breaking news
Bollywood
-
ఓటీటీకి రష్మిక మందన్నా లేటేస్ట్ మూవీ.. అఫీషియల్ ప్రకటన
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026 -
విలన్గా స్టార్ హీరో.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో విలన్గా నటిస్తోన్న లేటేస్ట్ ముూవీ హైవాన్. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో హైవాన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, రాజ్పాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ కె నారాయణ, శైలజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ స్టార్ హీరోకు నాపై క్రష్ ఉంది: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’లో పాల్గొన్న ఆమె.. టామ్ క్రూజ్కు తనపై క్రష్ ఉందని, తనకు వీడియోలు కూడా పంపిస్తుంటారని తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘మీకు ఎప్పుడైనా ఎవరిపైనైనా క్రష్ కలిగిందా..?లేక మీపై ఎవరికైనా క్రష్ ఉందా..?’ అని కామెడీయన్ ఆదిత్య కులశ్రేష్ఠ(కుల్లు) మల్లికను అడిగారు. ‘అందరికీ నాపైనే క్రష్ కలుగుతుంది. ప్రస్తుతం టామ్ క్రూజ్కు కూడా నాపై క్రష్ ఉంది. మేమిద్దరం కలిసి పార్టీ చేసుకున్న సమయంలో తీసిన వీడియోలు క్రూజ్ నాకు పంపించినప్పుడు ఇతర కంటెస్టెంట్లకూ వాటిని చూపించేదానిని’ అని పేర్కొన్నారు. పెళ్లిపై మల్లికా ఏమన్నారం..మల్లికా గతంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్తో రిలేషన్లో ఉండేవారట. 2024 నుంచి తాను సింగిల్గా ఉన్నట్లు వెల్లడించారు. పెళ్లికోసం మాట్లాడుతూ.. ‘పెళ్లికి అనుకూలంగా లేను. అలా అని దానికి వ్యతిరేకం కూడా కాదు. ఇద్దరు వ్యక్తులు ఏం కోరుకుంటున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. అని తెలిపారు. కాగా కరణ్ జోహర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ షో ఆగస్టు 13 నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. శ్వేతా తివారీ, మునావర్ ఫారూఖీ, క్రిస్టల్ డిసౌజా, రణ్వీర్ బ్రార్, ఇక్కా, పారుల్ గులాటి, అభిషేక్, తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్
రంగీలా, గాయం, సత్య, భూత్ లాంటి సినిమాలతో అప్పట్లో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్.. ప్రస్తుతం నటనకు పూర్తిగా దూరమైంది. ఎనిమిదేళ్ల క్రితం ఓ మూవీ చేయగా, నాలుగేళ్ల క్రితం ఓ షోలో కనిపించింది. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి కూడా వచ్చింది గానీ ఇందులోనూ ఎక్కువనాళ్లు ఉండలేదు. అలాంటి ఈమె ఉన్నఫలంగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఈమె మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)ఊర్మిళా..2018లో నటుడు మొహ్సిన్ అక్తర్ మీర్ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్గా మొహ్సిన్ మరో వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇవి బయటకు రావడానికి కొన్ని గంటల ముందే ఉర్మిళ తన ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది.'ప్రేమ, సమయం, విధేయత లాంటి ఖరీదైన విషయాలే నాకు నచ్చుతాయి' అని ఊర్మిళా ఓ కోట్ షేర్ చేసింది. అయితే ఈమె తన మాజీ భర్తని ఉద్దేశించే పెట్టిందా అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొహ్సిన్ పేరు ప్రస్తావించనప్పటికీ అతడికి కౌంటర్ ఇచ్చేలా ఊర్మిళ తన భావాన్ని బయటపెట్టిందని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్) -
సెల్ఫీ అంటూ వచ్చి బలవంతంగా లిప్ లాక్.. హీరోయిన్ కు లేడీ ఫ్యాన్ బిగ్ షాక్
-
డిసెంబరులో ఈఠా
మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయిగా వెండితెరపై శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. రణదీప్ హూడా ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల చేయడం లేదని, ఈ ఏడాది డిసెంబరు 4న రిలీజ్ చేయనున్నామని మంగళవారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. -
కొత్త భార్యపై ప్రేమ.. మాజీ భార్యను గుర్తుచేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జూన్లో నిధా భట్ను వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా తన రిసెప్షన్కు సంబంధించిన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ నోట్ రాశారు. అది ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.‘నువ్వు కేవలం నా భార్యగా మాత్రమే కాదు.. నా ఇల్లు, ప్రశాంతత, ప్రతిరోజూ నాకు ఇష్టమైన వ్యక్తిగా మారావు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రతి దశలో నిన్ను ప్రేమిస్తూ, నీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మనం కలిసి నిర్మించబోయే అందమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందమైన జంట.. మీ ఇద్దరూ ప్రేమతో, ఆనందంగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మోహ్సిన్ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఊర్మిళతో ఉన్న సమయంలోనూ ఇలాంటి హామీలే ఇచ్చి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఊర్మిళ, మోహ్సిన్ మధ్య ఏం జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.గతంలోనూ వైరల్..మోహ్సిన్ తన రెండో పెళ్లి సమయంలోనూ సోషల్మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘స్వచ్ఛమైన ఉద్దేశాలు, నిజమైన ప్రేమతో పాటు దేవుడి నిర్ణయాన్ని విశ్వసించాలి. సరైన సమయంలో నిధాను నా జీవితంలోకి తీసుకొచ్చారు. ఆమె నా జీవితంలో వెలుగులు నింపింది’ అని రాసుకొచ్చారు.2016లో ఊర్మిళతో వివాహం..ఊర్మిళ మటోండ్కర్, మోహ్సిన్ అక్తర్ మీర్ 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో పాటు.. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉండటంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. 2014లో ఓ వివాహ వేడుకలో ఊర్మిళను కలిసిన మోహ్సిన్.. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డారని సమాచారం. రెండేళ్ల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. -
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఓటీటీలో ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్న సూపర్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడు ఇగే వెబ్ సిరీస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్గా మారబోతోంది. వీరితో పాటు భోజ్పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే హిట్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా వెబ్ సిరీస్లకు ప్రీక్వెల్గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్ తెలిపింది. సిరీస్ మూడు పార్ట్లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
అగ్నివీర్గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్ను ఎంచుకుంది.రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్లో పనిచేశారు. కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
విడుదల తేదీ ఖరారు
బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , సంజయ్దత్ నటించిన అంతర్జాతీయ చిత్రం ‘7 డాగ్స్’ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈజిప్ట్ సూపర్స్టార్స్ అహ్మద్ ఎజ్, కరీమ్ అబ్దెల్ అజీజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటర్నేషనల్ మూవీ ‘7 డాగ్స్’. ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’, ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’ చిత్రాల ఫేమ్ దర్శక–ద్వయం ఆదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫల్లా తెరకెక్కించారు. ఇటాలియన్ నటి మోనికా బెల్లూసి, అమెరికన్ యాక్టర్ గియాన్ కర్లో అలెశ్శాండ్రో కీలక పాత్రల్లో నటించారు. సెలా స్టూడియోస్, జనరల్ ఎంటర్టైన్ మెంట్ అథారిటీ, రియాద్ సీజన్ నిర్మించిన ఈ చిత్రం మిడిల్ ఈస్ట్లో ఈ ఏడాది మే 27న అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో విడుదలై హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 21న భారత్లో రిలీజ్ చేయనున్నట్లు సోమవారం ప్రకటించి, ఓ వీడియో విడుదల చేశారు. -
గోవిందాతో ఆ యువ నటి.. మళ్లీ తెరపైకి ‘కోమల్’ పేరు!
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముంబై విమానాశ్రయంలో ఆయన యువ నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గతంలో గోవిందా భార్య సునీత ఆహూజా చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఆ ‘కోమల్’ ఎవరు? సునీత గతంలో ఎందుకు ఆమె పేరు ప్రస్తావించారో తెలుసుకుందాం..!గోవిందా, కోమల్ రాణి మధ్య గత నాలుగేళ్లుగా సంబంధం ఉందంటూ గతంలో కొన్ని వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఉత్తరాఖండ్లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరైనట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రచారంపై గోవిందా కానీ, కోమల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.గతంలో సునీత ఏం చెప్పారు?గోవిందా వివాహేతర సంబంధాలపై గతంలో జరిగిన చర్చ సందర్భంగా సునీత ఆహూజా ఓ ఇంటర్వ్యూలో ‘కోమల్’ అనే పేరును ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో కోమల్ పేరు గురించి ప్రశ్నించగా.. ఆ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. గోవిందా విషయంలో ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు తనకు లభిస్తే మాత్రం క్షమించబోనని సునీత స్పష్టం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి కనిపించడంతో సునీత అప్పట్లో ప్రస్తావించిన ‘కోమల్’ ఈమెనేనా? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరీ కోమల్ రాణి స్వర్ణకర్?ఉత్తరప్రదేశ్కు చెందిన కోమల్ రాణి స్వర్ణకర్ త్వరలో ‘రూపా’ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
సాహిత్యంలో నవలలు, నాన్-ఫిక్షన్, వ్యాసాలు, పీహెచ్డీ థీసిస్ల విషయంలో ‘ప్లాగరిజం’ (సాహిత్య చోరీ లేదా భావజాల దొంగతనం) అనే పదం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాటకాలు, లలిత కళలు, సినిమా వంటి ఇతర సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్లాగరిజం’ నిబంధనలను అత్యధికంగా ఉల్లంఘిస్తున్న రంగం బహుశా సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 1970లలో లేదా మరెప్పుడో ప్రపంచంలో ఎక్కడో తీసిన ఒక సినిమాను కాపీ కొట్టడం లేదా దాదాపుగా దానినే పోలిన చిత్రాన్ని రూపొందిండం, దానికి ఆధునిక పాత్రలను అద్దడం, కథలో చిన్న మార్పులు చేయడం, కథనంలో మాత్రం స్వల్ప పోలికలను ఉంచుకుని దానిని తమ సొంత సృష్టిగా ప్రచారం చేసుకోవడం చిత్రనిర్మాతలకు సులభం కావడంతో ఇది అత్యంత సాధారణంగా జరుగుతుంటుంది.‘ప్లాగరిజం’ అంటే..ఒకరి ఆలోచనలు, సమాచారం, భాష లేదా రచనను అసలు మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా (క్రెడిట్స్ ఇవ్వకుండా) ఉపయోగించడాన్ని ‘ప్లాగరిజం’ అంటారు. అసలైనదిగా నమ్మించే ప్రయత్నంలో ఒక రకమైన అనైతికత ఉండటం దీనిలోని ప్రధానాంశం. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు జరిగే కాపీరైట్ ఉల్లంఘనకు, ‘ప్లాగరిజం’నకు ఎప్పుడూ ఒకే అర్థం ఉండదు. బౌద్ధిక ఆస్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) రంగానికి చెందిన చాలా పదాల మాదిరిగానే, ‘ప్లాగరిజం’ కూడా ఆధునిక యుగానికి చెందిన భావనగా పరిణమించింది. భారతీయ లేదా అంతర్జాతీయ చలనచిత్రాల నుంచి కథలు, పాత్రలు, థీమ్లు, కథనాలను ‘అరువు తెచ్చుకోవడం’, ‘స్ఫూర్తి పొందడం’, ‘ప్రేరణ పొందడం’ లేదా ‘అడాప్ట్ చేసుకోవడం’ వంటివి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉన్నాయి.చార్లీ చాప్లిన్ సినిమా సినిమాతో..ఈ కోవలో ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం రాజ్ కపూర్ నిర్మించిన ‘శ్రీ 420’. చార్లీ చాప్లిన్ సినిమా ‘ట్రాంప్’ (అవసరాల కోసం తిరిగే వ్యక్తి) ఇమేజ్ను స్ఫూర్తిగా తీసుకున్నారనే విమర్శలను ఈ చిత్రం ఎదుర్కొంది. రాజ్ కపూర్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చోరీ చోరీ’ (1956) చిత్రం, క్లార్క్ గేబుల్, క్లాడియా కోల్బర్ట్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇట్ హ్యాపెండ్ వన్ నైట్’ (1934)కి కాపీయే. ‘ఫిర్ సుభా హోగి’ (1958) చిత్రంలో రాజ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది దోస్తోవ్స్కీ రాసిన సామాజిక దృక్పథం కలిగిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. క్వెంటిన్ టరాంటినో చిత్రం ‘రిజర్వాయర్ డాగ్స్’కి రీమేక్గా వచ్చిన ‘కాంటే’ చిత్రంలో బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో బాలీవుడ్ పాటలు, నృత్యాలను జోడించారు.నైతికపరమైన ఉల్లంఘన 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో, ఆయన కూతురు పూజా భట్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో అదే (కాంటే) సినిమాకు ఆధునికత, గ్లామరస్ జోడించి ‘దిల్ హై కి మాన్తా నహీ’ వచ్చింది. కాపీకి మూలమైన చిత్రం లేదా దర్శకుడి పేరును టైటిల్స్లో పేర్కొంటే ‘ప్లాగరిజం’ చేసినట్లు కాదు. కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు. అయినా వారు నైతికపరమైన నిజాయితీని ఉల్లంఘించినవారవుతారు (చట్టపరంగా కాకపోయినా). జాన్ అబ్రహాం, నానా పటేకర్ నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రం, బెన్ అఫ్లెక్, శామ్యూల్ జాక్సన్ నటించిన ‘చేంజింగ్ లేన్స్’ (2002) ఆధారంగా తెరకెక్కిందని చెబుతారు.మోహన్లాల్.. ‘నేరు’పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాలు ‘ప్లాగరిజం’ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటాయి. స్క్రిప్ట్లు, సన్నివేశాలు లేదా పాటలను కాపీ చేశారనే ఆరోపణలపై అనేక చిత్రాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయితే విదేశీ నిర్మాతలు, బ్యానర్లు వీటిని పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాల సినిమాలు దీనికి మినహాయింపు కాదు. మలయాళ చిత్రం ‘నేరు’ (2023) విషయంలో, పిటిషనర్ దీపక్ ఉన్ని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. జీతూ జోసఫ్, మోహన్లాల్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో తాను ఇదివరకే వారికి చెప్పిన స్క్రిప్ట్ లోని ఆలోచనలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ‘నేరు’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించింది. ఇక్కడ చిత్రంలో మోహన్లాల్ పెద్ద స్టార్గా ఉండటమే కారణం కావచ్చని అంటారు.కమల్ హాసన్.. ‘పాపనాశం’కమల్ హాసన్ కూడా తన కొన్ని సినిమాల్లో ‘ప్లాగరిజం’ ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ ‘పాపనాశం’. ‘ఒరు మజక్కాలతు’ నవల కాపీరైట్లను ఉల్లంఘించారంటూ సతీష్ పాల్ నిర్మాతలు, దర్శకుడు జీతూ జోసఫ్పై దావా వేశారు. అయితే చిత్ర నిర్మాతలు, కమల్ హాసన్ మద్దతుతో దర్శకుడు జీతూ జోసఫ్ ఆ కేసును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా నటించిన తమిళ చిత్రం ‘లింగా’పై మధురైకి చెందిన చిత్రనిర్మాత కె.వి. రవి రత్నం ఇది తన అసలు కథ అని ఆరోపించారు. అయితే ‘లింగా’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, రజనీకాంత్ స్వయంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ‘లింగా’ పొన్కుమరన్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.ముంబై ఫిలింమేకర్స్ మాట ఇదే..జాతీయ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ‘బ్యారి’ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంది. చివరకు రచయిత్రి సారా అబూబక్కర్ నవలను అనధికారికంగా అడాప్ట్ చేసుకున్నందుకు ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అలాగే మ్యూజికల్ సిమిలారిటీకి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్ల కారణంగా ‘కాంతారా’ చిత్రం హిట్ ట్రాక్ ‘వరాహ రూపం’ చట్టపరమైన ఆంక్షలు ఎదుర్కొంది. లక్ష్మణ్ దర్శకత్వం వహించి జయం రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ చిత్రం 2017లో ‘ప్లాగరిజం’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ భారతీయ చలనచిత్ర విశ్లేషకుడు ఎంకే రాఘవేంద్ర రాసిన ‘ప్లాగిరిజంగ్ ఫర్ బాలీవుడ్’ అనే పత్రం ప్రకారం ‘పాపులర్ ఇండియన్ సినిమా హాలీవుడ్ను అనుకరిస్తుందని భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ దేశాల సినిమాలతో పోలిస్తే తమ చిత్రాల కంటెంట్, ఫార్మాట్ భిన్నంగా ఉంటాయని ముంబై ఫిలింమేకర్స్ చెబుతున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే హాలీవుడ్ ‘కాపీ’ చిత్రాలు విజయవంతం కావాలంటే ఆ చిత్రాల్లో భారతీయుల తీరు తెన్నులను, ఇక్కడి సంస్కృతిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇతరుల భావాలు, కాన్సెప్ట్ల ద్వారా ‘స్ఫూర్తి’ పొందడాన్ని, వాటికి భాష, సాంస్కృతిక కోణాలు, భారతీయతను జోడించి సినిమాలు తీయడాన్ని రాఘవేంద్ర సైద్ధాంతికంగా వ్యతిరేకించ లేదు. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
హాలీవుడ్లో యానిమేషన్ మూవీ
బాలీవుడ్ దర్శకురాలు నిత్య మెహ్రా ఓ యానిమేషన్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాను పారామౌంట్ పిక్చర్స్, జొనాథన్ గోల్డ్స్టైన్, జాన్ ఫ్రాన్సిస్ డేలీ, కునాల్ నయ్యర్ కలిసి నిర్మించనున్నారట. న్యూజెర్సీకి చెందిన ఇండో–అమెరికన్ టీనేజ్ అమ్మాయి అనుకోకుండా బాలీవుడ్ మ్యూజికల్ ప్రపంచంలోకి వెళ్లినప్పుడు, ఈ యంగ్ అమ్మాయికి ఎదరైన సవాళ్లు? పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్.‘బార్ బార్ దేఖో’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన నిత్య ఆ తర్వాత ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు హాలీవుడ్లో చేయనున్న యానిమేషన్ మూవీపై ఫోకస్ పెట్టారు. -
నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బాలీవుడ్లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026 -
టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా?
భార తీయ సినిమాలో కోలీవుడ్ సినిమా ప్రత్యేక స్థానానికి చేరుకుంది. పలు తమిళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వసూ ళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే పలువురు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీలు తమిళంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా నుంచి ఐశ్వర్యారాయ్, దిశా పటానీ వరకు పలువురు ఉత్తరాది భామలు తమిళ చిత్రాలు చేశారు. తాజాగా మరో టాప్ హీరోయిన్ దృష్టి కోలీవుడ్ పై పడినట్లు సమాచారం. ఆ బ్యూటీ ఎవరో కాదు టాక్సిక్ భామ కియారా అద్వానీ.బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిమణుల్లో ఈమె ఒకరు. 2014లో ఫగ్లీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు భారీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. హిందీ చిత్రాలు నటిస్తూనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ మహేష్ బాబుకు జంటగా భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్తో జత కట్టారు. తాజాగా ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి టాక్సిక్ చిత్రంలో యష్కు జంటగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.ఇలా దక్షిణాదిలో తెలుగు, కన్నడం ప్రేక్షకులకు దగ్గరైన కియార అద్వానీ దృష్టి ఇప్పుడు కోలీవుడ్పై పడినట్లు సమాచారం. ఒక తమిళ ప్రముఖ నటుడు ఈమెను కోలీవుడుకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కథను కూడా చెప్పినట్లు, అందులో నటించడానికి కియారా అద్వానీ సుముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
మరో ప్రేమకథలో..?
యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, శ్రీలీల కలసి హిందీలో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఉమేష్ బిష్ట్ ట్రయాంగిల్ లవ్స్టోరీతో కూడిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేశారట. ఏక్తా కపూర్, గునీత్ మోంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్ రోల్స్లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఒకే అబ్బాయిపై ఇద్దరు అమ్మాయిలు విపరీతమైన ప్రేమ పెంచుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బీ టౌన్ టాక్.అలాగే ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. కాగా, ఈ సినిమాలో హీరోగా నటించే యాక్టర్ కోసం దర్శక–నిర్మాతలు పలువురి యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఓ హీరోను ఫైనలైజ్ చేసి, సినిమాను అధికారికంగా ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. మరి... ఇద్దరు అమ్మాయిల ప్రేమను పొందగలిగే ఆ హీరో ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... హిందీలో శ్రీలీల ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ ఫిక్స్ అయితే... బాలీవుడ్లో మరో ప్రేమకథా చిత్రం శ్రీలీల డైరీలో ఉంటుంది. -
భారత క్రికెటర్ జైస్వాల్తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్
సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలా రీసెంట్ టైంలో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ గురించి ఒకటి బయటకొచ్చింది. భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో డేటింగ్లో ఉందని అన్నారు. ముంబైలోని ఓ కాఫీ షాప్లో జంటగా కనిపించారని పుకార్లు తెగ అల్లేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా మృణాల్ స్పందించింది. కామెంట్ పెట్టి క్లాస్ పీకింది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)తను-జైస్వాల్ వైరల్ వీడియోకు సంబంధించి ఓ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ కనిపించగా.. దానికి మృణాల్ కామెంట్ పెట్టింది. ఒకేచోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు? అలా ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించింది.'బ్రో రిలాక్స్.. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం? మీరు ఇంత చదువుకున్నవాళ్లు కానీ ఇలాంటి పుకార్లను నిజమని ఎలా నమ్ముతున్నారు? దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. జెన్-జీ నుంచి కొంత నేర్చుకోండి. సరైన సమస్యలపై వీడియోలు చేయండి. అప్పుడు మరిన్ని వ్యూస్ వస్తాయి' అని మృణాల్ కామెంట్ చేసినట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రూమర్కి స్పందించినట్లు లేదు. చిన్నపాటి క్లాస్ పీకినట్లు ఉంది.అయితే మృణాల్పై డేటింగ్ రూమర్స్ ఇదేం కొత్త కాదు. తమిళ హీరో ధనుష్తో డేటింగ్లో ఉందని, వాలంటైన్స్ డే నాడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ మాట్లాడుకున్నారు. తీరా చూస్తే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈమె నుంచి మూడు సినిమాలొచ్చాయి. వాటిలో 'డెకాయిట్' అనే తెలుగు మూవీ ఉంది. త్వరలో 'పూజా మేరీ జాన్' అనే ఓటీటీ చిత్రంలో కనిపించనుంది.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ) -
‘ఓహ్ మై డాగ్’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘ఓహ్ మై డాగ్’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జంతుప్రేమికులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కుక్కలు, మనుషుల మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించారు. ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు బోల్తాకొట్టినట్లు కనిపిస్తోంది. సాక్నిల్క్(saknilk) ప్రకారం.. ఇండియాలో తొలి రోజు ‘ఓహ్ మై డాగ్’ సుమారు రూ.85లక్షల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు దాదాపు రూ.1.02 కోట్లుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ సినిమా 844 షోలను ప్రదర్శంచారు. తక్కువ సంఖ్యలో తెరలపై విడుదల కావడం కూడా ఈ వసూళ్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశముంది.ఈ సినిమాని కుక్కలు,వాటితో మనుషులకు ఏర్పడే అనుబంధమే ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు దర్శకుడు అమిత్ రాయ్. గతంలో పంకజ్ త్రిపాఠితో ‘ ఓహ్ మై గాడ్’ గా ఇప్పుడు ‘ఓహ్ మై డాగ్’గా టైటిల్ మార్చి తెరకెక్కించారు. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. -
సల్మాన్ఖాన్ ఇంటి ముందు కానిస్టేబుల్ మృతి.. ఏం జరిగింది..!
ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేశ్(41) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్ఖాన్ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా గణేశ్ విధులకు వచ్చారు. డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. తోటి పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సల్మాన్కు భద్రత ఎందుకంటే..గతంలో సల్మాన్ఖాన్కు గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. మరోపక్క 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కూడా బిష్ణోయ్ బృందం కఠినంగా ఉన్నట్లు చెబుతుంటారు. 2024లో సల్మాన్ నివాసమైన బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెట్స్ వద్ద కాల్పులు చేటుచేసుకున్నాయి. దీంతో అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.నా భద్రత.. దేవుడి చేతుల్లోనే..తనకు వస్తున్న బెదిరింపులు, ఏర్పాటు చేసి బందోబస్తుపై సల్మాన్ఖాన్ గతంలో మాట్లాడుతూ..‘ భారీ భద్రత మధ్య జీవించడం, బయటకు వెళ్లి రావడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బెదిరింపులకు నేను బయపడను. నా భద్రత అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది’ అని అన్నారు. -
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘డిస్కో కింగ్’, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాలు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం అద్భుతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక వివాదాలు, విషాదాలు, నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటీమణులతో ఆయన సాగించిన ప్రేమాయణాలు, రహస్య వివాహాలు నాడు సంచలనం సృష్టించాయి.కమల్ హాసన్ మాజీ భార్యతో..1970లలో మిథున్ చక్రవర్తి వరుస హిట్లతో సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ‘హమారా సంసార్’ చిత్రంలో కమల్ హాసన్ మాజీ భార్య సారికతో ఆయన కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే కొద్ది నెలలకే ఈ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయిందంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారికనే స్వయంగా మిథున్కు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.మోడల్,నటి హెలెనా లూక్తో వివాహంసారికతో బ్రేకప్ తర్వాత మానసికంగా కుంగిపోయిన మిథున్, మోడల్ కమ్ నటి హెలెనా లూక్కు దగ్గరయ్యారు. జావేద్ ఖాన్తో ఐదేళ్ల రిలేషన్షిప్ ముగిసిన హెలెనా కూడా ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నారు. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో 1979లో వారు వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. మిథున్ ప్రవర్తన కారణంగా హెలెనా విడాకులు తీసుకున్నారని అంటారు.హెలెనా బయటపెట్టిన మిథున్ టాక్సిక్ నేచర్విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హెలెనా లూక్, మిథున్తో తన అనుభవాన్ని ఒక పీడకలగా అభివర్ణించారు. మిథున్ తనను మానసికంగా ఎంతో వేధించారని, తన మాజీ ప్రియుడితో సంబంధం ఉందని నిత్యం అనుమానించే వారని ఆమె వెల్లడించారు. మిథున్కు అప్పట్లోనే వేరే మహిళలతో సంబంధాలు ఉండటం వల్లే, తనపై లేనిపోని అభూతకల్పనలు ఆపాదించేవారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం హెలెనా బాలీవుడ్కు పూర్తిగా దూరమై న్యూయార్క్లో స్థిరపడ్డారు.కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలితో పెళ్లిహెలెనాతో విడాకుల అనంతరం మిథున్ జీవితంలోకి సింగర్ కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలి ప్రవేశించారు. కిశోర్ కుమార్కు విడాకులు ఇచ్చిన తర్వాత, యోగితా 1979లో మిథున్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ను పూర్తిగా పక్కన పెట్టి, సంసారమే సర్వస్వంగా బతుకుతానని ఆమె ప్రకటించారు. ఈ దంపతులకు మహాక్షయ్ (మిమోహ్), ఉష్మే, నామాషి అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో పాటు దిశాని అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.శ్రీదేవి ఎంట్రీతో వైవాహిక జీవితంలో తుఫాన్అంతా సజావుగా సాగుతున్న సమయంలో 1985లో మిథున్ జీవితంలోకి దివంగత నటి శ్రీదేవి అడుగుపెట్టారు. ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లయినప్పటికీ మిథున్.. శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు. మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ 1985లో అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. ఈ సీక్రెట్ మ్యారేజ్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.భార్య యోగితా బాలి ఆత్మహత్యాయత్నంమిథున్, శ్రీదేవిల రహస్య వివాహం, వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న యోగితా బాలి తీవ్రంగా కుంగిపోయారు. భర్త మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరువాత ఆమె, తన పిల్లలతో కలిసి మిథున్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం మిథున్, నిర్మాత బోనీ కపూర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసింది.శ్రీదేవితో పెళ్లి రద్దు.. యోగితా బాలితో తిరిగి..మిథున్ తన మొదటి భార్య యోగితాకు విడాకులు ఇవ్వలేడని, ఆమెను పూర్తిగా వదిలించుకోలేడని గ్రహించిన శ్రీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1988లో మిథున్తో జరిగిన వివాహాన్ని ఆమె చట్టబద్ధంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి బోనీ కపూర్ను వివాహం చేసుకోగా, మిథున్ తిరిగి తన మొదటి భార్య యోగితా బాలి వద్దకు చేరారు. యోగితను ఒప్పించి ఆమెను ఇంటికి రప్పించుకున్న మిథున్, ఆ తర్వాత తమ మూడో సంతానాన్ని స్వాగతించారు. ఎన్నో వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం తన భార్య యోగితా బాలి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి కుమారులు మిమోహ్, ఉష్మే, నామాషి, కూతురు దిశాని కూడా సినీరంగంలో రాణిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
'చిన్న వయసులోనే పెళ్లిచూపులు.. నేను తప్పించుకున్నా'
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీటౌన్లో సుపరిచితమైన పేరు. ఇటీవలే ఆమె ఇష్క్నామా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షెహనాజ్.. ప్రేమ అంటే ముఖ్యమైన వ్యక్తులకు సమయం, స్వేచ్ఛ ఇవ్వడమేనని అన్నారు. అయితే పెళ్లిళ్లకు తాను దూరంగా ఉండేదాన్ని అని వెల్లడించారు.ప్రేమ, పెళ్లి సంబంధాలపై తన అభిప్రాయాలను షెహనాజ్ గిల్ వెల్లడించారు. మా కుటుంబంలో పెళ్లి చూపులు చిన్న వయసులోనే చూసేవారని తెలిపింది. అమ్మాయిలకు చాలా చిన్న వయసు నుంచే త్వరలో పెళ్లి అవుతుందని చెప్పేవారని గుర్తు చేసుకుంది. అలా వరుడి కోసం అన్వేషణ చాలా ముందుగానే మొదలవుతుందని పేర్కొంది. మా బంధువుల్లో ఒకరు నాకు పెళ్లి చేయాలని చూసింది.. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదని తెలిపింది. పెళ్లిళ్లకు వెళ్తే సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తారని షెహనాజ్ వెల్లడించింది. అందుకే నేను ఎక్కువగా పెళ్లిళ్లకు వెళ్లడం కూడా మానేసేదాన్ని అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు నా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని.. ఇప్పుడు అందరూ నా వెంట పడుతున్నారని నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. షెహనాజ్ గిల్ నటించిన 'ఇష్క్నామా' చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది. -
ఓటీటీలోకి కొత్త థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన
ప్రస్తుతం లోక్సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అలా ఈ ఏడాది ఈమె నుంచి వచ్చిన మూవీ 'భారత భాగ్య విధాత'. 26/11 దాడుల నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేసి ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకుడు. 26/11 దాడులు జరిగినప్పుడు ముంబైలోని కామా ఆస్పత్రిలో అంజలి అనే నర్స్, 20 మంది గర్భిణిలని రక్షించింది. ఆమె జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తీశారు. జూన్ 12న థియేటర్లలో రిలీజైంది గానీ జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే శుక్రవారం (ఆగస్టు 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.26/11 టెర్రర్ ఎటాక్ సమయంలో ఆస్పత్రిలో రోగులని కాపాడిన గీతా మాధవ్ (కంగనా రనౌత్) అనే నర్స్ పోరాటం, ఆమె ధైర్యం, అలానే ఈమెకు తోడుగా మరికొందరు నర్సులు కూడా ఎలాంటి సాహసం చేశారు? చివరకు ఏమైందనేదే 'భారత భాగ్య విధాత' స్టోరీ.ఇకపోతే ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)An untold story of ordinary nurses who stood with extraordinary courage on the darkest night of 26/11.Some heroes were never seen. Their stories were never told.Until now.Bharat Bhhagya Viddhaata Trailer Out Now.#BharatBhhagyaViddhaata premieres on 14th Aug on Hindi Zee 5… pic.twitter.com/gq6b61Piet— ZEE5Official (@ZEE5India) August 7, 2026 -
హీరోయిన్తో తెలుగు హీరో డేటింగ్?
రాజమండ్రిలో పుట్టి తెలుగులోనే వరస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన హర్షవర్ధన్ రాణే.. తర్వాత హిందీలోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఫిదా, అవును, అవును 2, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం బాలీవుడ్లోనే వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఓ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ మళ్లీ వినిపించాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోలే దీనికి కారణం.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సంజీదా షేక్ కలిసి పుణె సమీపంలోని పాన్షెట్లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఫొటోలను వేర్వేరు యాంగిల్స్లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే ట్రిప్కు వెళ్లారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.వీళ్లిద్దరి గురించి డేటింగ్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా అనిపించే ఫొటోలను షేర్ చేయడంతో ఇదంతా మొదలైంది. 2020లో రిలీజైన 'తైష్' మూవీలో కలిసి నటించారు. 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'కున్ ఫయా కున్'లో మరోసారి జంటగా కనిపించారు. హర్షవర్ధన్ ఇప్పటికే సింగిలే కానీ సంజీదా షేక్ మాత్రం ఆమిర్ అలీని పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది. ఓ కూతురు ఉండగా.. ఆమె ఇప్పుడు సంజీదా దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) -
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
1987 నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సుస్మితా ముఖర్జీ తన జీవితంలోని చాలా కష్టమైన కాలం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. రూ.కోటి అప్పు తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలని అవమానించే సి-గ్రేడ్ చిత్రాలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)గోల్ మాల్, రక్తచరిత్ర, జర హట్కే జర భచ్కే తదితర సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ నటించిన ఈమె.. చివరగా గతేడాది వచ్చిన 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్లో నటించింది. అయితే తనని 'మేడమ్.. మీరు ఎందుకు అలాంటి చెత్త సినిమాల్లో నటించారు?' అని ఒకరు ప్రశ్నించారని, ఆ ప్రశ్న తన జీవితంలోని బాధాకరమైన రోజుల్ని గుర్తు చేసిందని సుస్మితా చెప్పింది.'అవి మహిళలని అవమానించే సి-గ్రేడ్ సినిమాలు. అవి పూర్తిగా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. నేను నా మనసుని అమ్ముకున్నానా? అవును.. అమ్ముకున్నాను. అప్పట్లో నాకు ఆ పని నచ్చలేదు ఇప్పటికీ నచ్చదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. 2002లో నా భర్తతో కలిసి ప్రారంభించిన ప్రయాస్ ప్రొడక్షన్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. రూ.కోటి అప్పు మిగిలింది. అదే టైంలో టెక్నాలజీ కారణంగా మా సంస్థతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు దివాలా తీశాయి''అప్పు ఇచ్చినవాళ్లు తరచూ మా ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసేవారు. దీంతో మళ్లీ నటిగా పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నేను సంపాదించిన ప్రతి రూపాయి అప్పు తీర్చడానికే వెళ్లేది. ఆ రూ.కోటి తీర్చేందుకు నేను, నా భర్త ఎన్నో సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. నా కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమాల వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఆ నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టంతో కాదు. పరిస్థితుల ఒత్తిడిలో తీసుకోవాల్సి వచ్చింది' అని సుస్మితా ముఖర్జీ స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ) View this post on Instagram A post shared by Susmita Mukherjee (@susmita_mukherjeeofficial) -
‘రామాయణ’ డేట్ ఫిక్స్
రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. కాగా, ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.ఇప్పటికే ‘రామాయణ’ తొలి భాగం ట్రైలర్ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా ఇంగ్లిష్ ట్రైలర్ను రిలీజ్ చేసి, ‘రామాయణ పార్ట్ 1’ను నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ‘రామాయణ’ ఇంగ్లిష్ ట్రైలర్లో సంభాషణలు ‘బ్రహ్మ ఏఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో పాత్రల లిప్ సింక్కు తగ్గట్లు రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో ధర్మా ప్రోడక్షన్స్ రిలీజ్ చేస్తుండగా, ఓవర్సీస్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రామాయణ పార్ట్ 2’ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
19 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ రిలీజ్
ఒక సినిమాకు సీక్వెల్ తీయాలంటే రెండు నుంచి మూడేళ్లు టైమ్ పడుతుంది. అలా పుష్ప రిలీజైన మూడేళ్లకు సీక్వెల్గా పుష్ప-2 కూడా వచ్చేసింది. కానీ ఓ మూవీ సీక్వెల్ దాదాపు రెండు దశాబ్దాల వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అదే చేశారు మేకర్స్. ఎప్పుడో 2007లో వచ్చిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు.2007లో విడుదలైన క్లాసిక్ యాక్షన్ డ్రామా ఆవారపన్. ఇమ్రాన్ హష్మీ, దిశాపటానీ నటించారు. ఈ సినిమాకు దాదాపు 19 ఏళ్ల తర్వాత సీక్వెల్గా ఆవారపన్ - 2 తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శివమ్ పండిట్ పాత్రలో ఇమ్రాన్ తిరిగి వస్తున్నాడంటూ వీడియోను పంచుకున్నారు. ఈ మూవీకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. -
ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్విస్ట్ రాకా లో షారుఖ్
-
రామాయణలో రియా కపూర్ ఎవరో తెలుసా..?
నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.. ట్రైలర్లో తమ తమ పాత్రలతో హత్తుకున్న రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్తో పాటుగా మరో ముఖం కూడా ప్రేక్షకుల దుష్టిని ఆకర్షించింది. ఆమెనే రియా కపూర్ . సీత పక్కన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ నటి ఎవరని తెలుసుకోడానికి సోషల్ మీడియాకు పనిచెప్తున్నారు సినీ ప్రియులు. మరి ఆమె ఎవరో ఒకసారి చూద్దామా..?రియా కపూర్ ఎవరంటే..టెలివిజన్, ప్రాంతీయ సినిమాలు, మ్యూజిక్ విడియోల ద్వారా నటిగా గుర్తింపు పొందింది రియా కపూర్. ఈమె గతంలో సంపూర్ణ అనే సీరియల్లో నటించి బుల్లితెరలో, మిస్టేరియస్ అనే తెలుగు చిత్రంలో కనువిందు చేసింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పలు మార్లు ఆడిషన్స్ ,లుక్ టెస్ట్లను పూర్తి చేసిన తర్వాత ఈ భారీ బడ్జేట్ సినిమాలో మాండవి పాత్రకు ఎంపిక చేశారట. హిందూ పురాణాల ప్రకారం.. మాండవి కుశధ్వజ మహారాజు, చంద్రభాగ రాణిల కుమార్తె. సీతకు మేనకోడలు ( కజిన్) అవుతుంది. అనంతరం శ్రీరాముడి తమ్ముడు భరతుడిని వివాహం చేసుకుని అయెధ్య లో కీలక సభ్యురాలిగా మారుతుందట. ఇటీవల రిలీజైన రామాయణ ట్రైలర్లో రెప్పపాటు కాలం పాటు కనిపించినప్పటికీ రెండు భాగాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. కాగా చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా వెండి తెరను పలకరించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటులు కూడా ఉన్నారు. -
రామాయణ కాస్ట్యూమ్ పై కాంట్రవర్సీ.. సినిమా చూసి మాట్లాడండి అంటూ డిజైనర్స్ ఫైర్
-
ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్..(ఫొటోలు)
-
ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
ప్రముఖ నటి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ భామ జియా శంకర్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. ప్రియుడు కరణ్తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ శుభవార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.కాగా.. అభిషేక్ మల్హన్తో డేటింగ్ రూమర్స్ ఖండించిన కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. జియా, అభిషేక్లు గతంలో బిగ్ బాస్ ఓటీటీ -2 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ వార్తలను జియా కొట్టిపారేసింది.జియా శంకర్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా బిగ్బాస్తో పాటు చాలా రియాలిటీ షోలలో మెరిసింది. తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఎంత అందంగా ఉన్నావే మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ భామ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Jiyaa Shankar (@jiyaashankarofficial) -
ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు.. సినీ ప్రముఖుల నివాళులు
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని గోరెగావ్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.కాగా..గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. భివండిలోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మరణాన్ని 'లగాన్' సహనటుడు యశ్పాల్ శర్మ ధృవీకరించారు. ప్రదీప్ మృతి పట్ల అఖిల భారత సినీ కార్మికుల సంఘం సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.రావత్ కెరీర్..కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. -
భిక్షు యాదవ్, రాస్ బిహారీ.. ప్రదీప్ రావత్లోని మరో కోణం ఇది (ఫొటోలు)
-
బిగ్బాస్ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్
బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్. ఏ భాషలోనైనా ఈ షోకు ఆడియన్స్ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి బుల్లితెర ప్రియులను అలరించేందుకు రియాలిటీ షో వచ్చేస్తోంది. హిందీలో ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఈ షో 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20కి కౌంట్డౌన్ మొదలైంది. రాబోయే సీజన్కు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సారి కూడాహోస్ట్గా సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించనున్నారు.ఈ తాజా సీజన్ సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ టీజర్లో గుర్రంతో పాటు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే ఈ సారి సరికొత్తగా సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్లో కంటెస్టెంట్ల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్లను ప్రేక్షకులను పరిచయం చేస్తుందని..అంతే కాకుండా సీజన్-20 మధ్యలో ఒక మిస్టరీ ఉంటుందని సల్మాన్ ఖాన్ టీజర్లో ప్రస్తావించారు. ఈ టీజర్ కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.బిగ్ బాస్-20 స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ రియాలిటీ షో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా కలర్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ ఏడాది అన్ని భాషల్లోనూ ఓకేసారి ఈ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అదో రోజు నుంచే షో మొదలు కానుంది. View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar) -
స్పెయిన్ వెకేషన్లో సచిన్ కూతురు సారా (ఫొటోలు)
-
హంసలా మెరిసిపోతూ సింగర్ శ్రేయాఘోషల్ (ఫొటోలు)
-
డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్ ఠాకుర్
ఏఐ కల్చర్ పెరిగిపోయిన తర్వాత దానిని మంచి కోసం ఎంతమంది ఉపయోగిస్తున్నారో అనే సంగతి పక్కనబెడితే సెలబ్రిటీలని ఇబ్బంది పెట్టేందుకు విరివిగా వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి అవన్నీ నిజమనే భ్రమ కల్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితుల బారిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)'నా డీప్ ఫేక్ ఫొటోలని సృష్టించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే డిలీట్ చేయండి లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని మృణాల్ హెచ్చరించింది.మృణాల్ ఇప్పుడు కోప్పడటం కాదు గానీ గతంలో రష్మిక తదితర హీరోయిన్లు డీప్ ఫేక్ బారిన పడ్డారు. పలువురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే ఇలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం హీరోయిన్లని ఇబ్బందులకు గురిచేస్తోంది. మృణాల్ కెరీర్ విషయానికొస్తే..రీసెంట్గా ఓ హిందీ మూవీ చేసింది గానీ సరిగా ఆడలేదు.(ఇదీ చదవండి: 200 రోజులు కష్టపడితే ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే బ్లాక్బస్టర్: హీరో సూర్య) -
గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు
హిందీ సీరియల్స్తో పాటు రియాలిటీ షోల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నటి అదితి శర్మ.. భర్త అభినీత్ కౌశిక్, అత్తింటి వారిపై గృహహింస కేసు పెట్టింది. ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. భర్త తనని శారీరకంగా మానసికంగా వేధించాడని, వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసేవాడని, తన నగలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)అదితి శర్మ చెప్పినదాని ప్రకారం.. 2021 జూన్లో ఆన్లైన్ యాక్టింగ్ క్లాసుల ద్వారా అభినీత్ కౌశిక్తో పరిచయం ఏర్పడింది. 2024 సెప్టెంబర్ నుంచి ఇద్దరూ కలిసి బతకడం మొదలుపెట్టారు. అదే ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని చిన్న చిన్న విషయాలకే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని, నా డ్రస్సింగ్పై అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడని, తన దగ్గర నుంచే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించింది.2025 జనవరిలో కాఫీ విషయంలో జరిగిన ఓ గొడవ పెద్దది కావడంతో తనను దారుణంగా తిట్టారని, వివాహేతర సంబంధం కూడా అంటగట్టారని అదితీ తన ఫిర్యాదులో రాసుకొచ్చింది. తన మొబైల్ తరచూ చెక్ చేయడం, తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకోవడం లాంటివి కూడా అత్తింటివాళ్లు చేశారని తెలిపింది. తన మంగళసూత్రం, బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, గాజులు తదితర వివాహ ఆభరణాలని అడిగినా తనకు ఇవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తల్లితండ్రులని కలిసిన హీరో)ఈ ఏడాది మార్చిలో అదితీ భర్త అభినీత్, అతడి తరఫు న్యాయవాది ఈమెపై పలు ఆరోపణలు చేశారు.'అపోల్లెనా' సీరియల్ సహనటుడు సమర్థ్య గుప్తాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గుర్తించడంతోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అదితి తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, ఇండస్ట్రీలో ఇది బయటపడకూడదనే ఉద్దేశంతో తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలని కోరిందని అభినీత్ పేర్కొన్నాడు. కుటుంబాల మధ్య రాజీ చర్చల సందర్భంగా రూ.25 లక్షలు, విడాకులు కోరినట్లు కూడా ఆయన ఆరోపించాడు.భర్త ఆరోపణలపై స్పందించిన అదితి.. పెళ్లైన నెల రోజుల నుంచే తనని చాలా ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయాలు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున పూర్తి వివరాలు మాట్లాడలేనని చెప్పింది. గృహహింస తన వైపు నుంచి జరగలేదని స్పష్టం చేసిన ఈమె.. తన భర్త తనని, తన కుటుంబాన్ని పలుమార్లు అవమానించారని, అందుకే విడాకులు కోరినట్లు పేర్కొంది. తమ పెళ్లిని రహస్యంగా ఉంచాలనే నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సన్ గ్లాసెస్ తో గుడిలో పూజలు.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్
-
మాజీ ప్రేమికుల మధ్య మళ్లీ చిచ్చు
-
రామాయణ ట్రైలర్ లో హనుమాన్ ఎక్కడ..?
-
సీతమ్మ పాత్ర.. ప్రతీ తరానికీ ఒక పరీక్ష
రామాయణంలో శ్రీరాముడు కథానాయకుడైతే.. ఆ మహాకావ్యానికి హృదయం సీత. ఆమె కేవలం కథలోని ఒక పాత్ర కాదు.. భారతీయ సంస్కృతిలో సహనం, ఆత్మగౌరవం, త్యాగం, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన రూపం. అందుకే తెరపై సీత పాత్రను చూపించడం అంటే ఒక పాత్రను పోషించడం మాత్రమే కాదు.. తరతరాలుగా ప్రేక్షకుల మనసుల్లో ఏర్పడిన ఒక భావాన్ని ఆవిష్కరించడం.సినిమా, టెలివిజన్ చరిత్రలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. కాలం మారింది. కథ చెప్పే పద్ధతి మారింది. సాంకేతికత కొత్త రూపాలు తీసుకుంది. కానీ సీత పాత్రకు సంబంధించిన అంచనాలు మాత్రం ఎప్పటికీ మారలేదు. ఎందుకంటే ప్రేక్షకులు సీతను కేవలం ఒక కళాకారిణిగా చూడరు. ఆమె వెనుక ఒక విశ్వాసాన్ని, ఒక ఆరాధనను చూస్తారు. సీత పాత్రలో ప్రధానంగా కనిపించాల్సింది బాహ్య సౌందర్యం కాదు.. అంతర్గత బలం. రాజ మహిషిగా ఉన్న గౌరవం, అరణ్యవాసంలో కనిపించే సహనం, రావణుడి చెరలో ఉన్నప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం, చివరి వరకు ధర్మంపై ఉన్న నమ్మకం.. ఇవన్నీ ఒకే పాత్రలో పలకాల్సి ఉంటుంది. అందుకే సీత పాత్ర ఏ నటికైనా అత్యంత క్లిష్టమైన పరీక్షగా మారుతుంది.1987లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సీరియల్ ఈ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. అందులో సీతగా కనిపించిన దీపికా చిక్లియా నటన ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఆమె నటనలోని ప్రశాంతత, మృదుత్వం, బాధను భరించే ఆత్మస్థైర్యం అప్పటి ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్నాయి. ఒక పాత్ర ప్రజల నమ్మకాలతో ఎంతగా మమేకం అవుతుందో చెప్పడానికి అది ఒక గొప్ప ఉదాహరణ.తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే.. సీత పాత్రకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. తెలుగు సినిమాల్లో రామాయణ పాత్రల చిత్రీకరణకు ఎప్పుడూ ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా సీతను కేవలం కన్నీళ్లు పెట్టుకునే పాత్రగా కాకుండా.. గౌరవం, ధైర్యం, మాతృత్వం కలిగిన శక్తివంతమైన రూపంగా చూపించే ప్రయత్నాలు జరిగాయి. అందుకే కొన్ని చిత్రాల్లోని సీత పాత్రలు దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అయితే సీత పాత్రను తెరపైకి తీసుకురావడం వెనుక మరో పెద్ద సవాలు ఉంది. ఈ పాత్రను అతిగా దైవీకరిస్తే మానవీయ భావాలు తగ్గిపోతాయి. సాధారణ పాత్రలా చూపిస్తే ప్రేక్షకుల ఆరాధన దెబ్బతింటుంది. భక్తి, భావోద్వేగం, వాస్తవికత.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే అసలు పరీక్ష.ఇటీవలి కాలంలో వచ్చిన రామాయణ ఆధారిత చిత్రాలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశాయి. ఒక పురాణ పాత్రను ఆధునిక తెరపై చూపించేటప్పుడు కేవలం భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ సరిపోవు. ఆ పాత్ర ఆత్మను అర్థం చేసుకోవాలి. సంభాషణలు, వేషధారణ, కథనం, దర్శకుడి దృష్టి.. ప్రతి అంశం ప్రేక్షకుల అనుభూతిని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం సీత పాత్ర మరోసారి చర్చకు రావడానికి కారణం సాయి పల్లవి ఈ పాత్రలో కనిపించబోతుండటమే. సహజ నటనకు పేరుగాంచిన ఆమెకు ఇది కేవలం మరో సినిమా పాత్ర కాదు.. భారీ అంచనాలతో కూడిన బాధ్యత.అయితే సీత పాత్ర చరిత్ర చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ పాత్రను చేసిన ప్రతి కళాకారిని పోలికలను, విమర్శలను, అంచనాలను ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే సీత పాత్రకు ప్రేక్షకులు పెట్టుకున్న ప్రమాణాలు సాధారణమైనవి కావు. సీత పాత్రలో విజయాన్ని నిర్ణయించేది కేవలం నటన కాదు. ఆ పాత్రలోని నిశ్శబ్దాన్ని కూడా పలికించగలగాలి. కన్నీటి వెనుక ఉన్న ధైర్యాన్ని చూపించగలగాలి. త్యాగాన్ని బలహీనతగా కాకుండా ఒక గొప్ప శక్తిగా చూపించగలగాలి. అప్పుడే ఆ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుంది.సీత ఎలా కనిపించాలి అనే ప్రశ్నకు ప్రతి తరం తనదైన సమాధానం చెబుతుంది. కానీ ఆ పాత్రలో ఉండాల్సిన గౌరవం, పవిత్రత, ఆత్మబలం మాత్రం ఎప్పటికీ మారవు. అందుకే సీత పాత్రకు వచ్చే ప్రశంసలు అసాధారణం.. అలాగే వచ్చే విమర్శలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. అందుకే సీత పాత్ర ప్రతీ తరానికీ ఒక పరీక్ష. ప్రతి దర్శకుడికీ ఒక సవాలు. ప్రతి కళాకారుడికీ ఒక బాధ్యత. -
రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. SVC63 పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఒక్కో మూవీకి రూ.120 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకుంటాడనే టాక్ ఉన్న సల్మాన్.. దీని కోసం మాత్రం రూ.70 కోట్లే తీసుకుంటున్నాడని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి కారణం?(ఇదీ చదవండి: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)వచ్చే ఈద్ టార్గెట్గా తీస్తున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ పారితోషికం తగ్గింపు నిర్ణయం తీసుకోవడం వెనక ఆయన సన్నిహిత మిత్రుడు రఫీ కాజీ అనే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో ఈయన కీలక పాత్ర పోషించాడని, నిర్మాతల్లో ఒకరిగా కూడా ఉన్నాడని సమాచారం. స్నేహితుడి కోసమే సల్మాన్ తన సాధారణ పారితోషికంతో పోలిస్తే భారీగా తగ్గించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.అయితే అడ్వాన్స్ మొత్తంతో పాటు సినిమా లాభాల్లోనూ వాటాని సల్మాన్ తీసుకుంటున్నారా లేదా అనే విషయపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ తన సినిమాల్లో లాభాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2010లో రిలీజైన 'దబాంగ్' తర్వాత ఆయన కుటుంబ సభ్యులు లేదా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ (SKF) బ్యానర్ ఎక్కువ శాతం చిత్రాలని నిర్మించింది. 'బాడీగార్డ్'ని ఆయన సోదరి అల్విరా ఖాన్ నిర్మించగా, 'దబాంగ్'ని సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మించాడు.ఇకపోతే సల్మాన్ ఖాన్ మరోవైపు 'మాతృభూమి' అనే వార్బ్యాక్ డ్రాప్ మూవీ చేశాడు. గాల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యం కావడంతో ప్రస్తుతానికి దీన్ని హోల్డ్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇదెప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓటీటీలో ఇంటెన్స్ హిందీ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన) -
సినిమాలకు పనికొచ్చే ముఖమేనా.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
రామాయణ ట్రైలర్.. సందీప్ రెడ్డి వంగా రివ్యూ
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్తో చేస్తోన్న భారీ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నారు. స్పిరిట్తో బిజీగా ఉన్న సందీప్.. తాజాగా రామాయణ ట్రైలర్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ కేవలం ట్రైలర్ మాత్రమే కాదని ట్వీట్ చేశారు. అధర్మంపై ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే దానికి శాశ్వతమైన గుర్తు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. రణ్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముడుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈనెల 30న రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయగా విజువల్స్ పరంగా ఆకట్టుకుంది. రావణుడి పాత్రలో యశ్ మరింత గంభీరంగా కనిపించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్.. శూర్పణఖ పాత్రలో కనిపించనుంది. ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. "YEH RAM YUG KA AARAMBH HAI."Not just a trailer, but the eternal reminder that DHARMA will always triumph over ADHARMA.https://t.co/5uAgQKUlqg— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 31, 2026 -
'మిషన్ మంగళ్’నటికి చేదు అనుభవం : లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
బాలీవుడి నటి కీర్తి కుల్హారీ (Kirti Kulhari) సైబర్ నేరగాళ్ల మోసానికి గురయ్యారు. ఆమెకు తెలియ కుండానే, ఎలాంటి ఓటీపీ లేకుండా ఆమెక్రెడిట్ కార్డ్ ద్వారా విదేశీ విమానయాన సంస్థకు భారీ మొత్తంలో చెల్లింపులు జరిగిన ఘటన దిగ్బ్రాతి రేపింది. ఈ ఘటనపై ముంబై అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' ఫేమ్ కీర్తి ఆమె సినిమా చూస్తున్న సమయంలోనే క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి కేటుగాళ్లు ఆమెకు ప్రమేయం లేకుండానే రూ. 2.43 లక్షలకు పైగా డబ్బులు కొట్టేశారు. జూలై 24న రాత్రి అంధేరిలోని ఒక మల్టీప్లెక్స్లో కీర్తి సినిమా చూస్తుండగా బ్యాంకు నుంచి ఈ (International Transaction) లావాదేవీకి సంబంధించిన అలర్ట్ రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. AeroMexico ఏయిర్లైన్స్కి 2,525 యూఎస్ డాలర్ల చెల్లింపు జరిగినట్లు మెసేజ్ రావడంతో కీర్తి వెంటనే కస్టమర్ కేర్ను సంప్రదించారు. ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులుప్రాథమిక విచారణలో ఆమె కార్డ్ ఉపయోగించి వరుసగా 4 లావాదేవీల ద్వారా మొత్తం రూ. 2.43 లక్షలకు పైగా డ్రా చేసినట్లు తేలింది. వెంటనే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో మరిన్ని అనధికారిక లావాదేవీలు జరగకుండా బ్యాంక్ అధికారులు వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ను బ్లాక్ చేశారు.ఈ ఘటనపై కీర్తి కుల్హారీ ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు నమోదు చేశారు. ఇదీ చదవండి : భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలుకాగా కీర్తి ఇటీవల 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' చివరి సీజన్లో కనిపించారు. అంతకుముందు పింక్, క్రిమినల్ జస్టిస్, షైతాన్, హ్యూమన్ వంటి విజయవంతమైన చిత్రాలు, టెలివిజన్, సిరీస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలతో ఆదరణ పొందారు. జగన్ శక్తి దర్శకత్వంలో వచ్చిన 'మిషన్ మంగళ్' చిత్రంలో కీర్తి కుల్హరి ఆకట్టుకున్నారు.ఇదీ చదవండి: బెల్జియంలో గర్బా : పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా స్పందన -
బాలీవుడ్ ఫేమస్ ర్యాపర్ జీవితంలో ఏం జరుగుతోంది..?
-
గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
హిందీ ప్రముఖ సీరియల్ నటి కరిష్మా తన్నా శుభవార్త చెప్పేసింది. గురుపౌర్ణమి రోజున తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు.. కరిష్మా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈమె బయటపెట్టగా.. ఇప్పుడు బిడ్డ పుట్టాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)కరిష్మా తన్నా.. 2022లో ముంబైకి చెందిన బిజినెస్మ్యాన్ వరుణ్ బంగేరాని పెళ్లి చేసుకుంది. అంతకు ముందు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అనంతరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కరిష్మా.. 2001 నుంచి హిందీలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కుసుమ్' తదితర సీరియల్స్తో పాటు 'బిగ్ బాస్', 'నచ్ బలియే', 'జరా నచ్కే దిఖా' లాంటి రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఐదారేళ్లలో అయితే 'స్కూప్' లాంటి ఓటీటీ సిరీస్లతో ప్రశంసలు అందుకుంది. ఈమె 'సంజు', 'సూరజ్ పే మంగళ్ భారి' లాంటి సినిమాలు కూడా చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Karishma K Tanna (@karishmaktanna) -
ఓటీటీలోకి లేటెస్ట్ ఎమోషనల్ లవ్ సినిమా
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. తెరపై భావం పలికితే చాలు ఏ భాషా ప్రేక్షకులకైనా సరే నచ్చేస్తుంది. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుని మెప్పించిన సినిమా 'మై వావస్ ఆవుంగా'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఇప్పటికీ అలరిస్తున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, జబ్ ఉయ్ మెట్ లాంటి ప్రేమకథా సినిమాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజే, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. జూన్ 11న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.దేశ విభజన జరిగిన టైంలో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల కథని ఈ సినిమాలో చూపించారు. ఏళ్లు గడిచిపోయిన తర్వాత సదరు ప్రేమికుడు కాస్త వృద్ధుడు అవుతాడు. ఇతడి ఆశయాన్ని నెరవేర్చేందుకు మనవడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్తాడు. తర్వాత ఏమైంది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ. తాత పాత్రలో నసీరుద్దీన్ షా చేయగా.. ఇతడి యుక్త వయసు పాత్రని వేదాంగ్ రైనా, ప్రియురాలి పాత్రని శార్వరి పోషించారు. మనవడి పాత్రలో దిల్జీత్ దోసాంజే కనిపించారు. ఈ మూవీ ఆగస్టు 07 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ తేదీనే ఫైనల్! -
దిగ్గజ నటి రేఖ సినిమాకు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ నటించిన అద్భుత చలనచిత్రం ‘ఉమ్రావ్ జాన్’. 1981లో విడుదలైన ఈ చిత్రం నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇందులో అద్భుత అభినయం ప్రదర్శించిన రేఖ 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రేఖ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘ఉమ్రావ్ జాన్’ చిత్రం త్వరలో మరో అరుదైన గౌరవాన్ని అందుకోనుంది.వచ్చే నెలలో జరుగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎం) వేదికపై ఈ క్లాసిక్ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్రావ్ జాన్ పాత్ర దశాబ్దాలుగా తనతోపాటే సజీవంగా ఉందంటూ రేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ.. ‘ఉమ్రావ్ జాన్ నా జ్ఞాపకాల్లో, నా నిశ్శబ్దంలో, దశాబ్దాలుగా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉంది. ప్రపంచ వేదికపై ఈ చిత్రానికి దక్కుతున్న గౌరవం చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోతోంది’ అని పేర్కొన్నారు.ఆగస్టు 13 నుండి 23 వరకు జరుగనున్న ఈ చలనచిత్రోత్సవంలో రేఖ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ వేదికపై ప్రతిష్టాత్మక ‘ఎక్స్లెన్స్ ఇన్ సినిమా అవార్డు’తో ఆమెను సత్కరించనున్నారు. ఈ పురస్కారాన్ని కృతజ్ఞతా భావంతో స్వీకరించనున్నట్లు రేఖ తెలిపారు. ఇది కేవలం తన నటనకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, తన జీవితాన్ని, నటనను తీర్చిదిద్దిన చిత్రనిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, కళాకారులందరికీ అంకితమని ఆమె పేర్కొన్నారు. -
అత్యంత వైభవంగా ఇండియా కౌచర్ వీక్ ..! ఫ్యాషన్ చరిత్రలోనే తొలిసారిగా..(ఫొటోలు)
-
రణ్బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు.అయితే ఈ మూవీ ట్రైలర్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. రామాయణ ట్రైలర్ టైమ్ అండ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 24 రిలీజ్ చేస్తామని వాయిదా వేసిన మేకర్స్ తాజాగా డేట్తో టైమ్ ప్రకటించారు. ఈ నెల 30 తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.🕉️...Reposted from @malhotra_namit 's Instagram 🕉️ pic.twitter.com/PpnlFJKD32— The World Of Ramayana (@WorldOfRamayana) July 28, 2026 -
తండ్రి మరణించిన ఆస్పత్రిలోనే హీరో కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు.. నటుడు, దర్శకుడు అయిన సునీల్ ఆనంద్ (70) చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు జీనా నారంగ్.. కుటుంబ సభ్యుల తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్కి సర్జరీ.. కోయంబత్తూరులోనే ఎందుకంటే?)అమెరికా నుంచి భారత్కి తిరిగొస్తుండగా లండన్లో సునీల్ ఆనంద్కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల తర్వాత స్టెంట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా.. సర్జరీకి ముందే ఈయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తుదిశ్వాస విడిచారు. గతంలో తండ్రి దేవ్ ఆనంద్ ఏ ఆస్పత్రిలో అయితే చనిపోయారో అదే చోట ఇప్పుడు కొడుకు సునీల్ ఆనంద్ కూడా మరణించారు.1984లో తండ్రి దేవ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' సినిమాతో సునీల్ ఆనంద్.. హీరోగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే', 'మాస్టర్' తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే 2023లో తన తండ్రి 100వ జయంతి వేడుకల్లో మాట్లాడిన సునీల్ ఆనంద్.. నా జీవితంలో 40 ఏళ్లకు పైగా తండ్రి ఆరోగ్యం, షూటింగ్ షెడ్యూల్స్, కుటుంబ నిర్మాణ సంస్థ నవకేతన్ ఫిలిమ్స్ వ్యవహారాలని చూసుకున్నానని చెప్పారు. తన తండ్రి జీవితానికి అంకితమిచ్చేలా ఓ భారీ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఇప్పుడు సునీల్ ఆనంద్ తుదిశ్వాస విడిచారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
అందవిహీనమైన మహిళ నువ్వే.. ఒక్క మాటతో మారిన నటి జీవితం
'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే హిందీ సీరియల్లో సవితా విరాణి పాత్రలో నటించి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటి అపారా మెహతా తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా ఎమోషనల్ అయ్యారు. నటుడు దర్శన్ జరివాలాతో తన వైవాహిక జీవితంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)1982లో అపారా మెహతా, దర్శన్ జరివాలా పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ కూతురు ఉంది. అయితే 2003 నుంచి ఇద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. కానీ అధికారికంగా అయితే విడాకులు తీసుకోలేదు.'అప్పట్లో ఓసారి షోలు చేసేందుకు అమెరికా వెళ్లాను. ఆ టైంలో మా పెళ్లిరోజు వచ్చింది. దీంతో దర్శన్కు ఫోన్ చేశాను. 'మనిద్దరం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి' అని ఆయన అన్నారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత దర్శన్ నాతో విడిపోవాలని కోరారు. 'నేను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నాకు నచ్చడం లేదు. నా జీవితంలో చూసిన అత్యంత అందవిహీనమైన మహిళ నువ్వే' అని నాతో చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే షూటింగ్కు వెళ్లిపోయాను. ఆ రోజు వరసగా సీన్స్ ఉండేసరికి జరిగిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. తర్వాత ఆలోచించినప్పుడు ఆయన నిజంగానే అలా చెప్పారా అని నాకు అనిపించిందని.తర్వాత ఒకరోజు దర్శన్ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ మా మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్ కొనసాగుతోంది. అది ఇప్పటికీ మా ఇల్లే. ఆయన తిరిగి రావాలనుకుంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే ఆయన తిరిగి రాకపోవచ్చని నాకు తెలుసు. ఆయనలాంటి వ్యక్తి నాకు మళ్లీ దొరకరు. నాలాంటి వ్యక్తి కూడా ఆయనకు దొరకరు. విడివిడిగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మేమిద్దరం ఒకరి మాటను మరొకరం పూర్తిగా అర్థం చేసుకునేంత అవగాహనతో ఉన్నాం' అని అపారా మెహతా అన్నారు. 'గాంధీ మై ఫాదర్', 'గురు', 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' తదితర చిత్రాల్లో నటించిన దర్శన్ జరివాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.(ఇదీ చదవండి: ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు) -
ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు
బాలీవుడ్ తొలితరం సూపర్స్టార్ రాజేశ్ ఖన్నా.. 2012లో చనిపోయారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం రాజేశ్ మాజీ భాగస్వామి అనితా అద్వానీ. కొన్నాళ్ల క్రితం తమ సహజీవనానికి చట్టబద్ధ గుర్తింపు కోరుతూ బాంబే హైకోర్టులో ఈమె పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిత.. రాజేశ్ ఖన్నా, ఆయన భార్య డింపుల్ కపాడియా గురించి సంచలన కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)1973లో తనకంటే చాలా చిన్న వయసున్న డింపుల్ కపాడియాని రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నారు. వీరికి ట్వింకిల్ ఖన్నా(హీరో అక్షయ్ కుమార్ భార్య), రింకీ ఖన్నా అనే కూతుళ్లు ఉన్నారు. 1982లో డింపుల్, రాజేష్ ఖన్నా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా బతికారు గానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అయితే డింపుల్ దూరమైన తర్వాత రాజేశ్ ఖన్నా.. 2012లో మరణించే వరకు అనితా అద్వానీ అనే మహిళతో కలిసున్నారు. ఈ క్రమంలోనే తమ బంధానికి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని అనిత.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1న ఈమె అప్పీల్ని హైకోర్టు కొట్టివేసింది. ఇది లివ్-ఇన్ రిలేషన్షిప్ మాత్రమేనని, హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పెళ్లిగా పరిగణించలేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనితా అద్వానీ.. నా కేసుని హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద విచారించడం సరైనది కాదు. నన్ను భార్యగా గుర్తించలేమని కోర్టు పేర్కొంది. చెప్పాలంటే రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాని ఎన్నోసార్లు విడాకులు అడిగారు. కానీ ఆమె అంగీకరించలేదు. విడాకులు ఇవ్వాలంటే ఆస్తులన్నీ తమ పేరు మీద బదిలీ చేయాలని షరతు విధించింది. రాజేష్ ఖన్నా, డింపుల్ చాలా ఏళ్లుగా కలిసి జీవించలేదు. అయితే వాళ్లు విడాకులు కూడా తీసుకోకపోవడం వల్ల నాలాంటి వ్యక్తికి ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోయాయి. ఒక వ్యక్తి జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ లభించకపోవడం బాధాకరం అని అనితా అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె చేసిన వ్యాఖ్యలపై డింపుల్ కపాడియా లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.(ఇదీ చదవండి: 'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?) -
వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం!
బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత కనిపించకుండా పోయిన ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ అదృశ్యమై రెండు దశాబ్దాలకు పైగా గడిచినా, అతని ఆచూకీ తెలియకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ‘కరాజ్’, ‘అర్థ్’, ‘బసేరా’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, 2003 నుంచి తన కుటుంబ సభ్యులకు కనిపించకుండా పోయారు. మానసిక అనారోగ్య సమస్యలు, కెరీర్లో ఎదురుదెబ్బల కారణంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి.అమెరికాలోని అట్లాంటాలో గల ఒక సంస్థలో ఆయన ఉన్నట్లు దివంగత నటుడు రిషి కపూర్ గతంలో తెలిపారు. అయితే, రాజ్ కిరణ్ కూతురు రిషిక ఆ వాదనను ఖండించారు. తన తండ్రి అట్లాంటాలో లేరని, ఆయనను వెతికేందుకు తాము ప్రైవేట్ డిటెక్టివ్లను, న్యూయార్క్ పోలీసులను కూడా ఆశ్రయించామని ఆమె తెలిపారు. మరోవైపు ఆయన న్యూయార్క్లో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారనే వదంతులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదు.దివంగత రిషి కపూర్కు ఇచ్చిన మాటిను నిలబెట్టుకునేందుకు ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త సోమీ అలీ సుమారు 20 ఏళ్లుగా అమెరికా అంతటా ఆయన కోసం అన్వేషిస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లభించలేదు. రాజ్ కిరణ్ స్వచ్ఛందంగా తన పాత జీవితాన్ని వదిలేశారా? లేక అనారోగ్యం కారణంగా ఒంటరిగా మిగిలిపోయారా? అనే ప్రశ్నలకు ఏళ్లు గడుస్తున్నా సమాధానం దొరకలేదు. -
కాంబినేషన్ సెట్?
‘‘ఇలాంటి సినిమాలో నువ్వు నటించాలి’’ అని తన కుమార్తె జాన్వీ కపూర్తో గతంలో శ్రీదేవి పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో జాన్వీయే తెలిపారు. అది ఏ సినిమా అంటే... నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించిన మరాఠీ మూవీ ‘సైరత్’ (2016). శ్రీదేవి ఆకాంక్ష నెరవేరి, సరిగ్గా ఈ చిత్రం హిందీ రీమేక్ ‘ధడక్’లో నటించే చాన్స్ జాన్వీకి దక్కింది. ఈ చిత్రానికి శశాంక్ ఖేతన్ దర్శకత్వం వహించారు. అయితే తెర మీద ఈ సినిమాని చూడకుండానే 2018లో ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించారు. ‘ధడక్’ 2018 జూలై 20న విడుదల కావడం, మరాఠీలోలానే హిందీలో సూపర్ హిట్ కావడం జరిగింది. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... ‘సైరత్’ రీమేక్ ద్వారా కథానాయికగా పరిచయమైన జాన్వీ ఆ చిత్రదర్శకుడు నాగరాజ్ మంజులేతో సినిమా చేయనున్నారట. ఈ ఇద్దరి మధ్య తమ కాంబినేషన్ సినిమాకి సంబంధించిన కథాచర్చలు జరిగాయని టాక్. అన్నీ కుదిరితే త్వరలో ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని సమాచారం. -
కొత్త లోకా బ్యూటీకి బిగ్ ఛాన్స్.. ఏకంగా దురంధర్ హీరోతో..! (ఫోటోలు)
-
బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)
-
అదృష్టం అంటే ఈ హీరోయిన్దే.. తొలి చిత్రమే రూ.300 కోట్ల బడ్జెట్!
ఏ రంగంలోనైనా సక్సెస్ ప్రభావం గట్టిగా ఉంటుంది. అలా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్లో మంచి విజయం కోసం ఎదురుచూసిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. తండ్రి ప్రియదర్శన్.. దర్శకుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ కెరీర్ ప్రారంభంలో హిట్స్ పడక డీలా పడింది. తమిళంలో శింబు 'మానాడు' సక్సెస్ ఈమెకు కాస్త ఊరటనిచ్చింది. అలాంటిది కల్యాణి.. రీసెంట్ టైంలో చేసిన మలయాళ చిత్రం 'లోక' మూవీ అనుహ్యంగా బ్లాక్బస్టర్ అయింది. రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించింది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)ఉమెన్ సెంట్రిక్ సూపర్ హీరో కథతో తీసిన ఈ సినిమా.. కల్యాణి ప్రియదర్శన్కు యాక్షన్ హీరోయిన్గా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్లు తెలుస్తోంది. 'ధురంధర్' ఫేమ్ రణ్వీర్ సింగ్.. త్వరలో జాంబి థ్రిల్లర్ స్టోరీతో తీస్తున్న రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కల్యాణిని హీరోయిన్గా తీసుకున్నారట.ఇందులో కల్యాణిది యాక్షన్ రోల్ అని తెలుస్తోంది. ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందని టాక్. దీని తర్వాత తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన 'లోక' సీక్వెల్లో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం అవుతుందని సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) -
నన్ను కావాలనే తప్పించారు.. వారణాసి బ్యూటీ ఎమోషనల్
-
దురదృష్టమని వదిలేస్తే.. అదే ఇప్పుడు రూ.450 కోట్లు అయ్యింది!
ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.కొన్నాకే మొదలైన కష్టాలు..బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అన్లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారిందిఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధరతర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. -
విదేశీయుడిని పెళ్లాడబోతున్న స్టార్ హీరో కూతురు.. ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
'నిన్ను పొరపాటున తీసుకున్నారు'.. రాజమౌళి హీరోయిన్ ఆవేదన
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇండియన్ మూవీలో నటిస్తోంది. మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసిలో హీరోయిన్గా కనిపించనుంది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ముద్దుగుమ్మ తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కేవలం ఒక్క క్షణంలోనే సినిమా చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమందిని మెప్పించలేకపోయాననే కారణంతో తనను సినిమా నుంచి తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయని ప్రియాంక తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను వాళ్లతో ఏకీభవించలేదని.. నన్ను సినిమాల నుంచి తీసేశారు. 2007లో ఓ సినిమాకు నన్ను ఎంపిక చేశారు. సలామ్-ఎ-ఇష్క్ షూటింగ్ సమయంలో మరో సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సమయంలో హీరో ఒకరోజు నా సెట్కు వచ్చారు. తర్వాత నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసి నాకు మద్దతుగా వచ్చాడని అనుకున్నా. కానీ ఆయన ఊహించని మాట చెప్పారు. దర్శకుడు పొరపాటున నిన్ను సెలెక్ట్ చేశారు. నిజానికి ఈ రోల్ మరో హీరోయిన్ చేయాల్సింది. మనం భవిష్యత్తులో మరో సినిమా చేద్దాం. ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చా’ అని చెప్పారని గుర్తు చేసుకుంది. అంతేకాకుండా కొందరు అగ్ర హీరోలు నన్ను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. -
ముంబై : గౌరవ్ గుప్తా కౌచర్ షోలో... మెరిసిన నటి అనన్య పాండే, శోభిత (ఫొటోలు)
-
సీజేపీ ఆందోళన.. కత్రినా కైఫ్ మీద ఈ విమర్శలేంటి?
ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి విద్యార్థి నిరసనలు జరుగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ విషయమై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులే పోరాడుతుండగా తాజాగా ప్రతిపక్షాలు కూడా వీళ్లతో కలిసి చేరాయి. ఈ విద్యార్థి ఉద్యమానికి బాలీవుడ్ నటీనటులు షబానా ఆజ్మీ, ప్రీతి జింటా, రితేష్ దేశ్ ముఖ్, సోనూసూద్, సోనాక్షి సిన్హా తదితరులు తమ సంఘీభావం తెలిపారు. అయితే దీనికి ఏ మాత్రం సంబంధం లేని కత్రినా కైఫ్ మీద ఇప్పుడు పలువురు విమర్శలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్తో కత్రినా.. సందీప్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు?)కత్రినా కైఫ్ అభిమాని ఒకరు 'కేథలిక్ ఫ్యాన్స్' అని ఓ ఫ్యాన్ పేజీ రన్ చేస్తున్నాడు. దీనికి దాదాపు 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ పేజీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సదరు పేజీ అడ్మిన్ ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి కత్రినాకు అభిమానినని, అలాంటిది భారతీయ విద్యార్థులకు సంబంధించిన కీలక అంశంపై ఆమె స్పందించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సదరు అడ్మిన్ వెల్లడించాడు.మేము మీకు కష్టకాలంలో అండగా నిలిచాం. కానీ భారతీయుల కోసం ముఖ్యంగా విద్యార్థుల కోసం ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకు లేదు. అందుకే మిమ్మల్ని అన్ఫాలో చేస్తున్నా. ఈ ఫ్యాన్పేజీని కూడా మూసివేస్తున్నా అని సదరు అడ్మిన్ పేర్కొన్నాడు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు సదరు పేజీ అడ్మిన్కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం కత్రినాకు మద్దతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నట్లే, స్పందించకపోయే హక్కు కూడా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ప్రతి సామాజిక, రాజకీయ అంశంపై సెలబ్రిటీలు తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.(ఇదీ చదవండి: రూ.251 ఫోన్ స్కామ్ గుర్తుందా? ఈ కాన్సెప్ట్తో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ తెలుగు సిరీస్) -
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్ను గుర్తించే మిషన్లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్ఫోర్స్ కమాండర్గా కనిపించనున్నారు. -
ముంబై : అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
-
శ్రీరాముడు పాత్ర చేయడం నా అదృష్టం: రణ్బీర్ కపూర్
రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 1’, వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 2’ విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగం ట్రైలర్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట వేడుక నిర్వహంచి, ఈ సినిమా హిందీ 3డీ ట్రైలర్ను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి యోగా గురువు రామ్దేవ్ బాబా అతిథిగా హాజరై, ట్రైలర్ నచ్చిందని చెప్పి, ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో రణ్బీర్ మాట్లాడుతూ– ‘‘రామానంద్ సాగర్గారు తీసిన ‘రామాయణం’ (సీరియల్)లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్గారు అత్యద్భుతంగా నటించారు. తరాలుగా శ్రీరాముడి పాత్రలో అరుణ్గారిని చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నేను చిన్నప్పట్నుంచి శ్రీ రాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘సీతమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం. ఆ సీతమ్మే నాతో ఆమె పాత్ర చేయిస్తుందని, సీతమ్మకు కావాల్సినట్లుగా నా చేత నటింపజేసుకుంటుందని నమ్మి నేను ఈ రోల్ చేశాను. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘మన శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ‘రామాయణ’ చేశాం’’ అని అన్నారు.‘‘మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు నమిత్ మల్హోత్రా. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల సంవత్సరాలుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు నితీష్ తివారి. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, శోభన, అజింక్య, కునాల్ కపూర్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ నటి
మన దేశంలో సినిమాల కంటే సీరియల్స్కే క్రేజ్ ఎక్కువ. అందుకు తగ్గట్లే వాటిలో నటించేవాళ్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అలా భారతీయ టీవీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్లలో హిందీ నటి జెన్నిఫర్ వింగెట్ ఒకరు. 'కసౌటీ జిందగీ కే', 'సరస్వతీ చంద్ర', 'బేహద్', 'బేపన్నా', 'కోడ్ ఎం' తదితర సీరియల్స్తో ఈమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడీమె రెండో పెళ్లి చేసుకుని అభిమానులని సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)జెన్నిఫర్ గతంలో 'దిల్ మిల్ గయే' సీరియల్ చేసింది. ఇందులో నటిస్తున్న టైంలోనే సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ప్రేమించింది. 2012లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో రెండేళ్లకే అంటే 2014లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న జెన్నిఫర్ గురించి కొన్నాళ్ల ముందు మళ్లీపెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఈమె స్పందించలేదు. దీంతో అవి పుకార్లు మాత్రమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారికంగా తన వివాహం గురించి ప్రకటన చేసింది.గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్కి చెక్ పెడుతూ జెన్నిఫర్ వింగెట్.. తన పెళ్లి వీడియోని షేర్ చేసింది. సింగపూర్కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్ని తన భర్తగా పరిచయం చేస్తూ వివాహం సంగతి అధికారికంగా ప్రకటించింది. యూకేలోని ఓ చర్చిలో సన్నిహితుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది.నూతన దంపతులుగా మొదటిసారి కలిసి నడవడం, ఉంగరాలు మార్చుకోవడం, తొలి ముద్దు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలను ఆస్వాదించడం లాంటి మధుర క్షణాలని ఈ వీడియోలో పంచుకుంది. ఇక జెన్నిఫర్ పెళ్లి గురించి పోస్ట్ పెట్టడంతో సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి) View this post on Instagram A post shared by Jennifer Winget (@jenniferwinget1) -
ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్కు దక్కింది ఇంతేనా?
సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు ఊహించని విజయాలను సాధించి బాక్సాఫీస్ లెక్కలనే తలకిందులు చేస్తుంటాయి. 1975లో ‘షోలే’ వంటి బ్రహ్మాండమైన చిత్రం విడుదలైనప్పుడు, అదే సమయంలో వచ్చిన ఒక చిన్న బడ్జెట్ భక్తి చిత్రం సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ సినిమా పేరు ‘జై సంతోషి మా’. ఈ చిత్రం సాధించిన విజయం, అందులోని ఒక పాట సృష్టించిన రికార్డులు నేటికీ సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అయితే, ఈ భారీ విజయం వెనుక ఒక గాయని పడిన వేదన, ఆమెకు అన్యాయం జరిగిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.‘షోలే’ను దాటేసిన ‘జై సంతోషి మా’1975లో వచ్చిన ‘జై సంతోషి మా’ ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక భావోద్వేగంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. భారీ తారాగణం, భారీ సెట్టింగ్స్ లేకపోయినా, ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అప్పట్లో రికార్డులు సృష్టించిన ‘షోలే’ చిత్రానికి సైతం గట్టి పోటీనిచ్చి, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కింది.గడప గడపకూ చేరిన భక్తి గీతంఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అందులోని పాటలు.. ముఖ్యంగా ‘మైతో ఆరతీ ఉతారూ రే సంతోషి మాతా కీ...’. ఈ పాట దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ మారుమోగింది. ఈ పాటను తన మధురమైన గాత్రంతో పండించారు ప్రముఖ గాయని, లతా మంగేష్కర్ సోదరి ఉషా మంగేష్కర్. ఆ కాలంలో ఈ పాట ఒక ట్రెండ్ను సెట్ చేసింది. సినిమాతో పాటు ఈ పాట కూడా ఒక చరిత్రను సృష్టించింది.కేవలం రూ. 400 పారితోషికంఅయితే సినిమా ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ విజయంలో భాగస్వామి అయిన ఉషా మంగేష్కర్కు దక్కిన పారితోషికం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఈ చిత్రంలో మూడు పాటలు పాడారు. ఆ మూడు పాటలకు గానూ ఆమెకు మొత్తం 1200 రూపాయలు చెల్లించారు. అంటే ఒక పాటకు ఆమెకు ముట్టింది కేవలం 400 రూపాయలు మాత్రమే. నాటి పరిస్థితుల రీత్యా ఇది చాలా తక్కువ మొత్తం అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.రికార్డుల మీద రికార్డులుఉషా మంగేష్కర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం ఈ సినిమా గత 100 ఏళ్ల సినీ చరిత్రలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. భారీ లాభాలను గడించినప్పటికీ, నిర్మాతలు ఆమెకు ఎటువంటి అదనపు పారితోషికం అందించలేదు. సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన తర్వాత కూడా, కనీసం కృతజ్ఞతగానైనా అదనంగా చెల్లించాలనే కనీస బాధ్యతను కూడా మేకర్స్ విస్మరించడం గమనార్హం.సంగీత దర్శకుడికి ఫ్రిజ్, గాయనికి మొండి చెయ్యినిర్మాతల తీరుపై ఉన్న అసంతృప్తిని ఉషా మంగేష్కర్ బయటపెట్టారు. సినిమాకు సంగీతం అందించిన సి. అర్జున్కు గుర్తింపుగా ఒక ఫ్రిజ్ బహుకరించారు. అయితే అద్భుతమైన గాత్రంతో పాటలకు ప్రాణం పోసిన గాయనికి మాత్రం అటువంటి చిన్న గుర్తింపు కూడా దక్కలేదు. అప్పట్లో ఉన్న చిత్ర పరిశ్రమలోని వివక్షకు, కళాకారుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.ఆ అన్యాయంపై మౌనంగానే..ఎంతో కష్టపడి పాడి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించినా, క్రెడిట్ విషయంలో కూడా ఆమెకు సరైన గుర్తింపు లభించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఏ రకమైన ప్రశంసలు లేకపోగా, ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె వాపోయారు. అయినా ఉషా మంగేష్కర్ ఆ నాటి పరిస్థితులపై ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోయారు.నేటికీ ఒక చేదు జ్ఞాపకంగా..‘జై సంతోషి మా’ సినిమా సాధించిన రికార్డులు, ఆ సినిమా వెనుక దాగి ఉన్న ఉషా మంగేష్కర్ కన్నీటి గాథ ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కమర్షియల్ సక్సెస్ కంటే కళాకారుల శ్రమకు విలువ ఇవ్వాల్సిన బాధ్యతను ఈ సంఘటన ఎత్తిచూపుతుంది. నేటికీ ఈ పాట విన్నప్పుడు ఎంతో భక్తిభావం కలుగుతుంది. కానీ ఆ పాట వెనుక ఒక సింగర్కు జరిగిన అన్యాయం చూస్తే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది.ఇది కూడా చదవండి: రథయాత్ర వేళ.. భక్తిభావంలో ముంచెత్తే అద్భుత చిత్రాలు -
కింగ్ ఖాన్ గేమ్స్ ఆడతాడు
బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ టాప్ హీరో. కింగ్ ఖాన్ అంటూ తెరపై షారూఖ్ కనపడితే అభిమానులు ఒళ్లు మరచిపోతారు. షారుఖ్ ఖాన్ వీడియో గేమ్స్ అంటే ఒళ్లు ఇల్లు కూడా మరచిపోతారు. ఆయన టాప్ యాక్టర్ అని దేశమంతా తెలుసు కానీ ఆయన బెస్ట్ వీడియో గేమర్ అని తక్కువ మందికే తెలుసు. సిక్స్ టీ ఏజ్లోనూ సిక్స్ప్యాక్ తో స్క్రీన్ను మెరిపించేందుకు ఎంత కష్టానికైనా సై అనే ఈ సూపర్స్టార్, విశ్రాంతి తీసుకోవడానికి కూడా వినోదాన్నే ఎంచుకుంటారు. అందులో భాగంగా తాను బాట్మాన్: ఆర్కమ్ ఆరిజిన్స్ వంటి ప్రసిద్ధ గేమ్లు ఆడతానని తరచుగా ఆయన చెబుతారు. ఏదో రిలాక్సేషన్ కోసం వీడియో గేమ్స్ ఆడితే ఆయన హాబీ గురించి చెప్పుకోవాల్సింది ఏమంది? కానీ ఆయన ముంబై లోని అత్యంత ఖరీదైన భవనాల్లో ఒకటైన ఆయన ఇల్లు ’మన్నత్’లో ఒక అంతస్తు మొత్తాన్ని గేమింగ్ పరికరాలు సెటప్ల కోసం కేటాయించారు కాబట్టే ఆయన హాబీ హాట్ టాపిక్ అవుతుంటుంది.సాటి హీరోలతోనూ... సినిమాల్లోనూ సాటి హీరోలతో తీవ్రమైన పోటీతత్వానికి ప్రసిద్ధి చెందిన ఆయన తరచుగా అభిషేక్ బచ్చన్, కాజోల్ వరుణ్ ధావన్ వంటి సహనటులతో షూటింగ్ల మధ్య గేమ్లు ఆడుతూ పోటీ పడుతూ తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు.. ఆయన ఉత్సాహం ప్రోత్సాహంగా మారి తరచుగా తోటి నటులపై కూడా తన ప్రభావం చూపింది. దానికో ఉదాహరణ ఆయన సహనటుడు సోనూ సూద్. ఒకసారి సెట్లో షూటింగ్ గ్యాప్లో షారూఖ్ ఖాన్ ద్వారా గేమింగ్ నేర్చుకున్న సోనూ ఇప్పుడు దానికి తాను కూడా బానిస అయ్యా నంటున్నాడు. ’మై హూ నా’ షూటింగ్ సమయంలో షారుఖ్ ఉత్సాహంగా... ఫిఫా ఆడేవారని, ఆడేవారని గెలిచే వరకు గేమింగ్ కొనసాగించాలని పట్టుబట్టేవారని షూటింగ్ సమయంలో జాయెద్ ఖాన్ వంటి సహనటులు తరచు గుర్తుచేసుకుంటారు. జాయెద్ ఖాన్ ఇటీవల ’మై హూ నా’ సెట్లో షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను పంచుకుంటూ, షూటింగ్ తర్వాత తాము తరచూ కలిసి వీడియో గేమ్లు ఎలా ఆడేవారో గుర్తుచేసుకున్నారు. ఆయనకు ఉన్న వీడియో గేమ్ అభిరుచి గాఢతను సోదాహరణంగా వెల్లడిస్తూ ఎస్ఆర్కే ఒక అంకితభావం గల గేమర్ అని, ముఖ్యంగా ఫీఫా 2000 గేమ్లో ఓడిపోవడాన్ని ఆయన ఇష్టపడరనే విషయాన్ని జాయెద్ పంచుకున్నారు. గేమింగ్ పట్ల ఆయనకున్న అభిరుచి బయటివారిని మాత్రమే కాదు ఆయన ఇంటివారిని కూడా ఓ ఆట ఆడిస్తోంది. ఆయన చిన్న కొడుకు అబ్రమ్ని కూడా గేమ్ లవర్గా మార్చేసింది. తన ఇద్దరు అబ్బాయిలు గేమింగ్ లో లీనమైన ఫొటోని ఆయన భార్య గౌరీఖాన్ని అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఆధారిత వీడియో గేమ్స్ రావడానికి కూడా రావణ్, డాన్ 2, చెన్నై ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు దోహదం చేశాయి. – సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మౌనీ రాయ్తో డేటింగ్ వార్తలు.. నటుడు స్ట్రాంగ్ రియాక్షన్
ఇటీవలే విడాకుల ప్రకటనతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. నాగిని సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. ఈ ఏడాది మే నెలలో తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తన భర్త సూరజ్ నంబియార్తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే విడాకుల ప్రకటించిన రెండు నెలల్లోనే మౌనీ రాయ్పై రూమర్స్ మొదలయ్యాయి. నటుడు అర్జున్ బిజ్లానీతో ఆమె డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తున్న వీడియో వైరలైంది. దీంతో మౌనీ రాయ్, అర్జున్ రిలేషన్లో ఉన్నారంటూ బాలీవుడ్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నటుడు అర్జున్ బిజ్లానీ స్పందించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు రాస్తోన్న వారిని విమర్శించారు. ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన మీడియా సంస్థలను కోరారు. మా మధ్య 15 ఏళ్లకు పైగా ఉన్న స్నేహాన్ని ప్రేమగా చిత్రీకరించడం నిరాశపరిచిందన్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న నా స్నేహితురాలికి అండగా నిలబడినప్పుడు ఇలా జరగడం మరింత బాధాకరమని అర్జున్ అన్నారు. మా ఇద్దరి చుట్టూ అల్లుతున్న కథనాలు అవాస్తవమని అర్జున్ వెల్లడించారు. ఈ విషయంపై ఓ ప్రత్యేక నోట్ విడుదల చేశారు. అర్జున్ తన నోట్లో రాస్తూ..' "ప్రియమైన క్లిక్బైట్ మిత్రులారా.. 15 ఏళ్లకు పైగా స్నేహంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక గాసిప్ పేజీ శీర్షికలో వచ్చినంచ మాత్రాన ఒక్కసారిగా జంటగా మారిపోరు. కొన్నిసార్లు మన స్నేహితుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ వ్యూస్ కోసం ప్రతి స్నేహాన్ని ప్రేమ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవడం మంచింది. మనం సృష్టించే కథనాల విషయంలో బాధ్యతగా ఉందాం." అంటూ రాసుకొచ్చారు.ప్రజల వ్యక్తిగత జీవితాలకు నష్టం కలిగించేలా సంచలనాత్మక శీర్షికలను వాడకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి అనవసరంగా చొరబడి.. గందరగోళం సృష్టించే తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని మీడియాను కోరారు. బాధ్యతాయుతమైన జర్నలిజం విశ్వసనీయతను పెంచుతుందని.. క్లిక్బైట్ పెంచదని సూచించారు. అర్జున్, మౌని ప్రేమలో ఉన్నారన్న వార్తలను క్రిస్టల్ డిసౌజా కూడా ఖండించింది. ఇదేం పిచ్చి. కేవలం వ్యూస్ కోసం ఏమైనా పోస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది.కాగా.. నటుడు అర్జున్, మౌనీ రాయ్ 15 ఏళ్లకు పైగా స్నేహితులుగా ఉన్నారు. 2015లో, ఏక్తా కపూర్ నిర్మించిన 'నాగిన్' సీరియల్లో వారు రితిక్, శివన్య పాత్రలలో నటించారు. వీరి జోడీ అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకటిగా నిలిచింది. గతంలో జనవరి 27, 2022న సూరజ్ను పెళ్లాడిన మౌనీ రాయ్.. ఈ ఏడాది మే 14న విడిపోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించింది.ఇక కెరీర్ విషయానికొస్తే మౌని రాయ్ ఇటీవల 'ది భూత్నీ','సలాకార్' చిత్రాలలో కనిపించారు. ఆమె అబ్ హోగా హిసాబ్ వెబ్ సిరీస్, హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో కూడా నటించారు. అర్జున్ బిజ్లానీ ఇటీవల అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో 'రైజ్ అండ్ ఫాల్' గెలుచుకున్నారు. అతను ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కామెడీ డ్రామాతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. -
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి
యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్ల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆంచల్ సింగ్.. గత కొన్నేళ్లుగా మోహిత్ చావ్లా అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. తాజాగా వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఢిల్లీలో పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలని ఆంచల్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జోడీ)కొన్నేళ్లు కలిసి జర్నీ చేసిన తర్వాత జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలనే నిర్ణయం సహజంగా వస్తుంది. మా ప్రపోజల్ కూడా ఎంతో అందంగా జరిగింది. కానీ అది నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే మా బంధంలో ప్రతి చిన్న అనుభవం, ప్రతి జ్ఞాపకాన్ని దాటుకుని ఈ దశ వరకు వచ్చాం. అదే నాకు గొప్ప సర్ప్రైజ్ కంటే ఎక్కువ రొమాంటిక్గా అనిపించింది అని ఆంచల్ చెప్పింది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని ఆంచల్ చెప్పింది.పంజాబీ నటి అయిన ఆంచల్.. 2012 నుంచి ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతోంది. తొలుత ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఈమె.. 2013లో వచ్చిన ఓ సింహళ మూవీతో నటిగా మారింది. ఆపై రామయ్య వస్తావయ్యా, హాలీడే, జాక్సన్ దురై, దిళ్లుకు దుడ్డు, పుంజ్ ఖాబ్, బాంబ్ జిగ్రా, జక్మీ లాంటి హిందీ, తమిళ, పంజాబీ సినిమాలు చేసింది. కానీ ఓటీటీలో చేసిన యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్లు ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంతకు సీమంతం) -
ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయిపల్లవి పేరు చెప్పగానే ఫిదా, ప్రేమమ్, అమరన్ లాంటి సినిమాలు, అందులో ఆమె చేసిన అద్భుతమైన యాక్టింగ్ గుర్తొస్తుంది. ఇప్పటివరకు దక్షిణాదిలోని పలు భాషల్లో నటించిన ఈమె.. ఈ ఏడాది హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ హీరోగా చేసిన మూవీతో పరిచయమైంది. రెండున్నర నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ చూడొచ్చు.(ఇదీ చదవండి: సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు: ఆమిర్ ఖాన్)సాయిపల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటించిన సినిమా 'ఏక్ దిన్'. థాయ్ భాషకు చెందిన 'వన్ డే'కి ఇది అఫీషియల్ రీమేక్. పెద్దగా బజ్ లేకుండానే ఈ ఏడాది మే 01న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి తప్పితే ఇందులో చెప్పుకోదగ్గ మరో ప్లస్ పాయింట్ లేదు. ఆమిర్ కొడుకు జునైద్ యాక్టింగ్ అయితే మరీ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ మూవీని జనాలు మర్చిపోయారు. తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేసినప్పటికీ ఇదొచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియనంతలా వచ్చి వెళ్లిపోయింది.ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ సినిమాని విదేశాల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మన దేశంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఏక్ దిన్' విషయానికొస్తే.. ఐటీ ప్రొఫెషనల్ అయిన దినేశ్ (జునైద్ ఖాన్) తనతో పనిచేసే మీరా(సాయిపల్లవి)ని రహస్యంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం ఆమెతో చెప్పే ధైర్యముండదు. ఆఫీస్ పనిమీద జపాన్ వెళ్లినప్పుడు కనీసం ఒక్కరోజైనా ఆమెతో గడపాలని కోరుకుంటాడు. కట్ చేస్తే మీరాకు 'ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన వ్యాధి వస్తుంది. అంటే ఒకరోజుపాటు ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. మరి ఆ రోజు ఏం జరిగింది? దినేశ్ తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగలిగాడా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ) -
సోనమ్ వాంగ్చుక్కు '3 ఇడియట్స్'తో సంబంధం లేదు
కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్నిరోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తోంది. వీళ్లతో మద్ధతిచ్చిన ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. ఏకంగా 9 కిలోలకు పైగా బరువు తగ్గిపోవడంతో ఈయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అయితే చాలామందికి వాంగ్ చుక్ పేరు చెప్పగానే 'త్రీ ఇడియట్స్' సినిమా గుర్తొస్తుంది. ఈయన జీవితం ఆధారంగానే ఆమిర్ పోషించిన పాత్రని తెరకెక్కించారని ఇన్నాళ్లు అంతా అనుకున్నారు. కానీ వాంగ్ చుక్కి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ ఖాన్ ఇప్పుడు చెప్పారు.(ఇదీ చదవండి: విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!)బ్రిటన్లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆమిర్ ఖాన్.. సోనమ్ వాంగ్ చుక్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆయన సురక్షితంగా దీక్ష విరమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం త్రీ ఇడియట్స్' మూవీలో నటించిన ఓమి వైద్య.. సోనంకు మద్ధతు ప్రకటిస్తూ.. పున్సుఖ్ వాంగ్డూ పాత్ర ఈయన జీవితం ఆధారంగా తీశారని అన్నాడు.ఇప్పుడీ విషయం పైనా స్పందించిన ఆమిర్ ఖాన్.. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గానీ, రచయిత అభిజిత్ జోషి గానీ సినిమా తీసే టైంలో సోనం వాంగ్ చుక్ గురించి వ్యక్తిగతంగా ఏం తెలుసుకోలేదు. ఈ మూవీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆరోగ్యం పట్ల అందరం ఆందోళన చెందుతున్నాం. త్వరగా దీక్ష విరమించి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.సోనం వాంగ్చుక్ గతంలో ఇదే విషయమై ఓసారి స్పందిస్తూ, తన జీవితం ఆధారంగా ఆ పాత్ర తీయలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. తన పనితీరు, ఆలోచనల నుంచి కొంతమేర ప్రేరణ పొంది ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: రుక్మిణి మిస్.. ప్రీతి ముకుందన్కి లక్కీ ఛాన్స్)🚨 REPORTER : Your film was inspired by Sonam Wangchuk. He is on fast. AAMIR KHAN 🔥🔥 : No, the character in 3 Idiots had nothing to do with Sonam Wangchuk. We didn't even know about him when we were shooting the film.Aamir stuns CJP 😭😂🔥pic.twitter.com/QaLS5AIf6p— News Algebra (@NewsAlgebraIND) July 16, 2026 -
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజాగా సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్పై సరికొత్తగా అందించనున్నారు. కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందించిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించనుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ కతలో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవనే అభిప్రాయాన్ని ప్రశ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహసాల ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుందని మనకు అవగతమవుతుంది. ఈ సిరీస్ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.రైటర్ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ..'నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథలను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్ఫామ్స్ రూపొందించటం అనందంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించదగ్గ విషయం' అని అన్నారు -
విడాకులు తీసుకున్న రామాయణ నటుడు
ప్రముఖ బాలీవుడ్ జంట తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసుకుంది. మరాఠీ నటుడు, దర్శకుడు అదినాత్ కొఠారి, ఆయన భార్య నటి ఊర్మిళ కనేత్కర్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులను కోరారు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ తమ కుమార్తె జిజా పట్ల ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తనను ఇద్దరం కలిసికట్టుగా పెంచడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు.కొఠారే తన ఇన్స్టాలో రాస్తూ.. "మా స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు మా విజ్ఞప్తి. చాలా సార్లు ఆలోచించిన తర్వాత నేను, ఊర్మిళ పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒక జంటగా మా ప్రయాణం ముగిసింది. కానీ మా కుమార్తె జిజా పట్ల మా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆమె మాకు అత్యంత ప్రాధాన్యత. ఆమె ప్రేమ, భద్రత, మద్దతుతో పెరిగేలా చూసేందుకు మేము చాలా సంతోషంగా, అంకితభావంతో కలిసి పెంచుతాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని అదే విధంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం" అని రాసుకొచ్చారు.ఈ సమయంలో మీడియా మిత్రులు, ప్రజలు మా గోప్యతను గౌరవిస్తారని మేము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సిని కెరీర్ విషయానికొస్తే కొఠారే నెట్ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'లో కనిపించారు. ఈ షోలో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, విహాన్ సమత్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 83లో క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ పాత్ర పోషించారు. కాగా.. కొఠారే ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తోన్న 'రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవీ దూబే, యశ్, సన్నీ డియోల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
మృణాల్.. టీమిండియా క్రికెటర్తో డేటింగ్?
తెలుగులో మూడు నాలుగు సినిమాలే చేసినప్పటికీ హీరోయిన్ మృణాల్ ఠాకుర్ని ఇక్కడి ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూత్ బాగానే ఓన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఏదోలా మృణాల్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం హీరో ధనుష్తో డేటింగ్, పెళ్లి అని తెగ మాట్లాడుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ పంత్తో డేటింగ్లో ఉందంటున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు.(ఇదీ చదవండి: మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక)మృణాల్ ప్రస్తుతం హిందీలో వరసగా సినిమాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితం హీరో ధనుష్తో ఈమె రిలేషన్లో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ వీటిని మృణాల్ కొట్టిపారేసింది. రీసెంట్గా రిషభ్ పంత్, ఈమె ఒకరినొకరు ఇన్ స్టాలో ఫాలో చేసుకోవడంతో వీళ్లిద్దరూ ఏమైనా డేటింగ్ చేస్తున్నారా అని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది.అయితే పంత్ గురించి ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేం కాదు. చాన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో రిలేషన్ అంటూ పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హడావుడి తప్పితే నిజంగా అలాంటిదేమైనా ఉందా? లేదా అనేది మృణాల్, పంత్ చెప్పాలి. అప్పటివరకు ఈ గోల తప్పదు.(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?) -
ఇండియన్ సినిమాతో పాక్ థియేటర్లకు కాసుల పంట!
భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాజకీయంగా, భౌగోళికంగా ఎన్ని సరిహద్దు రేఖలు ఉన్నప్పటికీ, ఈ రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే ఒక అద్భుతమైన వంతెన ఉంది. అదే హిందీ చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్. దశాబ్దాల సెంటిమెంట్, ఉమ్మడి సంస్కృతి, భాషా సామీప్యతతో బాలీవుడ్ సినిమాలు పాకిస్తాన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కేవలం వినోద సాధనంగానే కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహనను, శాంతిని పెంపొందించే ఒక సున్నితమైన సాధనంగా ఇవి ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం.పాకిస్తాన్లో బాలీవుడ్ హవాపాకిస్తానీయులకు బాలీవుడ్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్. దీనికి ప్రధాన కారణం ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక పునాది. భారతదేశం, పాకిస్తాన్ రెండింటికీ ఒకే విధమైన చారిత్రక నేపథ్యం, సంప్రదాయాలు, సంగీతం, నృత్య రీతులు ఉన్నాయి. పాకిస్తాన్లోని మెజారిటీ ప్రజలకు హిందీ, ఉర్దూ భాషలు సులభంగా అర్థమవుతాయి. అందువల్ల, వారు హిందీ సినిమాలలోని డైలాగులను, కథలను బాగా ఆస్వాదిస్తారు. భారీ నిర్మాణ విలువలు, ఆకట్టకునే విజువల్స్, నటీనటుల గ్లామర్ పాక్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తున్నాయి.విభజన గాయాలు - సినిమా చరిత్రభారత్-పాక్ సినిమా బంధాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నాటి దేశ విభజన కాలానికి వెళ్లాలి. విభజనకు ముందు, ఈ ప్రాంతంలో చిత్ర పరిశ్రమ ఉమ్మడిగా ఉండేది. నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసేవారు. అప్పట్లో లాహోర్ ఒక ప్రధాన సినిమా హబ్గా ఉండేది. కానీ విభజన తర్వాత, చిత్ర పరిశ్రమ కూడా విడిపోయింది. చాలా మంది ప్రతిభావంతులు ముంబై (నాటి బాంబే) కి తరలి రావడంతో బాలీవుడ్ బలమైన పరిశ్రమగా ఎదిగింది. పాకిస్తాన్ తన చిత్ర పరిశ్రమను మొదటి నుండి నిర్మించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, నాటి విభజన గాయాలు, అనుబంధాల నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇప్పటికీ ఇరు దేశాల ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తుంటాయి.పాక్ ప్రేక్షకులను కదిలించే ప్రధానాంశాలుపాకిస్తాన్ ప్రజలు బాలీవుడ్ సినిమాల్లో కొన్ని నిర్దిష్టమైన అంశాలకు బాగా కనెక్ట్ అవుతారు. వాటిలో మొదటిది ‘కుటుంబ విలువలు’. ఇరు దేశాల్లోనూ కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ. అలాగే, సమాజం, కట్టుబాట్లను ఎదిరించి గెలిచే 'ప్రేమకథలు' విశ్వవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటాయి. అవినీతి, పేదరికం, లింగ అసమానత వంటి ‘సామాజిక సమస్యల’ పై తీసే సినిమాలు అక్కడ చర్చకు దారితీస్తాయి. వీటికి తోడు భావోద్వేగాలతో కూడిన డ్రామా, దేశభక్తి వంటి అంశాలు పాక్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి.వివాదాలు - సెన్సార్షిప్ సవాళ్లుభారతీయ సినిమాలకు పాకిస్తాన్లో ఆదరణ ఉన్నప్పటికీ, ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగడం లేదు. పాక్ అధికారులు సినిమాల విడుదలకు ముందు కఠినమైన సెన్సార్షిప్ విధిస్తుంటారు. రాజకీయాలు, మతపరమైన అంశాలు లేదా వారి సంస్కృతికి భిన్నంగా ఉండే సీన్లు, డైలాగులను తొలగిస్తారు. దీనికి తోడు, ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు హిందీ సినిమాల దిగుమతి, ప్రదర్శనలపై పాక్ ప్రభుత్వం నిషేధం విధిస్తుంది. ఇది అక్కడి థియేటర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తుంది.పైరసీ.. ఆర్థిక నష్టాలుపాకిస్తాన్లో బాలీవుడ్ చిత్రాలకు ఉన్న మరో పెద్ద ముప్పు పైరసీ. అధికారికంగా సినిమాలు విడుదల కాకపోయినా లేదా ఆలస్యమైనా, అక్రమ మార్గాల్లో సినిమాలు కాపీ అయి ప్రజల్లోకి వెళ్లిపోతాయి. దీనివల్ల చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అయితే, ఈ సవాళ్లు, ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ, దొంగచాటుగానైనా సరే భారతీయ సినిమాలను చూడాలనే పాక్ ప్రజల ఆరాటం మాత్రం తగ్గడం లేదు.డిజిటల్ యుగంలో బాలీవుడ్ భవిష్యత్తుప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్ఫారాలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి సరిహద్దుల గోడలను బద్దలు కొడుతున్నాయి. థియేటర్ల ఆంక్షలు, సెన్సార్షిప్లతో సంబంధం లేకుండా పాక్ ప్రజలు నేరుగా హిందీ సినిమాలను వీక్షిస్తున్నారు. భవిష్యత్తులో భారత్-పాక్ చిత్ర పరిశ్రమల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు, నటీనటుల మార్పిడి వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలు ఏవైనా, వెండితెర అందించే వినోదం, మానవ సంబంధాల కథలు ఇరు దేశాల ప్రజలను ఎప్పటికీ కలుపుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది కూడా చదవండి: అమరనాథ్ యాత్రలో అద్భుతం -
పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్ అందాలు.. ఫోటోలు
-
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
-
'మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?'.. హీరోయిన్కు చేదు అనుభవం
సల్మాన్ ఖాన్ 'వీర్' (2010) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హౌజ్ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఇక తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించింది.ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో పెద్దగా చేయకపోయినా జరీన్ ఖాన్.. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్లో మెరిసింది. ఓ క్లాత్ స్టోర్ ఓపెనింగ్కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా డ్రెస్సులు చూస్తున్న జరీన్ ఖాన్ను ఓ ఫొటోగ్రాఫర్ అసభ్యకర ప్రశ్న వేశారు. ఈ డ్రెస్ మీరు ట్రయల్ వేయొచ్చుగా అని అడగాడు. దీంతో ఆమె వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. మీ హద్దులు దాటొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #ZareenKhan slammed the paparazzi after one of them allegedly asked her to "try the dress" in front of everyone at a Mumbai event.She immediately shut it down, saying, "Hadd mein rehna," and made it clear she won't tolerate such comments.Being a celebrity doesn't mean someone… pic.twitter.com/GsiIhprgnB— Anjali (@Vada_paaww) July 14, 2026 -
25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పూణేలోని ముల్షీ తాలూకాలో రూ. 16.42 కోట్లతో 25.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1,04,000 చదరపు మీటర్లు ( సుమారు 25.7 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్నిరణ్బీర్ నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోనూ భారీ పెట్టుబడుల తరువాత తాజాగా డీల్ విశేషంగా నిలుస్తోంది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సిఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లావాదేవీ 2026 ఏప్రిల్ 30న నమోదైంది. ముల్షీలోని పింప్రి గ్రామంలో ఒకదానికొకటి ఆనుకుని ఉన్న నాలుగు భూభాగాలను రణబీర్ కొనుగోలు చేశారు. వీటి మొత్తం వైశాల్యం 1,04,000 చదరపు మీటర్లు (సుమారు 25.7 ఎకరాలు). అరుణ్ శ్రీరామ్ లూత్రా, నవీన్ శ్రీరామ్ లూత్రా ,మాలా ఉమేష్ మెహతా అనే వ్యక్తుల నుంచి ఈ స్థలాన్ని కొన్నారు. ఈ భారీ ల్యాండ్ డీల్ కోసం రణ్బీర్ ఏకంగా రూ. 82.13 లక్షలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.రణబీర్ కపూర్ ఇటీవల అయోధ్యలోని విలాసవంతమైన లేఅవుట్ 'ది సరయూ'లో రూ. 3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్ను 2026 మే నెలలో కొనుగోలు చేశారు. ఆ పెట్టుబడి పెట్టిన కొద్ది నెలలకే ఈ కొత్త భారీ భూమి కొనుగోలు జరగడం విశేషం.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?రణబీర్, అలియా నెట్వర్త్ పలు కథనాల ప్రకారం కపూర్ కుటుంబానికి చెందిన ఈ స్టార్ హీరో రణబీర్ కపూర్ నికర ఆస్తి విలువ రూ. 400 కోట్లు. జీక్యూ ఇండియా (GQ India) 2024 నివేదిక ప్రకారం, రణబీర్ కపూర్తో పోలిస్తే ఆలియా భట్ నికర ఆస్తి విలువ ఎక్కువ. ఆమె ఆస్తి రూ. 550 కోట్లు. ఇవి కాకుండా రణబీర్ సావన్ (Saavn), బెకో (Beco) వంటి పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు. డ్రోన్ఆచార్య అనే ఏరియల్ ఇన్నోవేషన్స్ కంపెనీకి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అలాగే 'ఆర్క్స్' (Arks) వంటి వెంచర్లలో భాగస్వామ్యంతో పాటు, ముంబై సిటీ ఎఫ్సి (Mumbai City FC) ఫుట్బాల్ క్లబ్కు సహ-యజమానిగా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్పాలి హిల్లోని 'కృష్ణ రాజ్ బంగ్లా' రణబీర్ రియల్ ఎస్టేట్ ఆస్తులలో ముఖ్యమైనది, దీని విలువ దాదాపు రూ. 250 కోట్లుగా చెబుతారు. పూణేలోని ట్రంప్ టవర్స్లో కూడా ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆయన లగ్జరీ కార్ల కలెక్షన్లో బెంట్లీ కాంటినెంటల్ GT V8, రేంజ్ రోవర్, మెర్సిడెస్-AMG SL 55, G63 వంటి కార్లు ఉన్నాయి.ఇక వృత్తిపరమైన విషయానికొస్తే, రానున్న నెలల్లో రణబీర్ నటించిన రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. నవంబర్లో, నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1)లో కనిపించనున్నారు. ఇందులో సాయి పల్లవి, యష్ , సన్నీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027 ప్రారంభంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ నటించిన 'లవ్ & వార్' (Love & War) అనే పీరియడ్-రొమాన్స్ చిత్రం విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ చిన 'యానిమల్' (2023) చిత్రంలో రణబీర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. -
11 ఫ్లాప్లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ పేరు ఒక ప్రభంజనం. అయితే ఒకానొక సమయంలో ఆయన కెరీర్ పతనావస్థకు చేరింది. వరుసగా 11 సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘బిగ్ బీ’ నటనకే గుడ్ బై చెప్పాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ చిత్రాల గమనాన్ని, అమితాబ్ బచ్చన్ తలరాతను పూర్తిగా మార్చేస్తూ 1973లో ఒక సంచలన చిత్రం విడుదలైంది. అదే ‘జంజీర్’. ఈ సినిమా వెనుక ఉన్నది మరెవరో కాదు, హిందీ చిత్రసీమలో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ యుగానికి నాంది పలికిన దిగ్గజ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ మెహ్రా. రైల్వే స్టేషన్లో ఆకలితో పడుకున్న ఒక సామాన్యుడు, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన దర్శకుడిగా ఎలా ఎదిగారు అనేది నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్ను తలపిస్తుంది.వీధుల నుండి ముంబై కలల ప్రపంచానికి..ప్రకాష్ మెహ్రా 1939 జూలై 13న ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, తండ్రి సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో ఆయన ఒంటరివారయ్యారు. మేనమామల దగ్గర పెరిగిన మెహ్రా, తన 13-14 ఏళ్ళ ప్రాయంలోనే కలల నగరం ముంబైకి పారిపోయి వచ్చారు. ముంబైలో బతకడానికి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తలదాచుకోవడానికి చోటు లేక రైల్వే స్టేషన్లో ఆకలితో నిద్రపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. పొట్టకూటి కోసం ఒక కటింగ్ షాప్లో పనిచేశారు. థియేటర్లలో ఫ్లోర్ క్లీన్ చేయడం, స్టేజ్ పై తెరలు లాగడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించారు.టీ బాయ్ నుండి స్టార్ డైరెక్టర్గా..సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఎలాగోలా స్టూడియోలలో అడుగుపెట్టిన ప్రకాష్ మెహ్రా, మొదట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టీ అందించే చిన్న ఉద్యోగిగా చేరారు. అలా అందరికీ చాయ్ పోస్తూనే సినిమా మేకింగ్లోని మెళకువలను గమనించేవారు. క్రమంగా ప్రొడక్షన్ కంట్రోలర్గా మారి, ఆ తర్వాత దర్శకులకు అసిస్టెంట్గా చేరి మెగాఫోన్ పట్టే స్థాయికి ఎదిగారు. 1968లో శశి కపూర్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ‘హసీనా మాన్ జాయేగీ’ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. మొదటి ప్రయత్నమే మంచి విజయాన్ని సాధించడంతో పరిశ్రమలో ఆయన పేరు మారుమోగింది. ఆ తర్వాత ‘మేళా’ (1971), ధర్మేంద్రతో ‘సమాధి’, రాజేంద్ర కుమార్తో 'ఆన్ బాన్' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు.భార్య నగలు కుదువబెట్టి తీసిన ‘జంజీర్’1973లో ప్రకాష్ మెహ్రా కెరీర్ను మాత్రమే కాకుండా, భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ‘జంజీర్’ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, రాజ్కుమార్ వంటి ఆనాటి టాప్ హీరోలందరికీ కథ వినిపించారు. కానీ రకరకాల కారణాల వల్ల వారంతా ఈ సినిమాను తిరస్కరించారు. దాంతో అప్పటికే వరుసగా 11 ఫ్లాపులతో సతమతమవుతున్న అమితాబ్ బచ్చన్ను హీరోగా పెట్టాలని మెహ్రా నిర్ణయించుకున్నారు. ఫ్లాప్ హీరోతో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో, ప్రకాష్ మెహ్రా స్వయంగా తన భార్య నగలను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకుని సినిమాను నిర్మించారు.‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఉదయించాడిలా..‘జంజీర్’ థియేటర్లలోకి వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతవరకు చాక్లెట్ బాయ్, రొమాంటిక్ పాత్రలకే పరిమితమైన హిందీ సినిమాలో, వ్యవస్థపై తిరగబడే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అమితాబ్ను ప్రకాష్ మెహ్రా ఆవిష్కరించారు. ఈ సినిమాతోనే అమితాబ్ బచ్చన్కు ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే బిరుదు వచ్చింది. అమితాబ్ కెరీర్ ఒక్కసారిగా తిరుగులేని టాప్ గేర్లోకి దూసుకెళ్లింది.‘విజయ్’ అనే ఐకానిక్ పేరుతో..అమితాబ్ బచ్చన్కు స్క్రీన్ మీద ‘విజయ్’ అనే పేరును మొదటిసారిగా పెట్టింది ప్రకాష్ మెహ్రానే. ‘జంజీర్’ లోని విజయ్ పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, ఆ తర్వాత అమితాబ్ నటించిన దాదాపు 19 పైగా చిత్రాలలో ఇతర దర్శకులు కూడా ఆయన క్యారెక్టర్ పేరును ‘విజయ్’ గానే కొనసాగించారు. జంజీర్ విజయం తర్వాత ప్రకాష్ మెహ్రా-అమితాబ్ కాంబినేషన్ బాలీవుడ్కు ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన హేరా ఫేరి (1976), ముకద్దర్ కా సికందర్ (1978), లావారిస్ (1981), నమక్ హలాల్ (1982), షరాబీ (1984) వంటి చిత్రాలు నేటికీ కల్ట్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి.అంతర్జాతీయ కల.. ముగిసిన ప్రస్థానంబాలీవుడ్ను శాసించిన ప్రకాష్ మెహ్రా హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లెస్ బ్రాన్సన్తో కలిసి ‘ది గాడ్ కనెక్షన్’ అనే అంతర్జాతీయ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని కోసం భారీగా నిధులు కూడా సమకూరాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కటింగ్ షాప్ వర్కర్ నుండి కోట్లాది మందిని అలరించిన దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన ప్రకాష్ మెహ్రా 2009లో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన సినిమాలు, అమితాబ్ బచ్చన్ రూపంలో అందించిన స్టార్డమ్ భారతీయ సినిమా ఉన్నంతవరకు సజీవంగానే ఉంటాయి.ఇది కూడా చదవండి: సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ -
పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. బాక్సాఫీస్ వద్ద దురంధర్ చెత్త రికార్డ్..!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ దురంధర్. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు కలిపి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఏకంగా రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ స్పై మూవీస్కు ఆడయన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే జపాన్లో ఇండియన్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లో గతంలో రిలీజైన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. జపాన్లో ఇండియన్ చిత్రాల క్రేజ్ దృష్ట్యా తాజాగా దురంధర్ మూవీని సైతం అక్కడ రిలీజ్ చేశారు. దాదాపు 80 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. కానీ తొలి రోజే దురంధర్ మేకర్స్కు నిరాశ ఎదురైంది. ఈ స్పై చిత్రాన్ని తొలి రోజు కేవలం 900 మంది మాత్రమే వీక్షించారు.ఈ చిత్రం జూలై 10న జపాన్ థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో ఆ దేశంలోని టాప్ 25 చిత్రాలలో స్థానం సంపాదించలేకపోయిందని స్థానిక ట్రేడ్ నివేదికల్లో వెల్లడైంది. తొలిరోజు కేవలం 900 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవడంతో టాప్-10 ఇండియన్ సినిమాల జాబితాలో దురంధర్కు చోటు దక్కలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' 1300 టికెట్స్తో చివరి స్థానంలో ఉండగా.. 'పుష్ప 2' గతంలో ఇదే మైలురాయిని చేరుకోలేకపోయింది. జపాన్లో రిలీజైన పుష్ప-2 మూవీకి కేవలం 886 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. తాజాగా దురంధర్కు 900 టికెట్స్ మాత్రమే బుకింగ్స్ లభించాయి. గతంలో జపాన్లో విడుదలైన మొదటి రోజే 8230 టికెట్లతో 'ఆర్ఆర్ఆర్' అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 'సాహో', 'కల్కి 2898 ఏడీ', 'పఠాన్', 'సలార్', 'జవాన్', 'రంగస్థలం', 'దేవర', 'బాహుబలి 2' 'టైగర్ 3' సినిమాలు ఉన్నాయి.మరోవైపు ధురందర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,813 కోట్లు వసూలు చేసి.. 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2025లో థియేటర్లలోకి వచ్చిన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ చిత్రాలను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్ కీలక పాత్రల్లో నటించారు. -
దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
-
ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం
లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే సినిమాలతో పాటు రీసెంట్ సెన్సేషన్ 'మైన్ వాపస్ ఆవుంగా'తో ఇంతియాజ్ అలీ దర్శకుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి కుమార్తె ఇదా అలీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. దర్శకురాలిగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇకపోతే ఈమె ఇప్పుడీమె తనకు ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి బయటపెట్టింది. ఇన్ స్టాలో ఫొటోలు పంచుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)ఇదా అలీ.. గత కొన్నేళ్ల నుంచి కృష్ణ్ అగర్వాల్తో ప్రేమలో ఉంది. ఎప్పటికప్పుడు తాము కలిసున్న ఫొటోలోని ఇదా పోస్ట్ చేస్తూనే ఉంది. అలాంటిది జూలై 01న రాత్రి 11 గంటలకు నార్వేలేని య్ట్రెసాండ్ బీచ్లో క్రిష్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆమెకు వజ్రాల ఉంగరం తొడిగాడు. ఈ ఫొటోలు పోస్ట్ చేయగా.. బాలీవుడ్ సెలబ్రిటీలైన వేదాంగ్ రైనా, శార్వరి, ఖుషి కపూర్, ఆలియా కశ్యప్, ఓర్రీ తదితరులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదా అలీ విషయానికొస్తే..మాయా, లిఫ్ట్, థాయ్ మసాజ్ తదితర షార్ట్ ఫిల్మ్స్ తీసింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి) View this post on Instagram A post shared by Ida Ali (@idaali11) -
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
-
ఏడు కేసుల్లో దోషిగా కమెడియన్.. జైలు శిక్ష ఖరారు
బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ మరోసారి జైలుకు వెళ్లనున్నారు. గతంలో చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే ఆయనకు జైలు శిక్ష విధించగా.. తీహార్ జైలు అధికారులకు లొంగిపోయారు. తాజాగా మరో ఏడు కేసుల్లో రాజ్పాల్ యాదవ్కు చుక్కెదురైంది. ఆయన దోషిగా తేలుస్తూ న్యాయస్థానం మూడు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఇప్పటి వరకు ఏడు వేర్వేరు కేసుల్లో ఆయన దోషిగా తేలారు. ఈ కేసుల శిక్షలు అన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.ఈ ఏడు చెక్కు బౌన్స్ కేసుల్లో ఫిర్యాదుదారులకు ఒక్కొక్కరికి రూ.1.05 కోట్లు చెల్లించాలని రాజ్పాల్ యాదవ్ను ఆదేశించింది. అదనంగా రూ. 25 వేల జరిమానాతో పాటు.. ఫిర్యాదుదారుడికి రూ. 1,04,75,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి కేసులో ఫిర్యాదుదారుడికి రూ.5,51,380 చెల్లించాలని యాదవ్ భార్య రాధా యాదవ్ను హైకోర్టు ఆదేశించింది. రాజ్పాల్ యాదవ్ ఇప్పటికే డిపాజిట్ చేసిన రూ.2.25 కోట్లు చెల్లించాల్సిన మొత్తంలో సర్దుబాటు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్పాల్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. గతంలో తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది. -
సిస్టర్ పెళ్లిలో ఖుషీ కపూర్ స్టైలిష్ అవుట్ఫిట్.. ఫోటోలు
-
తమన్నా యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా మోస్ట్ అవైటేడ్ మూవీ వివాన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియో పంచుకున్నారు మేకర్స్. తాజాగా రిలీజైన పోస్టర్ అడవి నేపథ్యంలో డిజైన్ చేశారు. ఇందులో చేతిలో త్రిశూలంతో ఉన్న ఒక యోధుడు కనిపిస్తుండగా.. ఒకవైపు ఉగ్రరూపంతో ఉన్న పులి, మరోవైపు రౌద్రంతో దూసుకొస్తున్న ఎద్దును చూపించారు. ఈ ఫాంటసీ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Baagh uski dahaad hai… Nandi uski shakti. Aur Vvaan… uski kahaani.#THEVVAAN in cinemas on 25th September, 2026.Starring: @SidMalhotra #TamannaahBhatia @WhoSunilGrover @ManishPaul03 #ShwetaTiwari @soniiannup Producers: #ShobhaKapoor @EktaaRKapoor @ArunabhKumar &… pic.twitter.com/YyULbvAFa7— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 9, 2026 -
మూడు జనరేషన్లతో హీరోయిన్ మెమరబుల్ ట్రిప్ (ఫొటోలు)
-
అన్షులా-రోహన్ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే!
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత మోనా శౌరిల కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడి రోహన్ థక్కర్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సన్నితుల సమక్షంలో పంజాబీ, గుజరాతీ సంప్రదాయాల మేళవింపుతో వైభవంగా ఈ వీరి వివాహ వేడుకు ముగిసింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరించాయి. అదే సందర్భంలో అన్షులా మనసు దోచుకున్నరోహన్ ఎవరు? అతని ఆస్తిపాస్తులేంటి అనే వివరాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.అన్షులా-రోహన్ లవ్ స్టోరీఅన్షులా-రోహన్ దాదాపు మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే సమయానికి ఆమెకు అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. జూలై 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 2025లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో జూన్లో వీరిద్దరూ దంపతులుగా మారాయి. మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక మంగళవారం తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే సమయానికి రోహన్ అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2025 జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో జూన్లో వీరిద్దరూ దంపతులుగా మారాయి. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)ఎవరీ రోహన్ థక్కర్రోహన్ బహిరంగంగా కనిపించే సెలబ్రిటీ కానప్పటికీ రోహన్ స్క్రీన్రైటర్గా పాపులయ్యారు. ఆయన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్కు చెందిన డిజిటల్ కంటెంట్ సంస్థ 'ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్' (Dharmatic Entertainment) లో ఫ్రీలాన్స్ రైటర్గా పనిచేస్తున్నారు. ముంబైలో 1993 అక్టోబర్ 12న పుట్టాడు. తల్లితండ్రులలు, సోదరుడు హృదయ్ ఠక్కర్ ఉన్నారు. కానీ రోహన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి 'ప్లేరైటింగ్ అండ్ స్క్రీన్రైటింగ్'లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే యూసీఎల్ఏ (UCLA) లో కూడా స్క్రీన్రైటింగ్ కోర్సు చేశారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఆయన అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా రంగాలలో పనిచేశారు. ప్రస్తుతం ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లో వెబ్ సిరీస్లు, సినిమాలకు కథలు రాస్తున్నారు 'ది నవలిస్ట్' (2016), 'నెవర్ టూ లేట్' (2016), 'నింబస్' (2018) వంటి లఘు చిత్రాలకు రచయితగా , స్క్రిప్ట్ సూపర్వైజర్గా అతనికి క్రెడిట్ లభించింది. రోహన్ థక్కర్ నికర ఆస్తి విలువ సుమారు 8.5 కోట్ల రూపాయలు పై మాటేనని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.అన్షులా కపూర్ గురించి..బాలీవుడ్లో పాపులర్ ఫ్యామిలీ కపూర్ కుటుంబానికి చెందిన అన్షులా, సెలబ్రిటీలను అభిమానులతో కలుపుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేసే 'ఫ్యాన్కైండ్' (Fankind) అనే సంస్థను నడుపుతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'ది ట్రెయిటర్స్' (The Traitors) అనే రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొన్నారు.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
షూటింగ్స్ అంటే ప్రాణాలతో చెలగాటమేనా?
వెండితెరపై మనల్ని అలరించేందుకు నటీనటులు చేసే సీన్స్ కొన్నిసార్లు వారి ప్రాణాలకే ముప్పుగా మారుతుంటాయి. సినిమా షూటింగుల్లో డూప్ లేకుండా స్టంట్లు చేయడం, ప్రమాదకరమైన సన్నివేశాల్లో పాల్గొనడం బాలీవుడ్ అగ్ర తారలను చావు అంచుల్లోకి నెట్టేసింది. ‘జాగృతి’, ‘పత్తర్ కే ఫూల్’ తదితర చిత్రాల సమయంలో తాను దాదాపు మరణానికి దగ్గరగా వెళ్లానని ఆమధ్య సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. అయితే కేవలం సల్మాన్ మాత్రమే కాదు.. బాలీవుడ్కు చెందిన మరికొందరు స్టార్ హీరో హీరోయిన్లు కూడా షూటింగ్ సెట్స్లో ప్రమాదాల నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ సల్మాన్ ఖాన్‘తేరే నామ్’ చిత్ర షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్కు ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. ఒక సన్నివేశం కోసం ఆయన రైలు పట్టాలపై, రైలుకు ముందు నడుస్తూ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో సల్మాన్ అదుపు తప్పి కింద పడిపోయారు. రైలు ఆయనకు అత్యంత సమీపంగా దూసుకువెళ్లింది. తృటిలో ప్రాణాపాయం తప్పిన ఈ భయంకరమైన అనుభవాన్ని సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకుంటూ షాక్కు గురిచేశారు.సాహసాల వేళ అక్షయ్ కుమార్కు ప్రమాదంబాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ తన సినిమాల్లోని చాలా స్టంట్లను స్వయంగా చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన ‘ఖిలాడియోం కా ఖిలాడీ’, 'సూర్యవంశీ' తదితర చిత్రాల షూటింగ్ సమయంలో తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ఒక స్టంట్ చేస్తున్నప్పుడు ఆయనకు తీవ్రమైన గాయాలై, ప్రాణాపాయ పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.యాభై అడుగుల ఎత్తు నుండి పడ్డ హృతిక్ రోషన్‘క్రిష్’ సినిమా సెట్స్లో స్టార్ హీరో హృతిక్ రోషన్కు ఒక ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్ వైర్ సహాయంతో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, ఒక్కసారిగా ఆ కేబుల్ తెగిపోయింది. దాంతో హృతిక్ దాదాపు 50 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆ గాయాల నుండి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలం పట్టింది.అమితాబ్ బచ్చన్ 'కూలీ' ప్రమాదంబాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్కు ‘కూలీ’ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదం గురించి తెలియని వారుండరు. ఒక ఫైట్ సీన్లో పునీత్ ఇస్సార్ అమితాబ్పై బలమైన పంచ్ విసిరారు. ఈ దెబ్బకు అమితాబ్ అంతర్గత అవయవాలు దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరిన ఆయన, ఏకంగా 59 రోజుల పాటు మరణంతో పోరాడి, చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు.సైఫ్ అలీ ఖాన్ బైక్ బ్యాలెన్స్ తప్పడంతో..‘క్యా కెహనా’ సినిమా సెట్లో సైఫ్ అలీ ఖాన్ ఒక రోడ్డు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒక సీన్ కోసం ఆయన బైక్ నడపాల్సి ఉంది. అయితే షూట్ సమయంలో సైఫ్ బైక్పై నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా కిందపడి, పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల నుంచి కోలుకోవడానికి ఆయనకు కొన్ని నెలల పాటు చికిత్స అవసరమైంది.జీప్ ప్రమాదంలో గాయపడ్డ ఐశ్వర్యా రాయ్బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా ‘ఖాకీ’ చిత్ర షూటింగ్ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఒక సీన్ కోసం ఆమె జీపులో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ జీపు డ్రైవర్ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, ఐశ్వర్య జీపులో నుండి బయటకు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.ఇది కూడా చదవండి: హీరోయిన్ అందానికి దాసోహమై.. -
కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు
హీరోయిన్ కాజల్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. చాన్నాళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త మూవీతో బిజీగా ఉంది. ఈమె నటించిన 'ద ఇండియన్ స్టోరీ' విడుదలకు సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తను చేయబోయే మూవీస్ విషయంలో ఎలాంటి మార్పు వచ్చిందనేది బయటపెట్టింది.(ఇదీ చదవండి: నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్)'ఇప్పుడు ఏ మూవీ ఓకే చేసినా నా కొడుకు దృష్టి నుంచి ఆలోచిస్తాను. 'మమ్మా చేసిన గ్రేట్ సినిమా ఇది' అని అతడు గర్వంగా చెప్పుకోవాలి. అందుకే ఎలాంటి చిత్రాలు చేయాలి? అనే విషయంపై నాకు ఎక్కువ బాధ్యత, అవగాహన వచ్చాయి. నీల్కి రామాయణం అంటే ఇష్టం. ఇంట్లో రోజూ రామ్ లీలా చూస్తాడు. నేను 'రామాయణ'లో మండోదరిగా నటిస్తున్నానని చెప్పగానే తెగ ఆనందపడ్డాడు. అతడికి ఇష్టమైన పాత్ర రావణుడు. ఈ మూవీ పార్ట్2 వచ్చేసరికి నీల్కి ఐదేళ్లు వస్తాయి. థియేటర్లో నా కొడుకు చూసే తొలి సినిమా ఇదే అవుతుంది' అని కాజల్ చెప్పుకొచ్చింది.లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. తర్వాత యంగ్, స్టార్ హీరోలు అందరితోనూ దాదాపుగా నటించింది. కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అనంతరం మళ్లీ అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది.(ఇదీ చదవండి: 15 సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు: బాబుమోహన్)నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా :- Actress #KajalAggarwal "Naa koduku #Neil garvapade roles ne chesthunnanu. '#Ramayana' lo Mandodari ga natistunnanduku chala excited ga unnanu. Neil theatre lo chuse naa first cinema ide.Responsible & meaningful roles… pic.twitter.com/YwgGa2Td3H— Milagro Movies (@MilagroMovies) July 7, 2026 -
నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. ఇది ఖరీదైన ప్రక్రియే కానీ
పిల్లల్ని కనేందుకు సహజ ప్రక్రియ, ఐవీఎఫ్, సరోగసి లాంటి పద్ధతులున్నాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి 'ఎగ్ ఫ్రీజింగ్' అనేది కూడా వెలుగులోకి వచ్చింది. అంటే వయసులో ఉన్నప్పుడు మహిళలు తమ అండాల్ని భద్రపరుచుకుంటారు. తర్వాత పిల్లల్ని కనాలనే ఆలోచన వచ్చినప్పుడు వాటిని తమ శరీరంలోకి ప్రవేశపెట్టి తల్లి అవుతారు. రీసెంట్ టైంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు ఇలానే చేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)'ఈ విషయాన్ని మొదటిసారి మీతో పంచుకుంటున్నాను. నా అండాల్ని భద్రపరుచుకున్నాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. పెళ్లి, పిల్లలు అనేది మనస్ఫూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే జరగాలి. సమాజం లేదా వయసు ఒత్తిడి వల్ల కాదు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా కాస్ట్ లీ. కానీ నేను దాన్ని భరించగలిగినందుకు అదృష్టవంతురాలిని. ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఉండదు''మిమి సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేశాను. హార్మోన్ చికిత్స వల్ల శరీరం ఉబ్బినట్లు అనిపించడం, బరువు పెరగడం లాంటివి ఉంటాయి. అప్పటికే మూవీ కోసం బరువు పెరుగుతున్నందున అదే సరైన టైం అని భావించి నా ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను. ఇది అంత సులభం కాదు. హార్మోన్ల మార్పుల కారణంగా మూడ్ స్వింగ్స్, శారీరక అసౌకర్యం లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే భవిష్యత్తులో పిల్లల విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది' అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కృతి సనన్.. తర్వాత తెలుగులో 'దోచేయ్' అని మరో మూవీ చేసింది. ప్రభాస్ 'ఆదిపురుష్'లోనూ సీతగా నటించింది. ఈమె చేసిన లేటెస్ట్ చిత్రం 'కాక్టెయిల్ 2' గత నెలలో రిలీజైంది. కలెక్షన్స్ వచ్చాయి గానీ మూవీ మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది)Kriti Sanon revealed for the first time that she has frozen her eggs 👀She did it coz she doesn't want to marry soon but wanted to preserve her biological clock. She did it cleverly during the period when she had to gain weight for Mimi, while her hormones were disruptive 👀 pic.twitter.com/KY9W6pxGiU— Chota Don (@choga_don) July 7, 2026 -
సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు)
-
హీరోయిన్ అందానికి దాసోహమై..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను 60, 70వ దశకాల్లో తన అద్భుతమైన అందం, అభినయంతో ఏలిన అగ్ర కథానాయిక ఆశా పరేఖ్. వెండితెరపై తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకున్న ఈమెను అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా పరిగణిస్తారు. అయితే, సెలబ్రిటీలపై అభిమానులు చూపించే అమితమైన ప్రేమ ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తుంటుంది. ఒకానొక సమయంలో ఓ చైనీస్ అభిమాని చేసిన పిచ్చి పని వల్ల ఆశా పరేఖ్ తన సొంత ఇంట్లోనే తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆ ఉత్కంఠభరిత ఘటన వివరాలు..సినిమా రంగాన్ని ఏలిన అందాల నటిఆశా పరేఖ్కు ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచిపేరుంది. అలాగే అభిమాన గణం కూడా భారీగానే ఉంది. 2017లో ప్రముఖ పత్రిక ‘ఫిల్మ్ఫేర్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తనను తీవ్ర భయానికి గురిచేసిన ఒక వింత సంఘటన గురించి ఆశా పరేఖ్ తెలిపారు. తనపై విపరీతమైన వ్యామోహం పెంచుకున్న ఒక చైనీస్ అభిమాని తన జీవితంలో ఎలాంటి కలకలం సృష్టించాడో ఆమె వివరించారు.చైనీస్ అభిమాని విపరీత చేష్టలుఆశా పరేఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు చైనీస్ వ్యక్తి ఆమెపై అభిమానం చాటుకునేందుకు ఏకంగా ఆమె ఇంటి బయటే తిష్ట వేశాడు. అక్కడే బస చేస్తూ నిరంతరం ఆమె కదలికలను, రోజువారీ కార్యకలాపాలను గమనించేవాడు. అతడి వింత ప్రవర్తనతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజురోజుకూ అతడి నిఘా ఎక్కువవడంతో, ఆఖరికి అతడి కంట పడకుండా తప్పించుకునేందుకు ఆశా పరేఖ్ తన సొంత కారులోనే దొంగచాటుగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.కత్తితో పొరుగువారిని బెదిరించి..సదరు అభిమాని అశా ఇంటి బయట తిష్టవేయడమే కాకుండా, ఎలాగైనా ఆమె పెళ్లి చేసుకోవాలనే మొండి పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆశా పరేఖ్ ఇంటి ఇరుగుపొరుగు వారు అతడి ప్రవర్తనను గమనించి, అక్కడి నుండి వెళ్లొపొమ్మని గట్టిగా మందలించారు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ చైనీస్ అభిమాని వెంటనే తన వద్ద ఉన్న కత్తిని తీసి, వారిని చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.పోలీస్ కమిషనర్ రంగప్రవేశంఈ విపరీత పరిణామాల చూసి ఆశా పరేఖ్ షాకయ్యారు. సొంత ఇంట్లోనే రక్షణ కరువైందనే భయం ఆమెలో మొదలైంది. ఎంత చెప్పినా వినని ఆ అభిమాని వేధింపుల నుండి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఏ పరిష్కారం దొరక్కపోవడంతో, ఆశా పరేఖ్ అప్పటి ముంబై పోలీస్ కమిషనర్కు స్వయంగా ఫోన్ చేసి రక్షణ కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ చైనీస్ అభిమానిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.జైలు నుండి వచ్చిన వింత లేఖఈ సంఘటన గురించి ఆశా పరేఖ్ స్పందిస్తూ.. జైలుకు వెళ్లిన తర్వాత కూడా ఆ అభిమాని మారలేదని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. జైలు నుంచే ఆమెకు ఒక లేఖ రాస్తూ, ‘నన్ను జైలులో పెట్టారు, దయచేసి నన్ను బయటకు తీసుకురండి’ అని వేడుకున్నాడట. దీనిపై ఆశా స్పందిస్తూ, ‘నేనే నిన్ను లోపల పెట్టించాను.. మరి ఎలా బయటకు తీసుకువస్తానని అనుకున్నావు?’ అని చమత్కరించారు. ఈ ఆసక్తికరమైన ఘటనను ఆమె ‘ది కపిల్ శర్మ షో’లో కూడా పంచుకున్నారు.దాదాసాహెబ్ అవార్డు గ్రహీత వ్యక్తిగత జీవితంసినీ పరిశ్రమకు ఆమె చేసిన విశిష్ట కృషికి గానూ 2020లో భారత ప్రభుత్వం ఆమెను అత్యున్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుతో సత్కరించింది. ఆశా పరేఖ్ ప్రముఖ చిత్రనిర్మాత నాసిర్ హుస్సేన్తో ప్రేమలో పడినప్పటికీ, అతనిని వివాహం చేసుకోలేదు. ఆమె జీవితాంతం వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. తన దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆమె ‘తీస్రీ మంజిల్’, ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’, ‘కార్వాన్’ తదితర అద్భుత చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.ఇది కూడా చదవండి: నాడు చైనా నుంచి తప్పించుకున్న దలైలామా ఏం చేశారు? -
మా దుస్తులపై కూడా వాళ్లదే నిర్ణయం..: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఈ ఏడాది ప్రారంభంలో కాక్టెయిల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి సనన్.. సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై మాట్లాడింది. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.సినీ పరిశ్రమలో లింగ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుందని కృతి సనన్ అన్నారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే స్టార్డమ్ చాలా ప్రత్యేకమన్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపారు. సెట్లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశానని తెలిపారు. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్లో వ్యతిరేకత పెరిగిపోతుందని కృతి సనన్ పంచుకుంది. కృతి సనన్ మాట్లాడుతూ..' సెట్లో దర్శకుడిని ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. నాకు ఆసక్తి ఎక్కువ. ఎప్పటినుంచో అంతే. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటా. నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావ్ అంటారు. సెట్స్పై ఉండే మేనేజ్మెంట్కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్లో కూర్చోబెడతారని' ఆమె తెలిపింది.కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. 'చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని' చెప్పుకొచ్చింది. -
బోనీ కపూర్ కూతురి పెళ్లి.. పంజాబీ సంప్రదాయంలో వేడుకలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆయన మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లి వేడుకలు ఇటీవలే మొదలయ్యాయి. గతేడాది ప్రియుడు రోహన్ థక్కర్తో నిశ్చితార్థం చేసుకున్న అన్షులా ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.పెళ్లి వేడుకల్లో భాగంగా పంజాబీ సంప్రదాయంలో చుడా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో అన్షులా కపూర్ బ్రదర్ అర్జున్ కపూర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. తన సిస్టర్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది అన్షులా కపూర్. అతను ఇంత నిబద్ధతతో ఉండటం తాను ఎప్పుడూ చూడలేదని అన్షులా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వేడుకలో ఖుషీ కపూర్, ఓరీతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక సమయంలో కలీరా ఎవరి తలపైనైనా పడితే.. నెక్ట్స్ ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్నారని నమ్ముతారు.కాగా.. అన్షులా కపూర్, రోహన్ థక్కర్ల నిశ్చితార్థం జూలై 2025లో జరిగింది. 2022లో ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నామని అన్షులా వెల్లడించింది. కాగా.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) -
బాలీవుడ్ నయా ఆల్రౌండర్.. మోడ్రన్ 'ధురంధర్'
బాలీవుడ్లోని అద్భుతమైన హీరోల్లో రణవీర్ సింగ్ ఒకడు. నేడు(జూలై 6)ఇతడి పుట్టినరోజు. ముంబైలోని బాంద్రా ఈస్ట్లో పుట్టిపెరిగిన రణ్వీర్.. 2010లో యష్ రాజ్ ఫిల్మ్స్ రొమాంటిక్ కామెడీ 'బ్యాండ్ బాజా బారాత్'తో అనుష్క శర్మతో కలిసి నటుడిగా అరంగేట్రం చేశాడు, ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అరంగేట్ర అవార్డు అందుకున్నాడు. తర్వాత 2011లో 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్'లో మళ్లీ అనుష్కతో కలిసి నటించాడు. 2013లో లూటేరాలో విషాద పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'రామ్లీలా'తో దీపికా పదుకొణెతో కలిసి అదరగొట్టేశాడు. ఈ చిత్రమే వారి ప్రేమకథకు నాంది పలికింది. 2018లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కెరీర్లో హిట్లతో పాటు ఫ్లాప్లు కూడా చూసిన రణవీర్.. '83' సినిమాలో నటించినందుకుగానూ 2022 ఫిబ్రవరిలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఇతడి కెరీర్ మలుపు తిప్పింది 'ధురంధర్'. 2025 డిసెంబర్ 5న తొలి పార్ట్ రిలీజై షాకిచ్చే బ్లాక్ బస్టర్ అయింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా వావ్ అనిపించే రీతిలో వసూళ్లు సాధించింది. ఈ ఏడాది మార్చిలో 'ధురంధర్ 2: ద రివెంజ్' రిలీజైంది. 1800 కోట్లకు పైగా వసూళ్లతో 'పుష్ప 2' రికార్డులను అధిగమించడంతో పాటు దేశ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించింది.ఈ సినిమా సక్సెస్ టైంలో రణ్వీర్ భార్య దీపికా పదుకొణె సోషల్ మీడియాలో స్పందించకపోవడంతో వారి మధ్య విభేదాలు, విడాకుల గురించి పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత ఈ జంట ముంబై వీధుల్లో, ఒక రెస్టారెంట్లో కలిసి కనిపించడంతో వీటికి తెరపడింది. ఆపైన 2026 ఏప్రిల్లో తమ మొదటి బిడ్డ దువా పుట్టింది. తర్వాత కొన్నాళ్లకే రెండోసారి తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు దీపిక ప్రకటించింది.వ్యక్తిగత జీవితంలో సంతోషంగా, వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న రణవీర్ సింగ్.. తన అరంగేట్రం నుంచి నేటి వరకు వైవిధ్యభరితమైన పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. 'బ్యాండ్ బాజా బారాత్'లో అమాయక కుర్రాడిగా, 'రామ్ లీలా'లో శృంగార కథానాయకుడిగా, 'లూటేరా'లో విషాద పాత్రలో, '83'లో కపిల్ దేవ్గా, ఇప్పుడు 'ధురంధర్'లో స్పై యాక్షన్ హీరోగా - ఇలా ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించిన రణవీర్.. బాలీవుడ్ నయా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. తన 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నాడు.(ఇదీ చదవండి: 'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు) -
60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్
-
‘కలల నగరం’ కథలే వేరు..
దేశ ఆర్థిక రాజధాని, మాయానగరిగా పేరొందిన ముంబై కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది కోట్ల మంది కలల నిలయం. హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్)కు కేంద్ర బిందువైన ఈ నగరం, దశాబ్దాలుగా ఎంతో మంది దర్శకులకు అద్భుతమైన కథా వేదికగా నిలిచింది. ఇక్కడి లోకల్ రైళ్లు, రద్దీగా ఉండే గల్లీలు, ఆకాశహర్మ్యాలు, మురికివాడలు.. సినిమా స్క్రిప్ట్లలో కీలక పాత్రలుగా మారిపోయాయి. ముంబై నగర జీవన విధానాన్ని, అక్కడి విభిన్న పార్శ్వాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించిన బాలీవుడ్ చిత్రాలివే..నగర జీవితాల అంతర్లీన బంధాలుఅనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఇన్ ఎ... మెట్రో' సినిమా ముంబై ఆధునిక జీవన విధానానికి అద్దం పడుతుంది. నగర జీవితంలో మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ఆకాంక్షలు, వారు ఎదుర్కొనే సవాళ్లను విభిన్న కథల ద్వారా ఇందులో చూపించారు. కిక్కిరిసిన లోకల్ రైళ్లు, నైట్ లైఫ్, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత కోసం సామాన్యులు పడే తాపత్రయాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. అదేవిధంగా, హన్సల్ మెహతా తెరకెక్కించిన ‘సిటీలైట్స్’ చిత్రం ఒక గ్రామీణ కుటుంబం మెరుగైన జీవితం కోసం ముంబైకి వలస వచ్చి ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులను, వారి భావోద్వేగాలను ఆవిష్కరించింది.లోకల్ రైళ్లు.. డబ్బావాలాల మ్యాజిక్ముంబై లైఫ్ లైన్ అనదగ్గ లోకల్ రైళ్ల నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘ఏక్ చాలీస్ కీ లాస్ట్ లోకల్’. అర్ధరాత్రి వేళ లోకల్ ట్రైన్ మిస్సయిన ఇద్దరు వ్యక్తులు నగర వీధుల్లో ఎదుర్కొన్న ఊహించని, నవ్వు తెప్పించే సంఘటనలను ఈ డార్క్ కామెడీ చిత్రంలో చూపించారు. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ‘ది లంచ్ బాక్స్’ సినిమా ముంబైలోని ‘డబ్బావాలా’ వ్యవస్థ ఆధారంగా రూపొందింది. ఒక లంచ్ బాక్స్ డెలివరీ తారుమారు కావడం వల్ల ఇద్దరు ఒంటరి వ్యక్తుల మధ్య చిగురించిన పరిచయం, నగరంలోని యాంత్రిక జీవితంలో మానవీయ బంధాల విలువను చాటిచెప్పింది.విషాదం నుండి కోలుకున్న ముంబై స్పిరిట్ముంబై నగరంపై జరిగిన దాడులు, అక్కడి ప్రజల మనోధైర్యాన్ని చాటే చిత్రాలు కూడా బాలీవుడ్లో వచ్చాయి. 2006 ముంబై రైలు పేలుళ్ల నేపథ్యంలో నిషికాంత్ కామత్ రూపొందించిన ‘ముంబై మేరీ జాన్’ చిత్రం, ఆ ఘోర విపత్తు తర్వాత నగర ప్రజలు ప్రదర్శించిన ఐక్యతను, వారి జీవన పోరాటాన్ని అద్భుతంగా చూపించింది. మరోవైపు, శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ చిత్రం, 2008 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం దేశభక్తితో పాటు విపత్కర పరిస్థితుల్లో ముంబై నగరం చూపిన గుండె నిబ్బరాన్ని ప్రతిబింబించింది.మురికివాడల వాస్తవికత.. మానవ హక్కుల పోరాటంమీరా నాయర్ క్లాసిక్ చిత్రం ‘సలామ్ బాంబే’.. ముంబై వీధుల్లోని అట్టడుగు వర్గాల, ముఖ్యంగా వీధి బాలల కఠిన జీవితాలను ప్రపంచానికి పరిచయం చేసింది. పేదరికం, ఆకలి, మనుగడ కోసం వారు చేసే పోరాటం ఇందులో అత్యంత వాస్తవికంగా ఉంటుంది. అలాగే హన్సల్ మెహతా దర్శకత్వంలో వచ్చిన బయోపిక్ ‘షాహిద్’, ముంబైలో 2010లో హత్యకు గురైన మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ జీవితాన్ని ఆవిష్కరించింది. ముంబైలోని న్యాయ వ్యవస్థ సంక్లిష్టతలను, అన్యాయంగా నిందపడిన వారి కోసం ఒక వ్యక్తి చేసిన పోరాటాన్ని ఈ సినిమా చూపించింది. కిరణ్ రావు చిత్రం ‘ధోబీ ఘాట్’ కూడా నగరంలోని సాంస్కృతిక, ఆర్థిక వైవిధ్యాన్ని నలుగురు వ్యక్తుల కోణంలో ఆసక్తికరంగా చూపించింది.‘పేజ్ 3’ సంస్కృతి.. క్రైమ్ అండర్ వరల్డ్మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పేజ్ 3’ సినిమా ముంబై హై-సొసైటీ, సెలబ్రిటీల విలాసవంతమైన జీవితాలు, మీడియా ప్రపంచం వెనుక ఉన్న చేదు నిజాలను నిలదీసింది. దీనికి భిన్నంగా, రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘షోర్ ఇన్ ది సిటీ’ ముంబైలోని నేర ప్రపంచం, సామాన్యుల ఆశయాలు, మనుగడ కోసం పడే ఆరాటాన్ని గ్రిప్పింగ్గా చూపించింది. మరో ముఖ్యమైన చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, 1970ల నాటి ముంబై అండర్ వరల్డ్ తీరుతెన్నులను, గ్యాంగ్స్టర్ల మధ్య నడిచిన ఆధిపత్య పోరాటాన్ని చూపించింది.యువత కలలు.. కీలక ఎన్కౌంటర్లుఅయాన్ ముఖర్జీ రూపొందించిన ‘వేక్ అప్ సిద్’ చిత్రంలో ముంబై నగరం ఒక అందమైన కలల ప్రపంచంలా కనిపిస్తుంది. మెరైన్ డ్రైవ్, ముంబై వర్షాలు, కెరీర్ కోసం నగరానికి వచ్చే యువత ఆలోచనలను ఈ సినిమా ఎంతో ఆహ్లాదకరంగా చూపించింది. ముఖ్యంగా ముంబై నగరాన్ని చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా అపూర్వ లాఖియా తెరకెక్కించిన ‘షూటౌట్ ఎట్ లోఖండ్వాలా’ చిత్రం 1991లో ముంబై పోలీసులకు, మాయా డోలాస్ గ్యాంగ్కు మధ్య లోఖండ్వాలా కాంప్లెక్స్లో జరిగిన ఎన్కౌంటర్ ఆధారంగా రూపొందింది. ఇది ముంబైలోని క్రైమ్ హిస్టరీని కళ్లకు కడుతుంది.ఇది కూడా చదవండి: తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు! -
మూగబోయిన గాత్రం.. ప్రముఖ సింగర్ కన్నుమూత
ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ జానపద గాయని తీజన్ బాయి(70) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆమె రాయ్పూర్లో మరణించారు. ఆమె మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మే 27న రాయ్పూర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన తీజన్ బాయి.. ఛత్తీస్గఢ్ సాంప్రదాయ కళను ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో తీజన్ బాయి జన్మించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకువెళ్లినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఇండియాలోని అత్యంత ప్రసిద్ధ జానపద కళాకారిణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా.. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు. -
ఆల్ఫా మూవీపై ట్రోలింగ్.. కరణ్ జోహార్ ప్రశంసలు..!
ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధానపాత్రలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. స్పై యూనివర్స్లో వచ్చిన మూవీ కావడంతో మరింత రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావించారు. కానీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.10 కోట్ల ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో రూ.9.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్గా ఇండియాలో రూ.11.10 కోట్ల గ్రాస్ రాబట్టగా.. విదేశాల్లో రూ.5 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.అయితే ఈ మూవీపై విమర్శలు వస్తున్న వేళ.. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన ఆరంభం అంటూ ఆలియా నటనను కొనియాడారు. సోషల్ మీడియాలో రెస్పాన్స్ కంటే ప్రేక్షకుల స్పందనే ముఖ్యమని జోహార్ అన్నారు. ఆల్ఫా లాంటి భారీ స్థాయి సినిమాలను ద్వేషంతో కాకుండా.. సానుకూల వైఖరితో అభినందించాలని ఆయన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సినిమాలను థియేటర్లలో ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు.కాగా.. ఈ చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్, హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. దియా మీర్జా కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఏడవ చిత్రం కావడం విశేషం. -
61 ఏళ్ల వయసులో మూడో వివాహానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో
-
ట్రైలర్కి వేళాయె
హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నమిత్ మల్హోత్రా నిర్మాత. ఈ మూవీ తొలి భాగాన్ని దీపావళి కానుకగా నవంబరులో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ‘రామాయణ’ ట్రైలర్ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఈనెల 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నార ట. అందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ వేడుకని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మునుపెన్నడూ లేని విజువల్స్తో ఈ మూవీ రానుంది. ‘రామాయణ’కి హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, ఇండియన్ మ్యుజీషియన్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
గోల్ నుంచి కొనుగోలు దాకా...
భారతదేశంలో అత్యంత వ్యయప్రయాసలతో నిర్మించిన ‘రామాయణ్’ చిత్రంలో రణ్బీర్ కపూర్ కథానాయకుడు కావచ్చు కానీ మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న సాకర్ మ్యాచ్లు చూస్తూ కేరింతలు కొట్టే ఫుట్బాల్ క్రీడాభిమాని కూడా. నిరుపేద పిల్లలను ఆదుకునేందుకు నిధుల సేకరణకోసం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన 18 మంది బాలీవుడ్ ప్రముఖులతో కూడిన ఆల్ స్టార్ ఫుట్బాల్ క్లబ్లో సభ్యుడు. అయితే ఫుట్బాల్పై అభిమానం అంతటితో ఆగిపోలేదు.జీవితంలో ఓ భాగం‘రణబీర్ ఎంత పెద్ద ఫుట్బాల్ అభిమాని అంటే... కేవలం ఒక మ్యాచ్ చూడటం కోసమే ఆయన ఒక్కరోజులో బార్సిలోనా దాకా ప్రయాణించేవాడు’’ అంటూ ఆ క్లబ్ భాగస్వామి బిమల్ పరేఖ్ గుర్తు చేసుకుంటారు. ఫుట్బాల్పై అమితమైన ఆసక్తి ఉన్న రణబీర్ కపూర్, గత 2014లో ‘ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్’ను కొనుగోలు చేశారు. ఒకే సీజన్ లో ‘లీగ్ విన్నర్స్ షీల్డ్’’ఐఎస్ఎల్ కప్’ టైటిల్ రెండింటినీ గెలుచుకున్న మొదటి క్లబ్గా ఆయన క్లబ్ నిలిచింది. ఆ తర్వాత, కూడా రెండుసార్లు ఐఎస్ఎల్ లీగ్ విన్నర్స్ షీల్డ్ను కైవసం చేసుకుంది.‘చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ నా జీవితంలో ఒక భాగం, ఇప్పుడు ఇండియన్ సూపర్ లీగ్లో ముంబై నగరానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. నాకున్న ఆసక్తిని ఈ క్రీడ అభివృద్ధికి వినియోగించడం సంతోషం కలిగిస్తోంది’’ అంటారు రణబీర్.నటుడిగా కన్నా ఆటగాడిగానే...తన బిజీ షూటింగ్ షెడ్యూల్లో కాస్త తీరిక దొరికితే చాలు... రణబీర్ ముంబైలోని ఒక ఫుట్బాల్ మైదానంలో సినీ పరిశ్రమకు చెందిన తన స్నేహితులతో కలిసి ఫుట్బాల్ ఆడటానికి వెళ్లిపోతాడు. ‘ప్రతి రాత్రి పడుకునే ముందు, నటుడిగానో లేదా స్టార్గానో సినిమా సెట్లో ఉన్నట్టు అనుకోను. ఫుట్బాల్ మైదానంలో 8వ నంబర్ జెర్సీ ధరించిన ఫుట్బాల్ క్రీడాకారుడిగా మాత్రమే నన్ను నేను ఊహించుకుంటాను. దిగ్గజ క్రీడాకారులు మెస్సీ ఇనియెస్టాలకు బంతిని పాస్ చేస్తున్నట్లు కలలు కంటాను’’ అని చెప్పడాన్ని బట్టి రణబీర్ క్రీడాసక్తిని అర్థం చేసుకోవచ్చు.‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన ఏ క్రీడాకారుడిపైనైనా భవిష్యత్తులో క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేయాలని కోరుకుంటున్నాను,’’ అని కూడా రణబీర్ చెప్పాడు. ’‘ఫుట్బాల్ ఆట ఆడటం వల్ల అడ్రినలిన్ పెరుగుతుంది, ఇది ప్రేక్షకులను అత్యంత లీనమయ్యేలా చేసే ఆట. దీనిలోని ప్రతి నిమిషం, ప్రతి సెకను ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తూనే ఉంటుంది’’ అని అంటారాయన. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులైన ప్రేక్షకులతోపాటు ఆయన కూడా ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తున్నారు.– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
ప్రియురాలితో మూడో పెళ్లి.. అతిథులకు ప్రత్యేక మెను..!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈనెల 5న తన ప్రియురాలు, బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక చాలా సింపుల్గా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరగనుందని వెల్లడించారు. ఈ వివాహాన్ని అత్యంత దగ్గరి బంధువులతోనే చాలా సీక్రెట్గా జరుపుకోనున్నారు. ఈ పెళ్లికి కేవలం 100-150 మంది మాత్రమే అతిథులు మాత్రమే హాజరవుతారని అమిర్ ఖాన్ సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు. అతిథులకు ప్రత్యేక భోజనాల మెను సిద్ధం చేసినట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. అమిర్, గౌరీ మెను విషయంలో తమకు ఇష్టమైన వంటకాల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. వీరిద్దరు అతిథులకు ఇచ్చే విందు స్పెషల్గా ఉండాలని భావిస్తున్నారట.ఈ పెళ్లికి అమిర్ ఖాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి కూడా హాజరవుతారని తెలుస్తోంది. కాగా.. అమిర్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు.#WATCH | Mumbai | On his marriage plans, actor Aamir Khan says, "I am getting married on July 5, and the wedding will take place at home with close family and friends. We seek everyone's blessings and hope that we remain happy forever..." (02.07) pic.twitter.com/GXhBqEaDcH— ANI (@ANI) July 3, 2026 -
బ్రేకప్ పై ఒక్క పోస్ట్ తో క్లారిటీ..!
-
ప్రియురాలితో మూడో పెళ్లి.. అమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. గతేడాది తన ప్రియురాలిని పరిచయం చేసిన 60 ఏళ్ల హీరో మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. బెంగళూరుకు చెందిన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. ఈ నెల 5న వీరిద్దరి పెళ్లి జరగనుంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ జంట ఒక్కటి కానున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు.అయితే పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్ వేడుక ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. కేవలం అమిర్ ఖాన్ ఇంట్లో అత్యంత సన్నిహితులకు మాత్రమే ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ వేడుకను కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ప్రైవేట్గా జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని సన్నిహితులు ఒకరు వెల్లడించారు. ఇటీవల ఇంటర్వ్యూలోనూ అమిర్ ఖాన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. మా ఇంట్లోనే కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహిత స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని తెలిపారు. మేమిద్దరం చాలా నిరాడంబరంగా చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నామని అమిర్ పేర్కొన్నారు. కాగా.. జూలై 5న ఈ జంట పెళ్లిబంధతో ఒక్కటి కానున్నారు. కాగా.. గతేడాది తన బర్త్ డే సందర్భంగా అమిర్ ఖాన్ ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశారు.కాగా.. అమిర్ ఖాన్కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా.. ఇద్దరితోనూ విడిపోయారు. అమిర్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు, వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. మరోవైపు ప్రియురాలు గౌరీ స్ప్రాట్కు సైతం ఓ కుమారుడు ఉన్నారు. ఆమె కూడా తన భర్తకు విడాకులిచ్చింది. -
రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న తాజా చిత్రం ‘ముపాపా’. సమీర్ సక్సేనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్, పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్స్పై యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విదాని ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2027 ఫిబ్రవరి 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ బుధవారం ప్రకటించారు. ‘‘ముపాపా’ వినూత్నమైన థియేట్రికల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియన్స్కి కొత్త విజువల్ అనుభూతిని అందిస్తుంది. ‘కాలా పానీ, మామ్లా లీగల్ హైస’ వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో భాగమైన పోషమ్ పా పిక్చర్స్ భాగస్వాములు సమీర్ సక్సేనా, బిస్వపతి సర్కార్, సౌరభ్ ఖన్నా, అమిత్ గోలాని ‘ముపాపా’ చిత్రంలో భాగమయ్యారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఆల్ఫా ట్రైలర్పై ప్రభాస్ రివ్యూ.. వీరిద్దరి కాంబో ఫిక్సయిందా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఫౌజీ, కల్కి-2 మూవీస్ కూడా చేస్తున్నారు.ఇక ప్రభాస్ మూవీ తాజాగా ఆలియా భట్ మూవీపై ప్రశంసలు కురిపించారు. స్పై థ్రిల్లర్గా వస్తోన్న ఆల్ఫా మూవీ ట్రైలర్ చూసిన ప్రభాస్.. తన అభిప్రాయాన్ని పంచుతున్నారు. ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేస్తూ ట్రైలర్కు రివ్యూ ఇచ్చేశారు. ఆల్ఫా ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. జూలై 3న రిలీజవుతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చారు.ఇది చూసిన ఆలియా భట్.. ప్రభాస్ పోస్ట్కు రిప్లై కూడా ఇచ్చింది. థ్యాంక్ యు అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్కు స్పందించింది. అయితే దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ కేవలం అభినందనలు తెలిపే ఓ సాధారణ పోస్ట్ కాదంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కల్కి-2లో అలియా భట్ ఫిక్స్ అయిందంటూ పోస్టులు పెడుతున్నారు. అంందుకే ప్రభాస్ ఇలా మెచ్చుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. -
ఆస్పత్రికి డబ్బుల్లేక.. 5 వేలకే పనిచేశా: స్టార్ సింగర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవలే 'మై వాపస్ ఆవుంగా' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, వేదాంగ్ రైనా, శార్వరి కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే సింగర్ దిల్జీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. అంతేకాకుండా తన బాల్యంలోని కష్టాల గురించి మాట్లాడారు. కొన్నిసార్లు తమ కుటుంబం వైద్య చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదురైందని తెలిపారు. నా చిన్నప్పుడు మా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని సింగర్ వెల్లడించారు. పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్లలో ప్రదర్శనలు ఇచ్చానని పేర్కొన్నారు.దిల్జీత్ దోసాంజ్ మాట్లాడుతూ..' 2002లో తన తొలి ఆల్బమ్ విడుదల చేశా. ఆ తర్వాత పుట్టినరోజు వేడుకల్లో ప్రదర్శనల కోసం కొందరు తమ కంపెనీని కొందరు సంప్రదించారు. మొదట అలాంటి కార్యక్రమాల్లో పాడటానికి ఆసక్తి లేకపోయినా.. కాంట్రాక్టు వల్ల ఆఫర్లను అంగీకరించా. కేవలం ఆల్బమ్ అమ్మకాలతో ఆర్థికంగా ఎదగలేనని గ్రహించా. ఆ తర్వాత ప్రత్యక్ష ప్రదర్శనల ఇవ్వడమే సరైన మార్గమని నమ్మా. ఆ టైమ్లో నేను ఎవరినీ కాదనలేదు. ఎవరైనా రూ. 5,000, రూ. 10,000, రూ. 15,000 ఇస్తే సరే అన్నా. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని చోట్ల ప్రదర్శనలకు వెళ్లా' అని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల వల్లే పని దొరికిన చోటల్లా ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధమయ్యానని దిల్జిత్ దోసాంజ్ చెప్పుకొచ్చారు. నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చానని.. జబ్బు చేస్తే, డాక్టరు దగ్గరకు వెళ్ళడానికి డబ్బులు ఉండేవి కావని తెలిపారు. అయితే పెళ్లిళ్లలో ప్రదర్శనలు ఇవ్వడం మానేశానని ఆయన వెల్లడించారు. పంజాబీ సంగీత పరిశ్రమలోని కొంతమంది సీనియర్ కళాకారులు నా ప్రదర్శనలను చిన్నచూపు చూశారు. ఆ వ్యాఖ్యలు తన కెరీర్ను ప్రభావితం చేయకుండా.. సొంత కచేరీలను నిర్వహించడంపై దృష్టి పెట్టానని దిల్జీత్ పంచుకున్నారు. -
పాఠ్యపుస్తకంలో ‘నింబుడ, నింబుడ’.. విచారణకు ఆదేశం!
భువనేశ్వర్: ఒడిశాలో ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో ఒక బాలీవుడ్ పాట ముద్రితం కావడం వివాదానికి దారితీసింది. 1999లో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రంలోని ‘నింబుడ నింబుడ’ అనే హిందీ పాట లిరిక్స్ పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలా మంది దీనిపై మీమ్స్తో హాస్యాన్ని పండిస్తే, మరికొందరు పాఠ్యపుస్తకాల నాణ్యత పరిశీలనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వివాదంపై ఒడిశా పాఠశాల, ప్రజా విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ్ స్పందిస్తూ, ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ పాఠ్యపుస్తకాల తప్పులపై సమగ్ర విచారణకు ఆదేశించారని, ఇందుకు ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, సవరించిన కొత్త పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.ఇటీవలే ఒకటి నుండి ఎనిమిది తరగతుల ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో స్పెల్లింగ్ తప్పులు, ప్రముఖుల పేర్లు తప్పుగా ముద్రించడం వంటి దాదాపు 1600 లోపాలు ఉన్నట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అప్పటి టీచర్స్ ట్రైనింగ్ అండ్ ఎస్సీఆర్ఈటీ డైరెక్టర్ మనోజ్ పాఢీతో పాటు ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లను సస్పెండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల పుస్తకాలను ప్రచురించే ముందు పలు దశల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇలాంటి తప్పులు పిల్లల చదువును దెబ్బతీస్తాయని విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)
-
పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి
నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటి వార్తలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాయి. అయితే మనస్పర్థల కారణంగా విడిపోయాం అనే కారణాన్ని దాదాపు సినీ జంటలన్నీ చెబుతుంటాయి. కానీ ఓ సీరియల్ నటి మాత్రం షాకింగ్ రీజన్ చెప్పింది. తన భర్త.. పిల్లలు కావాలని అడగడంతోనే విడాకులు ఇచ్చేశానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)హిందీ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న 'లాక్ అప్' అనే రియాలిటీ షో రెండో సీజన్లో పాల్గొంది. రెండో ఎపిసోడ్లో మాట్లాడుతూ తన భర్త గౌరవ్ ఖన్నా నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల గురించి బయటపెట్టింది. సహ కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకుంది.'మా పెళ్లి టైంలోనే నాకు తల్లికావడంపై ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. కాలక్రమణా అది మారుతుందేమో అనుకున్నా. కానీ తర్వాత నేను పిల్లల్ని కనడానికి, తల్లి అయ్యేందుకు సరైన వ్యక్తి కాదని తెలుసుకున్నాను. అదే సంగతి గౌరవ్కి కూడా చాన్నాళ్ల క్రితమే చెప్పాను. అంగీకరించాడు కూడా. కానీ కాలం గడిచేకొద్ది ఆయన అభిప్రాయం మారింది. ప్రస్తుతం పిల్లలు కావాలని అంటున్నాడు. కానీ నేను ఆయన కోరిక నెరవేర్చలేను. ఇది నాకు తెలిసిన వెంటనే.. ఒకవేళ ఈ కారణంగా నన్ను విడిచిపెట్టాలనుకుంటే ఆ నిర్ణయం కూడా నాకు సమ్మతమే అని గౌరవ్తో కూడా చెప్పాను' అని ఆకాంక్ష పేర్కొంది.(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం)'చాలామంది కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం, పిల్లల్ని కనడం లాంటి వాటి కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ కోణంలో చూస్తే గౌరవ్ తప్పు చేయట్లేదు. కానీ నాకే పిల్లల్ని కనాలనే ఆసక్తి లేదు. ఆయన కావాల్సిన జీవితాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే ఆయనని ఆ పరిస్థితిలో ఉంచాలని నేను కోరుకోవడం లేదు' అని ఆకాంక్ష చెప్పుకొచ్చింది.ఇకపోతే ఆకాంక్ష.. సంతోషి మా, యే హై ఆషికీ, క్రైమ్ పట్రోల్ తదితర సీరియల్స్ చేసింది. 2016 నవంబరులో నటుడు గౌరవ్ ఖన్నాని ఈమె పెళ్లి చేసుకుంది. అయితే గతేడాది బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొన్నప్పుడు కూడా గౌరవ్ ఖన్నా ఆకాంక్ష ఇప్పుడు చెప్పిన విషయాన్నే చెప్పాడు. తన భార్య, పిల్లలను కనకూడదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, తనకు మాత్రం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలు కావాలనే కోరిక ఉందని వెల్లడించాడు. అయితే ఇదంతా చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నం చేయట్లేదని స్పష్టం చేశాడు.(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్) -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో మరో థ్రిల్లర్ మూవీ సందడి చేయనుంది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఇక్కా వచ్చేనెలలో ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ చిత్రాన్ని కోర్ట్ రూమ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 10 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మర్డర్ కేసు చుట్టే కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ కేసును వాదించే డిఫెన్స్ లాయర్గా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ ట్రైలర్లో కోర్ట్ రూమ్ సీన్స్ ఆసక్తిగా పెంచేస్తున్నాయి. మరి ఈ కేసులో సన్నీ డియోల్ గెలిచారా? అక్షయే ఖన్నా తప్పించుకున్నారా? లేదా అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.కాగా.. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
భన్సాలీతో బాబు..! సెట్స్ పైకి బీభత్సమైన కాంబో
-
బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు
బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ఓ హీరో. ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ రాక్షసుడు, అల్లుడు శీను తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు. అయినా సరే ప్రస్తుతం మూడు నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న ఇతడు.. ప్రస్తుతం భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తున్నాడు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానీ ఓ క్రేజీ రికార్డ్ సాధించాడు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి)తెలుగులో తీసిన యాక్షన్ సినిమాల్ని పేర్లు మార్చి యూట్యూబ్లో హిందీలో రిలీజ్ చేస్తుంటారు. వీటికి ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోలు రవితేజ, రామ్ తదితరులు గతంలో చేసిన చిత్రాలకు ఇలానే వ్యూస్ వచ్చేవి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శీను కాంబోలో వచ్చిన 'జయ జానకి నాయక' కళ్లు చెదిరే ఘనత సాధించింది.'జయ జానకి నాయక ఖూంకర్' పేరుతో యూట్యూబ్లో ఉన్న హిందీ వెర్షన్ సినిమా.. ఏకంగా 1000 మిలియన్లు అంటే బిలియన్ వ్యూస్ సాధించింది. దక్షిణాది నుంచి డబ్బింగ్ అయిన చిత్రాల్లో ఇదే అత్యధికం. దీని తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్ 1.. 860 మిలియన్ల వ్యూస్తో తర్వాతి స్థానంలో ఉంది. అయితే తెలుగులో 'జయ జానకి నాయక' సినిమా జస్ట్ యావరేజ్. కానీ హిందీలో అది కూడా యూట్యూబ్లో మాత్రం వేరే లెవల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.అయితే తన సినిమాల హిందీ డబ్బింగులకు యూట్యూబ్లో విపరీతమైన ఆదరణ వస్తుండేసరికి.. కొన్నాళ్ల క్రితం 'ఛత్రపతి' రీమేక్తో బెల్లంకొండ.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఘోరంగా డిజాస్టర్ అయ్యేసరికి మళ్లీ అటువైపు చూడలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
శ్రద్ధాకపూర్ లేటేస్ట్ మూవీ.. టైటిల్పై తీవ్ర అభ్యంతరం..!
శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో వస్తోన్న హిస్టారికల్ బయోపిక్ ఈథ. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా.. ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రముఖ జానపద కళాకారణి విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్తోనే అంచనాలు పెరిగాయి. ఈ బయోపిక్లో రణదీప్ హూడా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'ఈథ ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.టైటిల్పై వివాదం..ఈ మూవీని ప్రముఖ కళాకారిణి విఠాబాయి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆమె అత్యంత గౌరవరప్రదమైన జానపద కళాకారిణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆమె జీవితంపై వస్తోన్న మూవీ టైటిల్ ఈథ అని పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ టైటిల్ను మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. బయోపిక్కు విఠాబాయి పేరు ఎందుకు పెట్టలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేకర్స్ ప్రశ్నించింది.తాజాగా విఠాబాయి వారసులు సైతం ఈథ టైటిల్ను వ్యతిరేకిస్తున్నారు. ఆమె కుమారులు కైలాష్, రాజేష్ నారాయణ్గావ్కర్, మనవడు మోహిత్ నారాయణ్గావ్కర్ సైతం టైటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టైటిల్పై చిత్ర నిర్మాతలు తమ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నారు. ఆమె జీవిత చరిత్రకు ఆమె పేరునే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమా పేరుకు సంబంధించిన విషయం కాదని... మహారాష్ట్రలో గొప్పగా భావించే లావణి, తమాషా సంప్రదాయాన్ని తీర్చిదిద్దడంలో సహాయపడిన విఠాబాయికి తగిన గుర్తింపునివ్వాలని కోరుతున్నారు. 'విఠా' లేదా 'విఠాబాయి' అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కానీ.. మ్యాడాక్ ఫిల్మ్స్ గానీ స్పందించలేదు.విఠాబాయి నారాయణ్గావ్కర్ ఎవరు?విఠాబాయి నారాయణ్గావ్కర్ మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి. ఆమె స్థానిక లావణి, తమాషా సంప్రదాయ కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నరాు. ఆమె తన కెరీర్లో అత్యంత గౌరవనీయమైన జానపద కళాకారిణులలో ఒకరిగా నిలిచి తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ జానపద కళలకు ఆమె చేసిన సేవలను భారత రాష్ట్రపతి 1957, 1990లో గుర్తించారు. కానీ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ.. విఠాబాయి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో పోరాడారు. -
'చంపేస్తామని బెదిరించారు'..లపత్తా లేడీస్ నటుడి ఆవేదన
బాలీవుడ్ మూవీ లపత్తా లేడీస్ పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్గా నిలిచింది. కిరణ్ రావు తెరకెక్కించిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. ఏకంగా 13 విభాగాల్లో అవార్డులను ఎగరేసుకుపోయింది. ఈ సూపర్ హిట్ మూవీలో సతేంద్ర సోని కీలక పాత్రలో కనిపించారు. లాపతా లేడీస్, మీర్జాపూర్ చిత్రాలతో ఫేమస్ అయిన సతేంద్ర సోనీ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఓ మూవీ షూటింగ్లో తనను డైరెక్టర్ బెదిరించారని సతేంద్ర సోనీ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు డబ్బులు ఇవ్వకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎనిమిది రోజుల పనికి డబ్బు చెల్లించమని అడిగినందుకు చిత్రనిర్మాత పుష్పేంద్ర సింగ్ తనను మూవీ నుంచి తొలగించారని కన్నీటిపర్యంతమయ్యారు. తనతో పాటు పలువురు సహాయ నటులను ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ఆ వీడియోలో పేర్కొన్నారు.ఈ వీడియోలో సతేంద్ర సోని మాట్లాడాతూ.. హలో, నా పేరు సతేంద్ర సోని. నేను 'పెడ్ పల్కి' అనే సినిమా షూటింగ్ కోసం మధ్యప్రదేశ్లోని మైహార్ వచ్చా. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత పుష్పేంద్ర సింగ్ నాకు 50 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన డబ్బు షూటింగ్ సమయంలో చెల్లిస్తామని మాట ఇచ్చారు. మొత్తం 10 రోజుల షూటింగ్.. ఇప్పటికే 8 రోజులు పూర్తయింది. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే ప్యాకప్ చేసుకోమన్నాడు. పది నిమిషాల్లో హోటల్ ఖాళీ చేయి.. లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అతని భార్య ప్రగతి చౌహాన్ కూడా నన్ను తిట్టి, అసభ్య పదజాలంతో దూషించింది. దీంతో నేను చాలా భయపడ్డా. భయంతో హోటల్ నుండి చెక్ అవుట్ చేశా. శ్రీధర్ దుబే, పంకజ్ శర్మ కూడా నాతోపాటే వచ్చారు. ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. చాలా కష్టపడి ముంబై చేరుకున్నా. ' అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Satendra Soni (@satendrassoni) -
ప్రముఖ బుల్లితెర జంట విడాకులు
సినీ ఇండస్ట్రీలోనే విడాకులు పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ విజయ్, జయం రవి లాంటి వాళ్లు విడాకుల కేసులతో వార్తల్లో నిలిచారు. సినిమా రంగంలోనే ఎక్కువగా ఇలాంటి వార్తలొస్తున్నాయి. తాజాగా మరో స్టార్ జంట విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ప్రముఖ బాలీవుడ్ జంట గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటి ఆకాంక్ష తాజాగా లాక్ అప్ సీజన్-2 ప్రీమియర్లో అఫీషియల్గా చెప్పేసింది. గతేడాదిగా తాము విడివిడిగా ఉంటున్నామని.. ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఆమె వెల్లడించింది.ఈ విషయాన్ని 'లాక్ అప్ సీజన్ 2' ప్రీమియర్లో ఆకాంక్ష ధృవీకరించింది. గత ఏడాదిగా తాము విడివిడిగా ఉంటున్నామని, ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఆమె అక్కడ వెల్లడించింది. దీంతో 10 ఏళ్ల వివాహ బంధం తర్వాత గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా విడాకులు తీసుకోబోతున్నారు.ఈ రియాలిటీ షోలో ఆకాంక్ష మాట్లాడుతూ.. "నేను, గౌరవ్ విడాకులు తీసుకుంటున్నాం. మేము గతేడాదిగా విడివిడిగానే ఉంటున్నాం. ఈ విషయం బయటికి చెప్పలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. నాకు, గౌరవ్కు మధ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. మేము ఇప్పటికీ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. భాగస్వాములుగా మేము ఒకరికొకరు సెట్ కాలేదని అనుకుంటున్నాం., ఎందుకంటే మేమిద్దరం చాలా భిన్నమైన ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం. కానీ మేమిద్దరం కలిసి కాదు" అని విడాకులపై తేల్చేసింది. కాగా.. గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా చాలా ఏళ్ల ప్రే తర్వాత నవంబర్ 24, 2016న కాన్పూర్లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరు బాలీవుడ్ సీరియల్స్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. -
థాయ్ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
-
సైలెంట్గా ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ రాజా శివాజీ. ఈ చిత్రంలో రితేశ్ దేశ్ముఖ్ హీరోగా నటించడమే కాదు.. ఆయనే దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీ మరాఠీ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా మరాఠీతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించారు. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని ఇందులో చూపించారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో జెనీలియా, విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. Vidroh karne aa rahein hai Raje ⚔️ pic.twitter.com/1tnxMXNzGU— Netflix India (@NetflixIndia) June 26, 2026 -
‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
-
రియల్ టు రీల్.. 'ఎవరీ విఠాబాయి'?
సినిమా నటులు ఎన్నో పాత్రలు పోషిస్తుంటారు. అయితే నిజజీవిత పాత్రలు పోషించడం అనేది వారికి నిజంగానే సవాలు. అలాంటి సవాలు ఇప్పుడు బాలీవుడ్ అందాల నటి శ్రద్ధా కపూర్కు ఎదురైంది. ‘ఈథా’ అనే బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్లో విఠాబాయి నారాయణ్ గావ్కర్ పాత్రను శ్రద్ధా కపూర్ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో...‘ఎవరీ విఠాబాయి?’ అనే ఆసక్తి మొదలైంది. విఠాబాయి నారాయణ్ గావ్కర్ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పండర్పూర్లో జన్మించిన ప్రసిద్ధ జానపద కళాకారిణి. చిన్న వయసులోనే నాటకరంగంలోకి వచ్చింది. రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. తమాషా, లావణి కళాకారిణిగా తన గానం, నృత్యంతో ప్రేక్షకులను అలరించింది. మరాఠీ జానపదకళలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా నిలిచింది.ఉత్సాహానికి, పట్టుదలకు మారుపేరు అయిన విఠాబాయి ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న రోజుల్లో కూడా వేదికపై ప్రదర్శన ఇచ్చింది. ‘తమాషా సామ్రాజ్ఞి’గా ప్రసిద్ధురాలైన విఠాబాయిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. -
ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)
-
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. ఆసక్తిగా పోస్టర్స్
మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడే అదే పేరుతో మూవీ రానుంది. మీర్జాపూర్: ది మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మీర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.తాజాగా పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మీర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా.. పునీత్ కృష్ణ కథ అందించారు. ఈ మూవీని రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగు భాషలోనూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
బిడ్డని కని వెంటనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. కానీ చివరి క్షణాల్లో డబ్బుల్లేక
బయోపిక్స్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సరిగా తీయలే గానీ సీజన్తో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేటెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ 'ఈటా' పేరుతో ఓ సినిమా చేస్తోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. తీరా చూస్తే ఇదో నిజజీవిత కథతో తీసిన మూవీ అని తెలిసింది. విఠాబాయి అనే ప్రసిద్ధ నృత్య కళాకారిణి జీవితాన్ని ఇప్పుడు వెండితెరపై చూపించబోతున్నారు. ఇంతకీ విఠాబాయి ఎవరు?(ఇదీ చదవండి: కమ్ బ్యాక్ అంటే ఇది.. ఓడిన చోటే సమంత గెలిచింది)'ఈటా' సినిమా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్గొంకర్ బయోపిక్. 1935లో మహారాష్ట్రలోని పంఢర్పూర్లో జానపద కళాకారుల కుటుంబంలో జన్మించిన ఈమె.. చిన్నప్పటి నుంచే కళావాతావరణంలో పెరిగారు. తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ప్రసిద్ధ భౌ-బాపు మాంగ్ నారాయణ్గావంకర్ తమాషా బృందంతో పనిచేసేవారు. వీళ్లంతా మహారాష్ట్రలో సంప్రదాయ జానపద కళలని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు.కళా సంప్రదాయాల మధ్య పెరిగిన విఠాబాయి.. లావణి, గవలన్, భేదిక్, తమాషా తదితర సంప్రదాయ కళారూపాలను నేర్చుకుని క్రమంగా మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన కళాకారిణులలో ఒకరిగా ఎదిగారు. ఈమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 'తమాషా సామ్రాజ్ఞి' అనే బిరుదు కూడా అందుకున్నారు. ఇంత ప్రసిద్ధ డ్యాన్సర్ అయినప్పటికీ ఈమె జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. తండ్రి చనిపోవడంతో కుటుంబ తమాషా బృందం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడంతో విఠాబాయిపైన కుటుంబ బాధ్యతలు పడ్డాయి. దీంతో కళారంగాన్ని విడిచిపెట్టకుండా మరింత అంకితభావంతో తమాషా ప్రదర్శనల్లో పాల్గొనేది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర జానపద సంస్కృతిలో చెరగని ముద్ర వేసింది.విఠాబాయి ఎంత లెజెండ్ అనేది ఒక్క సంఘటనతో చెప్పొచ్చు. 'ఈటా' మూవీ టీజర్లో చూపించినట్లు తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ప్రదర్శనకు సిద్ధమైంది. ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన సమయంలో ఈమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అయినా సరే చలించిపోలేదు.స్టేజీ వెనక్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి.. బొడ్డుతాడు స్వయంగా కోసుకుని కాసేపటికే కాళ్లకు గజ్జెలు కట్టుకుని స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలా కళాపట్ల ఈమెకు ఉన్న అంకితభావం ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేసింది.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)అయితే భారత జానపద కళలకు చేసిన సేవలకుగాను విఠాబాయికి 1957, 1990లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారాలు లభించాయి. 2006లో మహారాష్ట్ర ప్రభుత్వం 'విఠాబాయి నారాయణ్గొంకర్ జీవిత సాఫల్య పురస్కారం'ని కూడా ప్రారంభించింది. తమాషా కళారంగానికి విశేష సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తోంది.అయితే ఇంత ప్రసిద్ధ కళాకారిణి అయినప్పటికీ జీవితాంతం ఈమెని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, వ్యక్తిగత కష్టాలు వెంటాడాయి. 2002లో విఠాబాయి చనిపోయే సమయంలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో కన్నుమూసింది. తర్వాత ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు సాయం చేయడంతో దాదాపు రూ.5000 మొత్తాన్ని ఆస్పత్రికి చెల్లించారు. ఇలాంటి విషాదకరమైన విఠాబాయి జీవితాన్ని వెండితెరపై ఎంత ప్రభావవంతంగా చూపిస్తారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.'ఛావా' ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'ఈటా'లో 1940ల నుంచి 1990 వరకు విఠాబాయి జీవితాన్ని చూపించబోతున్నారు. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేయగా రణదీప్ హుడా, నానా పాటేకర్, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, సిద్ధార్థ్ జాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తారేమో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఒక్క స్పీచ్.. చిరంజీవిపై ట్రోలింగ్) -
ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!
-
పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్తో హింట్ ఇచ్చిందిగా..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పెద్ది మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ అచ్చియమ్మ పాత్రలో మెప్పించింది బాలీవుడ్ భామ. అయితే ఆమె రోల్పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆమె సీన్స్ను కొన్నింటిని తొలగించారు. పెద్ది మూవీతో తన గ్లామర్తో అభిమానులను ఆకట్టుకుంది.ఇక సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రేమ, ప్రియుడి గురించి హింట్ ఇచ్చింది. తాను ధరించిన టీ షర్ట్పై క్యూట్ కొటేషన్ రాసుకొచ్చింది. ఒకవేళ నేను తప్పిపోతే నా ప్రియుడికి అప్పజెప్పండి ప్లీజ్.. శిఖర్ పహారియా పేరు రాసిన టీ షర్ట్ను ధరించింది. చూసేందుకు ఇదంతా ఫన్నీగా ఉన్నా.. ఈ ముద్దుగుమ్మ తన లవ్ గురించి ఓపెన్గానే చెప్పినట్లు ఉందంటున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో జాన్వీ కపూర్.. ప్రియుడు శిఖర్ పహారియానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
బాలీవుడ్ ప్రముఖ నటుడు, స్త్రీ 2, ఓఎమ్జి-2 మిమి, మీర్జాపూర్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న పంకజ్ త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిగా వచ్చిన ఆస్తి తాగాదాలో పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీ తీవ్రంగా గాయపడిన సంగతి కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం నటుడు పంకజ్ త్రిపాఠి స్వగ్రామమైన బరౌలీ పట్టణంలోని బెల్సంద్ వద్ద ఈ దాడి జరిగింది. భూ వివాదానికి సంబంధించిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు బీజేంద్రనాథ్ తివారీపై కర్రతో దారుణంగా దాడిచేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.హుటాహుటిన అతడిని గోపాల్ గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి దాడికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి జుడీషియల్ కస్టడీకి పంపినట్లు గోపాల్గంజ్ ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందనందున పూర్తి స్థాయి చట్టపరమైన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ దాడి ఘటనపై జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.Gopalganj, Bihar: Brother of actor Pankaj Tripathi, Bijendra Nath Tiwari, sustained critical injuries in a sharp-weapon attack linked to an old dispute. He was shifted to Patna for advanced treatment, while police formed a special team and launched raids to apprehend the accused. pic.twitter.com/uZRLUN3WNs— IANS (@ians_india) June 21, 2026ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం -
శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్
హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలేం చేయట్లేదు. తమిళ, హిందీలో చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమెని ముఖ్యమంత్రి భార్య అవమానించారని సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)యోగా డే వేడుకల సందర్భంగా ముంబైలో భారీ కార్యక్రమం జరిగింది. దీనికి శ్రీలీల, షాహిద్ కపూర్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కూడా తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. ఫొటోలకు పోజులిచ్చే క్రమంలోనే తన కూతురితో పాటు ఫొటో కావాలని చెప్పి అమృత.. శ్రీలీలని పక్కకు వెళ్లి నిలబడమన్నారు. ఈ వీడియో చూసి శ్రీలీల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సీఎం భార్య అవమానించారని కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి) View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
రియా కపూర్ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం
ముంబై: ఇటీవల అమెరికా వెళ్లిన బాలీవుడ్ దర్శకురాలు, ఫ్యాషన్ స్టయిలిస్ట్ రియా కపూర్ అద్దెకు తెచ్చుకున్న రూ.1.35 కోట్ల విలువైన వజ్రపు చెవి రింగులను పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహితురాలు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూయార్క్లో జరిగే మెట్ గాలాలో పాల్గొనేందుకు రియా కపూర్ ముంబైలోని మెహతా జువెల్లర్స్ అండ్ గోయెంకా జువెల్లర్స్ వద్ద ఖరీదైన రెండు జతల చెవి రింగులను అద్దెకు తీసుకున్నారు. వాటిని సవ్లీన్ సింగ్కు ఇవ్వగా, ఆమె తన బ్యాగులో పెట్టుకున్నారు. రియా, సవ్లీన్ బృందం ఏప్రిల్ 17వ తేదీన ముంబై నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి న్యూయార్క్కు 28న చేరుకున్నారు. న్యూయార్క్లో బస చేసిన పియెర్రె హోటల్కు వెళ్లాక బ్యాగు తెరిచి చూడగా రెండు వేర్వేరు బాక్సుల్లో ఉన్న చెవి రింగులు కనిపించలేదు. వీటితోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన మరో రెండు జతల చెవిరింగులు బ్యాగులో లేవు. తిరిగి ముంబై వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆభరణాలు ముంబైలో మాయమయ్యాయా లేక దుబాయ్, అమెరికాలో ఎవరైనా దొంగిలించారా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శనివారం తెలిపారు. -
ఓటీటీకి దురంధర్-2.. ఆడియన్స్కు బిగ్ సర్ప్రైజ్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కొచ్చిన ఈ సినిమా.. నేటి నుంచి నెట్ఫ్లిక్స్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.అయితే నెట్ఫ్లిక్స్లో ఓటీటీ ప్రియులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు మ్యూటెడ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అన్మ్యూటెడ్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఇండియన్స్ ఆడియన్స్కు కూడా అన్ మ్యూటెడ్ వర్షన్ చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం దురంధర్-2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ
ప్రేమలో పడటానికి, ఆత్మీయ నేస్తాన్ని మనసారా జీవితంలోకి ఆహ్వానించడానికి వయసుతో పనేముంది. కొందరు తమ ఇరవైలలోనే తమ సోల్మేట్ను కలుసుకుంటారు. మరికొందరు నిజమైన తోడు కోసం దశాబ్దాల తరబడి వేచి ఉంటారు. కానీ అరవై ఏళ్ల వయసులో అంటే ఎవ్వరూ ఊహించరు కదా. ప్రఖ్యాత నటి సుహాసిని ములేది 60లలో కూడా ప్రేమ దొరుకుతుందని నిరూపించారు. సుహానా సఫర్తో ఇటీవల జరిగిన సంభాషణలో, జాతీయ అవార్డు గ్రహీత సుహాసినీ 60 ఏళ్ల వయసులో తన పెళ్లి గురించి గుర్తుచేసుకున్నారు.“నేను 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పటివరకు నాకు సరైన జోడి దొరకలేదు. నా భర్త చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి,” అని తన భర్త గురించి ములే చెప్పుకొచ్చారు. లగాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలలో అద్భుత నటనతో ఆకట్టుకుని, అనేక సినిమాల్లో రాణించిన సుహాసిని, ఇక తానెప్పటికీ పెళ్లి చేసుకోలేనేమో ఒంటరిగానే ఉండిపోతానేమే అనుకునేవారట. కానీ విధి మరోలా ఉంది.పేట్ మార్చిన ఫేస్బుక్ మెసేజ్ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా, ఫేస్బుక్లో అనుకోకుండా లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్ట్ (LHC) భౌతిక శాస్త్రవేత్త (Physicist) అతుల్ గుర్తు ప్రొఫైల్ రికమండేషన్ కనిపించింది. అరే..భౌతిక శాస్త్రవేత్తలుకూడా ఫేస్బుక్లో ఉన్నారా?’ అనుకున్నారు. తనకు ఎప్పటినుంచో సైన్స్ అంటే ఆసక్తి ఉండటంతో, ఇంకొంచెంఇంట్రస్టింగ్గా అనిపించింది. ‘LHC అంటే ఏంటి?’ అని ఒక మెసేజ్ పంపారు. అంతే అదే ఆమె జీవితాన్ని అందమైన మలుపు తిప్పింది. ఒక్క మెసేజ్వయసు వ్యత్యాసాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారిద్దరూ అనేకసార్లు మాట్లాడుకున్నారు. అయితే ఒకరోజు అతుల్ ఆమెకు, "బంధాలను మనమే నిర్మించుకోవాలి; అవి ఆకాశం నుండి ఊడిపడవు" అన్నపుడు పట్ల పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది. అయితే, ఆమె నమ్మకాన్ని మరింత బలపరిచిన విషయం ఏమిటంటే, ఆయన తన మొదటి భార్య గురించి రాసిన ఒక వ్యాసం. క్యాన్సర్ బారిన పడ్డ తన భార్య చనిపోయేలోపు ఆమె కోరుకున్న కోరికలన్నీ తీర్చారు. అంతేకాకుండా, ఆమెను సంతోషపెట్టేందుకే ఆమె అనారోగ్య సమస్యను ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఈ విషయం సుహాసిని దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమె హృదయాన్ని కూడా తాకింది.అలా కొన్ని రోజులు ఆన్లైన్లో మాట్లాడుకున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ చివరిలో ముఖాముఖి కలుసుకున్నారు. అలాగే గుర్తును కలిసి, మాట్లాడిన తర్వాత, తన కూతురు సరైన ఎంపిక చేసుకుందని ఆమె తల్లికి నమ్మకం కలిగిందట. అలా సుమారు 75 రోజుల తర్వాత, కుటుంబం అంగీకారంతో 2011 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఎంత అసాధారణంగా ఉందంటే, పెళ్లి రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయారట. అయితే తన యవ్వనంలో పెళ్లి చేసుకోనందుకు ఎదుర్కొన్న విమర్శల మాదిరిగానే, 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట. జీవితంలో ఆలస్యంగా ప్రేమను కనుగొనడం తాను పొందిన అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందంటారు సుహాసిని. సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయో, వయసు పెరుగుతోందనో ఏవరో చెప్పారనో జీవితంలో అతి ముఖ్యమైన సంబంధంలోకి జారిపోకుండా, నిజాయితీగా ఇరు మనసులు కలిసిన నిష్కల్మషమైన ప్రేమే మిన్న అని చాటి చెప్పారు. ఎవరీ సుహాసినీ ములేసుహాసిని ములే హిందీ, మరాఠీ, అస్సామీ చిత్రాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్లో నటించారు. నటనతో పాటు, ఆమె డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో, ఆమె మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. సుహాసిని ములే 1950 నవంబర్ 20న బిహార్లోని పాట్నాలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించారు. 1965లో, పియర్స్ సబ్బు ప్రకటన కోసం సుహాసిని ములే మోడల్గా ఎంపికయ్యారు. ఈ ప్రకటనను చూసిన తర్వాత, ప్రముఖ చిత్ర దర్శకుడు మృణాల్ సేన్ తన చిత్రం భువన్ షోమ్ (1969)లో ఆమెకు ఒక పాత్రను అందించారు.అలా మొదలైన ఆమె నటనా ప్రస్తానం ఎన్నో విజయవంతమైన పాత్రలు, అవార్డులు, రివార్డులతో అద్వితీయంగా సాగింది. -
మరో ఓటీటీకి దురంధర్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. గతేడాది డిసెంబర్లో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన దురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే వచ్చిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారని ఓటీటీ సంస్థ ప్రకటించింది.అయితే తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఓవర్సీస్ ఆడియన్స్కు మాత్రమే నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇండియాలోని ప్రేక్షకులకు సైతం నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వీడియోను రిలీజ్ చేసింది. అంటే ఈ శుక్రవారం నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా దురంధర్-2 సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. 19 June, on Netflix in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.— Netflix India (@NetflixIndia) June 17, 2026 -
'ధురంధర్' తర్వాత వస్తున్న స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
హిందీలో స్పై థ్రిల్లర్ సినిమాలంటే గతేడాది నవంబరు ముందు వరకు యష్ రాజ్ సంస్థ నిర్మించిన మూవీసే గుర్తొచ్చేవి. ఎప్పుడైతే 'ధురంధర్' వచ్చిందో వీటిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అంతలా 'ధురంధర్' ఫ్రాంచైజీ ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి కొత్త మూవీ రిలీజ్కి సిద్ధమైంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'.. ఇలా అయిందేంటి?)యష్ రాజ్ స్పై యూనివర్స్లో ఇప్పటివరకు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, వార్ 2 తదితర చిత్రాలు వచ్చాయి. చివరగా వచ్చిన 'వార్ 2'లో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ నటించాడు. కానీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆల్ఫా'. ఆలియా భట్, శర్వారీ లీడ్ రోల్స్ చేశారు. వచ్చే నెల 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు.యష్ రాజ్ స్పై యూనివర్స్లో ఇప్పటివరకు భారత్-పాక్ కాన్సెప్ట్తో మూవీస్ వచ్చాయి. 'ఆల్ఫా'లో మాత్రం స్టోరీ మారినట్లు కనిపిస్తుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. పసిపాపగా ఉన్నప్పుడే ఆలియాని విలన్ ఎత్తుకొచ్చేశాడు. ఆమెని ఆయుధంలా తయారు చేసి, భారత ఆర్మీపై ప్రయోగిస్తాడు. ఈ క్రమంలోనే ఆలియా అలియాస్ ఆల్ఫాకు తన గతం ఎలా తెలిసింది? ఇందులో మరో హీరోయిన్ శర్వారీ, ఆర్మీ అధికారి అనిల్ కపూర్ పాత్రలేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆలియా కూడా ఫైట్స్ గట్టిగానే చేసినట్లు కనిపిస్తుంది. మరి 'ధురంధర్' చూసిన కళ్లతో ఆడియెన్స్.. 'ఆల్ఫా'ని ఆదరిస్తారా అనేది పెద్ద క్వశ్చన్.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో ఒకే కారులో ఇద్దరు మాజీ భార్యలు, ప్రియురాలు) -
ఒకే కారులో ఇద్దరు మాజీలు, ప్రియురాలు.. ఇదెలా సాధ్యం..!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను వచ్చే నెలలోనే పెళ్లాడనున్నారు. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కనున్నారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా బెంగళూరుకు చెందిన తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశారు. ఇరువురి కుటుంబాల అంగీకారంతో జూలై 5న పెళ్లి చేసుకోబోతున్నారు.ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అమిర్ ఖాన్కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే. మొదట రీనా దత్తాను పెళ్లాడిన ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును ఆయన పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకు వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు.ముచ్చటగా మూడోసారి తన ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్రావు, ప్రియురాలు గౌరీ స్ప్రాట్తో కలిసి ఓకే కారులో కనిపించారు. అమిర్ ఖాన్ ముందు సీటులో కూర్చోగా ముగ్గురు వెనక సీటులో కూర్చుని ప్రయాణించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు భార్యలతో కనిపించడం ఏ స్టార్ హీరోకు సాధ్యం కాదంటూ పోస్టులు పెడుతున్నారు. Dear women if you love Amir Khan? then let your husband be like him.#amirkhan pic.twitter.com/JK3NtDPJOA— Echoles By Sushil Singh (@EcholesBySushil) June 17, 2026 -
విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
సీనియర్ నటుడు, ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్నారు. గతంలో తెలుగులో 'గోపాల గోపాల' చిత్రంలోనూ నటించారు. ఇప్పుడీ ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన దత్తత కూతురు విదేశీయుడితో నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)ఒకప్పుడు హిందీలో వరస సినిమాలతో హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన తొలుత హెలెనా ల్యూక్ అనే నటిని పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగు నెలలకే విడిపోయారు. తర్వాత నటి యోగితా బాలిని వివాహమాడారు. వీళ్లకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. అలానే దిశానీ అనే పాపని కూడా దత్తత తీసుకున్నారు. కోల్కతా అనాథగా దొరికిన ఈ పాపని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడీ ఈమె అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటోంది. నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే కాలిఫోర్నియాకు చెందిన మైల్స్ మంట్జరిస్ అనే కెమెరామ్యాన్తో కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడిన దిశానీ.. ఈనెల 12వ తేదీన అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో పంచుకుంది. చూస్తుంటే ఈ ఏడాదిలో పెళ్లి కూడా చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఏదేమైనా మిథున్ చక్రవర్తి కూతురు దేశాంతర వివాహం చేసుకోనుండటం చర్చనీయాంశమైంది. నటుడు అర్జున్ చిన్న కూతురు కూడా ఇటలీకి చెందిన ఓ కుర్రాడితో గతంలో నిశ్చితార్థం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!) View this post on Instagram A post shared by Dishani Chakraborty (@dishanichakraborty) -
ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్తో, గులాబీ రంగు సూట్లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్తో పాటు వింటేజ్ లుక్ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్ బెబో అని ఎందుకంటారు? తన లుక్ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. -
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్లో 'ఖుబూల్ హై' అనే సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్కమ్ చెప్పింది. ఆమె తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ఆహానా రిసార్ట్లో గ్రాండ్గా జరిగింది.కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు. పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్గా పాల్గొన్నారు. -
ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్గా స్ట్రీమింగ్
ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Bollywood doesn't make enough courtroom thrillers.#Ikka already has my attention. The poster feels tense, the tagline is intriguing, and #SunnyDeol looks completely locked in. 🔥⚖️Also, you can never count out #AkshayeKhanna in a film like this when it comes to intense,… pic.twitter.com/9SuJeH0vWN— Siddharth R Kannan (@sidkannan) June 13, 2026 -
'రాముడి పాత్రకు సుశాంత్ను మించినవారు లేరు'.. సోదరి ఎమోషనల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి గుర్తు చేసుకుంది. ఇవాళ సుశాంత్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. కాలం గడిచినా తన సోదరుడి ఉనికి ఇంకా తమతోనే ఉందని శ్వేత రాసుకొచ్చింది. నువ్వు లేకుండా ఆరేళ్లయినా నువ్వు జీవించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ శ్రీరాముడిలా ఉన్న ఏఐ ఫోటోను షేర్ చేసింది.శ్వేత తన ఇన్స్టాలో రాస్తూ.. "ఆరేళ్ల కాలం గడిచిపోయింది.. అయినా కొన్ని ఆత్మలు కాలానికి అతీతంగా ఎదుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అతను ఎలా మరణించాడో కాకుండా.. ఎలా జీవించాడో గుర్తుంచుకోవాలనుకన్నా.. అతను జిజ్ఞాస, కరుణ, గౌరవంతో నిండిన వ్యక్తి' అని అభివర్ణించారు. ఎవరైనా సరే చాలా గౌరవించేవాడని శ్వేత తెలిపింది. కరుణ, దయ లేకపోతే విజయానికి అర్థం లేదని తన చుట్టూ ఉన్నవారికి నేర్పించాడని ఆమె రాసుకొచ్చారు. అందుకే తన సోదరుడు జీవితమే తనకు ఆదర్శమని ఆమె అన్నారు. రాముడిలా సుశాంత్ సింగ్ రాజ్పుత్..నితేష్ తివారీ రామాయణం టీజర్ విడుదలైన తర్వాత.. సుశాంత్ను శ్రీరాముడిగా ఊహించకున్నానని తెలిపింది. రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన అమూల్యంగా భావించే విలువలకు ప్రతీక అని పేర్కొంది. మర్యాద, కరుణ, గౌరవం, ధైర్యం, సత్యం సీతామాతపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ రాముడి పాత్రకు సంబంధించిన అమాయకత్వం, స్వచ్ఛత, ఔన్నత్యం సుశాంత్ కనిపించాయని అన్నారు. ఈ రోజుల్లో భాయ్ పోషించినంత అద్భుతంగా రాముడి పాత్రను ఎవరూ పోషించలేరని కూడా శ్వేత అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. View this post on Instagram A post shared by ♾️Shweta Singh Kirti (@shwetasinghkirti) -
‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
పనివాళ్లు మనుషులు కారా?: నటి ఆగ్రహం
పనివాళ్లు మనుషులు కారా? వాళ్లకు హెయిర్ కట్ చేస్తే సొమ్మేమైనా అరిగిపోతుందా? అని మండిపడుతోంది బాలీవుడ్ నటి సంధ్య మృదుల్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. నటి తల్లి తన ఇంట్లో పని చేసే ఓ యువతిని సెలూన్కు తీసుకెళ్లి జుట్టు కట్ చేయించాలనుకుంది. కానీ అందుకు ఒకటీరెండు సెలూన్లు అసలు అంగీకరించనేలేదట! డబ్బులు ఎక్కువిస్తామన్నా సరే ససేమీరా కుదరదని తేల్చి చెప్పేశాయట!బెదిరించినా, బతిమాలినా..ఈ విషయం విని సంధ్యకు ఒళ్లు మండిపోయింది. ఆ ఆక్రోశాన్నే తను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కింది. 'అమ్మ.. తన ఇంట్లో పనిమనిషికి మంచి హెయిర్ కట్ చేయించాలనుకుంది. దగ్గర్లో ఒక సెలూన్కు తీసుకెళ్లింది. కానీ వాళ్లు చేయమన్నారు. మరో సెలూన్కు వెళ్లగా వాళ్ల దగ్గరా అదే సమాధానం. ఎందుకు చేయరని ప్రశ్నించింది. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తానని అభ్యర్థించింది. అయినప్పటికీ వాళ్లు కుదరదని వెనక్కు పంపించేశారు. ఇంకా ఏ కాలంలో ఉన్నాం?ఇదంతా చూసి ఆ పనిమనిషి మనసు నొచ్చుకుంది. చివరకు ఒక సెలూన్ వాళ్లు ఒప్పుకోవడంతో ఆమెకు హెయిర్ కట్ చేయించి తనను అమ్మ లంచ్కు తీసుకెళ్లింది. అసలు మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? పనివాళ్లు సెలూన్స్కు రాకూడదా? వాళ్లేమైనా అంటరానివాళ్లా? వాళ్లను లోపలకు రానివ్వకపోవడానికి వీరికేం హక్కుంది? నిజంగా ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇక్కడ తప్పు కేవలం సెలూన్లది, అందులో పనిచేసేవారిదే కాదు.. మనది కూడా! ఇకనైనా మారండిమనలో చాలామంది పనివాళ్లను అన్నిచోట్లా అడుగుపెట్టనివ్వరు, కనీసం లిఫ్ట్ కూడా ఎక్కనివ్వరు. ఇలాంటి నీచమైన కండీషన్స్ పెట్టే మనుషులు మారాల్సిన సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం' అని ఆవేదన వ్యక్తం చేసింది. 'పనివాళ్లు మన ఇంటిని, మన కుటుంబాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అలాంటివారికి మనమిచ్చే గౌరవం ఇదా? హెయిర్ కట్ చేయించుకోవాలనుకున్న 26 ఏళ్ల అమ్మాయిని ఇంత బాధపెట్టాలా? అని క్యాప్షన్ ఇచ్చింది. సంధ్య చివరగా తమిళంలో 'పరాశక్తి' సినిమాలో ఇందిరా గాంధీగా నటించింది. View this post on Instagram A post shared by Sandhya Mridul (@sandymridul) చదవండి: విషాదం.. దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత


