ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని రూమర్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, యాంకర్ షెఫాలి బగ్గా డిన్నర్కు వెళ్లడంతో వీరు లవ్లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) పోస్టర్ వైరలవుతోంది.
యాంకర్ ఫైర్
ఇందులో చాహల్ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్ అని కౌంటరిచ్చింది.
పెళ్లి- విడాకులు
ఇకపోతే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్ ఆర్జే మహవశ్తో కొంతకాలం రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్గా ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో బ్రేకప్ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.
బిగ్బాస్తో ఫేమస్
అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్ ఇచ్చిన కౌంటర్తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్ యాంకర్. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో పార్టిసిపేట్ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

చదవండి: అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ


