breaking news
Cinema News
-
షారూఖ్ 'అంకుల్'.. నిజంగా అంతమాట అనేసిందా?
హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్గ్రీన్ స్టార్స్గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్ షారూఖ్ ఖాన్ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..అక్కడ మొదలైందిసౌదీ అరేబియాలోని రియాద్లో ఇటీవలే జాయ్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్ వంటి పలువురు హాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్ నటి హండె ఎర్సెల్ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్.. షారూఖ్తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్ ఖాన్కు పెద్ద అభిమాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీశారు.ఎవరీ అంకుల్?ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్ను చూపిస్తూ ఎవరీ అంకుల్ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్షాట్ తెగ వైరలయింది.అది ఫేక్దీంతో నెటిజన్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్షాట్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్ అనైతే అనలేదు అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్.. ఇంటాక్సికేటెడ్ బై లవ్, చేజింగ్ ద విండ్ అని రెండు టర్కిష్ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్లోనూ యాక్ట్ చేస్తానంది.ఫేక్ స్క్రీన్షాట్ (ఫోటోలో ఎడమవైపు)చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్ -
'యాక్టర్స్ అందరూ వేశ్యలు.. నువ్వూ అదే చేస్తానంటే చస్తా!'
సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్ నటి సయాని గుప్తా.మంచి జీతంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్ను వేశ్యలు అని పిలిచేది. అమ్మ సపోర్ట్ లేదునేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్టీఐఐ (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో చేరాను. సినిమాఅప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్ఎల్బీ 2, ఆక్సన్, పాగలైట్, ఆర్టికల్ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్లో కనిపించింది.చదవండి: పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి -
పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్
దర్శకుడిగా వరుస బ్లాక్బస్టర్లు కొడుతున్న అనిల్ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. సరైన నిర్ణయం తీసుకోకపోతేఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్బస్టర్ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్ ఇచ్చాను.టైటిలే విచిత్రంగా ఉండబోతోందితాజాగా వైజాగ్ టూర్లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్ అయితే జరగబోతోంది. టైటిల్ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్ ప్రకటిస్తాను.పవన్ కల్యాణ్తో కాదు!ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్ మాత్రమే ఫిక్స్ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్ దరకడం కదా! జూన్, జూలైలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుంది. పవన్ కల్యాణ్ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: పెళ్లి ప్రపోజల్.. ముందు కెరీర్పై ఫోకస్ చేయ్: హీరోయిన్ -
హీరోయిన్కు పెళ్లి ప్రపోజల్.. ముందు కెరీర్పై ఫోకస్ చేయ్!
సెలబ్రిటీకు ప్రపోజల్స్ రావడం అనేది చాలా కామన్. అయితే చిన్నపిల్లలు కూడా ప్రపోజ్ చేస్తున్నారని, అదే కాస్త ఆశ్చర్యంగా ఉందంటోంది హీరోయిన్ అవంతిక మోహన్. టీనేజ్ పిల్లలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని చెప్తోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్స్ షేర్ చేసింది. అందులో ఓ అబ్బాయి.. కేరళలో చాలామంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వారిలో నేనూ ఒకడిని అన్నాడు. చిన్న వయసులో ఎంత ధైర్యమో..ఆ మెసేజ్కు అవంతిక స్పందిస్తూ.. ఈ పిల్లాడిని చూడండి.. అంత చిన్నవయసులోనే ఎంత ధైర్యమో! చిన్నోడా.. నేను చెప్పేదేంటంటే నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. కాబట్టి నా గురించి ఆలోచించకుండా వెళ్లి నీ హోమ్వర్క్ చేసుకో.. నా జీవితంలో కొత్త హీరో ఎంట్రీకి ఛాన్స్ లేదు. నీ కెరీర్ మీద ఫోకస్ చేయు అని చెప్పుకొచ్చింది.నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? మరో స్క్రీన్షాట్లో ఓ యువకుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? అని అడిగాడు. అది చూసిన అవంతికకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. నీ మెసేజ్ చూడగానే నాకు నిజంగా నవ్వొచ్చింది. నీకు దాదాపు 20 ఏళ్లు ఉంటాయనుకుంటా.. చాలా రాంగ్ టైమ్ ఇది! అయినా సరే నీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!సినిమాసరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్ పర్సన్ నీ జీవితంలోకి వస్తారు.. అప్పటివరకు జీవితాన్ని ఆస్వాదించు అని రిప్లై ఇచ్చింది. అవంతికకు ఇలాంటి ప్రపోజల్స్ గతంలోనూ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే.. అవంతిక యక్షి: ఫేత్ఫుల్లీ యువర్స్, నీలాకాశం పచ్చకాదల్ చువన్న భూమి, క్రొకొడైల్ లవ్ స్టోరీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది.చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు: శర్వానంద్ -
నన్ను వాడుకుని వదిలేశారు.. ఒక్కడూ..!: శర్వానంద్
మొత్తానికి టాలీవుడ్ హీరో శర్వానంద్ హిట్టు కొట్టాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.నిర్మాతతో విభేదాలు?ఇకపోతే శర్వానంద్కు, నిర్మాత అనిల్ సుంకర మధ్య విభేదాలంటూ గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ సమయంలో శర్వా.. అనిల్ సుంకరను ప్రశంసించిన విధానం చూస్తే అవన్నీ ఉట్టి రూమర్సే అని తేలిపోయాయి. అయినప్పటికీ తాజాగా ఓ చిట్చాట్లో నిర్మాతతో విభేదాలపై స్పందించాడు.నా పరిస్థితి ఇలా..శర్వానంద్ మాట్లాడుతూ.. అనిల్గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మాకే తెలుసు. మేమంతా ఒకరకమైన బాధలో ఉన్నాం. ఇప్పుడు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ నాకు హిట్టొచ్చి ఆరేడేళ్లవుతోంది. నా పరిస్థితి ఇలా ఉంటే అనిల్ నిర్మాతగా చేసిన గత రెండు సినిమాలు పోయాయి. అలా ఒకరికొకొకరం సహాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు.మోసం చేశారుగతంలో నేను చాలామంది నిర్మాతలకు సాయం చేశాను. అందరూ వాడుకుని వదిలేసినవాళ్లే! నేను సాయం చేసినప్పుడు శర్వా మనవాడు అన్న భావన వారిలో ఉండాలి కదా.. అది ఏమాత్రం లేదు. నన్ను మోసం చేశారు. అలాంటి వాళ్లను నమ్మాలంటే కూడా ఆలోచించాల్సి వస్తోంది. అలా వారి వల్ల నాకు తెలియకుండానే తిక్కలోడిగా మారిపోయాను. కానీ, అనిల్గారు నన్ను నమ్మి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆయన నాకు అన్నకంటే ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. శర్వానంద్ ప్రస్తుతం బైకర్, భోగి సినిమాలు చేస్తున్నాడు.చదవదండి: నటుడు, ఎమ్మెల్యే రెండో పెళ్లి.. మొదటి భార్య సంచలన ఆరోపణలు -
నటుడు, ఎమ్మెల్యే రెండో పెళ్లి.. స్పందించిన మొదటి భార్య
బెంగాలీ నటుడు, ఖరగ్పూర్ ఎమ్మెల్యే హిరాన్ చటర్జీ రెండో పెళ్లి చేసుకున్నారు. వారణాసిలో మోడల్ రితికా గిరిని వేదమంత్రాల సాక్షిగా వివాహమాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పరిణామాలపై నటుడి మొదటి భార్య ఆనందిత చటర్జీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. మీలాగే నేనూ ఆన్లైన్లో ఫోటోలు చూశాను. దీనిగురించి నా వద్ద ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. ఇది ఇల్లీగల్ మ్యారేజ్.. వారి పెళ్లి చెల్లదు అని పేర్కొంది.ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే..ఇంకా మాట్లాడుతూ.. నేను, హిరాన్ 2000వ సంవత్సరం డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నాం. మొదట్లో బాగానే ఉన్నాం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో హిరాన్.. ఖరగ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే ఓ మహిళతో రిలేషన్లో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. మొదట్లో నమ్మలేదు, లైట్ తీసుకున్నా.. కానీ, తర్వాత విషయం చిన్నది కాదని అర్థమైంది.హిరాన్ చటర్జీ-రితికా గిరి పెళ్లి ఫోటోజీర్ణించుకోలేకపోయా..మా కూతురి వయసు కంటే రెండేళ్లు పెద్ద అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అది జీర్ణించుకోలేకపోయాను. 2022లో అతడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి విడిగా జీవిస్తున్నాను. నా కూతుర్ని చూసేందుకు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఏవేవో కథలు చెప్పేవాడు. రితికా గిరి అనే అమ్మాయి చచ్చిపోతానని బెదిరిస్తోందని, వేధింపులకు గురి చేస్తోందని బాధపడేవాడు. అప్పుడు మాతో కలిసి ఉండమని చెప్పాను.ఈ గొడవలకు దూరంఅలా 2024లో నా కూతురి 18వ బర్త్డే సమయంలో మాతోపాటే ఉన్నాడు. మేమంతా కలిసి బ్యాంకాక్ వెళ్లి అక్కడ తన బర్త్డే సెలబ్రేట్ చేశాం. సరిగ్గా అదే సమయంలో ఆ ఆమ్మాయి నాకు ఫోన్ చేసి బెదిరించింది. తను చెప్పినట్లుగానే మళ్లీ నా భర్తతో కలిసిపోయింది. ఈ వ్యవహారంతో నేను చాలాకాలంగా టార్చర్ అనుభవిస్తున్నా.. అతడు రెండో పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది.రెండో భార్య ఏమందంటే?ఈ క్రమంలో హిరాన్ చటర్జీ రెండో భార్య రితికా గిరి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తనది చిన్న వయసు కాదని పేర్కొంది. హిరాన్ అతడి మొదటి భార్యకు ఎప్పుడో విడాకుల నోటీసు పంపాడని తెలిపింది. కాబట్టి తమ పెళ్లి చెల్లుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి ఫోటోల్ని మొదట షేర్ చేసిన రితికా.. తర్వాత కాసేపటికి వాటిని డిలీట్ చేసింది.చదవండి: ప్రేమలో ఉన్నా.. అతడు ముస్లిం కాదు: ఫరియా అబ్దుల్లా -
ఎవరు మీరంతా? కూతురి ముఖం దాచేసిన బిపాసా!
హీరోయిన్ బిపాసా బసు- నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ దంపతులు కూతురు దేవిని తీసుకుని బయటకు వెళ్లారు. సెలబ్రిటీలు ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పాపరాజీ(ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు) బిపాసా దంపతులను ఫాలో అయ్యారు. హీరోయిన్ను, ఆమె కూతురు దేవిని ఫోటోలు తీశారు. దీంతో బిపాసా కాస్త అసహనానికి లోనైంది. వెంటనే కూతురు ముఖాన్ని దాచేసింది. అసలు ఎవరు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా కోపంతోనే ఓ బిల్డింగ్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.చిగురించిన లవ్ స్టోరీ2015లో వచ్చిన ఎలోన్ సినిమా షూటింగ్లో కరణ్ సింగ్- బిపాసా కలుసుకున్నారు. వెండితెరపై జంటగా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడింది. ఏడాదిపాటు ప్రేమకబుర్లు చెప్పుకున్న వీరు 2016 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2022లో కూతురు దేవి జన్మించింది. సినిమాసినిమాల విషయానికి వస్తే.. తెలుగులో టక్కరిదంగ సినిమాలో నటించింది. బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన బిపాసా కొంతకాలంగా మూవీస్కు దూరంగా ఉంటోంది. చివరగా డేంజరస్ వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో ఆమె భర్త కరణ్ సింగ్ కూడా నటించాడు. ఇతడు చివరగా ఫైటర్ మూవీలో యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Bollywood Reporter (@bollywoodreporter.in) చదవండి: ఓటీటీలో మోగ్లీ మూవీ.. ఎక్కడంటే? -
తప్పు తెలుసుకున్నా.. క్షమించండి: హీరోయిన్
మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో రిలీజ్ చేసింది. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదని! కుక్కకి సర్జరీనేను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది మంచిగా కోలుకోవాలని సమ్మక్కను మొక్కుకున్నాను. అనుకున్నట్లుగానే కుక్క కోలుకుని బాగా నడుస్తోంది. అందుకే మొక్కు చెల్లించాలని నా కుక్కతో బంగారం (బెల్లం) తూకం వేయించాను. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. తప్పు తెలుసుకున్నామన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగనివ్వను. మన సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించమని కోరుతున్నాను అని చేతులెత్తి వేడుకుంది.మేడారం జాతరతెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఎంతో విశిష్టమైనది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ వేడుకకు లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. చాలామంది వారి బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తారు. ఈ క్రమంలోనే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' హీరోయిన్ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురూ ఆమె చేసిన పనిని విమర్శించారు. దాంతో ఆమె ఇలా వివరణ ఇచ్చుకుంది.చదవండి: తెలుగు, తమిళ హీరోయిన్స్పై రాజాసాబ్ బ్యూటీ సెటైర్లు -
తెలుగు హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ విమర్శలు
మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాన్ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తోంది.డైలాగులు బేఖాతరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. మమ అనిపించేవారుఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్ సింక్ వల్ల డబ్బింగ్లో చెప్పే డైలాగ్స్కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్ మూవీలో నిన్ను ట్రోల్ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు. #MalavikaMohanan Acting in Master was trolled by all with her expression But She Commenting on others pic.twitter.com/tASuISbGrh— SillakiMovies (@sillakimovies) January 21, 2026 చదవండి: మమ్ముట్టి సినిమాలు రిజెక్ట్ చేశా..: హీరోయిన్ భావన -
మమ్ముట్టి సినిమాలు సైతం రిజెక్ట్ చేశా..: భావన
హీరోయిన్ భావన పెళ్లయిన కొత్తలో మలయాళ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్లపాటు (2018-2022) మాలీవుడ్లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సినిమా ఛాన్సులు ఇచ్చినా వాటిని నిర్మహమాటంగా తిరస్కరించింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.ఏదీ ప్లాన్ చేయలేదుభావన మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేయలేదు. ఎందుకో సడన్గా మలయాళ సినిమాలకు దూరంగా ఉండాలనిపించింది. పెళ్లి చేసుకున్నాక నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. కుటుంబంతో సరదాగా గడిపాను. ఆ సమయంలో అలా ఉండటమే నాకు నచ్చింది. మాలీవుడ్కు వెళ్లి అక్కడ బిజీ నటిగా ఉండాలనిపించలేదు.కథ వినకుండానే రిజెక్ట్ చేశా..నా ఇష్టప్రకారమే సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సన్నిహితులు ఈ సినిమా చేయు, బాగుంటుంది.. ముందు కథ విను, నచ్చకపోతే నో చెప్పు అనేవారు. అయినా సరే కథ వినకుండానే చాలా సినిమాలు రిజెక్ట్ చేశాను. కథ నచ్చాక కూడా నో చెప్పడం బాగోదనే అలా చేశాను. ఆషిఖ్ అబు, పృథ్వీరాజ్ సుకుమారన్, జయసూర్య, మమ్ముట్టి సినిమాలను సైతం తిరస్కరించాను. ఎందుకలా చేశావు? దీనివల్ల ఏం సాధిస్తావు? అని నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. సమాధానం లేదుఅప్పుడు నాకు మలయాళ సినిమాలకు విరామం ఇవ్వాలనిపించిందంతే! హ్యాపీగా బెంగళూరులో కుటుంబంతో గడపాలనుకున్నాను. ఈ లైఫ్స్టైల్ను బ్రేక్ చేసి మళ్లీ కేరళ వెళ్లిపోయి హడావుడిగా సినిమాలు చేయాలనుకోలేదు అని చెప్పుకొచ్చింది. భావన.. కన్నడ నిర్మాత నవీన్ను 2017లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లాడింది. పెళ్లయిన ఐదేళ్లపాటు మాలీవుడ్ను పూర్తిగా పక్కనపెట్టేసింది. కేవలం కన్నడ భాషలో మాత్రమే వరుసగా సినిమాలు చేసింది. ఇకపోతే భావన.. ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలతో తెలుగువారికి సైతం దగ్గరయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అనోమి ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. -
ప్రముఖ నటి ఊర్వశి ఇంట విషాదం
చెన్నై: ప్రముఖ నటి ఊర్వశి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు, నటుడు కమల్ రాయ్ (54) చెన్నైలో కన్నుమూశారు. కమల్ రాయ్ మృతి పట్ల దర్శకుడు వినాయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఊర్వశి, కల్పన, కలారంజినిల సోదరుడే కమల్ రాయ్. ఈయన కల్యాణసౌగంధికం సినిమాలో విలన్గా నటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుడిని ప్రార్థించాడు.నటులు చావర వీపీ నాయర్- విజయలక్ష్మిల సంతానమే కమల్ రాయ్. అతడికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే ఊర్వశి, కళారంజిని, కల్పన. ఈ ముగ్గురు కూడా యాక్టర్స్గా సుపరిచితులే. వీరితో పాటు ఓ సోదరుడు కూడా ఉండేవాడు. అతడి పేరు ప్రిన్స్. చిన్నవయసులోనే అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.కమల్ రాయ్ విషయానికి వస్తే.. సాయుజయం, కొల్లైలక్కం, మంజు, కింగిని, కల్యాణ సౌగంధికం, వచలం, శోభనం, ద కింగ్ మేకర్, లీడర్ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. మోహన్లాల్, ఊర్వశి హీరోహీరోయిన్గా నటించిన యువజనోల్సవం మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. తమిళ సినిమాల్లోనూ నటించారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్లోనూ మెరిశారు.చదవండి: భారత్లో బిజినెస్ చేయలేక దుబాయ్కు చెక్కేసిన హీరోయిన్ -
భారత్లో ఈజీ కాదు, అందుకే దుబాయ్ చెక్కేశా..
ఒకప్పుడు హిట్ సినిమాల హీరోయిన్.. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్. భారత్ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్గా లైమ్ లైట్లోకి వచ్చింది. తనే హీరోయిన్ రిమీ సేన్.భారత్లో అలా లేదుహీరోయిన్ రిమీ సేన్ మాట్లాడుతూ.. దుబాయ్ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్లో లేదు. భారత్లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.అనుకూలంగా లేదుదీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.సినిమారిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్లో హంగామా, ధూమ్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్మాల్ 2, ధూమ్ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్బై చెప్పేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) చదవండి: ఇంకా నిద్రపోతున్నారా? హీరోకు అవమానకర ప్రశ్న -
40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోల్స్ లెక్క చేయను
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ 'ధురంధర్' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్కు జంటగా నటించింది 20 ఏళ్ల సారా. దీంతో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్. అదే నమ్ముతా..ఆమె మాట్లాడుతూ.. నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగా లేను. కాబట్టి అక్కడేం జరుగుతుందనేది నాకు పెద్దగా తెలీదు. ఈ ఏజ్ గ్యాప్ గొడవంతా సోషల్ మీడియాలోనే జరుగుతోందనుకుంటా.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుందని భావిస్తాను. ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. కాబట్టి ఏజ్ గ్యాప్ నచ్చకపోవడమనేది వారి సమస్య. అది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు. అలాంటివి నేను లెక్క చేయను. సినిమా కథేంటో నాకు తెలుసు. ఆ కథకు అనుగుణంగానే అందరూ నడుచుకున్నారు. అంతే..కో స్టార్పై ప్రశంసలుఇకపోతే రణ్వీర్ సింగ్ లాంటి నటులను నేను చూడలేదు. ఎంతో అంకితభావంతో పని చేస్తాడు. సెట్లో ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. సినిమా తీయడం అనేది దర్శకనిర్మాతల పని మాత్రమే కాదు.. సమిష్టి కృషి అని నమ్ముతాడు. సెట్ డిజైన్ దగ్గరి నుంచి అన్నింట్లోనూ పాలుపంచుకుంటాడు. అందర్నీ ఏకం చేసి ముందుకు నడిపిస్తాడు అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమా 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్బస్టర్ టాక్తో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: రేణూ దేశాయ్ శాపనార్థాలు -
ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘నిలవే’
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. పీఓవీ(POV) ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్టు చిత్ర బృందం వెల్లడించింది.ఈ చిత్రంలో సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించగా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. -
రామ్చరణ్ కండల సీక్రెట్ అతడే
టాలీవుడ్లో ఇప్పుడు బెస్ట్ ఫిజిక్ను స్క్రీన్పై చూపించడానికి స్టార్స్ పోటీపడుతున్నారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన కసరత్తులతో ఫిజిక్ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్గా బయటకు వచ్చిన ఆయన ఫిట్ లుక్ బాగా వైరల్ అయింది. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్లకు ట్రైనర్ కూడా అంతే. మరి రామ్ చరణ్ లుక్ని ఈ రేంజ్లో క్లిక్ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?ఆయనే ముంబయికి చెందిన రాకేష్ ఉడియార్. ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్గా బాలీవుడ్కి సుపరిచితుడైన రాకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.రాకేష్ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్ లోకల్ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు. అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది, ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.‘‘నాకు ఎప్పుడూ ఫిట్నెస్పై ఆసక్తి ఉండేది దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్లో స్వీపర్గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్ ట్రైనర్గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్నెస్ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ రాకేష్ ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను అర్బాజ్ ఖాన్(సల్మాన్ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్ నాకు ఫోన్ చేసి, బాడీగార్డ్ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుంచీ రాకేష్ సల్మాన్కు పర్సనల్ ట్రైనర్గా కొనసాగుతున్నాడు. ఇక మరో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ఖాన్ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్కు ఫోన్ చేసి తన ట్రైనర్గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.రామ్చరణ్తో పరిచయం అలా...‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్కు రాకేష్ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్ సల్మాన్ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్ ఫిజిక్తో ఫిట్గా కనపడాలని చరణ్ అనుకున్నాడు’’ అని రాకేష్ చెప్పాడు. అప్పటి నుంచి రామ్ చరణ్తో రాకేష్ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్ వివరిస్తున్నాడు.రామ్చరణ్ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్ కపూర్, డైసీ షా పుల్కిత్ సామ్రాట్తో సహా తారలెందరికో రాకేష్ శిక్షణ ఇచ్చాడు. ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్ పొందడానికి ఒక ఫిట్నెస్ ప్రణాళిక ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్ సినిమా కోసం, ఆమిర్ఖాన్ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్ చరణ్ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్ సల్మాన్, రామ్ చరణ్ లు ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్ సెషన్ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్ వెల్లడించాడు. ‘సల్మాన్ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా, జిమ్కు వెళ్లడం మానడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్ చెప్పాడు. -
ఆ సినిమాల్లో నన్ను చూసి నాకే ఛీ అనిపించింది : శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్కి చాలా గ్యాప్ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్పడింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్ర..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పండక్కి ఎక్కువ సినిమాలు ఉండడంతో తొలి రోజు చాలా తక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అయింది. అయితే తొలి రోజే హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్ రావడం ఆనందంగా ఉందంటున్నాడు శర్వానంద్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన పాత చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూసుకుంటే.. తనకే ఆసహ్యం కలుగుతుందని చెప్పారు. ‘జాను(2019) సినిమా సమయంలో నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. నా చేయి కూడా పని చేయదని చెప్పారు. కానీ దేవుడి దయ, సంకల్ప బలంలో త్వరగానే రికవరీ అయ్యాను. అయితే ఆ సమయంలో నేను చాలా లావు అయిపోయాను. ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో చాలా లావుగా కనిపిస్తాను. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలు చూస్తే.. ‘ఛీ ఛీ..ఎలా ఉన్నా? నన్ను చూసి టికెట్స్ ఎందుకు తెగాలి?’ అనిపించింది. అందుకే సినిమాల ఫెయిల్యూర్కి నేను కూడా ఒక కారణం అని భావించా. నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. ముందుగా నా శరీరాన్ని మునుపటి మాదిరిగా మార్చాలనుకున్నా. ముందుగా వాకింగ్ ప్రారంభించాను. ఆ తర్వాత రన్నింగ్, యోగా చేస్తూ డైటింగ్ చేశా.ఇప్పుడు నా లుక్ మారింది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో స్టైలీష్గా ఉన్నానని చెబుతున్నారు. బైకర్లో కూడా అలానే కనిపిస్తా.ఇకపై అన్ని మంచి సినిమాలు అందించడానికే కృషి చేస్తా’ అని శర్వా చెప్పుకొచ్చాడు. -
అల్లరి నరేశ్ ఇంట విషాదం
టాలీవుడ్ హీరో ‘అల్లరి’ నరేశ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి వెంకటరత్నం 2019లో మరణించారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్ ఆయన కుమారులే. వెంకట్రావు మరణంలో అల్లరి నరేశ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. -
అది నిజం కాదు.. కానీ నిజం కావాలి : రష్మిక
‘‘నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’’ అని హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) అంటున్నారు. నటిగా తన కథల ఎంపిక, పారితోషికం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక. ఆమె మాట్లాడుతూ–‘‘హీరోయిన్గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా, అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్స్టోరీ సినిమాలు ఇష్టం. ఇంకొంతమంది వాణిజ్య చిత్రాలను ఇష్టపడతారు. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, ఉమెన్ సెంట్రిక్... ఇలా విభిన్న రకాల జానర్స్లో సినిమాలు చేస్తున్నాను. (చదవండి: నా ఫోటోలు జూమ్ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా')ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసమే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్ సాంగ్స్ చేయడంపైనా నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ గా ఉండాలి. లేదంటే.. ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్స్ సినిమాల్లో మాత్రం లీడ్ రోల్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నారు.. అయితే ఇది నిజం కాదు. కానీ, అది నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ
జెనరేషన్ మారుతోంది. మొన్నటి తరంలా నిన్నటి తరం లేదు, నిన్నటి తరంలా నేటితరం లేదు. ఇప్పుడంతా హైటెక్ స్పీడ్.. అయితే ఇదే కొన్నిసార్లు తనను భయానికి గురి చేస్తోందంటోంది బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాన్న (రామ్ ముఖర్జీ) ఉన్నప్పుడు నా సినిమాలు చూసి పర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పేవాడు. ఆయన వెళ్లిపోయాక ఫీడ్బ్యాక్ పొందడమే కష్టమైపోయింది. నా కూతురు తట్టుకోలేదుకానీ భగవంతుడు నాన్నను కోల్పోయిన లోటును కూతురితో భర్తీ చేశాడు. అయితే నా కూతురు నా సినిమాలు ఎక్కువగా చూడదు. ఎందుకంటే నేను ఏడ్చే సన్నివేశాలను చూసి తను తట్టుకోలేదు.. అదే సంతోషంతో డ్యాన్స్ చేసే సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంటుంది. నేను నటించిన హిచ్కి, తోడా ప్యార్ తోడా మ్యాజిక్, బంటీ ఔర్ బబ్లీ సినిమాలు చాలా ఇష్టపడుతుంది.మేకప్ వేసుకున్నా బాధేకుచ్ కుచ్ హోతాహై మూవీ మాత్రం చూడలేదు. ఎందుకంటే అందులో నేను మొదటి సన్నివేశంలోనే చనిపోతాను. అది తను తట్టుకోలేదు. అలాగే నేను మేకప్ వేసుకుంటే కూడా తనకు నచ్చదు. నువ్వు నా అమ్మలా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. మేకప్ తీసేయగానే ఇప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్తుంది. ఎంతైనా తను జెన్ ఆల్ఫా (2010 - 2024 మధ్య జన్మించినవారు) కిడ్. అదే నా చిన్నతనంలో..ఒక్కోసారి కోపంతో నాపై అరిచేస్తుంటుంది. అప్పుడు తను చెప్పేది నేను ఓపికగా వినాల్సిందే! అదే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చెంపదెబ్బలు కొట్టేది. అదే పని నేను చేశాననుకోండి, నా కూతురు తిరిగి కొట్టినా కొట్టొచ్చు. తను చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తనకు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.సినిమారాణీ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కూతురు అధీర జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగానూ రాణీ ముఖర్జీ.. ఉత్తమ నటిగా గతేడాది జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం మర్దానీ 3 మూవీ చేస్తోంది.చదవండి: కోహ్లితో రిలేషన్? స్పందించిన బిగ్బాస్ కంటెస్టెంట్ సంజనా -
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
సంజనా గల్రానీ.. అప్పుడెప్పుడో బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ నటి కొంతకాలంగా సినిమాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె ఇటీవల తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఏకంగా టాప్ 5లో చోటు దక్కించుకుంది. అయితే గతంలో సంజనాపై ఓ రూమర్ ఉంది. క్రికెటర్ విరాట్ కోహ్లితో లవ్ ట్రాక్ నడిపిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆ పబ్లిసిటీ వద్దుకెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది సంజనా. ఆమె మాట్లాడుతూ.. నేను బెంగళూరు అమ్మాయిని. కన్నడలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్కు అతిథిగా వెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది తప్ప అంతకుమించి ఏమీ లేదు. అదంతా గతం. విరాట్ కోహ్లి గర్ల్ఫ్రెండ్గా గుర్తింపు పొందడం, ఆ పబ్లిసిటీ నాకవరసరమే లేదు. కానీ, ఈ లేనిపోని లవ్ రూమర్స్ మా స్నేహాన్ని చెడగొట్టాయి. ఈ రూమర్స్ రాకపోయుంటే ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్గా కొనసాగేవాళ్లం. ఆ బాధ నాకెప్పుడూ ఉంది అని చెప్పుకొచ్చింది.ఏం జరిగిందంటే?సంజనా గల్రానీ, క్రికెటర్ విరాట్ కోహ్లి 2011 సమయంలో ప్రేమించుకున్నారంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ ఏడాది ఐపీఎల్లో బెంగళూరుకు సపోర్ట్ చేసింది సంజనా.. ఈ క్రమంలోనే తరచూ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లేది. అలా ఓసారి ఆర్సీబీ జెర్సీ ధరించిన ఈ నటి.. విరాట్ కోహ్లితో కలిసి మైదానంలో ముచ్చట్లు పెట్టింది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముంది, వీళ్లిద్దరికీ లింక్ పెడుతూ కథనాలు బయటకు వచ్చాయి. కానీ, కొంతకాలానికి వీరిద్దరూ మరెక్కడా కలిసి కనిపించలేదు.చదవండి: సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక మందన్నా -
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.అదే కారణంఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.ఒక్కసారి కాదు, రెండుసార్లుచాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. చేయిదాటిపోయిందినాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన -
మరోసారి స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్..
కోలీవుడ్లో కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్, అజిత్. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.30 ఏళ్లుగా..రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్, అజిత్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. రీరిలీజ్అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్ నటించిన తెరి, అజిత్ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.1996 సంక్రాంతికి మొదలుఇకపోతే విజయ్, అజిత్ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్ నటించిన కోయంబత్తూర్ మాప్పిళై, అజిత్ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నటించిన పూవే ఉనకాగా, అజిత్ నటించిన కల్లూరి వాసన్ చిత్రాలు మూడు రోజుల గ్యాప్తో విడుదలయ్యాయి. 1997లో విజయ్ నటించిన కాలమేల్లామ్ కార్తిరుప్పేన్ , అజిత్ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.స్టార్ హీరోల సినిమాలు రిలీజ్1999లో విజయ్ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్ ,అజిత్ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్ విజయ్ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్ నటించిన ఫ్రెండ్స్, అజిత్ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్ నటించిన భగవతి, అజిత్ నటించిన విలన్ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పుడు మరోసారి..2003లో విజయ్ నటించిన తిరుమలై , అజిత్ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్ నటించిన ఆది ,అజిత్ నటించిన పరమశివం.., 2007లో విజయ్ నటించిన పోకిరి , అజిత్ నటించిన ఆల్వార్ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్ నటించిన తుణివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ అవుతున్నాయి. -
సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక
గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.గతేడాది ఒక్కటే ఫ్లాప్ తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.నాకు చెప్పిన కథ వేరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.చదవండి: ఆ ఇద్దరే బిగ్బాస్ విజేతలు.. మరో సర్ప్రైజ్ ఏంటంటే? -
దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్ చేశా.. అందరిముందే అరిచాడు!
సెలబ్రిటీల జీవితం అద్దాల మేడలాంటిదంటారు. నిజమే, ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారిది ఆడంబర జీవితమే.. అయితే ఆ స్థాయికి ఎదిగేవరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను చాలామంది నటీమణులు బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలున్నాయి. హీరోయిన్ తమన్నా కూడా ఇందుకు అతీతం కాదు.బాలీవుడ్లో బిజీఒక్క పాటకు డ్యాన్స్ చేయడానికి సుమారు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఈ అందాల రాశి 2 దశాబ్దాలుగా పలు భాషల్లో హీరోయిన్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఐటం సాంగ్స్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమన్నాకు ప్రస్తుతం దక్షిణాదిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.దర్శకుడు ఒత్తిడిఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులోనే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఒక సినిమాలోని ఓ సీన్లో హీరోతో కలిసి చాలా సన్నిహితంగా నటించాలని దర్శకుడు ఒత్తిడి చేశాడంది. అయితే ఆ సీన్లో నటించేందుకు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పి నిరాకరించానంది. హీరోయిన్ను మార్చండిదీంతో సెట్లో అందరూ ఉండగా హీరోయిన్ను మార్చండి అని ఆ దర్శకుడు గట్టిగా అరిచాడంది. అలా ఆ సన్నివేశంలో నటించాల్సిందేనని దర్శకుడు పట్టుబట్టడంతో తాను తగ్గకుండా ఏం జరిగినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది. చివరకు ఆ దర్శకుడు క్షమాపణ చెప్పారంది. అయితే అది ఏ సినిమా? ఆ దర్శకుడు ఎవరు? అన్న విషయాలు మాత్రం బయటపెట్టలేదు. -
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. ఆరనీకుమా ఈ దీపం సాంగ్ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్ప్రైజ్ అయ్యారు. స్క్రీన్పై రవితేజ మాస్ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్ సాంగ్ను తాజాగా రిలీజ్ చేశారు. పబ్లో హీరోయిన్ ఆషికా రంగనాథ్తో మాస్ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..సినిమాసినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ -
నన్ను తిడుతూ.. సినిమా మధ్యలోనే వెళ్లిపోతారు!
భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం యుఫోరియా. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా (జనవరి 17న) యుఫోరియా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బోల్డ్గా తీశా..ఆయన మాట్లాడుతూ.. కంటెంట్ ఓరియంటెడ్ సినిమా తీయడానికి నేనెప్పుడూ వెనుకాడలేదు. యుఫోరియా నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కథ. ఇందులో మూడు ప్రధానాంశాలున్నాయి. అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్.. ఈ మూడే కథకు కీలకమైనవి. కథను ఎంత స్ట్రాంగ్గా అనుకున్నానో అంతే బోల్డ్గా తీశాను. ఆ ప్రమాదం ఉంది!కొన్ని సన్నివేశాల్లో నన్ను తిడుతూ అరుస్తారు కూడా! కొందరైతే సినిమా మధ్యలో నుంచే బాయ్కాట్ చేసి వెళ్లే ప్రమాదముంది. యూత్ ఎంతకు దిగజారిపోతున్నారు? సమాజం ఎలా తయారైంది? అన్నది చెప్పాను. మద్యలో కొందరు కోపంతో వెళ్లిపోదామనిపించినా చివరకు ఈ కథ ఇలాగే చెప్పాలి అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు. చదవండి: కూతురికి అమ్మవారి పేరు పెట్టిన బాలీవుడ్ హీరో -
1980 నేపథ్యంలో ‘రామ్ భజరంగ్’.. గ్లింప్స్ రిలీజ్
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా, సిమ్రత్ కౌర్, సట్న టీటస్, ఛాయాదేవి, మానసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రామ్ భజరంగ్’. సీహెచ్ సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి సుధీర్, డా. రవి బాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాను. ప్రేక్షకులకు మా సినిమా నచ్చేలా ఉంటుంది’’ అని తెలిపారు. సందీప్ మాధవ్ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రొడక్షన్ వేల్యూస్తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సందీప్ మాధవ్ అన్నారు. ‘‘1980 నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అని సీహెచ్ సుధీర్ రాజు చెప్పారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం కష్టపడి పని చేశారు’’ అన్నారు స్వాతి సుధీర్. ‘‘మా సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు రవి బాల. -
హీరో కూతురికి నామకరణం.. సాక్షాత్తూ అమ్మవారి పేరు!
బాలీవుడ్ జంట రాజ్కుమార్ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు. తాజాగా తమ ఇంట్లోకి సంతోషాల మూటను తీసుకొచ్చిన చిన్నారి చేతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాపకు "పార్వతి పాల్ రావు" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట! ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 2021లో పెళ్లిరాజ్ కుమార్ రావు- పాత్రలేఖ ఇద్దరూ సినిమా యాక్టర్సే. 2014లో సిటీలైట్స్ సినిమా షూటింగ్లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ రానురానూ మరింత బలపడింది. పెద్దలు కూడా వారి ప్రేమాయణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2021 నవంబర్ 15న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది న్యూజిలాండ్ ట్రిప్లో ఉన్నప్పుడు పాత్రలేఖకు తాను గర్భవతిని అన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే భారత్ తిరిగొచ్చేసిది. అయితే బిడ్డ పుట్టాక మళ్లీ న్యూజిలాండ్ ట్రిప్కు వెళ్లి ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టేస్తానంటోంది.సినిమారాజ్ కుమార్ రావు.. 2010లో సినీ జర్నీ మొదలుపెట్టాడు. రణ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, స్త్రీ. తలాష్, లవ్ సోనియా, హిట్, శ్రీకాంత్, భేడియా, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. పాత్రలేఖ విషయానికి వస్తే.. ఈమె లవ్ గేమ్స్, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) -
‘ఒక్కడు’లో ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా?
గుణశేఖర్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించిన ‘ఒక్కడు’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఛార్మినార్ సెట్ వేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత పాటలతో పాటు కొన్ని కామెడీ సీన్ల గురించి బాగా మాట్లాడుకున్నారు.ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మాణ్యం సెల్ఫోన్ సీన్ అయితే... ఇప్పుడు చూసినా పడి పడి నవ్వుతాం.అందులో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మాణ్యం.. కొత్తగా సెల్ఫోన్ కొని.. ఆ నెంబర్ని తన ప్రియురాలికి చెప్పి..ఫోన్ చేయమని చెబుతాడు. అదే సమయంలో మహేశ్ బాబు గ్యాంగ్ పాస్ పోర్ట్ కోసం అక్కడికి వెళ్తారు. పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో..బయటకు వచ్చి ఆయనకు ఫోన్ చేసి విసిగిస్తారు. ప్రియురాలి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ధర్మవరపు.. వరుసగా రాంగ్ కాల్స్ రావడంతో చిరాకుతో ఫోన్ని పగలగొడతాడు. ఈ సీన్ సినిమాకు బాగా ప్లస్ అయింది. అయితే ఈ సన్నివేశంలో ధర్మవరపు తనదైన స్టైల్లో చెప్పే 98480 32919 అనే నెంబర్ ఎవరిదో తెలుసా? ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజుదట. మహేశ్ బాబే ఈ నెంబర్ పెట్టమని దర్శకుడికి సూచించాడట. ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖరే ఈ విషయాన్ని చెప్పాడు.‘ధర్మవరపు సుబ్రహ్మాణ్యం సీన్ కోసం ఓ ఫోన్ నెంబర్ పెట్టాలనుకున్నాం. అప్పుడు మహేశ్ బాబు వచ్చి ఎం.ఎస్. రాజుగారి నెంబర్ పెట్టేయండి అన్నారు. అప్పుడప్పుడు మహేశ్ కొంతమందిని ఇలా టీజ్ చేస్తుంటాడు. నేను వద్దని చెప్పినా.. ఆయన వినలేదు. ‘మీరు పెట్టేయండి..నేను చూసుకుంటా’ అన్నారు. అప్పుడు రాజుగారు షూటింగ్లో లేరు. ఆ నెంబర్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించాం. నార్మల్గా కాకుండా పొయెటిక్గా చెప్పమని ధర్మవరానికి నేనే చెప్పా. రిలీజ్ తర్వాత అది బాగా ట్రెండ్ అయింది. కొన్నాళ్ల పాటు రాజుగారికి ఫోన్ కాల్స్ వచ్చాయి. సినిమాలో లడ్డుగాడు మాట్లాడినట్లే..మాట్లాడేవారు. ఫస్ట్డే షో పడినప్పటి నుంచే రాజుగారికి ఫోన్లు రావడం మొదలయ్యాయి’ అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.ఒక్కడు(Okkadu Movie) విషయానికొస్తే.. ఇందులో మహేశ్ బాబుకి జోడీగా భూమిక నటించింది. విలన్ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించాడు. 2003 జనవరి 15న రిలీజ్ అయిన ఈ చిత్రం..అప్పట్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. -
‘తస్కరి–ది స్మగ్లర్స్ ’ వెబ్ సిరీస్ రివ్యూ.. సీక్రెట్స్ ఆఫ్ స్మగ్లింగ్
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్ అనే సిరీస్ ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాంమనకు తెలిసిన 64 కళలలో చోర కళ అనేది చతురత, నైపుణ్యంతో కూడుకున్నది. ఆ చోర కళలో ఓ విభాగమే ఈ స్మగ్లింగ్. ఇప్పటిదాకా అడపా దడపా వార్తలలో వినపడినట్టు లేక అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో చూపించడం ద్వారానే స్మగ్లింగ్ అనేది సామాన్యులకు కాస్త పరిచయం. ఈ స్మగ్లింగ్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ రూపొందింది. నీరజ్ పాండే ఈ సిరీస్కి కథ అందించి, స్వీయదర్శకత్వంలో రూపొందించారు. ఏడు భాగాలతో తెలుగు డబ్బింగ్ వెర్షన్తో పాటు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ స్మగ్లింగ్ జరిగే విధానాన్ని, కస్టమ్స్ ఆ స్మగ్లింగ్ని అరికట్టే పద్ధతులను సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా దాదాపు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో ఈ సిరీస్కు ప్రాణం పోశారు. ఈ సిరీస్ కథ మొత్తం ముంబై శివాజీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నేపథ్యంలో నడుస్తుంది. ఈ ఎయిర్పోర్టులో కథానాయకుడు అర్జున్ మీనా కస్టమ్స్ ఆఫీసరుగా పని చేస్తుంటాడు. తాను పని చేస్తున్న ఎయిర్పోర్టులో ఇతర దేశాల నుండి కొన్ని కోట్ల రూపాయల విలువ గల స్మగ్లింగ్ జరుగుతోందని, అది కూడా అరబ్ దేశాలలో ఉన్న బడా చౌదరి వల్ల జరుగుతోందని తెలుసుకుంటాడు అర్జున్. ఇదే సమయంలో కొత్తగా తమకు వచ్చిన బాస్ ప్రకాశ్తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. కానీ బడా చౌదరి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కస్టమ్స్ వాళ్ళని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. మరి... బడా చౌదరి స్మగ్లింగ్ బండారాన్ని అర్జున్ బయటపెడతాడా? లేదా అన్నది మాత్రం ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ కాస్త పేలవంగా అనిపించినా సిరీస్ మొత్తం చూసినవారికి స్మగ్లింగ్ సీక్రెట్స్ బాగానే తెలుస్తాయి. ఈ వీకెండ్కి ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ మంచి కాలక్షేపం. – హరికృష్ణ ఇంటూరు -
సీనియర్ హీరోలకు బ్లాక్బస్టర్.. అనిల్ 10వ సినిమా ఎవరితో?
కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్ హిట్లు కొట్టేసి శెభాష్ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..ఫస్ట్ సినిమా నుంచే..అనిల్ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్ 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్ హిట్లే అందుకున్నాడు. బ్లాక్బస్టర్ సినిమాలుగతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్ పండగను క్యాష్ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది. సీనియర్ హీరోలతో సినిమాలుఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. చిరంజీవి బంపరాఫర్మరోవైపు మెగాస్టార్.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్ ఇచ్చాడు. అనిల్ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే అనిల్ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.రామ్చరణ్తో సినిమా!మన శంకరవరప్రసాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'రామ్చరణ్తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్బస్టర్ చేయండి.. వెంటనే రామ్చరణ్ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్.. చరణ్తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!పదో సినిమాపై బజ్అసలే అనిల్ రావిపూడి కెరీర్లో 10వ సినిమా.. హిట్ స్ట్రీక్ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్బస్టర్ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్తోనా? చిరు-వెంకీతోనా? నాగ్తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి! -
2016.. నా జీవితమే నరకప్రాయం: కంగనా రనౌత్
2026కి వెల్కమ్ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.2016ని ఎందుకు మిస్ అవుతున్నారో?వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందరూ సడన్గా 2016ని ఎందుకు మిస్ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్ నోటీసులు పంపాడు.సంచలనంఅది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్సైడర్స్, ఔట్సైడర్స్ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.ఏమిటా వివాదం?గతంలో కంగనా రనౌత్- హృతిక్ రోషన్ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్ రోషన్ను ఎక్స్గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్ చేసింది. దీంతో హృతిక్.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో యాక్ట్ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్ ఏమందంటే?
ఒకప్పుడు గ్లామర్తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్బై చెప్పేసింది. 2020 అక్టోబర్లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్పై సనాఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతం వల్లేనేమో! -
వెటకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ సునీల్: రవితేజ
సునీల్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య కామెడీ వదిలే వేరే జోనర్లో వెళ్లాడు. మళ్లీ భర్త మహాశయులు సినిమాతో కామెడీ వైపు వచ్చాడు. సినిమా చూసినవాళ్లు అంతా సునీల్ కామెడీ గురించి మాట్లాడుతున్నారు. దుబాయ్ శ్రీను తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. అప్పుడప్పుడైనా సునీల్ కామెడీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ నెల 13న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ లభించింది. శనివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో సినిమా సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీల్తో తనకున్న అనుబంధాన్ని రవితేజ పంచుకున్నాడు. ‘సునీల్, నేను మంచి స్నేహితులం. ఓ రకంగా చెప్పాలంటే.. వెతకారంతో కూడిన బెస్ట్ ఫ్రెండ్ నాకు. మా అమ్మ, వాళ్ల అమ్మ మంచి స్నేహితులు. వాళ్ల నుంచే మాకు వెతకారం వచ్చింది(నవ్వుతూ..) ’ అన్నారు. ఇక సునీల్ కూడా రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్ లేకున్నా సరే నేను కలిసే ఏకైక హీరో రవితేజ. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎనర్జీ నెక్ట్ లెవల్’ అన్నారు. -
8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతంవల్లేనేమో!
సంగీత ప్రపంచంలోనే అగ్రజుడు ఏఆర్ రెహమాన్. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించాడు. పుట్టుకతోనే హిందూ అయిన ఇతడు తర్వాత ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్ల బాలీవుడ్లో సరైన అవకాశాలు రాలేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఔట్ సైడర్తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. రోజా, బాంబే, దిల్సే వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్లో ఔట్సైడర్ (ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి)లానే ఫీల్ అయ్యేవాడిని. కానీ తాల్ సినిమా పాటలు అందరి ఇంట్లోకి చేరాయి. ఇప్పటికీ ఎంతోమంది ఉత్తరాదివాళ్లు ఆ మూవీ పాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది.8 ఏళ్లుగా తగ్గిన అవకాశాలుఅప్పుడు నాకు పంజాబీ సంగీతంపై మరింత ఆసక్తి కలిగింది. అలా సుక్వీందర్ సింగ్ను కలిశాను. తనతో కలిసి చేసిన 'చయ్య చయ్య', 'జై హో..' పాటలు ఎంత ఆదరణ పొందాయో మీ అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిదేళ్లుగా నాకు బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. బహుశా దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్ ఒక కారణమైతే.. నా మతం కూడా మరో కారణం కావొచ్చు. ఏదేమైనా నాకు నా కుటుంబానితో గడిపేందుకు సమయం దొరికిందనుకుంటాను. అవే నా దగ్గరకు..అయినా పనికోసం నేను పాకులాడటం లేదు. పనే నా దగ్గరకు రావాలని అనుకుంటాను. నా వృత్తిపట్ల నాకున్న నిబద్ధతే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదని పలువురు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రామాయణం మూవీలో ఛాన్స్ నీ మతం చూసే ఇచ్చారా? అని మండిపడుతున్నారు. చదవండి: ధనుష్తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? -
ధనుష్తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? అసలు నిజమిదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.ఇంత సడన్గా పెళ్లేంటి?అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్ -
గుణ శేఖర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్ రిలీజ్
గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. డ్రగ్స్ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.సివిల్ సర్వెంట్ అవ్వాలనుకునే ఓ అమ్మాయిపై అత్యాచారం జరగడం.. మాదకద్రవ్యాల మత్తులో ఓ యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్లడినట్లు ట్రైలర్లో చూపించారు. ఇక భూమిక.. ఆ యువకుడిగా తల్లిగా నటించినట్లు తెలుస్తోంది. ఆమె తనపైనే కేసు వేసుకొని హైకోర్టుని ఆశ్రయించినట్లు ట్రైలర్లో చూపించారు. ఆమె చేసిన నేరం ఏంటి? ఫోక్సో చట్టాన్ని ఉపయోగించి ఈ అత్యాచార కేసుని పోలీసు కమిషనర్ జయదేవ్ నాయిర్(గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలా సాల్వ్ చేశాడనేది తెలియాలంటే ఫిబ్రవరి 6న సినిమా చూడాల్సిందే. -
నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు..: శర్వానంద్
గతేడాది సంక్రాంతికి మనమేతో హిట్టు కొట్టాడు హీరో శర్వానంద్. ఈసారి నారీ నారీ నడుమ మురారి మూవీతో మరోసారి సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. ఈ యేడు సంక్రాంతి బరిలో నాలుగైదు సినిమాలున్నప్పటికీ వాటి పోటీని తట్టుకుంటూ మళ్లీ హిట్టందుకున్నాడు.ఎమోషనల్ స్పీచ్ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి విన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ.. నిర్మాత అనిల్ సుంకర గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడగండి.. చాలా మంచి వ్యక్తి అని చెప్తారు. ఒక అన్నగా అండగా నిల్చున్నారు. ఈ సినిమాను ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు.అలా ఎప్పుడూ అనుకోకుఆయన గురించి ఓ విషయం చెప్పాలి. మహాసముద్రం సినిమా పోయాక నేను ఫోన్ చేసి సారీ చెప్పాను. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నేను కూడా కొంచెం ఫిట్గా ఉండుంటే బాగుండేదన్నాను. అందుకాయన ఛీఛీ శర్వా.. అలా ఎప్పుడూ అనుకోకు. ఇది అందరమూ కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి అందరమూ బ్లేమ్ తీసుకోవాలి అన్నాడు. అందరం కలిసి తప్పు చేశాం.. అందరం భరిద్దాం అన్నాడు. ఇంతవరకు చూడలేదుఅలా ఒక నిర్మాత చెప్పడం నేనింతవరకు చూడలేదు. నీవల్ల నాకు డబ్బులు పోయాయని ఇంతవరకు అనలేదు. థాంక్యూ అనిల్గారు. మీ బ్యానర్ కోసం నేనెప్పుడూ రెడీగా ఉంటాను అని ఎమోషనలయ్యాడు. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన మహాసముద్రం 2021లో విడుదలై డిజాస్టర్గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించాడు.చదవండి: కోలీవుడ్ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ -
దుస్తులు విప్పమన్న జనసేన నేత.. మండిపడ్డ చిన్మయి
సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికి తెలిసిందే. మహిళలపై జరిగే దాడులు, అవమానాలపై స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో తనను తీవ్రంగా ట్రోల్ చేసినా సరే.. తనకు తప్పుగా అనిపించిన అంశాలపై నిర్భయంగా మట్లాడుతుంటారు. తాజాగా ఆమె తన ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. మహిళలపై జనసేన నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.దుస్తులు విప్పమన్న జనసేన నేత..పవిత్రమైన సంక్రాంతి పండుగ వేళ కోనసీమ సంస్కృతిని మంటగలిపేలా రాజోలు నియోజకవర్గంలో యథేచ్చగా రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీ నేతలే వీటిని ప్రోత్సహించడం గమనార్హం. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరుడు ఒకరు మలికిపురం మండలం గోగన్నమట్టం గ్రామంలో రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించాడు. వేదికపై కూర్చొని ఉన్న రికార్డింగ్ డాన్సర్లతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలంటూ డ్యాన్సర్లకు కండీషన్ పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. సదరు జనసేన నేతపై నెటిజన్లు మండిపడుతున్నారు. అశ్లీల గందరగోళమే..ఈ వీడియోని సింగర్ చిన్మయి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ప్రేక్షకులు చీరింగ్ చేస్తుండగానే స్టేజ్పై ఉన్న అమ్మాయిలను ఇలా అవమానిస్తారని ఊహించలేదు. ఓ వ్యక్తి అమ్మాయిల దుస్తులను విప్పమంటున్నాడు. అది విని అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతున్నారు. ఇది బయటకు రావడం మంచిదా కాదా కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న భాష, ప్రవర్తన అత్యంత నీచమైనవి. ఇది పూర్తిగా అశ్లీల గందరగోళమే’ అని రాసుకొచ్చారు. చిన్మయి ట్వీట్పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెడితే..మరికొంతమంది ఆమెను విమర్శిస్తూ.. కామెంట్ చేస్తున్నారు.I didnt think something like this would happen to girls in front of a CHEERING audience.Man tells these girls to strip. And the audience cheers. I dont know if I should be sad or happy that this sh*t is getting exposed.No wonder the abuse and the language here is so vile.… pic.twitter.com/V9Ren2eNVr— Chinmayi Sripaada (@Chinmayi) January 16, 2026 -
ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి పొంగల్ పండగ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈయన నటిస్తున్న 54వ చిత్రం ఇది. దీనికి కర అనే టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, ఓ వీడియోను విడుదల చేశారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజురముడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేశ్.. థింక్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా కర చిత్రంలో ధనుష్ పేరు కరసామి అని వీడియోలో పేర్కొన్నారు. ధనుష్ను మాస్ గెటప్లో చూపించారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. -
యాక్షన్ మూవీ 'కటాలన్' టీజర్ రిలీజ్
మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కటాలన్. దుషారా విజయన్ కథానాయిక. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్లో.. మలయాళ మూవీ చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో ఆంటోనీ వర్గీస్ను పరిచయం చేశారు. శుక్రవారం (జనవరి 16న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించగా షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను థాయ్లాండ్లో, ఓంగ్-బాక్ సిరీస్తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "పాంగ్" అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. అజనీష్ సంగీతం అందించిన ఈ మూవీలో సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాసు, పార్థ్ తివారి తదితరులు కీలక పాత్రల్లో నటింనున్నారు. కటాలన్ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మే 14న విడుదల కానుంది. -
షార్ట్ ఫిలిం పోటీ.. రూ.10 కోట్ల సినిమా తీసే ఛాన్స్
హీరో మంచు విష్ణు సంక్రాంతి సందర్భంగా ఓ గుడ్న్యూస్ చెప్పాడు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీ పెడుతున్నట్లు తెలిపాడు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ - సీజన్ 1ను ప్రకటించాడు. మేరకు అవా ఎంటర్టైన్మెంట్స్ కీలక ప్రకటన చేసింది. ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్టంగా 10 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను సమర్పించవచ్చని తెలిపింది. కథ చెప్పడం, దర్శకత్వ దృష్టి ఆధారంగా విజేతలను నిర్ణయిస్తామంది. ఈ పోటీలో గెలుపొందిన దర్శకుడుకి పది కోట్ల బడ్జెట్తో సినిమా తీసే అవకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు కల్పించనున్నాడు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకు రావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. -
తమన్నా ఐటం సాంగ్కు 100 కోట్ల వ్యూస్..
ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్తో వైరల్ అవుతోంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్గా స్టెప్పులేసిన పాట ఒకటి వన్ బిలియన్ వ్యూస్ వ్యూస్ దాటింది. అదే 'స్త్రీ 2' మూవీలోని 'ఆజ్ కీ రాత్'. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఫస్ట్ వ్యూ నుంచి 1 బిలియన్ (100 కోట్ల) వరకు.. మీ ప్రేమకు థాంక్స్' అని రాసుకొచ్చింది.సినిమాతమన్నా 2005లో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్తో గుర్తింపు తెచ్చుకుంది. 100% లవ్, బద్రీనాథ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఆగడు, బాహుబలి, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. చివరగా ఓదెల 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు చేస్తోంది.ఐటం సాంగ్తో మరింత క్రేజ్అల్లుడు శీను మూవీలో 'రావే నా లబ్బర్ బొమ్మ' అనే ఐటం సాంగ్లో తొలిసారి స్టెప్పులేసింది. జై లవకుశలో 'స్వింగ్ జర', సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్ డాంగ్', జైలర్లో 'నువ్వు కావాలయ్యా..', స్త్రీ 2లో 'ఆజ్ కీ రాత్', రైడ్ 2లో 'నషా' వంటి ఐటం సాంగ్స్తో తమన్నా ఫుల్ పాపులర్ అయిపోయింది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: మన శంకరవరప్రసాద్గారు నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? -
థియేటర్లలో హౌస్ఫుల్.. రికార్డులు సృష్టిస్తోన్న చిరంజీవి మూవీ
'మన శంకరవరప్రసాద్గారు' డబుల్ సెంచరీ కొట్టారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో యాక్ట్ చేశాడు. సంక్రాంతి స్పెషల్గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్బస్టర్ టాక్ సంపాదించుకుంది.డబుల్ సెంచరీరెండురోజుల్లోనే సెంచరీ (రూ.100 కోట్లు) కొట్టిన ఈ మూవీ ఇప్పుడు నాలుగురోజుల్లోనే డబుల్ సెంచరీ (రూ.200 కోట్లు) మార్క్ను చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'థియేటర్లలో విజిళ్లు.. బయటేమో హౌస్ఫుల్ బోర్డులు.. రెండువందల కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు' అంటూ చిరు- అనిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి సినిమా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. Whistles inside - Housefuls outside…BOX-OFFICE OVERFLOWING EVERY SIDE 💥💥#ManaShankaraVaraPrasadGaru కి "రెండువంద"ల కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు. 🙏🏻🙏🏻🙏🏻#MegaSankranthiBlockbusterMSG grosses 200 CRORE+ worldwide and racing ahead with BLOCKBUSTER… pic.twitter.com/CO2GTdqUfS— Shine Screens (@Shine_Screens) January 16, 2026 చదవండి: నా సినిమా చూసి విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు: చిరంజీవి -
'టాక్సిక్' కోసం 'ధురంధర్ 2' వాయిదా? డైరెక్టర్ క్లారిటీ...
ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్తోనే బ్లాక్బస్టర్ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్గా ధురంధర్ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.అదేరోజు టాక్సిక్ రిలీజ్ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్ టాక్సిక్ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్ ఫుల్స్టాప్ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ క్లారిటీధురంధర్ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) డైరెక్టర్, ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.చదవండి: మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లో ఓటీటీలోకి.. -
ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: నాగవంశీ
‘త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను’ అన్నారు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’.నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాం. నాకు రాజ్కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది. ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నిర్మాత నాగవంశీ హృదయపూర్వక ధన్యవాదాలు’అన్నారు.నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించింది’ అన్నారు. -
'MSG' చూసి ఓ జంటలో మార్పు.. విడాకులు క్యాన్సిల్
అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే హిట్టు గ్యారెంటీ.. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాడంటే బ్లాక్బస్టర్ పక్కా! పైగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మన శంకరవరప్రసాద్గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పెషల్ ఇంటర్వ్యూ నయనతార హీరోయిన్గా యాక్ట్ చేయగా వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను సంక్రాంతి హిట్ బొమ్మగా ప్రేక్షకులు ఆల్రెడీ డిసైడ్ చేశారు. అందుకే సంక్రాంతి కానుకగా చిరు, వెంకీ, అనిల్ రావిపూడిల స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓ జంట విడాకులు తీసుకోవాలని మూడు నెలలుగా అనుకుంటోంది. విడాకులు క్యాన్సిల్ఇద్దరూ వేర్వేరుగా మన శంకరవరప్రసాద్గారు మూవీ చూశారు. సినిమా చూడగానే ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుని విడాకులు రద్దు చేసుకుని కలిసిపోయారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉంటాయి. అవే వారిలో మార్పు తెచ్చాయి. ఇలాంటి సీన్స్ రాసిన అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్' అని మెచ్చుకున్నాడు.సినిమా కథ విషయానికి వస్తే..శంకర వరప్రసాద్(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. అతడి భార్య పేరు శశిరేఖ (నయనతార). ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోతారు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని శశిరేఖ తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆరేళ్ల తర్వాత పిల్లలు చదివే స్కూల్లో పీఈటీ టీచర్గా చేరతాడు శంకర్. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు ఆయన ఎలా దగ్గరయ్యాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవేంటి? మళ్లీ కలిశారా? లేదా? అన్నదే కథ!చదవండి: భర్తతో సమంత తొలి సంక్రాంతి -
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్’ ఏ స్థానంలో ఉందంటే..
సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్ను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్లో టాప్ పొజిషన్లో షారుఖ్ఖాన్ కింగ్ సినిమా ఉండగా.. ప్రభాస్-సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఐఎండీబీ ప్రకటించిన టాప్ 20 సినిమాలివే...1) కింగ్ (హిందీ) :‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.2) రామాయణ (హిందీ)రణ్బీర్ ప్రధాన పాత్రలో నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్బీర్ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్ హీరో యశ్.. రావణుడిగా కనిపించబోతున్నాడు.3) జననాయగన్(తమిళ్)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.4) స్పిరిట్(తెలుగు)ప్రభాస్ హీరోగా సందీప్రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.5) టాక్సిక్(కన్నడ)యశ్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.6) బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్సల్మాన్ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఇందులో సల్మాన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.7) ఆల్ఫా(హిందీ)అలియా భట్. శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్రాజ్ ఫిల్మ్స్లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.8) దురంధర్ 2 (హిందీ)బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.9) బోర్డర్ 2 (హిందీ)1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్లో సన్నీ డియోల్తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.10) ఫౌజీహను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్) : ప్రదీప్ రంగనాథన్(హీరో)12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని13) పెద్ది(తెలుగు): రామ్ చరణ్14) డ్రాగన్(తెలుగు): ఎన్టీఆర్15) లవ్ అండ్ వార్(హిందీ): రన్బీర్ కపూర్16) బూత్ బంగ్లా(హిందీ): అక్షయ్ కుమార్17) బెంజ్(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ19) ‘పేట్రియాట్ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్లాల్20) ఓ రోమియో (హిందీ): షాహిద్ కపూర్ -
ఒక్కడు: చార్మినార్ సెట్ ఖర్చు, ఫస్ట్ అనుకున్న టైటిల్ తెలుసా?
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ కళకళలాడుతోంది. చిరంజీవి 'మనశంకర వరప్రసాద్గారు', ప్రభాస్ 'ది రాజాసాబ్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', రవితేజ 'భర్తమహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారి' సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో అన్ని సినిమాల కన్నా 'మన శంకర వరప్రసాద్గారు' మూవీ కలెక్షన్స్ వద్ద ఎక్కువ దూకుడు చూపిస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మహేశ్బాబు సినిమా కూడా సంక్రాంతి రారాజుగా నిలిచింది. ఆ మూవీ ఏంటో తెలుసా? ఒక్కడు. 2003 జనవరి 15న విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఆ సినిమా విశేషాలను ఓసారి చూసేద్దాం...పేపర్లో చూసి కథచిరంజీవితో గుణశేఖర్ తీసిన 'మృగరాజు' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ మూవీ తర్వాత గుణశేఖర్ కసితో తీసిన సినిమా 'ఒక్కడు'. ఒకరోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ చూశాడు. పుల్లెల గోపీచంద్ తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేదు, అయినా ఎన్నో కష్టాలు పడి ఛాంపియన్గా ఎదుగుతాడు. మొదట అనుకున్న టైటిల్దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథ రాసుకున్నాడు. అది మహేశ్బాబుకు చెప్పగా వెంటనే ఒప్పుకున్నాడు. నిర్మాతగా రామోజీరావును అనుకున్నాడు. కానీ, ఆయన ఆసక్తి చూపకపోయేసరికి ఎమ్మెస్ రాజు చెంతకు చేరింది. టైటిల్ విషయంలోనే అంతా మల్లగుల్లాలు పడ్డారు. 'అతడే ఆమె సైన్యం' అన్న టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ అది ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేయడంతో మరొకటి వెతుక్కున్నారు. చార్మినార్ సెట్ కోసం'కబడ్డీ' అనుకున్నారు, మళ్లీ ఎందుకో వెనక్కు తగ్గారు. చివరకు 'ఒక్కడు' టైటిల్ ఫిక్స్ చేశారు. అందరికీ నచ్చేసింది. మహేశ్బాబు హీరోగా, భూమిక హీరోయిన్గా నటించగా ప్రకాశ్రాజ్ విలన్గా యాక్ట్ చేశారు. అప్పట్లోనే భారీ బడ్జెట్తో చార్మినార్ సెట్ వేసి మూవీ తీశారు. ఈ సెట్ కోసం దాదాపు రూ.2 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పాతబస్తీని, ముఖ్యంగా కర్నూల్ కొండారెడ్డి బురుజును సినిమాలో హైలెట్ చేసి చూపించారు. మాస్ & స్టార్ ఇమేజ్అలా ఒక్కడు రూ.9 కోట్లతో తీస్తే దాదాపు రూ.40 కోట్లు రాబట్టింది. మహేశ్బాబు కెరీర్లో తొలిసారి మాస్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. అతడికి స్టార్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచిపోయాయి. ఈ మూవీ 8 నంది అవార్డులు గెలుచుకుంది. అంతేకాకుండా ఒక్కడు దాదాపు ఎనిమిది భాషల్లో రీమేక్ అయింది. ఇప్పటివరకు ఒక్కడు మూవీ ఐదుసార్లు రీరిలీజ్ అవడం విశేషం! చదవండి: బక్కచిక్కిపోయిన బుల్లిరాజు.. ఆ కారణం వల్లే -
బక్కచిక్కిన బుల్లిరాజు.. ఆ రెండు కారణాల వల్లే..
ఒక్క సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు బుల్లిరాజు. వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో బుల్లిరాజు నోరు తెరిస్తే బూతులు.. అయినా సరే కొలికేత్త.. కొలికేత్త అంటూ బుల్లిరాజు చేసిన కామెడీకి జనాలు పడీపడీ నవ్వారు. ఇతడి కామెడీ టైమింగ్కు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.డబుల్ ధమాకాఅలా 'మన శంకరవరప్రసాద్గారు' మూవీలోనూ మెప్పించాడు. గతేడాది బుల్లిరాజు నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలాగైతే బ్లాక్బస్టర్ కొట్టిందో ఈ 'మన శంకరవరప్రసాద్గారు' కూడా అంతే మెగా బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దీంతో బుల్లిరాజు అలియాస్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ దశ తిరిగిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు, నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీలోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఈ మూవీ కూడా విజయపథంలో నడుస్తుండటంతో ఈసారి సంక్రాంతికి డబుల్ ధమాకా అందుకున్నాడు.అందుకే సన్నబడ్డాడా?అయితే సినిమా ఈవెంట్స్లో మాత్రం కాస్త బక్కచిక్కి కనిపించాడు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. అతడికి వైరల్ ఫీవర్ వచ్చింది. రెండు.. తెరపై కాస్త సన్నగా కనిపించాలని బుల్లిరాజే భావించాడట! ఓ ఈవెంట్లో రేవంత్ మాట్లాడుతూ.. నేను దాదాపుగా 10 సినిమాలు చేస్తున్నాను. అన్ని సినిమాల్లో ఒకలాగే కనిపిస్తే ఏం బాగుంటుంది? ఒక మూవీలో కాస్త డిఫరెంట్గా కనిపిద్దాం అని డైట్ చేశా.. అందుకే సన్నబడ్డా..రెండో సినిమాయే మెగాస్టార్తో..ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుంటారు. నేను తీసిన మొదటి సినిమాకే ఆయనతో నటించే ఆఫర్ వచ్చింది. అది నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన విషయం.. సంక్రాంతికి వస్తున్నాంలో బూతులు తిట్టా.. కానీ, మన శంకర వరప్రసాద్లో బూతులు తిట్టలేదు. అదే తేడా.. అన్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బిజీ స్టార్ అయిపోయాడు బుల్లిరాజు. సంక్రాంతి బ్లాక్బస్టర్లు ఖాతాలో వేసుకుంటూ సంక్రాంతి బుల్లోడుగా మారిపోయాడు.చదవండి: తొలి సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్ల తర్వాత.. -
టాప్ హీరో ఛీ కొట్టిన స్టోరీ కీ జై కొట్టిన బన్నీ... ఏమిటా ధైర్యం?
ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరో ప్లాప్ డైరెక్టర్కు ఛాన్స్ ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు బన్నీ, లోకేష్ కనగరాజ్ ల కాంబో సంచలనం గా మారింది.టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమాల ఫ్యాన్స్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఈ కాంబో. భారీ విజయాలను అందించిన పుష్ప 2: ది రూల్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు సాధారణ టాలీవుడ్ స్టార్ను దాటిపోయాడు పాన్-ఇండియా సూపర్ స్టార్ రేస్ లో సగర్వంగా నిలబడ్డాడు. మరోవైపు కూలీ వంటి భారీ చిత్రం ద్వారా బోలెడంత అప్రతిష్ట మూట గట్టుకున్నాడు లోకేష్. పెద్ద హీరోల్ని డీల్ చేయలేకపోయాడనే తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు రజనీ-కమల్ కాంబో సినిమా తో పాటు మరికొన్ని భారీ చిత్రాల ఆఫర్లు పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అనేది సినీ పండితుల అంచనాలకు అందడం లేదు. వినవస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో లో రూపొందనున్నచిత్రం ఓ సూపర్ హీరో సినిమా కావచ్చు. దీనిపై అనేక అంచనాలు అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా రానప్పటికీ జోరుగా ఊహగానాలు సాగుతున్నాయ్. ఇది భారతీయ సినిమాలో సూపర్ హీరో కథలను మరో గమ్యం వైపు నడిపే అవకాశం ఉందని అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఒక కల్చరల్ చరిత్రనూ సృష్టించడం ఖాయమని లోకేష్ టాలెంట్ పట్ల నమ్మకం వున్నవారు అంటున్నారు.అయితే ప్రస్తుతం బన్నీ ఓకే చేసిన స్టోరీ సూర్య హీరో గా లోకేష్ సారద్యం లో తెరకెక్కనున్న సూపర్ హీరో చిత్రం ఇరుంబుకై మాయవి తరహా అనీ, ఈ సినిమా ఆలోచన మొదట బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో చర్చిస్తే ఆయన తిరస్కరించాడని దీనిని బన్నీ ఓకే చేయడం విచిత్రం గా ఉందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.పుష్ప సిరీస్ తో అనూహ్యమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అయన భవిష్యత్ కు చాలా కీలకం గా మారనుంది అనేది నిస్సoదేహం. తన తదుపరి చిత్రానికి టాప్ డైరెక్టర్ అట్లీ ని ఎంచుకుని పర్ఫెక్ట్ ఛాయిస్ గా ప్రశంసలు అందుకున్న ఐకాన్ స్టార్ ఆ తర్వాత లోకేష్ ను ఎంచుకోవడం ఖరారైతే అది పెద్ద సాహసం గానే చెప్పాలి. -
తట్టుకోలేకపోయా, గదిలో కూర్చుని ఏడ్చా..: షారూఖ్ కూతురు
కింగ్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా 'ద ఆర్చీస్' మూవీతో సినీప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడేకంగా తండ్రితో కలిసి నటించబోతోంది. షారూఖ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ చిత్రంలో సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఆసక్తే ఉండేది కాదని, రానురానూ తన ఆలోచన మారిందని చెప్తోంది.ఒంటరిగా ఏడ్చా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో నాటకాల్లో పాల్గొనాలంటే అస్సలు ఇంట్రస్ట్ ఉండేది కాదు. కానీ, తర్వాత సడన్గా నాకు దానిపై ఆసక్తి పెరిగింది. ఓసారి స్కూల్లో వేయబోయే ఒక నాటకం కోసం ఆడిషన్ ఇచ్చాను, కానీ నేను కోరుకున్న పాత్రలో నన్ను సెలక్ట్ చేయలేదు. ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. చాలా బాధపడ్డాను. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. కింగ్ సినిమాలో..అప్పుడు నాకు యాక్టింగ్పై ఎంత ఇష్టం ఉందనేది తెలిసింది. స్టేజీపై పర్ఫామ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ఆ ప్యాషన్ ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కింగ్ సినిమా విషయానికి వస్తే.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా షారూఖ్ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. 'కింగ్' షారూఖ్తో దీపికా నటిస్తున్న ఆరో సినిమా కావడం విశేషం! గతంలో వీరిద్దరూ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాల్లో కలిసి నటించారు.చదవండి: 37 ఏళ్ల తర్వాత మొదటి హీరోను కలిసిన స్టార్ హీరోయిన్ -
ఒక్క క్లిక్తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫస్ట్ సినిమా హీరోతో అలనాటి హీరోయిన్.. 37 ఏళ్లకు!
ముఖానికి ఇంత మేకప్ వేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పటి అందాల తార కనక. తమిళ సినీ ప్రపంచంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన దేవిక కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సడన్గా వెండితెరపై కనిపించకుండా పోయింది. వివాదాలతో వార్తల్లో..దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ మధ్యలో కనకకు క్యాన్సర్ అని, చనిపోయిందని రూమర్స్ రాగా అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. తండ్రితో వివాదం కారణంగానూ వార్తల్లో నిలిచింది. కనక మానసిక పరిస్థితి సరిగా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కనక చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు దేవిక, దర్శకుడు దేవదాస్ విడిపోయారు. ఫస్ట్ సినిమా హీరోతల్లీకూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోయాక కనక మరింత ఒంటరితనం అనుభవించింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడిపిన కనక తాజాగా తన మొదటి హీరోను కలిసింది. కరకట్టక్కరన్ అనే తమిళ చిత్రం ద్వారా కనక హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. రామరాజన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడాదిపాటు విజయవంతంగా ఆడింది. 37 ఏళ్ల తర్వాత కలయికతాజాగా హీరో రామరాజన్ను కలిసింది కనక. వీరివెంట మ్యూజిక్ డైరెక్టర్ దరన్ కుమార్ కూడా ఉన్నాడు. 37 ఏళ్ల తర్వాత కలయిక అంటూ ఈ రీయూనియన్ ఫోటోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వాటే సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కనకకి మేకప్ కొంచెం ఎక్కువైందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కనక.. తెలుగులో బ్రహ్మర్షి విశ్వామిత్ర, వాలు జడ తోలు బెల్టు సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Dharan Kumar (@dharankumar_c)చదవండి: జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే.. -
బాక్సాఫీస్ను రఫ్పాడిస్తున్న ‘వరప్రసాద్ గారు’.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని‘మన శంకరవరప్రసాద్ గారు’తో మరోసారి నిరూపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ డేనే వరల్డ్వైడ్ గ్రాస్గా రూ.84 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే సెంచరీ (100 కోట్లు) కొట్టేసింది. మూడో రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా భారీగా సాగింది. పండగ సీజన్ కావడంతో సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు తరలివెళ్లారు. దీంతో మూడు రోజుల్లో వరల్డ్వైడ్ గ్రాస్ రూ.152 కోట్లకు చేరుకుందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.(మనశంకర వరప్రసాద్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇటీవల కాలంలో చిరంజీవి సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ తన పాత ఫామ్ను తిరిగి తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా 9వ హిట్. అతని సంక్రాంతి సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయింది. గతంలో సంక్రాంతి సమయంలో విడుదలైన అతని చిత్రాలు అన్నీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ సారి కూడా అదే మ్యాజిక్ పనిచేసింది.ఈ చిత్రంలో చిరుకి జోడీగా నయనతార నటించగా..క్యాథరిన్ కీలక పాత్రలో పోషించింది. ఇక విక్టరీ వెంకటేశ్ క్యామియో.. ఈ సినిమాకు మరింత ప్లస్ యింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరో అదిరిపోయే సంక్రాంతి 🥳🥳🥳🙏🙏🙏🙏అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🥳🔥🔥🔥 pic.twitter.com/QBPAE3BKBG— Anil Ravipudi (@AnilRavipudi) January 15, 2026 -
నేరుగా ఓటీటీలో విడుదలైన అనంత.. ఎక్కడంటే?
భక్తిరస కథాచిత్రాలు అరుదుగా ఉంటాయి. ఈ మధ్య విడుదలైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా అనంత అనే భక్తిరస కథాచిత్రం సంక్రాంతి సందర్భంగా మంగళవారం నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఇది పుట్టపర్తి సాయిబాబా దైవలీలల గురించి చెప్పే సినిమా.అనంత సినిమాఇంతకుముందు బాషా, అన్నామలై వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన సురేశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీశ్ కృష్ణమూర్తి నిర్మించారు. జగపతిబాబు, సుహాసిని, వైజీ.మహేంద్రన్, నిగల్గళ్ రవి, తలైవాసల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని, గీత రచయిత స్నేషన్ మాటలు, పాటలు అందించారు.జీవిత చరిత్ర కాదుఇది సాయిబాబా జీవిత చరిత్ర కాదని, ఆయన మహిమలతో కూడిన భక్తిరస కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పూర్తి విశ్వాసంతో బాబాను నమ్మితే ఫలితాలెలా ఉంటాయన్నది చెప్పే సినిమాయే అనంత అన్నారు. ఇందులో అందరూ అద్భుతంగా నటించారన్నారు. దేవా సంగీతం సినిమాకు పెద్ద బలం అని తెలిపారు.ఓటీటీలో నేరుగా రిలీజ్సినిమా చూసిన పలువురు ప్రముఖులు థియేటర్లలో విడుదల చేయమని కోరారన్నారు. అయితే ఓటీటీ సంస్థ కమిట్ అవడంతో హాట్స్టార్కు స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చామన్నారు. ఈ సినిమా మంగళవారం అంటే జనవరి 13 నుంచి ఓటీటీలో ప్రసారం అవుతోందని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.చదవండి: రజనీకాంత్ కోసమే జైలర్ 2లో నటించా: విజయ్ సేతుపతి -
జైలర్ 2లో యాక్ట్ చేశా.. రజనీకాంత్ కోసమే..
తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. హీరోగా, విలన్గా సినిమాలు చేస్తున్నాడు. అవసరమైతే అతిథి పాత్రలో కనిపించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేసినట్లు ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. జైలర్ 2లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. నాకు రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి రోల్స్ చేయనుఇండస్ట్రీలో ఎన్నో దశాబ్దాలుగా సూపర్స్టార్గా రాణిస్తున్నవారి దగ్గరినుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. అలా జైలర్ 2లో ఆయన దగ్గరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చాలామంది విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. అయితే అవన్నీ రొటీన్గా ఉంటున్నాయి. హీరోను ఎలివేట్ చేసే విలన్ పాత్రలు చేయడం నాకెంతమాత్రమూ ఇష్టం లేదు.మూకీ సినిమాతో..కథను ముందుకు నడిపిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ పంచే విలన్ పాత్రల్ని మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం 'గాంధీ టాక్స్'. మూకీ (మాటలు లేని) సినిమాగా తెరకెక్కిన గాంధీ టాక్స్ జనవరి 30న విడుదలవుతోంది. ఈ మూవీలో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్దార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.చదవండి: మహేశ్బాబు గుడ్న్యూస్.. ఆరోజే ఓపెనింగ్ -
హీరో నో రెమ్యునరేషన్.. హీరోయిన్ చేయనంది..
ద్రౌపది 2 మూవీలో నటించేందుకు హీరో రిచర్డ్ రిషి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చిత్ర దర్శకుడు మోహన్ జి పేర్కొన్నారు. ఈయన ఇంతకుముందు దర్శకత్వం వహించిన ద్రౌపది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దానికి సీక్వెల్గా ద్రౌపది 2 తెరకెక్కిస్తున్నాడు.ఈ నెలలో రిలీజ్నేతాజీ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత చోళ చక్రవర్తి జీఎం ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించాడు. రక్షణ హీరోయిన్గా నటించిన ఇందులో నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది.నెల రోజుల్లో షూటింగ్ పూర్తిఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత చోళ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి కథతో సినిమా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు మోహన్ జి ఈ కథతో వచ్చారన్నాడు. సినిమా షూటింగ్ను 31 రోజుల్లో పూర్తి చేశారని తెలిపాడు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ నిర్వహించేవారని పేర్కొన్నాడు.ఆయన లేకపోతే ఈ సినిమా లేదుదర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ.. ఇది పీరియాడికల్ కథా చిత్రం అని చెప్పాడు. ద్రౌపది సినిమాలాగే ఈ మూవీకి కూడా అంతే సిన్సియర్గా పని చేశామన్నాడు. హీరో రిచర్డ్ రిషి లేకపోతే ఈ సినిమా లేదన్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని వెల్లడించాడు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలలో శిక్షణ కోసం ఆయన రోజుకు 16 గంటల చొప్పున ఏడాది పాటు శ్రమించారని గుర్తు చేశారు. బడ్జెట్ దాటిపోయిందిముందు అనుకున్న బడ్జెట్ను దాటిపోయినా సరే కథపై నమ్మకంతో సపోర్ట్ చేసిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపాడు. ద్రౌపది మొదటి భాగంలో నటించిన హీరోయిన్ సీక్వెల్ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో 25 మంది హీరోయిన్లను ఆడిషన్ చేసి చివరకు రక్షణను ఎంపిక చేశామన్నాడు. ఆమె చాలా ధైర్యవంతురాలని, మంచి ప్రతిభ ప్రదర్శించారన్నాడు. రక్షణకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్గా, వేశ్యగా..
ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బాలీవుడ్లో అనేక సక్సెస్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.చిన్నతనంలోనే..చిన్నప్పుడు మహారాజు గెటప్ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సినిమాతక్కువకాలంలోనే స్టార్ హీరోయి్గా మారింది. 1942: ఎ లవ్స్టోరీ, అకేలే, హమ్ అకేలే తుమ్, ఖామోషి: ద మ్యూజికల్, దిల్సే, కంపెనీ, తాజ్ మహల్, భూత్ రిటర్న్స్ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్ (భారతీయుడు), ముదల్వన్ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్ మూవీ చేసింది.క్యాన్సర్పై పోరాటంమనీషా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్లో మల్లికాజాన్ అనే వేశ్యపాత్రలో యాక్ట్ చేసింది. గతేడాది లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది.చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్గా విడాకులు: బాలీవుడ్ నటి -
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం..: నటి
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్ హగ్పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకులు..సెప్టెంబర్ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్ హగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్మాల్ రిటర్న్స్, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్ చేసింది. -
బాలీవుడ్ పీఆర్ కల్చర్పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో బాలీవుడ్లో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పీఆర్ అంటే మన గురించి, మన సినిమాల గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రమోషన్ అనేది ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది. ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మన ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడుతున్నారు’’ అని హీరోయిన్ తాప్సీ(Taapsee Pannu) పేర్కొన్నారు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఆర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా వర్క్లో స్పీడ్ తగ్గించాను. ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీలోని పీఆర్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రతి దానికి డబ్బు చెల్లించాలని గ్రహించాను. ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడతారు. మీ విజయం వేరొకరి వైఫల్యంపై ఆధారపడి ఉంటుందనేలా కొత్త వెర్షన్స్ సృష్టించారు. కానీ, నా మనస్తత్వం పూర్తి భిన్నమైనది. మన పనే మన గురించి చెప్పాలనుకుంటాను. అందుకే ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయను. నా ప్రయాణాలు, నా కోసం, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ ఆర్టికల్స్ రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్ మీడియా ఖాతాలకు వేలల్లో చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని స్పష్టం చేశారామె. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాప్సీ. -
బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే కన్నీళ్లాగలేదు!
ఆడవారిపై నోరు పారేసుకున్న నటుడు శివాజీని కడిగిపారేసింది యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. కానీ కొందరు శివాజీ లాంటి పురుషాహంకార ధోరణి ఉన్నవాళ్లు మాత్రం అనసూయనే ట్రోల్ చేశారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా విమర్శించారు. అయినా అనసూయ వెనక్కు తగ్గకుండా స్త్రీ హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ ప్రెస్మీట్కు వీడియో కాల్ ద్వారా హాజరైంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. నేను బాగున్నా..తాజాగా తన కన్నీళ్లకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్న జరిగిన ప్రెస్మీట్లో జూమ్ కాల్ ద్వారా మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉండటంతో, ఆ బలహీన క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. నేను పూర్తిగా బాగున్నాను.మనమంతా మనుషులమేమన స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు నేనుగానీ, ఏ మహిళ అయినా సరే ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుక్కోవడం నిజంగా బాధాకరం. కానీ, అదే సమయంలో నా వెనక నిలబడ్డ అద్బుతమైన, బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తోంది. మనమంతా మనుషులమే.. మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు. అన్నీ దాటుకుని నిలబడతా..ముఖ్యమైనది ఒక్కటే.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి, అన్ని అడ్డంకులు ఎదురొడ్డి నిలబడతాను. ఎవరి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది.. నన్ను కాదు. నిన్న జరిగిన ప్రెస్మీట్లో.. నేను అక్కడ లేకపోయినా, ధైర్యం, ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మానవత్వాన్ని ఎంచుకుందాంఅది నాకు నిజమైన సాధనగా అనిపిస్తోంది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అది నేరుగా నా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే తెలియజేస్తాను. అంతవరకు మౌనంగానే ఉంటాను. మనమంతా శాంతి, సానుభూతి, మానవత్వాన్ని ఎంచుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అనసూయ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: నన్ను లాక్కెళ్లి ముద్దుపెట్టాలని చూశారు: అనిల్ రావిపూడి -
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: అనగనగా ఒక రాజునటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్ పొన్నప్ప, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: మారిసంగీతం: మిక్కీ జె. మేయర్విడుదల తేది: జనవరి 14, 2026హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అనగజగా ఒక రాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Anaganaga Oka Raju Review).ఎలా ఉందంటే..తెలిసిన కథతోనే సినిమా తీసి మెప్పించడం అనేది...పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్టే అవుతుంది. లుక్ మారితే చాలా ఇష్టపబతారు. కానీ లోపాలు కనిపిస్తే విమర్శలు తప్పవు. ‘రాజుగారు’ ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతాం. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల వరకు బోరింగ్గా సాగుతుంది. ఒక్కో సీన్ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి వేసే పంచ్లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. ఎలెక్షన్ క్యాంపెయిన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్లో కథనం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. రాజు పాత్రలో జీవించేశాడు. ఇక చారులతగా మీనాక్షి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీరిద్దరు తప్పితే.. మిగతా పాత్రలేవి అంతగా గుర్తుండవు. హీరోయిన్ తండ్రిగా రావు రమేశ్ రెగ్యులర్ పాత్రలో కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎర్రిబాబు పాత్రలో తారక్ పొన్నప్ప.. బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటలు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్గా కనబడుతుంది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నన్ను లాక్కెళ్లి ముద్దు పెట్టాలని చూశారు: అనిల్ రావిపూడి
వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు కొల్లగొట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అవన్నీ నాకు కొట్టిన పిండి అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఒకటీరెండు కాదు వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని హిట్ మెషిన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.మెగా బ్లాక్బస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించాడు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మెగా బ్లాక్బస్టర్ థాంక్యూ మీట్లో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.కనబడితే లాక్కెళ్లి..ఆయన మాట్లాడుతూ.. ఈ కథలోని అన్ని సన్నివేశాలకు చిరంజీవి గారే స్ఫూర్తి. నాకు ఈ సినిమా చేసే అవకాశాన్నిచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మెగా ఫ్యాన్స్ అయితే నేను కనబడితే లాక్కెళ్లి ముద్దులు పెడదామని చూస్తున్నారు. వాళ్లు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేను.ఫామ్హౌస్ కొనివ్వాలిఅమెరికాలో ప్రీమియర్స్ 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తే నిర్మాత సాహు గారపాటికి కారు ఇస్తానన్నాను. నేను అనుకున్న నెంబర్ దాటిపోయింది కాబట్టి ఆయనకు కారు కొనిస్తాను. కాకపోతే.. కలెక్షన్స్ మూడు దాటి నాలుగు మిలియన్ డాలర్లు వస్తే నాకు ఫామ్ హౌస్ కొనివ్వాలి. ఇప్పుడు ఆయన కారు అడుగుతారా? లేదా? అనేది ఆయన ఇష్టం అని అనిల్ రావిపూడి సరదాగా ఓ కండీషన్ పెట్టాడు.చదవండి: మన శంకరవరప్రసాద్ గారు రెండు రోజుల కలెక్షన్స్ -
‘రాయుడు గారి తాలూకా’ నుంచి రెండో సాంగ్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా రెండో పాటను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల చేశారు.‘ఏలేలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : భర్త మహాశయులకు విజ్ఞప్తినటీనటులు: రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఎల్వి సినిమాస్నిర్మాత: చెరుకూరి సుధాకర్దర్శకత్వం: కిషోర్ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: జనవరి 13, 2023ఈ ముగ్గుల పండక్కి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్ మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయినా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్ని స్పెయిన్లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్కు తగ్గట్లు ప్రెష్గా ఉన్నాయి. మీమ్స్ కంటెంట్ని బాగా వాడుకున్నాడు. సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు కొన్ని సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఏ జోనర్ సినిమాకైనా ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్ అయింది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్ మోడల్ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు. ఫస్టాఫ్లో సత్య, కిశోర్ల కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్ ఎపిసోడ్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది. హైదరాబాద్ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. మొత్తంగా పస్టాఫ్లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి.. బోర్ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్లో మాత్రం ఆ కామెడీ డోస్ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్లో కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ సీన్ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్, డింపుల్ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, సత్య, సునీల్ల కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయింది. మరళీధర్ గౌడ్ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. పిన్నీ సీరియల్ సాంగ్తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. మూడో సాంగ్ రిలీజ్తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్. 'నాలోన సోకులున్నయ్, సొంపులున్నయ్ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్ సీపన, సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ శాన్వి మేఘన నవీన్ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: బాస్ చింపేశాడు.. మెగాస్టార్పై అల్లు అరవింద్ ప్రశంసలు -
బాస్ చింపేశాడు.. చిరంజీవిపై అల్లు అరవింద్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్బస్టర్ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది. వింటేజ్ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'మన శంకర వరప్రసాద్గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.బాస్ ఈజ్ బాస్అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. బాస్ చింపేశాడు. బాస్ ఈజ్ బాస్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్ మూవీ అని ప్రశంసలు కురిపించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్ పాటించి, వర్కవుట్స్ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడాడు.సరైన సమయం దొరక్క..కరణ్ జోహార్ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్ ఉండవు. అర్జంట్ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నాననేవారు. అమ్మ తిట్టేదిఅమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. కళ్లు తిరిగి పడిపోయా..అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్రూమ్లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాటి వల్లే బరువు తగ్గా..కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్ చేశాను. గేమ్స్ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్ జోహార్ చెప్పుకచ్చాడు.చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్ చూశారా? -
క్రైమ్ యాంకర్గా శోభిత.. చీకటిలో ట్రైలర్ చూశారా?
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్కాస్ట్కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.క్రైమ్ యాంకర్గా శోభితసమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్ కిల్లర్.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!సినిమాచీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. చదవండి: పీరియడ్స్.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్ -
పీరియడ్స్.. ఒక్కరూ నా బాధ అర్థం చేసుకోలే: హీరోయిన్
ఒక్కసారి డేట్స్ ఇచ్చాక చెప్పిన సమయానికి సెట్లో ఉండాల్సిందే! అది హీరోలైనా, హీరోయిన్లయినా! అయితే కొన్నిసార్లు పీరియడ్స్ వల్ల నటీమణులు ఇబ్బందిపడుతుంటారు. దాన్ని బయటకు చెప్పుకోలేక, చెప్పినా అర్థం చేసుకోరేమోనన్న భయంతో లోలోపలే మథనపడుతుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు. ధనుష్ హీరోగా నటించిన 'మార్యన్' అనే తమిళ మూవీలో పార్వతి కథానాయికగా యాక్ట్ చేసింది. రొమాంటిక్ సీన్ఈ సినిమా షూటింగ్లో జరిగిన సంఘటనను పార్వతి తాజాగా గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. మార్యన్ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని బీచ్లో షూట్ చేశారు. నన్ను పూర్తిగా నీళ్లలో ముంచి తడిపారు. నేను అదనపు డ్రెస్ తీసుకెళ్లలేదు. షూటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. నాకేమో చాలా అసౌకర్యంగా ఉంది. అదెవరూ గమనించట్లేదు.ఒప్పుకోలేదుఓ పక్క పీరియడ్స్.. మరోపక్క నీళ్లలో తడవడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒకసారి హోటల్కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని చెప్పాను. వాళ్లు కుదరదన్నారు. అంతే, నా కోపం నషాళానికి అంటింది. నేను పీరియడ్స్లో ఉన్నాను.. కచ్చితంగా వెళ్లి తీరాలి అని గట్టిగా అరిచి చెప్పాను. వెంటనే సెట్లో ఉన్నవారంతా షాకై అలా చూస్తున్నారు. వాళ్లు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆరోజు సెట్లో నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్లే ఉన్నారు.ఒంటరిగా ఫీలయ్యాచాలాసేపటివరకు నా ఇబ్బందిని చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఫీలయ్యాను. నాలో ఓపిక కూడా నశించింది అని చెప్పుకొచ్చింది. పార్వతి తిరువోతు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు మూవీస్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: మన శంకరవరప్రసాద్గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
బ్లాక్బస్టర్ రెస్పాన్స్.. సంతోషంలో చిరంజీవి, అనిల్ రావిపూడి
సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్గారు దిగేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి రోజే బ్లాక్బస్టర్ టాక్ అందుకుంటోంది. ప్రీమియర్స్ నుంచే సినిమాకు హిట్ టాక్ మొదలైంది. 'బాస్ ఈజ్ బ్యాక్.. ఈ సంక్రాంతి బాస్దే..' అంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. సెలబ్రేషన్స్ఇది చూసిన చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంక్రాంతి హిట్ బొమ్మఅనిల్ రావిపూడి ముందుగా చెప్పినట్లుగానే సినిమాలో వింటేజ్ చిరును చూపించాడు. అద్భుతమైన యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్తో మెగాస్టార్ అభిమానులను ఎంతగానో అలరించాడు. మొత్తానికి ఈ సినిమా మెగా ఫ్యాన్స్కు అసలైన పండగను తీసుకొచ్చింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! A beautiful moment celebrating a MEGA BLOCKBUSTER RESPONSE 😀❤️🔥Hit Machine, director @AnilRavipudi, producers @sahugarapati7 & @sushkonidela met Megastar @KChiruTweets to share the happiness after the blockbuster response from the premieres of #ManaShankaraVaraPrasadGaru 🔥… pic.twitter.com/ZL8Tsch547— Gold Box Entertainments (@GoldBoxEnt) January 11, 2026 (మన శంకర వరప్రసాద్గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరో ఎవరనేది పట్టించుకోను : మీనాక్షి చౌదరి
‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.⇢ నవీన్తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి. -
గోశాలకు సోనూసూద్ రూ.11 లక్షలు విరాళం
మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.గోశాలకు విరాళంఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.సినిమాసోనూసూద్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్.. ఇలా అనేక సినిమాల్లో విలన్గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా.. -
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్ చేశారడు.‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?(చదవండి: మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్పై కక్ష.. హరీశ్రావు సంచలన కామెంట్)'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్ ట్వీట్ చేశాడు. Happy and Sad to see this - Happy to know hardwork, dreams and money of many is protected in a way. And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026 -
చచ్చిపోవాలనిపించింది.. ఎంతోమందిని కలిశా..
చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. అర్ధరాత్రి థెరపీకాకపోతే మనకు కరెక్ట్ థెరపిస్ట్ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్ థెరపిస్ట్ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.చచ్చిపోవాలన్న ఆలోచనలుఅప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్ థెరపిస్ట్ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. సినిమాప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్, ఎన్ను నింటె మొయిదీన్, చార్లీ, ఉయరె, వైరస్, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్ సిరీస్తో తెలుగువారికి సైతం పరిచయమైంది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
సంక్రాంతి వేడుకల్లో చై-శోభిత.. భోజనం వడ్డిస్తూ..
టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఈసారి సంక్రాంతిని కాస్త ముందుగానే జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకకు హాజరైన వీరిద్దరూ అక్కడ ఉన్నవారికి ఆప్యాయంగా భోజనం వడ్డించారు. అనంతరం అక్కడి వారితో ఫోటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమాకాగా చై- శోభితలది ప్రేమ పెళ్లి. కొంతకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన చైకి 'తండేల్'తో పెద్ద హిట్ లభించింది. రూ.100 కోట్లు రాబట్టిన తొలి సినిమాగా అతడి కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం చై 'వృషకర్మ' సినిమా చేస్తున్నాడు. శోభిత సంగతేంటి?'విరూపాక్ష' వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. శోభిత విషయానికి వస్తే.. ఇటీవలే తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. 'చీకటిలో' అనే థ్రిల్లర్ సినిమాతో జనవరి 23న ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలవుతోంది. #EverGreen Couple #Yuvasamrat @chay_akkineni sir @sobhitaD Madam 😍💞 at Annapurna Studios Sankranthi Pongal Festival Celebrations ✨🥳#ANRLivesOn #NagaChaitanya #SobhitaDhulipala #Vrushakarma pic.twitter.com/Hse8fBVw7p— En Uyir Chaitu (@Kalyan7781) January 10, 2026 చదవండి: నీ బర్త్డే నాకెంతో స్పెషల్.. పుట్టినందుకు థాంక్స్: అల్లు అర్జున్ -
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు.. పుట్టినందుకు థాంక్స్
ట్రోలింగ్ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్ చూశాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.నాలుగు సార్లు రిపీట్హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎనలేని గౌరవంపుష్పకు సీక్వెల్గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.నా జీవితాన్ని మార్చేసిన రోజు హ్యాపీ బర్త్డే డార్లింగ్.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్ సుకుమార్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. Happy Birthday, darling.It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar Puttinandhuku thanks!!! 🖤(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026 చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్ రావిపూడి -
ప్రియుడిని పెళ్లాడిన 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, కథానాయిక నుపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. వారం రోజుల క్రితమే ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శనివారం (జనవరి 10న)నాడు ప్రియుడిని వివాహం చేసుకుంది. రాజస్తాన్లో ఉదయ్పూర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.పెళ్లి చేసుకున్న హీరోయిన్ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఒకే ఒక్క మూవీనుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Bollywood (@lifestyleofbollywood)Finally its here ✨5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ— G (@kixtr1KSanon) January 10, 2026 View this post on Instagram A post shared by Stebin Ben (@stebinben) -
పొగిడినా.. విమర్శించినా నవ్వుతా : అనిల్ రావిపూడి
‘‘ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఈ బ్రాండ్ నాకు వద్దు. కుదిరినప్పుడల్లా సంక్రాంతికి వచ్చి కుర్రాడు ఏదో నవ్విస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చాలు’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄÷ందిన తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం రేపు(సోమవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు...→ ఈ సినిమా అంతా చిరంజీవిగారు చేసిన శంకరవరప్రసాద్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుంది. ఈ తరహా సినిమా చేయడం నాకు కూడా కొత్తే. ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషనల్ రైడ్ కూడా ఉంది. భార్యా భర్తల మధ్య ఓ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాను. చిరంజీవిగారు సెల్ఫ్ సెటైర్స్ వేసుకున్నారు. అది ఆయన గొప్పదనం. ఇది ఆడియన్స్ను అలరించడానికి మాత్రమే. → కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్మేన్ వెంకీ గౌడ అనే పాత్రలో వెంకటేశ్గారు నటించారు. చిరంజీవి, వెంకటేశ్గార్ల కాంబినేషన్ సీన్స్ 20 నిమిషాలు ఉంటాయి. వారితో షూటింగ్ చేసిన సమయం నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్. మా సినిమా టికెట్ ధరలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండాలని, చిరంజీవిగారు స్ట్రిక్ట్గా చెప్పారు. దీంతో మేం నార్మల్ హైక్స్ కోసమే రిక్వెస్ట్ పెట్టుకున్నాం. → ఈ సినిమాలోని హుక్స్టెప్ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ పాటకు బదులు మేం ముందుగా మరో మెలోడీ ట్యూన్ అనుకున్నాం. కానీ, ఆ తర్వాత వద్దనుకుని లాస్ట్ షెడ్యూల్లో ఈ ‘హుక్ స్టెప్’ సాంగ్ను షూట్ చేశాం. ఫైనల్గా ఇలా మెగా మ్యాజిక్ జరిగింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. → నా సినిమాల ప్రొడక్షన్స్ , బడ్జెట్ విషయాల్లో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అయితే నా లైఫ్లో నేను ప్రొడక్షన్స్ , డిస్ట్రిబ్యూషన్ చేయను. ఇక సోషల్ మీడియాలో నాపై కొన్ని విమర్శలు వస్తుంటాయి. పొగడ్తలను స్వీకరిస్తున్నప్పుడు, విమర్శలను కూడా తీసుకోవాలి. అందుకే నేను దేనికీ A. నన్ను విమర్శించినా నవ్వుతా.. పొగిడినా నవ్వుతా. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. నాగార్జునగారితో కూడా సినిమా చేయాలని ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. నా కొత్త సినిమా ఇంకా ఖరారు కాలేదు. -
చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. లిఫ్ట్లో అలా ప్రవర్తించాడు : హీరోయిన్
దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోత్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.ఛాతీపై కొట్టాడు.. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్కు వెళ్లాను. ట్రైన్ కోసం పెరెంట్స్తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్ పార్ట్ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?లిఫ్ట్లో అలా.. కొట్టేశా19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్ పార్ట్ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా. నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది. సినిమాలో విషయానికి వస్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -
సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ.. ఈ నెలలోనే మూడో పార్ట్
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "మర్దానీ 3". దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ను ఓ నెల ముందుకు జరిపారు.సినిమామర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీరాయ్గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. 'ద రైల్వేమెన్' ఫేమ్ ఆయుష్ గుప్తా కథ అందించాడు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) చదవండి: ఇలా జరుగుతుందనుకోలేదు.. సారీ: రాజాసాబ్ డైరెక్టర్ -
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్న్యూస్, ఒక బ్యాడ్న్యూస్. ముందుగా బ్యాడ్న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.పదేళ్ల సందర్భంగా..ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.తేరి రీరిలీజ్వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్గా రీమేక్ అవగా బాలీవుడ్లో ఆకట్టుకోలేకపోయింది. ஜனவரி 15 முதல் அகிலமெங்கும்Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026 చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్ -
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ధురంధర్ హీరో సరసన..ధురంధర్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ప్రళయ్' (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కల్యాణి యాక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.అన్నీ నాకే కావాలి!మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.ప్రళయ్ సినిమా!ప్రళయ్ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్ హిందీ సినిమా ప్రళయ్ అవుతుంది.చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్ నిర్మాత భావోద్వేగం -
పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం
తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్లో చూసుకుని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. చివరి నిమిషంలో వాయిదాకానీ సెన్సార్ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్ నిర్మాత వెంకట్ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్ సినిమాను 2025 డిసెంబర్ 18న సీబీఎఫ్సీకి పంపించాం. డిసెంబర్ 22న యూఏ 16+ సర్టిఫికెట్ ఇస్తామంటూ మాకు మెయిల్ చేశారు. సడన్గా ఓ ఫిర్యాదుఅలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్ బోర్డు మెయిల్ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. పరిస్థితి చేయిదాటిందిపైగా రివైజింగ్ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.అసలేంటి సమస్య?భగవంత్ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్సీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంన్ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions)చదవండి: రాజాసాబ్.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి -
నయనతారపై ట్రోలింగ్.. స్పందించిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ గురించి అందరికి తెలిసిందే. సినిమాను తెరకెక్కించడమే కాదు..ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ చేస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంలో అనిల్ ప్రమోషన్స్ కూడా పాత్ర కూడా బాగానే ఉంది. స్టార్ హీరో వెంకటేశ్తో ఇన్స్టా రీల్స్ కూడా చేయించి.. సినిమాను అందరికి రీచ్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ‘మనశంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా అప్లై చేశాడు. సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టాడు. షూటింగ్ మొదలైన రోజే.. మెగాస్టార్ చిరంజీవిపై ఓ స్పెషల్ వీడియో వదిలాడు. ఒకపక్క షూటింగ్ చేస్తూనే..మరోపక్క ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు నయనతారతో కూడా సినిమా ప్రమోషన్స్ చేయించిన ఘనత అనిల్కే దక్కింది.సాధారణంగా నయనతార మూవీ ప్రమోషన్స్కి చాలా దూరంగా ఉంటారు.తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో ముందుగానే ప్రమోషన్స్కి రానని అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎంత పెద్ద స్టార్ సినిమాలో నటించినా, దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసినా ఆమె మాత్రం ప్రమోషన్స్కి వెళ్లరు.అయితే మనశంకరవరప్రసాద్ గారు సినిమాకు వచ్చేసరికి ఆమె తీరే మారిపోయింది. చాలా హుషారుగా ప్రమోషన్స్ చేసున్నారు. ఆమెతో చేయించిన స్పెషల్ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అదే సమయంలో నయనతారపై కొంతమేర ట్రోలింగ్ కూడా నడిచింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆమె తీరును తప్పుబట్టారు. కోలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించినా, చివరికి తను స్వయంగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రమోషన్స్కు రాని నయనతార... తెలుగు సినిమాల కోసం ఇలా ముందుకు రావడం ఏంటీ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా మీకు అంత ఎక్కువైపోయిందా? అంటూ ఆమెపై విమర్శలు చేశారు.తాజాగా ఈ ట్రోలింగ్పై ‘మనశంకర్ వరప్రాసద్ గారు’ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ని ఆమె పట్టించుకోదని.. తనకు నచ్చిన పని చేస్తుందని చెప్పారు. ‘ఒక్కో సినిమాకు ఒక్కో వైబ్ ఉంటుంది. ప్రతి మూవీకి దర్శకుడు వెళ్లి హీరో, హీరోయిన్లకు కథ చెబుతాడు. అయితే వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నామనేది ముఖ్యం. మన ప్రవర్తనను బట్టి.. వాళ్లు కూడా మారుతుంటారు. నేను అందరితో కలిసిపోతుంటాను. ప్రతి ఆర్టిస్ట్ని కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటాను. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి నా భుజంపై చేయి వేసి మాట్లాడతారు. అంతలా వాళ్లతో కలిసిపోతాను. మనం జన్యూన్గా అడిగినప్పుడు.. మనకున్న బాండ్ని బట్టి చేయను అనే వాళ్లు కూడా ప్రమోషన్స్ చేస్తారు. నయనతార చాలా నిజాయితీగా పని చేస్తారు. తను నటించే సినిమాలకు 100 శాతం న్యాయం చేస్తారు. ‘సినిమాకు ఇది అవసరం..దర్శకుడు పని తీరు ఇలా ఉంటుంది’ అని అమె బలంగా నమ్మినప్పుడు కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు’ అని అనిల్ చెప్పుకొచ్చారు.‘మన శంకరవరప్రసాద్ గారు’ విషయానికొస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. A Sweet New year Surprise to all of you from team #ManaShankaraVaraPrasadGaruGRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12th pic.twitter.com/gT1uHFTwmX— Nayanthara✨ (@NayantharaU) January 1, 2026 -
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. వరుణవి కోసం..
చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు. ఎలిమినేషన్ అనేది లేకుండా గ్రాండ్ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.మాటిచ్చిన మెగాస్టార్ఈ షోకి సుధీర్ యాంకర్గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్ రావిపూడి, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, సింగర్ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.మాట నిలబెట్టుకున్న చిరంజీవిఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు తెలిపింది.చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్కు ఏకంగా చెప్పు చూపించాడా? -
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్ కాపీ కొట్టి.. ఒరిజినల్ కంపోజర్కే దొరికిపోయాడు. తమన్ లేటెస్ట్గా ది రాజాసాబ్ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్తో కలిసి స్టెప్పులేశాడు.కాపీ కొట్టాడా?అయితే ఈ పాట ఒరిజినల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్.. తన ఒరిజినల్ సాంగ్ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజాసాబ్ రిలీజ్ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Vidojean (@vidojean) చదవండి: నావాడిని కలిసానోచ్.. రోహిణి -
నావాడిని కలిసానోచ్.. ఫోటో షేర్ చేసిన రోహిణి!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. నావాడిని కలిశా..మత్తు వదలరా, బలగం, హను-మాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్) వెబ్సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది. షాకయ్యారా?ఇంతమంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.నిజమైతే బాగుండు యాంకర్ అరియానా అయితే సీరియస్గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) చదవండి: అది సవాల్గా అనిపించింది: ఆషికా రంగనాథ్ -
అది సవాల్గా అనిపించింది : ఆషికా రంగనాథ్
‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. నా పీఏ క్యారెక్టర్లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్ని మ్యాచ్ చేయడం సవాల్ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని పేర్కొన్నారు. -
కల్యాణ్ కృష్ణ చేతుల మీదుగా 'రాయుడి గారి తాలుకా’సాంగ్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్ను సోగ్గాడే చిన్ని నాయన ,బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల విడుదల చేశారు. ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నాగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లె అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
18 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఇన్నాళ్లకు మెగా సక్సెస్
ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం. కొరియోగ్రాఫర్ ఆట సందీప్కు కావాల్సినంత టాలెంట్ ఉంది. కానీ విజయం మాత్రం ఆవగింజంత కూడా లేదు. చాలాఏళ్లుగా ఆ సక్సెస్ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలం క్రితం డ్యాన్స్ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్కు డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కిందట కెరీర్ మొదలుపెట్టిన సందీప్కు ఎట్టకేలకు సక్సెస్ దొరికింది. రోషన్ 'ఛాంపియన్' మూవీలో 'గిరగిర గింగిరానివే..', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్'లో 'హుక్ స్టెప్' పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అతడి జర్నీ ఓసారి చూసేద్దాం..సోషల్ మీడియాలో ఫేమస్ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్లో పాల్గొని విన్నర్గా నిలిచాడు సందీప్. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్గా స్థిరపడింది. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేశాడు. సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్స్ మాస్టరే.. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రీల్స్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ జంట టాలెంట్కు బోలెడన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులు అభిప్రాయపడ్డారు.గిరగిర గింగిరానివే.. పాటతో క్లిక్సందీప్.. కొరియోగ్రాఫర్గా కొన్ని సినిమాలు చేశాడు కానీ మంచి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆమధ్య హీరోగా లవ్ యూ టూ అని ఓ మూవీ కూడా చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇక సందీప్ డ్యాన్స్ రీల్ చూసి ఛాంపియన్ మూవీ నిర్మాత స్వప్నదత్ ఓసారి అతడికి కాల్ చేసింది. తన సినిమాలో కొరియోగ్రఫీ చేయమని అడిగింది. అలా అతడి హిట్ లిస్ట్లో మొదటి పాటగా గిరగిర గింగిరానివే.. వచ్చి చేరింది. సందీప్ దంపతుల టాలెంట్ చిరంజీవికి కూడా తెలిసింది. వెంటనే ఆయన వీరిని ఇంటికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.ఫేవరెట్ హీరోకి కొరియోగ్రఫీమన శంకర వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్ చేయమని వరం ప్రసాదించాడు. అసలే సందీప్ ఫేవరెట్ హీరో ఆయన.. అలాంటిది పిలిచి మరీ అవకాశం ఇచ్చాక నిరూపించుకోకుండా ఉంటాడా? సింపుల్గా ఉంటూనే గ్రేస్ కనిపించేలా స్టెప్స్ క్రియేట్ చేశాడు. చిరు కూడా.. అంతే గ్రేస్గా, స్టైలిష్గా స్టెప్పులేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో సందీప్కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత ఇంత మంచి విజయం రావడంతో.. ఇన్నేళ్లుగా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాడు. అనుకున్నది సాధించానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి అతడికి మున్ముందు కూడా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: ది రాజాసాబ్లో ఆ సీన్స్ డిలీట్ -
ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్
ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్ టీమ్.. ప్రభాస్ను మోస్ట్ హ్యాండ్సమ్ లుక్లో చూపించారు. సినిమాలో డార్లింగ్ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.అటు వింటేజ్ లుక్.. ఇటు ఓల్జ్ ఏజ్ లుక్టీజర్, ట్రైలర్లో ప్రభాస్ను ఓల్డ్ ఏజ్ లుక్లో చూపించారు. సినిమాకు హైప్ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్ లుక్, ఇటు ఓల్జ్ ఏజ్ లుక్లో ప్రభాస్ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది. సినిమాఅయితే ఈ సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaab https://t.co/EZYyncCc8R— Abhi063 (@Ab0612ish) January 9, 2026 View this post on Instagram A post shared by Movie Mirchi (@movie_mirchi___) First scam in 2026This look 😭😭pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
మా ఇంటి బంగారం టీజర్: అదరగొట్టేసిన సామ్
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ ఇది. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తోంది. శుక్రవారం (జనవరి 9న) మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ రిలీజ్'ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం...' అన్న సామ్ డైలాగ్తో వీడియో మొదలవుతుంది. అత్తగారిల్లిది.. ఇంకోసారి ఆలోచించుకో అంటే 'అందరూ ఎంతో మంచోల్లలాగా ఉండారు. నాకు చూస్తాంటే ఎప్పటినుంచో తెలిసినట్లుంది. నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్లుగా కలిసిపోతాం..' అని సామ్ అత్తారింట్లో అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తుంది. అటు క్లాస్, ఇటు మాస్చీర కట్టు, బొట్టుతో సింపుల్గా అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. ముఖ్యంగా బస్లో, ఏకంగా అత్తగారింట్లో సమంత ఫైట్ సీన్స్ చేసినట్లు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. సామ్ అటు క్లాస్, ఇటు మాస్ లుక్లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి కథ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. -
త్వరలో గుడ్న్యూస్ చెప్తానంటున్న హీరోయిన్
హీరోయిన్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ గతేడాది పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. తాజాగా ఈ జంట ఓ వ్లాగ్లో త్వరలోనే ఒక కొత్త ప్రయాణం మొదలు కానుందని ప్రకటించింది. దీంతో అవికా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం ఊపందుకుంది.ఈ రూమర్స్ను తాజాగా అవికా గోర్ కట్టిపారేసింది. నేను గర్భవతిని కాదు, అలాంటి విశేషం ఏం లేదు. కాపోతే త్వరలోనే ఓ శుభవార్త చెప్తాను, అదేంటో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే! అని చెప్పింది.ప్రేమ- పెళ్లిఅవికా- మిలింద్ 2020లో హైదరాబాద్లో తొలిసారి కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్లో ఈ లవ్బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది 'పతీ పత్నీ ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు.సినిమాఅవికా విషయానికి వస్తే.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్గా మారింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, 10th క్లాస్ డైరీస్, షణ్ముఖ వంటి పలు తెలుగు సినిమాలు చేసింది.చదవండి: రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు! -
హీరోయిన్గా రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్..
సినిమా మాధ్యమం చాలా పవర్ఫుల్. దీనికి చాలా మంది ఆకర్షితులవుతారు. పలువురు నటించాలని కలలు కంటారు. అందుకు కొందరు స్ఫూర్తి దాయకులవుతారు. అలా అగ్ర హీరోయిన్ నయనతారని స్ఫూర్తిగా తీసుకుని కథానాయికగా మారింది వర్ధమాన నటి ఐశ్వర్య కేఎస్. ఈమె హీరోయిన్గా నటించిన జస్టీస్ ఫర్ జెనీ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది. చిన్నతనం నుంచి ఆసక్తిపవర్ ఫుల్ పోలీస్ అధికారిగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో నటించిన ఐశ్వర్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు చిన్నతనం నుంచి కళలు, క్రీడలపై ఆసక్తి ఎక్కువ అంది. తాను కబడ్డీ క్రీడలో రాష్ట్ర స్థాయిలో తమిళనాడు తరఫున పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. అలా శారీరక వ్యాయామం చేయడం వల్ల నటనపై కూడా ఆత్మవిశ్వాసం కలిగిందని తెలిపింది.నా జీవితాన్ని మలుపు తిప్పిందికోవిడ్ కాలంలో ఒక షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చిందని, అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొంది. తర్వాత జస్టిస్ ఫర్ జెనీలో నటించే అవకాశం వచ్చిందంది. తాజాగా నట్టి నటరాజ్కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయంది. స్వయంకృషితో శ్రమించి అగ్ర కథానాయికగా ఎదిగిన నయనతార తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చింది. దర్శకులు వెట్రిమారన్, మారిసెల్వరాజ్ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది. అలాగే కొత్త ఆలోచనతో వస్తున్న యువ దర్శకుల చిత్రాల్లోనూ నటించడానికి సిద్ధమంటోంది. -
రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.థియేటర్లో మొసళ్లు?అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్ అని నినాదాలు చేస్తున్నారు. అదీ సంగతి!ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్లోనూ ఆ క్లిప్ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు. సినిమారాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్గా విడుదలైంది. Prompt crt ga eyaledu bhai adu screen atu side untey seats etu side pettadu https://t.co/mlcCuWnGui— Nikkar Narayana ™ (@urstrulynikkar1) January 8, 2026Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026Ehh mental nakoduluu crocodile 🐊 ni sav dengaru climax lo edi USA ani chepandra vadikii 🥵🥵🥵😭😭💥💥💥💥💥#RajaSaab pic.twitter.com/e7Io1fZ1PZ— Virat Kohli (@Kranthi_1322) January 8, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్. రవిమోహన్ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది. స్క్రీన్ప్లే రాయడమే ఛాలెంజింగ్ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్ప్లే రాయడమే ఛాలెంజింగ్గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలని అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్ భాస్కర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే.. తర్వాత టాక్ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువఅయితే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్లోకి లాగుతున్నారు. సందీప్ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్ రెడ్డితో బ్లాక్బస్టర్ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.ఆర్ఆర్ఆర్ నుంచి..ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో, కింగ్డమ్ అప్పుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో, శివ రీరిలీజ్ సమయంలో రాంగోపాల్ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్ నాన్న రిలీజ్ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్ హీరోహీరోయిన్లు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లను ఇంటర్వ్యూ చేశాడు. బుల్లెట్ పాయింట్ ప్రశ్నలుఅందరూ సందీప్నే యాంకర్గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్ పాయింట్స్లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్ అవడం మరో విశేషం. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి బాలీవుడ్లోనూ బజ్ క్రియేట్ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం! చదవండి: 23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే -
చైతో పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
హీరోయిన్ శోభిత ధూళిపాళ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత తన మొదటి సినిమాను ప్రకటించింది. ఈ సినిమా పేరు "చీకటిలో". ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో చీకటిలో మూవీ జనవరి 23 నుంచి ప్రసారం కానున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు పోస్ట్ పెట్టింది.థ్రిల్లర్ మూవీలో శోభితఈ మేరకు చీకటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో శోభిత తలకు హెడ్ఫోన్స్ పెట్టుకోగా ఎదుట మైక్ ఉంది. బహుశా తను రేడీయో జాకీ అయి ఉండవచ్చు. ఆమె పాత్ర పేరు సంధ్య అని వెల్లడించారు. హీరోయిన్ వెనకాల ఏదో నేరానికి సంబంధించిన విచారణ తాలూకు సెటప్ ఉంది. దీన్ని బట్టి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇట్టే తెలిసిపోతుంది.పెళ్లి తర్వాత మొదటి మూవీకాగా శోభిత ధూళిపాళ.. 2024లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎటువంటి సినిమా ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇప్పుడు సడన్గా చీకటిలో ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. చీకటిలో సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని డి.సురేశ్ బాబు నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. మరి ఈ థ్రిల్లర్ తెలుగు మూవీలో శోభిత ఎలా మెప్పిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)చదవండి: నా కూతురికి కష్టపడాల్సిన అవసరమే లేదు: చిరంజీవి -
‘అనగనగా ఒక రాజు’ మూవీ ట్రైలర్ రివ్యూ
ఈ సంక్రాంతికి చివరిగా రాబోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. నవీన్ మార్క్ కామెడీతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది ఈ ట్రైలర్. ‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు’ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గుడిలో ఉన్న హుండీలో నోట్ల కట్టను వేసేందుకు హీరో ప్రయత్నించడం..అందులో పట్టకపోవడంతో ‘పంతులుగారు.. ఎన్నిసార్లు చెప్పానండి..కన్నం పెద్దది చేయమని..నోట్లు పట్టట్లేదు’ అని నవీన్ అంటే.. చిల్లర వేయడం కోసం చిన్నగా పెట్టామని పంతులు అంటాడు. వెంటనే ‘చిల్లరగాళ్ల కోసం సపరేట్ హుండీ పెట్టండి’ అని నవీన్ పంచ్ విసురుతారు. ఇలా ట్రైలర్ మొత్తం నవీన్ మార్క్ కామెడీతో సాగుతుంది. అమెరికాకు వెళ్లే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకునే యువతి పాత్రలో మీనాక్షి చక్కగా నటించింది. మీనాక్షి, నవీన్ ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరించదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. నవీన్, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "పండగకు అల్లుడు వస్తున్నాడు" అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు. మొత్తానికి, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పండగ వాతావరణం అన్నీ కలగలిసిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే!
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తను డైరెక్ట్ చేసిన సినిమాలు అవార్డులు గెలిచాయి కానీ ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. తాజాగా భారత జాతీయ సినీ అకాడమీ (NICA) ప్రెస్మీట్కు హాజరైన రోహిత్ శెట్టి ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.యాంకరింగ్ చేయమని..ఆయన మాట్లాడుతూ.. నాకు, అవార్డులకు మధ్య సంబంధమే లేదు. ఇప్పటివరకు 17 సినిమాలు తీశాను. అవార్డు ఫంక్షన్కు పిలుస్తుంటారు, కానీ హోస్ట్గా చేయమని మాత్రమే ఇన్విటేషన్ వస్తుంటుంది. అలా అవార్డుల ఫంక్షన్లో యాంకర్గా మాత్రమే కనిపించాను అన్నాడు.ఎప్పుడో మొదలైందినార్త్ వర్సెస్ సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సినిమా రిలీజైతే పండగ చేసుకోవాలి. సినిమా అనేది మొదలైనప్పటినుంచే ఇక్కడి వాళ్లు దక్షిణాదిలో.. దక్షణాదివాళ్లు బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. 1950 నుంచే ఇదంతా జరుగుతోంది. మనం ప్రాంతీయ బేధాలు చూడకుండా సినిమా సెలబ్రేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా వల్ల ప్రపంచమే చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అందరూ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేసి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పుకొచ్చాడు.సినిమారోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.చదవండి: హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ -
హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ!
నేచురల్ యాక్టింగ్తో పక్కింటి కుర్రాడు అనిపించుకున్నాడు హీరో తరుణ్. వరుసగా హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఇతడికి తిరుగులేదు.. నెక్స్ట్ స్టార్ హీరో ఇతడే అనుకున్న తరుణంలో సడన్గా కనిపించకుండా పోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. అవేంటో అభిమానులకు కూడా సరిగ్గా తెలీని పరిస్థితి! ఈరోజు (జనవరి 8న) తరుణ్ బర్త్డే.. ఈ సందర్భంగా తరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..తల్లిదండ్రుల అడుగుజాడల్లో..సీనియర్ నటి రోజా రమణి, నటుడు సుశాంత్ చక్రపాణిల కుమారుడే తరుణ్. చిన్న వయసులోనే తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచాడు. నాయకుడు, అగ్ని నక్షత్రం, అంజలి, మనసు మమత, ఆదిత్య 369, పిల్లలు దిద్దిన కాపురం, తేజ వంటి సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. అంజలి మూవీకిగానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్'నువ్వే కావాలి' మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ మూవీ వందరోజులకు పైగా ఆడటంతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కొల్లగొట్టింది. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నవ వసంతం.. ఇలా ఎన్నో హిట్స్ అందుకోవడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్కి గుడ్బైదీంతో తమిళంలో అవకాశాలు రాగా అక్కడ కూడా రెండు సినిమాలు చేశాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడేసరికి కోలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. తరుణ్ను తెలుగులోనూ వరుస ఫ్లాపులు వెంటాడాయి. కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో మళ్లీ పరాజయాలే చూశాడు. 2018లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ మూవీలో చివరిసారిగా కనిపించాడు. ఇది డిజాస్టర్ అయ్యేసరికి సినిమాలే వదిలేశాడు.రీ ఎంట్రీ ఆలస్యం!అయితే 2023లో రోజా రమణి.. తరుణ్ రీఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఒక సినిమాతోపాటు ఒక వెబ్సిరీస్కు కూడా సంతకం చేశాడంది. కానీ, ఇంతవరకు వాటి గురించి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. లేటుగా వచ్చినా పర్లేదు కానీ మంచి కంటెంట్తో రీఎంట్రీ ఇస్తే అంతే చాలని కోరుకుంటున్నారు తరుణ్ అభిమానులు. తరుణ్ను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఏజెంట్ సమయంలో మాటిచ్చి నిలబెట్టుకున్నారు!
'నారీ నారీ నడుమ మురారి' సినిమా కథ విన్నప్పుడు మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందనిపించి, వెంటనే అంగీకరించాను. అంతేకానీ.. ఈ మూవీలో నా క్యారెక్టర్కు ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది? నాతో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను ఆలోచించలేదు. ఈ సినిమాకు స్టోరీ ఈజ్ కింగ్. మంచి వినోదాత్మక చిత్రం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని తెలిపింది హీరోయిన్ సాక్షి వైద్య.కామెడీ టైమింగ్ అద్భుతంశర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అమాయకంగా, చాలా నిజాయితీగా ఉండే నిత్య పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్గానూ రిలేట్ అవుతుంది. శర్వాగారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. సంయుక్తతో నాకు మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నారుతెలుగులో డైలాగ్స్ చెప్పడంలో దర్శకుడు రామ్గారు నాకు సాయపడ్డారు. నాకు మరోసారి అవకాశం కల్పిస్తానని ఏజెంట్ మూవీ సమయంలోనే నిర్మాత అనిల్ సుంకర గారు చెప్పారు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. అనూప్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదు. సంక్రాంతిని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఉత్తరాదితో సంక్రాంతి సెలబ్రేషన్స్ హడావుడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ కష్టం తనకు అవసరమే లేదు: కూతురిపై చిరంజీవి ప్రశంసలు -
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నాడు. పెద్ద కూతురు సుష్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, తండ్రికి స్టైలిస్ట్గా పని చేస్తోంది. అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి నిర్మాతగానూ మారింది. చిరు ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకర వరప్రసాద్గారు' మూవీని సాహు గారపాటితో పాటు మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూతురిపై ప్రశంసలు కురిపించాడు చిరంజీవి.ఇదంతా అవసరమా?'నా బిడ్డ సుష్మిత సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమ కచ్చితంగా ఆదరిస్తుందని చెప్పాను. మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారన్నాను. నేనయితే కష్టాలు చిన్నప్పుడే చూశాను. కానీ, నా కూతురు కష్టపడుతుంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా? అనిపించేది. తను మాత్రం ఒక బిడ్డగా మా నాన్నను ఇంప్రెస్ చేయాలి, నిర్మాతగా హీరోకు ది బెస్ట్ ఇవ్వాలి అని మామూలు టెక్నీషియన్లా ప్రయత్నించింది.నన్ను ఆదర్శంగా తీసుకునితనకు అన్నిరకాలుగా కంఫర్ట్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. కానీ తను అలా ఆలోచించలేదు, ఏదో సాధించాలనుకుంది. నువ్వు సాధించి చూపించావ్.. ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తాం అని ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలాగో హిట్టవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాను నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు తనెంతో సంతోషపడుతుందని నాకు తెలుసు.థాంక్యూ పాపఈ పరిశ్రమలో నాకు చేదోడువాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా అండదండలందిస్తూ.. ఇంటికి పెద్దదైనందుకు పెద్దరికాన్ని సొంతం చేసుకుంటూ తోడుగా ఉన్నందుకు థాంక్యూ పాప.. అన్నాడు. ఆయన స్పీచ్ విని సుష్మిత వెంటనే తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ మూవీ జనవరి 12న విడుదల కానుంది.చదవండి: హుక్ స్టెప్.. వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ -
ఆహా ఓహో..అస్సలు సినిమా ముందుంది అంటున్న ఐశ్వర్య!
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా ముందుంది’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి. -
ఆ డైరెక్టర్ భార్యను కొడితే కోమాలోకి వెళ్లింది: పూనమ్ కౌర్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్కి టచ్లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలనే ఓపెన్గా మాట్లాడడం.. పాలిటిక్స్తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనమ్కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా, చర్చనీయాంశంగానూ మారాయి. పలుమార్లు ఆమెపై ట్రోలింగ్ కూడా నడిచింది. అయినా కూడా పూనమ్ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్తో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురి చేశాడంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి.(చదవండి: ఎన్నో దారుణాలు చూశా.. నాకు విలువ లేదు.. అందుకే విడాకులు!)తాజాగా పూనమ్(Poonam Kaur ) ఓ యూట్యూబ్ చానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ..సోషల్ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ గతంలో పూనమ్ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా..దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఆమె వివరించింది.‘నేను ఊరికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టను. నా హార్ట్కు టచ్ అయిన విషయాల గురించే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె ఐదారు రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి.. హీరోయిన్తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’ అని పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు, హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది. -
హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట
మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. -
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ! Her name says it all. Angammal. Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchersWriter: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026 చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్ -
శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' తారలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన సినిమా విడుదలవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది.ఐశ్వర్య రాజేశ్ తెలుగమ్మాయే అయినా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్థిరపడింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇక్కడివారికి దగ్గరైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది.సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే..జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ 'జననాయకుడు' విడుదలవుతున్నాయి. జనవరి 10న శివకార్తికేయన్ 'పరాశక్తి', జనవరి 12న చిరంజీవి 'మన శంకర్ వరప్రసాద్ గారు', జనవరి 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', జనవరి 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగ ఓరాజు', శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' రిలీజవుతున్నాయి.చదవండి: వయసు గురించి ఆలోచించేదే లేదంటున్న చందమామ -
శివకార్తికేయన్కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్సింగ్లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్ -
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ -
వయసు గురించి ఆలోచించనంటున్న చందమామ
అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటోంది.ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది. -
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?)మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్గా ఎలా మారాడు?)ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్టైమ్నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
‘మన శంకరవరప్రసాద్’ కి సీక్వెల్ ఉందా?
ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే..అప్పడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే.. సీక్వెల్ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు. చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి కూడా సీక్వెల్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్ వరప్రసాద్’కి సీక్వెల్ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్ ఎండింగ్ మూవీ. క్లైమాక్స్లో పార్ట్ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
టాలీవుడ్ హీరోతో పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమన్నారంటే..
సినీ తారల ప్రేమ, పెళ్లి విషయాలపై పుకార్లు కామన్. వాళ్లు నిజంగా ప్రేమలో ఉన్నా లేకపోయినా సరే.. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చేస్తుంటాయి. అయితే కొంతమంది తారలు వాటిని లైట్గా తీసుకొని స్పందించకుండా ఉంటారు. మరికొంతమంది అయితే క్లారిటీ ఇస్తుంటారు. ఈ రెండో కోవాకు చెందిన హీరోయిన్నే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీపై ఇటీవల ఓ రూమర్ గట్టిగా వినిపించింది. అక్కినేని యంగ్ హీరో సుశాంత్తో మీనాక్షి(Meenakshi Chaudhary ) ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మీనాక్షి స్పందించింది. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.‘ఇలాంటి పుకార్లు విని నవ్వుకుంటాను. సుశాంత్, నేను మంచి స్నేహితులం మాత్రమే. మేమిద్దరం కలిసి నటించాం(మీనాక్షి తొలి సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సుశాంత్ హీరో). అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇండస్ట్రీలో అవన్నీ కామన్. రోజుకో గాసిప్ వస్తుంది. అవన్నీ నిజం కాదనీ అందరికీ తెలుసు. నేను కూడా వాటిని మైండ్కి తీసుకోను. అలా విని..ఇలా వదిలేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చెప్పుకొచ్చింది. మీనాక్షి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన పెళ్లి పుకార్లపై స్పష్టత ఇచ్చింది. -
సంక్రాంతికి రిలీజ్ అంటే చాలా మంది నమ్మలేదు : అనిల్ సుంకర
‘‘స్క్రిప్ట్ విని, ఈ కథతో సినిమా చేయగలమా? లేదా అనే ఓ జడ్జ్మెంట్కు రాగలగాలి. సినిమా రిజల్ట్ ఎలాగూ మన చేతిలో ఉండదు. అందుకే సినిమా స్క్రిప్ట్ లెవల్లోనే అన్నీ జాగ్రత్తగా చూసుకోగలగాలి. అఖిల్తో మేం చేసిన ‘ఏజెంట్’ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. దాంతో ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. అందుకే మంచి స్క్రిప్ట్తో వస్తేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే ఆ సినిమా బాగున్నట్లే’’ అని చె΄్పారు నిర్మాత అనిల్ సుంకర. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘నారీ నారీ నడుమ మురారి’ పండగ మూవీ. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ మంచి క్యారెక్టర్ చేశారు. శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేశారు. ఒకే ఆఫీసులో ఓ అబ్బాయి మాజీ ప్రేమికురాలు, ఆ అబ్బాయి ప్రస్తుత లవర్ ఉంటే... ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. మా సినిమాను మేం సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటే చాలా మంది నమ్మలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ మేం ముందుగా చెప్పినట్లే సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో ‘దిల్’ రాజుగారు, వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్లో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇక సంక్రాంతి సీజన్లో నాలుగైదు సినిమాలు రావడం అనేది కామన్. ఈ సీజన్లో విడుదలైన సినిమాలన్నీ హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మన తెలుగు చిత్రాలతో పాటు అనువాద చిత్రాలూ విడుదలవుతున్నాయి. అయితే కంటెంట్ బాగున్న సినిమాలకే ప్రేక్షకాదరణ లభిస్తుంది. ‘నారీ నారీ నడుమ మురారి’కి ఓటీటీ డీల్ పూర్తయింది. నూతన నటీనటులతో ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే మూవీ చేయబోతున్నాం. అడివి శేష్తో ‘గూఢచారి 2’ రాబోతోంది. సాయిదుర్గాతేజ్, తేజ సజ్జాలతో సినిమాలున్నాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘ఏజెంట్’ సినిమా విఫలమైంది. అఖిల్కు ఓ హిట్ ఇస్తే ఆ బాధ పోతుంది. ‘భోళా శంకర్’ సినిమాకూ సరైన ఫలితం రాలేదు. ఇదే సినిమా నాలుగేళ్ల క్రితం విడులై ఉంటే, బాక్సాఫీస్ ఫలితం మరోలా ఉండేది’’ అని పేర్కొన్నారు. -
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
రాత్రికి రాత్రే ఫేమస్ అయినవారిలో మరాఠి నటి గిరిజ ఓక్ ఒకరు. ఈమె నటిగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ చిన్న ఇంటర్వ్యూ క్లిప్ వల్ల సడన్గా ఒక్క రోజులోనే వైరల్ అయిపోయింది. అందులో ఆమె నీలిరంగు చీర కట్టుకుని సింపుల్గా కనిపించింది. ఈ వైరల్ ఫేమ్ వల్ల తన సినిమాలు ఎక్కువమంది చూస్తే చాలని ఆశపడుతోంది.అమ్మ గురించి ఎప్పుడూ..తాజాగా తొలిసారి ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. నేను మా అమ్మ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇన్ని గంటలు మాత్రమే పనిచేయాలనే నిబంధన అంటూ ఏమీ ఉండదు. దానివల్ల నేను కొన్నిసార్లు 10-12 గంటలపాటు షూటింగ్లో ఉండేదాన్ని. కొన్నిసార్లు 16 గంటలపాటు ప్రయాణించి సెట్కు వెళ్లేదాన్ని.ఒంటరిగానే..పెళ్లికి ముందు, తర్వాత కూడా ఒంటరిగానే వెళ్లేదాన్ని. కానీ రోజంతా పనిచేసి ఇంటికొస్తే.. ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ నాతో ఎందుకు లేదు? అనిపించేది. ఆమె నాతో లేకపోవడానికి ఓ కారణం ఉంది. నా పెళ్లవడానికి ముందే తను రెండో పెళ్లి చేసుకుంది. అయితే నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోవడం అస్సలు తట్టుకోలేకపోయాను. సైకియాట్రిస్ట్ను కలిశా.. 17 ఏళ్ల వయసులోనే తొలిసారి థెరపీ తీసుకున్నాను. కొన్నేళ్లపాటు ఆ థెరపీలు కొనసాగించాను. సాక్షి సంతకంసినిమా షూటింగ్స్కు వెళ్లొచ్చాక ఇంట్లో అంతా నిశ్శబ్ధంగా ఉండేది. అమ్మ నాతో ఉంటే.. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా భోజనం సిద్ధం చేసేది, నాతో కబుర్లు చెప్పేదని ఫీలయ్యేదాన్ని.. తనను బాగా మిస్ అయ్యేదాన్ని! ఏదేమైనా అమ్మ తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. ఆ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అమ్మ ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. తన రెండో పెళ్లికి నేను సాక్షి సంతకం పెట్టాను అని చెప్పుకొచ్చింది. గిరిజ ఓక్.. హిందీలో తారే జమీన్పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె వంటి చిత్రాల్లో నటించింది. మరాఠిలో అనేక చిత్రాలు చేసింది.చదవండి: చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా ఇవ్వలేదు: హీరో -
డబ్బు, హోదా ఎంతున్నా అనాథలా అనిపిస్తోంది!
ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్ గతేడాది చివర్లో ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడ్డ ఆయన డిసెంబర్ 4న ఉదయం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఎంతోమంది సినీప్రముఖులు ఆయన్ను చివరిసారిగా చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఏవీఎం స్కూల్లో శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆయన నాకు చాలా క్లోజ్ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. శరవణన్తో నేను 11 సినిమాలు చేశాను. ఆయన తన ఆఫీసులో కూర్చునే.. చాలామందికి అనేక హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. కేవలం సినిమాపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు చాలా క్లోజ్. శివాజీ సినిమా తర్వాత ఆయన నాకో సలహా ఇచ్చాడు.అనాథగా మిగిలా..ఏజ్ పెరిగేకొద్దీ మరింత బిజీగా ఉండాలన్నాడు. కనీసం ఏడాదికో సినిమా అయినా చేయమని సూచించాడు. ఇప్పటికీ నేను ఆ సలహా పాటిస్తున్నాను. మనకు నచ్చినవారిని కాలం తనకు నచ్చినప్పుడు తీసుకెళ్లిపోతుంది. ఎంత డబ్బు, హోదా ఉన్నా సరే నచ్చినవాళ్లు దూరమైనప్పుడు అనాథగా మిగిలాం అన్న భావన కలగకమానదు. శరవణన్ సర్ చాలా గొప్ప వ్యక్తి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.గర్వంగా ఫీలవుతున్నా.కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఏవీఎమ్ కుటుంబానితో కలిసి పని చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఏవీఎమ్ స్కూల్ లేదు. ఒకవేళ ఉండుంటేనా.. నేను కూడా అదే పాఠశాలకు వెళ్లేవాడిని. నేను ఏదైనా తప్పులు చేస్తే శరవణన్ నాపై అరిచేవాడు కాదు.ఏవీఎమ్ బ్యానర్ ద్వారా పరిచయంకానీ, నేనేదైనా మంచి చేస్తే మాత్రం అందరిముందు పొగిడేవాడు, సంతోషపడేవాడు అని పేర్కొన్నాడు. కమల్ హాసన్.. ఏవీఎమ్ బ్యానర్ ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు. 1960లో వచ్చిన కలతుర్ కన్నమ్మ సినిమాకుగానూ కమల్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.చదవండి: సంధ్య థియేటర్లో దారుణం.. లేడీస్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా -
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొలిసారి..అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.సినిమాకాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) చదవండి: రామ్చరణ్తో అనిల్ రావిపూడి సినిమా -
జన నాయగణ్ Vs పరాశక్తి.. విజయ్ రియాక్షన్ ఇదే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ మూవీ విడుదలవుతోంది.పొంగల్కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్ మూవీ అక్టోబర్లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్కు వద్దామని ఆకాశ్ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జన నాయగణ్ మూవీ పొంగల్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్కు ఫోన్ చేసి మనం రిలీజ్ పోస్ట్పోన్ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్ మేనేజర్ జగదీష్కు ఫోన్ చేసి.. జననాయగణ్ రిలీజ్ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. విజయ్తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు. -
నా హృదయం ముక్కలు.. హద్దులు మీరుతున్నారు: దర్శన్ భార్య
వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్లైన్ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్లో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నాకే ఇలా జరుగుతుందంటే..కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్లైన్లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.నిశ్శబ్ధాన్ని వీడండితప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.జైలు జీవితంఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్ జైలు జీవితం గడుపుతున్నాడు.చదవండి: సినిమా ఫ్లాప్.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్ నటి -
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్వీర్లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్ సీఎం అవుతాడు: నటుడు సుమన్ -
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14) -
హీరో విజయ్ సీఎం అవుతాడు: సుమన్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.జనాల్లో అనుమానాలుతాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.సినిమా వదిలేయాల్సిందే!ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేంఅందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. విజయ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్మీరు షూటింగ్కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు -
సుమన్ చేతుల మీదుగా ‘రాయుడు గారి తాలుకా’ పోస్టర్ రిలీజ్!
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మిస్తున్నారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈమూవీ నుంచి టైటిల్ పోస్టర్ని ప్రముఖ నటుడు సుమన్ గారు విడుదల చేస్తూ.. చిత్రబృంధానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి గారు మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్ పోస్టర్ని సుమన్ గారు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓ డిఫరెంట్ కంటెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటీనటులు అంతా కొత్తవారే అయినప్పటికీ.. చాలా బాగా నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మంచి కంటెంట్లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లేని శ్రీనివాస్ ఉలిశెట్టి అందించగా.. నగేశ్ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్గా, ఎంజే సూర్య ఎడిటర్గా పని చేస్తున్నాడు. -
'నారీ నారీ నడుమ మురారి' మూవీలో మరో హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి బరిలో సినిమాలుసంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ 'రాజాసాబ్', విజయ్ 'జననాయగణ్' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి. A special addition, a special announcement! 📢The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️🔥Get ready for laughter overload! 😂🔥Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿Charming Star @ImSharwanand… pic.twitter.com/XrmD6fRh5b— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026 చదవండి: జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ -
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్సానియత్కే దుష్మన్' అప్పుడే రిలీజైంది. చున్నీ లాగే సీన్..ఆ మూవీ చూడమని మా పేరెంట్స్కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. చెడామడా తిట్టారుఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు. నెగెటివ్ రోల్స్ వల్లే..నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్. -
ద్రౌపది 2 మూవీలో తుగ్లక్ పాత్ర
దర్శకుడు మోహన్.జి ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రం ద్రౌపది. ఆ మూవీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా ద్రౌపది 2 తెరకెక్కుతోంది. రిచర్డ్ రిషి, రక్షణ జంటగా నటించిన ఇందులో నట్టి నటరాజ్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, చిరాగ్ జానీ, దివి, దేవయాని శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి జిఎం ఫిలింస్ కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించారు.ద్రౌపది 2 విశేషాలుఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు యూ/ఏ సర్టిఫికెట్ పొంది త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ సహా, ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కాగా 14వ శతాబ్దానికి చెందిన తమిళ చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో ద్రౌపది 2ని తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు ప్రతినాయకులు నటిస్తున్నారని.. అందులో ప్రధానంగా నటుడు చిరాగ్ జానీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్ర పోషించారని వెల్లడించారు. అతి తెలివి కలిగిన తుగ్లక్ పాత్ర తెరపై ఆవిష్కరించడం కాస్త కష్టంగా మారిందని, కానీ, చిరాగ్ జానీ సమర్థవంతంగా పాత్రను పోషించారని తెలిపారు. ఈ మేరకు చిరాగ్ జానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. Terror Wears A Crown 👑Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026 -
సినిమా నచ్చకపోతే మందుబాటిల్ ఇప్పిస్తా: దర్శకుడు
శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించగా వరుణ్రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సక్సెస్ మీట్పాజిటివ్ టాక్తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్ ఆడియన్స్ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు. మందు తాగి లొల్లి పెడదాంకానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. క్వాటర్ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్ ఇప్పిస్తా.. అన్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
శత్రువులు కూడా మిత్రువులే.. 'అద్దం' స్పెషల్ గిఫ్ట్!
తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్ గిఫ్ట్ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.శత్రువుల్లేరుట్రోల్స్ను ఎలా డీల్ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.ముందడుగుపర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.నాలుగు పెళ్లిళ్లుబాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
హీరోగా అకీరా నందన్.. రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్- పవన్ కల్యాణ్ల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్ కానీ, ఇటు రేణూ దేశాయ్ కానీ కచ్చితంగా చెప్పడం లేదు. కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే తనకు చాన్స్ ఇస్తే..అకీరాతో పాన్ వరల్ట్ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని.. అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్ అడగ్గా.. ‘ఈ టాపిక్ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు. -
పోకిరి విలన్కు యాక్సిడెంట్.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.యాక్సిడెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమాఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
'మగాడిలా తయారవుతున్నావ్'.. నటి కూతురి కౌంటర్
మలయాళ నటి, యాంకర్ మంజు పిళ్లై- దర్శకుడు, కొరియోగ్రాఫర్ సుజిత్ వాసుదేవన్ల కూతురు దయ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. కాస్త బొద్దుగా ఉన్నందుకు కొందరు తనపై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది. ఇటీవలే ఆమె జిమ్కు వెళ్లడం మొదలుపెట్టగా.. రానురానూ మగాడిలా తయారవుతున్నావని ఓ వ్యక్తి విమర్శించాడు.నీకు మగతనం లేదుదీనిపై దయ సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చింది. నాలో మగతనం ఉందని, జిమ్కు వెళ్తే పూర్తిగా మగాడినైపోతానని ఓ వ్యక్తి అన్నాడు. నాలో ఈ మగతనం నీకు అసౌకర్యాన్ని కలిగిస్తే సారీ.. నాలోని ఈ మగతనాన్ని అంగీకరించేంత పౌరుషం మీకు లేకపోవడం బాధగా ఉంది. మీరు నాకంటే పెద్ద మగాడినని ఒప్పుకునేంత మగతనం లేకపోవడం విచారకరం అని పేర్కొంది. View this post on Instagram A post shared by jaaannuuuu (@daya.sujith) చదవండి: హిందీలో డియర్ కామ్రేడ్? స్పందించిన బాలీవుడ్ హీరో -
సోఫాపై నగ్నంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా?
పలు చిత్రాల్లోనూ... వెబ్ సిరీస్ల్లోనూ కథానాయకుడిగానూ, కీలక పాత్రల్లోనూ నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్యరావు. ఒకవైపు హీరోగా నటిస్తూనే..మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన అనుష్క ‘ఘాటీ’ సినిమాలో విలన్గానూ నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ విలక్షణ నటుడు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు) విడుదల చేసి చిత్ర యూనిట్ను అభినందించారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ను గమనిస్తే..దుస్తులు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావును చూడొచ్చు. తను రగ్డ్ లుక్తో స్క్రీన్ను సీరియస్గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్నెస్ను తెలియజేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయకుండా , పాత్రలు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ కలుగుతుందిఈ సందర్భంగా... చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్స్, సెన్సిబుల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్గారు.. మరోసారి ‘దిల్ దియా’తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించటానికి సిద్ధమవుతున్నారు. చైతన్యరావు మదాడిని న్యూ అవతార్లో చూడబోతున్నారు. రా ఎమోషన్స్ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్ను సినిమాటిక్ లాంగ్వేజ్లో దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ‘దిల్ దియా’ను సమ్మర్లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. చైతన్యరావు మాదాడి, ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film 🔥 WISHING YOU ALL THE LUCK 🤗CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026 -
హిందీలో డియర్ కామ్రేడ్? దాని జోలికే వెళ్లనన్న హీరో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో 'కబీర్ సింగ్'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్ పాత మూవీ 'డియర్ కామ్రేడ్' ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.రీమేక్స్ జోలికి వెళ్లనుతాజాగా ఈ రూమర్స్పై సిద్దాంత్ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు.అంతా గందరగోళంఅటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.సినిమాసిద్దాంత్ చతుర్వేది చివరగా 'ధడక్ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్ పెరుమాల్' (2018)కి రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్ కామ్రేడ్' విషయానికి వస్తే.. ఇందులో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. -
రూ.70 కోట్ల సినిమా.. 2.19 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ!
గతంలో స్టార్ హీరో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే..బలమైన కంటెంట్తో రాకపోతే ప్రేక్షకులు థియేటర్స్ వైపే వెళ్లడం లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..సినిమాకు మినిమం కలెక్షన్స్ రావడం లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ సినిమాకు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆయన నటించిన వృషభ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ డిజాస్టర్గా నిలిచింది.దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొత్తంగా రూ. 2.19 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు శాతం మాత్రం రికవరీ చేసింది. ఓవర్సీస్లో అయితే ఈ మూవీ 8 రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ. 1.94 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో అయితే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. తొలి రోజు రూ. 10 లక్షలు వస్తే..నాలుగో రోజు కేవలం రూ. లక్షకు మాత్రమే పరిమితమైంది. తెలుగు వెర్షన్లో మొత్తంగా రూ. 32 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు రూ. 65 కోట్లకు పైనే నష్టం వచ్చేలా కనిపిస్తుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
శంబాల.. వారం రోజుల్లో ఎంతొచ్చిందంటే?
హిట్టు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాడు హీరో ఆది సాయికుమార్. తన కంటే ఎక్కువగా అతడి తండ్రి, నటుడు సాయికుమార్ నిరీక్షిస్తున్నాడు. వీరి ఎదురుచూపులకు తెరదించుతూ 2025 ముగింపులో భారీ విజయం సొంతమైంది. శంబాల సినిమాతో ఆది హిట్టు కొట్టాడు. తండ్రి సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సమయంలో ఈ సక్సెస్ రావడం మరింత విశేషం! వారం రోజుల్లోనే అన్ని కోట్లా?శంబాల విషయానికి వస్తే ఆది హీరోగా, అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. శంబాల సక్సెస్తో ఆదికి మంచి బూస్ట్ దొరికినట్లయింది! #Shambhala pic.twitter.com/Bmc71qEtbb— Aadi Saikumar (@iamaadisaikumar) January 2, 2026 చదవండి: భార్యకు విడాకులు! మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు -
ఆడదానికే ఎందుకు? మగవాడికి నేర్పించండి: రోహిణి
పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటోంది ప్రముఖ నటి రోహిణి. మనం పాటించే మంచి అలవాట్లను వారు కూడా అనుసరించేలా చూడాలని చెప్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో రోహిణి పాల్గొంది. ఈ సందర్భంగా తనను కన్నది తెలుగు తల్లి అయితే పెంచింది తమిళ తల్లి అని పేర్కొందిం.చిన్నప్పటి నుంచే..ఆమె ఇంకా మాట్లాడుతూ... సమాజం నాకు స్త్రీ పాత్ర ఇచ్చింది. స్త్రీ అంటే మగాడికన్నా తక్కువ.. వాళ్లంత చదవనవసరం లేదు, వాళ్లకున్న హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సమానత్వం లేదని తెలిసింది. చిన్నప్పటినుంచే ఇలా కూర్చోవాలి, వంట చేయాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని చెప్తారు. ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు మా పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు చెప్తుంటారు. కొడుక్కి మాత్రం.. ఈ పని చేయొద్దు, ఆడదే చేస్తుంది అని అమ్మ చెప్తుంది. జీతాల్లేని శ్రామికులంఅలా కాకుండా.. మీ ఇద్దరూ కలిసి పనిచేయాలిరా అని అమ్మ చెప్పి పెంచితే ఎంత బాగుంటుంది. సమాజంలోని ఎన్నో విషయాలను సరిచేసే శక్తి మహిళకు ఉంది. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే ఆడవాళ్ల గురించి పట్టించుకోవాలి. మనం జీతాల్లేని శ్రామికులం. పుట్టుకతోనే శ్రామికులం. అన్నం ఎవరు వండినా ఉడుకుతుంది. ఆడదాని చేత్తో వండితేనే అన్నం అవుతుందా? అబ్బాయిలకు కూడా అన్నీ నేర్పండి. మా అబ్బాయికి కూడా..సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. దీనివల్ల యువత పక్కదారి పడుతుంది. ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. బట్టలు వేసుకునే బయటకు వెళ్లాలి.. ఒంటిపై డ్రెస్ లేకుండా వెళ్లకూడదని పిల్లలకు చిన్నప్పుడే చెబుతున్నాం.. దాన్ని అలవాటు చేశాం. ఇక్కడ ఆడవాళ్లం చీరలు కట్టుకుంటాం. లండన్లో షార్ట్స్, స్కర్ట్స్,గౌన్ వేసుకుంటారు. మన అలవాట్లనే పిల్లలకు నేర్పించి మంచిదోవ పట్టించాలి. మా అబ్బాయికి కూడా అదే చెప్తుంటాను. చెడు అలవాట్ల వల్ల వచ్చే కష్టనష్టాలను చెప్పి దానిజోలికి వెళ్లకుండా చూసుకోవాలి అని రోహిణి చెప్పుకొచ్చింది.చదవండి: కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు లోక ఆఫర్ -
కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు 'లోక' ఆఫర్!
మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం లోక. కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ ఉమెన్ చిత్రం లోక. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొత్త లోక: చాప్టర్ 1 పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. 2025 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కల్యాణి ప్రియదర్శన్ కంటే ముందు పార్వతి తిరువోతును సంప్రదించినట్లు ఓ రూమర్ ఉంది.హీరోయిన్ అసహనంతాజాగా ఈ రూమర్పై పార్వతి సీరియస్ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతమదృష్ట్య కుట్టకర్. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్ వచ్చిందా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికామె స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం. మీరు ఇలాంటివి చాలా వింటుంటారు. మీకు నచ్చింది వినుకోండి అని బదులిచ్చింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలిస్తా: నటికి బంపరాఫర్ -
భార్యతో తెగదెంపులు, మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు
పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.మళ్లీ కలిసే ప్రసక్తే లేదుఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. లోపించిన సఖ్యతమూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది. ముగ్గురు పిల్లలుఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు. సీరియల్స్, సినిమాదివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్ 'నరనాతు తంపురాన్' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్, పంచాంగి వంటి సీరియల్స్ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్ -
అందుకే ‘రాజాసాబ్’ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
పొలిటికల్ ఎంటర్ టైనర్గా ‘ధర్మస్థల నియోజకవర్గం’
వరుణ్ సందేశ్ ,వితికా షేరు, సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిమూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుo భాస్కర్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ "మా చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్ సుమన్ లతోపాటు యంగ్ హీరోస్ కూడా నటించారు.మంచి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. చంద్ర బోస్ గారు అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్ కు సునీత గారు వినసొంపైన వాయిస్ ఇచ్చారు. అన్ని హంగుల్తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం . తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు . -
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన 'సు ఫ్రమ్ సో' నటి
కన్నడ నటి సంధ్య అరకెరె త్వరలో తల్లి కాబోతోంది. 'సు ఫ్రమ్ సో' మూవీలో సులోచన కూతురిగా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సంధ్య. అంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కన్నడ మూవీ 'సు ఫ్రమ్ సో'తో విశేష గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో సక్సెస్ అందుకుంటున్న ఈ నటి పర్సనల్ లైఫ్లో అంతకుమించి సంతోషంగా ఉంది. కారణం.. తానిప్పుడు గర్భవతి!బేబీ బంప్ ఫోటోలు2025 డిసెంబర్లో ఆమె సీమంతం జరిగింది. ఇప్పుడేమో భర్త, నటుడు శోధన్ బర్సూర్తో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ చేయించుకుంది. బేబీ కోసం వెయిటింగ్.. అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కుట్టి సంధ్య కోసం మేము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. రంగస్థల కళాకారిణి అయిన సంధ్య.. 'హిందే గాళి ముందె మత్తే' అనే షార్ట్ ఫిలింలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Sandhya Arakere (@sandhyaarakere) View this post on Instagram A post shared by Sandhya Arakere (@sandhyaarakere) చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ -
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్కు వెళ్లినా, ఫంక్షన్కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్బాస్ హౌస్కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్బాస్ హౌస్లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్


