Bollywood
-
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందించారు.అయితే తాజాగా ఈ మూవీలో నటించిన ఓ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో చివర్లో రణ్వీర్ సింగ్ ఆటోలో వస్తారు. ఆ ఆటోను నడిపిన బద్రుల్ ఇస్లాం వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో తాను ఇంకా దురంధర్-2 చూడలేదని అన్నారు. టికెట్స్ రేట్లు తగ్గాక వెళ్లి చూస్తానని చెబుతున్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉన్నందువల్ల చూడలేకపోతున్నాని తెలిపారు. కుటుంబంతో కలిసి దురంధర్-2 చూసేందుకు తనకు మరింత సమయం పడుతుందన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ అయిన బద్రుల్ కోసం సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్కు విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సారా అర్జున్ హీరోయిన్గా కనిపించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Mintu dhotian (@amar.gill.12139862) -
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా) -
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
బాలీవుడ్ లో సంచలనం.. రణవీర్ సింగ్ అమ్మమ్మకు పాకిస్థాన్ సంబంధాలు!
-
ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్
గత ఆరునెలలుగా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తలైవా రివ్యూతాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్ను బాక్సాఫీస్ కా బాప్ అని అభివర్ణించాడు. రణ్వీర్ సహా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్ (ట్విటర్)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్పై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందిసర్, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్మార్క్గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్, స్వాగ్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్స్టార్ మూమెంట్గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్ రాసుకొచ్చాడు. Sir, we’ve all grown up measuring “entertainment” with just one benchmark, YOU. ❤️⁰Making us whistle, laugh, cry and feel larger than life for decades and still doing it with the same swag and grace, that’s pure magic.So for you to call Dhurandhar 2 a “must watch” feels like…— Aditya Dhar (@AdityaDharFilms) March 23, 2026 చదవండి: బ్యాండ్మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్ -
హారర్కి గ్రీన్ సిగ్నల్?
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన ‘రేంజర్, ధమాల్ 4’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘దృశ్యం 3 (హిందీ వెర్షన్), గోల్మాల్ 5’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉంటున్నప్పటికీ ఇటీవల మరో కొత్త సినిమాకు అంగీకారం తెలిపారని బాలీవుడ్ సమాచారం.హిందీలో ‘జేమ్స్’, పంజాబీలో ‘సర్దాజ్ జీ, సర్దార్ జీ 2’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్ జుగ్రాస్ ఇటీవల ఓ హారర్ కథను అజయ్ దేవగన్ కు వినిపించారట. కథ, హారర్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ సినిమాకు అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే సెట్స్పైకి తీసుకెళ్లాలని రోహిత్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
జూన్లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్
బ్లాక్బస్టర్ ధురంధర్కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్: ద రివేంజ్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 28 ఏళ్ల నాటి లేఖఈ క్రమంలో ధురంధర్ 2లో మొహమ్మద్ ఆలంగా నటించిన గౌరవ్ గేరా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్కు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అమ్మానాన్న థాంక్యూఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్, రేడియో, టిక్టాక్ రీల్స్.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.లేఖలో ఏముందంటే?అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. ఫోన్, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera) చదవండి: ద 50 షో.. విన్నర్గా శివ్ ఠాక్రే.. ప్రైజ్మనీ మాత్రం ఎవరికంటే? -
The 50: అరకోటి ప్రైజ్మనీ.. విన్నర్కు కాదు, అతడి అభిమానికి!
ద 50 రియాలిటీ షోకి శుభం కార్డు పడింది. 50 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో మార్చి 22న విజయవంతంగా ముగిసింది. ఫైజల్ షైక్, కృష్ణ ష్రాఫ్, రజత్ దలాల్లను వెనక్కు నెడుతూ శివ్ ఠాక్రే విజేతగా నిల్చాడు. అతడికి ద 50 ట్రోఫీ అయితే దక్కింది. కానీ ప్రైజ్మనీ మాత్రం కాదు! అదే ఈ షో స్పెషాలిటీ.. కంటెస్టెంట్కు బదులుగా అతడి అభిమాని అరకోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. అలా శివ్ ఠాక్రే టైటిల్ గెలిస్తే అతడి అభిమాని సీతారామ్ ప్రహ్లాద్ అఘవ్ రూ.50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకున్నాడు.ఫినాలేలో ఏం జరిగిందంటే.. 50 మంది కంటెస్టెంట్లతో ద 50 షో మొదలైంది. ఫైనల్స్కు వచ్చేసరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. వారే రజత్ దలాల్, శివ్ ఠాక్రే, కృష్ణ ష్రాఫ్, కాక (రవీందర్ సింగ్), ఫైజల్ షైక్. మీలో ఒకర్ని మీరే ఎలిమినేట్ చేయాలని ద లయన్(షోలో బాస్) చెప్పగా.. శివ్, కృష్ణ, కాక.. రజత్ను ఎలిమినేట్ చేశారు. మిగిలిన నలుగురికి నాలుగు రకాల టాస్కులు అప్పగించారు. వీటన్నింటిని దాటుకుని శివ్ ఠాక్రే గెలిచి సత్తా చూపించాడు. ఫైజల్ షైక్ ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అభిమానికి రూ.50 లక్షలునిజానికి ప్రిన్స్ నరూలా త్యాగం చేసిన టికెట్ టు ఫినాలేతోనే శివ్ ఠాక్రే ఫైనల్స్లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని ఇప్పుడేకంగా ట్రోఫీ గెలవడం విశేషం. రూ.50 లక్షలు గెలిచిన శివ్ ఠాక్రే అభిమాని సీతారాం మాట్లాడుతూ.. నేను, నా కుటుంబం పొలం పని చేసుకుంటాం. ఈ ప్రైజ్మనీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా ఒక మోసమేమో అనుకునేవాడిని. జరుగుతుందంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు, కారు కొనివ్వాలనుకున్నాను, ఈ డబ్బుతో అదే చేస్తాను అని పేర్కొన్నాడు. కాగా శివ్ ఠాక్రే.. గతంలో మరాఠి బిగ్బాస్ రెండో సీజన్ విజేతగా నిలవగా హిందీ బిగ్బాస్ 16వ సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: మంచు లక్ష్మి ఇంట్లో వేడుక.. మోహన్బాబు ఆశీర్వాదం -
హాలీవుడ్ సినిమా కోసం హృతిక్.. ఏలియన్కు డ్యాన్స్ నేర్పిస్తూ..
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చారు.ఏలియన్కి డ్యాన్స్"జాదూ వర్సెస్ రాకీ" అని టైటిల్ ఇచ్చిన ఈ వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, 'ది మార్షియన్' ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. 2025 డిసెంబర్లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ భారత్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్లో మార్చి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
50 ఏళ్ల వయసులో తండ్రయిన నిర్మాత
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు. బిడ్డ కోసం ఎదురుచూపులుభార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చిలో డెలివరీ డేట్ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.రెండో పెళ్లిహైదరాబాద్కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యాడు. ఆమిర్ ఖాన్ గజిని, క్వీన్, సూపర్ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.చదవండి: ధురంధర్ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్ నటుడు -
సల్మాన్ ఖాన్ పేరు.. నన్ను ధురంధర్ 2లో తీసేశారనుకున్నా!
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. నన్ను తీసేశారనుకున్నా..ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదుకానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.మేకప్ కోసం 12 గంటలుముసలి వయసులో ఉన్న దావూద్గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
మహేశ్బాబుతో యాక్టింగ్.. సెట్లో ఎలా ఉంటారంటే?
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే ఆ కిక్కే వేరంటోంది బాలీవుడ్ నటి నీరూ సెహగల్. ఈమె కీలక పాత్రలో నటించిన కొహ్రా వెబ్స సిరీస్ రెండో సీజన్కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది నీరూ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటులుగా సినిమా, సిరీస్ల కోసం మేం ఎంతో కష్టపడతాం. ఎప్పటికీ మర్చిపోనుఅవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? నేను అమెరికాలో పెరిగినప్పటికీ పంజాబీ సాంప్రదాయాలకు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాను. నా మూలాల్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆడిషన్ ద్వారానే కొహ్రా సీజన్కు ఎంపికయ్యాను. నా పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఇలాంటి బలమైన రోల్స్ మరిన్ని చేయాలనుంది. కథ బాగుండి, మంచి పాత్ర ఆఫర్ చేస్తే దక్షిణాదిలోనూ నటించడానికి రెడీ.. మహేశ్బాబుతో యాక్టింగ్రెండేళ్ల క్రితం ఓ యాడ్లో మహేశ్బాబుతో కలిసి పని చేశాను. ఆయన పెద్ద సూపర్స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా వినయంగా ఉంటాడు. డెడికేషన్తో పని చేస్తాడు. దానివల్ల షూట్ అంతా చాలా సౌకర్యంగా జరిగింది. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ.. ఇలా తనను చూసి చాలా నేర్చుకోవచ్చు అని నీరూ సెహగల్ చెప్పుకొచ్చింది.చదవండి: ధురంధర్ 2 విజయం వెనక తెలుగు సినిమా: ఆదిత్య ధర్ -
దూసుకెళ్తోన్న దురంధర్-2.. కేవలం మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
రణ్వీర్సింగ్ హీరోగా వచ్చిన దురంధర్-2 హవా కొనసాగుతోంది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్తోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.నెట్ వసూళ్ల పరంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.రూ. 339.27 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు అత్యధికంగా రూ.113 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజు వసూళ్లతోనే హిందీ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది.ఉత్తర అమెరికాలో 'ధురంధర్ 2' ఏకంగా 4,405 షోలు ప్రదర్శిస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. మూడో రోజు కూడా రెండు లక్షలకు టికెట్లకు పైగా విక్రయించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్ల ద్వారానే సుమారు రూ.23.70 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లను చూస్తే ఉత్తర అమెరికా మార్కెట్లో ఒక ఇండియన్ మూవీ ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్ 2' నిలవనుంది. యూకేలోనూ దురంధర్-2 షోలు హౌస్పుల్గా రన్ అవుతున్నాయి. బెల్ఫాస్ట్ నగరంలో ఏడు షోలు హౌస్పుల్గా ప్రదర్శించారు. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
దురంధర్-2 రిలీజ్.. టాక్సిక్ సేఫ్.. మరి ఉస్తాద్ సంగతేంటి?
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్ బాక్సాఫీస్ను షేక్ చేయడంతో సీక్వెల్గా భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 19న రిలీజైన దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనూ 3.95 మిలియన్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్తో కలిపి ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. టాక్సిక్ టీమ్ సేఫ్.. మరీ ఉస్తాద్ సంగతేంటి?యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దురంధర్ క్రేజ్ చూసి మేకర్స్ తెలివిగా తప్పుకున్నారు. ఈ లెక్కన చూస్తే టాక్సిక్ టీమ్ చేసిన పని కరెక్టే అనిపిస్తోంది. కానీ తెలుగు హీరో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం బాక్సాఫీస్ పోటీకి దిగింది. దురంధర్-2 మానియాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియడం లేదు. దురంధర్ దెబ్బకుఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయిందా? అని కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు. మరోవైపు చాలా థియేటర్లలో దురంధర్-2 మూవీకి టికెట్స్ కూడా దొరకడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఇంత భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కాస్తా ఆలోచించి ఉండాల్సిందనే ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్ మూవీ క్రేజ్ చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే జీవితాంతం సింగిల్గానే!
కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్షిప్స్లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సింగిల్గా ఉన్నానని..దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.ప్రశాంతంగా ఉంటా..నాకు కరెక్ట్ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.సినిమాపైగా రిలేషన్షిప్లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్ జార, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ , హీరోయిన్, బ్లాక్మెయిల్ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: ధురంధర్ 2 ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. తెలుగులో కూడా.. -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
బాక్సాఫిస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ 2
-
ఫ్రీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. రిజెక్ట్ చేశా: అనుపమ్ ఖేర్
టాలెంట్ ఉంటే చాలు ఎలాగైనా రాణించవచ్చనుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. కానీ, ఆయన బట్టతలను చూసి ఈయనెలా నటుడవతాడని చాలామంది సంశయించారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిల్వాలే దుల్హానియా లేజాయెంగే, హమ్ ఆప్కే హై కోన్, ద కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.అంకుల్ అని పిలవద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. యువతరం నన్ను సర్, అంకుల్ అని పిలిస్తే నచ్చదు. ఏకే లేదా అనుపమ్ గారు అంటే సరిపోతుంది. అంతేకానీ అంకుల్ అని నన్ను వేరు చేయడం ఇష్టం లేదు. సినిమా దగ్గరినుంచి ఏఐ, సైన్స్.. ఇలా అన్నిరకాల అంశాల గురించి చర్చించడం నాకెంతో ఇష్టం. ఇకపోతే ఎంతోమంది డాక్టర్లు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని ముందుకు వచ్చారు. పేపర్లో యాడ్కానీ, వాళ్లందరినీ సున్నితంగా తిరస్కరించాను. నా తలపై వెంట్రుకలు వచ్చేందుకు డబ్బు ఖర్చుపెట్టేందుకు రెడీ అయినవాళ్లూ ఉన్నారు. కానీ, నేను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలా డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. ఒకసారి ఏమైందంటే నేను న్యూస్పేపర్ చదువుతున్నాను. అందులో హెయిర్ ఆయిల్ కోసం ఓ వాణిజ్య ప్రకటన వేశారు. అది నేను చూడలేదు. సినిమాకానీ, నా కొడుకు సికందర్ నేను యాడ్నే చూస్తున్నా అనుకుని.. దాని గురించి ఆలోచించకు నాన్న అన్నాడు. ఎన్నో ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘోస్లా 2. ఇది 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఖోస్లా కా ఘోస్లా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. ప్రశాంత్ భాగియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది.చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలో కొత్త సినిమా -
దురంధర్-2 మూవీ.. ప్రీమియర్స్తోనే ఆల్టైమ్ రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్లో దురంధర్-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
రొమాంటిక్ సాంగ్.. దర్శకుడికి కాజోల్ వార్నింగ్!
ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్ అంధురాలిగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్ కోహ్లి పంచుకున్నాడు. హీరోయిన్ వార్నింగ్ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ మొదటిరోజే కాజోల్ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అంధురాలు ప్రేమలో పడకూడదా?అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా -
బూతు పాట : సంజయ్ దత్, నోరాఫతేహి, టీమ్కు మరో షాక్
సాక్షి, ఢిల్లీ: 'కేడీ: ది డెవిల్'(KD: The Devil) పాట వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అశ్లీల సాహిత్యం అంటూ రేగిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది.ఎన్సీడబ్ల్యూ సమన్లుఈ పాటలో అశ్లీలత ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ చిత్రం బృందంతోపాటు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహికి జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.ఈ పాటలో అభ్యంతరకరమైన ,అశ్లీల సాహిత్యం, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అనుచితమైన అవాంఛనీయ చిత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. పాట రచయితలు, నిర్మాతల నుండి వివరణ కోరింది.ఈ సాంగ్ విడుదల కాగానే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పాటలోని సాహిత్యం, కొరియోగ్రఫీ చాలా అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. అటు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. అశ్లీలతలో బాలీవుడ్ అన్ని హద్దులు దాటేసిందని తీవ్రంగా మండిపడ్డారు.మరోవైపు, చిత్ర దర్శకుడి భార్య రక్షిత ఈ పాటను సమర్థించారు. గతంలో కూడా ఇలాంటి మాస్ సాంగ్స్ వచ్చాయని, ఇది కేవలం సినిమా సృజనాత్మకతలో భాగమేనని దీన్ని సమర్ధించుకున్నారు.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ ,బాధ్యతల పరిమితులపై చర్చను రేకెత్తించింది.ఈ పాటలు భారతీయ సినిమాలో దీర్ఘకాలంగా ఉన్న ధోరణులలో భాగమని కొందరు వాదిస్తుండగా, హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్ను నిరోధించడానికి మరింత కఠినమైన నిబంధనలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్సీడబ్ల్యూ (NCW) చర్య వల్ల వినోద రంగంలో కంటెంట్ నియంత్రణపై విస్తృత పరిణామాలు చోటుచేసుకోవచ్చని మరికొందరి అంచనా. -
41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి- వివేక్ దహియా గుడ్న్యూస్ చెప్పారు. పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతా అయిపోయిందనుకునేలోపు..'పదేళ్ల ప్రయాణంలో ట్విస్ట్ అదిరింది కదూ.. కొన్ని ప్రయాణాలు తొందరపెట్టవు.. అవి సిద్ధంగా ఉన్నప్పుడే మొదలవుతాయి. మన కథ పూర్తయిందనుకులోపే జీవితం ఇలాంటి అందమైన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నా.. కారణం లేకుండానే నవ్వుతున్నా.. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.. అవును, మేము బేబీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నటి బ్యూటిఫుల్ క్యాప్షన్ జోడించింది.ఇంకా షాపింగ్ మొదలుకాలేదుఓ ఇంటర్వ్యూలో దివ్యాంక మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మొదట నా భర్తకే చెప్పాను. ఆ వెంటనే ఇంట్లో వాళ్లందరితోనూ పంచుకున్నాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఆరునెలలపాటు ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. నేను ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల దీన్ని ఇంతకాలం సీక్రెట్గా ఉంచగలిగాం. బేబీ కోసం ఇంకా షాపింగ్ మొదలుపెట్టలేదు.2016లో పెళ్లిజూన్లో డెలివరీ డేట్ ఇచ్చారు అని పేర్కొంది. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) చదవండి: ఓటీటీలో అమరావతికి ఆహ్వానం మూవీ -
టాలీవుడ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్లో ఏం జరగొచ్చనేది చూద్దాం.'ధురంధర్' పూర్తి స్టోరీ30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్లోని కాందహార్ ఎయిర్పోర్ట్లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్కి ఓకే చెబుతాడు.ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి? -
నాన్న చనిపోయినప్పుడు రూ.30 ఉన్నాయి: ఫరా ఖాన్
బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన చేదు బాల్యాన్ని బయటపెట్టింది. తన తండ్రి దర్శకనిర్మాత కమ్రాన్ ఖాన్ నిర్మించిన ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నామంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. ఐసా భీ హోతా హై సినిమాపై నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. కటిక పేదరికంలోకిఆ మూవీ శుక్రవారం రిలీజైతే ఆదివారానికల్లా కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. ఎంతో ధనవంతుడైన నాన్న పేదవాడయిపోయాడు. తన కలలు ఛిద్రం కావడం తట్టుకోలేకపోయాడు. మద్యపానానికి బానిసయ్యాడు. రాత్రి అయిందంటే చాలు మేమంతా వణికిపోయేవాళ్లం. అంతలా తాగేవాడు. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని ఐదారేళ్లు వెనక్కు నెట్టేసింది. ఆయన తలెత్తుకోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఎవరికీ తెలీదు13 ఏళ్లు ఏ పనీ చేయలేదు. అమ్మానాన్న విడిపోయినా కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. నాన్న దర్శకుడిగా విఫలమైనందున నేను డైరెక్టర్ అయి మంచి పేరు తేవాలనుకున్నాను. అలా చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువ చిత్రాలు చూసేవాదాన్ని. అయితే నాన్న ఎప్పుడూ కొడుకు గురించి ఆశపడేవాడు. సాజిద్ (ఫరా సోదరుడు) పుట్టాక నన్ను కాస్త పక్కనపెట్టేశాడు. నాన్న చనిపోయినప్పుడునాన్నకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు.. కానీ ఫోకస్ అంతా కొడుకుపైనే ఎక్కువ ఉండేది. అప్పుడు సక్సెస్ అవ్వాలన్న సంకల్పం నాలో మరింత బలపడింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన జేబులో రూ.30 మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ అన్నట్లుగానే హిందీ ఇండస్ట్రీలో మొదట కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకురాలిగా మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్, తీస్మార్ ఖాన్ వంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించింది.చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు -
నా భార్య రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ చేసింది: హీరో
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్లో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇప్పటికే అనేక హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి, కరెంట్ స్టవ్లమీద వంట చేస్తున్నాయి. అటు ప్రజలు సైతం సిలిండర్లు సమయానికి రావకపోవడంతో ఇండక్షన్ స్టవ్లు ఎగబడి మరీ కొంటున్నారు. రెండు ఆర్డర్..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అదే పని చేశాడు. ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా భార్య (ట్వింకిల్ ఖన్నా) నిన్నగాక మొన్న రెండు ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ పెట్టింది. అదింకా డెలివరీ అయిందో, లేదో నాకు తెలీదు. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఒకటి కొనుక్కుంటే బెటర్ అన్నాడు. సినిమాప్రస్తుతానికి తమ ఇంట్లో వంటగ్యాస్ కొరత లేదని, కాకపోతే బ్యాకప్ కోసం ఇండక్షన్ స్టవ్ రెడీ చేసుకుంటున్నట్లు తెలిపాడు. అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇది కాకుండా ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి.చదవండి: చికిరి చికిరి పట్టించుకోలేదు.. ఈ పాట వల్లే అభాసుపాలు: గేయరచయిత -
ఈ స్థాయికి హ్యాపీ: రాశీ ఖన్నా
‘‘చిత్ర పరిశ్రమలో నాకెలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను? అన్నది చూసుకుంటే సంతోషంగా ఉంటుంది. దాదాపు 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా చెప్పా రు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నా పాత్ర పేరు శ్లోక. చాలా మోడ్రన్ అమ్మాయి. మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో నాకు ఒక మాస్ సాంగ్ ఉంది.నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ పాట చిత్రీకరణని చాలా ఎంజాయ్ చేశాను. తెలుగువారి పండగైన ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి థియేటర్లో చూడొచ్చు. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్గారితో ఒక సినిమా, అలాగే ‘ఫర్జీ 2’ షో చేస్తున్నాను. అమెజాన్ సిరీస్లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో నా డైలాగ్స్ అన్నీ పంజాబీలోనే ఉంటాయి. తమిళ్లో ‘రౌడీ అండ్ కో’ మూవీలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కథలు వింటున్నాను’’ అని చెప్పా రు. -
చాంద్ దేఖ్ లేనా..
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సల్మాన్ సైనికాధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చాంద్ దేఖ్ లేనా..’ పాట టీజర్ను రిలీజ్ చేసి, త్వరలోనే పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.హిమేష్ రేష్మియా స్వరపరచిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం అందించగా, నిహాల్ టౌరో–అంకోనా ముఖర్జీ పాడారు. ఈ సినిమాకు తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే టైటిల్ను అనుకుని, ఇటీవల ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడిందని, ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావొచ్చని బాలీవుడ్ టాక్. -
బూతు పాటపై కేంద్రం సీరియస్
సినిమాల్లో ఈ మధ్య హింస పెరిగిపోతోంది. రక్తపాతం, వయలెన్స్ లాంటి వాటిని కాస్త ఎక్కువగానే చొప్పిస్తున్నారు. ఇది సమాజంపై చూపి ప్రభావం చూపే చాలానే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి తోడు పాటలు కూడా హద్దులు దాటేస్తున్నాయి. రీసెంట్గా అలా నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఓ గీతం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. సోషల్ మీడియాలో లెక్కకు మించిన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాటపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)కన్నడ హీరో ధ్రువ సర్జా లేటెస్ట్ మూవీ 'కేడీ:ది డెవిల్'. ఎప్పటినుంచో సెట్స్ మీదున్న ఈ చిత్రం విడుదలకు నానా తంటాలు పడుతోంది. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. త్వరలో రిలీజ్ చేద్దామనుకుని రీసెంట్గానే 'సర్కే చునర్' అని సాగే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఈ పాట సాహిత్యానికి సంబంధించి దక్షిణాదిలో ఓ దశ వరకు రాశారు. హిందీలో మాత్రం డబుల్ మీనింగ్ వచ్చేలా పచ్చిబూతులు రాసేశారు. దీనికి తోడు డ్యాన్స్ కూడా అసభ్యంగా ఉండేసరికి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.ఈ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. స్పందించిన కేంద్రం.. అన్ని చోట్ల నుంచి పాటని తొలగించాలని సెన్సార్ అధికారుల్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఈ తరహా అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఇప్పటికే హిందీ వెర్షన్ పాటని యూట్యూబ్ నుంచి తొలగించేశారు.పాన్ ఇండియా మూవీగా తీసిన 'కేడీ ది డెవిల్'ని.. రీసెంట్ టైంలో 'జన నాయగణ్'తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విజయ్ సినిమా రిలీజ్ నిరవధిక వాయిదా పడేసరికి సతమవుతున్న ఈ నిర్మాణ సంస్థకు 'టాక్సిక్' వాయిదా మరో దెబ్బ కాగా.. ఇప్పుడు ఈ పాటపై కూడా సర్వత్రా విమర్శలు, కేంద్రం సీరియస్ కావడం లాంటివి మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
రిలీజ్కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
ఆస్కార్ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)
-
సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!
ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్దిన్ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్ దిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్లాండ్ భాషలో రూపొందిన ఒన్ డే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇందులో అమీర్ఖాన్ వారసుడు జునైద్ఖాన్ హీరోగా నటించారు.జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్దిన్ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్ఖాన్లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మృతి.. జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రాస్తూ..'సినిమా సెట్లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం. వానిటీ వ్యాన్లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను. గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్స్టైలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్తో కలిసి పనిచేశారు. ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని నైపుణ్యాలు, సెట్లో తన వర్క్తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు!
ఇండియన్ బిగ్స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.రామాయణ సినిమాఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.కుంభకర్ణుడిగా..అతడే ఫైజల్ మాలిక్. పంచాయత్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.సినిమాలు, సిరీస్లుఫైజల్ మాలిక్.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కామెడీ పోలీస్గా నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్లో డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్లు చేశాడు. చివరగా హారర్ కామెడీ మూవీ థామాలో పోలీస్గా కనిపించాడు.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్ -
అలాంటి సీన్లు చేయమని బలవంతం..: నటి
సల్మాన ఖాన్ 'వీర్' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్ చేసింది. అయితే హేట్ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్ ఖాన్.ముందో మాట చెప్పి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్ మహదేవన్ అక్సర్ 2 సినిమా ఆఫర్ చేశారు. అయితే ఇందులో బోల్డ్ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. చెప్పిందొకటి.. చేసిందొకటికానీ, సెట్కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్ ఒకరకంగా చెప్పి షూటింగ్ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.ఎంత అన్యాయం?నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్.. నాకు లాభమే లేదు: విజయ్ సేతుపతి -
ఆస్కారం ఎవరికి?
హాలీవుడ్లో ఆస్కార్ సందడి మొదలైంది. 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఈ నెల 15న జరగనున్న సంగతి తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డు సాధించే ఆస్కారం ఎవరికి మెండుగా ఉంది? అనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించి, అత్యధికంగా 16 నామినేషన్స్ దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాకు ఫైనల్గా ఎన్ని అవార్డులు వస్తాయి? అనేది ప్రస్తుతం హాలీవుడ్లో హాట్ టాపిక్.అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా ‘సిన్నర్స్’ సినిమాను డామినేట్ చేసి, ఎక్కువ అవార్డులు దక్కించుకునే అవకాశం లేకపోలేదని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇక ‘ఫ్రాకింగ్స్టన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాలకు తొమ్మిది నామినేషన్స్ లభించగా, ‘హామ్నెట్’ చిత్రానికి 8 నామినేషన్స్ దక్కాయి. మరి... ఈ చిత్రాల్లో ఏ చిత్రం ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది. ఇక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు... ఈ ప్రధాన విభాగాల్లో హాలీవుడ్ కథనాల ప్రకారం అవార్డు దక్కే ఆస్కారం ఎవరికి ఉందనే విషయం తెలుసుకుందాం...జోస్యం నిజమవుతుందా?ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్ డికాప్రియో, ఈథన్ హాక్, మైఖేల్ బి జోర్డాన్, వాగ్నర్ మౌరా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ తిమోతి చాలమేట్ (‘మార్టీ సుప్రీం’ సినిమాకుగానూ)కే ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ‘ది సీక్రెట్ ఏంజెంట్’ చిత్రానికిగానూ వాగ్నర్ మౌరా గెలుచుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి బ్రెజిలియన్ యాక్టర్గా వాగ్నర్ నిలిచారు.అది మాత్రమే కాదు... ఉత్తమ నటుడిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ వాగ్నర్ మౌరా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ అందించే అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచున్నారు మైఖేల్ బి. జోర్డాన్. పైగా ఆస్కార్లోనే అత్యధిక నామినేషన్స్ను దక్కించుకున్న ‘సిన్నర్స్’ సినిమాలో నటించిన యాక్టర్ కాబట్టి మైఖేల్ బి. జోర్డాన్పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ‘బ్లూ మూన్’ సినిమాలో ఈథన్ హాక్, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రంలో లియోనార్డ్ డికాప్రియో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మెజారిటీ మాత్రం తిమోతి చాలమేట్కే అవార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా 30 ఏళ్ల వయసులోనే మూడుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడిగా తిమోతి పేరిట రికార్డు ఉంది. 97వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు విభాగంలో ‘ఏ కంప్లీట్ అన్నోన్’ సినిమాకుగాను తిమోతికి నామినేషన్ దక్కినప్పటికీ అవార్డు రాలేదు. ఈ మూడో ప్రయత్నంలో తిమోతికి అవార్డు ఖాయం అని హాలీవుడ్ జోస్యం చెబుతోంది..పాతికేళ్ల తర్వాత... గత ఏడాది జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది జరగనున్న 98వ అవార్డ్స్ ప్రదానోత్సవంలో కొత్తగా ‘బెస్ట్ క్యాస్టింగ్’ అనే విభాగాన్ని ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రవేశపెట్టింది. 2001లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు ‘బెస్ట్ క్యాస్టింగ్’ పేరుతో మరో విభాగాన్ని చేర్చారు.ఇలా 98వ ఆస్కార్ అవార్డ్స్లో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ క్యాస్టింగ్ విభాగంలో నీనా గోల్డ్ (‘హామ్నెట్’ సినిమా), జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్), గాబ్రియేల్ డొమింగ్యూస్ (ది సీక్రెట్ ఏజెంట్), ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్) మధ్య పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీ ‘సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రాల మధ్య ఉన్నట్లే, ఈ కొత్త విభాగంలోనూ ప్రధాన పోటీ ఫ్రాన్సిన్ మైస్లర్ (సిన్నర్స్), వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (కాసాండ్రా కులుకుండిస్)ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే యాక్టింగ్ విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు నాలుగు నామినేషన్స్ దక్కగా, ‘సిన్నర్స్’కు మూడు నామినేషన్స్ దక్కాయి. అయితే ఈ విభాగంలో ‘సిన్నర్స్’కే అవార్డు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే... ఆస్కార్ చరిత్రలోనే అత్యధికంగా నామినేషన్స్ దక్కించుకున్న రికార్డు ‘సిన్నర్స్’కే దక్కింది కాబట్టి ఈ సినిమాకే ఈ విభాగంలో అవార్డు వస్తుందంటున్నారు హాలీవుడ్ సినీ నిపుణులు. అలాగే జెన్నిఫర్ వెండెట్టి (మార్టీ సుప్రీం) అవార్డు అందుకునే చాన్స్ లేకపోలేదంటున్నారు.సిన్నర్స్ వర్సెస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నాయి. ఆస్కార్ హిస్టరీలోనే అత్యధికంగా 16 నామినేషన్స్ను దక్కించుకుని, చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే 13 నామినేషన్స్ దక్కించుకున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి కూడా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ ఉంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. నామినేషన్స్ పరంగా ‘సిన్నర్స్’దే పై చేయి అయినప్పటికీ ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమాకు రావచ్చొనే టాక్ హాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.ఈ ఏడాది జరిగిన బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డు (బాఫ్తా), గోల్డెన్ గ్లోబ్, ్ర΄÷డ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్కార్లోనూ ఉత్తమ చిత్రం విభాగంలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కు అవార్డు దక్కుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కానీ ‘సిన్నర్స్, హామ్నెట్’ చిత్రాలను కూడా తేలికగా తీసివేయలేమని హాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాలను దాటుకుని ఈ విభాగంలో బరిలో ఉన్న ‘బగోనియా, ఎఫ్1, ఫ్రాంకిన్స్టన్, మార్టీ సుప్రీం, ది సీక్రెట్ ఏజెంట్, ట్రైన్ డ్రీమ్స్’ వంటి సినిమాల్లో ఏదైనా సర్ప్రైజింగ్గా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? అనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఈ ఇద్దరిలో ఎవరు?ఉత్తమ నటి విభాగంలో ‘హ్యామ్నెట్’ చిత్రానికిగాను జస్సీ బక్లీ, ‘బగోనియా’ చిత్రానికిగాను ఎమ్మా స్టోన్, ‘సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రానికి రెనాటా రైన్సావా, ‘ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ ఉడ్ కిక్ యు’ చిత్రానికి నురోజ్ బర్న్, ‘సాంగ్ సంగ్ బ్లూ’ మూవీకి గాను కేట్ హడ్సన్లు నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ‘క్రిటిక్స్ చాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాఫ్తా అవార్డ్స్’లో నటిగా అవార్డు గెలుచుకుని, ఉత్తమ నటి విభాగంలోని ఆస్కార్ అవార్డు కోసం రేసులో ముందు వరుసలో ఉన్నారు జస్సీ బక్లీ. కాగా రెనాటా రైన్సావా, రోజ్లు తమ కెరీర్లో తొలిసారి ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు.అలాగే గతంలో ‘ఆల్మోస్ట్ ఫేమస్’ అనే చిత్రంలో సహాయ నటిగానూ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు కేట్ హడ్సన్. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఈసారి ఉత్తమ నటి విభాగంలో కేట్ హడ్సన్కు నామినేషన్ దక్కింది. కేట్, రెనాటా... ఈ ఇద్దరిలో ఆస్కార్ అదృష్టం ఎవర్ని వరిస్తుంది అనేది చూడాలి.భారత్కు నిరాశ ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్లో మన దేశానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్బౌండ్’ను పంపింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం షార్ట్ లిస్ట్ అయింది కానీ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో బ్రెజిల్ దర్శకుడు క్లెబర్ మెండోన్సా ఫిల్హో తీసిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్ దర్శకుడు జాఫర్ పనాహి తెరకెక్కించిన ‘ఇట్ వాజ్ జస్ట్ ఎ యాక్సిడెంట్’, నార్వే డైరెక్టర్ జోచిమ్ ట్రైయర్ తీసిన ‘సెంటిమెంటల్ వేల్యూ’, స్పెయిన్ డైరెక్టర్ ఆలివర్ లాక్సే రూపొందించిన ‘సిరాట్’, ట్యూనిషియా డైరెక్టర్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ సినిమాలు నామినేషన్ దక్కించుకున్నాయి.ఇంకా ఆస్కార్ కన్సిడరేషన్ విభాగంలో ‘మహావతార్ నరసింహా, కాంతార: ఏ లెజెండ్ చాప్టర్1, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సిస్టర్ మిడ్నైట్’ వంటి సినిమాలు పరిశీలన జాబితాలో ఉన్నప్పటికీ నామినేషన్ను దక్కించు కోవడంలో విఫలమయ్యాయి. అయితే ఆస్కార్ అవార్డుల ప్రజెంటర్స్లో భారతీయ నటి ప్రియాంకా చో్రపా కూడా ఉండటం అనేది భారతీయ ప్రేక్షకులను ఆనందపరిచే విషయం.పద్నాలుగో సారైనా అవార్డు వస్తుందా?దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఇప్పటికి 14 సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క అవార్డు వచ్చింది లేదు. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గాను పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు పాల్ థామస్కే దక్కింది.దీంతో ఆస్కార్ అవార్డు కూడా ఆయనకే రావొచ్చన్నది హాలీవుడ్ బలమైన నమ్మకం. మరోవైపు రేయాన్ కూగ్లర్ (సిన్నర్స్), ట్రియర్ (సెంటిమెంటల్ వేల్యూ), జాష్ షాఫ్టీ (మార్టీ సుప్రీం), క్లోయి జావ్ (హ్మామ్నెట్) లను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే...ఈ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో నామినేషన్స్ దక్కింది. ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) అమీ మాడిగన్ (వెపన్స్), బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) విభాగంలో లుడ్విగ్ గోరాన్సన్ వంటి వారు అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డుని ఏ స్టార్ చేజిక్కించుకుంటారు? ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమాకి దక్కుతుంది? అనే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోతుంది. – ముసిమి శివాంజనేయులు -
నీరా ఆర్య బయోపిక్లో?
బాలీవుడ్ హీరోయిన్, భార తీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం నీరా ఆర్యగా ఒదిగిపోవడానికి కసరత్తులు చేస్తున్నారని టాక్. ఎందుకంటే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తన కెరీర్లో ఎన్నో సవాల్తో కూడిన పాత్రలు చేసిన కంగన ప్రస్తుతం ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లోక్సభ సభ్యురాలు కావడమే. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న ఆమె గతంలోలా కాకుండా పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే నీరా ఆర్య బయోపిక్లో నటించడానికి అంగీకరించారట.స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు అనుబంధంగా రాణీ ఆఫ్ ఝాన్సీ మహిళా రెజిమెంట్ ఉండేది. ఇందులో కీలక సభ్యురాలిగా నీరా ఆర్య వ్యవహరించారు. భారతదేశ తొలి మహిళా గూఢచారిగా ఆమెకు పేరుంది. బ్రిటిష్ అధికారిని పెళ్లాడి, సిద్ధాంత విభేదాలతో విడిపోయిన నీరా ఆర్యని బ్రిటీష్ అధికారులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారట.1998 జూలై 26న ఆమె మృతి చెందారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చూపించిన ధైర్యసాహసాలు, గూఢచారిగా అద్భుతంగా పని చేసిన వైనం... ఇలా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన జీవితం ఆమెది. అలాంటి నీరా జీవితకథతో శివమ్ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని సమాచారం. కంగనాని కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి వివరించగా ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కంగన ప్రస్తుతం ‘భారత భాగ్య విధాత’ అనే సినిమా చేస్తున్నారు. -
అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్స్లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు. ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు. 'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు. మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
ఇండస్ట్రీకి వద్దామని చివరకు వ్యభిచారకూపంలోకి: నటి
గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు. ముందు పొగడ్తలునా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు. నన్ను నేను అమ్ముకోనుఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.మీటూమీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట షూటింగ్లో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.చదవండి: తెలుసు కదా.. షూటింగ్లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా -
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. -
సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఇకపై అవీ తప్పనిసరి..!
ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే?
సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్స్. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.విరోష్ రిసెప్షన్లో..ఇటీవల హైదరాబాద్లో జరిగిన విరోష్ (విజయ్ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్కు నీనా గుప్తా, భర్త వివేక్తో కలిసి హాజరైంది. స్టైలిష్గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.ప్రెగ్నెన్సీ రూమర్స్పై క్లారిటీదీంతో ఈ రూమర్స్పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్ 2 మూవీలో యాక్ట్ చేసింది.ప్రేమ- పెళ్లినీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్ పేరెంట్గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. Is Neena Gupta pregnant? pic.twitter.com/AlCeWzpvlG— Sapna Madan (@sapnamadan) March 5, 2026 చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్ పోస్ట్ -
బీ-టౌన్ డిజైనర్ల ఫేవరెట్ ఐకాన్గా అల్లు అర్జున్!
ఇది నిజంగా అరుదైన విషయమే అని చెప్పాలి. ఒక టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్లకు ఫేవరెట్ గా మారడం అనేది అంత ఈజీ కాదు. రజనీకాంత్ రోబో దగ్గర నుంచి గత కొంతకాలంగా మన దక్షిణాది సినిమాలు మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయి కలెక్షన్లు సాధిస్తుండవచ్చు గాక. కానీ మన టాలీవుడ్ హీరోలలో ఎవరూ బాలీవుడ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మొన్నటి హృతిక్ రోషన్, జాన్ అబ్రహాంలతో మొదలుకుని నిన్నటి రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్...తదితర టాప్ స్టార్స్ వెంటే క్యూ కట్టే సంప్రదాయం బాలీవుడ్ డిజైనర్స్ ది. అలాంటిది తొలిసారిగా ఉత్తరాది ఫ్యాషన్ పరిశ్రమ ఒక టాలీవుడ్ స్టార్ అంటే అమితాసక్తి చూపిస్తోంది. అతడే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.ఆరంభం నుంచే తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అల్లు అర్జున్ తొలిదశలోని దేశముదురు, హ్యాపీ, ఆర్య, ఇద్దరమ్మాయిలతో...వంటి సినిమాల్లో బన్నీ స్టైల్స్కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అలా తన సినిమాల ద్వారా స్టైలిష్ స్టార్ అనే సరికొత్త కిరీటాన్ని కూడా అయితే తెలుగులో ఆయన్ను స్టైలిష్ స్టార్గా చేసిన సినిమాలన్నింటిలోనూ బన్నీ.. అత్యాధునిక స్టైల్స్ చూపాడు కాబట్టి ఓకే.. అయితే కాస్త వంకరగా నడుస్తూ, ఊర మాస్ డ్రెస్సులు వేసుకున్న పుష్పరాజ్ గా ఆయన బాలీవుడ్ డిజైనర్లకు ఫేవరెట్గా మారడం విశేషం.ఇటీవల పలు సందర్భాల్లో అల్లు అర్జున్ ధరిస్తున్న డ్రెస్లు అన్నీ టాక్ ఆఫ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ షెర్వానీ లాంటివి బాలీవుడ్ స్టార్స్ కనుబొమలు ఎగరేసేలా చేశాయి. నీహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం దాదాపు రూ.3లక్షలు విలువ చేసే ఈ ఎత్నిక్ వేర్ను అల్లు అర్జున్ ధరించాడు. ఈ డ్రెస్ తో బన్నీ స్టైల్ వైరల్గా మారిపోయింది. అలాగే ఇటీవలి కాలంలో స్టార్ డిజైనర్గా దూసుకొచ్చిన అశ్విన్ మావ్లే కూడా పలు ప్రత్యేక సందర్భాల్లో బన్నీకి డిజైన్స్ క్రియేట్ చేశాడు. తాజాగా తన వెడ్డింగ్ యానివర్సరీ, అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా బన్నీ డ్రెస్సింగ్ స్టైల్స్ నెట్టింట్ సెన్సేషన్ గా మారాయి.దాంతో దేశంలోని టాప్ డిజైనర్లు అందరికీ అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రెస్ట్గా మారాడు. మరోవైపు బాలీవుడ్ మేగ్జైన్స్, వెబ్సైట్స్ అక్కడి స్టార్స్తో సమానంగా ఇంకా చెప్పాలంటే వారికన్నా మిన్నగా అల్లు అర్జున్ స్టైల్స్కి పెద్ద పీట వేస్తున్నాయి. ఇటీవలే తరుణ్ తహిల్యానీ, శంతను నిఖిల్, సబ్యసాచి తదితర టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ హైదరాబాద్లోనూ బొటిక్స్ ప్రారంభించిన నేపధ్యంలో దక్షిణాదిలో ప్రమోషన్స్ కోసం చూస్తున్న వీరందరికీ అల్లు అర్జున్ బెస్ట్ ఛాయిస్గా కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ఐకాన్స్టార్ నేషనల్ స్టైలిష్ స్టార్గా కిరీటం దక్కించుకోవడం తధ్యంగా కనిపిస్తోంది -
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
చైల్డ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది సీనియర్ నటి ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, ఆప్కీ కసమ్, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్.. చెండాలమైన లిరిక్స్: నటి -
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్.. చిన్నపిల్లలు కూడా!
సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే? -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
సర్జరీ ఫెయిల్.. దేవుడి ముందు మోకరిల్లి..: జేమీ లివర్
వెండితెరపై నవ్వులు పూయించే జానీ లివర్ ఒకానొక సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు. కన్నకొడుకు జెస్సీ చిన్నవయసులో ట్యూమర్తో బాధపడుతుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు. అతడే కాదు అతడి కుటుంబం కూడా మానసిక క్షోభ అనుభవించింది. ఈ విషయాన్ని తాజాగా జానీ లివర్ కూతురు జేమీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.కవర్ చేసేందుకు..ఆమె మాట్లాడుతూ.. నా తమ్ముడు స్కూల్లో ఉండగా వాడికి ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. మొదట్లో అదేంటో మాకూ అర్థం కాలేదు. కానీ, ఆ ట్యూమర్ సైజు పెరుగుతూ వాడిని ఇబ్బందిపెట్టింది. రానురానూ దాన్ని కవర్ చేయడం కోసం డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశాడు. మేమిద్దరం ఒకటే స్కూల్లో చదువుకునేవాళ్లం. తననెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ముంబైలో చేసిన మొదటి సర్జరీ విజయవంతం కాలేదు. అప్పుడు చాలా భయపడ్డాం. తన ఆరోగ్యం కుదుటపడాలని, బాగుండాలని నాన్న దేవుడి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించేవాడు.రెండుసార్లు సర్జరీజెస్సీ అడిగినవేవీ కాదనేవాళ్లం కాదు. అతడి కోరిక మేరకే అమెరికా ట్రిప్ వెళ్లాం. అనుకోకుండా అక్కడ సర్జరీకి ప్రయత్నించగా అది విజయవంతమైంది. రెండేళ్లలో రెండు సర్జరీలు జరిగాయి. దేవుడి దయ వల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాడు అని చెప్పుకొచ్చింది. జెస్సీ.. కిస్ కిస్కో ప్యార్ కరూన్, హౌస్ఫుల్ 4, భూత్ పోలీస్ వంటి సినిమాలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: సీజీ చేయడం రాక మా మీద తోస్తున్నారు: ఛోటా కె నాయుడు -
రణవీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ప్రియదర్శి..
-
ఆ రోజే థియేటర్స్లో ఆల్ఫా
ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ‘ఆల్ఫా’ చిత్రాన్ని తొలుత గత ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్కు ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్ను మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థలో ఆలియా చేసిన తొలి సినిమా ఇది. పూర్తి స్థాయి ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమా. ఆలియా, శార్వరీల యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్ను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
సల్మాన్ తో జోడీ?
సల్మాన్ ఖాన్ , సమంత జోడీగా నటించనున్నారా? అంటే... బాలీవుడ్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే ద్వయం సూపర్హీరో జానర్లో ఓ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుల్లో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు కనుక సమంత భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. అయితే ఈ సినిమాలో సమంత నటించడం లేదని, నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా స్క్రీన్ పై కనిపిస్తారా? లేక నిర్మాతగా భాగం అవుతారా? అనేది చూడాలి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మే 15న రిలీజ్ అవుతోంది. -
50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్సూన్ వెడ్డింగ్'తో నటుడిగా పరిచయమైన రణ్దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్స్టర్, జన్నత్ 2, రిస్క్, కర్మ ఔర్ హోలీ, కాక్టైల్, జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్గా అలరించాడు.అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్ని మణిపురి సంప్రదాయంలో రణ్దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) -
వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
ఇప్పుడంటే సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ లేనేలేవంటోంది సీనియర్ నటి సుప్రియ పాఠక్. 1980వ దశకంలో సెట్లో కనీస వసతులు లేకపోయినా పెద్దగా లెక్కచేయలేదని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ పాఠక్ మాట్లాడుతూ.. మేము ప్యాషన్తో యాక్ట్ చేసేవాళ్లం. మాకిచ్చిన పాత్రలను తప్ప మిగతా వేటినీ మేము పట్టించుకునేవాళ్లం కాదు. కానీ రానురానూ కొన్ని విషయాలు పట్టించుకోవాలని అర్థమైంది. బాత్రూమ్స్ తప్పనిసరిషూటింగ్ గ్యాప్లో కూర్చోవడానికి కొంత ప్లేస్ కావాలి. మహిళలకు ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండాలి. ఇవి కనీస అవసరాలు అని తెలుసుకున్నాం. సెట్లో అందరూ నిలబడి ఉన్నప్పుడు నిర్మాతలకు కూడా అర్థమైంది. కనీసం కూర్చోవడానికి ఏదైనా వసతి కల్పించాలని వాళ్లూ రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్కు వెళ్లినప్పుడు వాష్రూమ్స్ వసతి అనేది ఉండదు.కనీస వసతి అవసరంచలిలో లేదా ఎండలో షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు, టీ అనేవి అందించడం కూడా ముఖ్యమే! ఇప్పుడు షూటింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదాహరణకు 'మిర్చి మసాలా' సినిమా షూటింగ్ ఒక పల్లెలోని మిర్చి ఫ్యాక్టరీలో జరిగింది. నాతోపాటు పది మంది మహిళలు ఫ్యాక్టరీలో షూటింగ్లో పాల్గొన్నారు. రోజంతా మిర్చి ఫ్యాక్టరీలో..అసలే ఎండలు మండిపోతుంటే ఆ ఘాటు తట్టుకుని రోజంతా అక్కడే ఉండేవాళ్లం. వెనకాల ఉన్న గడ్డికుప్పలపై సేదతీరేవాళ్లం. అది పెద్ద సమస్యలా ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే మేమంతా ప్యాషన్తో పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పుకొచ్చింది.సినిమాసుప్రియ పాఠక్.. గుజరాతీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కలియుగ్, బజార్, రామ్లీలా, మాసూమ్, మిర్చి మసాలా వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అరవింద సమేత వీర రాఘవలో జేజిగా, గద్దలకొండ గణేశ్లో హీరో తల్లిగా యాక్ట్ చేసింది. చివరగా అస్సి అనే హిందీ చిత్రంలో కనిపించింది. కిచిడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. -
మరో సినిమా ఒప్పుకున్న ధురంధర్ హీరోయిన్?!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్ 2తో ముందుకు రాబోతోంది.రూమర్స్పై క్లారిటీఅయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో సారా.. హీర్ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్పై కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. నేనే చెప్తా..ప్రస్తుతం మేమంతా ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్ 2 తర్వాతే సారా తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్గా ధురంధర్ 2 వస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్ ఇండియావైడ్గా విడుదల కానుంది. Sara Arjun has not signed any other film. We are just waiting for D 2. She has not signed any film and has not met anyone regarding any project. So please relax, guys. I will personally update you about her next project. Just wait all the other news is only rumours🥰🧿❤️ pic.twitter.com/njCE7MsKIR— Mukesh Chhabra CSA (@CastingChhabra) March 7, 2026 చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు -
రిలీజ్కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
సల్మాన్ సినిమాలో హీరోయిన్ సమంత..
-
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
భారీ అంచనాలతో.. ధురంధర్ 2.. ట్రైలర్ చూస్తే పూనకాలే
-
భార్యాభర్తలిద్దరం పని చేస్తామంటే కుదరదు: కరీనా
రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని వాదించి వార్తల్లోకెక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తల్లయ్యాక అటు కెరీర్ను, ఇటు పిల్లల బాధ్యతను చూసుకోవడం కష్టమైన పని అని.. కొత్తగా తల్లయిన వారికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు అన్ని సినిమాలకు అది వర్కవుట్ కాదని విమర్శించారు. తల్లయ్యాక ఎలా?అటు దీపికా... పనిగంటలతో పాటు ఇతరత్రా డిమాండ్స్ కారణంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తల్లయ్యాక సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారన్న ప్రశ్నపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ద బకింగ్హామ్ మర్డర్స్ మూవీ షూట్ కోసం లండన్లో 35 రోజులు ఉండాల్సి వచ్చింది. ముందుగానే ప్లాన్ఎప్పుడు వెళ్లాలి? మళ్లీ ఎప్పుడు తిరిగి రావాలి? అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక మధ్యలో ఇండియా తిరిగొచ్చాను. పిల్లలతో గడిపాను. ఆ సమయంలో మిగతావారిపై చిత్రీకరణ జరిపారు. నేను తిరిగి వెళ్లగానే నా పాత్ర షూటింగ్ పూర్తిచేశారు. నేను అదృష్టవంతురాలినిచిత్రయూనిట్ నన్ను అర్థం చేసుకుని సహకరించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పైగా ఆ సమయంలో సైఫ్ ఇంట్లో పిల్లలతోనే ఉన్నాడు. మేమిద్దరం పని కోసం పరిగెడుతూ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేము. ఒకరు పని చేస్తున్నప్పుడు మరొకరు ఇంటిపట్టున ఉండి పిల్లల్ని చూసుకోవాలి. అలా అర్థం చేసుకునే భాగస్వామి ఉండాలి అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.చదవండి: రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్.. అంతా ఒక్కడే తింటాడా? -
రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్..
మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్ మాగంటి.మర్చిపోలేని అనుభవంఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్బీర్ తాత రాజ్కపూర్ పెద్ద స్టార్, తండ్రి రిషి కపూర్ గొప్ప స్టార్,.. రణ్బీర్ కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. ఒక ప్లేటు నిండా చాక్లెట్స్, చిప్స్తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్ది అన్నాడు. సర్, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్బీర్.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.సినిమాఅతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్బీర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్కు సీక్వెల్గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్లో భాగం కానున్నాడు.చదవండి: ఆస్కార్ నుంచి ఆహ్వానం -
ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
సినీ తారలు మాత్రమే కాదు.. ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆ రోజులు తిరిగి వస్తే బాగుంటుందని అందరం అనుకుంటాం. కానీ అది జరగదని మనకు కూడా తెలుసు. ఆ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగుతాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అక్క జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా తనతో ఉన్న చిన్నప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అస్సలు జాన్వీకపూర్ చిన్నప్పుడు ఇలా ఉండేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ చాలా క్యూట్ క్యూట్గా కనిపించారు. జాన్వీతో చిన్నప్పటి ఫోటోలు, అమ్మ శ్రీదేవితో ఉన్న పిక్స్ను షేర్ చేసింది. నా సోదరి, నా ప్రాణ స్నేహితురాలు, నా సలహాదారు, నా గురువు, నా క్రైమ్ పార్ట్నర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు నా జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండి..ఈ రోజు ఒక వ్యక్తిగా మారడానికి నన్ను పెంచడంలో సహాయపడినందుకు ధన్యవాదాలు తెలిపింది. నువ్వు లేకుండా నేను జీరో.. నా జీవితంలో ఎల్లప్పుడు నీతోనే ఉండాలని ఆశిస్తున్నాను.. లవ్ యూ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరో సినిమా చేస్తోంది. రామ్ చరణ్- బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) -
ఆస్కార్ నుంచి ఆహ్వానం
ప్రియాంకా చోప్రాకు మరోసారి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ నెల మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ ప్రెజంటర్గా పాల్గొననున్నారు ప్రియాంకా చోప్రా. ఆమెతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ అన్నే జాక్వెలిన్ హతావే, గ్వినేత్ పాల్ట్రో, రాబర్ట్ డౌనీ జూనియర్, ఆర్నేట్, పాల్ మెస్కల్ ప్రజెంటర్స్గా పాల్గొననున్నట్లు ఆస్కార్ అకాడమీ కమిటీ ప్రకటించింది.ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రియాంకా చోప్రా ప్రజెంటర్గా పాల్గొనడం ఇది తొలిసారి కాదు. 2016లో జరిగిన 88వ ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంక తొలిసారి ప్రజెంటర్గా వ్యవహరించారు. ఇప్పుడు పదేళ్లకు ఈ వేదికపై ఆమె మరోసారి విజేతలకు ఆవార్డులను ప్రదానం చేయనున్నారు.వారణాసి సినిమా ఓ గొప్ప అనుభవం: ప్రియాంకా చోప్రా మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చో ప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జార్జియాలో ప్రారంభమైంది. నెక్ట్స్ షెడ్యూల్ను అంటార్కిటికాలో ప్లాన్ చేశారని సమాచారం. కాగా, గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలోని ఫారెస్ట్ లొకేషన్స్లో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.ఆ షూటింగ్ అనుభవాలను ప్రియాంకా షేర్ చేసుకున్నారు. ‘‘కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయడం గొప్ప అనుభూతి. వేల సంఖ్యలో అడవి జీవులు వలస వెళ్తున్న సమయంలో వాటి మధ్య మేం ఉన్నప్పుడు షూటింగ్ జరిగింది. ఆ జంతువుల ముఖాలను అంత దగ్గరగా చూస్తుంటే ఈ భూమ్మీద అవి ఎన్నో ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయని అర్థమైంది. ప్రకృతి ఎంత శక్తిమంతమైనదో, జీవపరిణామ క్రమం ఎంత గొప్పదో వాటిని చూస్తే తెలిసింది’’ అని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు ప్రియాంకా చోప్రా. -
మూడెకరాలు, రూ. 35 కోట్లు : అయోధ్యలో ప్లాట్ కొన్న బిగ్బీ
బిగ్బీ అమితాబ్ బచ్చన్ విలువైన ప్లాట్ను కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ అయోధ్యలో 2.67 ఎకరాల భూమిని రూ. 35 కోట్లకు దక్కించుకున్నారు. అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ జన్మ భూమి ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ ప్లాట్ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని HoABL హౌస్ ఆఫ్ అభినందన్లో ఉంది. ఇక్కడే బచ్చన్ మరో రెండు ప్లాట్లను కలిగి ఉండటం విశేషం. HoABL ప్రకటన ప్రకారం, ఈ అమ్మకాన్ని బచ్చన్ కుటుంబ యాజమాన్యంలోని సంస్థ AB Corp ప్రతినిధి నిర్వహించారు. HoABL తో బచ్చన్ చేసిన నాల్గవ కొనుగోలు ఇది, మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్ర రిసార్ట్లో సోల్ దే అలీబాగ్ ప్రాజెక్ట్లో అమితాబ్కు ఒక స్థలం ఉంది. భూమిపై పెట్టుబడుల తరతరాల విశ్వాసాన్ని బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందనీ, అయోధ్యపై విశ్వాసం అనేది తరతరాలుగా పంచుకున్న వారసత్వం అన్నారు. HoABLలో, భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తామని HoABL చైర్మన్ అభినందన్ లోధా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమానికాగా ఆయోల్య ఆలయ నిర్మాణం, అలాగే విశాలమైన రోడ్లు, మెరుగైన రైల్వే స్టేషన్లు మరియు కనెక్షన్లు మరియు నగరానికి ప్రత్యేక విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత అయోధ్యలో భూమి ధరలు గణనీయంగా పెరిగాయి. HoABL, తదితర స్థానిక డెవలపర్లు, ప్రాజెక్టులతో పాటు రానున్న రోజుల్లో టూరిజం అభివృద్ధిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు కల్పించడానికి హోటళ్ళు,రిసార్ట్లను కూడా నిర్మిస్తున్నారు. HoABL ప్రస్తుత ప్రాజెక్ట్, సరయులో, బ్రూక్ఫీల్డ్ యాజమాన్యంలోని హోటల్ చైన్ ది లీలా ప్యాలెస్లు, హోటల్స్ , రిసార్ట్స్ నిర్వహించే హోటల్ కూడా ఉంది.ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్ తప్పదా? వైరల్ వీడియో(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్) -
వాయిదా రూమర్స్కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'ధురంధర్' తొలి భాగం.. భారత్తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్డ్రాప్లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) -
కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్
హీరోయిన్ కృతిసనన్పై యామీ గౌతమ్ అసూయతో రగిలిపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్లో కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అయితే ఈ విజయాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. లైక్ కొట్టడంతో వివాదంకృతీ సనన్కు బదులుగా హక్ సినిమాకుగానూ యామీ గౌతమ్కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని ఓ వీడియో క్రియేట్ చేశారు. అయినా అవార్డు గెలిస్తే మాత్రమే ఉత్తమ నటి అన్న అభిప్రాయాన్ని తాను ఏకీభవించను. ఈ అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో పొందుపరిచారు. కృతిని విమర్శిస్తున్న ఆ పోస్టుకు యామీ లైక్ కొట్టడంతో వివాదం మొదలైంది. అవమానించనుతాజాగా ఈ వ్యవహారంపై యామీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ఒక నటిని అవమానించేలా ఉన్న వీడియోను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజు ఎంతోమంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అలా వాటిని చూసే క్రమంలో పొరపాటున లైక్ పడి ఉండవచ్చు. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా నేను లైక్ చేయలేదు.క్లారిటీనా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు చేయలేదు. నా పనేంటో నేను చూసుకుని ముందుకు కదిలాను. క్లిక్బైట్ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాల్ని పెద్దది చేయకండి. నాకంటూ మంచి పేరు, గౌరవం ఉందని ఆశిస్తున్నాను. నాకెటువంటి పీఆర్ టీమ్ లేదు. అలాగే అవార్డులపై నా అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించాను. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. The reel Yami is referring to - pic.twitter.com/phE5GTvjUp— Pan India Review (@PanIndiaReview) March 5, 2026చదవండి: క్యూటీ.. నీవల్లే ఇదంతా: అల్లు అర్జున్ పోస్ట -
పెద్ది హీరోయిన్ బర్త్ డే.. కాలి నడకన తిరుమలకు..!
బాలీవుడ్ భామ, పెద్ది మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల చేరుకున్నారు. ఈ శుక్రవారం ఆమె బర్త్ డే కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అలిపిరి నడకదారిలో నడుచుకుంటూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. జాన్వీ కపూర్తో పాటు నటి మహేశ్వరి రేపు స్వామివారిని దర్శించుకోనున్నారుబాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీలో హీరోయిన్గా కనిపిచంనుంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది. మిరాకిల్ బేబీఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది. మాల్తీ ఏం చేస్తుందో? కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి. నా ఆలోచనంతా తన చుట్టూనే..తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా! -
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్, హిందీ బిగ్బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభల్. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.చిన్నప్పటినుంచి కష్టాలు'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.పెళ్లి ఇష్టం లేదుసోషల్ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. వార్నింగ్కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.బోరుమని ఏడ్చిన బిగ్బాస్ కంటెస్టెంట్ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్ అని అనురాగ్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. అనురాగ్ భార్య గతేడాది సెప్టెంబర్లో గర్భం దాల్చింది.చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్ -
రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ 'సేక్రెడ్ గేమ్స్' నటి
బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ ప్రారంభదశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇన్ఫిల్టరేటింగ్ డక్టల్ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్ 1లో ఉంది. రొమ్ము క్యాన్సర్ఇప్పుడు మీరిది చదువుతున్నారంటే ఈ వ్యాధి గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పేందుకు ధైర్యం కూడదీసుకున్నట్లే లెక్క! నేను రొటీన్ చెకప్కు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తూ ప్రారంభం దశలోనే గుర్తించగలిగాం. లెక్కలేనన్ని టెస్టులు, శస్త్రచికిత్సలు.. ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తోంది. కానీ మీ ప్రేమాభిమానాలే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాయి. భయం పటాపంచలుసర్జరీ తర్వాత అమ్మానాన్న ముఖం చూడగానే నాలో భయం పటాపంచలై కొత్త శక్తి ప్రవహించింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వు స్ట్రాంగ్ లేడీవి.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.కెరీర్రాజశ్రీ దేశ్పాండే తలాష్ (2012) చిత్రంతో బాలీవుడ్లో తన కెరీర్ ఆరంభించింది. కిక్, మామ్, ద స్కై ఈజ్ పింక్, జోరం వంటి చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కుచ్ తో లోగ్ కహేంగే, 24: ఇండియా సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది. సేక్రెడ్ గేమ్స్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్తో విశేషమైన పాపులారిటీ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) చదవండి: నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి -
నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి
ధురంధర్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్ అంటూ సాగే ఐటం సాంగ్లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్ తెచ్చుకుంది ఆయేషా ఖాన్. అయితే గతంలోనూ ఓ సాంగ్లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్ చేశారని చెప్తోంది. సడన్గా తీసేశారుతాజాగా ఓ ఈవెంట్లో ఆయేషా ఖాన్ మాట్లాడుతూ.. టీ సిరీస్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్ హీరోయిన్గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. నిజంగా బాధాకరంఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్ చేస్తారు.ఫేమస్ కాకపోయుంటే..అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.సినిమాసీరియల్స్లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ 17వ సీజన్తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్ బుష్, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్, కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 సినిమాలు చేసింది.చదవండి: విజయ్- రష్మిక.. ఎవరు ప్రపోజ్ చేశారంటే? -
టాలీవుడ్పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. దీని వల్ల పెట్రోలు, బంగారం ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని భారతీయులు కంగారు పడుతున్నారు. మరోవైపు ఇదే యుద్ధాన్ని చూసి టాలీవుడ్ కూడా భయపడుతోంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఇంతకీ అవేంటి? రాబోయే పాన్ ఇండియా మూవీస్పై ఈ యుద్ధం ప్రభావం ఎంత ఉండొచ్చు?(ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు)బలమైన మార్కెట్ఒకప్పుడు అంటే తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్తో విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చిత్రాలకు అమెరికన్ మార్కెట్ ఎంత కీలకమో.. అరబ్ దేశాల్లోని మార్కెట్ కూడా అంతే కీలకం. అరబ్ దేశాల్లో పనుల కోసం వెళ్లే చాలామంది భారతీయులు.. అక్కడ మూవీస్ బాగానే చూస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అటు థియేటర్లలో మూవీస్ రిలీజులు కష్టమే. ఒకవేళ విడుదల చేసినా జనాలు.. వచ్చి చూడటం కూడా కొంతవరకు అనుమానమే. రాబోయే కొన్నినెలల పాటు అరబ్ దేశాల్లో మన సినిమాలకు మార్కెట్ కాస్త తగ్గొచ్చు.షూటింగ్స్ బంద్మన దేశంలో తీసే చాలా సినిమాలని విదేశాల్లోనూ తెరకెక్కిస్తుంటారు. మరీ ముఖ్యంగా దుబాయితో పాటు మిగతా అరబ్ కంట్రీస్లో పాటల షూటింగ్స్ లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలావరకు చిత్రీకరణలు నిలిచిపోయాయి. కొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు. అయితే అరబ్ దేశాల్లో చాలావరకు షూటింగ్స్కి సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మరో చోటకు వెళ్లాలి అంటే ఆయా పరికరాల్ని అన్నింటినీ మరోచోటకు తీసుకెళ్లడం లాంటివి కాస్త కష్టతరమైన విషయమే అని చెప్పొచ్చు.ప్రయాణ ఆంక్షలుఇదే యుద్ధం వల్ల చాలావరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని వేరే వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో నటీనటులు, సాంకేతిక సిబ్బంది, నిపుణులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన పాన్ ఇండియా సినిమాలకు చాలావరకు విదేశాల్లోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుంటారు. యాక్షన్ సీన్స్ లాంటి వాటికోసం విదేశాల నుంచి సంబంధిత టెక్నీషియన్స్ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు యుద్ధం ఆగేంతవరకు ఈ విషయాల్లో సినిమా బృందాలకు ఇబ్బందులు తప్పవు.విడుదల వాయిదాఇదే యుద్ధ ప్రభావం.. రాజమౌళి తీస్తున్న 'వారణాసి', అల్లు అర్జున్-అట్లీ చేస్తున్న సినిమాలతో పాటు పలు చిత్రాల విడుదల తేదీలపై కచ్చితంగా పడే అవకాశమైతే ఉండొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధాన్ని విరమిస్తాయనేది తెలియట్లేదు. ఒకవేళ రాబోయే కొన్నిరోజుల్లో విరమించినా సరే మన పాన్ ఇండియా సినిమాలకు అవసరమయ్యే విదేశీ సాంకేతికత, నిపుణుల విషయంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తొచ్చు. అది పరోక్షంగా విడుదల తేదీలపై పడటం గ్యారంటీ.ఆర్థిక భారంయుద్ధం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సినిమా షూటింగ్ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ప్రొడక్షన్ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగొచ్చు. అదే జరిగితే బడ్జెట్ సమస్యలతో సినిమాల ఇంకాస్త లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇదే యుద్ధం కారణంగా చాలామంది బాలీవుడ్ నటీనటులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్లందరూ స్వదేశానికి వచ్చేసినా సరే భయమనేది కొన్నాళ్ల పాటు ఉండిపోతుంది. దీంతో షెడ్యూల్స్, షూటింగ్స్ ఆలస్యం కావొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఆయా దేశాలపైనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమపైనా పరోక్షంగా పడింది. రూ.10 వేల కోట్లకు పైనే నష్టం ఉండొచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్) -
తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు
ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్.. చాన్నాళ్ల క్రితమే వాటిని పక్కనబెట్టేసింది. ఓ వైపు ఫ్యామిలీ, మరోవైపు సినిమాలు చేస్తూ బతికేస్తోంది. రీసెంట్ టైంలో అయితే సన్నీ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వీడియోలో కనిపించింది. సన్నీ ఇంటికి వెళ్లిన ఫరా ఖాన్.. చాలాసేపు ముచ్చటించింది. మిగతా వాటి సంగతేమో గానీ తన కూతురు గురించి సన్నీ లియోన్ చెప్పిన ఓ విషయం మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.(ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)డేనియల్ వెబర్ని పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ లియోన్.. లాతుర్కి చెందిన నిషా అనే పాపని దత్తత తీసుకుంది. తర్వాత సన్నీ దంపతులకు కవల అబ్బాయిలు పుట్టారు. నిషాకి ఇప్పుడు తొమ్మిదేళ్లు. అయితే ఈ వయసులోనే తన కూతురు.. బూ బాక్స్ అనేదాన్ని కనిపెట్టిందని సన్నీ బయటపెట్టింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.సన్నీ లియోన్ మాట్లాడుతూ.. 'బూ బాక్స్' అనేది టూ ఇన్ వన్ టిష్యూ హోల్డర్. సాధారణంగా టిష్యూని ఉపయోగించిన తర్వాత ఓ డస్ట్ బిన్లో పడేస్తాం. లేదంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. ఇది గమనించిన నిషా.. టిష్యూ బాక్స్ పక్కనే చిన్న చెత్త బుట్ట కలిపి ఉండేలా దీన్న డిజైన్ చేసింది. అంటే టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే ఉన్న బిన్లో పడేయొచ్చు. దీంతో శ్రమ తగ్గుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది.అయితే దీన్ని తయారు చేయడం వెనక ఓ కారణముంది. ముంబైలోని దుమ్ము వల్ల నిషాకు ఎప్పటికప్పుడు అలర్జీ వచ్చేది. దానికోసం టిష్యూలు వాడి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పడేసేసరికి తిట్టేదాన్ని. అప్పుడు నిషాకు ఈ ఆలోచన వచ్చింది. ఓ టిష్యూ బాక్స్కు ప్లాస్టర్తో డిస్పోజబుల్ కప్ అతికించి నాకు చూపించింది. అదే ఇప్పుడు ఓ కమర్షియల్ ప్రొడక్ట్గా మారి నిషాకు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది. చిన్న వయసులోనే స్వశక్తి డబ్బు సంపాదిస్తోంది అని సన్నీ లియోన్ గర్వంగా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్) -
జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
బాలీవుడ్తోనే మొదలైన కెరీర్.. ఫైనలియర్లో ఉన్నప్పుడు!
మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్ కెరీర్ గురించి ఓ సారి చూసేద్దాం..బాలీవుడ్ మూవీతో కెరీర్ మొదలుప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థాపకుడు అల్లు అరవింద్ చిన్న కుమారుడే అల్లు శిరీష్. అరవింద్ పెద్ద కుమారుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కంటే ముందుకొత్త జంట చిత్రంతో క్రేజ్ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్ బర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్ మొదలవడానికే ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఆమిర్ ఖాన్కు అభిమానిఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. లగాన్, గులాం సినిమాలు చూశాక ఆమిర్ ఖాన్కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.అదే ఎక్కువ ఇష్టంతమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్ -
దురంధర్ 2 రివ్యూ వచ్చేసింది.. నా భర్త ఇరగదీశాడు అంటున్న యామి..!
-
దుబాయ్లో చిక్కుకుపోయా.. నన్ను భారత్కు తీసుకురండి!
ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా చిక్కుకుపోయింది. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగొచ్చే దారి కనిపించడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది.సాయం చేయండిగౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీగారు.. ప్రస్తుత సంక్షభ పరిస్థితుల్లో నేను దుబాయ్లో చిక్కుకున్నాను. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఇండియాకు ఎలా రావాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది సోనాల్.సినిమాసోనాల్ చౌహాన్ మోడల్, సింగర్, హీరోయిన్. జన్నత్ చిత్రంతో హిందీలో, రెయిన్బో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, ఎఫ్ 3, ద ఘోస్ట్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా ఆదిపురుష్ మూవీలో మండోదరిగా యాక్ట్ చేసింది. చివరగా దర్ద్ (2024) అనే ద్విభాషా చిత్రంలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: ఇషితా దత్తా -
తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: బాలీవుడ్ నటి
తెలుగు చిత్రం చాణక్యుడుతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది ఇషితా దత్తా. తర్వాత మాత్రం బాలీవుడ్లోనే సెటిలైంది. దృశ్యం, దృశ్యం 2, దేదే ప్యార్ దే 2 వంటి హిందీ చిత్రాల్లో తళుక్కుమని మెరిసింది. రిష్తాన్ కా సౌధాగర్: బాజీగర్ సీరియల్ చేసే సమయంలో నటుడు వస్తల్ సేత్తో ప్రేమలో పడింది. 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో బాబు జన్మించగా 2025లో పాప పుట్టింది.తల్లి జీవితం ఇంతే..తల్లయ్యాక తన జీవితమే మారిపోయిందంటోంది ఇషితా దత్తా. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిక్కుల జుట్టు, ఇంట్లో ఎక్కడపడితే అక్కడ బొమ్మలు.. ఎప్పటికీ పూర్తవని పనులు.. అవి కాకుండా సంబంధం లేని ప్రదేశాల్లో కూడా స్టిక్కర్లు.. తల్లి జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఇందులో స్వచ్ఛమైన ఆనందం దాగి ఉంది అని రాసుకొచ్చింది. ఇకపోతే ఇషిత తన పిల్లల ఆటలు, అలకలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.చదవండి: సన్యాసం తీసుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ -
సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!
ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్లో పేరు వినిపించడంతో వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్కు వచ్చిన ఆమె సన్యాసిగా మారింది. కిన్నెర అఖాడాలో చేరి మహా మండలేశ్వర్ పదవి అందుకుంది. బుల్లితెరపై రీఎంట్రీఅయితే కొన్ని వారాల క్రితమే ఆ హోదా నుంచి తప్పుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కనిపించనుంది. హిందీలో ప్రసారమవుతున్న లాఫ్టర్ చెఫ్ మూడో సీజన్లో అతిథిగా అలరించనుంది. ఈ రియాలిటీ షో సెట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీరు గమించారో, లేదో కానీ టీవీలో కనిపించక 25 ఏళ్లవుతోంది. అది కూడా ముఖ్యమేరెండున్నర దశాబ్దాల తర్వాత బుల్లితెరపై మళ్లీ కనిపించబోతున్నాను. చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. అందరూ లైఫ్లో బిజీ అవడంతో పాటు సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. మధ్యమధ్యలో హాయిగా నవ్వుకోవడం కూడా ముఖ్యమే.. ఇలాంటి షోలు అందుకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీహార్ జైల్లో నాలుగు నెలలు.. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు: నటి -
తీహార్ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి
మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించింది నటి, ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్. తాజాగా తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. సందీప మాట్లాడుతూ.. నా శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడెందుకింత శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో..అక్కడి వాతావరణం కూడా భయానకంగా ఉంది. గత జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటాను, ఆ కర్మ నన్ను ఇలా వెంటాడుతోందని భావించాను. దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్లు అని ఎన్నోసార్లు వేడుకున్నాను. జైల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి మనల్ని కలుస్తుంటే మరింత బాధేసేది. నా వల్ల వారు జైలుకు రావాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. కానీ నేనేంటో తెలిసిన నా పేరెంట్స్, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు.కన్నీళ్లు ఆగవుతీహార్ జైల్లో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటికీ ఆ జైలు జీవితం గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆగవు. వాష్రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి. నేలపై పడుకోవాలి. తిండి దారుణంగా ఉంటుంది. నాలుగు రోటీలు, అన్నం, పప్పు.. రోజూ ఇదే ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. కొందరు పోలీసులు జాలి చూపిస్తారు. మరికొందరు వారి ఫ్రస్టేషన్, కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారు. ఇద్దరు మహిళలకు సాయంకానీ జైల్లో డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేదం,న టే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ రూ.3000 దొంగతనం చేసిన కేసులో నాలుగునెలలుగా జైల్లో ఉంటోంది. తనకు అంధురాలైన తల్లి ఉంది, తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. నేను బయటకు వచ్చాక తనకు సాయం చేస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. మరో మహిళ.. భర్త చేసిన ఆర్థిక మోసానికిగానూ ఆరునెలలుగా శిక్ష అనుభవిస్తోంది. తనకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చేందుకు సహకరించాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లక్కీ మూవీ.. ఓటీటీ రివ్యూ -
ఖరీదైన హీల్స్ ధరించిన హీరోయిన్.. చెప్పుల ధర వేలల్లో కాదు!
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.గోవా ట్రిప్తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్ పొట్టి డ్రెస్లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్ డాల్స్ అండ్ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్కు చెందిన చెప్పులు.చెప్పుల ధర ఎంతంటే?ఆ హీల్స్ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు, సీరమ్ రూ.50 వేలు అని తెలిపాడు. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి -
అప్పటివరకు నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్ 2". అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్ శెట్టి.మాట మీదే ఉన్నా..రూ.500 కోట్ల క్లబ్లో చేరిన తర్వాతే బోర్డర్ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్ దాటేస్తుంది. సినిమాఅప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్ వరకు వెళ్లాను. అహాన్ ఇంట్లో ప్రాక్టీస్ చేసిన డైలాగులను థియేటర్లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్గా బోర్డర్ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్, ప్రణవ్ వశిష్ట్, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా? -
ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కెరీర్ పరంపర (1993) సినిమాతో మొదలైంది. అయితే దీనికంటే ముందు సైఫ్ బేకుడి చిత్రంతో పరిచయం కావాల్సి ఉంది. కానీ గర్ల్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్తేనే సినిమా ఛాన్స్ అని డైరెక్టర్ కండీషన్ పెట్టాడని, దానికి సైఫ్ నిరాకరించాడని, దాంతో ఈ సినిమా అతడి చేజారిందని ప్రచారం జరిగింది.అసలేం జరిగిందంటే?దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై బేకుడి దర్శకుడు రాహుల్ రవాలి స్పందించాడు. ఆనాడు అసలేం జరిగిందనే విషయాలను గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. గర్ల్ ఫ్రెండ్ ఉందన్న కారణంతో సైఫ్ అలీఖాన్ను రిజెక్ట్ చేశానన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం. అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. అప్పుడలా...షూటింగ్కు సరిగా వచ్చేవాడే కాదు. దానివల్ల నేను ఒత్తిడికి లోనయ్యాను. యాక్టింగ్ బాగా చేస్తాడు, కానీ షూటింగ్కు రాకుండా చిరాకు తెప్పించేవాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ తనలో చాలా మార్పు వచ్చింది అని చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే.. ఆషిక్ ఆవారా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమామై ఖిలాడీ తు అనారి, ఏక్తా రాజా, హమేశా, కీమత్: దే ఆర్ బ్యాక్, కచ్చే ఢాగే, దిల్ చహతా హై, డర్నా మానా హై, హమ్ తుమ్, ఓంకార, లవ్ ఆజ్ కల్, తానాజీ ఇలా అనేక సినిమాలు చేశాడు. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం హైవాన్, హమ్ హిందుస్తానీ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె -
ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్
ఇప్పుడంతా ఓటీటీ జమానా. ఓ భాషలో అద్భుతమైన సక్సెస్ చేసుకున్న ఏ సినిమా అయినా సరే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అలా గతేడాది గుజరాతీలో తీసిన ఓ డివోషనల్ మూవీ.. బంపర్ బ్లాక్బస్టర్ అయింది. రూ.50 లక్షల బడ్జెట్తో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్ అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి మూకీ సినిమా)గుజరాతీ సినీ ఇండస్ట్రీలో తొలి రూ.100 కోట్ల వసూళ్లు అందుకున్న సినిమా 'లాలో-కృష్ణ సదా సహాయతే'. గతేడాది అక్టోబరు 10న రిలీజ్ కాగా.. నవంబరు 28న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. లాంగ్ రన్లో కళ్లు చెదిరే కలెక్షన్ అందుకుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం సృష్టించింది. దీనికి కారణం కథలోని బలం.2019లో గుజరాతీలో రిలీజైన 'చాల్ జీవీ లాయియే' చిత్రం రూ.50 కోట్ల వసూళ్లు సాధించగా.. 'లాలో' సినిమా దాన్ని అధిగమించేసింది. రూ.100 కోట్ల ఘనత సాధించిన తొలి గుజరాతీ మూవీగా నిలిచింది. కృష్ణుడి లీలలు చూపించే బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అంకిత్ సఖియా దర్శకుడు. రీవా రచ్, శ్రుహద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ, గుజరాతీ భాషల్లోనే చూడొచ్చు.'లాలో-కృష్ణ సదా సహాయతే' విషయానికొస్తే.. లాలో పాత్రధారి ఓ ఆటో డ్రైవర్. గతంలో జరిగిన సంఘటనల వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. తాగుడుకు బానిసవుతాడు. ఓసారి అనుకోకుండా ఒక ఫామ్హౌస్లో చిక్కుకుపోతాడు. ఆ ఏకాంతంలో అతడికి కృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి. ఆ ఆధ్యాత్మిక చింతనలో ముక్తి మార్గంవైపు నడుస్తాడు. గతం తాలూకు బాధలు, తన మనసులోని అలజడిని దాటుకుని కొత్త ఆశలతో ముందుకెళ్లడం మొదలపెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్ సిరీస్ రివ్యూ) -
ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంటూనే ఉంది. స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికా సైడ్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ది వైట్ లోటస్లో యాక్ట్ చేసే అవకాశాన్ని కూడా వదిలేసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది.హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి అవుట్ది వైట్ లోటస్ నాలుగో సీజన్ కోసం మేకర్స్ దీపికను సంప్రదించారట! అయితే ఈ ప్రాజెక్ట్లో నటించాలంటే ఆడిషన్ తప్పనిసరి అని టీమ్ చెప్పిందట. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తనకు ఆడిషన్ ఏంటన్న భావనతో దీపికా ఈ ఛాన్స్ను వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీపిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అరవడం పెద్ద విషయం కాదుప్రశాంతంగా ఉండటమే అన్నింటికంటే గొప్ప వరం. సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడటం పెద్ద విషయం కాదు. దానికి ఎటువంటి శక్తి, బలం అవసరం లేదు. కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్థబ్ధుగా, ప్రశాంతంగా ఉండాలి, భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదు. ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. అదొక శక్తి. మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థంపర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్గా ఉండటమే అన్నింటికంటే పెద్ద సూపర్ పవర్ అని దీపికా పదుకొణె రాసుకొచ్చింది.చదవండి: హీరోలు రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే: తాప్సీ -
హీరోలు నన్ను రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే..: తాప్సీ
'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది తాప్సీ పన్ను. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, సాహసం, గేమ్ ఓవర్, మిషన్ ఇంపాజిబుల్ ఇలా తెలుగులో అనేక సినిమాలు చేసింది. తమిళ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది. సౌత్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడే పాగా వేసింది.హీరోల వెనకడుగుతాజాగా ఈ బ్యూటీ అస్సి అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న తాప్సీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు వెనకడుగు వేశారు. కారణాలు తెలీదు కానీ నాతో చేయననేవారు. అలా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి.చాలామందికి పెద్ద షాక్చాలామటుకు సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది ఫైనల్గా హీరోనే నిర్ణయిస్తాడు. అయితే కొందరు దర్శకులు మాత్రం ఫలానా హీరోయినే కావాలని పట్టుబడతారు. వారు కోరుకున్న హీరోయిన్తోనే సినిమా మొదలుపెడతారు. ఉదాహరణకు డండీ సినిమానే తీసుకుందాం. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సర్ నన్నే తీసుకోవాలని డిసైడయ్యారు. నిజానికి షారూఖ్తో తరచూ జత కట్టే హీరోయిన్స్ వేరు. కానీ, అది బ్రేక్ చేస్తూ నన్ను ఎంపిక చేయడంతో చాలామంది షాకయ్యారు. ఇకపోతే నాతో పనిచేయడం కష్టమని ఓ రూమర్ ఉంది. అదెలా వచ్చిందో నాకర్థం కాదు.అదే నిజమైతే..ఎందుకంటే నా కెరీర్లో చాలామంది దర్శకుడు నాతో మళ్లీ మళ్లీ పని చేశారు. నాతో పని చేయడం కష్టమైతే సెకండ్ టైమ్ నన్నెందుకు తీసుకుంటారు? నాతో పని చేయనివారు, నా గురించి తెలియనివారే నాపై అనవసరమైన రూమర్ పుట్టించారు. దానికోసం ఆలోచించి నేనేంటో బయటకు వచ్చి చెప్పాల్సిన పనిలేదు. నేను పనితోనే సమాధానం చెప్తాను అంది తాప్సీ.చదవండి: నీకు ఉసురు తగులుతుంది.. హేటర్స్కు ఇచ్చిపడేసిన తనూజ -
50 ఏళ్ల వయసులో 29 ఏళ్ల హీరోతో టబు రొమాన్స్
-
4 రోజులు ఇంటికెళ్లకుండా షూటింగ్.. 5వ రోజు ఆస్పత్రిలో!
సాధారణంగా ఉద్యోగులు 8-9 గంటలపాటు పని చేస్తారు. కానీ సినిమా, బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం కొన్నిసార్లు గ్యాప్ లేకుండా రోజంతా షూటింగ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటోంది బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాళ్లు నొప్పి పుట్టి ఇక నిలబడటం నా వల్ల కాదు అనేవరకు పని చేయించుకుంటూనే ఉంటారు. ఇంటికి వెళ్లేంత తీరిక ఎక్కడిది?నా కెరీర్ మొదట్లో వెంటవెంటనే సినిమాలు చేశాను. షూటింగ్స్కు గ్యాప్ ఉండేది కాదు. కనీసం ఫిలిం సిటీ నుంచి నా ఇంటికి వెళ్లే తీరిక కూడా దొరికేది కాదు. దాంతో నిర్మాతలను షూటింగ్ లొకేషన్లోనే నాకంటూ ఒక రూమ్ వసతి కల్పించమని అడిగేదాన్ని. పొద్దున ఐదింటికి షూట్ స్టార్ట్ చేస్తే ఐదు గంటల వరకు కొనసాగేది. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఏడింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్ అయ్యేది. సినిమాఅలా వరుసగా ఐదు రోజులు జరిగింది. దాంతో ఆరో రోజు నేను సెట్లో కాకుండా హాస్పిటల్లో పడున్నాను అని గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె అడిగినట్లుగా 8 గంటల పని డిమాండ్ సబబే అని వత్తాసు పలికింది. కాగా ఇషా కొప్పికర్.. చంద్రలేఖ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసింది. చివరగా అయలాన్ మూవీలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లినవుతా.. కానీ పెళ్లి అవసరం లేదు: హీరోయిన్ -
పెళ్లంటేనే భయమేస్తోంది.. ఎగ్స్ భద్రపర్చుకున్నా!
ప్రస్తుత సమాజంలో చాలామంది పెళ్లంటేనే భయపడుతున్నారు. హీరోయిన్ డైసీ షా కూడా పెళ్లంటే వెనకడుగు వేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ సింగిల్గా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, డబ్బు.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు తెలివిగా రెండూ అని బదులిచ్చింది. రోజుకో వార్త..పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రేమలు, పెళ్లిళ్ల గురించి రోజుకో రకమైన వార్తలు వింటూనే ఉన్నాం. బ్లూ డ్రమ్ కేస్, బ్రేకప్ కేసులు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అయితే పిల్లలు కనేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటికే నేను నా అండాలను భద్రపరుచుకున్నాను. నేనెప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు పిల్లల్ని కంటాను అని చెప్పుకొచ్చింది.సినిమాడైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించింది. భద్ర అనే కన్నడ మూవీతో హీరోయిన్గా మారా జైహో అనే హిందీ చిత్రంతో పేరు తెచ్చుకుంది. చివరగా రెడ్ రూమ్ వెబ్ సిరీస్తో అలరించింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది. -
రొమాంటిక్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి: భాగ్యశ్రీ
కెరీర్ ఎంత స్పీడులో ఉన్నా సరే పెళ్లవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్. కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్లయ్యాకే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తోంది.కాలక్షేపం కోసం..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ... సమాజాన్ని ప్రతిబింబించేవే సినిమాలు. 90'sలో జనాలకు వినోదం అంటే సినిమానే గుర్తొచ్చేది. కుటుంబంతో కలిసి సమయం కేటాయించడానికి, కాలక్షేపం చేయడానికి సినిమాకు వెళ్లేవారు. ఇప్పుడన్నీ మారిపోయాయి. చిన్న కుటుంబాలే ఎక్కువయ్యాయి. వినోదం కోసం అనేక మాధ్యమాలు వచ్చాయి. జనాలకు ఆప్షన్స్ ఎక్కువయ్యాయి.బలవంతంగా ఇరికించొద్దుఅదే సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యంగా మారింది. సినిమాల్లోనూ జానర్స్ వచ్చాయి. వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అయితే మోడ్రన్ సినిమాల్లో సహజత్వం కోసం రొమాంటిక్ సన్నివేశాలను బలవంతంగా చొప్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా పిల్లలతో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి క్లోజప్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పుకొచ్చింది.సినిమాఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన భాగ్యశ్రీ.. ప్రభాస్ 'రాధేశ్యామ్'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు హిందీ సినిమాల్లో నటించి వెండితెరపై చిన్న బ్రేక్ తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజా శివాజీ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ మే1న విడుదల కానుంది.చదవండి: అదో చెత్త సినిమా.. ఇంత వెక్కిరించాలా?: నటుడు -
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్బాస్ షణ్ను ఎంగేజ్మెంట్ -
ఇందులో ప్రాపగండా ఎక్కడుంది..? దురంధర్పై సీనియర్ నటుడు రివ్యూ
దురంధర్ మూవీతో రణ్వీర్ సింగ్ బాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఛావా, కాంతార-2 చిత్రాల వసూళ్లను అధిగమించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేశారు. దీనిపై ప్రాపగండా చిత్రమని ముద్రవేశారు.తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా మాట్లాడారు. దురంధర్ ఓ మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కొనియాడారు. సాంకేతికత పరంగానూ ప్రేక్షకులను మెప్పించిందన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్లో చాలా వాస్తవిక పద్ధతిలో రూపొందించారని అన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి రణ్వీర్ సింగ్ అని అభివర్ణించారు. ఈ సినిమాను ఒక సంపూర్ణ కళాఖండమని అభివర్ణించారు. ఇందులో ఎలా ప్రాపగండా లేదని.. సినిమాను సినిమాగానే చూడాలని శతృఘ్న సిన్హా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ధురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా మెప్పించారు. ప్రస్తుతం ధురంధర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. Wow! Just happened to see the most talked about film an absolute masterpiece 'Dhurandhar'. What 'propaganda' film??? A film is a film is a film. It's a great film, gripping interesting & full of entertainment, made with sincerity. The sets too have been created beautifully in…— Shatrughan Sinha (@ShatruganSinha) February 25, 2026 -
పదేళ్ల తర్వాత దొరికిన అరుదైన గిఫ్ట్ ఆ సినిమానే: తాప్సీ
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే అస్సీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్రలో మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవల ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ తన కెరీర్ గురించి మాట్లాడింది. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆఫర్ రావడంపై స్పందించింది. డంకీ లాంటి భారీ కమర్షియల్ చిత్రంలో అవకాశం రావడం మంది నటులకు కష్టమని తెలిపింది. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం తన కెరీర్లో అరుదైన క్షణమని వెల్లడించింది. సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ పాత్ర అవసరమని.. అందుకే తనకు వచ్చిందని ఆమె అన్నారు.తాప్సీ పన్ను మాట్లాడుతూ..'డంకీ లాంటి అవకాశాలు తనకు మాత్రమే కాదు. పరిశ్రమలోని చాలా మంది నటులకు కూడా కష్టమే. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం నా కెరీర్లో అరుదైన క్షణం. చాలా సంవత్సరాల నాకు లభించిన సినిమా డంకీ. దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన తర్వాత అందుకున్న బహుమతి డంకీ. నాలాంటి వారికి డంకీ లాంటి సినిమా దొరకడం కష్టం. అస్సీ, గాంధారి లాంటి సినిమాలు చేయడం వల్లే డంకీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలు నాకు పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చాయని' పంచుకుంది. తన కెరీర్ను మాస్ ఎంటర్టైనర్లతో ప్రారంభించానని తెలిపింది. దక్షిణాదిలో నా కెరీర్ను మాస్ చిత్రాలతో ప్రారంభించా.. ఆ తర్వాత నా హిందీ సినిమా అరంగేట్రం డేవిడ్ ధావన్తో జరిగిందని పేర్కొంది.కాగా.. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
డ్రైవింగ్ చేస్తూ నిద్ర పోతున్నాడు: హీరోయిన్
హీరోయిన్ మీరా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. క్షేమంగా, వేగంగా వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటే డ్రైవర్ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నానని చెప్తోంది. ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఉబర్ క్యాబ్ వల్ల నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మంగళవారం ఉదయం ఆరుగంటల కోసం కారు బుక్ చేసుకున్నాను. తీరా దుమ్ము, మురికి పట్టిన కారు వచ్చింది. డ్రైవర్ కూడా అంతే డర్టీగా ఉన్నాడు. కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్ను అడిగాను. నిద్రపోతూ డ్రైవింగ్కానీ, అతడు సమాధానం చెప్పే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్ దిగిపోయి మరొకటి బుక్ చేసుకున్నాను. కానీ ఉబర్ మాత్రం నా నుంచి 6 గంటల ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని.. ఇదెంత అసహ్యకరం అని ట్వీట్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటూ వారి అనుభవాలు షేర్ చేసుకున్నారు.సినిమామీరా చోప్రా విషయానికి వస్తే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ మూవీ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ద టాటూ మర్డర్స్ అనే వెబ్ సిరీస్లోనూ నటించింది. Had a massively scary unfortunate experience with @Uber @Uber_India. Booked a cab fr 6 hrs early morning. Driver came dirty with a stinking and dusty car. When i asked him why the car is stinking i realised hes not able to talk also coz he was almost sleeping while driving. I…— Meerra Chopraa (@MeerraChopra) February 24, 2026 చదవండి: ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే: తమన్నా -
రోడ్డుపై అందరూ కలిసి చితకబాదారు: అక్షయ్ కుమార్
కాలేజీ డేస్లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వన్సైడ్ లవ్ అయితే మరికొందరిది టూసైడ్ లవ్. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడట! ఈ విషయాన్ని 'ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' షోలో వెల్లడించాడు. తాజాగా ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.అమ్మాయి ఇంటి ముందుతన కాలేజీ డేస్లోని లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. 'ఇది 40 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాను. తనకోసం ప్రత్యేకంగా ఒక పాట నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ ఒకరికి గిటార్ వాయించడం తెలుసు. కాబట్టి వాడిని వెంటేసుకుని నేరుగా అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. తన్నులు తిన్నాంఅతడు గిటార్ వాయిస్తుంటే నేను పాట పాడటం మొదలుపెట్టాను. నా పాట విని అమ్మాయి వస్తుందనుకుంటే చుట్టుపక్కలవాళ్లు వచ్చి మమ్మల్ని చితక్కొట్టారు. వారి చేతిలో చచ్చామనుకున్నాం. ఎవరినో ఇంప్రెస్ చేద్దామని వెళ్లి మేమే తన్నులు తిని వచ్చాం' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా సినిమాల్లో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్లో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను కలిశాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసింది. 2001లో అక్షయ్, ట్వింకిల్ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2002లో కుమారుడు ఆరవ్ జన్మించాడు. 2012లో కూతురు నితారా పుట్టింది.చదవండి: విడాకుల తర్వాత బాధలో.. ఎవర్నీ నమ్మొద్దనుకున్నా..: సమంత -
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్కు స్ట్రాంగ్ కౌంటర్
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ స్పందించారు. అనురాగ్కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్ఫ్లిక్స్తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిల్లిగవ్వ లేక తిండి లేక.. ప్రతిరోజూ ఏడ్చేవాడిని: నటుడు
ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆమిర్ అలీ. ఎఫ్ఐఆర్ అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అతడు నాలుగైదు హిందీ సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు.నా పని అయిపోయిందనుకున్నాఅతడు మాట్లాడుతూ.. నేను టీవీలో ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు బుల్లితెరపై కనిపించాలని లేదు. టీవీలో కనిపిస్తే సినిమా యాక్టర్గా నా పనైపోయినట్లేనని నా అభిప్రాయం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే కొన్ని సినిమాలు చేశాను.. కానీ, అవి రిలీజ్ కాకుండానే ఆగిపోయాయి. దాంతో నాకివ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. చేతిలో చిల్లిగవ్వ లేక..ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తినడానికి తిండి లేక, ఫుడ్ కొనుక్కోవడానికి సరిగా డబ్బు కూడా ఉండేది కాదు. ఇంటి బాధ్యత మొత్తం నాపైనే ఉంది. అప్పటికే నేను రెండు మూడు సినిమాలు చేయడంతో ఇక్కడ కెరీర్ సెట్టయిందన్న భావనతో ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అయిష్టంగా టీవీ ఇండస్ట్రీకి వెళ్లాల్సి వచ్చింది. సీరియల్స్ ఎందుకు అనగానే..అప్పుడు ప్రతిరోజు నేను నా వ్యాన్లో కూర్చుని ఏడ్చేవాడిని. నాతో సినిమాలు చేసినవారందరూ ఎందుకు సీరియల్స్ చేస్తున్నావని అడగ్గానే దుఃఖం తన్నుకొచ్చేది. అరగంటపాటు ఆపకుండా ఏడ్చేవాడిని. 2019లో చాలామంది దర్శకనిర్మాతలను కలిశాను. నువ్వు హీరోవి, నిన్ను సైడ్ క్యారెక్టర్స్లో ఎలా చూస్తారు? ఇప్పటికీ ఇబ్బందులే..ఒకవేళ అలాంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్తాం అంటూ మాట దాటేసేవారు. 2017లో టీవీ ఇండస్ట్రీని వదిలేసినప్పటికీ నాపై బుల్లితెర నటుడు అనే ముద్ర అలాగే ఉండిపోయింది. అంత ఈజీగా నాకెవరూ అవకాశాలివ్వరు అని ఆమిర్ అలీ చెప్పుకొచ్చాడు. ఆమిర్ అలీ.. ఐ హేట్ లవ్ స్టోరీస్, ఫరాజ్ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: బుల్బుల్ తర్వాతే క్రేజ్.. యానిమల్తో సెన్సేషన్ -
లైఫే టర్నయ్యిందిలే బుల్బుల్ పిట్ట!
టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ వస్తుంది. మరికొందరికి ఏళ్లు గడిచాక గుర్తింపు దక్కుతుంది. హీరోయిన్ తృప్తి డిమ్రి రెండో కోవకు చెందుతుంది. నేడు (ఫిబ్రవరి 23న) ఈ బ్యూటీ బర్త్డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..అనుకోకుండా సినిమాల్లోకి..హీరోయిన్ తృప్తి డిమ్రి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్ డిమ్రి ఎయిరిండియా ఉద్యోగి. తల్లి గృహణి. తృప్తి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆమె సోదరుడి స్నేహితుడు ఫోటోగ్రాఫర్. ఒకరోజు ఈమె ఫోటోలు తీసి ఢిల్లీలోని ఇమేజెస్ బజార్కు పంపించాడు. ఆ ఫోటోలు వారికి నచ్చడంతో ఫోటోషూట్కు పిలిపించారు. అలా తృప్తి జర్నీ మొదలైంది. తండ్రి కోరిక నెరవేర్చేందుకుమొదట్లో యూట్యూబ్ ఛానల్లో పని చేసింది. అక్కడే కెమెరాకు అలవాటు పడటం నేర్చుకుంది. నిజానికి తృప్తి తండ్రికి యాక్టర్ అవ్వాలని కోరికట.. దీంతో తండ్రి కోరికను తాను నెరవేర్చాలనుకుంది. బుల్లితెరపై అయినా నటిస్తే చాలనుకుని మొదట్లో మోడలింగ్ చేసింది. అక్కడ మంచి పేరు రావడంతో నటి అవ్వాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టింది. అయితే నటిని అవుతా అని ఇంట్లో చెప్పగానే కుటుంబంసభ్యులు కొంచెం కంగారుపడ్డారట. అవకాశాలు లేనప్పుడు..పైగా బంధువులు కూడా.. ఆమె ఇండస్ట్రీకి వెళ్తే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు అని భయపెట్టారు. అయినా ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవకాశాలు రాని సమయంలో బాధపడింది. కానీ, వెనకడుగు మాత్రం వేయలేదు. అలా మామ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది వచ్చిన లైలా మజ్నులోని లైలా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైంది. యూత్ క్రష్2020లో వచ్చిన హారర్ మూవీ బుల్బుల్తో ఓటీటీ స్టార్గా మారింది. ఆ మూవీ తర్వాత తన దశ తిరిగిపోయింది. 2023లో వచ్చిన సందీప్రెడ్డి వంగా యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అందరికీ క్రష్గా మారిపోయింది. బ్లాక్బస్టర్ మూవీ భూల్ భులయ్యా 3లో ద్విపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం హిందీలో మా బెహెన్, తెలుగులో ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమా చేస్తోంది. తెలుగులో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం!చదవండి: ఫుడ్డుతో చంపేస్తున్న ప్రభాస్.. ఏ హీరోయిన్కు పంపాడంటే? -
హీరోయిన్ కోసం ప్రభాస్ స్పెషల్ ట్రీట్
డార్లింగ్ ప్రభాస్ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. తను తినడమే కాదు చుట్టూ ఉన్నవారికి సైతం ఫుడ్డు పెట్టి చంపేస్తాడు. ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్కు భోజనం తినిపిస్తాడు. కొన్నిసార్లు అందరి కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా చెన్నై నుంచి ముంబైకి భోజనం తెప్పించాడు.హీరోయిన్ కోసం స్పెషల్ ఫుడ్తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వికి ఇలాగే ఫుడ్ ట్రీట్ ఇచ్చాడు. స్టార్టర్ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్ వరకు.. అన్నింటినీ పార్శిల్ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇంత రుచికరమైన భోజనం పంపింనందుకు ప్రభాస్కు కృతజ్ఞతలు చెప్పింది.సినిమాఫౌజీ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.చదవండి: బాఫ్టా అవార్డులు.. తొలిసారి భారత్ మూవీకి అవార్డ్ -
అమితాబ్ను చూసేందుకు ఒక్కరూ రాలేదా?
ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు వచ్చి అభిమానులను పలకరిస్తుటాడు బిగ్బీ అమితాబ్ బచ్చన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కనిపించడం, పలకరించడం తన కర్తవ్యం అని భావిస్తాడు. అయితే నిన్న (ఫిబ్రవరి 22) మాత్రం అమితాబ్ ఇంటి నుంచి బయటకే రాలేదు.కనిపించని అభిమానులుఅందుకు గల కారణాన్ని అమితాబ్ తాజాగా తన బ్లాగ్లో రాసుకొచ్చాడు. పనెప్పుడూ ఉత్సాహంతోనే సాగుతుంది. కానీ, అది పూర్తవకముందే రోజు ముగుస్తుంది. ఇంతలోనే విరామం, విశ్రాంతి తీసుకునేందుకు ఆదివారం వస్తుంది. దుదరదృష్టవశాత్తూ ఈ ఆదివారం జల్సా (బిగ్బీ ఇంటి పేరు) గేటు ముందు ఎవరూ లేరు. కాబట్టి మీరు కూడా ఎవరూ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, మీ శక్తిని ఆదా చేసుకోండి.అదేంటి?తర్వాత మనం మళ్లీ కలుద్దాం. అప్పటివరకు ఈ నిశ్శబ్ధపు ఆలోచనల్లోనే ప్రేమను పంచుకుందాం అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. అమితాబ్ను చూసేందుకు ఎవరూ రాకపోవడమేంటి? ఆయన చరిష్మా తగ్గిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా హీరోగా రాణిస్తున్న అమితాబ్.. చివరగా వేట్టైయాన్ సినిమాలో కనిపించాడు. 120 బహదూర్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే రామాయణ: పార్ట్ 1లో జటాయు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు.చదవండి: ధోతి స్టైల్లో హీరోయిన్ డ్రెస్.. ధరెంతంటే? -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
హీరోయిన్ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటేనే సిగ్గు: జాకీ ష్రాఫ్
బాలీవుడ్ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ తాజాగా 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' నాలుగో సీజన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా మాధురి దీక్షిత్ మాట్లాడుతూ.. 'కర్మ' సినిమా సెట్లో తొలిసారి జాకీ ష్రాఫ్ను కలిశాను. నేను ఆ మూవీలో ఒక చిన్న పాటలో నటించాను. మొహమాటంఆ సమంలో జగ్గూ దాదా (జాకీ ష్రాఫ్), అనిల్ కపూర్ గారు అక్కడే ఉన్నారు. ఇద్దరూ నా పర్ఫామెన్స్ చూస్తున్నారు. నాకసలే అదంతా కొత్త.. వీళ్లిద్దరూ నన్నే చూస్తుండటంతో కాస్త మొహమాటంగా ఫీలయ్యాను. ఇక ఆ సాంగ్ చూసిన తర్వాత జగ్గూ దాదా, శ్రీదేవి.. అందులో వారిని ఊహించుకున్నారు అని గుర్తు చేసుకుంది.మాధురి అందాన్ని చూసి..జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్, నటి సరోజ్ ఖాన్ ద్వారా నాకు తొలిసారి మాధురి గురించి తెలిసింది. మాధురి అందమైన హీరోయిన్ అలాగే అద్భుతమైన డ్యాన్సర్ కూడా అని సుభాష్ గయ్తో చెప్పింది. మాధురిని సినిమాలో ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చింది. అలా తన గురించి తెలిసింది. ఇప్పటికీ నేను మాధురి అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటా.. తను నాతో అన్నిరకాల పాత్రల్లో నటించింది. ప్రియురాలిగా, భార్యగా, అలాగే నా అత్తగానూ యాక్ట్ చేసింది. అయితే మాధురితో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను చాలా మొహమాటపడ్డాను. జాకీపై ప్రశంసలుకొన్ని భావోద్వేగాలు మనసులోనే కదలాడతాయి. వాటిని పైకి చూపించడం కష్టం. పైగా ఆమె మాట్లాడేటప్పుడు తన కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడటడం, పాడటం మరింత కష్టతరం. తను మాత్రం పాత్రలో లీనమైపోయి బోలెడంత ప్రేమను కురిపిస్తుంది అన్నాడు. ఇంతలో మాధురి మాట్లాడుతూ.. జగ్గూ చాలా అమాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అని జాకీ ష్రాఫ్పై ప్రశంసలు కురిపించింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో చివరగా దేవదాస్ అనే సినిమా వచ్చింది.చదవండి: పవిత్ర లోకేశ్ నాతో ఎలా ఉంటుందంటే?: నరేశ్ పెద్ద కుమారుడు -
'అందుకే బాలీవుడ్ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్లో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది బ్లఫ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్కి వెళ్లడంపై మాట్లాడింది. నేను బాలీవుడ్ను వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగానే ఫీలయ్యానని పేర్కొంది. అందువల్లే హాలీవుడ్లో అడుగుపెట్టాల్సి వచ్చిదంని వెల్లడించింది. ఇండియన్ సినిమాల్లో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. వారణాసిలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..' నేను హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగా భావించా. నా కెరీర్ మరింత విస్తరించాలనుకున్నా. అందుకే హాలీవుడ్లో పనిచేశా. కానీ బాలీవుడ్ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పరిమితమైన అవకాశాలే రావడంతో ప్రాజెక్టుల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్లోకి అడుగుపెట్టా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాజమౌళి సార్తో వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది. -
అదే చివరి సినిమా అనుకున్నా.. రూ.1 కోటి పారితోషికం!
కొన్ని సినిమాలు కెరీర్నే మలుపు తిప్పుతాయి. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి మున్నాభాయ్ ఎంబీబీఎస్ అలాంటి సినిమానే! హీరో సంజయ్ దత్కు రైట్ హ్యాండ్గా ఉంటూ తన కామెడీ టైమింగ్, డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తాడు. వీరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది కన్నార్పకుండా చూస్తుంటారు. ఎంతిస్తే అంత చాలనుకున్నా..ఈ మూవీ తన కెరీర్లోనే టర్నింగ్ పాయింట్ అంటున్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. తాజాగా పింక్విల్లాతో మాట్లాడుతూ.. మున్నా భాయ్ సినిమాకంటే ముందు నేను పెద్దగా సంపాదించిందంటూ ఏమీ లేదు. ఎంతిస్తే అంత చాలనుకుని సినిమాలు చేసుకుంటూ పోయాను తప్ప ఎన్నడూ మంచి పారితోషికం కోసం గొడవపడలేదు. మున్నా భాయ్ ఎంబీబీఎస్ రిలీజయ్యాక కరోజు దర్శకనిర్మాత విపుల్ షా నాకు ఫోన్ చేశాడు. మున్నా భాయ్ MBBS మూవీలో ఒక దృశ్యంరెమ్యునరేషన్ రూ.1 కోటిఇక మీదట నువ్వు చేసే సినిమాలకు రూ.1 కోటి కంటే ఒక్క రూపాయి తక్కువ తీసుకున్నా నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ టాలెంట్ నీకు తెలియట్లేదు. ఎందుకిలా చేస్తున్నావు? అని క్లాస్ పీకాడు. అప్పుడు నా మేనేజర్తో ఎవరైనా అడిగితే నా రెమ్యునరేషన్ కోటి రూపాయలు అని చెప్పమన్నాను. అప్పటినుంచే నాకు కొంచెం ఎక్కువ డబ్బు రావడం మొదలైంది. నిజానికి మున్నాభాయ్ సినిమా ఆఫర్ నాకంటే ముందు చాలామందికి వెళ్లింది. నేను కూడా మంచి పొజిషన్లో ఉంటే రిజెక్ట్ చేసేవాడినేమో!చివరి సినిమా అనుకున్నా..ఇదే నా చివరి సినిమా అవుతుందనుకున్నాను. ఎందుకంటే మళ్లీ గూండాలా నటించమనే ఆఫర్లు వస్తాయి.. వాటిని చేయడం నావల్ల కాదని డిసైడయ్యాను. అనూహ్యంగా సినిమాకు మంచి స్పందన లభించింది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది అని అర్షద్ వార్సీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మున్నాభాయ్ ఎంబీబీఎస్కు రీమేక్గా తెలుగులో శంకర్దాదా MBBS తెరకెక్కగా ఇక్కడ కూడా ఘన విజయం అందుకుంది.చదవండి: కూతురు పుట్టిన ఏడాదికి పాప ఫోటో షేర్ చేసిన అంబటి అర్జున్ -
ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన చిత్రం ధురంధర్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న విడుదలవగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా ఆర్. మాధవన్ బయటపెట్టాడు.దుఃఖం ఆపుకోలేకపోయారుఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద ముఠాని పెంచి పోషించే రెహమాన్ బలోచ్ పాత్రలో అక్షయ్ ఖన్నా, పాకిస్తాన్ మేజర్గా అర్జున్ రాంపాల్ నటించారు. సినిమాలో 26/11 ముంబై దాడుల సన్నివేశాన్ని చిత్రీకరించగానే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ ఒక్కసారిగా ఏడ్చేశారు. షూటింగ్ అయ్యేవరకు బాధను గొంతులోనే దిగమింగుకున్నారు. దర్శకుడు కట్ చెప్పిన మరుక్షణం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అలాంటి పాత్రలు పోషించినప్పుడు వాటి ప్రభావం వారిపై కొన్నిరోజులపాటు ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.సినిమాధురంధర్ విషయానికి వస్తే ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ధురంధర్ 2 మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ -
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, భర్త అపూర్వ పడ్గోయంకర్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్ భవ్య సింగ్.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా వాటిని నటి టీమ్ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official) -
ఏడేళ్లు విడివిడిగా నిద్ర.. మా ఇద్దరికీ స్లీప్ డివోర్స్: నటి
బాలీవుడ్ నటి అర్చన పూరణ్ సింగ్ అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవేవీ కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్లో ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తోంది. ఎటువంటి మొహమాటం లేకుండా పర్సనల్, ప్రొఫెషనల్.. అన్ని విషయాలను పంచుకుంటోంది. ఐ లవ్యూ చెప్పుకోవడం కాదుతాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఐ లవ్యూ చెప్పుకోవడంలో కాదు, దాన్ని చూపించడంలో ఉంటుంది. అయితే పెరుగుతున్న వయసును బట్టి ఈ ప్రేమ రూపాలు కూడా మారుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు. కాబట్టి మరోసారి మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకునే వీలు దొరికింది. నాకు ఆలస్యంగా పడుకోవడం అలవాటు. తనేమో త్వరగా నిద్రపోతాడు. చిన్న పనులే..అతడికి డిస్టర్బ్ అవకూడదని నేను ఎటువంటి శబ్ధాలు చేయను. హెడ్ఫోన్స్ పెట్టుకునే పాటలు వింటాను. పొద్దున ఆయన త్వరగా లేస్తాడు. అప్పుడు నేనింకా నిద్రలోనే ఉంటాను కాబట్టి తను కూడా నన్ను డిస్టర్బ్ చేయడు. సైలెంట్గా తన పనులు తాను చేసుకుంటాడు. ఈ చిన్నచిన్న పనులే ప్రేమను సూచిస్తాయి.ఈ లెక్కన విడాకులైనట్లే!నా భర్తకు గురక అలవాటు ఉంది. నాకేమో చిన్న అలికిడి అయినా చటుక్కున లేస్తాను. మళ్లీ నిద్రలోకి జారుకోవడం చాలా కష్టం. అందుకే భర్త పక్కన నేను పడుకోలేను. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని స్లీప్ డివోర్స్ అంటారు. ఐదు నుంచి ఏడేళ్లపాటు మేమిద్దరం ఇలాగే విడివిడిగానే నిద్రపోయాం. ఈ లెక్కన విడాకులు తీసుకున్నట్లే! (నవ్వుతూ)జీవితం చాలా చిన్నదిగత 10-15 ఏళ్లలో మా మధ్య ఇగో పూర్తిగా నశించిపోయింది. ముందు నువ్వే సారీ చెప్పాలన్న వాదన అనేదే మా మధ్య లేదు అని చెప్పుకొచ్చింది. అర్చన భర్త, నటుడు పర్మీత్ మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎన్ని పండుగలు, బర్త్డేలు ఉన్నాయని? ప్రతిదానికి గొడవపడుతూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది. అన్నింటినీ పక్కనపెట్టి సంతోషంగా బతికేయాలి అని చెప్పుకొచ్చాడు.చదవండి: అజిత్, విజయ్ మధ్య శతృత్వం? క్లారిటీ ఇచ్చిన షాలిని -
ధనుష్ ఆ రోజు నా కోసం.. ఓ కారణముంది: మృణాల్
సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మృణాల్ ఠాకుర్.. అంతకు ముందు హిందీ సీరియల్స్తో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె గ్లామర్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అలాంటిది గత కొన్నిరోజుల నుంచి మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్తో ఈమె బంధం గురించి తెగ రూమర్స్ వచ్చాయి. ఏకంగా పెళ్లి చేసుకుంటారని కూడా మాట్లాడుకున్నారు. అంతకు ముందు మృణాల్ చేసిన ఓ ప్రీమియర్లో ధనుష్ కనిపించడమే దీనికి కారణం. అయితే ఆ రోజు ధనుష్ ఎందుకు వచ్చాడనేది ఇప్పుడు మృణాల్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: లెస్బియన్ పాత్రలో రష్మిక?)'నేను ధనుష్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన చేసిన రాయన్, మారి, రాంఝానా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' అయితే ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ఆయన నటన అద్భుతం. మిగతా యాక్టర్స్ నుంచి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ రాబట్ట గల సత్తా కూడా ఆయన సొంతం. నటుడిగానే కాకుండా గీత రచయిత, సింగర్, డ్యాన్సర్, డైరెక్టర్ కూడా. 'తేరే ఇష్క్ మే' షూటింగ్ జరుగుతున్న టైంలో సర్.. మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్కి వస్తారా? అని అడిగాను. ఆయన వస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగానే ఆయన రావడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్లో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను' అని ఓ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్స్ గురించి మాట్లాడిన మృణాల్.. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో కూడా నాకు తెలియదు. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఇష్టమైతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని, కాకపోతే అంతలోపు తాను నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయని పేర్కొంది. ఈమె హీరోయిన్గా చేసిన హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)Actress #MrunalThakur on #Dhanush! "He is a genius! He is a multi-talented. I would like to work with him definitely. After watching his movie, I became a huge fan of his works."pic.twitter.com/s7B65LPvil— Star Talkies (@startalkies_ofl) February 20, 2026 -
అమ్మ ఉగ్రరూపం.. పీక పట్టుకుని చెంప పగలగొట్టింది!
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా "ద బ్లఫ్" సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి (ఫిబ్రవరి 20) నుంచే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రియాంక తన తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.పక్కదారి పట్టడంతో..ప్రియాంక మాట్లాడుతూ.. అప్పుడు నాకు 11 ఏళ్లు ఉంటాయనుకుంటాను. ఒకసారి ఢిల్లీలో ఉండగా రాత్రిపూట అమ్మ, నేను బయటకు వెళ్లాం. క్యాబ్ బుక్ చేసుకుని కొంత దూరం వెళ్లగానే సడన్గా అమ్మ ముఖం ఎర్రబడింది. డ్రైవర్ పీక పట్టుకుని తిట్టడం మొదలుపెట్టింది. అతడు నెమ్మదిగా కారును మెయిన్ రోడ్ నుంచి మరోవైపు దారి తిప్పాడు. అది షార్ట్కట్ అని చెప్పాడు. 4 నెలలు కిక్కుమనకుండా..కారులో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. అమ్మ అతడి కాలర్ పట్టుకుని మెయిన్రోడ్ మీదుగానే కారును తీసుకెళ్లమని హెచ్చరించింది. అతడి చెంప కూడా పగలగొట్టింది. అమ్మను అలా ఉగ్రరూపంలో ఎన్నడూ చూడలేదు. ఆ సంఘటన తర్వాత దాదాపు నాలుగు నెలలవరకు ఎన్నడూ అమ్మతో గొడవపడలేదు. ఆరోజు నేను లేకపోయుంటే అమ్మ అంత సీరియస్ అయ్యేదో? లేదో? కానీ, హోటల్కు తిరిగి రాగానే అమ్మ నిలువెల్లా వణికిపోయింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.చదవండి: మలయాళ మూవీ చథా పచ్చ రివ్యూ -
స్వలింగ సంపర్క ప్రేమికురాలిగా రష్మిక?
ఇండస్ట్రీలో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు చాలా మారిపోయాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే జనాలు తగ్గిపోయారు. హీరోహీరోయిన్లు ఎవరైనా సరే కాస్త వైవిధ్యమైన పాత్రలు చేస్తే చూసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే అలాంటివి చేసే వాళ్లు మాత్రం ఇప్పటికే కాస్త తక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ రష్మిక మాత్రం ఇప్పుడు పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు.. కనీసం కలలో కూడా ఊహించని పాత్రలో కనిపించనుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. తొలుత సొంత భాషలో గుర్తింపు తెచ్చుకుని తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్డమ్ సొంతం చేసుకుంది. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయింది. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్లోనూ వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అలా ఈమె చేసిన హిందీ సినిమాల్లో 'కాక్టెయిల్ 2' కూడా ఒకటి.(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక నటించారు. అయితే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, కాకపోతే కృతి సనన్, రష్మిక.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. అంటే లెస్బియన్ పాత్రలు అనమాట. బాలీవుడ్ సినిమాల్లో ఈ పాయింట్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు గానీ దక్షిణాదిలో ఇలాంటి పాత్రలు రావడం దాదాపు అసాధ్యం. అందున స్టార్ హీరో లేదా హీరోయిన్లు ఇలాంటి చేయరు. మరి రష్మిక ఈ తరహా పాత్ర చేసిందని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే గనక తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?ఇకపోతే రష్మిక వచ్చే వారమే పెళ్లి చేసుకోనుంది. ప్రియుడు విజయ్ దేవరకొండతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. రాజస్తాన్ వేదికగా ఈ నెల 26న డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ శుభకార్యానికి ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ వేదికపై మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
గర్వం... వారసత్వం
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ టైటిల్ రోల్లో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా (హిందీ, మరాఠీ) చిత్రం ‘రాజా శివాజీ’. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందు తున్న సినిమా ఇది. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ , మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంస్థల సమర్పణలో జ్యోతీ దేశ్పాండే, జెనీలియా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 1న రిలీజ్ కానుంది.ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ‘రాజా శివాజీ’ సినిమా కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మన రాజు మన గర్వం... మన వారసత్వం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఈ సినిమాపోస్టర్ను షేర్ చేశారు రితేష్. హిందీ, మరాఠీ భాషలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ΄్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. -
'రాణి ఎప్పటికీ రాణినే'.. నమ్రతపై వారణాసి బ్యూటీ ప్రశంసలు..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్పై వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. రాణి ఎప్పటికీ రాణినే ఉంటూ ఓ వీడియోను షేర్ చేసింది. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న వీడియోను పంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు మహేష్ బాబును కూడా ట్యాగ్ చేసింది.కాగా.. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రతా శిరోద్కర్ మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. నమ్రతా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే ఏడాది నమ్రతా ప్రపంచ అందాల పోటీల్లో మనదేశం తరఫున పాల్గొని టాప్-6లో ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. కాగా.. ఆ తర్వాత మిస్ వరల్డ్ -2000 పోటీల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఏకంగా టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.నమ్రతా సినీ కెరీర్నమ్రతా తొలిసారిగా 1977లో శత్రుఘ్న సిన్హా నటించిన షిర్డీ కే సాయి బాబా చిత్రంలో నటించింది. 1998లో మేరే దో అన్మోల్ రతన్ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన నమ్రతా.. 2000 ఏడాదిలో వంశీ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలను నమ్రతా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. View this post on Instagram A post shared by The Crown Journal (@the_crown_journal) -
జైళ్లలో స్మోకింగ్ జోన్ ఉండాలి: రాజ్పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్ జోన్స్) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.ఏం జరిగింది?రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్బౌన్స్ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్ జైలులో లొంగిపోయాడు. ఫిర్యాదుదారునికి రాజ్పాల్ యాదవ్ రూ.1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్పాల్ యాదవ్.. హంగామా, భూల్ భూలయా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్ -
ఆ హీరో తల్లి కాళ్లు కడిగి నీళ్లు తాగుతాడు!
బాలీవుడ్ నటుడు గోవిందా ఈ మధ్యకాలంలో సినిమా అప్డేట్స్ కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడి ఎఫైర్స్ గురించే ఎక్కువ ప్రచారం జరిగింది. భార్య సునీత అహూజాతో విడిపోతున్నాడని కూడా రూమర్స్ రాగా అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది.ఆయన నుంచే ప్రేరణఅయితే గోవిందా వ్యక్తిత్వం ఎంతో ఉత్తమమైనదని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానంటున్నాడు నటుడి మేనల్లుడు వినయ్ ఆనంద్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. గోవిందా అంకుల్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేనే కాదు, ఆయన ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు దేశం మొత్తం ఆయన నుంచి స్ఫూర్తి పొందింది.కాళ్లు కడిగి ఆ నీళ్లుఆయన్ను, ఆయన డ్యాన్స్ను కాపీ కొట్టని స్టార్ హీరోలు లేరు. డ్యాన్స్ రానివారు కూడా ఆయన్ను చూసి స్టెప్పులేయడం మొదలుపెట్టారు. అమ్మమ్మ (గోవిందా తల్లి) పుట్టినరోజు నాడు ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగేవాడు. అలాంటి గొప్ప వ్యక్తికి అవకాశాలు తగ్గిపోవడం చూసి చాలా బాధపడ్డాను. తనకోసం కొన్ని ఆఫర్లు తీసుకొచ్చినా చేసేవాడు కాదు. ఈవెంట్స్ చేయమని అడిగినా నిరాకరించేవాడు. తన కారణాలు తనకు ఉండొచ్చు. మా మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.ఎన్నడూ ప్రశ్నించలేదుఆయన నాకు మామయ్య అయినప్పటికీ ఎందుకిలా తీసుకొచ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నారని ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆయన ఏం చెప్పినా ఓకే సర్ అంటుంటాను. దాదాపు 70 (హిందీ, భోజ్పురి) సినిమాల్లో హీరోగా నటించినా, పేరు, గుర్తింపు ఉన్నా ఆయన ముందు మాత్రం ఎప్పటికీ వినమ్రుడిగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: బేబి గర్ల్ మూవీ రివ్యూ -
ఆపరేషన్ సింధూర్పై మరో సినిమా.. వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్ ఇదే..!
ఆపరేషన్ సిందూర్పై మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఫిక్సయింది. తాజాగా మరో మూవీ సైతం రానుందని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్లో టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.అయితే తనపై వస్తున్న ఈ రూమర్స్పై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రూపొందిస్తారని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తాను అతిపెద్ద జాతీయవాద ప్రాజెక్ట్పై పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని.. చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు వివేక్ నిరాకరించారు.తాజా న్యూస్ ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో కలిసి వివేక్ అగ్నిహోత్రి 'ఆపరేషన్ సిందూర్' తెరకెక్కించున్నారని వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. గతేడాది అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.మరోవైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో దర్శకుడు ఉత్తమ్ నితిన్ సినిమాని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ను కూడా విడుదల చేశారు. కాగా.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఏప్రిల్ 22, 2025న జరిగింది. -
జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: అక్షయ్ కుమార్
భార్య పుస్తకాల రచయిత్రి, కానీ తాను మాత్రం ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా చదవలేదంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈయన హోస్ట్గా వ్యవహరిస్తున్న షో "వీల్ ఆఫ్ ఫార్చ్యూన్". తాజాగా ఈ షో ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయం చెప్పాడు అక్షయ్. నా భార్య ట్వింకిల్ ఖన్నా రచయిత్రి. నాకు తెలిసి తను రోజుకొక పుస్తకం అయినా చదివేస్తుంది.పుస్తకం చదివిన పాపాన పోలేదునేను మాత్రం ఇంతవరకు జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు. కాకపోతే అందరి ముఖాల్ని ఇట్టే చదివేయగలను. మనుషుల్ని చదవడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రస్తతం భూత్ బంగ్లా అనే హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అలాగే వెల్కమ్ టు ద జంగిల్ అనే మరో ప్రాజెక్ట్ అతడి చేతిలో ఉంది.సినిమాఅక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా విషయానికి వస్తే.. బర్సాత్, జబ్ ప్యార్ కిస్సే హోతా హై, బాద్షా వంటి పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె పుస్తక రచయిత్రిగా మారింది. మిసెస్ ఫన్నీబోన్స్, పైజామాస్ ఆర్ పర్గివింగ్, వెల్కమ్ టు ప్యారడైజ్ వంటి ఎన్నో పుస్తకాలు రాసింది. ఇటీవల 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ 'అనే షోకి సహ వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.చదవండి: రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితమయ్యా..: అనురాగ్ కశ్యప్ -
రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితం: దర్శకుడు
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ 2023లోనే రాసుకున్న కథ "కెనడీ". షూటింగ్ పూర్తయి చాలాకాలం అయిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తను కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొన్నాడు.2009 నుంచి..అతడు మాట్లాడుతూ.. మాగ్జిమమ్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ఖర్చుపెట్టాం. 2009 నుంచి నా ధ్యాసంతా ఆ సినిమాపైనే! ఈ కథను నెట్ఫ్లిక్స్ చదవకుండానే ఓకే చెప్పేసింది. మీరు దేనికి ఓకే చెప్పారో ఒకసారి చూసుకోండి అంటే ఒక్కరు తప్ప ఎవరూ స్క్రిప్ట్ చదవలేదు.పక్కన పడేసిన నెట్ఫ్లిక్స్ఏడాదిన్నర కాలంలో నేను 900 పేజీలు రాశాను. నా స్క్రిప్ట్ నచ్చకపోయుంటే నెట్ఫ్లిక్స్ ముందే చెప్పొచ్చుగా! సైలెంట్గా ఉండిపోయింది. తర్వాత సడన్గా తమ పాలసీలో కొన్ని మార్పులు చేస్తున్నామంటూ పలు వెబ్ సిరీస్, సినిమాలను రద్దు చేసింది. అందులో నా ప్రాజెక్ట్ ఒకటి. అయితే దానికి పరిహారంగా వేరే స్క్రిప్ట్ పంపించి వాటిని డైరెక్ట్ చేయమని అడిగింది. అవి యావరేజ్గా ఉన్నాయని, నాకు కొంచెం సమయం ఇవ్వండని అడిగాను. రెండుసార్లు గుండెపోటువాళ్లు మాత్రం మా దగ్గర 4 నెలలపాటు యాక్టర్స్ డేట్స్ ఖాళీగా ఉన్నాయని ఒత్తిడి చేశారు. నాకు కొంచెం సమయం ఇస్తే తప్ప వాటిని చేయలేనని చెప్పాను. నేను రాసిన ఒక షో వారికి బాగా నచ్చింది. కానీ దాన్ని మనీ హీస్ట్ ఇండియన్ వర్షన్గా మార్చి రాయమన్నారు. వాళ్ల పద్ధతి నాకసలు నచ్చలేదు. చాలా బాధపడ్డాను. ఎక్కువ ఒత్తిడి, బాధ వల్ల రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆస్తమాదాంతో రక్తం పలుచబడేందుకు మందులు వాడాను, కరోనా వ్యాక్సిన్ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇవి నా శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ చూపించాయి. ఆస్తమా వచ్చింది. దానికోసం స్టెరాయిడ్స్ వాడాను. ఎక్కువ డోసు మందులు వాడేసరికి నాకు డ్రగ్స్ వాడినట్లే అనిపించింది. తాగడం మొదలుపెట్టాను. జంక్ఫుడ్ ఆర్డర్ పెడుతూ నచ్చినట్లు తిన్నాను. ఎనిమిది నెలల్లోనే 35 కిలోలు పెరిగాను. వీల్చైర్కే పరిమితంనన్ను చూసి నా కూతురు భయపడిపోయింది. రిహాబిలిటేషన్ సెంటర్కు పంపింది. అలా మూడుసార్లు రిహాబిలిటేషన్కు వెళ్లాను. ఒకసారి అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు నా కుడి కాలుకి దెబ్బ తగిలింది. రక్తం పలుచబడే మందులు వాడుతున్నందున సర్జరీ చేయడం కుదరదన్నారు. కొన్ని నెలలపాటు వీల్చైర్లో ఉన్నాను. నెమ్మదిగా కోలుకుని ఇప్పుడిలా ఉన్నాను అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.చదవండి: మగవాళ్ల మందు పార్టీకి ఒంటరిగా రమ్మని పిలుపు: నటి -
మందుపార్టీకి ఒంటరిగా రమ్మన్నారు: బాలీవుడ్ నటి
ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్గా ఉన్న నటి వైష్ణవి మెక్డొనాల్డ్.. తర్వాత వెండితెరకు గుడ్బై చెప్పేసింది. గత కొంతకాలంగా బుల్లితెరపైనే సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించింది. వైష్ణవి మాట్లాడుతూ.. ఒక పెద్ద సినిమాలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. పోస్టర్స్, బ్యానర్స్ కూడా రెడీ అయ్యాయి. అందరూ మగవాళ్లే..కానీ తర్వాత మాత్రం మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే.. నేను ఎక్కడికి వెళ్లిన అమ్మను వెంట తీసుకునే వెళ్తాను. కానీ ఓ సాయంత్ర కాలం మీటింగ్ కోసం ఒంటరిగా రమ్మన్నారు. ఆ పార్టీలో అందరూ మగవాళ్లే ఉంటారని, కలిసి మందు తాగొచ్చని చెప్పారు. నాకది నచ్చలేదు. అమ్మ ఎల్లప్పుడూ నా వెంటే ఉండటం వాళ్లకూ నచ్చలేదు. హీరోకి నాపై ఆసక్తిషూటింగ్ కోసం నేను స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంటుందని ఆ నిర్మాణ సంస్థ నాకు పాస్పోర్ట్ తీసిపెట్టింది. కానీ మా అమ్మకు మాత్రం పాస్పోర్ట్ రెడీ చేయలేదు. పైగా హీరోకు నాపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అతడి ప్రపోజల్ రిజక్ట్ చేయడంతో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి నన్ను సినిమా నుంచి తీసేశారు. అది చాలా పెద్ద సినిమా. నేను అందరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని. సినిమా నుంచి సీరియల్ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకునేదాన్ని. దాంతో రానురానూ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలోనే శక్తిమాన్ సీరియల్కు ఓకే చెప్పాను. ఇది నా కెరీర్కు ఎంతో తోడ్పడింది అని చెప్పుకొచ్చింది. హిందీలో బాబుల్, సాంచా, మమ్మీ పంజాబీ, సూపర్ నాని వంటి పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై శక్తిమాన్, మే ఢిల్లీ హూ, కసౌటీ జిందగీ కే, మిలే జబ్ హమ్ తుమ్ వంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది.చదవండి: నా విజయానికి నా ప్రతిభ కారణం కాదు: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ -
ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే హిందీ సెలబ్రిటీలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు)స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్ షా తదితర సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా.. ఫిబ్రవరి 14న ఢిల్లీ తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కియారా అడ్వానీతో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధార్థ్.. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కష్టకాలంలో కుటుంబంతో కలిసి ఉన్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్.. మంగళవారం రాత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోలెడన్ని ఫొటోలని పంచుకున్నాడు.'ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తలవంచలేదు. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు. మర్చంట్ నేవీ కెప్టెన్గా సముద్రాన్ని శాసించడం దగ్గర నుంచి అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. స్ట్రోక్ వల్ల ఆయన వీల్ ఛైర్కే పరిమితమైనప్పటికీ బలంగా నిలబడ్డారు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. నిద్రలోనే మమ్మల్ని మీరు వదిలి వెళ్లారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నాన్న' అని సిద్ధార్థ్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన) View this post on Instagram A post shared by Sidharth Malhotra (@sidmalhotra) -
తీవ్ర విషాదం.. 'రెడీ' నటి కన్నుమూత
బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్పాండే (60) కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ప్రవీణ దేశ్పాండే 2019లో మల్టిపుల్ మైలోమా (బ్లడ్ క్యాన్సర్ రకం) బారిన పడ్డారు. అయినప్పటికి ఓ వైపు చికిత్స పొందుతూనే తన నటనను కొనసాగించారు. 2023లో కొంత కాలం విరామం తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆమె చివరిగా ఇటీవల విడుదలైన 'తస్కరీ' (Taskaree) వెబ్ సిరీస్లో ఆతిది పాత్రలో కన్పించారు. తన హుందాతనమైన నటనతో ఈ సిరీస్లోనూ ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే దేశ్పాండే ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె కేవలం వెండితెరపైనే కాకుండా, అనేక సూపర్ హిట్ హిందీ, మరాఠీ సీరియల్స్లో నటించి ఇంటింటికీ సుపరిచితురాలయ్యారు. ఆమె 'పరమాణుస, 'జలేబీస, 'ఏక్ విలన్' వంటి చిత్రాలలో ఆమె సహాయ నటిగా అలరించారు. ఆమె మృతి పట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తంచేసింది. -
రిలీజ్కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత
రణ్వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్'. రెండు నెలల క్రితం థియేటర్లలో కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో నెలరోజుల్లో సీక్వెల్ కూడా విడుదల చేయనున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూవీ టీమ్కి షాక్ తగిలింది. ముంబైలో ఇకపై షూటింగ్ చేయడానికి అనుమతి లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశముంది. ఇంతకీ అసలేమైంది?'ధురంధర్' చిత్రాన్ని తీసిన దర్శకుడు ఆదిత్య ధర్.. జియో స్టూడియోస్తో కలిసి నిర్మాణంలో భాగమయ్యాడు. 'బీ62 స్టూడియోస్' ఆదిత్యదే. ఈ నిర్మాణ సంస్థ పలుమార్లు నియమనిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఇకపై ముంబైలో షూటింగ్ కి అనుమతించకూడదని, ఈ మేరకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)కొన్నిరోజుల క్రితం ముంబైలోని చారిత్రక పోర్ట్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు డ్రోస్ ఎగరవేయడంతో నిర్మాణ సంస్థకు చెందిన మేనేజర్పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా ముంబైలోని పలు వీధుల్లో షూటింగ్ జరగ్గా.. ఆ సమయంలో క్రాకర్స్, మండే పదార్థాలు ఉపయోగించారు. ఇది కండీషన్స్ ఉల్లంఘించడమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఇలా వరసగా ఉల్లంఘనలని తీవ్రంగా పరిగణించిన బీఎమ్సీ.. ఆదిత్య ధర్కి చెందిన బీ62 స్టూడియోస్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రతిపాదించింది. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ.. ముంబైలో షూటింగ్ చేయడం కుదరదు.అలానే రీసెంట్ టైంలో అనుతి లేకుండా బిల్డింగ్లపై షూటింగ్ చేసినందుకు, అక్రమంగా జనరేటర్లు వాడినందుకుగానూ లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ని కూడా అధికారులు రద్దు చేశారు. మరి ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఏమని స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ప్రముఖ హీరోయిన్కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ ప్రముఖ నటి అమీషా పటేల్పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక ఒప్పందంలో ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ హాజరు కావడం లేదు. దీంతో తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది.2017న వ్యాపారావేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలో నటి అమీషా పటేల్ ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని పవన్ కుమార్ వర్మ రూ. 14.50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్లోని ఢిల్లీ రోడ్లోని ఒక హోటల్లో అమీషా పటేల్ కోసం లగ్జరీ హోటల్ బుకింగ్ చేశారు. అయితే, చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాకిచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చిన అమీషా. . రూ. 10 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని మిగిలిన రూ. 4.50 లక్షల చెక్కు తరువాత బౌన్స్ అయిందని కోర్టుకు వర్మ తెలిపారు. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు అమీషా పటేల్కు పలుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ, ఆమె హాజరు కాలేదు. ఆమె హాజరును నిర్ధారించడానికి కోర్టు ఇప్పుడు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఈ వివాదం 2017 నాటిదని, ఒక ఒప్పందం ద్వారా సమస్య ఎప్పుడో క్లియర్ అయిందన్నారు. ఆమేరకు మొత్తం డబ్బును తిరిగి ఇచ్చిందని ఆయన అన్నారు. అమీషా పటేల్ వివరణఈ విషయంపై అమీషా పటేల్ సోషల్మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. 'అర్ధిక లావాదేవీలకు సంబంధించి పవన్ వర్మతో సెటిల్మెంట్ గతంలోనే పూర్తి అయింది. ఆమేరకు డీడ్పై కూడా అతను సంతకం చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను చేస్తున్న మోసంపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తను ఇప్పటికైనా మానుకోవాలి.' అని అమీషా తెలిపింది. -
పెద్ద సినిమాకు సెలక్ట్ అయ్యా.. తీరా హీరోగా పనికిరానని!
ఎంతోమంది యాక్టర్స్ ఏదో ఒక సమయంలో తిరస్కరణకు గురవుతుంటారు. ఆల్రెడీ వేరేవాళ్లను సెలక్ట్ చేశాం, నీ ఫేస్కు ఈ పాత్ర సూటవదు... ఇలా ఏదో ఒక సాకు చెప్పి వారిని తప్పిస్తుంటారు. అలా ఓ నిర్మాత తనకూ ఓ సాకు చెప్పడంతో గుండు గీసుకున్నానంటున్నాడు బాలీవుడ్ హీరో సిద్దాంత్ చతుర్వేది.పెద్ద సినిమాకు షార్ట్లిస్ట్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. చాలామంది నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజెక్ చేస్తూనే వచ్చారు. అయితే అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక పెద్ద సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాను. నా పేరు షార్ట్లిస్ట్ చేయడంతో సంతోషపడ్డాను. కొన్ని వర్క్షాప్స్కి సైతం హాజరయ్యాను. నా పాత్ర కోసం నేను రెడీ అవుతూ ఉన్నాను. నేను ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలిచిన ఏడాదికే ఈ సినిమా ఆఫర్ దక్కించుకున్నాను. రిజెక్షన్తో షాక్దాంతో సినిమాల్లోకి రావడం పెద్ద కష్టమేం కాదని భావించాను. ఆ మూవీ దర్శకుడు, కాస్టింగ్ డైరెక్టర్కు నేను బాగా నచ్చాను. మూడు, నాలుగు నెలలు వర్క్షాప్కు హాజరయ్యాక నిర్మాత నన్ను స్క్రీన్ టెస్ట్ చేసి రిజెక్ట్ చేశాడు. నేను షాకయ్యాను. అసలేమైందని కాస్టింగ్ డైరెక్టర్ను అడిగాను. ఉంగరాల జుట్టు ఉంటే హీరో కాలేరు అని ఒక్క ముక్కలో సింపుల్గా చెప్పేశాడు. ఒకసారి జుట్టు స్ట్రయిట్ చేసుకుని ఆడిషన్కు రమ్మన్నారు. వాళ్లు చెప్పినట్లు చేశాక కూడా నన్ను రిజక్ట్ చేశారు.గుండు గీసుకున్నా..చాలా బాధపడ్డాను. నాకసలు జుట్టే వద్దని గుండు గీసుకున్నాను. మా అమ్మకు నా ఉంగరాల జుట్టు అంటే ఇష్టం. అయినా సరే కోపం, బాధతో దాన్ని తీసేశాను. ఇప్పుడీ రోజు సినిమా పోస్టర్లో అదే ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. సిద్దాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన దో దీవానే షెహర్ మే ఫిబ్రవరి 20న విడుదలవుతోంది.చదవండి: భార్యతో విడాకులు, జైలు జీవితం..నరకం అనుభవించానంటున్న సామ్రాట్ రెడ్డి -
ఆ హీరోయిన్కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్
అటు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన "ధురంధర్" ప్రస్తుతం ఓటీటీలోనూ చెలరేగుతోంది. మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ రవీనా టండన్ ప్రశంసలు కురిపించింది. దానికంటే ముందు హీరోయిన్ యామీ గౌతమ్కు క్షమాపణలు చెప్పింది.హీరోయిన్కు సారీజూమ్ పాడ్కాస్ట్లో రవీనా టండన్ మాట్లాడుతూ.. ధురంధర్ సినిమా చూశాక హీరోయిన్ యామీ గౌతమ్కు ఫోన్ చేశాను. ఐయామ్ సారీ, నేను నీ భర్త (దర్శకుడు ఆదిత్య ధర్)కు వీరాభిమానిని అని మాట్లాడాను. ఈ విషయం ఆమె భర్తతో చెప్పమన్నాను. మన సినిమాల్లో ఏదైతే మిస్ అవుతుందో దాన్ని ఆయన తిరిగి తీసుకొచ్చాడు. పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ వంటి సినిమాలు చూశాక జనాల్లో సంతృప్తి కలిగింది. ఎంత ఎదిగిపోయాడో!ఇప్పుడు హీరోలు నిజమైన హీరోల్లా కనిపిస్తున్నారని ఫీలవుతున్నారు. ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ 10 ఏళ్ల వయసులో నేను ఓ సాంగ్ చేస్తుండగా చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఎంత ఎదిగిపోయాడో! సినిమాలో అద్భుతంగా నటించాడు. సంజయ్, అక్షయ్ కూడా చించేశారు. సారా అర్జున్, రాకేశ్ బేడీ, గౌరవ్ కూడా బాగా యాక్ట్ చేశారు అని రవీనా టండన్ చెప్పుకొచ్చింది.సినిమాధురంధర్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్గా ధురంధర్ 2 మార్చి 19న రాబోతోంది.చదవండి: టాలీవుడ్లో సీక్వెల్ ట్రెండ్కు బ్రేక్? -
రూ.10 కోట్లు పెట్టినా రాదు: మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలే. వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్.. హీరో ధనుష్ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.లైఫ్లో సెటిలవాలిప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్ మే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.సన్యాసి జీవితమే..యాక్టర్గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్ ఉంది. కానీ నాపై రూమర్స్ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. అందులో డౌటే లేదురూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్ను పట్టించుకుంటూ పోతే కెరీర్పై ఫోకస్ చేయలేను అని మృణాల్ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది? -
తిట్లదండకం ఆపలేదు.. కోపంతో లాగిపెట్టి కొట్టా: హీరో
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. ప్రత్యర్థులను మట్టి కరిపించడంలోనే కాదు, వారిపై పంచులు విసరడంలోనూ దిట్ట! ఇతడు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్కు షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 జడ్జిలు హాజరయ్యారు. వారిలో ఒకరైన అమన్ గుప్తా.. మీరు జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సంఘటన ఏది? అని అడిగాడు.ఎంత చెప్పినా వినడే..అందుకు అక్షయ్ ఏదైనా ఫన్నీ సంఘటన చెప్తాడనుకుంటే ఏకంగా ఒకరిని లాగి పెట్టి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నా క్లోజ్ ఫ్రెండ్తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నా స్నేహితుడిని తిడుతున్నాడు. ఆపమని వారించినా సరే వినకుండా దుర్భాషలాడుతున్నాడు. మొదట మంచిగా చెప్పి చూశా.. తర్వాత వార్నింగ్ ఇచ్చా.. అయినా వినలేదు. ఇక ఆరోసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాను.ఆవేశం పట్టలేక..అందరిముందు అలా తిడుతుండేసరికి నా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు. అది చూసి భరించలేకపోయిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. ఒక్క దెబ్బకే అతడు కిందపడిపోయి స్పృహ కోల్పోయాడు. అయిపోయింది, నా కెరీర్ ఖతం అని భయపడ్డా.. అతడికి మెలకువ రావాలని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ముఖంపై నీళ్లు చల్లిన కొద్ది క్షణాలకే అతడు లేచి కూర్చో వడంతో ఊపిరి పీల్చుకున్నా..ఈరోజు అయితే..అదే సంఘటన ఈరోజు జరిగి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని కానీ అలా కొట్టేవాడిని కాదు. అదే నాకు ఇబ్బందిగా అనిపించిన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ చివరగా జాలీ ఎల్ఎల్బీ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న నటి -
అది నా దురదృష్టం: రణ్బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు సొంతంగా బట్టల బిజినెస్ ఉంది. అదే ఆర్క్స్. గతేడాది ఫిబ్రవరి 14న ఈ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆర్క్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లైవ్లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్బీర్ లవ్ అండ్ వార్తో పాటు రామాయణ సినిమాలు చేస్తున్నాడు. అయితే లవ్ అండ్ వార్ రిలీజ్ పోస్ట్పోన్ అయినట్లు తెలిపాడు.ఎదురుచూపులకు తగ్గ ఫలితంఅదేంటో మరి దురదృష్టం. నేనెప్పుడు సినిమా మొదలుపెట్టినా త్వరగా పూర్తవవు. అందరూ ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, నావి మాత్రం చాలా సమయం పడుతున్నాయి. అయితే అది రిలీజైనప్పుడు మాత్రం మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించాలన్నదే నా కోరిక. రెండుమూడేళ్లుగా చాలా కష్టపడుతున్నాను. కొన్నింటికి సమయం తప్పదు. రామాయణ రిలీజ్ తర్వాతే లవ్ అండ్ వార్ వస్తుంది అని పేర్కొన్నాడు.అనుకోకుండా అలా..రామాయణ ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుంది. తన కూతురు రాహా పుట్టిన నెల అయిన నవంబర్లోనే రామాయణ రిలీజ్ అవుతుండటం యాదృచ్ఛికమైనప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫేవరెట్ సినిమా ధురంధర్ అని చెప్పాడు. అందులో అందరూ అద్భుతంగా నటించారని రణ్బీర్ ప్రశంసించాడు.చదవండి: తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు -
ధురంధర్లో ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా ధురంధర్. మౌత్ టాక్తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోనూ దుమ్ము దులుపుతోంది.అక్షయ్పై సర్వత్రా ప్రశంసలురణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజయ్యాక అందరికన్నా ఎక్కువగా అక్షయ్ పేరే మారుమోగిపోయింది. అతడి స్వాగ్, డ్యాన్స్, లుక్స్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రెహ్మాన్ డకాయిట్గా అక్షయ్ అదరగొట్టేశాడని ప్రశంసలు లభించాయి.స్పందించిన నాగ్అయితే రెహ్మాన్ పాత్ర కోసం అక్షయ్ కంటే ముందు నాగార్జునను సంప్రదించారని ఓ వార్త ఫిల్మీదునియాలో వైరలవుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని కింగ్ నాగ్ కొట్టిపారేశాడు. ధురంధర్ సినిమా కోసం తనను సంప్రదించలేదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ధురంధర్ మూవీ చాలా బాగుందన్నాడు. సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం అదిరిపోయిందని, అతడి ముందు సినిమా ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ కూడా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించాడు. సినిమాలో అందరూ బాగా నటించారని, అక్షయ్ ఖన్నా అద్భుతంగా యాక్ట్ చేశాడని మెచ్చుకున్నాడు. ధురంధర్ సీక్వెల్ కూడా మరింత బ్లాక్బస్టర్ అవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ధురంధర్ 2 మూవీ మార్చి 19న విడుదలవుతోంది.చదవండి: కపుల్ ఫ్రెండ్లీకి హిట్ టాక్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? -
రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..!
బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలైన రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు బెదిరింపులొచ్చాయి. తాజాగా మరో నటికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ నటి హిమాన్షీ ఖురానాకు బెదిరింపులొచ్చాయి. పది కోట్లు ఇవ్వాలని ఓ దుండగుడు డిమాండ్ చేశాడు. దీంతో నటి పంజాబ్లోని మొహాలీ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ మెయిల్ ద్వారా వాయిస్ నోట్ వచ్చిందని.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని హిమాన్షీ తన ఫిర్యాదులో పేర్కొంది. జీషన్ అక్తర్ అనే పేరుతో మెయిల్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నటి హిమాన్షీ ఖురానీ పంజాబీ మూవీ సద్దా హక్తో ఫేమ్ తెచ్చుకున్నారు. జోడీ బిగ్డే పార్టీ, నా.. నా.. నా లాంటి ఆల్బమ్స్తో అలరించారు. అంతేకాకుండా హిందీ బిగ్బాస్ సీజన్- 13లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోకుండానే తండ్రినయ్యా.. ఐవీఎఫ్, సరోగసి ద్వారా!
యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోనని మొండిగా కూర్చున్నాడు ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు, నటుడు తుషార్ కపూర్. అయితే పెళ్లికి విరుద్ధమే కానీ, తండ్రవడానికి కాదని సింగిల్ పేరెంట్ అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్, సరోగసి ద్వారా తండ్రయిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.అక్కడే నేర్చుకున్నా..తుషార్ కపూర్ మాట్లాడుతూ.. మా నాన్నలాగే నేను కూడా పాతకాలం మనిషిని. కాకపోతే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. ఐదేళ్లు అమెరికాలో ఉండటం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఓ బిడ్డకు తండ్రయ్యాను. మా నాన్న అలా కాదు. తను పెళ్లిని గౌరవిస్తాడు. కుటుంబ బంధాలను నమ్ముతాడు.40 ఏళ్లకు తండ్రినయ్యా..నేను కాస్త మొహమాటస్తుడినే. ఎక్కువగా బయట కూడా తిరగను. అయితే ఒక పిల్లవాడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. 40 ఏళ్ల వయసులో తండ్రయ్యాను. తండ్రవడానికి అదే సరైన సమయం అని భావిస్తాను. మన సమాజం మాత్రం 25 ఏళ్లకే పెళ్లి, పిల్లలు అని గోల మొదలుపెడుతుంది. నేను కూడా పెళ్లిని గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ ఎందుకో అది నాకు సూటవదనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు.ఆ జర్నీ వల్లే..39 ఏళ్ల వయసులో ఓసారి తిరుపతికి వెళ్లాను. అప్పుడే నటుడు, నిర్మాత ప్రకాశ్ జాను కలిశాను. తిరుపతి నుంచి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు మా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇద్దరం కాసేపు కూర్చుని కాలక్షేపం చేశాం. అప్పుడే అతడో మాటన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ సింగిల్ పేరెంట్ అవొచ్చుగా.. అదొకసారి ఆలోచించు అన్నాడు. అతడి కుటుంబంలో ఒక అమ్మాయి ఇలాగే సింగిల్ పేరెంట్ అయిందని తెలిపాడు.సినిమావెంటనే నాక్కూడా ఓ బిడ్డ కావాలనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికప్పుడు అన్నీ తెలుసుకుని, ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు. చివరకు ఐవీఎఫ్, సరోగసి ద్వారా తండ్రినయ్యాను అని తుషార్ చెప్పుకొచ్చాడు. తుషార్ కపూర్.. ముజే కుచ్ కెహ్నా హై, గాయబ్, గోల్మాల్, గోల్మాల్ రిటర్న్స్, షోర్ ఇన్ ద సిటీ, ద డర్టీ పిక్చర్, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీ చేస్తున్నాడు.చదవండి: సూర్య-జ్యోతిక ప్రేమను ఒప్పుకోని హీరో తండ్రి -
అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత విక్రమ్ భట్ ఆర్థిక మోసం కేసులో చిక్కుకున్నాడు. దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ్ దంపతులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్లకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.హీరోయిన్ మేకప్ ఆర్టిస్ట్ ఏమందంటే?ఇదే సమయంలో పలువురు ఆర్టిస్టులు విక్రమ్ తమకు సరిగా జీతాలివ్వలేదని ముందుకొస్తున్నారు. 2023లో వచ్చిన 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్, ఖిలోనా (ఇది మధ్యలోనే ఆగిపోయింది) సినిమాలకు టెక్నీషియన్లకు డబ్బు చెల్లించలేదని పలువురు మీడియా ముందుకొచ్చారు. తాజాగా హీరోయిన్ అవికాగోర్కు మేకప్ ఆర్టిస్ట్గా పని చేసిన స్నేహ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.స్పందన లేదుమిడ్డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ శర్మ మాట్లాడుతూ.. 1920: హారర్స్ ఆఫ్ ద హార్ట్ సినిమాకు పని చేసిన చాలామందికి పూర్తి వేతనాలు చెల్లించలేదు. మా జీతాలు మాకు చెల్లించమని అడుక్కుంటున్నాం.. కానీ విక్రమ్ భట్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఒక హెయిర్స్టైలిస్ట్కి అయితే ఇంటి అద్దె కట్టకపోవడంతో అతడిని ఇంటినుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో మాకు సమయానికి డబ్బు చెల్లించారు.సగమే ఇచ్చి..కానీ రెండో షెడ్యూల్కు వచ్చేసరికి నిధులు లేవన్నారు. ఓపక్క డబ్బు లేదంటూనే మరో పక్క కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. 1920 మూవీ కోసం నాకు రోజుకు రూ.18 వేల లెక్కన డీల్ మాట్లాడుకున్నాను. అయితే అందులో నాకు సగమే ఇచ్చారు. విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ను అడిగితే ఆ లెక్కలేవీ తనకు తెలియదంది. పైగా మరికొన్ని రోజులు ఉచితంగా పని చేయమని కోరింది.పైసా ఇవ్వడుడబ్బు ఇవ్వకపోతే నేనెందుకు పని చేస్తానని కరాఖండిగా రానని చెప్పేశాను. దాంతో మరో మేకప్ ఆర్టిస్ట్తో ఉచితంగా పని చేయించుకున్నారు అని చెప్పుకొచ్చింది. విక్రమ్ భట్ మనమంతా ఒకే కుటుంబం అని సెంటిమెంట్ డైలాగ్ చెప్పి అందరితో ఇలాగే పని చేయించుకుంటాడని, డబ్బు మాత్రం సరిగా ఇవ్వడని పలువురు సిబ్బంది వాపోయారు. కొందరికైతే లక్షలు ముట్టాల్సింది ఉందని, అవేవీ ఇవ్వకుండా మోసం చేశాడంటున్నారు.చదవండి: సూర్య -జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు: హీరో తండ్రి -
బన్నీని చూసి బాలీవుడ్ రగిలిపోతోందా?
‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్ అల్లు అర్జున్కి రావడం, జవాన్ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ బాలీవుడ్లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత అల్లు అర్జున్ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి. తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివాదమా? బాలీవుడ్ వ్యూహమా?ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాడ్కాస్ట్లో పాల్గొన్న ఓ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్ పేరు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో ట్రెండింగ్గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్ పెరుగుతున్న పాన్ ఇండియా క్రేజ్ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఇలా టాలీవుడ్ స్టార్స్పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ టీమ్ స్పందన..తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించి వైరల్ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. -
పాక్లో ధురంధర్ సీడీలు.. ఇంత చీప్గా దొరుకుతున్నాయా?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ గతేడాది ధురంధర్తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్లోనూ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అక్కడ థియేటర్లలో రిలీజ్ అవకుండా బ్యాన్ చేసినప్పటికీ ఓటీటీలో మాత్రం తెగ చూసేస్తున్నారు.సీడీల అమ్మకంఅంతేకాదు, పాక్లో ధురంధర్ మూవీ పైరసీ క్యాసెట్లు కూడా అమ్ముతున్నారు. యూట్యూబర్ కార్ల్ రాక్ షేర్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని రెయిన్బో సెంటర్ పైరసీ కంటెంట్కు పెట్టింది పేరు. అక్కడ ధురంధర్ సినిమా సీడీలను 50 పాకిస్తాన్ రూపాయలకే ( భారత కరెన్సీలో రూ.16కే) అమ్ముతున్నారు. పాకిస్తాన్లో ఇండియన్ సినిమాలను నిషేధిస్తారు. కానీ ఇక్కడ నేనేం కనుగొన్నానో చూడండి అంటూ యూట్యూబర్ ధురంధర్ సీడీ చూపించాడు.అటు బ్యాన్.. ఇటు పైరసీఇది చూసిన జనాలు.. పాకిస్తాన్ను తిట్టే సినిమాలను అక్కడి ప్రజలే ప్రేమిస్తున్నారు.. ఇది మరీ విడ్డూరం. ఇంకా పైరసీ క్యాసెట్లు అమ్ముతున్నారంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం ఏమో ధురంధర్పై బ్యాన్ విధించింది. వీళ్లేమో ఎంతో సులువుగా పైరసీ చేస్తున్నారు. మరోపక్క మూవీ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్ 2 మార్చి 19న విడుదలవుతోంది. View this post on Instagram A post shared by Karl Rock (@iamkarlrock) చదవండి: అర్జున్తో వివాదం.. విశ్వక్ ఏమన్నాడంటే? -
రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. హీరోయిన్ ఏమందంటే?
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలుస్తాయి. అలాంటి డిజాస్టరే అందుకుంది 2023లో వచ్చిన "ది లేడీ కిల్లర్". ఈ సినిమా వైఫల్యం గురించి తాజాగా స్పందించింది హీరోయిన్ భూమి పెడ్నేకర్. దల్దల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా మిడ్ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన స్క్రిప్ట్ పరిపూర్ణంగా ఉంది. కానీ, అందులో చాలా భాగాన్ని తెరకెక్కించలేదు. ముందే తెలిసుంటే బాగుండుఅసంపూర్తిగానే సినిమా రిలీజ్ చేశారు. ఇది నాకు ముందే తెలిసుంటే బాగుండేది. నేను కూడా మేకింగ్లో భాగమై ఉంటే కొన్ని విషయాలను మార్చగలిగేదాన్ని. అయినా జరిగినదానికి నేను షాక్లోనే ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. కాబట్టి ఈ సినిమా పరిస్థితేంటా? అని భయపడ్డాను. చివరకు ఇది ఒక గుణపాఠం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. సినిమా షూట్ అవలేదుదాదాపు 35% సినిమా షూట్ చేయనేలేదు. అయినా రిలీజ్ చేశారు. అది నా జీవితంలోనే ఎంతో బాధాకరమైన విషయం. ఈ సినిమాకిలా జరగడం నన్ను ఎంతగానో కలిచివేసింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను చాలా బాధపెట్టింది. ఇక నా పనైపోయిందనుకున్నాను. అసలు దానికి బాధ్యులెవరన్నది ఇప్పటికీ నాకర్థం కాదు అని భూమి పెడ్నేకర్ చెప్పుకొచ్చింది.సినిమాద లేడీ కిల్లర్ సినిమా విషయానికి వస్తే.. అజయ్ భేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా నటించారు. దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.1 లక్షలోపే కలెక్షన్స్ రాబట్టింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో యూట్యూబ్లో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు.చదవండి: రామ్చరణ్- ఉపాసన కవలల పేర్ల వెనక అర్థం ఇదే.. -
నా గర్భాశయాన్ని తీసివేయించాడు.. ఉదిత్ నారాయణ్పై రంజనా ఫిర్యాదు
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు రంజనా ఝా చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది.NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. బీహార్లోని సుపాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య కలిసి తనపై క్రిమినల్ కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ నారాయణ్తో విడాకులు తీసుకున్న తర్వాత రంజనా ఝా పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. అయితే, తాజాగా ఆమె చేసిన ఆరోపణ అత్యంత హేయంగా ఉంది. ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం... 1996లో హెల్త్ చెకప్ పేరుతో తనను ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. అయితే, తనకు తెలియకుండా గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపించింది. తన అంగీకారం లేకుండా ఉదిత్ నారాయణ కుట్ర పన్నారని చెప్పింది. తాను తల్లి కాకుండా అడ్డుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఈ విషయం తనకు చాలా ఏళ్ల తర్వాత తెలిసిందని చెప్పింది. మరో అనారోగ్య సమస్యతో డాక్టరును సంప్రదించినప్పుడు అసలు విషయం బయటపడిందని పేర్కొంది. ఉదిత్ నారాయణ్ చేసిన ఈ మోసం తనను మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఎంతో కుంగదీసిందని పోలీసుల ముందే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కుట్రలో ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్య దీప కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ని రెండో పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. 1984న హిందూ ఆచారాల ప్రకారం తనను మొదట పెళ్లి చేసుకున్నాడని రంజనా తెరపైకి వచ్చింది. అయితే తొలుత బుకాయించాడు గానీ ఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. కొంత కాలంగా భరణం కూడా చెల్లించడం లేదని రంజనా తెలుపుతుంది. -
యానిమల్ నటుడి యాక్షన్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సుబేదార్. ఈ యాక్షన్ సినిమాకు సురేశ్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుబేదార్ అర్జున్ మౌర్య జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు దేశం కోసం పోరాడిన సైనికుడు.. తన ఇంటిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి శత్రువులతో పోరాటం చేశారనే కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా సుబేదార్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. విక్రమ్ మల్హోత్రా, అనిల్ కపూర్, సురేష్ త్రివేణి నిర్మిస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. వచ్చేనెల మార్చి 5 నుంచి ఓటీటీలో డైరెక్ట్గా రిలీవుతోంది. ఈ చిత్రంలో రాధిక మదన్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్ , ఫైసల్ మాలిక్ కీలక పాత్రల్లో నటించారు. -
నాకు జరిగినట్లు నా కూతురికి జరగనివ్వను!
నాలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వనంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్ మాట్లాడుతూ.. నా తండ్రి (నటుడు రణ్బీర్ కపూర్)కి, నాకు మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. మేమిద్దరం అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం కాదు. ఎందుకంటే ఆ జనరేషన్లో తండ్రీకొడుకుల మధ్య అలాంటి సీరియస్నెస్సే ఉండేది. ఇద్దరి మధ్య ఒక గోడ ఉండేది. నా కూతురి విషయానికి వచ్చేసరికి ఆ గోడను నేను కూల్చాలనుకుంటున్నాను. తనతో ఒక ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నాను. తను నచ్చినవన్నీ చేసేందుకు సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్బీర్ కపూర్- ఆలియా భట్.. 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఈ దంపతులకు కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం రణ్బీర్- ఆలియా.. లవ్ అండ్ వార్ సినిమా చేస్తున్నారు. అలాగే రణ్బీర్.. రామాయణ మూవీలో రాముడిగా కనిపించనున్నాడు. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. యష్ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా: నిఖిల్ -
దృశ్యం 3లో ప్రకాశ్ రాజ్.. కానీ!
ఈ మధ్య ప్రకాశ్ రాజ్ గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. దీంతో అదంతా ఫేక్ న్యూస్ అని అతడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. హిందీ 'దృశ్యం 3' సినిమాలో అక్షయ్ ఖన్నా తప్పుకున్న విషయం తెలిసిందే! ప్రకాశ్రాజ్ క్లారిటీఆ స్థానంలో ప్రకాశ్ రాజ్ నటించనున్నాడన్నది లేటెస్ట్ టాక్. ఈ ఊహాగానాలపై ప్రకాశ్రాజ్ స్పందించాడు. తాను దృశ్యం 3లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. హిందీ మూవీ 'దృశ్యం 3'లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్ కూడా మొదలైంది. కాకపోతే నేను ఎవరినీ రీప్లేస్ చేయడంలేదు అని వెల్లడించాడు.సూపర్ హిట్ ఫ్రాంచైజీదృశ్యం విషయానికి వస్తే.. మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ సినిమా పలు భాషల్లో రీమేకై అక్కడా విజయం సాధించింది. దీనికి సీక్వెల్గా వచ్చిన రెండో భాగం మరింత సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు దృశ్యం ఫ్రాంచైజీలో మూడో భాగం రాబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్ పూర్తవగా రిలీజ్కు రెడీ అవుతోంది. హిందీలో అజయ్ దేవ్గణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.దృశ్యం 3 నుంచి అక్షయ్ అవుట్'దృశ్యం 2'లో పోలీస్ అధికారి పాత్రలో యాక్ట్ చేశాడు అక్షయ్ ఖన్నా. ఈ లెక్కన మూడో భాగంలోనూ అతడు ఉండాల్సిన వ్యక్తి! కానీ 'ధురంధర్' సక్సెస్ తర్వాత గర్వం అతడి తలకెక్కిందని, గొంతెమ్మ కోర్కెలు కోరాడని ప్రచారం జరిగింది. నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ కూడా అదే నిజమన్నాడు.గొంతెమ్మ కోర్కెలు'అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ, విగ్ కావాలని డిమాండ్ చేశాడు. దృశ్యం 2లో బట్టతలతో కనిపించి ఇప్పుడు జుట్టుతో కనిపిస్తే బాగోదని నచ్చజెప్పాం. అప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకోవడంతో నోటీసులు ఇచ్చాం' అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో జైదీప్ అహ్లావత్ను తీసుకున్నట్లు కూడా తెలిపాడు. ఇంతలోనే ప్రకాశ్ రాజ్ తెరమీదకు రావడం, ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. Started shooting for this engaging franchise #Drishyam3 in hindi. With a wonderful team and a scintillating role to play . Im sure you will love it . ❤️❤️❤️( and yes im not replacing anyone..) 😛😛😛— Prakash Raj (@prakashraaj) February 10, 2026 చదవండి: ఏదైనా జరగరానిది జరిగితే.. శ్రీహాన్ మంచి మనసు -
లక్నో నుంచి లాహోర్ వెళ్తే?
సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘లాహోర్ 1947’. షబానా అజ్మీ, ప్రీతి జింతా, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.భారత్ – పాకిస్తాన్ దేశాల విభజన కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉండదట. లక్నోకు చెందిన ఓ ముస్లిం కుటుంబం కొన్ని పరిస్థితుల కారణంగా లాహోర్ వెళ్లాల్సి వస్తుందట. ఆ తర్వాత అక్కడ ఆ కుటుంబం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే కోణంలో ‘లాహోర్ 1947’ సినిమా కథనం సాగుతుందని సమాచారం. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
బాలీవుడ్ మూవీ.. పైసా తీసుకోని తమన్నా, విక్రాంత్!
వాలంటైన్స్ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.స్టార్ అవడానికి ముందే..అయితే విక్రాంత్ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్ తర్వాత అతడు పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. ఉచితంగానే..నేను డైరెక్ట్ చేసిన మఖ్బూల్ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్కు కూడా వచ్చింది అని విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నాడు.చదవండి: సెట్లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్ -
ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పిన కరీనా కపూర్
ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 అయినప్పటికీ వారం రోజుల ముందే సందడి మొదలవుతుంది. రోజ్డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే.. అంటూ ఫిబ్రవరి 7 నుంచే రోజుకో రకమైన సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అలా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే. ఈ క్రమంలో బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తమలో ఎవరు ముందుకుగా ప్రపోజ్ చేశారో వెల్లడించారు.నగలు బహుమతివీరిద్దరూ జంటగా వోగ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కరీనా కపూర్ మాట్లాడుతూ నా బర్త్డే, పెళ్లిరోజుకు సైఫ్ జ్యువెలరీ గిఫ్ట్గా ఇస్తుంటాడు అంది. ఇంతలో సైఫ్ కలగజేసుకుంటూ ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు కూడా తనకు బహుమతులిస్తుంటాను అని చెప్పాడు.నాకైతే గుర్తు లేదుఐ లవ్యూ ఎవరు ముందుగా చెప్పారన్న ప్రశ్నకు.. కరీనా అది నేనే అయ్యుంటుంది. అతడు నన్ను ఇబ్బంది పెట్టకూడదనే చూస్తాడు. కాబట్టి నేనే సాహసం చేసి చెప్పుంటాను అంది. అందుకు సైఫ్.. ఇది నిజంగా బాగుంది, నాకైతే ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న విషయం అసలు గుర్తేలేదు అన్నాడు.పెళ్లిసైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ 2008లో వచ్చిన తషాన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారులు తైమూర్, జే సంతానం. కాగా సైఫ్ అలీ ఖాన్కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో సైఫ్.. అమృత సింగ్ను పెళ్లి చేసుకోగా వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఈ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2004లో విడిపోయారు.చదవండి: అజిత్ను కలిసేందుకు క్యూ కడుతున్న హీరోలు -
Prabhas Kalki 2 Update: కమల్.. అమితాబ్ రెడీ.. మరి ప్రభాస్?
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దాంతో త్వరలో రానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ ఇవ్వడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', హనుతో 'ఫౌజీ' సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రం ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు రెడీ అవుతున్నాయి. కల్కి 2కు ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది. దాంతో ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్ను కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. హీరో ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


