కంగనా ఫైర్
లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.మీలాంటి మనిషిని చూడలేఈ మేరకు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది. ప్రియమైన ఏర్ రెహమాన్.. నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయినా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.చీరలో వెళ్లేందుకు నోతన బ్రాండ్ ప్రమోషన్స్ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్ రెహమాన్ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.చదవండి: ఒక్కడు మూవీలో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా? -
ధురంధర్ సునామీ.. 9 ఏళ్ల బాహుబలి రికార్డు బద్దలు
-
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బాలీవుడ్
-
2016.. నా జీవితమే నరకప్రాయం: కంగనా రనౌత్
2026కి వెల్కమ్ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.2016ని ఎందుకు మిస్ అవుతున్నారో?వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందరూ సడన్గా 2016ని ఎందుకు మిస్ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్ నోటీసులు పంపాడు.సంచలనంఅది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్సైడర్స్, ఔట్సైడర్స్ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.ఏమిటా వివాదం?గతంలో కంగనా రనౌత్- హృతిక్ రోషన్ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్ రోషన్ను ఎక్స్గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్ చేసింది. దీంతో హృతిక్.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో యాక్ట్ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్ ఏమందంటే?
ఒకప్పుడు గ్లామర్తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్బై చెప్పేసింది. 2020 అక్టోబర్లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్పై సనాఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతం వల్లేనేమో! -
8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతంవల్లేనేమో!
సంగీత ప్రపంచంలోనే అగ్రజుడు ఏఆర్ రెహమాన్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించాడు. పుట్టుకతోనే హిందూ అయిన ఇతడు తర్వాత ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్ల బాలీవుడ్లో సరైన అవకాశాలు రాలేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఔట్ సైడర్తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. రోజా, బాంబే, దిల్సే వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్లో ఔట్సైడర్ (ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి)లానే ఫీల్ అయ్యేవాడిని. కానీ తాల్ సినిమా పాటలు అందరి ఇంట్లోకి చేరాయి. ఇప్పటికీ ఎంతోమంది ఉత్తరాదివాళ్లు ఆ మూవీ పాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది.8 ఏళ్లుగా తగ్గిన అవకాశాలుఅప్పుడు నాకు పంజాబీ సంగీతంపై మరింత ఆసక్తి కలిగింది. అలా సుక్వీందర్ సింగ్ను కలిశాను. తనతో కలిసి చేసిన 'చయ్య చయ్య', 'జై హో..' పాటలు ఎంత ఆదరణ పొందాయో మీ అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిదేళ్లుగా నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. బహుశా దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్ ఒక కారణమైతే.. నా మతం కూడా మరో కారణం కావొచ్చు. ఏదేమైనా నాకు నా కుటుంబానితో గడిపేందుకు సమయం దొరికిందనుకుంటాను. అవే నా దగ్గరకు..అయినా పనికోసం నేను పాకులాడటం లేదు. పనే నా దగ్గరకు రావాలని అనుకుంటాను. నా వృత్తిపట్ల నాకున్న నిబద్ధతే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదని పలువురు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రామాయణం మూవీలో ఛాన్స్ నీ మతం చూసే ఇచ్చారా? అని మండిపడుతున్నారు. చదవండి: ధనుష్తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? -
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్లో అవకాశాలు దక్కాలంటే ఘర్వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు... హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.ఓ ప్రముఖ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్సైడర్లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు. మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్మేకర్ రెహమాన్ వ్యాఖ్యలను చీప్ అని పేర్కొన్నారు. అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
'టాక్సిక్' కోసం 'ధురంధర్ 2' వాయిదా? డైరెక్టర్ క్లారిటీ...
ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్తోనే బ్లాక్బస్టర్ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.అదేరోజు టాక్సిక్ రిలీజ్ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్ టాక్సిక్ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్ ఫుల్స్టాప్ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ క్లారిటీధురంధర్ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) డైరెక్టర్, ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.చదవండి: మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లో ఓటీటీలోకి.. -
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. పోస్టర్తోనే విపరీతంగా ట్రోల్స్..!
భామ.. తమిళం, మలయాళంలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్కు షిఫ్ట్ అయిన సాయిపల్లవి.. రామాయణతో పాటు ఏక్ దిన్ అనే మూవీలో కనిపించనుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.తాజాగా సంక్రాంతి కానుకగా ఏక్ దిన్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏక్ దిన్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ కాస్తా విమర్శలకు దారి తీసింది. ఇది చూస్తుంటే 2016లో వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ డేను పోలి ఉందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆ మూవీని కాపీ చేశారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.పేరుతో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ చిత్రం రీమేక్ చేయనున్నారా? లేదా కొత్త స్టోరీనా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే కాపీ కంటెంట్ అనే విమర్శలొస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్నారు. సునీల్ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో మే 1న రిలీజ్ చేయనున్నారు. Amir Khan Production: Sai Pallavi’s Bollywood debut #EkDin is the remake of Thai Film #OneDay.Of late Why Amir Khan is behind remakes🤔#LalSinghChadha - Flop#Loveyapa - Flop#SithareZameenPar - Decent#EkDin - 🤞 pic.twitter.com/W0IuZ7bbZZ— Christopher Kanagaraj (@Chrissuccess) January 16, 2026 -
ఇండో-పాక్ వార్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బోర్డర్-2 ట్రైలర్
గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన వార్ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటించారు. -
అల్లుడు సెంచరీ.. మామయ్య ఫుల్ ఖుషీ..!
అల్లుడు కేఎల్ రాహుల్పై మామయ్య సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ కొట్టడంతో బాలీవుడ్ నటుడు కొనియాడారు. విభిన్నమైన స్థానం.. అదే ప్రశాంతత.. అదే వ్యక్తిత్వం అంటూ అల్లుడిని ఆకాశానికెత్తేశారు. ఆ స్కోర్ బోర్డ్లో ఈ సెంచరీ ప్రత్యేకంగా గుర్తుంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న క్షణాలను సంయమనాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సునీల్ శెట్టి పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన కేఎల్ ఫ్యాన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. కేఎల్ రాహుల్.. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కుతూరు కూడా జన్మించింది. వీరి పెళ్లి వేడుకను సునీల్ తన ఫామ్ హౌస్లోనే గ్రాండ్గా నిర్వహించారు. ఈ పెళ్లి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు సందడి చేశారు. కాగా.. కేఎల్ సతీమణి అతియా శెట్టి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. View this post on Instagram A post shared by Suniel Shetty (@suniel.shetty) -
తట్టుకోలేకపోయా, గదిలో కూర్చుని ఏడ్చా..: షారూఖ్ కూతురు
కింగ్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా 'ద ఆర్చీస్' మూవీతో సినీప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడేకంగా తండ్రితో కలిసి నటించబోతోంది. షారూఖ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ చిత్రంలో సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఆసక్తే ఉండేది కాదని, రానురానూ తన ఆలోచన మారిందని చెప్తోంది.ఒంటరిగా ఏడ్చా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో నాటకాల్లో పాల్గొనాలంటే అస్సలు ఇంట్రస్ట్ ఉండేది కాదు. కానీ, తర్వాత సడన్గా నాకు దానిపై ఆసక్తి పెరిగింది. ఓసారి స్కూల్లో వేయబోయే ఒక నాటకం కోసం ఆడిషన్ ఇచ్చాను, కానీ నేను కోరుకున్న పాత్రలో నన్ను సెలక్ట్ చేయలేదు. ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. చాలా బాధపడ్డాను. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. కింగ్ సినిమాలో..అప్పుడు నాకు యాక్టింగ్పై ఎంత ఇష్టం ఉందనేది తెలిసింది. స్టేజీపై పర్ఫామ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ఆ ప్యాషన్ ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కింగ్ సినిమా విషయానికి వస్తే.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా షారూఖ్ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. 'కింగ్' షారూఖ్తో దీపికా నటిస్తున్న ఆరో సినిమా కావడం విశేషం! గతంలో వీరిద్దరూ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాల్లో కలిసి నటించారు.చదవండి: 37 ఏళ్ల తర్వాత మొదటి హీరోను కలిసిన స్టార్ హీరోయిన్ -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్గా, వేశ్యగా..
ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బాలీవుడ్లో అనేక సక్సెస్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.చిన్నతనంలోనే..చిన్నప్పుడు మహారాజు గెటప్ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సినిమాతక్కువకాలంలోనే స్టార్ హీరోయి్గా మారింది. 1942: ఎ లవ్స్టోరీ, అకేలే, హమ్ అకేలే తుమ్, ఖామోషి: ద మ్యూజికల్, దిల్సే, కంపెనీ, తాజ్ మహల్, భూత్ రిటర్న్స్ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్ (భారతీయుడు), ముదల్వన్ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్ మూవీ చేసింది.క్యాన్సర్పై పోరాటంమనీషా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్లో మల్లికాజాన్ అనే వేశ్యపాత్రలో యాక్ట్ చేసింది. గతేడాది లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది.చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్గా విడాకులు: బాలీవుడ్ నటి -
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం..: నటి
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్ హగ్పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకులు..సెప్టెంబర్ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్ హగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్మాల్ రిటర్న్స్, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్ చేసింది. -
దురంధర్ దూకుడు.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రిలీజై 39 రోజులైనా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1300 కోట్ల మార్క్కు చేరువలో ఉంది.ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డును తన సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డ్ను ధురంధర్ తుడిచిపెట్టేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల కలెక్షన్ రాబట్టింది. అంతకుముందు బాహుబలి-2 20.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత తొమ్మిది ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.కాగా.. ఇప్పటికే ఈ మూవీ భారత్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి ఆదిత్య ధార్ ధర్శకత్వం వహించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. -
ధనశ్రీ- చాహల్ మళ్లీ కలవబోతున్నారా?.. క్రికెటర్ రియాక్షన్ ఇదే..!
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. గతేడాది అఫీషియల్గా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ వర్క్ లైఫ్తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విడిపోయిన జంటపై నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట మరోసారి కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్- ధనశ్రీ వర్మ ది -50 అనే రియాలిటీ షోలో కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్రికెటర్ చాహల్ స్పందించారు.అయితే తామిద్దరు కలుస్తామన్న వార్తలను చాహల్ కొట్టిపారేశారు. తమ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని క్రికెటర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెటర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు. అయితే ఈ రూమర్స్పై ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. కాగా.. ది -50 అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు చిత్రనిర్మాత ఫరా ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
గ్రాండ్గా సిస్టర్ పెళ్లి.. సందడి చేసిన ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్పూర్లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్ను పెళ్లాడింది. ఉదయపూర్లో జరిగిన వివాహ వేడుకలో కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.నుపుర్ సనన్ సినీ కెరీర్..నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) Kriti Sanon walks sister Nupur down the aisle as she weds Stebin Ben in dreamy Christian & Hindu ceremonies!#kritisanon #stebin #nupursanon #marriage #ptcpunjabigold pic.twitter.com/hNpgUbEeFo— PTC Punjabi Gold (@PtcGold) January 12, 2026 -
పవర్ఫుల్ పాత్రలో...
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా లీడ్ రోల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఇ.ఫ్లవర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా సఫియా ఓక్లీ–గ్రీన్, టెమ్యూరా మారిసన్ ఇతర పాత్రలు పోషించారు. ఏజీబీవో, సినీస్టార్ పిక్చర్స్, బిగ్ ఇండీ పిక్చర్స్, పర్పుల్ పెబుల్ పిక్చర్స్పై జో రుస్సో,ఆంటోనీ రుస్సో, ఏంజెలా రుస్సో–ఓట్సా్టట్, మైఖేల్ డిస్కో, ప్రియాంకా చోప్రా, సిలీ సల్దానా, మరియల్ సల్దానా నిర్మించారు.ప్రియాంకా చోప్రా పవర్ ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ టీజర్ని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్ను ప్రియాంకా చోప్రా షేర్ చేశారు. ఇదిలా ఉంటే... లాస్ఏంజిల్స్లోని బెవర్లీ హిల్టన్ వేదికగా 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకి భర్త నిక్ జోనస్తో కలిసి రెడ్ కార్పెట్పై గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్ పాటించి, వర్కవుట్స్ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడాడు.సరైన సమయం దొరక్క..కరణ్ జోహార్ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్ ఉండవు. అర్జంట్ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నాననేవారు. అమ్మ తిట్టేదిఅమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. కళ్లు తిరిగి పడిపోయా..అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్రూమ్లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాటి వల్లే బరువు తగ్గా..కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్ చేశాను. గేమ్స్ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్ జోహార్ చెప్పుకచ్చాడు.చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్ చూశారా? -
ప్రేమపై నాకు నమ్మకం ఉంది!
మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకపాటల్లో తనదైన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారామె. మహేశ్బాబు ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే..’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక...’పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్తో 1998లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మలైకా. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. అర్జున్ కపూర్తో ప్రేమలో ఉండటం వల్లే అర్బాజ్ ఖాన్కి మలైకా విడాకులిచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత అర్జున్ కపూర్– మలైకా అరోరా కూడా రిలేషన్ షిప్కి బ్రేకప్ చెప్పారు. తాజాగా తన విడాకులు, రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు మలైకా అరోరా. ‘‘నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత విడిపోయాను. అనంతరం రిలేషన్షిప్లో ఉన్నాను. బ్రేకప్ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనేది తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నా విషయంలో సెట్ కాలేదు అంతే. అయినప్పటికీ ప్రేమ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అనేది నాకు చాలా ఇష్టం. అది దక్కాలంటే అదృష్టం ఉండాలి’’ అని పేర్కొన్నారు మలైకా ఆరోరా. -
గోశాలకు సోనూసూద్ రూ.11 లక్షలు విరాళం
మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.గోశాలకు విరాళంఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.సినిమాసోనూసూద్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్.. ఇలా అనేక సినిమాల్లో విలన్గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా.. -
ప్రియుడిని పెళ్లాడిన 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, కథానాయిక నుపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. వారం రోజుల క్రితమే ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శనివారం (జనవరి 10న)నాడు ప్రియుడిని వివాహం చేసుకుంది. రాజస్తాన్లో ఉదయ్పూర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.పెళ్లి చేసుకున్న హీరోయిన్ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఒకే ఒక్క మూవీనుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Bollywood (@lifestyleofbollywood)Finally its here ✨5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ— G (@kixtr1KSanon) January 10, 2026 View this post on Instagram A post shared by Stebin Ben (@stebinben) -
సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ.. ఈ నెలలోనే మూడో పార్ట్
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "మర్దానీ 3". దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ను ఓ నెల ముందుకు జరిపారు.సినిమామర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీరాయ్గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. 'ద రైల్వేమెన్' ఫేమ్ ఆయుష్ గుప్తా కథ అందించాడు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) చదవండి: ఇలా జరుగుతుందనుకోలేదు.. సారీ: రాజాసాబ్ డైరెక్టర్ -
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ధురంధర్ హీరో సరసన..ధురంధర్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ప్రళయ్' (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కల్యాణి యాక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.అన్నీ నాకే కావాలి!మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.ప్రళయ్ సినిమా!ప్రళయ్ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్ హిందీ సినిమా ప్రళయ్ అవుతుంది.చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్ నిర్మాత భావోద్వేగం -
క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)
-
హోటల్లో 18 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో స్టార్ హీరో..
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్ ఆర్యన్ డేటింగ్ గురించి బాలీవుడ్లో బిగ్ న్యూస్ వైరల్ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్ అవుతున్నాయి. దీంతో అతను సోషల్మీడియాలో ఆమెను అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది.35ఏళ్ల కార్తిక్ ఆర్యన్ టీనేజ్ అమ్మాయితో గోవా బీచ్లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం. సోషల్మీడియాలో వారు షేర్ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్ అమ్మాయితో డేటింగ్ చేయడం ఏంటి అంటూ కార్తిక్ ఆర్యన్కు మెసేజ్లు పెడుతున్నారు.బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది. కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకు కామెంట్స్ను ఆపేసింది. కానీ, కార్తిక్ ఆర్యన్ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.కార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. -
బంగ్లా నుంచి కబురు వచ్చింది
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. టబు, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, వామికా గబ్బి, జిస్సు సేన్ గుత్తా ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే మే 15న రిలీజ్ చేయనున్నట్లుగా గురువారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘బంగ్లా నుంచి కొత్త కబురు వచ్చింది. మే 15న బంగ్లా డోర్స్ తెరుచుకుంటాయి (న్యూ రిలీజ్ డేట్ని ఉద్దేశించి)’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే!
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తను డైరెక్ట్ చేసిన సినిమాలు అవార్డులు గెలిచాయి కానీ ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. తాజాగా భారత జాతీయ సినీ అకాడమీ (NICA) ప్రెస్మీట్కు హాజరైన రోహిత్ శెట్టి ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.యాంకరింగ్ చేయమని..ఆయన మాట్లాడుతూ.. నాకు, అవార్డులకు మధ్య సంబంధమే లేదు. ఇప్పటివరకు 17 సినిమాలు తీశాను. అవార్డు ఫంక్షన్కు పిలుస్తుంటారు, కానీ హోస్ట్గా చేయమని మాత్రమే ఇన్విటేషన్ వస్తుంటుంది. అలా అవార్డుల ఫంక్షన్లో యాంకర్గా మాత్రమే కనిపించాను అన్నాడు.ఎప్పుడో మొదలైందినార్త్ వర్సెస్ సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సినిమా రిలీజైతే పండగ చేసుకోవాలి. సినిమా అనేది మొదలైనప్పటినుంచే ఇక్కడి వాళ్లు దక్షిణాదిలో.. దక్షణాదివాళ్లు బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. 1950 నుంచే ఇదంతా జరుగుతోంది. మనం ప్రాంతీయ బేధాలు చూడకుండా సినిమా సెలబ్రేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా వల్ల ప్రపంచమే చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అందరూ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేసి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పుకొచ్చాడు.సినిమారోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.చదవండి: హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ -
కొడుక్కి నామకరణం.. ఆ పేరుతో విక్కీకి ప్రత్యేక అనుబంధం!
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. 2025 నవంబర్ 7న ఈ జంటకు కొడుకు పుట్టాడు. బాబు పుట్టి రెండు నెలలైన సందర్భంగా అతడికి నామకరణం చేశారు. విక్కీ, కత్రినా చేతిలో కొడుకు చేయి పెట్టిన ఫోటో షేర్ చేస్తూ "విహాన్ కౌశల్" అని పరిచయం చేశారు.పేరు వెనక ప్రత్యేకతవిహాన్ పేరుకు విక్కీ కౌశల్కు విడదీయరాని అనుబంధం ఉంది. 'ఉరిః ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో హీరో విక్కీ కౌశల్ పోషించిన పాత్ర పేరు మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్. ఆ పాత్రకు గుర్తుగానే కొడుక్కి విహాన్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉరి సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విక్కీ.. విహాన్ పాత్రకు వెండితెరపై ప్రాణం పోస్తే... ఇప్పుడు చిన్న విహాన్ అతడి చేతిలో జీవం పోసుకున్నాడు.. జీవితమంటేనే ఒక సర్కిల్ కదా! అని కామెంట్ చేశాడు. కాగా 2019లో వచ్చిన 'ఉరి' మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
చావు తప్ప మరో దారి లేదు.. విడాకులిచ్చా: నటి
ఒకరు మన తోడుంటేనే జీవితం పరిపూర్ణం అని చెప్పారు తప్ప నీకు నవ్వు ముఖ్యం.. ఒంటరిగా అయినా సంతోషంగా ఉండగలవు అని ఎవరూ చెప్పలేదు అంటోంది బాలీవుడ్ నటి షెఫాలి షా. హిందీ సినిమాలు, సిరీస్లతో అలరించే షెఫాలికి రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటగా బుల్లితెర నటుడు హర్ష్ చయ్యను పెళ్లాడింది. రెండు పెళ్లిళ్లుకానీ, వీరి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. 2000వ సంవత్సరంలో దంపతులిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది దర్శకుడు విపుల్ అమృత్లాల్ షాను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన మొదటి వైవాహిక జీవితపు తాలూకు చేదు అనుభవాలను నటి గుర్తు చేసుకుంది. ఎన్నో దారుణాలుషెఫాలి మాట్లాడుతూ.. నీకు భర్త, స్నేహితుడు, అన్న, చెల్లి.. ఇలా ఎవరి అవసరమూ లేదు, నీకు నువ్వు చాలు అని ఎవరూ నాతో చెప్పలేదు. ఒకవేళ మీరు మంచి రిలేషన్లోనే ఉంటే అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు. కానీ ఆ రిలేషన్షిప్ బాగోలేకపోతే మాత్రం అంతకన్నా నరకం మరొకటి లేదు. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది. ఆ రిలేషన్ను కొనసాగించాలా? వదిలేయాలా? అన్న అంతర్మథనంలో పడతారు. చావు తప్ప..చివరకు ఒకరోజు వస్తుంది. ఇక సహించడం నా వల్ల కాదనిపిస్తుంది.. దీన్నలాగే వదిలేస్తే రేపు నా ప్రాణాలు పోవచ్చేమో అనిపిస్తుంది. అలాంటి సందర్భం నా జీవితంలోనూ ఎదురైంది.. అది నా ఫస్ట్ మ్యారేజ్ సమయంలో! అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఓ ప్రశ్న అడిగింది. నీ జీవితంలో మళ్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి తారసపడకపోతే ఏం చేస్తావ్? రిస్క్ తీసుకుంటావా? లేదా ఈ బంధాన్ని కంటిన్యూ చేస్తావా? అని అడిగింది. రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపాను.రిస్క్ చేశాఅవసరమైతే నా జీవితాన్ని ఒంటరిగానైనా గడుపుతానన్నాను. అంతేకానీ నాకు విలువ లేని చోట, ఏమాత్రం ఆనందం దొరకని చోట శిలలా బతకలేనని బదులిచ్చాను. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేందుకు నేనేం పిజ్జాను కాదని చెప్పా.. అని గుర్తు చేసుకుంది. షెఫాలి చివరగా ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: రూ.25 లక్షలు మోసపోయా.. సినిమా ఛాన్సులు కూడా -
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ -
టీవీ చరిత్రలో ఓ శకం ముగిసింది
టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ని అధికారికంగా మూసివేసింది. మైఖేల్ జాక్సన్ లాంటి పాప్ సింగర్లని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానెల్ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం!1981 ఆగస్టు 1న ప్రారంభమైంది. పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ.. సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు.. పాశ్చాత్య సంగీతం నుంచి పాప్ కల్చర్ వరకు మైఖేల్ జాక్సన్ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానెల్... క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80స్, 90స్, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ అనే ఛానెళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానెళ్లన్నింటినీ ఇప్పుడు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.1981లో తొలిసారి ఎంటీవీలో ప్రసారమైన "వీడియో కిల్డ్ ది రేడియో స్టార్" అనే పాటనే.. 2025 డిసెంబర్ 31న చివరిసారి ప్రసారం చేసి తన ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానెల్ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి, ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణమనే సందేశాన్నిచ్చింది.ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానెల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ ఛానెల్తో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యాజిక్ మూసివేసినప్పటికీ ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ ప్లాట్ఫార్మ్లపై దృష్టి పెట్టనున్నట్లు సదరు ఛానెల్ ప్రకటించింది.ఎంటీవీ ఛానెల్కు సంబంధించిన ప్రధాన ఘట్టాలు1981లో అప్పటి వరకు మ్యూజిక్ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది.1983లో థ్రిల్లర్ ఆల్బమ్లోని బిల్లీ జీన్, బీట్ ఇట్ వీడియోలు ఎంటీవీలో ప్రసారం అవడంతో మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్స్టార్గా మారాడు.1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్ అవార్డ్స్ ప్రారంభించడంతో... క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతోమంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది.1985లో ఎంటీవీని వయాకామ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది.1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్గా మారాయి. నిర్వానా, ఎరిక క్లాప్టన్ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి.1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తరువాత కాలంలో ఎంటీవీ దశను, దిశను మార్చేసింది.2000లో రియాల్టీ షోస్ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్, లాగునా బీచ్, ది హిల్స్ వంటి వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానెల్ నుండి ఎంటర్టైన్మెంట్ ఛానెల్గా మార్చాయి.2025 డిసెంబర 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్ను నిలిపి వేసింది. చివరి ప్రసారం 'వీడియో కిల్డ్ ది రేడియో స్టార్'తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది. -
దీపికా పదుకోణె బర్త్డే స్పెషల్.. వైరల్ ఫోటోలు ఇవే
-
చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా తీసుకోలే: బాలీవుడ్ హీరో
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట గత నెలలో శుభకార్యం జరిగింది. కార్తీక్ చెల్లెలు కృతిక తివారీ వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్తో ఆమె ఏడడుగులు వేసింది. తాజాగా ఈ పెళ్లి విశేషాలను కార్తీక్ పంచుకున్నాడు. కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరీ తు మేరీ. అనన్య పాండే హీరోయిన్గా యాక్ట్ చేసింది. పెళ్లిలో ఫ్రీగా డ్యాన్స్ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్, అనన్య పాండే 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. గత నెలలో చెల్లి పెళ్లి జరిగింది. పనులన్నీ అమ్మ, చెల్లియే చూసుకున్నారు. నా ఇంట్లో శుభకార్యానికి నేనే అతిథిగా వెళ్లాను. పెళ్లిలో ఉచితంగా డ్యాన్స్ చేశాను. నా సోదరి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు.సినిమాకార్తీక్ ఆర్యన్ విషయానికి వస్తే.. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్ 'తూ మేరీ మైన్.. తేరా మైన్ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ధురంధర్ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా? -
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్వీర్లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్ సీఎం అవుతాడు: నటుడు సుమన్ -
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్సానియత్కే దుష్మన్' అప్పుడే రిలీజైంది. చున్నీ లాగే సీన్..ఆ మూవీ చూడమని మా పేరెంట్స్కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. చెడామడా తిట్టారుఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు. నెగెటివ్ రోల్స్ వల్లే..నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్. -
ప్రియురాలితో స్టార్ హీరో మేనల్లుడి ఎంగేజ్మెంట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అయాన్ అగ్నిహోత్రి ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు టీనా రిజ్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. ఇవీ కాస్తా వైరల్ కావడంతో అయాన్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ మేనల్లుడు సంగీతకారుడు అయాన్ అగ్నిహోత్రి సింగర్, మ్యూజిషియన్గా రాణిస్తున్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఒక ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సల్మాన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నారు. View this post on Instagram A post shared by Agni (@ayaanagnihotri) -
అది నా అదృష్టం!
‘కౌన్ బనేగా కరోడ్పతి’ (కేబీసీ).. ఈ రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షో అంత పాపులర్ కావడానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్. 17 సీజన్లుగా ఈ షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘కేబీసీ’ సీజన్ 17 గ్రాండ్ ఫినాలే శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ ఎపిసోడ్లో ఆరంభంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ–‘‘25 ఏళ్లుగా ‘కేబీసీ’ షోతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నాను.నా జీవితంలో మూడింట ఒక వంతు సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే వెచ్చించాను. సామాన్యుల జ్ఞానానికి అగ్నిపరీక్షలా నిలిచే ఈ వేదికపై ఇంతకాలం హోస్ట్గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు వీక్షకులు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. మీరు ఇలా తోడుగా ఉన్నంత వరకు ఈ గేమ్ షో ఇలానే కొనసాగుతుంది. థ్యాంక్యూ’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అమితాబ్. -
సల్మాన్ ఖాన్ రూ.80 కోట్ల ఆస్తి ఆమె పేరిట?
సల్మాన్ ఖాన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతలోనే దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఆసక్తికర పనిచేసి చర్చనీయాంశమయ్యాడు. తన సవతి చెల్లిపై అంతులేని ప్రేమ చూపించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: సింగర్తో యంగ్ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన)సల్మాన్ ఖాన్కి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. పాన్వెల్ అనే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటుంటాడు. కొన్నిరోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫౌమ్ హౌస్కే తన సవతి చెల్లి అర్పితా పేరుని పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నప్పటికీ.. తెచ్చి పెంచుకున్న అర్పితాపై ఎక్కువ మమకారం చూపిస్తుంటాడు.చిన్నప్పటి నుంచి అర్పితాని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఆమె కొడుకుల్ని కూడా ముద్దు చేస్తుంటాడు. ఇప్పుడు ఈమె పేరుని తన ఫౌమ్ హౌస్కి పెట్టాడంటే రాబోయే రోజుల్లో ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌమ్ హౌస్ ప్రస్తుత విలువ రూ.80 కోట్ల పైనే ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
పోకిరి విలన్కు యాక్సిడెంట్.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.యాక్సిడెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమాఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
రోడ్డుకు అడ్డొచ్చిందని.. మామ ఇంటినే కూల్చేశా: నితిన్ గడ్కరీ
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు విస్తరణ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అనే విధంగా రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు గడ్కరీ స్వయంగా వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో, నెటిజన్లు స్పందిస్తూ.. నితిన్ గడ్కరీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్ తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్లో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ వంటమనిషి దిలీప్.. నితిన్ గడ్కరీకి ఒక విజ్ఞప్తి చేశారు. తన ఊరిలో రోడ్డు వేయమని గడ్కరీని కోరగా.. ఫరా తమాషాగా దిలీప్ ఇంటి మీద నుంచే రోడ్డు వేయండి సార్ అని ఫన్నీ కామెంట్స్ చేశారు. దీనిపై గడ్కరీ భార్య కాంచన్ స్పందిస్తూ.. అప్పుడు దిలీప్కు ఇల్లు ఉండదు.. మా నాన్నగారికి జరిగినట్లే జరుగుతుంది అని గుర్తుచేశారు.ఇంతలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు తెలిపారు. అనంతరం, ఫరా స్పందించి.. మరి ఆయనకు కొత్త ఇల్లు కట్టించారా? అని ప్రశ్నించగా.. ‘లేదు, కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం మాత్రమే ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.ఇదే సమయంలో గడ్కరీ మరో ఉదంతం గురించి మాట్లాడారు. తాను ఇటీవల కోల్కతా వెళ్లినప్పుడు ఒక రెస్టారెంట్లో చైనీస్ ఫుడ్ ఆయనకు బాగా నచ్చింది. ఆ వంటకాన్ని తన వ్యక్తిగత చెఫ్కు నేర్పించమని ఆయన కోరగా.. అది తమ పాలసీకి విరుద్ధమని రెస్టారెంట్ యాజమాన్యం తిరస్కరించింది. అప్పుడు గడ్కరీ..‘ఈ రెస్టారెంట్ ఎవరి భూమిలో ఉందో తెలుసా?. ఇది కోల్కతా పోర్ట్ ట్రస్ట్ భూమి.. నేను షిప్పింగ్ మంత్రిని. మీరు నేర్పించకపోతే మీ లీజు రద్దు చేస్తాను’ అని సరదాగా హెచ్చరించడంతో వారు దిగొచ్చారని చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
సింగర్తో యంగ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్ ఓ ఇంటిది కాబోతుంది. గత కొన్నాళ్లు వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ సింగర్ స్టెబిన్ బెన్ని ఈమె పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)కృతి సనన్ మొదట తెలుగు సినిమాలు చేసి ఆపై బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. చెల్లి నుపుర్ సనన్ కూడా అలానే చేయాలనుకుంది. మొదటగా టాలీవుడ్లో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఒకటిరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. కెరీర్ పరంగా వెనకబడినప్పటికీ లైఫ్లో ముందడుగు వేసింది. పెళ్లికి సిద్ధమైంది.ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ని నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 11న ఈ శుభకార్యం జరగనుందని ఇదివరకే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు గానీ తేదీ లాంటివి ఏం ప్రకటించలేదు. నుపుర్కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
నాతోపాటు నవ్వారు, ఏడ్చారు.. బిగ్బీ భావోద్వేగం
సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్బీ అమితాబ్ బచ్చన్ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్బీ భావోద్వేగానికి లోనయ్యాడు.అంతా నిన్ననే..కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.థాంక్యూ సో మచ్నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @sonytvofficial చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
హిందీలో డియర్ కామ్రేడ్? దాని జోలికే వెళ్లనన్న హీరో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో 'కబీర్ సింగ్'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్ పాత మూవీ 'డియర్ కామ్రేడ్' ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.రీమేక్స్ జోలికి వెళ్లనుతాజాగా ఈ రూమర్స్పై సిద్దాంత్ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు.అంతా గందరగోళంఅటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.సినిమాసిద్దాంత్ చతుర్వేది చివరగా 'ధడక్ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్ పెరుమాల్' (2018)కి రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్ కామ్రేడ్' విషయానికి వస్తే.. ఇందులో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. -
విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి
నెల క్రితం సమంత రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈమె అనే కాదు గతంలోనూ పలువురు హీరోయిన్లు విడాకులు తీసుకున్న కొన్నేళ్లకు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో బ్యూటీ చేరింది. కొత్త ఏడాది సందర్భంగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి వీడియోని కూడా పంచుకుంది.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)యాడ్స్లో నటించి కెరీర్ ప్రారంభించిన కీర్తి కల్హారీ.. తర్వాత బాలీవుడ్లోనూ పింక్, ఉరి, షైతాన్, మిషన్ మంగళ్ తదితర సినిమాలు చేసింది. క్రిమినల్ జస్టిస్, హ్యుమన్, ఫోర్ మోర్ షాట్స్ తదితర వెబ్ సిరీస్ల్లోనూ కీలక పాత్రలు చేసి పేరు సొంతం చేసుకుంది. ఈమెనే ఇప్పుడు తన ప్రియుడిని పరిచయం చేసింది. 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్లో తన సహనటుడు రాజీవ్ సిద్ధార్థ్తోనే ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని అధికారికం చేసేశారు.కీర్తి కల్హారీ గతంలో సాహిల్ సెహగల్ అనే నటుడిని 2016లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న కీర్తి ఇప్పుడు రాజీవ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. చూస్తుంటే త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారనిపిస్తోంది. కొత్త జంటకు తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్ చివరి సీజన్ గత నెల 19న స్ట్రీమింగ్ అయింది. ఆ సిరీస్ ఇలా అయిపోయిందో లేదు వీళ్లు తమ బంధాన్ని బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) -
సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?
సాయిపల్లవి.. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్. గతేడాది ఫిబ్రవరిలో 'తండేల్'తో ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. బయట కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఈమె హిందీలో 'రామాయణ' అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. ఇది రాబోయే దీపావళికి థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. దీనికంటే ముందో ఓ హిందీ రొమాంటిక్ మూవీతో రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కావాల్సినప్పటికీ.. స్టార్ హీరో వల్లే ఆలస్యమవుతోందని మాట్లాడుకుంటున్నారు.సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. హిందీలో చేసిన తొలి సినిమా 'మేరే రహో'. సూపర్స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో. ఈ మూవీ షూటింగ్ గతేడాది ఏప్రిల్లోనే పూర్తయిపోయింది. లెక్క ప్రకారం అయితే డిసెంబరు రెండో వారంలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ 'ధురంధర్' దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. కొడుకు చిత్రం మార్కెటింగ్ అంతా చూసుకుంటున్న ఆమిర్ ఖాన్.. కావాలనే ఈ మూవీ రిలీజ్ వాయిదా వేశాడు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ బాలీవుడ్లో బోర్డర్ 2, ధురంధర్ 2, బ్యాటల్ ఆఫ్ గాల్వాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇంత పోటీలో వస్తే తమ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావని భయపడ్డాడో ఏమో గానీ ఆమిర్ ఖాన్.. 'మేరే రహో' చిత్రాన్ని జూలైలో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే.. 'రామాయణ' రిలీజ్కి కొద్ది రోజుల ముందే సాయిపల్లవి హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి బజ్ లేదు.ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇప్పటికే ఓటీటీలో ఓ మూవీ, థియేటర్లలో ఓ సినిమా(లవ్ టుడే రీమేక్) చేశాడు. రెండు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సాయిపల్లవితో చేసిన చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి? -
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్కు వెళ్లినా, ఫంక్షన్కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్బాస్ హౌస్కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్బాస్ హౌస్లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
కుప్పలుతెప్పలు వద్దు.. ఒక్క సినిమానే చేస్తా!: ఆలియా భట్
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమె చివరగా జిగ్రా (2024) సినిమాలో కనిపించింది. 2025లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ మూవీస్ చేస్తోంది.అర్థం చేసుకోగలిగా..తాజాగా ఆలియా భట్ మాట్లాడుతూ.. నేను హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా చేశాను. కానీ అందులో నా పాత్రకు మరీ ఎక్కువ స్టంట్ సీన్లు లేవు. కానీ ఆల్ఫా మూవీలో ఎక్కువ యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. పాప పుట్టాక ఇలాంటి సీన్లలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నా శరీరం ఇటువంటి సన్నివేశాల్లో నటించేందుకు ఏమేరకు సహకరిస్తుందనేది అర్థం చేసుకోగలిగాను.అదే నేర్చుకున్నా..లవ్ అండ్ వార్ మూవీ అయితే నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించలేదు. సంజయ్ లీలా భన్సాలీతో పని చేయడం అందమైన అనుభవాలను మిగిల్చింది. సెట్లో ఎంతగానో నేర్చుకున్నాను. గంగూభాయ్ కతియావాడి సెట్లో మైండ్లో ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా.. ఖాళీ మైండ్తో ముందుకు వెళ్లాలని నేర్చుకున్నాను. అప్పుడే అన్నింటినీ పరిశీలించొచ్చు, గమనించి నేర్చుకోవచ్చు.రెండూ బ్యాలెన్స్ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒక్కసారి ఒక ప్రాజెక్టులో మాత్రమే నటించాలనుకుంటున్నాను. ఓ పక్క కూతురు రాహాను చూసుకుంటూ మరోపక్క ఏదైనా ఒక సినిమాలో మాత్రమే లీనమవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: మురారి క్లైమాక్స్.. కాస్త తేడా కొట్టినా నన్ను చంపేవాళ్లే: దర్శకుడు -
బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!
-
దానాలతో ఇల్లు గుల్ల.. ఇంటింటికీ తిరిగి షాంపూలు అమ్మా!
చాలా హిందీ సినిమాల్లో నవ్వులు పంచిన అర్షద్ వార్సీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశాడు. 16 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవితంలో నిలదొక్కుకునేందుకు, బతుకు బండి సాగించేందుకు నానా అగచాట్లు పడ్డాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.బంగారు లైటర్అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. నా తండ్రి పేరు అహ్మద్ అలీ ఖాన్. తను హార్మోనియం వాయించేవాడు. ఉర్దూలో షాయరీలు రాసేవాడు. చిన్నప్పుడు నన్ను హాస్టల్లో వేశారు. సెలవులకు మాత్రమే ఇంటికొచ్చేవాడిని. ఓసారి ఆయన తనదగ్గరున్న గోల్డ్ లైటర్ను వేరేవాళ్లకు బహుమతిగా ఇచ్చేశాడు. మా ఇంట్లో పెద్ద కారు కూడా ఉండేది. మా అంకుల్ ఆ కారు మీద మనసు పారేసుకోవడంతో ఆయనకు గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఉన్నదంతా పోయిందిఇలా ఉన్నదంతా ఇచ్చుకుంటూ ఏమీ మిగలదని చిన్న వయసులోనే అర్థమైంది. మా ఇంటికి జగదీప్, యునుస్ పర్వీజ్ వంటి సెలబ్రిటీలు వచ్చి మాతో కలిసి భోజనం చేసేవారు. మా నాన్నకు ముంబైలో రెండు భవంతులు ఉండేవి. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువకాలం అద్దెకు ఉండేవాళ్లు ఆ ఇంటి యజమానులవుతారు అని కోర్టు ప్రకటించింది. అన్నీ మానేశా..దీంతో నాన్న వెంటనే ప్రాపర్టీని కొందరి పేరు మీదకు బదిలీ చేశారు. తర్వాత వాళ్లు తిరిగిచ్చేస్తారనుకున్నాడు. కానీ అది జరగలేదు. సుమారు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాను. అప్పటిదాకా గాలికి తిరుగుతున్న నేను ఒక్కసారిగా పెద్దవాడినైపోయాను. ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీలకు వెళ్లడం.. అన్నీ మానేశాను. సినిమాఅన్నీ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాను. ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాను. నాలుగు రాళ్లు సంపాదించాను. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. అర్షద్ వార్సీ.. మున్నా భాయ్ ఎంబీబీఎస్, హల్చల్, సలాం నమస్తే, జాలీ ఎల్ఎల్బీ, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఢమాల్ 4, కింగ్, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.చదవండి: 25 ఏళ్లకే పెళ్లా? ఆ తప్పు చేయొద్దంటున్న బాలీవుడ్ బ్యూటీ -
25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయొద్దు!
అమ్మాయిలు.. మీకు చాలా లైఫ్ ఉంది.. వెంటనే పెళ్లి చేసుకోకండి అంటోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. తనకు 25వ ఏటనే పెళ్లయిందని, ఆ తప్పు మరెవరూ చేయకూడదంటోంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి.. దయచేసి ఆ తప్పు చేయకండి. నేను అదే తప్పు చేశాను. కాకపోతే నా వైవాహిక జీవితంలో జరిగిన ఓ అందమైన విషయం ఏంటంటే బిడ్డను కనడం. వర్కవుట్ కాలేదుఅయినప్పటికీ నేను చెప్పేది ఒక్కటే ముందు లైఫ్ను ఆస్వాదించండి.. స్థిరపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అవండి అని సలహా ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి అనే సాంప్రదాయాన్ని నేను బలంగా నమ్ముతాను. కానీ ఎందుకో మరి నా విషయంలో వర్కవుట్ కాలేదు. విడిపోయాం.. నేను అక్కడే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగాను. ప్రేమను పొందడం ఇష్టంకొందరితో ప్రేమలో పడ్డాను. కానీ ఎన్నడూ విసుగుచెందలేను. ఇప్పటికీ నా లైఫ్ను నేను ఆస్వాదిస్తున్నాను. ప్రేమ అనే ఆలోచన నాకెంతో ఇష్టం. ప్రేమను పంచడం, పొందడం భలే ఇష్టం. అలా అని ఇప్పుడు నేను ప్రేమ కోసం ఎదురుచూడటం లేదు. ఒకవేళ అది నా ఇంటి తలుపు తడితే దాన్ని కాదనలేను, తప్పకుండా ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చింది.పెళ్లి- విడాకులుచయ్య చయ్య, కెవ్వు కేక వంటి ఐటం సాంగ్స్తో పాపులర్ అయిన మలైకా అరోరా.. 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లాడింది. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. కొంతకాలానికి మలైకా - అర్బాజ్ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడిపోయారు. తర్వాత అర్బాజ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను వివాహం చేసుకున్నాడు. మలైకా.. హీరో అర్జున్ కపూర్తో ప్రేమాయణం నడిపింది, కానీ వీరి బంధం పెళ్లి పట్టాలెక్కేలోపు బ్రేకప్ చెప్పుకున్నారు.చదవండి: చెప్పలేనంత బాధ.. భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నా: బండ్ల గణేశ్ -
సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ తనకు తరచూ మెసేజ్లు చేసేవాడని బాంబు పేల్చింది. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి సంభాషణ జరగడం లేదని తెలిపింది.ఓ ఈవెంట్ సందర్భంగా ఎవరైనా క్రికెటర్తో డేటింగ్ చేయాలనుకుంటున్నారా అని రిపోర్టర్ అడగగా ఖుషి ఇలా బదులిచ్చింది. "నేను ఎలాంటి క్రికెటర్తో డేట్ చేయాలనుకోవడం లేదు. చాలా మంది క్రికెటర్లు నన్ను ఫాలో అవుతున్నారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ తురుచూ మెసేజ్లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు. నాకు లింక్ అప్స్ అస్సలు నచ్చవు" అని స్పషం చేసింది. సూర్యకుమార్ యాదవ్ గురించి ఖుషి బయటపెట్టిన ఈ సంచలన విషయాలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారాయి. తరుచూ భార్యతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లే సూర్యకుమార్ యాదవ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇవాళే సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవీషా శెట్టితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి పూజలు చేశాడు. స్కై సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఖుషి వ్యాఖ్యలు బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.కోల్కతాలో జన్మించిన ఖుషి ఎంటీవీలో ప్రసారమయ్యే Splitsvilla రియాలిటీ షో ద్వారా బాగా పాపులరైంది. మోడల్ కూడా అయిన ఖుషి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. నితిన్తో కలిసి హార్ట్ అటాక్.. ఆకాశ్తో కలిసి దొంగ ప్రేమ తదితర సినిమాల్లో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది.సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. అతని సారథ్యంలో భారత టీ20 జట్టు ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 5 మ్యాచ్ల సిరీస్లో 3-1 తేడాతో విజయం సాధించింది. త్వరలో స్కై నేతృత్వంలోని టీమిండియా స్వదేశంలోనే న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సూర్యకుమారే సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్కప్ల కోసం టీమిండియాను ప్రకటించారు. పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా నడిపిస్తున్న సూర్యకుమార్.. వ్యక్తిగతంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. -
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది' -
నీలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం: చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్గా, సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.హ్యాపీ బర్త్డేనా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.ఎంజాయ్ చెయ్నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు. Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025 చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలు -
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ -
ధురంధర్ కలెక్షన్ల విధ్వంసం
-
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్, మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేశ్ బాబు 'వన్-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. తర్వాత తెలుగులో మరో మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా హిట్స్ అందుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్కి పెళ్లి కానుంది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)కృతిసనన్ ఫ్యామిలీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో సింగర్ స్టెబిన్ బిన్ కూడా కనిపించాడు. కృతి చెల్లి నుపుర్కి కాబోయే భర్త ఇతడే. గాయకుడిగా స్టెబిన్ బాగానే ఫేమ్ ఉంది. నుపుర్ కూడా హీరోయిన్గా తెలుగులోనే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో పరిచయమైంది. ఇది ఘోరమైన ఫ్లాప్ కావడంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.కొత్త ఏడాదిలో జరిగే సెలబ్రిటీ పెళ్లిలో నుపుర్దే మొదటిది అని చెప్పొచ్చు. రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా జనవరి 11న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.(ఇదీ చదవండి: ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్) -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
కళ్లకు కాటుక పెట్టుకున్నా బాధనే!: బుల్లితెర నటి
సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ఇట్టే పసిగడతారు. అది మేకప్ మహిమో? లేక డైట్ వల్ల అలా అయిందో అనడానికి బదులుగా ఏకంగా సర్జరీ చేయించుకుందని ఈజీగా అనేస్తారు. మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకు, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్లు చేస్తారు. బుల్లితెర నటి ప్రియాంక చాహర్ చౌదరిపై కూడా కొంతకాలంగా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్తాజాగా వీటిపై ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చాలారోజులుగా నాపై ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎక్కువ డోస్ ఉన్న యాంటిబయాటిక్స్ వాడాను. చాలామంది జనాలకు ఈ విషయం తెలియనే తెలియదు. ఆ సమయంలో బరువు తగ్గిపోయాను కానీ ముఖం మాత్రం కాస్త ఉబ్బింది. కళ్లకు కాటుక రుద్దినా..అంతదానికే జనాలు ఏదేదో ఊహించుకున్నారు. అయినా అందాన్ని మెరుగుపర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనేం చేయాలనుకున్నా, చేసినా అది నా ఇష్టం. ఇప్పుడు నేను కళ్లకు కాటుక రుద్దినా, లెన్స్ పెట్టుకున్నా సరే.. ముఖానికి ఏదో చేయించుకున్నానని మాత్రమే అంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం! సీరియల్అయినా నా ఫేస్కు మేకప్ వేయడం తప్ప ఏదీ చేయలేదు. అయినప్పటికీ జనాలు అది మేకప్ అని నమ్మరు.. ఇంకా ఏదో ఉందని మాట్లాడుతూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. ప్రియాంక చౌదరి.. 'ఉడారియాన్' సీరియల్తో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం 'నాగిని 7' సీరియల్ చేస్తోంది. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్ డిసెంబర్ 27న ప్రారంభం కానుంది. -
కొడుకులతో కలిసి హృతిక్ అదిరిపోయే డ్యాన్స్
దేశంలో బెస్ట్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు హృతిక్ రోషన్. ఇతడి స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఏడాది 'వార్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హృతిక్.. ఇందులోనూ ఓ పాటలో డ్యాన్స్ అదరగొట్టేశాడు. ఇప్పుడు బయట ఓ పెళ్లిలోనూ స్టేజీపై స్టెప్పులు ఇరగదీశాడు. అయితే ఇద్దరు కొడుకులతో కలిసి ఇది చేయడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)హృతిక్ రోషన్ మామ కొడుకు ఈషాన్ రోషన్ పెళ్లి రెండు రోజుల క్రితం ముంబైలో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. హృతిక్ తన ప్రేయసి షబా ఆజాద్తో కలిసి సందడి చేశాడు. ఇతడి మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా తన కొడుకులతో కలిసి పెళ్లిలో కనిపించింది.సంగీత్ సందర్భంగా హృతిక్.. తన ఇద్దరు కొడుకులు హ్రేహాన్, హృదాన్తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేశాడు. హృతిక్ అనుకుంటే కుమారులు కూడా తండ్రితో పోటీపడి డ్యాన్స్ చేయడం విశేషం. చూస్తుంటే వీళ్లకు కూడా యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లే కనిపిస్తుంది. మరి త్వరలో నటులుగా ఎంట్రీ ఇస్తారేమో?(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)Damn 😱 Gotta get lighter on my feet to keep up 🕺🏻 pic.twitter.com/UFnHNEIR7p— Hrithik Roshan (@iHrithik) December 25, 2025 -
హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
నా బిడ్డను దూరం చేశారు.. ఏడ్చేసిన కమెడియన్
కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తను ఇంట్లో ఉన్న సమయంలో సడన్గా ఉమ్మునీరు లీకైంది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బాబును తొలిసారి తన చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణాల గురించి మాట్లాడుతూ యూట్యూబ్లో ఓ వీడియో షేర్ చేసింది.దూరంగా ఉంచారుబాబు పుట్టిన వెంటనే నా నుంచి దూరంగా తీసుకెళ్లారు. పరీక్షలని, అబ్జర్వేషన్లో ఉంచాలని ఏవేవో కారణాలు చెప్పారు. కానీ వాడిని నాకు దూరంగా ఉంచడం తట్టుకోలేకపోయాను. రెండు రోజుల తర్వాత బాబును నా చేతికందించారు. తొలిసారి వాడిని ఎత్తుకున్నప్పుడు సంతోషంతో ఏడ్చేశాను. ఎవరి దిష్టి తగలకూడదుగోలాలాగే వీడు కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు అంది. బాబును ముద్దుగా కాజు అని పిల్చుకుంటోంది. ఈ వీడియో కింద అభిమానులు.. మీ పిల్లలు కాజు, గోలా.. ఇద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. కమెడియన్ భారతీ సింగ్.. యాంకర్, నిర్మాత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో బాబు లక్ష్ పుట్టాడు. ఇతడిని ముద్దుగా గోలా అని పిల్చుకుంటారు. View this post on Instagram A post shared by Harssh Limbachiyaa (@haarshlimbachiyaa30) -
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్టు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో 'దృశ్యం' ఫ్రాంచైజీలో రెండవ భాగాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2021లో కరోనా వల్ల మలయాళ వర్షన్ను ఓటీటీలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ దృశ్యంఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రావడటంతో తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. వెంకటేశ్ 'దృశ్యం 2' కూడా అదే ఏడాది ఓటీటీలో విడుదలైంది. అయితే అజయ్ దేవ్గణ్ హిందీ 'దృశ్యం 2' మాత్రం 2022లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు' దృశ్యం' మూడో పార్ట్ రాబోతోంది. మూడో పార్ట్మోహన్లాల్- జీతూ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్గణ్ 'దృశ్యం 3' షూటింగ్ ఇటీవలే మొదలైంది. టబు, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్టర్. ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో డిమాండ్ఈయన 'దృశ్యం 2'లో పోలీసాఫీసర్గా కనిపించారు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్ అయిన అక్షయ్.. మూడో పార్ట్ (Drishyam 3 Movie)లో నటించేందుకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట! అలాగే తన పాత్ర తెరపై కనిపించే తీరులో కొన్నిమార్పులు చేయమని సూచించాడట! నిజమెంత?ఈ విషయంలో నటుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు భోగట్టా.. దీంతో ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైనప్పటికీ అక్షయ్ ఖన్నా డిమాండ్లకు తలొగ్గి మళ్లీ అతడిని సినిమాలో తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!
-
నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)
-
రూ.50 కోట్లు నా దగ్గర ఎక్కడివి? మమ్మల్ని వదిలేయ్!
కుమారు సాను విలక్షణమైన సింగర్.. ఈయన తెలుగులో దేవుడు వరమందిస్తే.., మెరిసేటి జాబిలి నువ్వే.. వంటి పలు హిట్ సాంగ్స్ ఆలపించాడు. దాదాపు 16 భాషల్లో అనేక పాటలు పాడారు. అయితే ఆయన కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్లో ఒడిదుడుకుల కారణంగానూ తరచూ వార్తల్లో ఉంటాడు.రెండు పెళ్లిళ్లుఈయన రీటా భట్టాచార్యను 1986లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే భార్య ఉండగానే పలువురితో డేటింగ్ చేశాడు. వారిలో నటి కునికా సదానంద్ ఒకరు. ఈ విషయంలో గొడవలు రావడంతో కొన్నేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆరేళ్లపాటు కునికాతో రిలేషన్లో ఉన్న కుమార్ తర్వాత సలోని భట్టాచార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు సంతానం.మాజీ భర్తపై ఆరోపణలుఇటీవల రీటా భట్టాచార్య మాజీ భర్త కుమార్ సానుపై సంచలన ఆరోపణలు చేసింది. అతడూ ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడని ఆరోపించింది. కొడుకు పెళ్లి సమయంలో కుమార్ ప్రేమకథల గురించి పుకార్లు వస్తే వాటికి ఫుల్స్టాప్ పెట్టమని కోరినందుకు తన నెంబర్ బ్లాక్ చేశాడంది. మూడోసారి గర్భవతిగా ఉన్నప్పుడు తిండిపెట్టకుండా టార్చర్ చేశారంది. ఆయన కుటుంం కిచెన్ స్టోరేజ్కు తాళం వేసుకునేవారంది. గర్భంతో ఉన్నానన్న కనికరం చూపకుండా తనను కోర్టులచుట్టూ తిప్పాడంది.రూ.50 కోట్ల పరువు నష్టం దావాఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ సాను కోర్టును ఆశ్రయించాడు. ఆమె వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించాయంటూ రీటాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. విడాకుల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకూడదన్న అగ్రిమెంట్ను ఉల్లంఘించిందని పేర్కొన్నాడు. ఈ మేరకు మాజీ భార్యకు నోటీసులు పంపాడు.దయచేసి హింసించొద్దుదానిపై రీటా భట్టాచార్య స్పందిస్తూ.. నేను షాక్లో ఉన్నాను. అతడు.. తన ముగ్గురు కొడుకుల తల్లిపై కేసు వేస్తున్నానన్న విషయం మర్చిపోయాడా? పైగా రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. నా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుందనుకుంటున్నాడు? ఇది నిజంగా బాధాకరం. నా ముగ్గురు పిల్లల తండ్రిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా అయినా మెదులుకోమని ఆయన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. మమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు.. కానీ దయచేసి ఇబ్బందిపెట్టకు అని కోరింది. -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్గా మారిందా? అనేది తెలుసుకుందాం.ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ విమర్శలు..బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్కు మరింత ప్లస్గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది. -
ఈ ఏడాది టాలీవుడ్ కలెక్షన్స్ ఢమాల్.. సత్తా చూపని తెలుగు సినిమా
కొద్దిరోజుల్లో టాలీవుడ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. అయితే, 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వాటా రేంజ్ ఎంత అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఉంటారు. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ ఏడాదిలో సత్తా చాటింది. ధురందర్, ఛావా, సైయారా వంటి మూడు సినిమాలే సుమారు రూ. 2,500 కోట్ల కలెక్షన్స్కు దగ్గర్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చెప్పుకోతగినంత రేంజ్లో లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాల్లో ఓజీ మాత్రమే ఉంది. అదే గతేడాదిలో అయితే పుష్ప2, కల్కి, దేవర, హనుమాన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు టాప్- 10లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు ఏకంగా రూ. 3600 కోట్లు రాబట్టాయి. దీంతో గతేడాది ఇండియన్ సినిమా మార్కెట్లో తెలుగు పరిశ్రమ వాటానే ఎక్కువగా ఉంది. 2024లో టాలీవుడ్ మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రు. 7,924 కోట్ల గ్రాస్ ఉంది.2025లో మరింత ఉత్సాహంతో భారతీయ సినీ పరిశ్రమ అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో మెత్తం భాషలలో కలిపి దేశవ్యాప్తంగా 1546 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు రూ. 12,604 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. నెట్ పరంగా చూస్తే రూ. 10696 కోట్లుగా ఉంది. అయితే, కేవలం హిందీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో విడుదలైన 274 సినిమాలకు గాను రూ. 2,551 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ రూ. 1,533 కోట్ల గ్రాస్తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి.బాలీవుడ్లో సత్తా చూపని తెలుగు సినిమాఈ ఏడాదిలో తెలుగు సినిమా కలెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం రూ. 500 కోట్లు రాబట్టిన సినిమా ఒక్కటీ లేదు. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే రూ. 300 కోట్ల కలెక్షన్స్తో టాప్లో ఉన్నాయి. తర్వాత మిరాయ్, డాకు మహారాజ్, హిట్, కుబేర వంటి చిత్రాలు మాత్రమే కాస్త మెప్పించాయి. అయితే, ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. రూ. 500 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకుంటే ఆశించినంత రేంజ్లో రీచ్ కాలేదు. ఆపై హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఘాటీ, మాస్ జాతర, అఖండ-2 వంటి సినిమాలు కూడా అదే బాటలో నిలిచాయి. ఫైనల్గా 2025 టాలీవుడ్కు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు పడలేదు. -
దురంధర్ మరో రికార్డ్.. ఆ లిస్ట్లో షారూఖ్ ఖాన్ జవాన్ కంటే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో విడుదలైన 16 రోజుల్లో ఏకంగా రూ. 785 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఓవరాల్గా చూస్తే ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించిన ఏడో హిందీ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. షారూఖ్ ఖాన్ 'జవాన్', శ్రద్ధా కపూర్ 'స్త్రీ -2' చిత్రాల కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం రోజే ఛావా(రూ.807 కోట్లు) వసూళ్లను అధిగమించేలా కనిపిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ వల్ల దురంధర్ కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. -
ఐటమ్ సాంగ్స్ భామకు రోడ్డు ప్రమాదం.. వీడియో రిలీజ్
బాలీవుడ్ బ్యూటీ, ఐటమ్ సాంగ్స్ ఫేమ్ నోరా ఫతేహీ కారు ప్రమాదానికి గురైంది. ముంబయిలో ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నోరా కారు పూర్తిగా దెబ్బతినగా.. హీరోయిన్కు స్వల్పంగా గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో నోరా ఫతేహీ తలకు దెబ్బ తగలడంతో కాస్తా మతిభ్రమించినట్లు తెలుస్తోంది. అయితే వెంటేనే ఆస్పత్రికి వెళ్లడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే సన్బర్న్ సంగీత కచేరీ- 2025 ఈవెంట్కు హాజరైన ప్రదర్శనలో పాల్గొన్నారు.తాజాగా తన ఆరోగ్యంపై నోరా ఫతేహీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని తెలిపింది. నిన్న కారు ప్రమాదంతో చాలా భయపడ్డానని పేర్కొంది. తాగిన మత్తులో కారు నడిపిన వ్యక్తి తప్పిదం వల్లే తన కారు ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ఇలాంటి వాళ్లతో ప్రజల ప్రాణాలకు ముప్పుందని ఆవేదన వ్యక్తం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను కోరింది.కాగా.. ప్రస్తుతం నోరా ఫతేహీ కాంచన 4, కేడీ: ది డెవిల్’ వంటి భారీ సౌత్ ప్రాజెక్ట్స్ల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇషాన్ ఖట్టర్తో కలిసి ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. Actress Nora Fatehi injured in road accident,while heading to the #SunburnFestival for #DavidGuetta’s concert#NoraFatehi @MumbaiPolice pic.twitter.com/AIVMieHSNb— Indrajeet chaubey (@indrajeet8080) December 20, 2025 #NoraFatehi suffers a car accident while travelling to the Sunburn Festival for her scheduled appearance with David Guetta, after a drunk driver rams into her vehicle. A source reveals, “Nora Fatehi was involved in an unfortunate car accident, while on her way to the Sunburn… pic.twitter.com/dejnizbh8z— Filmfare (@filmfare) December 20, 2025 -
నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్.. 'జేకే' భార్య గురించి తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు లాంటి మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. దీంతో నటీనటులందరూ ఇంతేనేమో అనేది చాలామంది నెటిజన్ల అభిప్రాయం. కానీ తెరపైనే కాదు రియల్ లైఫ్లోనూ తాము ఫెర్ఫెక్ట్ అనేలా కొందరు యాక్టర్స్ ఉంటారు. అలాంటి నటుడే షరీబ్ హష్మీ. ఈ పేరు చెబితే మీకు తెలియకపోవచ్చు గానీ 'ద ఫ్యామిలీ మ్యాన్' జేకే అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. నటుడిగా మనల్ని ఎంతగానో నవ్వించే ఇతడి జీవితంలో షాకయ్యే కష్టాలున్నాయని మీలో ఎంతమందికి తెలుసు?షరీబ్ హష్మీది ముంబై. 2003లో నస్రీన్ని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకునే టైంలో ఓ టీవీ ఛానెల్లో పనిచేసేవాడు. నటుడిగా ఛాన్సుల కోసం ప్రయత్నించేవాడు. కొన్నాళ్లకు ఉద్యోగం విడిచిపెట్టి పూర్తిగా ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాడు. అప్పటికే ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో నస్రీన్.. కుటుంబ బాధ్యతల్ని తీసుకుంది. తన డబ్బులు, బంగారంతో పాటు ఇంటిని కూడా తాకట్టు పెట్టి మరీ భర్తని ప్రోత్సాహించింది. అలా 2008లో 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో చిన్న పాత్రలో నటించే అవకాశం షరీబ్కి వచ్చింది. తర్వాత అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యాడు. సరిగ్గా ఇలాంటి టైంలో షాకిచ్చే వార్త. భార్యకు ఓరల్(నోటి) క్యాన్సర్ అనే విషయం తెలిసి షరీబ్ గుండె బద్దలైంది.ఏకంగా నాలుగు సర్జరీలు జరిగాయి. కీమో థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తీసుకున్న తర్వాత మనిషి ఎలా మారిపోతారనే విషయాన్ని డాక్టర్స్ చెబుతుంటే షరీబ్-నస్రీన్ గుండె ఆగినంత పనయ్యింది. అయినా సరే బలంగా నిలబడ్డారు. క్యాన్సర్ని జయించారు. అయితే క్యాన్సర్ కారణంగా సర్జరీలు చేసుకోవడంతో నస్రీన్ ముఖాకృతి పూర్తిగా మారిపోయింది. అయినా సరే భార్య వెన్నంటే షరీబ్ నిలబడ్డాడు. అలా 2022 తర్వాత నస్రీన్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇదంతా చూసిన నెటిజనం.. ఈ జంటని తెగ అభినందిస్తున్నారు. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి విధినే గెలిచారు కదా అని మాట్లాడుకుంటున్నారు.షరీబ్ విషయానికొస్తే.. సినిమాలు, సీరియల్స్ చాలానే చేసినప్పటికీ 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఇతడికి ఎక్కడలేని గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్పాయ్)పక్కనే కనిపించే జేకే తల్పడే పాత్రలో షరీబ్ హష్మీ అదరగొట్టేశాడు. తనదైన కామెడీ టైమింగ్తో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యాక్టింగ్ సంగతి పక్కనబెడితే భార్యకు కష్టసుఖాల్లో తోడునీడలా నిలిచి రియల్ 'ఫ్యామిలీ మ్యాన్' అనిపించుకుంటున్నాడు. -
అక్షయ్ క్రేజ్పై అసూయ? మాధవన్ ఆన్సరిదే!
యానిమల్ సినిమాలో జమల్ కదు పాట ఎంత ఫేమస్ అయిందో ధురంధర్లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ అంత ఫేమస్ అయింది. అతడి స్వాగ్, లుక్స్, స్టెప్పులు అన్నింటికీ జనం ఫిదా అయ్యారు. అలా అని అదేదో రిహార్సల్స్ చేసిన డ్యాన్స్ కూడా కాదు. అప్పటికప్పుడు తోచినట్లుగా స్టెప్పేశాడంతే! ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నాయే ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలో రణ్వీర్ సింగ్, ఆర్ మాధవన్ వంటి స్టార్స్ ఉన్నా సరే అక్షయ్నే ఎక్కువ కీర్తిస్తున్నారు.మాధవన్కు కుళ్లు?ఈ విషయంలో మాధవన్ కాస్త అప్సెట్ అయ్యాడట! ఓపక్క ధురంధర్ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతున్నందుకు ఒకింత సంతోషంగా ఉన్నా.. అక్షయ్కే ఎక్కువ క్రెడిట్ రావడంతో హర్ట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మాధవన్ స్పందించాడు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అక్షయ్కు మంచి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే తప్ప బాధెందుకు ఉంటుంది? ఆయన ఎంతో ప్రతిభావంతమైన నటుడు, అలాగే ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. తనకు కచ్చితంగా ఈ ప్రశంసలు దక్కి తీరాల్సిందే!నాకంటే గొప్పవాడుఆయన తల్చుకుంటే లక్షల ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ తన కొత్తింట్లో తాపీగా కూర్చున్నాడు. విజయాన్ని నిశ్శబ్ధంగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నేను పెద్దగా జనం అటెన్షన్ కోరుకునే వ్యక్తిని కాదు. ఈ విషయంలో అక్షయ్ ఖన్నా నాకంటే గొప్పవాడు. ఆయన అసలేదీ పట్టించుకోడు. జయాపజయాలన్నీ కూడా అతడి దృష్టిలో సమానమే అని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లు వసూలు చేసింది. కేవలం భారత్లోనే రూ.483 కోట్లు రాబట్టింది.చదవండి: బిగ్బాస్ 9కి ప్రాణం పోసిన రియల్ గేమర్.. సంజనా -
ధురంధర్.. బాలీవుడ్కి ఓ ప్రమాద హెచ్చరిక!
కొన్ని సినిమాలు సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజులో ఉంటాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలూ వినిపిస్తాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అవును ఇదంతా చెబుతున్నది 'ధురంధర్' కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్లో ఏం మాట్లాడుకుంటున్నారు?'ధురంధర్'.. పదిహేను రోజుల క్రితం రిలీజైన హిందీ సినిమా. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో మూవీ ఉందని కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పీఆర్ షో దీనికి చేయలేదు. కట్ చేస్తే రిలీజైన రెండు వారాల్లో సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనూ మంచి రెస్పాన్స్, వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ తట్టుకోలేకపోయారు. హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది గానీ పాలిటిక్స్ చూపించకపోయింటే బాగుండేదని అన్నాడు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయి, జనాలకు ఇది నచ్చేస్తే ఇతడు హీరోగా ఉన్న స్పై యూనివర్స్ని ఇక జనాలు చూడరేమో అని భయం కావొచ్చు?హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ మూవీలో వయలెన్స్ దారుణంగా ఉందని చెప్పింది. ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అన్నట్లు మాట్లాడింది. మరి ఈమె గతంలో పలు చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లోనూ నటించింది. మరి వాటి సంగతేంటని నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు. పలువురు పేరు మోసిన హిందీ రివ్యూయర్లు కూడా ఇదేం మూవీ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో పాకిస్థాన్ని చాలా పవర్ఫుల్గా, భాయ్ భాయ్ దోస్తానా అన్నట్లు చూపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తీసిన స్పై యూనివర్స్లోని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్', 'వార్', 'వార్ 2' సినిమాల్లో పాకిస్థాన్ని ఒకలా ప్రెజెంట్ చేశారు. ఉగ్రవాదులని ఒకలా చూపించారు. కానీ 'ధురంధర్' చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్గా అర్థమయ్యాయని చెప్పొచ్చు. దీని దెబ్బకు ఇకపై యష్ రాజ్ స్పై యూనివర్స్ని జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే రాబోయే రోజుల్లో 'ధురంధర్' ఆ రేంజ్ ఎఫెక్ట్ చూపించబోతుంది.బాలీవుడ్లో గతంలోనూ నెపోటిజం ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో మాత్రం అది పీక్స్కి చేరింది. సదరు స్టార్ హీరో లేదా హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏ మేరకు ఆడుతున్నాయనేది అందరికీ తెలుసు. అయినా సరే వీళ్లు మాత్రమే స్టార్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో వాటికి చెక్ పడటం గ్యారంటీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రణ్వీర్ సింగ్, సంజయ్ దత్తో పాటు చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ మెరిశారు. ఇందులో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నది కూడా యాక్టింగేనా అనిపించక మానదు.'ధురంధర్' సినిమాలో ఒక్కసారి కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. కేవలం దాయాది దేశంలోని ఓ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది అని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అలా అని దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో పెద్ద పెద్ద మెసేజులు ఇవ్వలేదు. ఇది పరిస్థితి అని చూపించాడు. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అన్నట్లు వదిలేశాడు.దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా 'ధురంధర్'ని ప్రశంసిస్తూ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ప్రస్తుత దర్శకులు ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నాడు. కొన్నాళ్ల ముందు కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్లో 'కబీర్ సింగ్' తీసినప్పుడు ఇలానే చాలామంది చాలా విమర్శలు చేశారు. 'యానిమల్' రిలీజ్ టైంలోనూ ఇదే రిపీటైంది. కానీ వాళ్లందరికీ సందీప్.. తన సినిమాతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు కూడా ఆదిత్య అలాంటి పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ పునాదులు కదిలించే ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే బాలీవుడ్కి ఇదో ప్రమాద హెచ్చరిక లాంటిది! -
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పిన దృశ్యం డైరెక్టర్..!
సూపర్ హిట్ మూవీ దృశ్యం-2 డైరెక్టర్ అభిషేక్ పాఠక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. నటి శివాలిక ఓబెరాయ్ను పెళ్లాడిన ఆయన ఇవాళ శుభవార్తను పంచుకున్నారు. బేబీ పాఠక్ 2026లో వస్తోందంటూ ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ జంట ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. అభిషేక్ పాఠక్ నిర్మించిన ఖుదా హాఫిజ్ మూవీతో శివాలిక నటించారు. అదే సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అభిషేక్ పాఠక్ టర్కీలో శివాలికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వచ్చే ఏడాదిలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా.. అభిషేక్ పాఠక్ బాలీవుడ్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన భార్య శివాలికి ఓబెరాయ్ మూడు సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కమెడియన్
ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ఆమెకు మగబిడ్డ పుట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు ఆమె లాఫ్టర్ చెఫ్ షూటింగ్కు వెళ్లాల్సి ఉంది. కానీ, సడన్గా నొప్పులు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మరోసారి కొడుకు పుట్టాడు.2017లో పెళ్లికాగా భారతి సింగ్.. యాంకర్, నిర్మాత, రచయిత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమానురాగాలకు గుర్తుగా 2022లో కుమారుడు లక్ష్య జన్మించాడు. ఇతడిని ముద్దుగా గోల అని పిలుచుకుంటారు. గోలతో ఆడుకునేందుకు మరో బుజ్జాయి రాబోతోందన్న విషయాన్ని దంపతులిద్దరూ అక్టోబర్లో వెల్లడించారు. ప్రెగ్నెంట్ అని తెలియక..స్విట్జర్లాండ్లో ట్రిప్లో ఉన్న సమయంలో భారతికి తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అప్పటికి ఆమెకు ఏడు వారాలు. ఈ విషయం గురించి భారతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రెగ్నెంట్ అని తెలియక నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశా.. మందు కూడా తాగాను. ఓసారి అనుకోకుండా ప్రెగ్నెన్సీ కిట్ కనిపించేసరికి ట్రై చేశా.. ఆశ్చర్యంగా అది పాజిటివ్ వచ్చింది. ఇటీవలే సీమంతంనా భర్తకు చెప్తే అసలు నమ్మలేదు. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే గర్భం దాల్చానని నిర్ధారణ అయింది అని చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ఉన్నపళంగా ఇండియా వచ్చేశారు. కానీ బేబీ పుట్టాక మిగిలిన ట్రిప్ కచ్చితంగా పూర్తి చేస్తానంది. నవంబర్లో తను బేబీ బంప్తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వారం రోజుల క్రితమే తన సీమంతం జరిగింది.కమెడియన్గా, యాంకర్గా..భారతీ సింగ్.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. కామెడీ సర్కస్ షోలలోనూ పాల్గొంది. ఇండియాట్ గాట్ టాలెంట్ 5, 7, 8వ సీజన్స్, కామెడీ నైట్స్బ చావో, ద ఖాత్ర షో,డ్యాన్స్ దీవానే మూడో సీజన్, సరిగమప లిటిల్ చాంప్స్ 2022, లాఫ్టర్ చెఫ్స్ వంటి పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. View this post on Instagram A post shared by Bharti Siingh (@bharti.laughterqueen) -
'దక్షిణాది నిర్మాత హోటల్కు రమ్మన్నాడు'..: క్యౌస్టింగ్ కౌచ్పై బిగ్బాస్ బ్యూటీ
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. సినీతారలు ఏదో ఒక సందర్భంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. కొందరు వాటిని బహిరంగంగా మాట్లాడితే.. మరికొందరు బయటికి చెప్పలేక సతమతమవుతుంటారు. గతంలో చాలామంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా మరో నటి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసింది.బాలీవుడ్ నటి, స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్టీ చాహర్ ఇటీవలే సల్మాన్ ఖాన్ బిగ్బాస్ సీజన్-19లో కనిపించింది. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన మాల్టీ చాహర్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు, క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మాట్లాడింది.తనకు క్యాస్టింగ్ డైరెక్టర్లతో ఎలాంటి సమస్య రాలేదని మాల్టీ చాహర్ తెలిపింది. ఏ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదని వెల్లడించింది. అయితే ఓ దర్శకుడు మాత్రం వర్క్ పరంగా మాట్లాడే సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని వివరించింది. ఆ వేధింపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేవి కావని.. వారి ఉద్దేశ్యాన్ని బయటికి చెప్పకుండా అలాంటి హింట్స్ ఇస్తారని మాల్టీ తెలిపింది. ఓ దక్షిణాది నిర్మాతతో సమావేశమైనప్పుడు అతని హోటల్ రూమ్ గది నంబర్ తనకు ఇచ్చాడని ఆ అనుభవాన్ని పంచుకుంది. అలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో నేను అర్థం కానట్లు నటించానని.. ఆ తర్వాత మేము మళ్లీ కలుసుకోలేదని మాల్టీ చెప్పుకొచ్చింది.మాల్టీ చాహర్ మాట్లాడూతూ..'ఒక ఆఫీస్ మీటింగ్లో వీడ్కోలు సమయంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆలింగనం అని భావించా. కానీ అతను నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే అతన్ని అడ్డుకుని.. ఆ తర్వాత అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నా. అక్కడే అతన్ని నిలదీశా. అతన్ని నా తండ్రిలా భావించా. ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఎవరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచొద్దు. 'అని అన్నారు. మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దని సూచించింది. మనపై మనకు నియంత్రణ ఉండాలని కోరింది.కాగా.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్లతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్లో మిస్టరీ గర్ల్గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది. -
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ఏక్ దీవానే కీ దీవానీయత్'. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. దేశీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్పై అన్షుల్ గార్గ్, దినేష్ జైన్ నిర్మించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో షాద్ రంధావా, సచిన్ ఖేడేకర్, అనంత్ నారాయణ్ మహాదేవన్, రాజేష్ ఖేరా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. దాంపత్య జీవితంలో భార్య, భర్తల మధ్య ఆధిపత్య ధోరణి, వాటివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యల ఆధారంగా రూపొందించారు. This Holiday Season, har gulaab mein ishq dikhega, aur uske kaanton mein Ek Deewane Ki Deewaniyat! 🥀 #EkDeewaneKiDeewaniyat Premieres 26th December, only on #ZEE5#EkDeewaneKiDeewaniyatOnZEE5 pic.twitter.com/IYyhLPACda— ZEE5Official (@ZEE5India) December 18, 2025 -
ఫస్ట్ సినిమా.. డబ్బులివ్వలేదు, దారుణంగా చూశారు
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్ లైఫ్ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.చేదు అనుభవంరాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.దారుణంగా..కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్ చేశారు. అందుకే నా ఫస్ట్ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..ఆయనే న్యాయ నిర్ణేతసినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్ సర్జన్ అనే నాటకం వేశాను. మా టీమ్కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్లో దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.సినిమాలురాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. మేడ్ ఇన్ హెవెన్, సేక్రెడ్ గేమ్స్, ఓకే కంప్యూటర్ వంటి వెబ్ సిరీస్లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్ అనే థ్రిల్లర్ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు -
19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్గా!
అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా? అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్ కన్నా టాలెంట్ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..19 ఏళ్లకే జుట్టు రాలడందివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా కుమారుడే అక్షయ్ ఖన్నా. స్కూల్, కాలేజీ డేస్లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్ లాస్ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయనుకునేవాడు. తండ్రి సినిమాతో ఎంట్రీకానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్ (Akshaye Khanna)కు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ 'బోర్డర్'. ఈ చిత్రం తర్వాత అక్షయ్ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా తనదైన మార్క్ సృష్టించాడు. వైరల్దిల్ చహ్తా హై, హమ్రాజ్, దీవాంగే, రేస్, తీస్ మార్ ఖాన్, ఇత్తేఫఖ్, సెక్షన్ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ చిత్రంలో తన యాక్టింగ్, డ్యాన్స్ క్లిప్తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్లైట్లో ఉండే అలవాటు లేదు. 50 ఏళ్లు దాటినా సింగిల్గానే..వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్ కరిష్మా కపూర్తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా! #AkshayeKhanna How on earth are you aging backwards, sharpening your features instead of softening them.? Akshay, you insane, precision-crafted monster of talent, how are you this god-level? It’s illegal at this point.He’s grown into a kind of dangerous handsomeness, the kind… pic.twitter.com/dExZhHFddH— sweeti singh vikram (@SweetiSghVikram) December 7, 2025 -
హ్యాపీ బర్త్ డే మై హార్ట్బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
-
పేరెంట్స్గా ప్రమోషన్.. లావణ్య నుంచి సోనియా ఆకుల వరకు!
ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు అంటారు. కానీ తరాలు మారుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసి చూడు, పిల్లల్ని కని చూడు అంటున్నారు. ఆ రేంజ్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఎంత బిజీగా ఉన్నా సరే చిన్నపాపాయి నవ్వు చూస్తే ఆ ఒత్తిడి అంతా మటాష్ అయిపోతుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు కెరీర్లో సెటిల్ అవగానే పేరెంట్హుడ్ గురించి ఆలోచిస్తున్నారు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందరు. ఆ జాబితాను చూసేద్దాం....వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠికొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నవీరిద్దరు.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 10న బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో జంటగా నటించారు..వశిష్ట సింహ- హరిప్రియవశిష్ట సింహ- హరిప్రియ 20203 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఈ జంటకు మగబిడ పుట్టింది. పెళ్లిరోజునే బాబు పుట్టడం మరో విశేషం!విక్కీ కౌశల్- కత్రినా కైఫ్హీరో విక్కీ కౌశల్కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఓపక్క ఛావా విజయం, మరోపక్క పుత్ర సంతానంతో గాల్లో తేలుతున్నాడు. విక్కీ- కత్రినా దంపతులలకు నవంబర్ 7న బాబు పుట్టాడు.సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీసిద్- కియారా చాలాకాలం ప్రేమలో మునిగి తేలారు. 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు జూలై 15న తమ కుటుంబంలోకి బుజ్జి పాపాయి వచ్చినట్లు ప్రకటించారు. పాపకు సరాయా అని నామకరణం చేశారు.పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దాహీరోయిన్ పరిణీతి చోప్రా- నాయకుడు రాఘవ్ చద్దా 2023లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 19న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ చిన్నోడికి నీర్ అని పేరు పెట్టారు.అర్బాజ్ ఖాన్- షురా ఖాన్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు ఈ ఏడాది అక్టోబర్5న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ కూతురికి సిపారా ఖాన్ అని నామకరణం చేశారు.రాజ్కుమార్ రావు- పాత్రలేఖసినిమాలతో బిజీ ఉండే రాజ్కుమార్- పాత్రలేఖ.. ఇద్దరూ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది తల్లిదండ్రులుగా ఒక స్టెప్ ముందుకు వేశారు. నవంబర్ 15న తమ మూడో పెళ్లి రోజునాడే పాప పుట్టిందని ప్రకటించారు.కేఎల్ రాహుల్- అతియా శెట్టిక్రికెట్ క్రీడాకారుడు కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది మార్చిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు ఎవారా అని నామకరణం చేశారు. దీనర్థం దేవుడు పంపిన బహుమతి.వీళ్లే కాకుండా బుల్లితెర నటులు సాయికిరణ్- స్రవంతి, మహాతల్లి జాహ్నవి జంట, బిగ్బాస్ సెలబ్రిటీలు సుదీప్, సోనియా ఆకుల కూడా తొలిసారి పేరెంట్హుడ్కు స్వాగతం పలికారు. బాలీవుడ్లో జైద్ దర్బార్- గౌహర్ ఖాన్, మాళవిక రాజ్- ప్రణవ్ బగ్గ, షీనా బజాజ్ - రోహిత్ పురోహిత్, షీనా బజాజ్ రోహిత్ పురోహిత్, జహీర్ ఖాన్- సాగరిక, నవరాజ్ హన్స్- అజిత్ కౌర్.. ఇలా పలు జంటల ఇళ్లలో చంటిబిడ్డల నవ్వులు వినిపించాయి. -
మరో వివాదంలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి
-
ఎన్టీఆర్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ అదిరిపోయే స్కెచ్
-
స్టార్ హీరోయిన్, ఆమె భర్తపై ఫ్రాడ్ కేసు
ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్తని మోసం చేశారనే అభియోగాలపై కొన్ని నెలల క్రితం నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. ఈ మేరకు జుహు పోలీసులు దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై శిల్పాశెట్టితో పాటు ఈమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 420 సెక్షన్ పెట్టారు.అసలేం జరిగింది?2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం దీపక్ కొఠారి అనే వ్యక్తి.. శిల్పాశెట్టి దంపతులకు రూ.60.48 కోట్లు ఇచ్చాడు. కానీ వీళ్లు ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నారు. షాపింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి శిల్పా-రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా వీళ్లదే. 2016 ఏప్రిల్లో శిల్పా శెట్టి తనకు వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ చెప్పారు.అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే శిల్పా శెట్టి.. డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని దీపక్ కొన్నాళ్ల క్రితం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. శిల్పా, ఈమె భర్త రాజ్ కుంద్రాపై ఫ్రాడ్ కేసు నమోదు చేశారు.మరోవైపు శిల్పా శెట్టికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ 'బాస్టియన్' వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్లో ఇది ఉంది. అనుమతించిన టైమ్ కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచడం, అర్ధరాత్రి పార్టీలకు పర్మిషన్ ఇచ్చి నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను బెంగళూరు పోలీసులు ఈ రెస్టారెంట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక పోలీస్ చట్టంలోని సెక్షన్ 103 కింద సుమోటో ఫిర్యాదుల ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ డియోల్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో 1997లో బ్లాక్బస్టర్గా నిలిచిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన సన్నీ డియోల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధర్మేంద్ర మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ టీజర్లోని డైలాగ్ చెబుతూ అభిమానులను అలరించారు. ఈవెంట్లో మాట్లాడుతూ.. ఆవాజ్ ఎక్కడి వరకు వెళ్లాలి? అని సన్నీ డియోలా అనడంతో.. ప్రేక్షకులు లాహోర్ వరకు అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకుల స్పందనతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ మూవీ వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరంతా దేశాన్ని రక్షించడానికి పోరాడే సైనికుల పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రాణా హీరోయిన్లుగా కనిపించనున్నారు.#SunnyDeol Gets Emotional At #Border2teaser Launch Event 🔥😭 pic.twitter.com/fn7dqfWc8J— Filmy_Duniya (@FMovie82325) December 16, 2025 -
దురంధర్ క్రేజ్.. మూవీని వీక్షించిన టీమిండియా
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీని టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్ మాల్లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్ దురంధర్ను వీక్షించింది.ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్టైమ్ కలెక్షన్స్ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Subodh Rambir Singh (@bollyfreaksofficial) -
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్ పేరు రాసుకోండి..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్ను కొనియాడారు.సైయారాను దాటేసిన దురంధర్..డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలా దురంధర్ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.అందుకే బజ్..పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్వీర్ సింగ్ మూవీ రావడం కూడా దురంధర్కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్ల రికార్డులను తుడిచిపెట్టేసింది.ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్గా మార్చి 12, 2026న విడుదల కానుంది. -
ప్రపంచంలో అందమైన టాప్ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్తో పాటు గ్లామర్ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్ టెన్ అందమైన హీరోయిన్ల లిస్ట్లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్డోనీ నిలిచారు. టాప్-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్కు చెందిన అనా డి అర్మాస్, పారిస్కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్ నిలిచారు.Top 10 Most Beautiful Actresses in the World 2025/261. 🇦🇺 Margot Robbie2. 🇺🇸 Shailene Woodley3. 🇨🇳 Dilraba Dilmurat4. 🇰🇷 Nancy McDonie5. 🇮🇳 Kriti Sanon6. 🇵🇰 Hania Aamir7. 🇨🇺/🇪🇸 Ana de Armas8. 🇬🇧 Emma Watson9. 🇺🇸 Amber Heard10. 🇹🇷 Hande Erçel(Source: IMDb List - Top… pic.twitter.com/DlW1Hj9Pzy— Infodex (@infodexx) December 15, 2025 -
'ధురంధర్' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్లో ఓ హై పొజిషన్లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్వీర్ సింగ్) పాక్లోని కరాచీకి స్పై ఏజెంట్గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.క్లైమాక్స్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్స్టర్ గ్రూప్లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్వీర్).. సీక్వెల్లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్స్టర్స్లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్స్టర్స్ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్లో చిన్నపాటి ట్రైలర్లా చూపించారు. తద్వారా సీక్వెల్పై ఆసక్తి పెంచారు.ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్లో ఎక్స్పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ) -
హిందీ మార్కెట్లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్
తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ను శాసించే రేంజ్కు చేరుకున్నాయి. పుష్ప2,కల్కి, కార్తికేయ2, హనుమాన్ వంటి సినిమాలు అక్కడ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్గా మిరాయ్ కూడా హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దక్షిణాది కంటే హిందీ బెల్ట్లోనే మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలు బాగా రన్ అవుతాయి. అందుకే మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ చిత్రం కూడా కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ, అఖండ2 మాత్రం హిందీ మార్కెట్లో టోటల్ ఫ్లాప్గా నిలిచింది. ఆ మధ్య హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా ఇంతే.. అసలు ఆ సినిమా హిందీలో విడుదలైన విషయం కూడా జనాలకు తెలియదు.అఖండ్ హిట్.. సీక్వెల్ ఫట్అఖండ పార్ట్-1 హాట్స్టార్లోకి స్ట్రీమింగ్కు వచ్చాక హిందీలో భారీ హిట్ అయింది. ఈ సినిమా తప్పకుండా చూడండి అంటూ సోషల్మీడియాలో పోస్టులు కూడా షేర్ చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్కు హిందీలో కూడా అదే ఆదరణ లభిస్తుందని మేకర్స్ విశ్వసించారు. ఈ నమ్మకంతోనే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా నార్త్ ప్రేక్షకులపై ఆశలు పెట్టుకుని అఖండ 2ని రూపొందించారు. ఈ క్రమంలోనే శివుని తాండవం, హనుమంతుడి స్వరూపంతో పాటు భక్తి వంటి అంశాలను చేర్చడం.. ఆపై సనాతన ధర్మం, దేశభక్తి వంటి అంశాలను కథ డిమాండ్కు మించి చేర్చారు. కథలో బలం ఉండి దానికి ఈ అంశాలు జోడిస్తే అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ, ప్రస్తుతం హిందీలో అఖండ2 పేలవమైన కలెక్షన్స్తో నిరాశపరిచింది.ప్రెస్ మీట్ ఖర్చులు కూడా రాలేదుమొదటిసారిగా, నందమూరి బాలకృష్ణ కూడా హిందీ వెర్షన్ను చురుకుగా ప్రమోట్ చేశారు, కొన్ని హిందీ యూట్యూబ్ ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉత్తర భారత మార్కెట్తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యం బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి చాలా కష్టపడ్డారు. అయితే, వారి వ్యూహం ఫలించలేదు. ఆపై అఖండ 2 తెలుగులో కూడా పేలవమైన ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ఉత్తర అమెరికా మార్కెట్లో నిరాశపరిచే విధంగా మొదటిరోజు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో హిందీ వెర్షన్ నుండి అంచనాలు త్వరగా తగ్గిపోయాయి. హిందీ-డబ్బింగ్ విడుదల పూర్తిగా వాష్అవుట్గా నిరూపించబడింది. మొదటి మూడు రోజుల్లో, హిందీ వెర్షన్ కేవలం రూ. 35 లక్షలు మాత్రమే వసూలు చేసిందని నివేదించబడింది. కనీసం ముంబై ప్రెస్ మీట్ ఖర్చులను కూడా అఖండ రాబట్టలేదని కథనాలు వచ్చాయి. తమిళం, కన్నడ వంటి ఇతర భాషలలో ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కొంతవరకు ఊహించినప్పటికీ, హిందీలో దారుణమైన స్పందన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ పెద్ద షాక్ ఇచ్చింది. -
కాంతారపై రణ్వీర్ సింగ్ కామెంట్స్.. రిషబ్ శెట్టి రియాక్షన్..!
కాంతార వివాదంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు. రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ తనకు అసౌకర్యంగా అనిపించాయని అన్నారు. చెన్నైలో జరిగిన బిహైండ్వుడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రతిష్టాత్మక వేదికలపై దేవతలను ప్రస్తావిస్తూ మిమిక్రీ చేయకూడదని సూచించారు. కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు గౌరవప్రదంగా చిత్రీకరించామని తెలిపారు.రిషబ్ మాట్లాడుతూ, 'కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక చిత్రనిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించుకోవడానికి చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయవద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలోని పంజర్లీ దేవతను ఉద్దేశించి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ఆగ్రహానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో రణవీర్ సింగ్ పంజర్లీ దేవతను ఇమిటేట్ చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిషబ్ శెట్టి నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశమని అని అన్నారు. కాగా.. ఈ ఏడాది కాంతార: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. -
మన సికింద్రాబాద్లో పుట్టిన డైరెక్టర్.. ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు..!
డైరెక్టర్ శ్యామ్ బెనగళ్ ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడాయన. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో సినిమాకి ఊపిరి పోసిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ శ్యామ్ సుందర రావు. మన సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో డిసెంబరు 14, 1934న జన్మించారు. మన దేశ సినీ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. ఈ సందర్భంగా శ్యామ్ బెనెగల్ దర్శకత్వంపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.శ్యామ్ బెనెగల్.. మొదట యాడ్ ఏటెన్సీలో కాపీ రైటర్గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా సినిమా వైపు మళ్లింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తన ఆలోచనలు ఉండేవి. జీవితాన్ని, సమాజంలోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనే ఆశయంతో శ్యామ్ బెనెగల్ సినీరంగంలో అడుగుపెట్టారు. హైదరాబాద్లో ఫిలిమ్ సొసైటీ ప్రారంభించిన ఏకైక వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకుని.. సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారాయన. శ్యామ్ బెనెగల్ అంకుర్ సినిమాతో తన ప్రస్థానం మొదలెట్టారు. ఆ తర్వాత మంథన్, నిశాంత్, గరమ్ హవా, భూమిక ది రోల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.స్త్రీ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం..శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో శ్యామ్ బెనెగల్లో కనిపించింది. సికింద్రాబాద్లో పుట్టి పెరగడం వల్ల రైతులు, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. సినిమాలు ఎప్పుడు ప్రజల పక్షం నిలబడాలి ఎప్పుడు అనుకునేవారు శ్యామ్ బెనెగల్. ముఖ్యంగా శ్యామ్ బెనగల్(ShyamBenegal)తన సినిమాల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేశాడు. అంకుర్(1974)తో మొదలెట్టి జుబేదా (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. ముస్లిమ్ మహిళల జీవితాలను స్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు తెరకెక్కింటారు. వెండితెరపై ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎప్పుడు కొత్తవారికే ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలతో గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో అనుగ్రహంలో వాణిశ్రీ నటించింది. అంతేకాకుండా మన దేశం కోసం ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద డాక్యుమెంటరీ, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాను భారత్ ఏక్ ఖోజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మేకింగ్ ఆఫ్ మహాత్మా లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు కేవలం బాక్సాఫీస్ సంఖ్యలు మాత్రే కాదు.. అంతకు మించి అని అందరూ చెప్పడం ఆయన టాలెంట్కు ఓ నిదర్శనం.ఎనిమిది జాతీయ అవార్డులు...శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి అంకుర్(1975), నిశాంత్(1976), మంథన్ (1977), భూమిక: ది రోల్(1978), జునూన్(1979), ఆరోహణ్(1982), నేతాజీ సుభాష్ చంద్రబోస్(2005), వెల్డన్ అబ్బా(2009) చిత్రాలకు దక్కాయి. ఆయనకు సినీ రంగంలో సేవలకు గానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. తెలుగు సినిమా అనుగ్రహంకు నంది అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్లో అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి లాంటి గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయే చేసిన డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కావడం విశేషం. -
నేనెప్పుడూ నీవైపే.. ఒట్టేసి చెప్తున్నా: శిల్ప శిరోద్కర్
శిరోద్కర్ సిస్టర్స్ ఇండస్ట్రీలో తామేంటో రుజువు చేసుకున్నారు. అక్క నమ్రత తెలుగులో హీరోయిన్గా రాణిస్తే.. చెల్లి శిల్ప బాలీవుడ్లో అగ్ర కథానాయికగా దుమ్ము లేపింది. కాకపోతే ఇద్దరూ పెళ్లయ్యాక సినిమాలను పట్టించుకోవడం మానేశారు. శిల్ప రీఎంట్రీకి సిగ్నల్ ఇస్తూ గతేడాది హిందీ బిగ్బాస్ 18వ సీజన్లో పాల్గొంది. ఈ ఏడాది 'జటాధర' సినిమాతో పలకరించింది.పర్ఫెక్ట్ బర్త్డే డిన్నర్ఇదిలా ఉంటే శిల్ప- రంజిత్ దంపతుల కూతురు అనౌష్క ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను నటి ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "నా పర్ఫెక్ట్ కూతురికి పర్ఫెక్ట్ బర్త్డే డిన్నర్.. ఫ్యామిలీ, ఫుడ్, అంతులేని సంతోషం.." అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనౌష్క పెద్దమ్మాయిగా కనిపిస్తోంది. అందంలో తల్లికే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. ఈ ఫోటోల్లో శిల్ప భర్త రంజిత్ కూడా ఉన్నాడు.ఎంత ఎదిగిపోయావో..అనౌష్క పుట్టినరోజునాడు తను చిన్నప్పుడు దేశీ గర్ల్ పాటకు స్టెప్పేసిన ఓ డ్యాన్స్ వీడియోను సైతం షేర్ చేసింది. నా గారాలపట్టి అప్పుడే ఎంత పెద్దదైపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నువ్వు ఎన్ని బర్త్డేలు జరుపుకున్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ చిన్న పాపవే! ఒక ధృడమైన అమ్మాయిగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రపంచం, సంతోషం అన్నీ నువ్వే.. నమ్ముతావో, లేదో కానీ.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కూడా! నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బంగారం. ఎల్లప్పుడూ నేను నీకు అండగా నిలబడతానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
ఉదయం 9కల్లా సెట్లో.. అర్దరాత్రి వరకు షూటింగ్స్తోనే బిజీ!
వయసు మీద పడుతుంటే ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. అందులోనూ 80 దాటిందంటే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మాత్రం 83 (తన వయసు) అనేది జస్ట్ నంబర్ మాత్రమేనని, తానింకే కుర్రవాడినేనంటున్నారు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి.కేబీసీ షో హోస్ట్గా..అమితాబ్ సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే షోను హోస్ట్ చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కేబీసీ 17వ సీజన్ రన్ అవుతోంది. ఈ షోకి ఇటీవలే ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్ మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్, షరీబ్ హష్మీ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేబీసీ అనుభవాలను పంచుకున్నాడు షరీబ్ హష్మీ. అంతా కలలా ఉందిఆయన మాట్లాడుతూ.. అమితాబ్ (Amitabh Bachchan) గారిని కలిశానంటే ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. ఆ అనుభవాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా జర్నీ గురించి అడిగినప్పుడు ఆయన నాతోనే మాట్లాడారా? అని గాల్లో తేలిపోయాను. కానీ, ఆయన ఎనర్జీకి మాత్రం దండం పెట్టాల్సిందే! ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్క రోజులోనే మూడు ఎపిసోడ్ షూటింగ్స్ పూర్తి చేస్తారు. పొద్దున తొమ్మిదికల్లా సెట్కు వస్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు. మేము హాజరైన ఎపిసోడ్ షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. అలసట లేకుండా..మేమందరం కాసేపైనా ఓ చిన్న కునుకు తీస్తే బాగుండు అన్నట్లుగా ఉన్నామా? ఆయన మాత్రం నిద్రను దరిచేరనీయకుండా యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఆయన అంత సెద్ద సూపర్ హీరో అయ్యారు అని షరీబ్ (Sharib Hashmi) చెప్పుకొచ్చాడు. ఇటీవల అమితాబ్ సైతం ఓ బ్లాక్లో తాను ఉదయం ఐదున్నర గంటల వరకు పని చేసినట్లు తెలిపారు. ఇదంతా చూసిన అభిమానులు మీకున్న ఎనర్జీ, డెడికేషన్కు హ్యాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కాంతార హీరోయిన్కు బాలీవుడ్లో ఆఫర్ -
కాంతార హీరోయిన్కు బాలీవుడ్ ఆఫర్!
సౌత్లోని భారీ బడ్జెట్ సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. అయితే దక్షిణాదిలో టాలెంట్ నిరూపించుకుంటున్న భామలకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపొస్తోంది. అందుకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద ఉదాహరణ.. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్కు జంటగా ఓ సినిమా చేస్తోంది. తాజాగా మరో సౌత్ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రుక్మిణి వసంత్..నాలుగేళ్లు గ్యాప్2019లో బీర్బర్ ట్రయాలజీ మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి. అదే ఏడాది అప్స్టార్స్ అనే హిందీ మూవీలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం తనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సప్త సాగరదాచె ఎల్లో అనే కన్నడ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డ్రాగన్ఈ సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి టైటిల్తో విడుదలై మంచి స్పందన రాబట్టింది. దీని సీక్వెల్ కూడా సక్సెస్ అవడంతో పాటు రుక్మిణి అందానికి అందరూ ఫిదా అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా మెప్పించలేకపోయింది. కాంతార: చాప్టర్ 1 చిత్రంతో మరోసారి సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ నుంచి పిలుపుబాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రుక్మిణి (Rukmini Vasanth) మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి హిందీ సుపరిచితమైన భాషే అంది. ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని.. భగవంతుడి దయ ఉంటే త్వరలోనే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేసింది.చదవండి: తిండీనిద్ర మానేసి మందు తాగుతూ ఉన్నా: ఊర్వశి -
మినీ ఎక్స్ ఎస్క్వైర్ ఇండియా ఈవెంట్ లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? తినకుండా వచ్చేస్తా!
పెళ్లి భోజనాలనగానే కొందరు పండగ చేసుకుంటారు. నచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగించవచ్చని ఉబలాటపడతారు. మరికొందరు మాత్రం అంతమందిలో లైను కట్టి మరీ తినడానికి మొహమాటపడతారు. తనకు ఆ మొహమాటం కాస్త ఎక్కువేనంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్.నాకంత ఓపిక లేదుకృతి కర్బందా, పులకిత్ సామ్రాట్ హోస్ట్ చేస్తున్న 'ద మాన్యావర్ షాదీ' షోకి తాజాగా కరణ్ జోహార్ హాజరయ్యాడు. కృతి, పులకిత్ పెళ్లి విందు గురించి మాట్లాడారు. ఎంతమంది జనాలున్నా సరే అందరూ తమ వంతు వచ్చేవరకు ఓపికగా నిల్చుకుని భోజనం చేస్తారని పేర్కొన్నారు. ఇంతలో కరణ్ కలగజేసుకుటూ తనకు మాత్రం అంత ఓర్పు, సహనం లేదన్నాడు.భోజనం చేయకుండా వచ్చేస్తా!పెళ్లిలో నేనెప్పుడూ భోజనం చేయలేదు. భోజనం దగ్గర పెద్ద పెద్ద లైన్లుంటాయి. ఆహారం కోసం ప్లేటు పట్టుకుని అంత పెద్ద క్యూలో నిల్చోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్లకు వెళ్తాను.. కానీ అక్కడ భోజనం చేయకుండానే వెనుదిరుగుతాను అని పేర్కొన్నాడు. అతడి సమాధానం విని కృతి అవాక్కయింది.సినిమాఇకపోతే కరణ్ నిర్మించిన తాజా చిత్రం "తూ మేరీ మే తేరా -మే తేరా తు మేరీ". సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ గతంలో 'పతీ పత్నీ ఔర్ వో' సినిమాలో తొలిసారి జోడీ కట్టారు. ఇప్పుడు రెండోసారి జత కట్టిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.చదవండి: మౌగ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ -
ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లికోసం ప్లానింగ్!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్ 2 అనే పాడ్కాస్ట్లో వెల్లడించాడు. ఈ పాడ్కాస్ట్కు అర్జున్ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు. ఆరేళ్లుగా డేటింగ్అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!మొదటి పెళ్లికాగా అర్జున్ రాంపాల్.. 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.ఎవరీ గాబ్రియెల్లా?గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్ చేసింది. పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది. ఇష్క్ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్ డ్యాన్సర్గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే.. ఆంఖేన్, డాన్, ఓం శాంతి ఓం, ఈఎమ్ఐ, హౌస్ఫుల్, రాజ్నీతి, చక్రవ్యూహ్, సత్యాగ్రహ, ధాకడ్, ధురంధర్ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించాడు.చదవండి: రెండోసారి విడాకులు తీసుకోబోతున్న దర్శకుడు! -
'అఖండ 2'లో బాలకృష్ణ కూతురిగా.. ఎవరీ అమ్మాయి?
రీసెంట్గా రిలీజైన 'అఖండ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులకు ఇది నచ్చేస్తుండగా.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే ఓకే అనిపిస్తోంది. ఏదైతేనేం సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి సీన్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఐక్యూ 226, 17 ఏళ్లకే డీఆర్డీఓలో సైంటిస్ట్ అనే సన్నివేశాలపై మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?ఈ సినిమాలో అఖండ కూతురి పాత్రలో కనిపించిన నటి పేరు హర్షాలీ మల్హోత్రా. పంజాబీ హిందు కుటుంబానికి చెందిన ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ఏడేళ్ల వయసులోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' మూవీలో నటించింది. మున్నీ పాత్రలో మాటలు రానీ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఈ మూవీ కంటే ముందే 2012లోనే అంటే నాలుగేళ్ల వయసులోనే 'ఖబూల్ హై', లాత్ ఆవో త్రిష, సావధాన్ ఇండియా సీరియల్స్లో నటించింది. 2017లో సబ్ సే బడా కళాకార్ అనే సీరియల్ కూడా చేసింది. దీని తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు నటనకు గ్యాప్ ఇచ్చింది.మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమా 'అఖండ 2'తో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో హర్షాలీ యాక్టింగ్కి ఓ మాదిరి ప్రశంసలు దక్కుతున్నాయి తప్పితే మరీ సూపర్గా చేసిందని ఎవరూ అనట్లేదు. కాకపోతే ఈమె క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా హర్షాలీ చాన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) -
దూసుకుపోతున్న దురంధర్.. పుష్ప 2 రికార్డు అవుట్
-
ఏడాది చివరలో దుమ్మురేపుతున్న బాలీవుడ్..
ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ విజయాల జోరు కొనసాగించింది. 2025లో హిందీ సినిమాలు ఆధిపత్యం కొనసాగించాయి. కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్గానే మిగిలాయి. అయితే, ఈ ఏడాది కాస్త పర్వాలేదు. చాలా సినిమాలు మినిమమ్ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినవే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే ఛావా వంటి సినిమాతో ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సైయారా కూడా రూ. 600 కోట్ల మార్క్ను దాటేసింది. గతంలో అక్కడ టాలీవుడ్ సినిమాలు కల్కి, పుష్ప-2 వంటి సినిమాలు సత్తా చాటాయి. అయితే, ఈసారి మన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు.డిసెంబర్ నెలలో కూడా బాలీవుడ్ చిత్రాలు మెప్పిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే రూ. 300 కోట్ల మేరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ మూవీ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం దాదాపు రూ.180 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కేవలం డిసెంబర్లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇప్పటికే రెండు ఉంటే.. మరోకటి భారీ అంచనాలతో రానుంది.క్రిస్మస్ వీకెండ్లో డిసెంబర్ 31న ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ విడుదల కానుంది. అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో రూమిగా అనన్య, రే పాత్రలో కార్తిక్ కనిపించనున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో బాలీవుడ్లో తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సౌత్ నుంచి కాంతార-2 మాత్రమే బాలీవుడ్లో సత్తా చాటింది. 2025లో సౌత్ సినిమాలను వెనక్కి నెట్టిసి తన పట్టును హిందీ సినిమా నిలిబెట్టుకుంది. -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..అఖిల్ - జైనబ్కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్తో ఏడడుగులు వేశాడు. జూన్ 6న ఎంతో గ్రాండ్గా ఈ వెడ్డింగ్ జరిగింది.సమంత- రాజ్ నిడిమోరుహీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!అభిషన్ జీవింత్- అఖిలటూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఓ సినిమా ఈవెంట్లో ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.అవికా గోర్- మిలింద్ చంద్వానీచిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది.అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్సింగర్ అర్మాన్ మాలిక్ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది.హీనా ఖాన్- రాకీ జైస్వాల్బుల్లితెర నటి హీనా ఖాన్ కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్ 4న పెళ్లి చేసుకున్నారు.ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.అర్చన- బీఆర్ శరత్కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగింది.వీళ్లే కాకుండా సారా ఖాన్- క్రిష్ పాఠక్.. సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. -
25 ఏళ్లుగా డిన్నర్కే వెళ్లలేదంటున్న స్టార్ హీరో!
సినిమా తారలకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కాదు, కాదు వాళ్లే ఆంక్షలు పెట్టుకుని బతుకుతుంటారు. నోరు కట్టేసుకుంటారు, స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరు, ఒక్కమాటలో చెప్పాలంటే నచ్చినట్లు జీవించలేరు. ఎంతసేపూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలన్న తాపత్రయంలో ఉంటారు. అందుకోసం తమ శరీర సౌష్టవాన్ని నిత్యం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.25 ఏళ్లుగాఅయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం చీటింగ్ డే అంటూ కొన్నిసార్లు అన్నీ పక్కనపెట్టి నచ్చింది ఆరగిస్తుంటారు. అది బిర్యానీ అయినా, ఐస్క్రీమ్ అయినా! కాస్త గ్యాప్ దొరికితే వెకేషన్కో, డిన్నర్కో బయటకు వెళ్తుంటారు. కానీ అలా తాను డిన్నర్కు వెళ్లి 25 ఏళ్లు అయిందంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.వాళ్లే ఉన్నారుతాజాగా రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్కు హాజరైన సల్మాన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేనెప్పుడూ కుటుంబం, ఫ్రెండ్స్ అంటూ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను. కానీ నా జీవితంలో కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ను కోల్పోయాను. దీంతో ఇప్పుడు నాతో నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఎన్నో ఏళ్లకొద్దీ నాతో సావాసం చేస్తున్నారు.అదే నా పనినేను బయట డిన్నర్కు వెళ్లి 25 ఏళ్లవుతోంది. ఎంతసేపూ షూటింగ్, ఎయిర్పోర్ట్, హోటల్, ఈవెంట్.. ఆ వెంటనే షూటింగ్.. ఇదే నా పని. అలా అని ఈ విషయంలో నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. వారికోసం నేను కష్టపడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. మర్చిపోయాడా?అయితే సల్మాన్ ఖాన్ పలువురు సెలబ్రిటీలతో గతంలో డిన్నర్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆనాటి విషయాల్ని సల్మాన్ మర్చిపోయాడా? లేదంటే అప్పుడు తినకుండానే బయటకు వచ్చేశాడా? అన్నది తనకే తెలియాలి! ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan).. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నాడు. -
దగ్గరివాళ్లే ద్రోహం చేశారు.. రెండేళ్లవుతోంది: నటి
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టాక తనను చూసుకోవడంతోనే సరిపెట్టుకున్న రిచా చద్దా ఇప్పుడు మళ్లీ సెట్స్లో అడుగుపెట్టింది. అయితే అనుకున్నదానికంటే ఆలస్యంగానే సెట్లో రీఎంట్రీ ఇచ్చానంటోంది రిచా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ద్రోహం చేశారుదాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ పనిలో నిమగ్నమయ్యాను. వీలైనంత త్వరగా సెట్లో అడుగుపెట్టాలనుకున్నాను.. కానీ నా శరీరం, మనసు అందుకు సిద్ధపడటానికి చాలా సమయమే తీసుకుంది. వీటిని పక్కనపెడితే ఇండస్ట్రీలో అత్యంత దగ్గరి వ్యక్తులే నాకు ద్రోహం చేశారు. ఈ రంగంలో కొందరికి మాత్రమే నీతి నిజాయితీ అనే విలువలు ఉంటాయని అర్థమైంది. వాళ్లను క్షమిస్తానేమో కానీ..వాళ్లకు ఆత్మనూన్యతా భావం ఎక్కువ. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, పక్కపవాళ్లనూ సంతోషంగా ఉండనివ్వరు. ఎలా అంటే పక్కవాళ్ల జీవితంలోని ఆనందాన్నంతా పీల్చేస్తుంటారు. అయితే ఇదంతా కొత్తేమీ కాదు.. గురు దత్ 70 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటివాళ్లను నేను క్షమిస్తానేమో కానీ జరిగినదాన్ని మాత్రం మర్చిపోను.నాకంటూ లైఫ్ ఉందిపాప పుట్టకముందు నేనెలా ఉండేదాన్నో నాకే గుర్తులేదు. చాలామంది ఏదో ఒక కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండమని చెప్తున్నారు. నాకంటూ ఓ జీవితం ఉంది. ఆ లైఫ్లో జరిగే ప్రతీది చెప్పడం నాకిష్టం లేదు. అసలు సోషల్ మీడియాలో ప్రతీది షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఎవరైనా ఒంటరితనం పోతుందా? లేదా మనమేదో రిచ్ అని చెప్పడానికా? అయినా నేను ఆల్రెడీ రిచే (Richa) అని చెప్పుకొచ్చింది.సినిమారిచా చద్దా (Richa Chadha).. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, ఫర్కీ, సర్బ్జిత్, లవ్ సోనియా, గోలియో కీ రాస్లీల రామ్లీల, షకీల, సెక్షన్ 375 వంటి పలు సినిమాల్లో నటించింది. చివరగా హీరామండి వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) -
ఛూ మంతర్!
హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, కన్నడ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ‘ఆషికీ 3’ సినిమాతో బాలీవుడ్లో, ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హిందీలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే రెండో సినిమా ‘ఛూ మంతర్’లో నటించే చాన్స్ అందుకున్నారట శ్రీలీల.తరుణ్ దుడేజా దర్శకత్వంలో మాడాక్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ‘ముంజ్య’ ఫేమ్ అభయ్ వర్మ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా తొలుత అనన్యాపాండేను సంప్రదించారు మేకర్స్. ఆమె సరే అన్నప్పటికీ... తన బ్లాక్బస్టర్ వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’ రెండో సీజన్తో డేట్స్ క్లాష్ కావడంతో ‘ఛూ మంతర్’ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోనున్నారట. ఇప్పటికే మేకర్స్ సంప్రదించగా.. ‘ఛూ మంతర్’లో నటించేందుకు శ్రీలీల సుముఖంగా ఉన్నారని టాక్. -
నన్ను సర్జరీ చేయించుకోమన్నారు: ధురంధర్ నటి
స్టార్ నటులు రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్లో మెరిసింది. శరారత్ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.సర్జరీ చేయించుకోమని సలహాఅయితే కెరీర్ తొలినాళ్లలో తన లుక్పై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా ముక్కును సరిచేయించుకోమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. దాన్ని సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్లో ముందుకెళ్లరు.. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారు!ఫేమస్ డైరెక్టర్ మూవీఒకసారి ఓ హారర్ సినిమా ఆడిషన్కు వెళ్లాను. ఆయన ఫేమస్ డైరెక్టర్. ఆడిషన్ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలక్ట్ చేస్తారని అక్కడున్నవాళ్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. ఇది హారర్ సినిమా కాబట్టి సరిపోయింది. తెలుగులో సినిమాలుకానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్లవరస మార్చుకోవాలి అన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్ సినిమాలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటం సాంగ్ చేసింది. జాట్లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరూ 2 మూవీ చేస్తోంది. హిందీ బిగ్బాస్ 17వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) -
సౌత్ టు నార్త్.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్స్తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.స్టార్ హీరోయిన్భారతీరాజా పుతియ వార్పుగల్ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్ స్క్రీన్కు పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.తెలుగులో సినిమాలుతెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్బాబు జీవిత రథం, ఎన్టీఆర్తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.వైవాహిక బంధంలో సమస్యలుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్లో, హిందీ సిరియల్స్లో నటుడిగా కొనసాగుతున్నాడు.30 ఏళ్లు నరకంఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను. భరించడం నా వల్ల కాక..ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది. ఏం చేస్తోందంటే?ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్ నడుపుతోంది. యాక్టింగ్ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది. -
టాప్ ప్లేస్లో సైయారా
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఈ ఏడాదికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. హిందీ చిత్రం ‘సైయారా’ తొలి స్థానంలో నిలిచింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ లవ్స్టోరీ సినిమాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్లో నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక రెండో స్థానంలో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’, మూడో స్థానంలో విక్కీ కౌశల్ ‘ఛావా’, నాలుగో స్థానంలో రిషబ్ శెట్టి ‘కాంతారా: చాప్టర్ 1’ చిత్రాలు నిలిచాయి.రజనీకాంత్ ‘కూలీ’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’, ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’, షాహిద్ కపూర్ ‘దేవా’, అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’, కల్యాణీ ప్రియదర్శన్ ‘లోక చాప్టర్1: చంద్ర’ చిత్రాలు వరుసగా 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి. అలాగే ఐఎండీబీ పోర్టల్ టాప్టెన్ వెబ్ సిరీస్ జాబితాలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’కి తొమ్మిదో స్థానం దక్కింది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ తొలి స్థానంలో నిలిచింది. -
ఓటీటీల్లో వందలకొద్ది వెబ్ సిరీస్లు.. టాప్-10లో ఇండియాకు నో ప్లేస్!
ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. ఏ భాషలో వచ్చినా సరే డబ్బింగ్ చేసి డిజిటల్గా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ప్రతి ఏటా వందలకొద్ది చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రిలీజైన ఆదరణ దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ప్రతి ఏటా సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి వాటికి మాత్రమే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. మర్డర్ మిస్టరీ లాంటి సిరీస్లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. సినీ ప్రియుల అభిరుచితి తగ్గట్టుగానే చాలా వెబ్ సిరీస్లు డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా వరకు మన దేశ ఆడియన్స్ ఆదరిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కంటెంట్ సత్తా చాటలేకపోయింది.ఓవరాల్ రేటింగ్ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో మన ఇండియన్ వెబ్ సిరీస్ ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. ఐఎండీబీ ప్రకటించిన టాప్-25 వెబ్ సిరీస్లో ఇండియా నుంచి కేవలం నాలుగు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్-15లో హర్షద్ మెహతా స్కామ్-1992 కాస్తా ఫర్వాలేదనిపించింది. ఈ లిస్ట్లో తొలిస్థానంలో బ్రేకింగ్ బ్యాడ్(9.5) అనే వెబ్ సిరీస్ నిలవగా.. బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్(9.4), ప్లానెట్ ఎర్చ్-2(9.4) రెండు, మూడు స్థానాల్లో రేటింగ్ దక్కించుకున్నాయి.టాప్-10 విషాయానికొస్తే నాలుగు నుంచి వరుసగా.. ప్లానెట్ ఎర్త్, ది వైర్, చెర్నోబిల్, అవతార్- ది లాస్ట్ ఎయిర్బెండర్, బ్లూ, కాస్మోస్, బ్లూ ప్లానెట్-2 నిలిచాయి. ఇక 11 వ ప్లేస్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిలవగా.. 12లో ది సోప్రానోస్ వెబ్ సిరీస్ నిలిచింది. ఇక ఇండియా నుంచి హర్షద్ మోహతా వెబ్ సిరీస్ స్కామ్-1992(9.2) ఈ లిస్ట్లో 13వ స్థానం దక్కంచుకుంది. ఆ తర్వాత ఆస్పిరెంట్స్, గుల్లక్, టీవీఎఫ్ పిచర్స్ వరుసగా 23, 24, 25 స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్గా చూస్తే మనదేశం నుంచి ఒక్క వెబ్ సిరీస్ కూడా టాప్-10లో రేటింగ్ సాధించలేకపోయింది. -
కాంతారపై రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీ.. స్పందించిన సీనియర్ హీరో భార్య..!
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.అసలేం జరిగిందంటే..ఈవెంట్లో స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్వీర్ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.కాంతార మూవీ..రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్బస్టర్గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. -
నాకు 33 ఏళ్లు.. అందుకే ఎగ్ ఫ్రీజింగ్: రియా చక్రవర్తి
2020లో హిందీ చిత్రపరిశ్రమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. వారిలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి సెలబ్రిటీలున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మాత్రం వార్తల్లో సంచలనమైంది. అతడి ఆత్మహత్యకు ప్రేయసి రియా చక్రవర్తి కారణమంటూ నెట్టింట సదరుహీరోయిన్పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. జైలుకుఅలాగే సుశాంత్ మృతి కేసులో ఆమె అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అతడి మరణానికి రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రియాకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఆమె పాడ్కాస్ట్తో పాటు చాప్టర్ 2 డ్రిప్ పేరిట బట్టల బిజినెస్ మొదలుపెట్టింది. ఈరోజు ఆ బ్రాండ్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.ఎగ్ ఫ్రీజింగ్తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 33 ఏళ్లు. ఈ మధ్యే గైనకాలజిస్ట్ను కలిశా.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే ఓపక్క కెరీర్లో సెట్ అవ్వాలి. మరోపక్క సామాజిక ఒత్తిడి. మన శరీరం ఓ వయసు రాగానే పిల్లల గురించి ఆలోచించమని చెప్తుంది. కానీ మనసు మాత్రం.. నీ బిజినెస్, బ్రాండ్, కెరీర్.. అవే పిల్లలని, వాటి ఎదుగుదల గురించి ఫోకస్ చేయమని చెప్తుంది. నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. సినిమాఅందుకే ఇప్పుడే పెళ్లి, ఫ్యామిలీ అని ఆలోచించదల్చుకోలేదు. కాకపోతే ఎగ్ ఫ్రీజింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రియా చక్రవర్తి (Rhea Chakraborty).. తూనీగ తూనీగ అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్ కీ మారుతి, సోనాలి కేబుల్, జిలేబి, చెహరె సినిమాలు చేసింది. దొబారా, హాఫ్ గర్ల్ఫ్రెండ్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్... రజనీకాంత్ ఏమన్నారంటే? -
ముంబైలో లైఫ్ స్టైల్ ఆసియా అవార్డ్స్ 2025.. సందడిగా సినీ తారలు (ఫోటోలు)
-
ఇడియట్స్ మళ్లీ కలిస్తే?
ఆమిర్ఖాన్ హీరోగా నటించిన ‘3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్కి సన్నాహాలు మొదలయ్యాయని బాలీవుడ్ టాక్. రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఆమిర్ఖాన్ హీరోగా, ఆర్. మాధవన్ , శర్మన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘3 ఇడియట్స్’. విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ చిత్రం 2009లో విడుదలై, బ్లాక్ బస్టర్గా నిలిచింది.‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్ను రూపొందించే పనిలో ఉన్నారట రాజ్కుమార్ హిరాణి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కథ పూర్తయిన తర్వాత ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ బాలీవుడ్లో తెరపైకి వచ్చింది. ‘3 ఇడియట్స్’ చిత్రం తొలిపార్టులో నటించిన ప్రధాన తారాగణ మంతా సీక్వెల్లోనూ నటిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాలోని ప్రధానపాత్రధారులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ‘3 ఇడియట్స్’ కథనం సాగుతుందని బాలీవుడ్ భోగట్టా.ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమిర్ఖాన్ , రాజ్కుమార్ హిరాణి కాంబినేషన్ లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్ రానుందని ఓ ప్రకటన వచ్చింది. మరి.. ‘3 ఇడియట్స్’ సీక్వెల్ ముందు సెట్స్కి వెళుతుందా? లేక దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మొదలవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్ఫ్లిక్స్లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్పీ, మాక్గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. #RaatAkeliHai : #TheBansalMurders Tamil Dubbed Movie OTT Release Sets To Premiere From December 19th on Netflix Also In Telugu Hindi pic.twitter.com/dxhpWaJ15l— SRS CA TV (@srs_ca_tv) December 7, 2025 -
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఉండవంటున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ మూడో సీజన్ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.జీవితంలో మర్చిపోలేనుతాజాగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ అంతా ఓ చిట్చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ సీజన్ 1 రిలీజైనప్పుడు మనోజ్ రాత్రిపూట నాకు ఫోన్ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్కాల్ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అభద్రతా భావం ఎక్కువఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్ చేసి నీ యాక్టింగ్ బాగుంది, నీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ అనే వెబ్ సిరీస్లో, చిట్టగ్యాంగ్ మూవీలో నటించారు.చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి -
స్టార్ డైరెక్టర్తో సినిమా.. రూమర్స్పై స్పందించిన అమిర్ ఖాన్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అమిర్ ఖాన్తో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అటు కోలీవుడ్.. ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా రద్దైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే స్టోరీని మరో నటుడితో లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఈ విషయంపై మాట్లాడారు. కాగా.. అమిర్తో సినిమా పవర్ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోవైపు లోకేశ్ కనగరాజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రజనీకాంత్- కమల్హాసన్లతో లోకేశ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖైదీ -2 మూవీని ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ బిజీగా ఉండడం వల్లే అమిర్ ఖాన్తో చిత్రంపై రూమర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. -
60 ఏళ్లకు లవ్లో పడాలనుకోలే..
అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్లో ఉంటారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.మూడోసారి ప్రేమలో..రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్లో లవ్లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్షిప్లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గొడవల్లేవ్వైవాహిక బంధంలో సక్సెస్ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయినప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. ఫస్ట్ పెళ్లికిరణ్ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్, కిరణ్.. ఆమె పేరెంట్స్.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. రెండో పెళ్లికొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ (Aamir Khan).. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్


