breaking news
Cinema News
-
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది. -
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్వకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ ఏవీ లేవు: నటి -
గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్ విన్నారా?
'బేబి' సినిమా జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్". 90's సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్ అందుకున్నాడు. గోరేటి వెంకన్న నోట..వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్మెంట్ను పాటలో చూపించారు. ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చదవండి: అప్ప ట్లో వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి -
వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
ఇప్పుడంటే సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ లేనేలేవంటోంది సీనియర్ నటి సుప్రియ పాఠక్. 1980వ దశకంలో సెట్లో కనీస వసతులు లేకపోయినా పెద్దగా లెక్కచేయలేదని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ పాఠక్ మాట్లాడుతూ.. మేము ప్యాషన్తో యాక్ట్ చేసేవాళ్లం. మాకిచ్చిన పాత్రలను తప్ప మిగతా వేటినీ మేము పట్టించుకునేవాళ్లం కాదు. కానీ రానురానూ కొన్ని విషయాలు పట్టించుకోవాలని అర్థమైంది. బాత్రూమ్స్ తప్పనిసరిషూటింగ్ గ్యాప్లో కూర్చోవడానికి కొంత ప్లేస్ కావాలి. మహిళలకు ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండాలి. ఇవి కనీస అవసరాలు అని తెలుసుకున్నాం. సెట్లో అందరూ నిలబడి ఉన్నప్పుడు నిర్మాతలకు కూడా అర్థమైంది. కనీసం కూర్చోవడానికి ఏదైనా వసతి కల్పించాలని వాళ్లూ రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్కు వెళ్లినప్పుడు వాష్రూమ్స్ వసతి అనేది ఉండదు.కనీస వసతి అవసరంచలిలో లేదా ఎండలో షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు, టీ అనేవి అందించడం కూడా ముఖ్యమే! ఇప్పుడు షూటింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదాహరణకు 'మిర్చి మసాలా' సినిమా షూటింగ్ ఒక పల్లెలోని మిర్చి ఫ్యాక్టరీలో జరిగింది. నాతోపాటు పది మంది మహిళలు ఫ్యాక్టరీలో షూటింగ్లో పాల్గొన్నారు. రోజంతా మిర్చి ఫ్యాక్టరీలో..అసలే ఎండలు మండిపోతుంటే ఆ ఘాటు తట్టుకుని రోజంతా అక్కడే ఉండేవాళ్లం. వెనకాల ఉన్న గడ్డికుప్పలపై సేదతీరేవాళ్లం. అది పెద్ద సమస్యలా ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే మేమంతా ప్యాషన్తో పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పుకొచ్చింది.సినిమాసుప్రియ పాఠక్.. గుజరాతీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కలియుగ్, బజార్, రామ్లీలా, మాసూమ్, మిర్చి మసాలా వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అరవింద సమేత వీర రాఘవలో జేజిగా, గద్దలకొండ గణేశ్లో హీరో తల్లిగా యాక్ట్ చేసింది. చివరగా అస్సి అనే హిందీ చిత్రంలో కనిపించింది. కిచిడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. -
ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా సినిమాల్ని వదిలేయడం బాధాకరం!
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. నేరం అనే ద్విభాషా(తమిళ, మలయాళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. రాజా రాణి సినిమాతో ఎక్స్ప్రెషన్స్ క్వీన్గా పేరు తెచ్చుకుంది నజ్రియా నజీమ్. ఈ ఒక్క మూవీతో సౌత్లో సెన్సేషన్ అయిపోయింది. ఆ క్రేజ్తోనే వరుసగా సినిమాలు చేసింది. 2014వ సంవత్సరంలో నాలుగు మలయాళ మూవీస్లో మెరిసింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం!అదే ఏడాది ఆగస్టులో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పన్నెండేళ్ల కాలంలో మలయాళంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు చేసింది. అందులోనూ ఒకటి గెస్ట్ రోల్! నజ్రియా మలయాళంలో అదే స్పీడుతో సినిమాలు చేసుంటే బాగుండేదంటోంది సీనియర్ నటి ఊర్వశి.ఫహద్ గొప్ప యాక్టర్తాజాగా ఊర్వశి మాట్లాడుతూ.. నా ఫేవరెట్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. అతడెప్పుడూ హీరోయిజం చూపించే పాత్రలు చేయడు. తన గుండును విగ్గుతో కవర్ చేయడానికీ ప్రయత్నించడు. తను తనలాగే ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా నటిస్తాడు. ఇంకాస్త గట్టిగా కష్టపడితే తనకు మంచి కెరీర్ ఉంది. బసిల్ జోసెఫ్ కూడా గొప్ప నటుడే!నజ్రియా గొప్ప నటిహీరోయిన్స్ విషయానికి వస్తే మీరా జాస్మిన్, నవ్య నాయర్.. ఇలా చాలా మంది మంచి పర్ఫామెన్స్ ఇస్తారు. కానీ, నజ్రియా సినిమాల్లో యాక్టివ్గా ఉండుంటే తనంత గొప్ప నటి మరొకరు ఉండేవారు కాదు. పల్లెటూరి అమ్మాయి, మోడ్రన్ గర్ల్, తెలివైన యువతి.. ఇలా అన్ని రకాల పాత్రలు ఇట్టే చేయగలదు. తనకు మంచి టాలెంట్ ఉంది.. అయినా ఇలా సినిమాలను వదిలేయడం కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది.చదవండి: ధురంధర్ 2 తర్వాత ఆ సినిమాకు సంతకం చేసిన సారా అర్జున్? -
మరో సినిమా ఒప్పుకున్న ధురంధర్ హీరోయిన్?!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్ 2తో ముందుకు రాబోతోంది.రూమర్స్పై క్లారిటీఅయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో సారా.. హీర్ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్పై కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. నేనే చెప్తా..ప్రస్తుతం మేమంతా ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్ 2 తర్వాతే సారా తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్గా ధురంధర్ 2 వస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్ ఇండియావైడ్గా విడుదల కానుంది. Sara Arjun has not signed any other film. We are just waiting for D 2. She has not signed any film and has not met anyone regarding any project. So please relax, guys. I will personally update you about her next project. Just wait all the other news is only rumours🥰🧿❤️ pic.twitter.com/njCE7MsKIR— Mukesh Chhabra CSA (@CastingChhabra) March 7, 2026 చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు -
విడాకులు.. తాగుడుకు బానిసయ్యా.. చావే దిక్కనుకున్నా!
విడాకుల బాధ భరించలేక మద్యపానానికి బానిసయ్యానంటున్నాడు మలయాళ నటుడు భగత్ మాన్యుయెల్. చావు అంచులదాకా వెళ్లిన తనను స్నేహితులే కాపాడారని చెప్తున్నాడు. భగత్ మాన్యుయెల్ గతంలో డాలియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2017లో బాబు పుట్టాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2019లో జుంబా ట్రైనర్ షెలిన్ చెరిన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తనతో సంతోషంగా ఉంటున్నాడు.లవ్ మ్యారేజ్మొదటి పెళ్లి గురించి భగత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. మేము విడాకులు తీసుకుంటామని కలలో కూడా అనుకోలేదు. మా బంధం తెగిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. తాగడం మొదలుపెట్టాను. నా కొడుకు బాధ్యత నేనే తీసుకున్నాను. ఏరోజూ ఒంటరిగా..వాడి బాగోగులు మా అమ్మానాన్నే చూసుకున్నారు. నేను సమస్యలతో సతమతమవుతున్న సమయంలో నా ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉన్నారు. వాళ్లందరూ నేను కూడా బిజీగా ఉన్నానని అనుకున్నారు. కానీ ఒంటరిగా కూర్చుని తాగుతూ ఉండేవాడిని. జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. చచ్చిపోవాలనుకున్నాను. తర్వాత నా పరిస్థితి తెలుసుకుని స్నేహితులే నన్ను ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆరేడునెలలపాటు నన్ను ఏ రోజూ ఒంటరిగా వదిలేయలేదు.ఆటోలోనే షూటింగ్కు..ఏడేళ్ల క్రితం నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నా భార్య నాకెంతో సపోర్ట్గా నిలబడింది. కరోనా సమయంలో అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా ఫ్రెండ్స్ వల్లే అమ్మ ఈరోజు జీవించి ఉంది. ఇప్పుడు నాకు కారు కూడా లేదు. ఆటో, బస్సుల్లోనే షూటింగ్స్కు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చాడు. భగత్.. మలర్వాడి ఆర్ట్స్ క్లబ్, మాస్టర్స్, ఉస్తాద్ హోటల్, ఆడు 2, గూడలోచన, మందారం, ఉయరె, ఫోనిక్స్, గెట్ సెట్ బేబీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు.చదవండి: ముక్కలైన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా: హంసనందిని -
రీమేక్ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్లకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం. -
పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్ మేనమామ
చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్ అవదని అంటుంటేవాడని విజయ్ మేనమామ, నటుడు, నిర్మాత యశ్ రంగినేని చెప్తున్నాడు.పెళ్లి వద్దని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్ రంగినేని మాట్లాడుతూ.. విజయ్ పెళ్లి గురించి పాజిటివ్గా ఉండేవాడు కాదు. కెరీర్ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్ కామ్రేడ్ నుంచి విరోష్ (విజయ్- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. ఇంట్లో చెప్పగానే..ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. తలరాత చెప్పలేంఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్ను రౌడీ బాయ్లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్. టాక్సీవాలా రిలీజ్కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. దుఃఖం ఆపుకోలేక..ఆ విషయం తెలిసి విజయ్ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ -
10 రోజులకే అన్ని కోట్లా? కమల్కు కళ్లు చెదిరే పారితోషికం
రెండేళ్ల క్రితం వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రముఖ పాత్రలు పోషించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది.రెమ్యునరేషన్కే అంత బడ్జెట్అయితే ఈ బడ్జెట్లో ఎక్కువ భాగం తారల రెమ్యునరేషన్కే సరిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్ రూ.150 కోట్లు తీసుకోగా అమితాబ్, బిగ్బీ, దీపికా పదుకొణె చెరో రూ.20 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతలోనే సౌత్ ఇండియా స్టార్ కమల్ హాసన్ ఏకంగా రూ.100 కోట్ల మేర పుచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇవేవీ కాదు, అంతకుమించి పారితోషికం తీసుకున్నాడని తమిళ నటుడు యుగి సేతు వెల్లడించాడు.10 రోజులకే అన్ని కోట్లా?తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్ సర్ కల్కి సినిమాలో 20 రోజుల కాల్షీట్లకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని కమల్ బర్త్డేరోజే చెప్పాను. ఓసారి కల్కి నిర్మాత అశ్వినీదత్ను కలిశాను. నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు థాంక్యూ సర్..20 రోజులు ఎక్కడ?20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదన్నాను. వెంటనే ఆయన కలగజేసుకుని నాకు 20 రోజులు ఎక్కడిచ్చారు, 10 రోజుల డేట్సే ఇచ్చారు అని చెప్పాడు. అప్పటిదాకా కమల్ రోజుకు సుమారు రూ.8 కోట్లు సంపాదించాడనుకున్నాను, కానీ రోజుకు రూ.15 కోట్లు ఇచ్చారని తర్వాతే తెలిసింది అని యుగి పేర్కొన్నాడు.సినిమాబ్లాక్బస్టర్గా నిలిచిన కల్కి 2898 ఏడీకి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్టార్ నటీనటులందరూ సెకండ్ పార్ట్లోనూ కనిపించనున్నారు. దీపికా పదుకొణెను మాత్రం సీక్వెల్ నుంచి తప్పించారు. ఈ రెండో భాగంలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్కు ఎక్కువ నిడివి దక్కనుంది.చదవండి: అదృష్టవంతురాలిని.. కన్నీళ్లు ఆగడం లేదు: తనూజ -
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటించిన చిత్రం బ్యాండ్మేళం. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ జంట సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆన్స్క్రీన్లో ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఆఫ్స్క్రీన్లోనూ లవ్లో ఉందని ప్రచారం జరుగుతోంది. లవ్ రూమర్స్ఇదెంతవరకు నిజం? అని యాంకర్ ప్రశ్నించాడు. అందుకు రోషన్, శ్రీదేవి స్పందిస్తూ.. కోర్ట్ మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్టులం.. ఎలా పరిచయమయ్యామో గుర్తు లేదు కానీ ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే ఇంత క్లోజ్గా ఉంటాం. ఒరేయ్, పోరా అని పిల్చుకుంటాం.అది చూసి నవ్వుకుంటాంకోర్ట్ సినిమా సమయం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా మారాం. తెరపై మమ్మల్ని చూసి ప్రేమికులు అనుకుంటారు. ఆ కామెంట్స్ చూసి మేము నవ్వుకుంటాం. కానీ, మేము మంచి మిత్రులం మాత్రమే.. మా మధ్య ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం మిత్రులమే అని నొక్కి చెప్పారు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద ఎంత గట్టి సౌండ్ చేస్తుందో చూడాలి!చదవండి: ఆస్తి చూసి పెళ్లి? బిగ్బాస్ బ్యూటీ ఆన్సరిదే! -
నా తల్లి నుంచి కోడలి వరకు..: చిరంజీవి పోస్ట్
స్త్రీ లేనిదే సృష్టి లేదు, సమాజం లేదు. అసలు మహిళ లేనిదే మనుగడే లేదు. నేడు (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు, ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.మూవీస్సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి చివరగా మన శంకరవరప్రసాద్గారు సినిమాతో అలరించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురిగా అనస్వర రాజన్ కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే మోహన్లాల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారట! నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు,నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు,ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు.ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2026చదవండి: సెకండ్ హ్యాండ్ దుస్తులు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్ -
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్
వీకెండ్కి టాలీవుడ్లో ఒకేసారి 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లు వెలవెలబోతూ, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదు. ఇటు చూస్తే ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడి. ఇనస్టాగ్రామ్ తెరిస్తే చాలు రీల్స్ రీల్స్ తో ప్రచారం హోరెత్తింది.గివ్-ఎవే పేరిట ఉచిత పొందిన వారు మాత్రమే మొహమాటానికి ట్వీట్లు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు కనిపించడం లేదు. వచ్చిన సినిమాల్లో శ్రీవిష్ణు సినిమా ప్రయత్నమైతే గట్టిదే. నిలబడుతుందని ఊహించారు, కానీ కలెక్షన్ పరంగా ఏ మేరకు చేస్తుందో చూడాలి. సరస్వతి సినిమా పెద్దగా చప్పుళ్లు చేయలేదు. ప్రచారం గట్టిగా చేసిన సంప్రదాయిని సుప్పిని.. సినిమా అంతగా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. వీకెండ్ అయినప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా మార్పు ఉండదని అంచనా. ఎందుకంటే మరో 11 రోజులు తర్వాత పెద్ద సినిమా విడుదల కానుంది. -
విరోష్ రిసెప్షన్లో అల్లు అర్జున్ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే?
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.ఏం జరిగిందంటే?కొందు ఆయన్ను సైడ్ యాంగిల్లో చూసి జూనియర్ ఎన్టీఆర్ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్ బౌన్సర్లు ఎన్టీఆర్ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్ కాదు, ఆయనకు డూప్గా నటించే ఈశ్వర్. తాజాగా ఈశ్వర్ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్ సర్ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. జూమ్ చేస్తూ పెద్దగా..స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్ వచ్చింది. థాంక్యూ సోమచ్ అని వీడియో షేర్ చేశాడు. ఇతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్కు డూప్గా నటించాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwarharris_1) చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్ చేస్తారు: అషూ -
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్బాస్ నాన్స్టాప్లోనూ పాల్గొని మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్లో నటించింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే? -
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్తో త్రిష అంత క్లోజ్గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్కు వరలక్ష్మి శరత్కుమార్ కౌంటర్ -
రాహులా.. మనం సాధించాం: రష్మిక ట్వీట్ వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 జాబితాను శనివారం ప్రకటించారు. అందులో ఉత్తమ నటి అవార్డు స్టార్ హీరోయిన్ రష్మికను వరించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రానికి గానూ రష్మికకు ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎక్స్ వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. రాహుల్ ట్వీట్పై రష్మిక కూడా స్పదించింది. ఆయన పోస్ట్ని రీట్వీట్ చేస్తూ.. ‘రాహులా.. మనం సాధించాం’ అని రాసుకొచ్చింది. దానికి రాహుల్ రిప్లై ఇస్తూ..‘ఈ అవార్డుకి మీరు అర్హులు. థ్యాంక్యూ రష్మిక’ అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం రష్మిక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న తన ప్రియుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్లో గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Rahullaaaaaaa!! @23_rahulr 🥹🥹🥹🥹❤️We did it! ❤️❤️ https://t.co/kSHQ79P07p— Rashmika Mandanna (@iamRashmika) March 7, 2026 -
ఆయనలా దిగజారను.. సాయిమాధవ్కు వరలక్ష్మి కౌంటర్
వరలక్ష్మి శరత్కుమార్ స్వీయదర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సరస్వతి. సాయిమాధవ్ బుర్ర కథ అందించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఇష్టమొచ్చినట్లు మార్చేశారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు సాయిమాధవ్. సరస్వతి సినిమా పేరు ప్రస్తావించకుండా ఓ పోస్ట్ పెట్టాడు. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. హర్టయిన సాయి మాధవ్ఒక్కమాటైనా చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. కథను మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు, నా సోల్ వేరు, అసలా కథే వేరు అని పేర్కొన్నాడు. ఈ వివాదంపై తాజాగా వరలక్ష్మి శరత్కుమార్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరి కథను దొంగతనం చేయలేదు. కాంట్రాక్ట్ వేసి డబ్బులు ఇచ్చాకే ఆ కథ (సరస్వతి) నాదయింది. ఆయనపై గౌరవంతో క్రెడిట్స్లో తన పేరును పొందుపరిచాం. అందుకే మార్చాంకానీ, ఆయన ఆ గౌరవాన్ని మిగుల్చుకోలేదు. ఒకవేళ నా పేరు పెట్టుంటే ఇంకా సంతోషపడేదాన్ని. నాకే సమస్య లేదు! అసలేమైందంటే.. ఆయన చెప్పిన కథ విన్న ప్రతివాళ్లు సాగదీసినట్లుగా ఉందన్నారు. పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఆ కథను యథాతథంగా ముందుకు తీసుకువెళ్లగలమేమో! కానీ మేము మంచి నటులం తప్ప పెద్ద స్టార్స్ కాదు! కాబట్టి ఆ కథను జనంలోకి ఎలా తీసుకెళ్లాలి? అని ఆలోచించాం.కథ డెవలప్ చేసుకున్నా..దానిపై చాలా వర్క్ చేశాం. ఆ సమయంలో ఆయన ఒక్కసారి కూడా స్టోరీ సిట్టింగ్కు రాలేదు. తను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. సరేలే, బిజీగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. నేనే కథను డెవలప్ చేసుకున్నాను. కనీసం ఫోన్లో అందుబాటులోకి వచ్చినా కథ మార్చామని చెప్పగలిగేవాళ్లం. అప్పుడేమో ఆయనే అలా చేసి ఇప్పుడలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. దిగజారనుఅందులోనూ కథను మానభంగం చేశారని పెద్ద పెద్ద వ్యాఖ్యలు మీలాంటి వ్యక్తి నోటి నుంచి రాకూడదు. ఇది సభ్యత అనిపించుకోదు. సెన్సిటివ్ టాపిక్పై ఎలాంటి పదాలు వాడుతున్నామనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నాకు కావాలంటే చాలా కథలు బయటకు తీసేదాన్ని, కానీ నేనలాంటి మనిషిని కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను, మర్యాదిస్తాను. ఆయనలా దిగజారి నేను మాట్లాడను వరలక్ష్మి కౌంటర్ ఇచ్చింది.చదవండి: సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్ -
సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్
సెలబ్రిటీలన్నాక కూసింత ఓర్పు, సహనం ఉండాలి. అందులోనూ నలుగురిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు శాంతంగా ఉండాలి, చిరునవ్వుతోనే కనిపించాలి. అభిమానంతో ఎవరైనా సెల్ఫీ అడిగినప్పుడు కుదిరితే ఇవ్వాలి.. లేదంటే వినమ్రంగా తిరస్కరించాలి. కానీ, అసహనం ప్రదర్శించారంటే మాత్రం ఇదిగో ఇలా రాజేంద్రప్రసాద్లా విమర్శలపాలు కావాల్సి వస్తుంది.సెల్ఫీ అడిగితే..అసలే కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. తాజాగా ఈయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ కుర్రవాడు రాజేంద్రప్రసాద్ను చూసి ఆతృతతో సెల్ఫీ అడిగాడు. కానీ, ఆయన ఆ పిల్లాడిని అసహనంతో పక్కకు తోసేసి హడావుడిగా ముందుకు వెళ్లిపోయాడు. వీడియో వైరల్ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ ముఖకవళికలు ఆ పిల్లాడిని చీదరించుకున్నట్లుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఎందుకింత పొగరు చూపిస్తున్నాడు. ఒక్క సెల్ఫీ ఇస్తే ఏమవుతుంది? అసలు ఇలాంటి వాళ్లకు అటెన్షన్ ఇవ్వడం మానేయాలి అని విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం.. ఆయనేదో బిజీలో ఉన్నట్లున్నారు, వదిలేయండి అని సమర్థిస్తున్నారు. మరి ఇంత బలుపు అవసరమా ?మనుషులని పురుగులు లాగా చూడటం ఏంటి ? తోస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ కవళికలు చూడండి 👇😡 pic.twitter.com/4jS5UG7X2l— Hungry కుక్క 🐕 (@Truth_Exposer__) March 6, 2026 చదవండి: భార్యాభర్తలిద్దరూ పని చేస్తామంటే కుదరదు: కరీనా కపూర్ -
భార్యాభర్తలిద్దరం పని చేస్తామంటే కుదరదు: కరీనా
రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని వాదించి వార్తల్లోకెక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తల్లయ్యాక అటు కెరీర్ను, ఇటు పిల్లల బాధ్యతను చూసుకోవడం కష్టమైన పని అని.. కొత్తగా తల్లయిన వారికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు అన్ని సినిమాలకు అది వర్కవుట్ కాదని విమర్శించారు. తల్లయ్యాక ఎలా?అటు దీపికా... పనిగంటలతో పాటు ఇతరత్రా డిమాండ్స్ కారణంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తల్లయ్యాక సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారన్న ప్రశ్నపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ద బకింగ్హామ్ మర్డర్స్ మూవీ షూట్ కోసం లండన్లో 35 రోజులు ఉండాల్సి వచ్చింది. ముందుగానే ప్లాన్ఎప్పుడు వెళ్లాలి? మళ్లీ ఎప్పుడు తిరిగి రావాలి? అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక మధ్యలో ఇండియా తిరిగొచ్చాను. పిల్లలతో గడిపాను. ఆ సమయంలో మిగతావారిపై చిత్రీకరణ జరిపారు. నేను తిరిగి వెళ్లగానే నా పాత్ర షూటింగ్ పూర్తిచేశారు. నేను అదృష్టవంతురాలినిచిత్రయూనిట్ నన్ను అర్థం చేసుకుని సహకరించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పైగా ఆ సమయంలో సైఫ్ ఇంట్లో పిల్లలతోనే ఉన్నాడు. మేమిద్దరం పని కోసం పరిగెడుతూ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేము. ఒకరు పని చేస్తున్నప్పుడు మరొకరు ఇంటిపట్టున ఉండి పిల్లల్ని చూసుకోవాలి. అలా అర్థం చేసుకునే భాగస్వామి ఉండాలి అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.చదవండి: రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్.. అంతా ఒక్కడే తింటాడా? -
రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్..
మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్ మాగంటి.మర్చిపోలేని అనుభవంఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్బీర్ తాత రాజ్కపూర్ పెద్ద స్టార్, తండ్రి రిషి కపూర్ గొప్ప స్టార్,.. రణ్బీర్ కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. ఒక ప్లేటు నిండా చాక్లెట్స్, చిప్స్తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్ది అన్నాడు. సర్, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్బీర్.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.సినిమాఅతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్బీర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్కు సీక్వెల్గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్లో భాగం కానున్నాడు.చదవండి: ఆస్కార్ నుంచి ఆహ్వానం -
కరీనా కపూర్లా చూపిస్తానన్నాడు.. అందుకే బికినీ ధరించా!
హీరోయిన్ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఎవరే అతగాడు (2003) మూవీతో కథానాయికగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తాజాగా సరస్వతి సినిమాతో పలకరించింది.డైరెక్టర్ అడగడంతో..ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ప్రియమణి. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో బికినీ ధరించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చీర కట్టుకుని వెళ్లం కదా.. ఏది కంఫర్ట్గా ఉంటే ఆ దుస్తులే ధరిస్తాం. ద్రోణ సినిమాలో స్విమ్ సూట్ వేసుకోమని డైరెక్టర్ అడిగాడు. కరీనా కపూర్లా..టషన్ మూవీలో కరీనా కపూర్లా నిన్ను డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నా అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ స్విమ్సూట్ వేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఓకే చెప్పాను. ఆ తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ జరిగాయి. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్ చేస్తే అలాంటి డ్రెస్ వేసుకోక తప్పదు. కానీ మన సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడిగితే మాత్రం నేను కచ్చితంగా చేయనని చెప్పేస్తాను అని ప్రియమణి పేర్కొంది.చదవండి: ఇది కరెక్ట్ కాదు.. విజయ్పై నటి ఫైర్ -
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
స్టార్ హీరో విజయ్- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్లో పేర్కొంది. దీంతో విజయ్- సంగీత విడాకులకు హీరోయిన్ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.విడాకులుఆన్స్క్రీన్పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ విజయ్- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విజయ్.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్కు గురి చేసింది.అవతలివారి బాధను లెక్కచేయరా?ఈ వ్యవహారంపై విజయ్ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్ను కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.ఎవరీ సనం శెట్టి?కాగా సనం శెట్టి విజయ్కు వీరాభిమాని. కరూర్ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ -
తండ్రి లేకపోయినా ఆయన కల నెరవేర్చిన కూతురు
పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. కానీ ఆ ఆశ తీరకముందే తనువు చాలించాడు కళాభవన్ మణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2016 మార్చి 6న మరణించాడు. తండ్రి లేకపోయినా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూతురు శ్రీలక్ష్మి. తనను డాక్టర్గా చూడాలన్న తండ్రి కలను నిజం చేసింది.తండ్రి కల సాకారంఈ విషయాన్ని కళాభవన్ మణి సోదరుడు, డాక్టర్ ఆర్ఎల్వీ. రామకృష్ణన్ వెల్లడించాడు. మణి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెను పేదలకు వైద్యం చేసే డాక్టర్గా చూడాలని మణి ఎన్నో కలలు కన్నాడు. అతడు కోరుకున్నట్లే తను వైద్యురాలయింది. తన కుమార్తెను డాక్టర్ చేయాలని, పేదలకు ఉచిత చికిత్స అందించే ఆస్పత్రి ప్రారంభించాలన్నది మణి ఆశయం.డాక్టర్ విద్య పూర్తిఈ విషయాన్ని తనెప్పుడూ బయటకు చెప్తూ ఉండేవాడు. తండ్రి మరణించిన బాధలోనే శ్రీలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా తనకు మంచి మార్కులొచ్చాయి. కాలేజీలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. డాక్టర్ కోర్సులో చేరేందుకు రెండేళ్ల శిక్షణ తీసుకుంది. అలా MBBSలో సీటు సంపాదించుకుంది. కూతురి కోసం నిమ్మి (కళాభవన్ భార్య) కూడా కాలేజీ దగ్గర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది అని పేర్కొన్నాడు.ఆటో నడిపి సినిమాల్లో..కళాభవన్ మణి మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. బతుకు బండి ముందుకు సాగడం కోసం ఆటో నడిపాడు. కెప్టెన్ ప్రభాకరన్ అనే తమిళ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేశాడు. 1996లో వచ్చిన సల్లప్పం అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్గా అనేక సినిమాలు చేశాడు. ఆ తర్వాత సహాయక పాత్రలు చేశాడు.తెలుగు సినిమావాసంతియుమ్ లక్ష్మియుం పిన్నె నిజానుం సినిమాలో అంధ సింగర్గా నటించగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సహాయక పాత్రలకే పరిమితం కాకుండా విలన్గా ట్రై చేశాడు. తెలుగులో జెమిని, అర్జున్, ఆయుధం, నరసింహుడు, ఎవడైతే నాకేంటి, నగరం.. ఇలా అనేక సినిమాలు చేశాడు. ప్లే బ్యాక్ సింగర్గానూ టాలెంట్ చూపించాడు. నటుడిగా దాదాపు 200 సినిమాలు చేసిన ఆయన అతిగా మద్యం తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు.చదవండి: డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన నయనతార దంపతులు -
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఉన్న ఏరియాలోనే నయన్ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. డూప్లెక్స్ అపార్ట్మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్మెంట్కు 8 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. సినిమాహైదరాబాద్లోని బంజారాహిల్స్లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్ సహా నాలుగైదు మూవీస్ చేస్తోంది.చదవండి: హీరోయిన్ను అవమానించిన యామీ గౌతమ్? -
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్
హీరోయిన్ కృతిసనన్పై యామీ గౌతమ్ అసూయతో రగిలిపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్లో కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అయితే ఈ విజయాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. లైక్ కొట్టడంతో వివాదంకృతీ సనన్కు బదులుగా హక్ సినిమాకుగానూ యామీ గౌతమ్కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని ఓ వీడియో క్రియేట్ చేశారు. అయినా అవార్డు గెలిస్తే మాత్రమే ఉత్తమ నటి అన్న అభిప్రాయాన్ని తాను ఏకీభవించను. ఈ అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో పొందుపరిచారు. కృతిని విమర్శిస్తున్న ఆ పోస్టుకు యామీ లైక్ కొట్టడంతో వివాదం మొదలైంది. అవమానించనుతాజాగా ఈ వ్యవహారంపై యామీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ఒక నటిని అవమానించేలా ఉన్న వీడియోను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజు ఎంతోమంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అలా వాటిని చూసే క్రమంలో పొరపాటున లైక్ పడి ఉండవచ్చు. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా నేను లైక్ చేయలేదు.క్లారిటీనా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు చేయలేదు. నా పనేంటో నేను చూసుకుని ముందుకు కదిలాను. క్లిక్బైట్ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాల్ని పెద్దది చేయకండి. నాకంటూ మంచి పేరు, గౌరవం ఉందని ఆశిస్తున్నాను. నాకెటువంటి పీఆర్ టీమ్ లేదు. అలాగే అవార్డులపై నా అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించాను. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. The reel Yami is referring to - pic.twitter.com/phE5GTvjUp— Pan India Review (@PanIndiaReview) March 5, 2026చదవండి: క్యూటీ.. నీవల్లే ఇదంతా: అల్లు అర్జున్ పోస్ట -
క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం
టాలీవుడ్ స్టార్ జంట అల్లు అర్జున్- స్నేహ నేడు (మార్చి 6న) 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్ధాంగితో దిగిన ఫోటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మనది 15 ఏళ్ల బంధం.. నువ్వు లేకపోయుంటే ఈ జర్నీ ఇలా ఉండేదే కాదు అని అందమైన క్యాప్షన్ జోడించాడు. ఇది చూసిన అభిమానులు బన్నీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.లవ్ ఎట్ ఫస్ట్ సైట్సినిమాల్లో లవర్బాయ్గా మెప్పించిన అల్లు అర్జున్ నిజజీవితంలో కూడా తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. మనసులు కలిశాయి. కానీ పెద్దలు ఒప్పుకోలేదు.పెళ్లిఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తేల్చి చెప్పేశారు. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2010 నవంబర్ 26న అల్లు అర్జున్- స్నేహ నిశ్చితార్థం జరిగింది. 2011 మార్చి 6న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 2014లో వీరికి కుమారుడు అయాన్ జన్మించగా.. మరో రెండేళ్లకు కూతురు అర్హ పుట్టింది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. వీలు కుదుర్చుకుని మరీ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. వారితో కాలక్షేపం చేస్తుంటాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్కు ఊపిరి పోయేలా ఈ శుక్రవారం ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్కుమార్ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్ కథ అందించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి. -
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
-
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
-
రవితేజకు అవమానం.. అడ్డమైనవాళ్లు తింటారన్న నిర్మాత
ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో అటు కోన వెంకట్కు, ఇటు రవితేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్ రిపీట్ అయింది. వెంకీ, భగీరథ, షాక్, డాన్ శీను, బలుపు, పవర్ సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే రవితేజ హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. భోజనం చేస్తుండగా..ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న ఘోర అవమానాన్ని తాజాగా కోన వెంకట్ బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెట్లో కొన్నిసార్లు కొందరు దారుణంగా మాట్లాడతారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భోజనం చేస్తుండగా చూసిన ఓ నిర్మాత.. లంచ్ టైమ్లో అడ్డమైనవాళ్లందరూ వచ్చి తింటారు అని చీదరించుకున్నాడు. ఎవడొస్తే వాడికి భోజనం పెడతావా? నీది కాదు కదా సొమ్ము అని వడ్డించినవాడిని తిట్టాడు. లెవల్ చూపించమన్నా..ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాకైపోతారు.. ఆయన మరెవరో కాదు, రవితేజ! అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. కష్టాలను దాటుకుని తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే నిర్మాత రవితేజ డేట్స్ కోసం వెంటపడ్డాడు. నిన్ను అవమానించిన అతడికి నీ లెవలేంటో చూపించు, పొరపాటున కూడా డేట్స్ ఇవ్వకు అని నేను సలహా ఇచ్చాను.అదే అసలైన విజయంకానీ రవితేజ నా మాట వినలేదు. ఆ నిర్మాతకు డేట్స్ ఇచ్చి, అతడి బ్యానర్లోనే హిట్టు కొడితేనే నా దృష్టిలో అసలైన విజయం అన్నాడు. చెప్పినట్లుగానే అతడి బ్యానర్లో సినిమా చేసి విజయం సాధించాడు. రవితేజ స్థానంలో నేనుంటే మాత్రం సినిమా చేసేవాడిని కాదు అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.చదవండి: తనూజకు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిన దువ్వాడ మాధురి -
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది. మిరాకిల్ బేబీఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది. మాల్తీ ఏం చేస్తుందో? కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి. నా ఆలోచనంతా తన చుట్టూనే..తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా! -
దేవిశ్రీ ప్రసాద్కి అవమానం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు, మ్యూజిక్ లవర్స్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ అయినా.. ఐటమ్ సాంగ్ అయినా డీఎస్పీ తర్వాతే ఎవరైనా..అనేలా మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తాడు. ఆయన సంగీతం వల్లే కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. అలాంటి సంగీత దర్శకుడిని అవమానించారంటూ మైత్రీ మూవీస్ సంస్థతో పాటు దర్శకుడు హరీశ్శంకర్పై డీఎస్పీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం.డీఎస్పీ అవుట్..తమన్ ఇన్పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. బ్యాగ్గ్రౌండ్ స్కోర్ అందించడంలో బిజీ అయ్యాయని ఓ ఈవెంట్లో స్వయంగా దేవిశ్రీనే చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ మూవీకి బీజీఎం తమన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిది.Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥This will be a grand celebration and a lifetime memory for fans ❤️POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026రెండోసారి..మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గ్యాప్ వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వేరే సంగీతం దర్శకులను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్సింగ్ విషయంలోనూ అదే చేశారు. రిలీజ్కి 20 రోజుల ముందు బీజీఎం తమన్ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చారు. Request💔:#DeviSriPrasad #DSP @ThisIsDSP Garu #UstaadBhagatSingh & Future Films,Any Projects solo Gane Cheyandi Songs & BGMs. Duo & Collaboration Chesedhi Talent Vallu. Miku Avasaramledhu. Dayachesi Encourage Kuda Cheyodhu 🙏.Also Any Productions@MythriOfficial,@UBSTheFilm pic.twitter.com/fRwbgMZUGj— DSP & Harris jayaraj🎶 (@entertynmentfan) March 4, 2026వర్క్ నచ్చలేదా?ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని డీఎస్పీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. వర్క్ నచ్చలేదా? లేదా దేవిని అవమానించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇకపై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమాలు చేయొద్దు అంటూ దేవికి విజ్ఞప్తి చేస్తున్నారు. Why so much negitivity on #Devisriprasad, todays generation kids dont know the value of him. Anyhow people more interested on copycat only not with the original composers..#DSP— Tanneru Ravi Teja (@rav4467) March 5, 2026 -
చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి పలు చిత్రాలు నిర్మించాడు. దాదాపు దశాబ్దకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. బీజీ బ్లాక్బస్టర్స్ పేరుతో రెండో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.అంత టైం లేదుతాజాగా ఈయన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రయూనిట్తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ చేసే సమయం లేదు. నాదగ్గర వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను షూటింగ్స్కు వెళ్లి యాక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. చిరంజీవి సినిమాలో..కాకపోతే నా మనసుకు నచ్చి ఈ వేషం నేను వేయాల్సిందే అనిపించిన రోల్స్ మాత్రం స్వీకరిస్తాను. ఇప్పుడు చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. నాకు ఓ వేషం వేయాలని కోరిక ఉంది. అది నా బ్యానర్లోనే నిర్మించి ఆ రోల్ నేనే చేస్తాను, కచ్చితంగా సూపర్ హిట్ కొడతాను అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి- బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనే బండ్ల గణేశ్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ -
'రైరై రారా' పాట రాసేందుకు 2 నెలలు: అనంత శ్రీరామ్
ఒక మంచి పాట రాయడం, మాస్ పాట రాయడం అనేది కష్టం కాదు. కానీ, పెద్ది సినిమా కోసం రై రై రా రారా.. పాటలో మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తిమీద సాములా అనిపించింది. రెహమాన్ గారి బాణీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది అని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలిపారు.పెద్ది సెకండ్ సాంగ్రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి రై రై రారా.. అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేశారు.అదే జరిగితే..ఈ పాట రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్తో టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. రామ్చరణ్గారి రుద్రతాండవం, రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలుగారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా రై రై రారా.. పాటలోని లిరిక్స్ బాగున్నాయి అనడం.. సాహిత్యానికి ప్రశంసలు రావడం ఆనందాన్నిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఆ ఆలోచన విరమించుకునేలా నా పాట స్ఫూర్తి నింపితే నా రచన సార్థకమైనట్లే అని చెబుతుంటాను. ఆ లక్షణం ఈ పాటకు ఉంది అని చెప్పాడు. -
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్ మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
క్రేజీ కాంబో ఫిక్స్.. సూర్యతో పూరి జగన్నాధ్..!
తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్కు అవకాశం దక్కింది. అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
బ్లాక్బస్టర్ 'గీత గోవిందం'ను మిస్ చేసుకున్నా: హీరోయిన్
ఎనిమిదేళ్ల క్రితం రష్మిక మెడలో తాళి కడుతుంటే విజయ్కు చేతులు వణికాయి. కానీ ఇప్పుడు భయం, బెరుకు ఏదీ లేదు.. మనసంతా గాల్లో తేలుతోంది. చుట్టూ ఉన్న వాతావరణమంతా ప్రేమమయంగా మారింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్- రష్మిక రీల్ మ్యారేజ్ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్ చూసి సగటు ప్రేక్షకుడు మురిసిపోయాడు.ఆ సినిమాతో పునాదిఇప్పుడూ అంతే.. రియల్ లైఫ్లో విజయ్- రష్మిక ఒక్కటైనందుకు ప్రేక్షకలోకం సంతోషంగా శుభాకాంక్షలు చెప్తోంది. కలకాలం కలిసి జీవించమని దీవిస్తోంది. వీరి ప్రయాణానికి పునాది పడింది గీత గోవిందం సినిమాతోనే! పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్న టైంలోనే స్నేహం ప్రేమగా మారగా.. ఫస్ట్ రష్మికనే లవ్ ప్రపోజ్ చేసింది. గీత గోవిందం ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదుఅలా ఈ ఏడడుగల బంధానికి తొలి అడుగు పడింది. అయితే గీత గోవిందం సినిమా ఆఫర్ రష్మిక కంటే ముందు చాలామంది హీరోయిన్స్కు వెళ్లిందట! వారిలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఒకరు. ఈమె ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు తనకు తెలుగులో గీత గోవిందం ఆఫర్ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్ అయ్యాయి.సినిమాతెలుగులో 'గీత గోవిందం' కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. ఐశ్వర్య.. గీత గోవిందం పోగొట్టుకున్నప్పటికీ సీతా పయనం మూవీతో మంచి డెబ్యూ అందుకుంది. అటు రష్మికకు.. గీత గోవిందం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగానూ బాగా కలిసొచ్చింది.చదవండి: కొత్త కోడలు వచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్ దేవరకొండ -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
నాకంటూ పెద్దగా ఆస్తుల్లేవ్.. అద్దింట్లో ఉంటున్నా: వరలక్ష్మి
ఇప్పటివరకు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్కుమార్ సరస్వతి చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ హాజరైన వరలక్ష్మి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.రాజకీయాల్లోకి వస్తా..నాకంటూ పెద్ద ప్రాపర్టీలు ఏం లేవు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉన్నాను. నా సంపాదనతో నాకంటూ ఒక కారు కొనుక్కున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు కొన్నానంతే! భారీగా ఆస్తులుంటే ఇక్కడెందుకు ఉంటాను? ఇకపోతే నాకు రాజకీయాలంటే ఇష్టం. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా భవిష్యత్తులో తమిళనాడులో లేదా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చుసరస్వతి సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ అయిపోయాక చిత్రయూనిట్ అందరికీ ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాను. కాగా నన్ను తమిళ చిత్రపరిశ్రమ సరిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సినిమాలు మినహా తర్వాత అక్కడ ఎవరూ నా టాలెంట్ను పట్టించుకోలేదు అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ఓ ఆసక్తికర రూమర్ గురించి చెప్తూ.. నా పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చయిందని సోషల్ మీడియాలో రాశారు. అది చూసి బాగా నవ్వుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంటే నేనెందుకు ఇక్కడుంటాను? అని వరలక్ష్మి నవ్వేసింది.చదవండి: ఒంటరితనం భరించలేకున్నా.. తోడు కావాలి: నటి -
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. బిగ్బాస్ షోతో గుర్తింపుకొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తోడు కావాలిఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.రెండో పెళ్లిమిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! -
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. అయితే శ్యామల ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, కనీస మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి స్టార్ హీరో అల్లు అర్జున్ స్పందించాడు.ఒక అడుగు ముందుకేసి..శ్యామల, ఆమె కూతురి నిత్యావసరాలు, వైద్యఖర్చుల నిమిత్తం నెలకు రూ.10 వేలప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ డబ్బు ఆమెకు అందేలా శాశ్వత ఏర్పాట్లు చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. గతంలో పలువురు సెలబ్రిటీలు పావలా శ్యామలకు సాయం చేశారు. అయితే బన్నీ ఒక అడుగు ముందుకేసి తాత్కాలిక సాయం కాకుండా శాశ్వతంగా ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ పంపేందుకు చర్యలు తీసుకోవడం విశేషం! -
కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ నేడు(మార్చి 4) హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ విందు కంటే ముందే..తెలుగు మీడియాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సతీమణి రష్మికతో కలిసి మీడియా ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా విజయ్ మట్లాడుతూ.. తన కెరీర్లో మీడియా సహాకారం ఎంతో ఉందన్నారు.‘కెరీర్ ప్రారంభంలో నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది. నన్ను ప్రజల దగ్గరకు చేర్చేలా చేసింది మీడియాను. నా ప్రతి ఇంటర్వ్యూను తిరిగి చూసుకునేవాడిని. ఎలా మాట్లాడాను? ఇంకా ఎలా మట్లాడాలి?అనేది తెలుసుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి జంటగా మీ దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మనం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. తెలుగు మీడియా అనేది మా సొంత మీడియా. మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ విజయ్ నవ్వులు పూయించాడు. కాగా, ఇప్పటికే విజయ్-రష్మిక జంట అభిమానుల కోసం ఓ ప్రత్యేక విందును ఇచ్చింది. అలాగే మార్చి 1న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్లు పంపిణీ చేశారు.కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. -
రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ 'సేక్రెడ్ గేమ్స్' నటి
బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ ప్రారంభదశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇన్ఫిల్టరేటింగ్ డక్టల్ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్ 1లో ఉంది. రొమ్ము క్యాన్సర్ఇప్పుడు మీరిది చదువుతున్నారంటే ఈ వ్యాధి గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పేందుకు ధైర్యం కూడదీసుకున్నట్లే లెక్క! నేను రొటీన్ చెకప్కు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తూ ప్రారంభం దశలోనే గుర్తించగలిగాం. లెక్కలేనన్ని టెస్టులు, శస్త్రచికిత్సలు.. ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తోంది. కానీ మీ ప్రేమాభిమానాలే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాయి. భయం పటాపంచలుసర్జరీ తర్వాత అమ్మానాన్న ముఖం చూడగానే నాలో భయం పటాపంచలై కొత్త శక్తి ప్రవహించింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వు స్ట్రాంగ్ లేడీవి.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.కెరీర్రాజశ్రీ దేశ్పాండే తలాష్ (2012) చిత్రంతో బాలీవుడ్లో తన కెరీర్ ఆరంభించింది. కిక్, మామ్, ద స్కై ఈజ్ పింక్, జోరం వంటి చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కుచ్ తో లోగ్ కహేంగే, 24: ఇండియా సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది. సేక్రెడ్ గేమ్స్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్తో విశేషమైన పాపులారిటీ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) చదవండి: నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి -
నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి
ధురంధర్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్ అంటూ సాగే ఐటం సాంగ్లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్ తెచ్చుకుంది ఆయేషా ఖాన్. అయితే గతంలోనూ ఓ సాంగ్లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్ చేశారని చెప్తోంది. సడన్గా తీసేశారుతాజాగా ఓ ఈవెంట్లో ఆయేషా ఖాన్ మాట్లాడుతూ.. టీ సిరీస్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్ హీరోయిన్గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. నిజంగా బాధాకరంఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్ చేస్తారు.ఫేమస్ కాకపోయుంటే..అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.సినిమాసీరియల్స్లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ 17వ సీజన్తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్ బుష్, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్, కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 సినిమాలు చేసింది.చదవండి: విజయ్- రష్మిక.. ఎవరు ప్రపోజ్ చేశారంటే? -
విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..
ఈ సంవత్సరంలో టాప్ హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఈవెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక ల వివాహం ‘ విరోష్’ను సినీ పండితులు అభివర్ణిస్తున్నారు అయితే అంతకు మించి విరోష్ అర్థవంతమైన వేడుకగా కూడా నిలుస్తోంది. ఇది సెలబ్రిటీ వేడుకలలో మనం ఇకపై చూడబోయే సరికొత్త సంప్రదాయాలకు నాందిగా మారనుంది.స్టార్స్లో అరుదుగా కనిపించే మానవత్వాన్ని ప్రదర్శించిన ఈ జంట తమ ఆనందాన్ని ప్రైవేట్ ఉత్సవాలకు మించి విస్తరించారు, తమ ప్రయాణంలో తమకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరితో తమ ఆనందాన్ని పంచుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న నవదంపతులకు అందరూ కానుకలు ఇవ్వడం రివాజు. అయితే దీనికి భిన్నంగా ఈ జంట... నిరుపేదలకు తామే కానుకలు పంచి మనసులు గెలుచుకున్నారు.నోరు తీపి చేశారు..గత మార్చి 1న, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్ బాక్స్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన కస్టమ్–డిజైన్డ్∙కవర్లతో ప్యాక్ చేసిన స్వీట్ బాక్స్లు, కీలకమైన నగరాల మీదుగా అందంగా అలంకరించిన ట్రక్కుల ద్వారా పంపిణీ చేశారు, ప్రత్యేకంగా రూపొందించిన ‘‘వి అండ్ ఆర్’ ’ టీ–షర్టులు టోపీలు ధరించిన ఆన్–గ్రౌండ్ బృందాలు ప్రజలకు వ్యక్తిగతంగా స్వీట్లు అందించాయి, ఇది ఓ ప్రైవేట్ వేడుక ను పబ్లిక్ ఫెస్టివల్గా మార్చింది. అంతేకాకుండా ప్రతి స్వీట్ బాక్స్లో క్యుఆర్ కోడ్ ఏర్పాటు చేశారు, దీనిని స్కాన్ చేసి నేరుగా నవదంపతులకు ఆశీర్వాదాలు కూడా పంపవచ్చు.ఆలయాల్లో... అన్నదానం...అదే సమయంలో, అన్నదానం – ఆహారాన్ని పవిత్రంగా సమర్పించడం – భారతదేశంలోని అనేక దేవాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సేవ... ఆ దేవుళ్ల ఆశీర్వాదాలను కోరుతూనే తమ వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే రష్మిక విజయ్ ల ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతుంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం, బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్ వంటివి ఉన్నాయి.తమ వివాహాన్ని ఒక ఖరీదైన వేదికకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు విస్తరించడం ద్వారా, ప్రముఖుల వివాహ వేడుక అర్ధాన్ని ఈ జంట పునర్నిర్వచించారు. ఇది కేవలం ఇద్దరు తారల మధ్య కలయిక మాత్రమే కాదు, సామూహిక ఆనందంతో మేళవించిన జాతీయ అనుభవంగా మార్చారు. నేషనల్ క్రష్ అనే బిరుదును ఆనందించడం మాత్రమే కాదు ఆ స్థాయి ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకోవడం కూడా తనకు తెలుసని విజయ్ తోడుగా రష్మిక తెలియజెప్పారు. ‘ఈ దేశంలోని అందరు అందమైన ప్రజలకు, మీరు ఎల్లప్పుడూ మా ప్రయాణాలలో మా ప్రేమలో భాగమయ్యారు. మీ అందరికీ సన్నిహితంగా మా వివాహాన్ని జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంటుంది’’ అంటూ వీరు సోషల్ మీడియాలో ఇచ్చిన తమ వివాహ ప్రకటన రికార్డులను బద్దలు కొట్టింది, ఆసియాలో అత్యధికులు లైక్ చేసిన పోస్ట్గా విరాట్ కోహ్లీ గత రికార్డును అధిగమించింది.విద్యాదానం...తెలంగాణలోని తుమ్మన పేటలో విద్యార్థుల కోసం స్కాలర్షిప్లను ఈ విరోష్ జంట ప్రకటించారు. పెళ్లి తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్లోని విజయ్ స్వస్థలాన్ని ఈ జంట సందర్శించారు, నిరుపేదలకు విద్యాదానం చేయడానికి తమ వంతు సాయం అందించారు.దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించిన ఈ స్కాలర్షిప్లు, ఈ ప్రాంతంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న టీనేజర్లకు సహాయం చేయడం వారి చదువును కొనసాగించడానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా వారు కీలకమైన పాఠశాల పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు వారికి ఆసరాగా నిలవడం ఈ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం.తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తామ ని ఈ సందర్భంగా ఈ జంట జనం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. స్కాలర్షిప్ కార్యక్రమం ప్రత్యేకతలను వివరిస్తూ, విజయ్ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు జనంలో నుంచి వచ్చిన హర్షాతిరేకాలకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి పొంగిపోయారు. మరి ఇది కదా పుత్రోత్సాహం అంటే... మార్చి 4న హైదరాబాద్లో ఈ జంట రిసెప్షన్ వేడుక నిర్వహించనుంది. మరోవైపు సెప్టెంబర్లో విడుదల కానున్న ’రణబాలి’ చిత్రంలో రష్మిక విజయ్ ఇద్దరూ కలిసి కనిపించనున్నారు. గీత గోవిందం తర్వాత ఇది వారి మూడవ చిత్రం కాగా పెళ్లి తర్వాత వీరు కలిసి నటించిన తొలి చిత్రం కానుంది. తారలంటే తెరమీద నుంచి ఆనందం పంచేవారు మాత్రమే కాదు తమను ఆదరించిన సమాజానికి కృతజ్ఞత పంచేవారు కూడా అని నిరూపించిన వీరిద్దరికీ ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని ఉండాలని కోరుకుందాం. -
వాడు అమ్మాయిల పిచ్చోడు అందుకే వదిలేసా బ్రేకప్ పై తొలిసారి స్పందించిన హీరోయిన్
-
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. ఆనందంగా ఉందితల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్ చేశాడు. కాగా హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్ కల్యాణ్ నూరు కోడి వానవిల్ మూవీ చేస్తున్నాడు. Elated to share the most wonderful news with all my dear family ❤️🤗God willing 🙏 pic.twitter.com/11Icq8OMMz— Harish Kalyan (@iamharishkalyan) March 2, 2026 చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ -
పెళ్లికి ముందు సహజీవనం.. నాకు ఛాన్స్ ఇచ్చుంటే..
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన లయ.. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. దాంతో సినిమాలకు దూరమైంది. కాకపోతే 2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనిలో అతిథి పాత్రలో మెరిసింది. గతేడాది వచ్చిన తమ్ముడు చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. త్వరలో హాట్స్టార్లో రాబోతున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో జడ్జిగా కనిపించనుంది.నాకు ఛాన్స్ ఇచ్చుంటే..ఈ షోలో పెళ్లయిన దంపతులతో పాటు ప్రేమలో ఉన్న జంటలు, సహజీవనం చేస్తున్న జంటలు కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో లవ్- మ్యారేజ్- సహజీవనంపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్ అన్న ప్రస్తావనే లేదు. నిజం చెప్పాలంటే మీరు ఛాన్స్ ఇచ్చినా సరే నేనైతే ఆ పని చేయలేను. మారుతున్న కాలం ప్రకారం.. ఇప్పటి జనరేషన్వాళ్లు ఒకరి గురించి మరొకరు ముందే తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కొత్తగా వస్తున్న కాన్సెప్ట్.తప్పుపట్టనుఅంతకుముందు పెళ్లిలో ఇలాంటి విధానాలు లేవు. విడాకులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. కానీ, అన్నీ మారుతున్నాయి. కాబట్టి ఏది ఒప్పు? ఏది తప్పు? అని నేను చెప్పలేను. సహజీవనం చేస్తున్నవారిని నేను తప్పుపట్టలేను. వారి బంధం ధృడంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పెళ్లికి ముందు కలిసుంటున్నారు. అది వారి వ్యక్తిగత విషయం అని లయ చెప్పుకొచ్చింది. 10 జంటలతో రియాలిటీ షోమ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విషయానికి వస్తే.. ఇందులో పది జంటలు పాల్గొననున్నాయి. వారిలో వాసంతి కృష్ణన్- పవన్ కల్యాణ్, ప్రియాంక జైన్-శివకుమార్, బిగ్బాస్ ఫేమ్ మాస్క్ మ్యాన్- హరిత, అంజలి - పవన్, సాండ్రా- మహేశ్, నటరాజ్ మాస్టర్ - నీతూ, సోనియా, శుభ శ్రీ, నూకరాజు జంటలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విల్లాలో పది జంటల్ని పది వారాలు పెట్టి షో కొనసాగించనున్నారు. మరి ఇదెప్పుడు మొదలవుతుందో చూడాలి!చదవండి: లగ్జరీ కారులో సంపూర్ణేశ్ షికారు.. ఈ కార్ ధరెంతంటే? -
లగ్జరీ కారులో సంపూర్ణేశ్బాబు.. ధరెంతో తెలుసా?
హృదయకాలేయం (2014) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేశ్బాబు. మొదటి సినిమాతోనే ఫుల్ వైరల్ అయిపోయాడు. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. మధ్యలో బిగ్బాస్ షోలోనూ పాల్గొన్నాడు. కానీ, పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయాడు. నావల్ల కాదు నేనొచ్చేస్తానంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు.స్పోర్ట్స్ కారులో తిరిగిన సంపూఅయితే ఇటీవల ప్యారడైజ్లో సంపూ లుక్ రిలీజ్ చేయగా మరోసారి నెట్టింట వైరల్ అయిపోయాడు. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గొడ్డలి పట్టుకుని రౌడీ అవతార్లో కనిపించాడు. తాజాగా సంపూర్ణేశ్బాబు స్పోర్ట్స్ కారులో కనిపించాడు. హైదరాబాద్ రోడ్లపై రెడ్ కలర్ స్పోర్ట్స్ కారు వేసుకుని తిరిగాడు. ఇది చూసిన అభిమానులు సంపూ ఈ కారెప్పుడు కొన్నాడని ఆశ్చర్యపోతున్నారు. ఆ డబ్బుతోనే కొన్నాడా?ఈ కారు ఎంజీ సైబర్స్టర్ బ్రాండ్కు చెందినది అని తెలుస్తోంది. దీని ధర రూ.75 లక్షలపైనే ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే నటుడు ఇప్పుడు లగ్జరీ కారు నడుపుతుండటంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యారడైజ్ సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్తోనే ఈ కారు కొని ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ ఇది! సినిమాగతంలో వీరిద్దరూ దసరా చిత్రంతో బాక్సాఫీస్పై వసూళ్ల వర్షం కురిపించారు. ఈ సారి వినూత్న కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని జడల్ పాత్రలో నటిస్తుండగా మోహన్బాబు విలన్గా శికంజ మాలిక్గా, సంపూర్ణేశ్ బిర్యానీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, సాంగ్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. View this post on Instagram A post shared by Celebrity Paps📸 (@celebritypaps_) చదవండి: దుబాయ్లో మెగా డాటర్ శ్రీజ -
మనసుకు కష్టంగా ఉంది.. మంచు విష్ణు కోసం లక్ష్మి పోస్ట్
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేవాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. అటు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడులతో పలుచోట్ల ఎయిర్పోర్టులను మూసివేశారు. దాంతో ఎంతోమంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.దుబాయ్లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీవారిలో అజిత్, ఈషా గుప్తా, సోనాల్ చౌహాన్, మంచు విష్ణు వంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. విష్ణు అయితే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిలబడి ఉండగా తనపై నుంచే క్షిపణులు వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసి తన చిన్నకూతురు భయపడిపోయిందని పేర్కొన్నాడు. ఈ వీడియో కింద అభిమానులు విష్ణు కుటుంబంతో సహా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.మనసుకి కష్టంఈ క్రమంలో మంచు విష్ణు సోదరి, నటి లక్ష్మీ మంచు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దుబాయ్లో ఉన్న విష్ణు, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మనకు బాగా కావాల్సిన వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తట్టుకోవడం చాలా కష్టం. మీ అందర్నీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాను. ఆ దేవుడి దయ మీకు రక్షణగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమే గెలుస్తుంది అని రాసుకొచ్చింది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల జాబితా -
బాలీవుడ్తోనే మొదలైన కెరీర్.. ఫైనలియర్లో ఉన్నప్పుడు!
మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్ కెరీర్ గురించి ఓ సారి చూసేద్దాం..బాలీవుడ్ మూవీతో కెరీర్ మొదలుప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ సంస్థాపకుడు అల్లు అరవింద్ చిన్న కుమారుడే అల్లు శిరీష్. అరవింద్ పెద్ద కుమారుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా కంటే ముందుకొత్త జంట చిత్రంతో క్రేజ్ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్ బర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్ మొదలవడానికే ముందే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. ఆమిర్ ఖాన్కు అభిమానిఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. లగాన్, గులాం సినిమాలు చూశాక ఆమిర్ ఖాన్కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.అదే ఎక్కువ ఇష్టంతమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్ -
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్
చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్పాల్ యాదవ్.. వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్డేట్ ఇచ్చిన ప్రియాంక -
ఫ్యామిలీ మ్యాన్గా సూర్య.. టైటిల్ ఏంటో తెలుసా?
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం (మార్చి 2న) రిలీజ్ చేశారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్కు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాపోస్టర్లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సినిమామరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక. మరోటి.. మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. Power in his presence. 🔥Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026 చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్.. ఫోటో వైరల్ -
ఏఆర్.రెహ్మాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డా : హీరోయిన్
యుక్త వయసులో ప్రేమలో పడడం సహజం. అదేవిధంగా లవ్అట్ ఫస్ట్ సైట్ అనేది జరుగుతుంది. నటి మోహిని గుర్తుందా 90 ప్రాంతంలో దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా వెలిగారు. అప్పట్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటించి బహుభాషా నటిగా రాణించారు. 1987లో కూత్తు పుళక్కంగళ్ అనే చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత ఈరమాన రోజావే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. అలా పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగులోనూ ఆదిత్య 367 చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. అలా మామా బాగున్నావా చిత్రాల్లో నటించారు. 2011 వరకు నటించిన మోహిని భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అయితే అప్పుడప్పుడు సామాజిక మాద్యమాల్లో పోస్ట్లు పెడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ భామ పేర్కొంటూ తనకు సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ అంటే చాలా అభిమానం అన్నారు. హిందూ మతానికి చెందిన ఆయన ఆ తరువాత ఇస్లామ్ మతానికి మారినట్లు గుర్తు చేశారు. అప్పుడు తాను చాలా బాధ పడ్డానన్నారు. అయితే రెహ్మాన్ హిందువుగా ఉన్నప్పుడు ఆయన్ని తాను చాలా ఇష్టపడ్డానని తెలిపారు. ఆయన అదే మతంలో కొనసాగుంటే తన తల్లిదండ్రులను ఒప్పించి ఆయన్నే పెళ్లి చేసుకోవాలన్నంత ఆశ కలిగిందన్నారు. ఏఆర్.రెహ్మాన్ ప్రస్తుతం పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన హిందీలో తెరకెక్కుతున్న రామాయణ 1, 2 చిత్రాలకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మీర్తో కలిసి పనిచేస్తున్నారన్నది గమనార్హం. ఏఆర్.రెహ్మాన్ మూన్వాక్ అనే చిత్రానికి సంగీతాన్ని అందించడంతోపాటు పూర్తి స్థాయి పాత్రలో నటించడం విశేషం. ఇందులో ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇకపోతే రెహ్మాన్ గురించి మోహిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హీరో విజయ్ను అన్ఫాలో కొట్టిన కుమారుడు!
తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.విజయ్ను అన్ఫాలో కొట్టిన జేసన్ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్స్టాగ్రామ్లో దళపతిని అన్ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి - విడాకులుఏదేమైనా జేసన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.చదవండి: ఓటీటీలో విత్ లవ్.. రిలీజ్ ఎప్పుడంటే? -
‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్: రెండో రోజు పెరిగిన వసూళ్లు, ఎంతంటే?
హీరో శ్రీవిష్ణు మంచి ఫామ్లో ఉన్నాడు. వరుస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన తాజాగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఓ మెస్తరు అంచనాల మధ్య ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.95 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు అంతకు మించిన జోరును ప్రదర్శించింది. మొదటి రోజుతో పోలిస్తే..రెండో రోజు ఏకంగా 54 శాతం పైగా బుకింగ్స్ని నమోదు చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 9.1 గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.వీకెండ్లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ మూవీకి బాగా కలిసి వస్తోంది. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండుతులు అంచనా వేస్తున్నారు. -
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్లో చిక్కుకున్నా.. నన్ను భారత్కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
దుబాయ్లో చిక్కుకుపోయా.. నన్ను భారత్కు తీసుకురండి!
ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా చిక్కుకుపోయింది. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగొచ్చే దారి కనిపించడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది.సాయం చేయండిగౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీగారు.. ప్రస్తుత సంక్షభ పరిస్థితుల్లో నేను దుబాయ్లో చిక్కుకున్నాను. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఇండియాకు ఎలా రావాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది సోనాల్.సినిమాసోనాల్ చౌహాన్ మోడల్, సింగర్, హీరోయిన్. జన్నత్ చిత్రంతో హిందీలో, రెయిన్బో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, ఎఫ్ 3, ద ఘోస్ట్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా ఆదిపురుష్ మూవీలో మండోదరిగా యాక్ట్ చేసింది. చివరగా దర్ద్ (2024) అనే ద్విభాషా చిత్రంలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: ఇషితా దత్తా -
తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: బాలీవుడ్ నటి
తెలుగు చిత్రం చాణక్యుడుతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది ఇషితా దత్తా. తర్వాత మాత్రం బాలీవుడ్లోనే సెటిలైంది. దృశ్యం, దృశ్యం 2, దేదే ప్యార్ దే 2 వంటి హిందీ చిత్రాల్లో తళుక్కుమని మెరిసింది. రిష్తాన్ కా సౌధాగర్: బాజీగర్ సీరియల్ చేసే సమయంలో నటుడు వస్తల్ సేత్తో ప్రేమలో పడింది. 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో బాబు జన్మించగా 2025లో పాప పుట్టింది.తల్లి జీవితం ఇంతే..తల్లయ్యాక తన జీవితమే మారిపోయిందంటోంది ఇషితా దత్తా. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిక్కుల జుట్టు, ఇంట్లో ఎక్కడపడితే అక్కడ బొమ్మలు.. ఎప్పటికీ పూర్తవని పనులు.. అవి కాకుండా సంబంధం లేని ప్రదేశాల్లో కూడా స్టిక్కర్లు.. తల్లి జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఇందులో స్వచ్ఛమైన ఆనందం దాగి ఉంది అని రాసుకొచ్చింది. ఇకపోతే ఇషిత తన పిల్లల ఆటలు, అలకలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.చదవండి: సన్యాసం తీసుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ -
విజయ్, రష్మిక మూడోసారి.. చిరు-త్రిష రెండోసారి.. జోడీ రిపీట్
వెండితెరపై ఓ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరి, ఆ సినిమా హిట్ కూడా అయితే అప్పుడు ‘హిట్ పెయిర్’ అనిపించుకుంటారు. ఆ హిట్ పెయిర్ కాంబినేషన్కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న కొన్ని జోడీలు రిపీట్ అవుతున్నాయి. తొలిసారి జోడీగా నటించి, సక్సెస్ సాధించిన ఈ జంటకు సక్సెస్ రిపీట్ కావడం ఖాయం అనే అంచనాలున్నాయి. ఇక... రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. రెండోసారి... ఈ మధ్య చిరంజీవి హీరోగా నటించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ మూవీ ఒకటి. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష మెయిన్ హీరోయిన్గా, ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా నటించారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్ ’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ‘‘స్టాలిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి–త్రిష జోడీ ‘విశ్వంభర’తో రెండోసారీ అలరించనుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా ఈ మూవీ రూపొందింది. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ఫై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని 2025 ఆగస్టు 22న విడుదల చేసిన ‘విశ్వంభర’ సినిమా గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ వేసవిలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయింది. చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైన కథ ‘విశ్వంభర’. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది... వినోదపరుస్తుంది. ఈ వేసవికి ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా’’ అని చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. వందో చిత్రంలో... హీరో నాగార్జున, హీరోయిన్ టబు జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి పేరు చెప్పగానే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా గుర్తొస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొదటిసారి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న రిలీజైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో తమదైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు నాగార్జున–టబు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ మరోసారి సందడి చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించలేదు. కానీ, ‘సిసింద్రి’ (1995) సినిమాలో మాత్రం ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో సందడి చేశారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున–టబు ముచ్చటగా మూడోసారి నటిస్తున్నారు. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో మరోసారి ఆయనకి జోడీగా టబు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీకి పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. విజయ్–రష్మిక కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరిద్దరూ జోడీగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు విజయ్–రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’కి దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వారి లైఫ్లో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే.. రీల్ లైఫ్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా రియల్ లైఫ్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడమే. ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి కాంబోలో రానున్న ‘రణబాలి’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. సెకండ్ టైమ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లది హిట్ జోడీ. ‘శతమానం భవతి’ మూవీలో ఫస్ట్ టైమ్ జోడీగా నటించిన ఈ జంట సెకండ్ టైమ్ ‘భోగి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ సినిమాలో తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు శర్వానంద్–అనుపమ. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ మూవీ 2017 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్నారు శర్వా, అనుపమ. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’లో నటిస్తున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.ఈసారి భయపెడతారు ‘సామజ వరగమన’ సినిమాతో ప్రేక్షకులకు కడుపుబ్బా వినోదాలు పంచారు హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికా జాన్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించింది. ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ నటించిన సెకండ్ మూవీ ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ మూవీ కోసం రెండోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు–రెబా. తొలి చిత్రంలో ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ జంట ‘మృత్యుంజయ్’లో మాత్రం భయపెట్టనున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ‘సాంగ్స్, కామెడీ లేకుండా హానెస్ట్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. నా నటన కూడా సరికొత్తగా ఉంటుంది’’ అంటూ ఇటీవల శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ నెల 6కి ఈ మూవీ రిలీజ్ని వాయిదా వేశారు. బేబీ హిట్తో... ‘బేబీ’ మూవీతో ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య. వారిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి వీరి జోడీపై యూత్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనంద్– వైష్ణవి జంటగా నటిస్తున్న రెండో సినిమా ‘ఎపిక్’. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. కాగా ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి... సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘బేబీ’ మూవీతో సూపర్హిట్ జోడీ అనిపించుకున్న ఆనంద్–వైష్ణవి కలిసి నటిస్తున్న ‘ఎపిక్’ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రెండోసారి... ‘కోర్ట్’ సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా. ఈ ఇద్దరూ పరిచయమైన తొలి చిత్రం ‘కోర్ట్’. ఇప్పుడు రెండోసారి జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా 2025 మార్చి 14న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి జోడీగా నటించిన హర్ష్ రోషన్–శ్రీదేవి హిట్ పెయిర్గా నిలిచారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆడియన్స్లో వీరి జోడీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరు జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఫుల్ బజ్ నెలకొంది. -
సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్.. 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!
ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్లో పేరు వినిపించడంతో వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్కు వచ్చిన ఆమె సన్యాసిగా మారింది. కిన్నెర అఖాడాలో చేరి మహా మండలేశ్వర్ పదవి అందుకుంది. బుల్లితెరపై రీఎంట్రీఅయితే కొన్ని వారాల క్రితమే ఆ హోదా నుంచి తప్పుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కనిపించనుంది. హిందీలో ప్రసారమవుతున్న లాఫ్టర్ చెఫ్ మూడో సీజన్లో అతిథిగా అలరించనుంది. ఈ రియాలిటీ షో సెట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీరు గమించారో, లేదో కానీ టీవీలో కనిపించక 25 ఏళ్లవుతోంది. అది కూడా ముఖ్యమేరెండున్నర దశాబ్దాల తర్వాత బుల్లితెరపై మళ్లీ కనిపించబోతున్నాను. చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. అందరూ లైఫ్లో బిజీ అవడంతో పాటు సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. మధ్యమధ్యలో హాయిగా నవ్వుకోవడం కూడా ముఖ్యమే.. ఇలాంటి షోలు అందుకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీహార్ జైల్లో నాలుగు నెలలు.. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు: నటి -
‘సన్ ఆఫ్’ వస్తోన్న రెస్పాన్సే నా సక్సెస్ : సాయి సింహాద్రి
సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్మీట్లో సాయి సింహాద్రి మాట్లాడుతూ–‘‘యూఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న నేను సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉంటూ ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను పూర్తి చేశాను. ‘సన్ ఆఫ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే నా సక్సెస్’’ అని చెప్పారు.హీరోయిన్ మీరా రాజ్ మాట్లాడుతూ ‘మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న ‘సన్ ఆఫ్’లో తండ్రీ కొడుకుల మధ్య కనెక్టింగ్ చేసే మంచి రోల్లో నటించటం నటిగా నాకు మంచి గుర్తింపునిచ్చింది’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్, సంఘర్షణ కాన్సెప్ట్ నాకు నచ్చడంతో రిలీజ్కి ముందుకు వచ్చాను’’ అని చెప్పారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి. -
తీహార్ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి
మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించింది నటి, ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్. తాజాగా తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. సందీప మాట్లాడుతూ.. నా శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడెందుకింత శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో..అక్కడి వాతావరణం కూడా భయానకంగా ఉంది. గత జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటాను, ఆ కర్మ నన్ను ఇలా వెంటాడుతోందని భావించాను. దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్లు అని ఎన్నోసార్లు వేడుకున్నాను. జైల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి మనల్ని కలుస్తుంటే మరింత బాధేసేది. నా వల్ల వారు జైలుకు రావాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. కానీ నేనేంటో తెలిసిన నా పేరెంట్స్, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు.కన్నీళ్లు ఆగవుతీహార్ జైల్లో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటికీ ఆ జైలు జీవితం గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆగవు. వాష్రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి. నేలపై పడుకోవాలి. తిండి దారుణంగా ఉంటుంది. నాలుగు రోటీలు, అన్నం, పప్పు.. రోజూ ఇదే ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. కొందరు పోలీసులు జాలి చూపిస్తారు. మరికొందరు వారి ఫ్రస్టేషన్, కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారు. ఇద్దరు మహిళలకు సాయంకానీ జైల్లో డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేదం,న టే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ రూ.3000 దొంగతనం చేసిన కేసులో నాలుగునెలలుగా జైల్లో ఉంటోంది. తనకు అంధురాలైన తల్లి ఉంది, తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. నేను బయటకు వచ్చాక తనకు సాయం చేస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. మరో మహిళ.. భర్త చేసిన ఆర్థిక మోసానికిగానూ ఆరునెలలుగా శిక్ష అనుభవిస్తోంది. తనకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చేందుకు సహకరించాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లక్కీ మూవీ.. ఓటీటీ రివ్యూ -
ఆ హీరోయిన్ బయోపిక్లో నటించాలనుంది!
వివిధ భాషల్లో హీరోయిన్గా రాణిస్తోంది ప్రియాంక మోహన్. ఒంద్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందీ బ్యూటీ. అదే ఏడాది నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగువారికీ పరిచయమైంది. ఆ వెంటనే డాక్టర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశాలను అందుకుని పక్కింటి అమ్మాయి ఇమేజ్ సొంతం చేసుకుంది.సినిమాఅయితే ఈ బ్యూటీకి 2025 పెద్దగా కలిసి రాలేదు, సరైన హిట్ పడలేదు. అంతే కాకుండా ఇప్పుడు తన చేతిలో భారీ ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ప్రస్తుతం తమిళంలో నటుడు కెవిన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. కన్నడలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు ఈమె ప్రధాన పాత్రలో నటించిన మేడిన్ కొరియా నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.ఆమె బయోపిక్లో నటించాలనుందిఇకపోతే ప్రతి నటికి ఏదో ఒక బయోపిక్లో నటించాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరిక మీకు ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు ప్రియాంక ఇలా స్పందించింది. దివంగత నటి సౌందర్య బయోపిక్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. కన్నడ నటి సౌందర్య.. మాతృభాషలో కన్నా తెలుగు, తమిళం భాషల్లోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తక్కువకాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అంతే తక్కువ కాలంలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మరి సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తారా? ఒకవేళ తీస్తే ప్రియాంకను హీరోయిన్గా తీసుకుంటారా? చూడాలి! -
రాత్రికి రేటెంత అని అడిగారు.. ఇదేనా మీ సంస్కారం?
కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్య కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది నటి రేణూ దేశాయ్. తనపై ఇంత ద్వేషం ఎందుకని మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 2012లో నాకు విడాకులైనప్పటినుంచి నా గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. భరణం తీసుకున్నానని, నా వ్యక్తిగత జీవితం గురించి, ఏ రాజకీయ పార్టీకి బానిస అని.. ఇలా రకరకాలుగా తిడుతూనే వచ్చారు. నేను రానన్నానుఇక నాపై కామెంట్స్ చేసేందుకు ఏం మిగల్లేదు అనుకున్నాను. అది తప్పని అర్థమైంది. జనవరిలో కుక్కల కోసం ఓ ప్రెస్మీట్లో కూర్చున్నాను. నిజానికి అప్పుడు కూడా నేను ప్రెస్మీట్కు రాననే చెప్పాను. నేను ఏం మాట్లాడినా తిడతారే తప్ప ఎటువంటి సమాధానం దొరకదు అని చెప్పాను. కానీ, కొన్ని ఎన్జీవోలు నన్ను రమ్మని మరీమరీ అడిగారు. వందలాది కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు. మీరు కచ్చితంగా మాట్లాడాలన్నారు. అంత పెద్ద సంఖ్యలో కుక్కల్ని చంపేస్తుంటే నాకూ బాధేసింది.నానా బూతులు తిట్టారుఅందుకే ప్రెస్మీట్కు వచ్చాను. వంద కుక్కల్లో పది పిచ్చి కుక్కలుంటాయి. ఆ పదింటికోసం 90 మంచి కుక్కల్ని చంపొద్దన్నాను. అందులో ఏం తప్పు మాట్లాడాను? నేను చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా దాన్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నన్ను నానా బూతులు తిట్టారు. నేనేదైనా సినిమా చేస్తే మీ యాక్టింగ్ బాలేదు అని చెప్పండి.. తప్పుపట్టను. కానీ, నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం దేనికి? అందుకే అంత కోపంఇష్టమొచ్చిన బూతులు తిట్టడం ఏం సంస్కారం? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మీ ఇంట్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు మీరు ఎటువంటి కామెంట్స్ పెడుతున్నారో చూపించండి. ప్రెస్మీట్లో ఎవరో తెలియని వ్యక్తి లోపలకు వచ్చి దున్నపోతు అని తిట్టాడు. అందుకే కోప్పడ్డాను. అది అర్థం చేసుకోకుండా నాకు రేబిస్ వచ్చింది అంటూ దారుణమైన పదజాలంతో దూషించారు. ఒక ఘోరమైన కామెంట్ చూసి నేను చాలా షాకయ్యాను. కుక్కల వల్ల హానిఈ పిచ్చికుక్కలు రేణూదేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ను కరిస్తే తనకు ఆ బాధేంటో తెలుస్తుంది అన్నారు. ఇదేం భాష? ఆ ఆలోచనలు ఏంటి? మీ అమ్మానాన్న మిమ్మల్ని ఏం సంస్కారంతో పెంచారో నాకర్థం కావడం లేదు. ఆడమగ తేడా లేకుండా అందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుక్కల వల్ల ఎవరికైనా హాని కలుగుతుంటే వాటి బెడద ఎక్కువగా ఉందని మీ కార్పొరేటర్తో, మీ ఎమ్మెల్యేతో పోరాడండి. అంతే తప్ప మీకు నన్ను తిట్టే హక్కు లేదు.నేనేం చేశా?ఏదో ఒక రోజు ఈ తిట్ల దండకం ఆపేస్తారులే అని అంతా భరించాను. కానీ, మొన్న కులాల మధ్య గొడవలో ఒక బిడ్డ ప్రాణం పోతే నన్నే తిడుతున్నారు. ఇందులో నా ప్రమేయం ఎక్కడుంది? ఇక భరించడం నా వల్ల కాదు. ఎక్కడైనా బూతు కామెంట్స్ కనిపించాయంటే మీ ఇంటివరకు వస్తాను. మీ అమ్మానాన్న, అక్కచెల్లెళ్లకు మీరు పెట్టిన బూతుల కామెంట్ చూపించి ఇదేనా మీరు నేర్పిన సంస్కారం అని అడుగుతాను.బండబూతులు తిట్టండినేను కాశీకి వెళ్లినందుకు కూడా విమర్శించారు. నిండుగా ధరించిన దుస్తులు వేసుకున్న ఫోటో షేర్ చేస్తే కూడా రాత్రికి రేటెంత? అని అడిగారు. బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నారు? నన్ను తిడితే మీకొచ్చే ప్రయోజనం ఏంటి? ఒక పని చేద్దాం.. నేను పబ్లిక్ ముందు వచ్చి కూర్చుంటాను. నన్ను, నా పేరెంట్స్ను, పిల్లల్ని అందర్నీ బండబూతులు తిట్టండి. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏదైనా ఒక ప్రాణం నిలబడుతుందా? చెప్పండి. మీకు దమ్ముంటే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేని బూతులు తిట్టండి అని రేణూ దేశాయ్ ఆగ్రహించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) చదవండి: కాస్ట్లీ హీల్స్ ధరించిన నిక్కీ.. ఆ చెప్పుల ధర వేలల్లో కాదు! -
ఖరీదైన హీల్స్ ధరించిన హీరోయిన్.. చెప్పుల ధర వేలల్లో కాదు!
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.గోవా ట్రిప్తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్ పొట్టి డ్రెస్లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్ డాల్స్ అండ్ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్కు చెందిన చెప్పులు.చెప్పుల ధర ఎంతంటే?ఆ హీల్స్ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు, సీరమ్ రూ.50 వేలు అని తెలిపాడు. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి -
పాత ఫోన్కు కొత్త కవర్..మంచి మాట చెప్పిన మంచు మనోజ్
మంచు మనోజ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటాడు. చాలా ఓపెన్గా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. తన చేష్టలు, మాటలతో చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తుంటాడు. కానీ తాజాగా అయన అందరికీ ఓ మంచి సందేశం ఇచ్చాడు. మెప్పు కోసం అప్పులు చేయొద్దదంటూ యువతకు విలువైన సలహా ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ యూనవివర్సీటీలో జరిగిన ఈవెంట్కు అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందని.. వాడే వస్తువుల వల్ల రాదని చెప్పారు. పాతఫోన్కు కొత్త కవర్ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నాడు. అదేంటంటే.. మనోజ్ ఇప్పటికీ పాత ఐఫోన్నే వాడుతున్నాడు.కానీ దానికి iPhone 17 Pro Max కవర్ వేసి మ్యానేజ్ చేస్తున్నాడు. ఆ ఫోన్ను చూపిస్తూ.. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచించారు. డబ్బు వృథా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. మనోజ్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో మనోజ్ బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు.Actor Manchu Manoj advised youth not to take loans just to impress others. Speaking at an event, he said he uses his old iPhone with an iPhone 17 Pro Max cover, urging students to avoid unnecessary luxury spending and be content with what they have.#ManchuManoj pic.twitter.com/wNOz2NF4yE— Telangana Ahead (@telanganaahead) February 28, 2026 -
అప్పటివరకు నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్ 2". అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్ శెట్టి.మాట మీదే ఉన్నా..రూ.500 కోట్ల క్లబ్లో చేరిన తర్వాతే బోర్డర్ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్ దాటేస్తుంది. సినిమాఅప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్ వరకు వెళ్లాను. అహాన్ ఇంట్లో ప్రాక్టీస్ చేసిన డైలాగులను థియేటర్లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్గా బోర్డర్ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్, ప్రణవ్ వశిష్ట్, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.చదవండి: ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా? -
సినిమా అంటే నాకు ఒక కల, ఒక బాధ్యత: నిర్మాత శ్రీహన్సిక పెద్దిరెడ్డి
ఎవర్ గ్రీన్ జానర్ అయిన లవ్ డ్రామాకు వినోదాన్ని జోడిస్తూ, హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సరికొత్త కథాంశంతో, యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. ముహూర్తపు షాట్కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..సినిమా అంటే నాకు ఒక కల, ఒక బాధ్యత. అందుకే నా మొదటి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. యువత మనసు దోచుకునే ప్రేమ కథతో పాటు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం మా చిత్రంలో ఉంటుంది. నాణ్యమైన నిర్మాణ విలువలతో, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. భవిష్యత్తులో మా బ్యానర్ నుండి మరిన్ని మంచి చిత్రాలు రావడానికి ఇది పునాది లాంటిది’ అని పేర్కొన్నారు.దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ, త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, టైటిల్ను అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. -
ప్రేయసికి బ్రేకప్ చెప్పలేదని హీరోని మార్చేశారా?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కెరీర్ పరంపర (1993) సినిమాతో మొదలైంది. అయితే దీనికంటే ముందు సైఫ్ బేకుడి చిత్రంతో పరిచయం కావాల్సి ఉంది. కానీ గర్ల్ఫ్రెండ్కు బ్రేకప్ చెప్తేనే సినిమా ఛాన్స్ అని డైరెక్టర్ కండీషన్ పెట్టాడని, దానికి సైఫ్ నిరాకరించాడని, దాంతో ఈ సినిమా అతడి చేజారిందని ప్రచారం జరిగింది.అసలేం జరిగిందంటే?దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై బేకుడి దర్శకుడు రాహుల్ రవాలి స్పందించాడు. ఆనాడు అసలేం జరిగిందనే విషయాలను గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. గర్ల్ ఫ్రెండ్ ఉందన్న కారణంతో సైఫ్ అలీఖాన్ను రిజెక్ట్ చేశానన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం. అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. అప్పుడలా...షూటింగ్కు సరిగా వచ్చేవాడే కాదు. దానివల్ల నేను ఒత్తిడికి లోనయ్యాను. యాక్టింగ్ బాగా చేస్తాడు, కానీ షూటింగ్కు రాకుండా చిరాకు తెప్పించేవాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ తనలో చాలా మార్పు వచ్చింది అని చెప్పుకొచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే.. ఆషిక్ ఆవారా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమామై ఖిలాడీ తు అనారి, ఏక్తా రాజా, హమేశా, కీమత్: దే ఆర్ బ్యాక్, కచ్చే ఢాగే, దిల్ చహతా హై, డర్నా మానా హై, హమ్ తుమ్, ఓంకార, లవ్ ఆజ్ కల్, తానాజీ ఇలా అనేక సినిమాలు చేశాడు. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం హైవాన్, హమ్ హిందుస్తానీ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె -
ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంటూనే ఉంది. స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికా సైడ్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ది వైట్ లోటస్లో యాక్ట్ చేసే అవకాశాన్ని కూడా వదిలేసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది.హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి అవుట్ది వైట్ లోటస్ నాలుగో సీజన్ కోసం మేకర్స్ దీపికను సంప్రదించారట! అయితే ఈ ప్రాజెక్ట్లో నటించాలంటే ఆడిషన్ తప్పనిసరి అని టీమ్ చెప్పిందట. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తనకు ఆడిషన్ ఏంటన్న భావనతో దీపికా ఈ ఛాన్స్ను వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీపిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. అరవడం పెద్ద విషయం కాదుప్రశాంతంగా ఉండటమే అన్నింటికంటే గొప్ప వరం. సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడటం పెద్ద విషయం కాదు. దానికి ఎటువంటి శక్తి, బలం అవసరం లేదు. కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్థబ్ధుగా, ప్రశాంతంగా ఉండాలి, భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదు. ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. అదొక శక్తి. మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థంపర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్గా ఉండటమే అన్నింటికంటే పెద్ద సూపర్ పవర్ అని దీపికా పదుకొణె రాసుకొచ్చింది.చదవండి: హీరోలు రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే: తాప్సీ -
హీరోలు నన్ను రిజెక్ట్ చేశారు.. వాళ్ల వల్లే..: తాప్సీ
'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది తాప్సీ పన్ను. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, సాహసం, గేమ్ ఓవర్, మిషన్ ఇంపాజిబుల్ ఇలా తెలుగులో అనేక సినిమాలు చేసింది. తమిళ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది. సౌత్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడే పాగా వేసింది.హీరోల వెనకడుగుతాజాగా ఈ బ్యూటీ అస్సి అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న తాప్సీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు వెనకడుగు వేశారు. కారణాలు తెలీదు కానీ నాతో చేయననేవారు. అలా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి.చాలామందికి పెద్ద షాక్చాలామటుకు సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది ఫైనల్గా హీరోనే నిర్ణయిస్తాడు. అయితే కొందరు దర్శకులు మాత్రం ఫలానా హీరోయినే కావాలని పట్టుబడతారు. వారు కోరుకున్న హీరోయిన్తోనే సినిమా మొదలుపెడతారు. ఉదాహరణకు డండీ సినిమానే తీసుకుందాం. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సర్ నన్నే తీసుకోవాలని డిసైడయ్యారు. నిజానికి షారూఖ్తో తరచూ జత కట్టే హీరోయిన్స్ వేరు. కానీ, అది బ్రేక్ చేస్తూ నన్ను ఎంపిక చేయడంతో చాలామంది షాకయ్యారు. ఇకపోతే నాతో పనిచేయడం కష్టమని ఓ రూమర్ ఉంది. అదెలా వచ్చిందో నాకర్థం కాదు.అదే నిజమైతే..ఎందుకంటే నా కెరీర్లో చాలామంది దర్శకుడు నాతో మళ్లీ మళ్లీ పని చేశారు. నాతో పని చేయడం కష్టమైతే సెకండ్ టైమ్ నన్నెందుకు తీసుకుంటారు? నాతో పని చేయనివారు, నా గురించి తెలియనివారే నాపై అనవసరమైన రూమర్ పుట్టించారు. దానికోసం ఆలోచించి నేనేంటో బయటకు వచ్చి చెప్పాల్సిన పనిలేదు. నేను పనితోనే సమాధానం చెప్తాను అంది తాప్సీ.చదవండి: నీకు ఉసురు తగులుతుంది.. హేటర్స్కు ఇచ్చిపడేసిన తనూజ -
‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ధురంధర్ 2 చిత్రం కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ని క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి యామీ గౌతమ్ ధురంధర్ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్.. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్ అన్నారు.ఇక ధురంధర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ‘ధురంధర్’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. -
పిల్లలంటే ప్రాణం.. ఆ విషయంలో మాత్రం: ఉదయభాను
ఒకప్పుడు యాంకర్గా ఉర్రూతలూగించిన ఉదయభాను ఇప్పుడు సినీ నటిగా అలరిస్తోంది. గతేడాది త్రిబాణధారి బార్బరిక్ చిత్రంలో అలరించిన ఈ యాంకర్ ఇప్పుడు డాటరాఫ్ ప్రసాద్రావు: కనబడుట లేదు వెబ్ సిరీస్లో పోలీస్గా కనిపించింది. ఈ సిరీస్ జీ 5లో నేడే రిలీజైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఉదయభాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది.జాగ్రత్త అవసరంఆమె మాట్లాడుతూ.. జెన్జీ కిడ్స్ వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటున్నారు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు బిజీ.. పిల్లలు అయితే చదువు లేదంటే ఫోన్తో బిజీ అయిపోతున్నారు. కానీ, సోషల్ మీడియాకు పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే సోషల్ మీడియా టాక్సిక్.. అక్కడ మంచి కన్నా చెడుయే ఎక్కువగా ఉంది. ఈ ఫోన్ పిల్లల్ని క్రిమినల్స్గా మార్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.పిల్లలంటే ప్రాణంనాకు పిల్లలంటే ప్రాణం. వాళ్ల కోసం ఉదయం ఐదుగంటలకే లేచి వంట చేసి పెట్టి షూటింగ్కు వెళ్తాను. వారికోసం ప్రత్యేక సమయం కేటాయిస్తాను. ఇకపోతే నేను తొలిసారి మైక్ పట్టింది హృదయాంజలి కోసం! అప్పటికి చిన్న చిన్న సీరియల్స్ చేశాను. కానీ హృదయాంజలి షోతోనే యాంకర్గా నా జర్నీ మొదలైంది అని ఉదయభాను చెప్పుకొచ్చింది.చదవండి: నాన్స్టాప్ షూటింగ్.. ఐదో రోజు ఆస్పత్రిలో హీరోయిన్ -
4 రోజులు ఇంటికెళ్లకుండా షూటింగ్.. 5వ రోజు ఆస్పత్రిలో!
సాధారణంగా ఉద్యోగులు 8-9 గంటలపాటు పని చేస్తారు. కానీ సినిమా, బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం కొన్నిసార్లు గ్యాప్ లేకుండా రోజంతా షూటింగ్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటోంది బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాళ్లు నొప్పి పుట్టి ఇక నిలబడటం నా వల్ల కాదు అనేవరకు పని చేయించుకుంటూనే ఉంటారు. ఇంటికి వెళ్లేంత తీరిక ఎక్కడిది?నా కెరీర్ మొదట్లో వెంటవెంటనే సినిమాలు చేశాను. షూటింగ్స్కు గ్యాప్ ఉండేది కాదు. కనీసం ఫిలిం సిటీ నుంచి నా ఇంటికి వెళ్లే తీరిక కూడా దొరికేది కాదు. దాంతో నిర్మాతలను షూటింగ్ లొకేషన్లోనే నాకంటూ ఒక రూమ్ వసతి కల్పించమని అడిగేదాన్ని. పొద్దున ఐదింటికి షూట్ స్టార్ట్ చేస్తే ఐదు గంటల వరకు కొనసాగేది. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఏడింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్ అయ్యేది. సినిమాఅలా వరుసగా ఐదు రోజులు జరిగింది. దాంతో ఆరో రోజు నేను సెట్లో కాకుండా హాస్పిటల్లో పడున్నాను అని గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె అడిగినట్లుగా 8 గంటల పని డిమాండ్ సబబే అని వత్తాసు పలికింది. కాగా ఇషా కొప్పికర్.. చంద్రలేఖ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసింది. చివరగా అయలాన్ మూవీలో తళుక్కుమని మెరిసింది.చదవండి: తల్లినవుతా.. కానీ పెళ్లి అవసరం లేదు: హీరోయిన్ -
డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్ లవ్స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు.లవ్ సాంగ్మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్ బాధను కూడా చూపించారు.సినిమాఇదివరకు రిలీజైన టీజర్లో యాక్షన్ను ఎక్కువ హైలైట్ చేయగా ఈ పాటలో మాత్రం లవ్ టచ్ ఎక్కువ జోడించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
పెళ్లంటేనే భయమేస్తోంది.. ఎగ్స్ భద్రపర్చుకున్నా!
ప్రస్తుత సమాజంలో చాలామంది పెళ్లంటేనే భయపడుతున్నారు. హీరోయిన్ డైసీ షా కూడా పెళ్లంటే వెనకడుగు వేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ సింగిల్గా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, డబ్బు.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు తెలివిగా రెండూ అని బదులిచ్చింది. రోజుకో వార్త..పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రేమలు, పెళ్లిళ్ల గురించి రోజుకో రకమైన వార్తలు వింటూనే ఉన్నాం. బ్లూ డ్రమ్ కేస్, బ్రేకప్ కేసులు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అయితే పిల్లలు కనేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటికే నేను నా అండాలను భద్రపరుచుకున్నాను. నేనెప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు పిల్లల్ని కంటాను అని చెప్పుకొచ్చింది.సినిమాడైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించింది. భద్ర అనే కన్నడ మూవీతో హీరోయిన్గా మారా జైహో అనే హిందీ చిత్రంతో పేరు తెచ్చుకుంది. చివరగా రెడ్ రూమ్ వెబ్ సిరీస్తో అలరించింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది. -
అదో చెత్త మూవీ.. ఇంత అపహాస్యం చేస్తారా?: నటుడు
ప్రముఖ మలయాళ స్టార్ జయరామ్ కుమారుడు, నటుడు కాళిదాస్ జయరామ్ ఓ బాలీవుడ్ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.చెత్త మూవీఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.సినిమాపరమ్ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కేరళ కుట్టిగా యాక్ట్ చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి -
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్పూర్లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
అమ్మో.. రుక్మిణినా?.. భయపడిపోతున్న దర్శకనిర్మాతలు!
ఈ తరం హీరోయిన్లు నటనపై కంటే ధనార్జన పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అలా అవకాశాలను కోల్పోతున్నారా ? నటి రుక్మిణి వసంత్ లాంటి నటీమణులను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ కన్నడ భామ సినీ పయనం జస్ట్ ఆరేళ్లే. అయితే ఈ అమ్మడు ఇంత తక్కువ కాలంలోనే పాన్ ఇండియా కథానాయకిగా మారడం విశేషమే. 2019లో ఒక కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తాజాగా తెలుగు భాషల్లో చిత్రాలు చేశారు. ఇటీవల కన్నడం చిత్రం కాంతార –2లో నటించి విశేష గుర్తింపును పొందారు. పారితోషికం పెంచాలంటే ఎవరైనా, మంచి విజయం కోసం ఎదురు చూడాలి. అలాంటి హిట్ రుక్మిణి వసంత్కు కాంతారా– 2 చిత్రంతో వచ్చింది. తాజాగా ఓ తెలుగు, కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇంతకు ముందు విజయ్ సేతుపతికి జంటగా ఏస్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది. అదే విధంగా తెలుగులోనూ రంగప్రవేశం చేశారు. అక్కడ నటించిన తొలి చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం విజయాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి లక్కు ఉన్నట్లుంది ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వరించింది. ఇకపోతే కన్నడంలో యశ్తో కలిసి నటించిన టాక్సిక్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ అమ్మడి చేతిలో డ్రాగన్ అనే ఒక్క చిత్రం మాత్రమే ఉంది. కొత్తగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం వల్లే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపిక చేయడానికి వెనుకడుగు వేస్తున్నారట. రుక్మిణి వసంత్ ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 12 చిత్రాలు మాత్రమే చేశారు. అప్పుడే కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తుండడం చర్చనీయాశంగా మారుతోంది. -
ఓటరును పడగొట్టే 'సినిమా'..ఇదో కొత్త రాజకీయం!
సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్గానే ఉంటాయి. నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్గా మారింది.పినరయిలోని మరో కోణంకేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది. ఇదే పంథాలో ప్రపంచ నాయకులుభారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.కలిసొస్తున్న ‘గ్లామర్’ పాలిటిక్స్రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్ పవర్ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. -
గ్రాండ్గా విరోష్ పెళ్లి.. విజయ్ దేవరకొండకు భారీ కట్నకానుకలు?
టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్లో హైదరాబాద్లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్లో ఎప్పుడూ లేనంత గ్రాండ్గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు. -
చిరంజీవితో ఇలాంటి సినిమానా..?, పెద్ద సాహసమే : పరుచూరి
ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు రూ. 400 కోట్ల వరకు వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణను (రివ్యూ) పంచుకున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.రాజేంద్ర ప్రసాద్, నరేశ్ వంటి వారితో కేవలం కామెడీ సినిమాలు తీయడం వేరు, కానీ చిరంజీవి వంటి మాస్ హీరోతో పూర్తిస్థాయి యాక్షన్ కామెడీ చేయడం ఒక సాహసమని, దాన్ని అనిల్ రావిపూడి విజయవంతంగా పూర్తి చేశారని పరుచూరి కొనియాడారు. నిర్మాతగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మొదటి ప్రయత్నంలోనే తండ్రిని మళ్లీ ‘ఇంద్రసేనుడిలా’ సింహాసనంపై కూర్చోబెట్టారని ప్రశంసించారు.కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సక్సెస్ అయిందని, అందుకే రూ. 400 కోట్ల క్లబ్లో చేరిందని ఆయన పేర్కొన్నారు.‘మొదటి సన్నివేశంలో హీరో పాత్రకు పెళ్లి అయిందని భార్యకు దూరంగా ఉంటాడని చూపించారు. రెండో సన్నివేశంలోనే హీరో పాత్ర తీరు చెప్పారు. టీవీ సీరియల్తో తన కథను ముడిపెడుతూ చూపించారు. హీరోకు చిన్న కామెడీ టీమ్ని పెట్టి ఆ టీమ్లో ఒక హీరోయిన్ ఉండేలా చూశారు. ఆమెను కామెడీ టీమ్లో ఎందుకు పెట్టారు అని అందరికీ అనుమానం కలిగింది. అలా ఎందుకు పెట్టారో చివర్లో చూపించారు. హీరో, హీరోయిన్ ఎప్పుడు కలుస్తారు? ఎలా కలుస్తారు.. ఇలా ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం కానీ మనకంటే ముందు రచయిత, దర్శకులు వేసుకొని వాటిని పద్ధతి ప్రకారం స్క్రీన్ప్లే చేశారు. మధ్యమధ్యలో ఎమోషనల్ డైలాగులతో కూడా ఆకట్టుకున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా నీ పిల్లల్ని చూడాలని అనిపించి మా ఇంటికి వస్తే గేటు దగ్గర నిలబడి రిక్వెస్ట్ చేయి. పైనుంచి చూపిస్తా. పిల్లల్ని చూసి వెళ్లిపో’ అన్న మనిషి ప్రమాదంలో పడితే.. అతడిని హీరో ఎలా కాపాడాడు అనేది గొప్పగా చూపించారు. కామెడీ టీమ్లో ఉన్న హీరోయిన్.. చివరకు వెంకటేశ్ను పెళ్లి చేసుకోవడం ట్విస్ట్. ఇందులో మధ్యమధ్యలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దీన్ని యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించడానికి, చిరంజీవికి చిన్న సెల్యూట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికీ అదే ఎనర్జీ, అవే స్టెప్లు, అవే మూమెంట్లు అస్సలు ఏమాత్రం తేడా లేదు. మా చిరంజీవి.. ఎప్పటికీ మా చిరంజీవే అనిపించుకున్నారు’అంటూ తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. -
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్బాస్ షణ్ను ఎంగేజ్మెంట్ -
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అల వైకుంఠపురములో, రంగ్దే, టక్ జగదీశ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమాతో హీరోయిన్గా మారి ఫస్ట్ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ, అవార్డులు అందుకుంది. కోలీవుడ్ ఎంట్రీప్రస్తుతం ఎపిక్: ద సెమిస్టర్ మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్గా మారింది. జీవీ ప్రకాశ్ హీరోగా విఘ్నేశ్ కార్తీక్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. ఇప్పటికే 'హాట్స్పాట్ టూ మచ్'తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాఈ క్రమంలో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్లో జీవీ ప్రకాశ్ హీరోగా, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అజిత్ హీరోగా నటించిన వాలిమై అనే తమిళ మూవీలో వైష్ణవి చైతన్య చిన్న రోల్ చేసింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం కోలీవుడ్లో కథానాయికగా ఇదే తన తొలి సినిమా కానుంది.చదవండి: పెళ్లి వేడుకలో వరుణ్- లావణ్య.. ఎక్కడంటే? -
పెళ్లి వేడుకలో వరుణ్- లావణ్య.. ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అయితే మీరనుకున్నట్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల పెళ్లి వేడుకలో కాదు, లావణ్య సోదరుడు సిద్దాంత్ వివాహ వేడుకలో అని తెలుస్తోంది. కుమారుడు వాయువ్తో కలిసి వరుణ్- లావణ్య ఈ శుభకార్యంలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీఈ పెళ్లి డెహ్రాడూన్లో జరిగినట్లు తెలుస్తోంది. అటు నిహారిక సైతం మెహందీ సెలబ్రేషన్స్ అంటూ చేతులకు చందమామ పెట్టుకున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆ తర్వాత మేనల్లుడిని జాగ్రత్తగా చూసుకుంటున్న వీడియో షేర్ చేసింది. ఇదంతా చూస్తుంటే ఇది లావణ్య ఇంటి ఫంక్షన్లాగే అనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. వరుస అపజయాలతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు మూవీ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ హారర్ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. Mega Prince @IAmVarunTej and @Itslavanya spotted at Lavanya’s brother’s wedding festivities in Dehradun with little Vaayuv Tej 🫶✨#VarunTej #LavanyaTripathi #VaayuvTej pic.twitter.com/1jqmBagN4Q— Team Chiru Vijayawada (@SuryaKonidela) February 25, 2026 -
ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన స్టార్ హీరో.. ప్రోమో రిలీజ్
సాధారణంగా సినీ తారలను, రాజకీయ నాయకులను జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ కేరళలో ఓ అరుదైన ఇంటర్వ్యూ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన 'ప్రోమో' తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'క్లిఫ్ హౌజ్' ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి వేదికైంది. సాధారణంగా గంభీరంగా కనిపించే ముఖ్యమంత్రి, మోహన్ లాల్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ పాలన వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మోహన్ లాల్ ఒక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇదే తరహాలో ఇంటర్వ్యూ చేసి మెప్పించారు. ఇప్పుడు పినరయి విజయన్తో ఆయన చేసిన సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇది ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ప్రయత్నాల్లో భాగమేనని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒక నటుడిగా కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకం’ అని ఈ సందర్భంగా మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. The teaser for the special Mohanlal interview of Kerala CM Shri Pinarayi Vijayan.. Superstar-turned-interviewer at Cliff House—covering life, politics, governance & even CM’s love for films! 🔥Titled “കണ്ടും മിണ്ടിയും ഇരുവർ” (or “Iruvar”), full episode coming soon. Buzz is… pic.twitter.com/qgL6gBl9iB— John Brittas (@JohnBrittas) February 24, 2026 -
డ్రైవింగ్ చేస్తూ నిద్ర పోతున్నాడు: హీరోయిన్
హీరోయిన్ మీరా చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. క్షేమంగా, వేగంగా వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటే డ్రైవర్ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నానని చెప్తోంది. ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఉబర్ క్యాబ్ వల్ల నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. మంగళవారం ఉదయం ఆరుగంటల కోసం కారు బుక్ చేసుకున్నాను. తీరా దుమ్ము, మురికి పట్టిన కారు వచ్చింది. డ్రైవర్ కూడా అంతే డర్టీగా ఉన్నాడు. కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్ను అడిగాను. నిద్రపోతూ డ్రైవింగ్కానీ, అతడు సమాధానం చెప్పే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్ దిగిపోయి మరొకటి బుక్ చేసుకున్నాను. కానీ ఉబర్ మాత్రం నా నుంచి 6 గంటల ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని.. ఇదెంత అసహ్యకరం అని ట్వీట్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్లు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటూ వారి అనుభవాలు షేర్ చేసుకున్నారు.సినిమామీరా చోప్రా విషయానికి వస్తే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ మూవీ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ద టాటూ మర్డర్స్ అనే వెబ్ సిరీస్లోనూ నటించింది. Had a massively scary unfortunate experience with @Uber @Uber_India. Booked a cab fr 6 hrs early morning. Driver came dirty with a stinking and dusty car. When i asked him why the car is stinking i realised hes not able to talk also coz he was almost sleeping while driving. I…— Meerra Chopraa (@MeerraChopra) February 24, 2026 చదవండి: ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే: తమన్నా -
ఇకపై రూ. 1000 కోట్లు అక్కర్లేదు.. రాజమౌళితో పోలుస్తూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
రామ్గోపాల్ వర్మ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ . తాజాగా ఆయన 'సీడెన్స్ 2.0'( Seedance 2.0) అనే ఏఐ(AI) టూల్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగాన్ని ఏఐ ఏ విధంగా 'ఖూనీ' చేయబోతోందో, అదే సమయంలో సామాన్యుడికి ఏ విధంగా ముక్తి ప్రసాదించబోతోందో ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.టెక్నాలజీ మారుతున్న కొద్దీ సినిమా మేకింగ్ విధానం మారుతుందని అందరికీ తెలుసు, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా సినిమా ఇండస్ట్రీ మరణం గురించి జోస్యం చెప్పారు. 'సీడెన్స్ 2.0' వంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ రాకతో, కోట్లాది రూపాయల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో కూడిన ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ 'బ్రూటల్ మర్డర్' కాబోతోందని ఆయన ట్వీట్ చేశాడు.అత్యంత ఖరీదైన సినిమాలు తీసి, అత్యంత విజయవంతమై సినిమాలు తీయడం వల్ల రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు. రూ. 1000 కోట్లు కాదు అంతకంటే ఎక్కువ రాబట్టగలడనే ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. ఇదంతా ఆయనకు ఉన్న అసమానమైన క్రియేటివ్ ఊహాశక్తి వల్లే సాధ్యం అయింది. కానీ ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో, ఎంతమంది రాజమౌళిలు లేదా ఆయన కంటే మెరుగైనవాళ్లు చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు? క్రియేటివ్ విజన్ ఉన్నవాళ్లు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్సెస్ లేనివాళ్లు, డబ్బులు లేనివాళ్లు... వాళ్లకు అవకాశం తలుపు మూసేసి, కీలు కొందరి దగ్గరే ఉంది. కానీ సీడెన్స్ 2.O ఆ తలుపులను తన్ని పారేసింది. ఇక టాలెంట్ ఉంటే చాలు, అవకాశం కోసం ముంబై రానక్కర్లేదు. ఇది కేవలం వాళ్ల డిస్క్రిప్టివ్ ప్రాంప్ట్లు తీసుకొని, సినిమాటిక్గా, మల్టీ-షాట్లతో, సౌండ్ డిజైన్తో, వందల కోట్ల ఖర్చుతో, నెలలు పట్టే సీన్లను క్రియేట్ చేస్తుంది. ఇకపై నటులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, లైట్ బాయ్స్.. ఇలా భారీ సైన్యం అవసరం లేకుండానే థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు వస్తాయి.స్టార్ ఇష్యూస్ లేవు . బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్లు భయపడాల్సిన అవసరం లేదు ."పోస్ట్లో ఫిక్స్ చేద్దాం" అనే పని లేదు. ఒక షాట్ కోసం 300 మంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకరు. ఒక ప్రాంప్ట్. ఒక మైండ్. అడ్వాన్స్డ్ AIలు ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు తయారు చేయగలిగినప్పుడు... యూనియన్లు, కోట్ల ఓవర్హెడ్స్, "మాకే సినిమాలు తీయడం తెలుసు" అనే అహంకారం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మరణిస్తుంది. నెమ్మదిగా కాదు. శాంతియుతంగా కాదు. బ్రూటల్గా మర్డర్ అవుతుంది. కానీ దాని హార్ట్లో... ఇది సినిమాకు నిజమైన లిబరేషన్. డైనోసార్లు 100 ఏళ్లు రాజ్యం చేశాయి. ఇప్పుడు ఆస్టరాయిడ్ వచ్చేసింది. దాని పేరు AI. కొత్త ఎరాకు స్వాగతం. ఇక్కడ టాలెంట్ మాత్రమే ముఖ్యం, యాక్సెస్ కాదు. అదే చంపేస్తుంది. అదే రక్షిస్తుంది. ఇక వెనక్కి తిరిగి రానిది. కాబట్టి ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మరణమా? లేక ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క అల్టిమేట్ డెమోక్రటైజేషనా?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు. SEEDANCE 2.0 , the MURDERER of FILM INDUSTRY Leaving aside its copyright infringements etc which is another matter , here’s my take on Seedance 2.0 @ssrajsmouli is the no. 1 director because he makes the most expensive films and the most successful ..People fund him a 1000…— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2026 -
ఎంత సంపాదించినా ఇప్పుడే.. లేదంటే చివరకు!: తమన్నా
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటోంది హీరోయిన్ తమన్నా భాటియా. చేతిలో అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు వాటిని భద్రంగా కాపాడుకోవాలని చెప్తోంది. ఆ ముందుజాగ్రత్త లేకపోతే మొదటికే మోసం వస్తుందని, చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. రెండు దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే ఆభరణాల బిజినెస్లో అడుగుపెట్టింది.నాన్న వల్లే..ఆర్థిక భద్రత గురించి ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో నాన్నే నా ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఇప్పటికీ ఈ విషయంలో ఆయన సపోర్ట్, గైడెన్స్ ఎంతగానో ఉంది. ప్రస్తుతం నేను నా పెట్టుబడి వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ.. ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టాలన్న ముందుచూపుకు నాన్నే కారణం. ఆయన దగ్గరినుంచే ఈ ఆర్థిక క్రమశిక్షణ అలవడింది.సంపాదన ఉన్నప్పుడే..సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకానొక సమయంలో యాక్టర్స్ భారీగా సంపాదించగలరు. కానీ, దాన్ని సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలి. ఆ డబ్బును రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేయాలి. లేదంటే మాత్రం చివరకు ఏమీ మిగలదు అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ మూవీ మే 15న విడుదల కానుంది.చదవండి: పవన్ కల్యాణ్పై పూనమ్ సెటైర్లు -
పెళ్లి వేళ.. రష్మిక ముద్దు సీన్ వ్యాఖ్యలు వైరల్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ నెల 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇద్దరూ స్పందించలేదు. తాము రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ పరోక్షంగా హింట్ ఇస్తూనే వచ్చారు. చివరకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సడెన్గా పెళ్లి డేట్ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. రేపు ఉదయం ఉదయ్పూర్లోని ఓ రిసార్ట్లో వీరిద్దరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.ఇదిలా ఉంటే..పెళ్లివేళ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. రష్మిక గతంలో 'గీత గోవిందం' సినిమాలోని తన తొలి ముద్దు సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘తొలిసారి ఆన్స్క్రీన్పై ముద్దు సీన్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చాలా వ్యక్తిగతమైన విషయం. సెట్లో 200 మంది చూస్తుండగా ఎలా చేయాలో అర్థం కాలేదు. అయితే, నా కో-యాక్టర్ విజయ్ది కూడా అదే పరిస్థితి. నాలాగే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. చివరకు అది ఒక టెక్నికల్ విషయంలా పూర్తి చేశాం. పాత్రకు అవసరమైతే అలాంటి సీన్ చేయాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. కాబోయే భర్తతోనే తొలి ముద్దు సీన్ చేయడం గమనార్హం. కాగా, రష్మిక, విజయ్ గీత గోవిందంతో పాటు డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ కలిసి నటించారు. -
విషాదం.. 37 ఏళ్ల యువ నటుడు మృతి!
ఫిట్నెస్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు, బాడీ బిల్డర్ మయాంక్ పవార్ (37) అకాల మరణం సినీ, క్రీడా రంగాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, ఈ నెల 23న తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మయాంక్ పవార్ కేవలం నటుడిగానే కాకుండా, బాడీ బిల్డింగ్ రంగంలోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ను గెలుచుకుని రికార్డు సృష్టించారు.ప్రముఖ రియాలిటీ షో 'MTV Splitsvilla' సీజన్ 7లో కంటెస్టెంట్గా పాల్గొని యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవలే తన 37వ పుట్టినరోజును జరుపుకున్న మయాంక్, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. "ఒక గొప్ప ఫిట్నెస్ ఐకాన్ను కోల్పోయాం" అంటూ పోస్ట్లు పెడుతున్నారు. మోడల్గా, నటుడిగా ఎదుగుతున్న తరుణంలోనే ఈ విషాదం జరగడం దురదృష్టకరం. View this post on Instagram A post shared by Mayank Pawar™ (@pawarmayank) -
క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది : కోన వెంకట్
‘‘గుండెలో నుంచి వచ్చే ప్రేమకథకు ఎలాంటి ఆదరణ దక్కుతుందని ‘నిన్ను కోరి’ సినిమాతో తెలిసింది. నాని ఫిల్మోగ్రఫీలో ‘నిన్ను కోరి’ మరచిపోలేని చిత్రంగా నిలిచింది. శివ నిర్వాణ ఈ కథను గుండెతో చెప్పాడు. సతీష్ ‘బ్యాండ్ మేళం’ కథను చెప్పినప్పుడు నాకు అదే అనుభూతి కలిగింది. ఈ మూవీ క్లయిమాక్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ తెలిపారు. ‘కోర్ట్’ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. మార్చి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి సంగీత దర్శకుడు తమన్, దర్శకులు నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వేణు ఊడుగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమన్ మాట్లాడుతూ– ‘‘కోనగారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ‘దూకుడు’తో నా కెరీర్ ఇంకా కొనసాగుతూనే వెళ్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘కోనగారి వల్ల ఎంతో మంది దర్శకులు, రచయితలు ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన నాకు గాడ్ ఫాదర్’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా ఇది’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమాని అందరూ చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని సతీష్ జవ్వాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి చెప్పారు. -
అలా నటించటం తప్పేమీ కాదు : కాజల్
సీనియర్ హీరోయిన్లు తమ ఉనికిని చాటుకోవడానికి చాలా పాట్లు పడుతున్నారనే చెప్పాలి. ఇంతకుముందు వరకు భారతీయ సినిమాలో అగ్ర కథానాయకులుగా రాణించిన కొందరు హీరోయిన్లు పెళ్లై పిల్లలు కలిగినా సినిమాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇంకా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో తమ అందాలకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అందమైన ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ ప్రచారంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు తమిళం హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య పెళ్లి కూడా చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యారు. అయినప్పటికీ నటనకు దూరం కావడానికి ఇష్టపడడం లేదు. దీంతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. అందులో భాగంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అందాలను ప్రదర్శించే విధంగా సిద్ధమై వస్తున్నారు.తనను చూసి సీనియర్ నటి అని ఎవరు భావించరాదని ఉద్దేశంతో జూనియర్ నటీమణులకు పోటీగా పొట్టి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. అంతేకాకుండా ఈ భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లామర్ అనేది నటనలో ఒక భాగమేనని అన్నారు. అలా నటించటం తప్పేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా వివాహం అనేది నటిమణుల పయనానికి అడ్డు కాదని అన్నారు. ఈమె వ్యాఖ్యలు తన సహ నటీమణులను ఆలోచనల్లో పడేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’.. యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్?
టాలీవుడ్ హీరోలు యంగ్ దర్శకులపై చర్చ వస్తే తరచూ అట్లీ, ప్రశాంత్ నీల్, నీల్సన్, కార్తీక్ సుబ్బరాజు వంటి పేర్లే వినిపిస్తుంటాయి. కానీ మన దగ్గర కూడా యూత్ను ఆకట్టుకునే స్టైలిష్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించగల టాలెంట్ ఉన్న దర్శకులు ఉన్నారు.అందులో ముఖ్యంగా నిలుస్తున్న పేరు సుజీత్. ‘ఓజి’తో సుజీత్ ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా చుట్టూ ఏర్పడిన అంచనాలు, టీజర్లు, పోస్టర్లు—అన్నీ కలిపి సుజీత్ను పాన్ ఇండియా రేంజ్లో చర్చకు తెచ్చాయి. ‘ఓజి’ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్పై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది.సుజీత్ తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నానితో ఉండనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇండస్ట్రీలో ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. తాజాగా విడుదలైన ‘బ్లడీ రోమియో’ అనౌన్స్మెంట్ వీడియో ఈ ప్రాజెక్ట్పై మరింత స్పష్టత ఇచ్చింది. వీడియోలో కనిపించిన విజువల్స్ ఆధారంగా ఈ సినిమా యుకే ఫుడ్ మాఫియా బ్యాక్డ్రాప్లో సాగనుందని అర్థమవుతోంది. ఫుడ్ రెసిపీలు, చెఫ్ ఎలిమెంట్స్, వంటకాలకు సంబంధించిన సింబాలిజం వంటివి కథలో కీలక భాగమని సూచిస్తున్నాయి. లోగోలో కనిపించిన లండన్ బ్యాక్డ్రాప్ సినిమా సెట్టింగ్ను క్లియర్ చేసింది.ఇప్పటివరకు విభిన్న జానర్లలో తనదైన ముద్ర వేసుకున్న నాని, శ్రీకాంత్ ఓడెలతో కలిసి ఇటీవల రగ్డ్ పీరియాడిక్ టచ్ ఉన్న ‘పారడైజ్’ తరహా కథ తర్వాత సుజీత్తో పూర్తిగా స్టైలిష్ యాక్షన్ జోన్లోకి అడుగుపెడుతున్నారు. గన్స్, గర్ల్స్, స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్ సీన్స్ అన్నీ కలిపి ఈ చిత్రం ఫుల్ క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని టాక్. యూత్కు నచ్చేలా స్టైలిష్గా సినిమా తీయగల దర్శకుడిగా సుజీత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నాని వంటి నటుడితో కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ చిత్రం టాలీవుడ్కు కొత్త స్టైలిష్ యాక్షన్ ఫేజ్ను తెచ్చిపెడుతుందా? అన్నది చూడాలి. -
ఆ ఒక్క మాటతో మటన్ బిర్యానీ తినడం ఆపి, వాంతులు చేసుకున్నా : అనుపమ
గ్లామర్ డాల్గా మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్. నిరంతరం షూటింగులతో బిజీగా ఉండే ఈ మలయాళ కుట్టి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితాన్ని మలుపు తిప్పిన చేదు జ్ఞాపకాన్ని పంచుకుంది. ఆమె ఆహారపు అలవాట్లనే మార్చేసి, ఆమెను కొన్నాళ్ల పాటు శాకాహారిగా మార్చిన ఆ ‘మటన్ బిర్యానీ’ ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.అసలేం జరిగింది?బ్లాక్ బస్టర్ హిట్ 'కార్తికేయ-2' షూటింగ్ సమయంలో సెట్లోకి ఓ చిన్న మేకపిల్ల వచ్చిదంట. ఆ సమయంలో అక్కడే ఉన్న అనుపమ..దానితో కాసేపు ఆడుకొని, వదిలిపెట్టేసిందట. కట్ చేస్తే.. అదే రోజు మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే.. అసిస్టెంట్ వచ్చి నవ్వుతూ ‘మేడం.. మీరు తింటున్నది పొద్దున్నే మీరు ఎంతో ప్రేమగా ఆడుకున్న ఆ మేకపిల్లతో తయారు చేసిన బిర్యానీయే’ అన్నారట. ‘ఆ మాట విన్న వెంటనే ఆమె గొంతులో ముద్ద దిగలేదు.ప్లేటు పక్కన పడేశా. వాంతులు కూడా చేసుకున్నా. ఆ రోజు నుంచి మటన్ తినడమే మానేశా. చాలా రోజుల పాటు మటన్ విషయం వస్తే.. ఆ మేకపిల్ల గుర్తుకు వచ్చేది. ఈ మధ్యే మళ్లీ తినడం స్టార్ట్ చేశా’ అని ఓ ఇంటర్వ్యూలో అనుపమ చెప్పుకొచ్చింది. అనుపమ కెరీర్ విషయానికొస్తే..గత ఏడాది తెలుగులో ‘కిష్కింధపురి’, ‘పరదా’తో పాటు, మలయాళం, హిందీలో కలిసి మొత్తం ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం.ఆర్జే షాన్ దర్శకత్వంతో ఓ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తోంది. -
గల్ల పట్టుకొని కొట్టుకున్న రాజమౌళి, మహేశ్.. ఏఐ వీడియో వైరల్
సాంకేతికత ఎంత ఎదిగితే అంత ముప్పు కూడా ఉంటుందనే మాట నిజమనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న దృశ్యాలు అసలు-నకిలీల మధ్య తేడాను చెరిపేస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే.. అవి నిజమా కాదా అనేది కూడా కనిపెట్టలేకపోతున్నాం. అలాంటి ఓ ఫన్నీ ఏఐ వీడియోని ఎక్స్లో షేర్ చేశాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్వర్మ. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒకరినొకరు గల్ల పట్టుకొని కొట్టుకుంటున్నారు.ఏఐతో క్రియేట్ చేసిన ఈ వీడియోని ఎక్స్లో షేర్ చేస్తూ.. ‘సినిమా చనిపోయింది’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో మహేష్ బాబు, రాజమౌళి అత్యంత సహజంగా గొడవ పడుతుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఏఐతో ఏదైనా సాధ్యమే’, ‘బహుశా పాస్పోర్ట్ విషయంలోనే(వారణాసి షూటింగ్ మొదలైనప్పుడు మహేశ్ పాస్పోర్ట్ లాక్ చేసినట్లుగా జక్కన్న ఓ పోస్ట్ పెట్టాడు) ఈ గొడవ జరుగుతుందేమో’, ‘వారణాసి ప్రచారం సమయంలో కచ్చితంగా ఈ వీడియోను ప్లే చేస్తా’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమది ఇలాంటి వీడియోల వల్ల సెలబ్రిటీల ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారణాసి విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేశ్బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమరన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు .వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుది. CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026 -
రోడ్డుపై అందరూ కలిసి చితకబాదారు: అక్షయ్ కుమార్
కాలేజీ డేస్లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వన్సైడ్ లవ్ అయితే మరికొందరిది టూసైడ్ లవ్. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడట! ఈ విషయాన్ని 'ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్' షోలో వెల్లడించాడు. తాజాగా ఈ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.అమ్మాయి ఇంటి ముందుతన కాలేజీ డేస్లోని లవ్ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. 'ఇది 40 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాను. తనకోసం ప్రత్యేకంగా ఒక పాట నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ ఒకరికి గిటార్ వాయించడం తెలుసు. కాబట్టి వాడిని వెంటేసుకుని నేరుగా అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. తన్నులు తిన్నాంఅతడు గిటార్ వాయిస్తుంటే నేను పాట పాడటం మొదలుపెట్టాను. నా పాట విని అమ్మాయి వస్తుందనుకుంటే చుట్టుపక్కలవాళ్లు వచ్చి మమ్మల్ని చితక్కొట్టారు. వారి చేతిలో చచ్చామనుకున్నాం. ఎవరినో ఇంప్రెస్ చేద్దామని వెళ్లి మేమే తన్నులు తిని వచ్చాం' అని గుర్తు చేసుకున్నాడు.పర్సనల్ లైఫ్కాగా సినిమాల్లో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్లో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను కలిశాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసింది. 2001లో అక్షయ్, ట్వింకిల్ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2002లో కుమారుడు ఆరవ్ జన్మించాడు. 2012లో కూతురు నితారా పుట్టింది.చదవండి: విడాకుల తర్వాత బాధలో.. ఎవర్నీ నమ్మొద్దనుకున్నా..: సమంత -
జీవితంలో ఎవర్నీ నమ్మననుకున్నా.. అలాంటిది రాజ్ వచ్చాక!
'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది సమంత. తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2025 డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటోంది సామ్.అతడి వల్లే ఇలా ఉన్నాతాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేను. అలాంటిది నా జీవితంలోకి రాజ్ రావడం సంతోషంగా ఉంది. అతడు వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్ వల్లే నేనిప్పుడు బెటర్ పర్సన్గా మారాను. ఈ మధ్యే ఫ్రెండ్ను కలిశా..ఇటీవలే నా పాత ఫ్రెండ్ను కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్లిపోయాక నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేదానివి. చాలాకాలం తర్వాత మళ్లీ మామూలుగా కనిపిస్తున్నావ్ అని మెసేజ్ పెట్టింది (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజ్ వచ్చాక తన జీవితం సంతోషకరంగా మారిందంటోంది సామ్. ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రతిరోజూ కన్నీళ్లే: బాలీవుడ్ నటుడు -
చిల్లిగవ్వ లేక తిండి లేక.. ప్రతిరోజూ ఏడ్చేవాడిని: నటుడు
ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆమిర్ అలీ. ఎఫ్ఐఆర్ అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అతడు నాలుగైదు హిందీ సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు.నా పని అయిపోయిందనుకున్నాఅతడు మాట్లాడుతూ.. నేను టీవీలో ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు బుల్లితెరపై కనిపించాలని లేదు. టీవీలో కనిపిస్తే సినిమా యాక్టర్గా నా పనైపోయినట్లేనని నా అభిప్రాయం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే కొన్ని సినిమాలు చేశాను.. కానీ, అవి రిలీజ్ కాకుండానే ఆగిపోయాయి. దాంతో నాకివ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. చేతిలో చిల్లిగవ్వ లేక..ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తినడానికి తిండి లేక, ఫుడ్ కొనుక్కోవడానికి సరిగా డబ్బు కూడా ఉండేది కాదు. ఇంటి బాధ్యత మొత్తం నాపైనే ఉంది. అప్పటికే నేను రెండు మూడు సినిమాలు చేయడంతో ఇక్కడ కెరీర్ సెట్టయిందన్న భావనతో ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అయిష్టంగా టీవీ ఇండస్ట్రీకి వెళ్లాల్సి వచ్చింది. సీరియల్స్ ఎందుకు అనగానే..అప్పుడు ప్రతిరోజు నేను నా వ్యాన్లో కూర్చుని ఏడ్చేవాడిని. నాతో సినిమాలు చేసినవారందరూ ఎందుకు సీరియల్స్ చేస్తున్నావని అడగ్గానే దుఃఖం తన్నుకొచ్చేది. అరగంటపాటు ఆపకుండా ఏడ్చేవాడిని. 2019లో చాలామంది దర్శకనిర్మాతలను కలిశాను. నువ్వు హీరోవి, నిన్ను సైడ్ క్యారెక్టర్స్లో ఎలా చూస్తారు? ఇప్పటికీ ఇబ్బందులే..ఒకవేళ అలాంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్తాం అంటూ మాట దాటేసేవారు. 2017లో టీవీ ఇండస్ట్రీని వదిలేసినప్పటికీ నాపై బుల్లితెర నటుడు అనే ముద్ర అలాగే ఉండిపోయింది. అంత ఈజీగా నాకెవరూ అవకాశాలివ్వరు అని ఆమిర్ అలీ చెప్పుకొచ్చాడు. ఆమిర్ అలీ.. ఐ హేట్ లవ్ స్టోరీస్, ఫరాజ్ వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: బుల్బుల్ తర్వాతే క్రేజ్.. యానిమల్తో సెన్సేషన్ -
2017లో బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడతడినే పెళ్లి చేసుకుంటున్నా
మలయాళ నటి నిలీన్ సాండ్రా గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. దర్శకుడు శ్యామిన్ గిరీశ్తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. దేవుడు ఒక స్త్రీని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తనను ప్రేమగా చూసుకునే ఓ వ్యక్తిని తన జీవితంలోకి పంపుతాడు. పెళ్లి చేసుకోబోతున్నా..అలా 2017లో నాకోసం నిన్ను పంపాడు. ప్రేమికుడిగా కాదు బెస్ట్ ఫ్రెండ్గా! ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడదే బెస్ట్ ఫ్రెండ్తో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోబోతున్నాను. దేవుడు నాకోసం పంపిన వ్యక్తిని పెళ్లాడబోతున్నాను అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో నిలీన్.. శ్యామిన్తో కలిసి సరదాగా గడిపిన క్షణాలున్నాయి.ప్రియురాలి కోసం..ఒకరికోసం ఒకరు నిలబడటం, విహారయాత్రకు వెళ్లడం, కలిసి భోజనం చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అలాగే శ్యామిన్.. నిలిన్కు చీర సర్దడం, కాలికి మెహందీ వేయడం, కాలికి మసాజ్ చేయడం, తనకోసం ఇల్లు తుడవడం ఇలా ఎన్నో చేశాడు. మలయాళ నటి నిలీన్ సాండ్రా.. 2018, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో నటించింది. అలా సామర్థ్య శాస్త్రం, రాక్ పేపర్ సిజర్స్ వెబ్ సిరీస్లలో కనిపించింది. View this post on Instagram A post shared by Nileen SaNdra (@nileen_sandra) చదవండి: విజయ్- రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే? -
లైఫే టర్నయ్యిందిలే బుల్బుల్ పిట్ట!
టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. కొందరికి ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ వస్తుంది. మరికొందరికి ఏళ్లు గడిచాక గుర్తింపు దక్కుతుంది. హీరోయిన్ తృప్తి డిమ్రి రెండో కోవకు చెందుతుంది. నేడు (ఫిబ్రవరి 23న) ఈ బ్యూటీ బర్త్డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..అనుకోకుండా సినిమాల్లోకి..హీరోయిన్ తృప్తి డిమ్రి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో 1995 ఫిబ్రవరి 23న జన్మించింది. తండ్రి దినేష్ డిమ్రి ఎయిరిండియా ఉద్యోగి. తల్లి గృహణి. తృప్తి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ఆమె సోదరుడి స్నేహితుడు ఫోటోగ్రాఫర్. ఒకరోజు ఈమె ఫోటోలు తీసి ఢిల్లీలోని ఇమేజెస్ బజార్కు పంపించాడు. ఆ ఫోటోలు వారికి నచ్చడంతో ఫోటోషూట్కు పిలిపించారు. అలా తృప్తి జర్నీ మొదలైంది. తండ్రి కోరిక నెరవేర్చేందుకుమొదట్లో యూట్యూబ్ ఛానల్లో పని చేసింది. అక్కడే కెమెరాకు అలవాటు పడటం నేర్చుకుంది. నిజానికి తృప్తి తండ్రికి యాక్టర్ అవ్వాలని కోరికట.. దీంతో తండ్రి కోరికను తాను నెరవేర్చాలనుకుంది. బుల్లితెరపై అయినా నటిస్తే చాలనుకుని మొదట్లో మోడలింగ్ చేసింది. అక్కడ మంచి పేరు రావడంతో నటి అవ్వాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టింది. అయితే నటిని అవుతా అని ఇంట్లో చెప్పగానే కుటుంబంసభ్యులు కొంచెం కంగారుపడ్డారట. అవకాశాలు లేనప్పుడు..పైగా బంధువులు కూడా.. ఆమె ఇండస్ట్రీకి వెళ్తే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరు అని భయపెట్టారు. అయినా ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. ఇండస్ట్రీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవకాశాలు రాని సమయంలో బాధపడింది. కానీ, వెనకడుగు మాత్రం వేయలేదు. అలా మామ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది వచ్చిన లైలా మజ్నులోని లైలా పాత్రలో ప్రేక్షకులకు దగ్గరైంది. యూత్ క్రష్2020లో వచ్చిన హారర్ మూవీ బుల్బుల్తో ఓటీటీ స్టార్గా మారింది. ఆ మూవీ తర్వాత తన దశ తిరిగిపోయింది. 2023లో వచ్చిన సందీప్రెడ్డి వంగా యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. యూత్ అందరికీ క్రష్గా మారిపోయింది. బ్లాక్బస్టర్ మూవీ భూల్ భులయ్యా 3లో ద్విపాత్రాభినయం చేసింది. ప్రస్తుతం హిందీలో మా బెహెన్, తెలుగులో ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమా చేస్తోంది. తెలుగులో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం!చదవండి: ఫుడ్డుతో చంపేస్తున్న ప్రభాస్.. ఏ హీరోయిన్కు పంపాడంటే? -
అమితాబ్ను చూసేందుకు ఒక్కరూ రాలేదా?
ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు వచ్చి అభిమానులను పలకరిస్తుటాడు బిగ్బీ అమితాబ్ బచ్చన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కనిపించడం, పలకరించడం తన కర్తవ్యం అని భావిస్తాడు. అయితే నిన్న (ఫిబ్రవరి 22) మాత్రం అమితాబ్ ఇంటి నుంచి బయటకే రాలేదు.కనిపించని అభిమానులుఅందుకు గల కారణాన్ని అమితాబ్ తాజాగా తన బ్లాగ్లో రాసుకొచ్చాడు. పనెప్పుడూ ఉత్సాహంతోనే సాగుతుంది. కానీ, అది పూర్తవకముందే రోజు ముగుస్తుంది. ఇంతలోనే విరామం, విశ్రాంతి తీసుకునేందుకు ఆదివారం వస్తుంది. దుదరదృష్టవశాత్తూ ఈ ఆదివారం జల్సా (బిగ్బీ ఇంటి పేరు) గేటు ముందు ఎవరూ లేరు. కాబట్టి మీరు కూడా ఎవరూ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, మీ శక్తిని ఆదా చేసుకోండి.అదేంటి?తర్వాత మనం మళ్లీ కలుద్దాం. అప్పటివరకు ఈ నిశ్శబ్ధపు ఆలోచనల్లోనే ప్రేమను పంచుకుందాం అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. అమితాబ్ను చూసేందుకు ఎవరూ రాకపోవడమేంటి? ఆయన చరిష్మా తగ్గిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా హీరోగా రాణిస్తున్న అమితాబ్.. చివరగా వేట్టైయాన్ సినిమాలో కనిపించాడు. 120 బహదూర్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే రామాయణ: పార్ట్ 1లో జటాయు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు.చదవండి: ధోతి స్టైల్లో హీరోయిన్ డ్రెస్.. ధరెంతంటే? -
ట్రోల్స్ లెక్క చేయను.. నా ఇంటివరకు వస్తే మాత్రం!
దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నాక సమంత ముఖం వెలిగిపోతోంది. ఒకప్పుడు విచారంగా కనిపించే తన ముఖం ఇప్పుడు వెయ్యి ఓట్ల బల్బులా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం సంతోషకర జీవితం గడుపుతున్న సామ్ మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం! ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏదీ నన్ను కదిలించలేదుఇదిలా ఉంటే తాజాగా తను సోషల్ మీడియాలో అభిమానులతో చిట్చాట్ చేసింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? అని ఓ వ్యక్తి అడిగారు. అందుకు సమంత స్పందిస్తూ.. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నన్ను ఎఫెక్ట్ చేయవు. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్ చేస్తాను.దానర్థం అదే..అలా నా స్పేస్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. మిమ్మల్ని బ్లాక్ చేశానంటే నేను బాధపడ్డానని కాదు. మీలాంటివారికి నాదగ్గర చోటు లేదని అర్థం అని రిప్లై ఇచ్చింది. మీలోని ఓ ఫన్నీ థింగ్ ఏంటని అడగ్గా.. కిందపడి మరీ నవ్వుతానంది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ధ్యానం చేస్తానని బదులిచ్చింది.సినిమామా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఇందులో సమంత పెళ్లయిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఆపద వచ్చినప్పుడు కత్తి పట్టేందుకు కూడా వెనుకాడని శివంగిగానూ అలరించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.చదవండి: ఇంకా అదే బాధలో ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ -
హీరోయిన్ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటేనే సిగ్గు: జాకీ ష్రాఫ్
బాలీవుడ్ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ తాజాగా 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' నాలుగో సీజన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా మాధురి దీక్షిత్ మాట్లాడుతూ.. 'కర్మ' సినిమా సెట్లో తొలిసారి జాకీ ష్రాఫ్ను కలిశాను. నేను ఆ మూవీలో ఒక చిన్న పాటలో నటించాను. మొహమాటంఆ సమంలో జగ్గూ దాదా (జాకీ ష్రాఫ్), అనిల్ కపూర్ గారు అక్కడే ఉన్నారు. ఇద్దరూ నా పర్ఫామెన్స్ చూస్తున్నారు. నాకసలే అదంతా కొత్త.. వీళ్లిద్దరూ నన్నే చూస్తుండటంతో కాస్త మొహమాటంగా ఫీలయ్యాను. ఇక ఆ సాంగ్ చూసిన తర్వాత జగ్గూ దాదా, శ్రీదేవి.. అందులో వారిని ఊహించుకున్నారు అని గుర్తు చేసుకుంది.మాధురి అందాన్ని చూసి..జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్, నటి సరోజ్ ఖాన్ ద్వారా నాకు తొలిసారి మాధురి గురించి తెలిసింది. మాధురి అందమైన హీరోయిన్ అలాగే అద్భుతమైన డ్యాన్సర్ కూడా అని సుభాష్ గయ్తో చెప్పింది. మాధురిని సినిమాలో ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చింది. అలా తన గురించి తెలిసింది. ఇప్పటికీ నేను మాధురి అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటా.. తను నాతో అన్నిరకాల పాత్రల్లో నటించింది. ప్రియురాలిగా, భార్యగా, అలాగే నా అత్తగానూ యాక్ట్ చేసింది. అయితే మాధురితో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను చాలా మొహమాటపడ్డాను. జాకీపై ప్రశంసలుకొన్ని భావోద్వేగాలు మనసులోనే కదలాడతాయి. వాటిని పైకి చూపించడం కష్టం. పైగా ఆమె మాట్లాడేటప్పుడు తన కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడటడం, పాడటం మరింత కష్టతరం. తను మాత్రం పాత్రలో లీనమైపోయి బోలెడంత ప్రేమను కురిపిస్తుంది అన్నాడు. ఇంతలో మాధురి మాట్లాడుతూ.. జగ్గూ చాలా అమాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అని జాకీ ష్రాఫ్పై ప్రశంసలు కురిపించింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో చివరగా దేవదాస్ అనే సినిమా వచ్చింది.చదవండి: పవిత్ర లోకేశ్ నాతో ఎలా ఉంటుందంటే?: నరేశ్ పెద్ద కుమారుడు -
పిల్లలు నా మూవీ ఒక్కటి కూడా చూడలేదు: షాలిని
చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం మొదలుపెట్టింది షాలిని. బాలనటిగా 50కి పైగా సినిమాలు చేసింది. వాటిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలున్నాయి. తెలుగులో బెజవాడ బెబ్బులి, జైలు పక్షి, శారదాంబ, చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.బాలనటిగా, హీరోయిన్గా..1997లో అనియతిప్రావు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తమిళ స్టార్ హీరో అజిత్ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది. అయితే పిల్లలిద్దరూ ఇంతవరకు తన సినిమాలేవీ చూడలేదంటోంది షాలిని. ఒక్క సినిమా చూడలేదుతాజాగా ఓ అవార్డుల ఫంక్షన్కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా పిల్లలు ఇంతవరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. ఎప్పుడైనా చూద్దామని ప్లాన్ చేసుకుంటారు. తీరా సమయం దగ్గరపడ్డాక తర్వాత చూద్దాం అని వాయిదా వస్తుంటారు. అయితే నేను యాక్ట్ చేసిన సాంగ్స్ మాత్రం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్క మూవీ కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పటికైనా ఒక్క సినిమా అయినా చూడండ్రా.. అని స్టేజీపైనే పిల్లలను అభ్యర్థించింది షాలిని. View this post on Instagram A post shared by Reji babu Suresh babu (@rejibabusuresh) చదవండి: కుర్రాడైనా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న హీరోయిన్స్ -
డ్రాగన్ సీక్వెల్? హింట్ ఇచ్చిన డైరెక్టర్
దర్శకుడిగా, హీరోగా హిట్టయినవారిలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. కోమలి సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన ఇతడు లవ్ టుడేతో డైరెక్టర్ కమ్ హీరోగా భారీ సక్సెస్ కొట్టాడు. ఆ వెంటనే డ్రాగన్ సినిమా చేశాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది.రెండోసారి తప్పక వస్తాంఈ సందర్భంగా అశ్వత్.. ప్రదీప్తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డ్రాగన్ చిత్రానికి ఏడాది. సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్తో కలిసి పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. ఇద్దరు స్నేహితులు కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో చూపించాం. మమ్మల్ని నమ్మినందుకు ఏజీఎస్ ప్రొడక్షన్ బ్యానర్కు, మా టీమ్కు కృతజ్ఞతలు. మేము సెకండ్ టైమ్ తప్పకుండా వస్తాం అని రాసుకొచ్చాడు. సినిమాదీంతో అభిమానులు డ్రాగన్ సీక్వెల్ ఉంటుందా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డ్రాగన్ టీమ్ కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ విషయానికి వస్తే.. ప్రదీప్ హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరిట విడుదలై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. 1 year of Dragon ! Blast working with this self made star ⭐️ @pradeeponelife . when friends come together for work the relationship is at stake ! But the same stake pushes u to deliver 🧨keep growing more PR! Thanks to @Ags_production & my team ❤️WE WILL COME BACK ‘2’nd TIME 😉 pic.twitter.com/ZpcH1j5QMT— Ashwath Marimuthu (@Dir_Ashwath) February 21, 2026 చదవండి: సెట్లో అందరూ చూస్తుండగా.. : తాప్సీ -
పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్: నరేశ్ కుమారుడు
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. వీరిద్దరి గురించి నరేశ్ కుమారుడు, నటుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ మాట్లాడుతూ.. నటుల జీవితం చాలా కష్టతరం. వాళ్లందరూ ఏ కష్టం, బాధ వచ్చినా బాత్రూమ్లోనే ఏడుస్తారు. అలా కన్నీళ్లు పెట్టుకోని యాక్టర్స్ ఉండరు.స్టార్ హోటల్స్లో భోజనంనా విషయానికి వస్తే.. నేను బైక్స్, ఫుడ్ కోసం లక్షలు ఖర్చుపెట్టాను. కానీ రానురానూ ఫైవ్ స్టార్ హోటల్స్లో పెట్టే భోజనం కంటే ఇంటిభోజనమే మేలని రియలైజ్ అయ్యాను అన్నాడు. పవిత్ర లోకేశ్ గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి మనిషి. తనను తరచూ కలుస్తుంటాను. ఆవిడ అందరినీ ప్రేమగా పలకరిస్తుంటుంది. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాన్నకు సరైన జోడీ అని నా అభిప్రాయం. ఆమె ఉన్నప్పుడు ఆయన కూడా సైలెంట్గా ఉంటాడు.నాన్న హ్యాపీ50 + ఏజ్లో నాన్న ఇంత ప్రశాంతంగా ఉండటానికి ఆవిడే కారణం. ఇది చాలా మంచి విషయం. ప్రేమకు ఎటువంటి హద్దులు లేవనడానికి ఇది నిదర్శనం. పవిత్ర- నాన్నల బంధాన్ని నిర్మల నానమ్మ, కృష్ణ తాతయ్య కూడా ఆమోదించారు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే నానమ్మ- తాతయ్య సపోర్ట్ చేసేవారు. పవిత్ర వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు.నావల్ల కాదుఇకపోతే నాన్న మల్టీ టాలెంటెడ్. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పనులు పూర్తి చేస్తాడు. కానీ, నేను చాలా ఎమోషనల్ పర్సన్ని. నాన్నలా నేనుండలేను అని చెప్పుకొచ్చాడు. కాగా నరేశ్, అతడి మొదటి భార్య నేత్రల సంతానమే నవీన్. ఇతడు నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు వంటి పలు సినిమాల్లో నటించాడు. దర్శకుడిగా సత్య అనే షార్ట్ ఫిలిం తీశాడు. అయితే నవీన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు.చదవండి: OTT: పాతిరాత్రి మూవీ రివ్యూ -
తలకిందులుగా వేలాడుతున్న ఈ హీరోని గుర్తుపట్టారా?
పైన ఫోటోలో తలక్రిందుగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన నటుడు. కేవలం నటనతోనే కాదు, క్రమశిక్షణతో కూడిన ఫిట్నెస్తో కుర్రకారుకు ఇన్పిరేషన్గా నిలుస్తుంటారు. ఆయనే మాస్ హీరో విశాల్. ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ హీరో, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా డెంగ్యూ బారిన పడటం, షూటింగ్స్ ఒత్తిడి వల్ల కొన్నాళ్ల పాటు వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ జిమ్లోకి అడుగుపెట్టారు.తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జిమ్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. శరీరాన్ని దృఢంగా మార్చుకుంటూ, పాత 'పందెంకోడి' లుక్ను గుర్తుచేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆరోగ్యం కోసమే కాదు, తన తదుపరి ప్రాజెక్టుల కోసం కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం విశాల్ తన 36వ చిత్రంలో బిజీగా ఉన్నారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో 'మొగుడు' అనే టైటిల్ను ఖరారు చేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మగ మహారాజు', 'యాక్షన్' సినిమాల తరహాలోనే ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial) -
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ
మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో టాలీవుడ్లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సౌబిన్ షాహిర్. అతడు గతేడాది పోలీస్గా నటించిన థ్రిల్లర్ మూవీ పాతిరాత్రి. రతీనా పీటీ దర్శకత్వం వహించిన ఈ మలయాళ మూవీ 2025 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం...కథేంటి?పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే కేసుల్ని పోలీసులు ఎలా చేధిస్తారనేది చూపిస్తారు. అయితే ఈ మూవీలో మాత్రం కాస్త విభిన్నంగా తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించారు. అదే సమయంలో తమ తప్పు లేదని నిరూపిస్తూనే కేసును చేధిస్తారు. పాతిరాత్రి అంటే అర్ధ రాత్రి అని అర్థం. ఆ కటిక చీకటిలో ఏం జరిగిందనేదే సినిమా. ఎలా ఉంది?ఓపెనింగ్ షాట్తో సినిమాలో ఏదో విశేషం ఉండబోతుందని హింట్ ఇచ్చారు. తీరా చూస్తే మరీ అంత హైప్ ఇచ్చే మూమెంట్స్ ఏవీ ఉండవు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా, కొంత బోరింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తి పుంజుకుంటుంది. సెకండాఫ్లో స్పీడ్ పెరుగుతుంది. ప్రముఖ జర్నలిస్టు మరణం కేసులో కానిస్టేబుల్ హరీశ్ (సౌబిన్ షాహిర్), ఎస్ఐ జాన్సీ (నవ్య నాయర్) సస్పెండ్ అవుతారు.అక్కడి నుంచి వారు కేసులో అసలు హంతకులెవరో నిరూపించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో వెలుగుచూసే నిజాలు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, విచారణ మాత్రం మరీ అంత ఆసక్తికరంగా సాగదు. అయితే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు పాతిరాత్రిని ఒకసారి చూసేయొచ్చు. ప్రస్తుతం జీ5లో ఉన్న ఈ సినిమా మలయాళ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. (Paathirathri Movie Review) -
Thalaivar 173: రజనీ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు?
ఏడుపదుల వయసు దాటినా వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న నటుడు రజనీకాంత్. నిజం చెప్పాలంటే ఇటీవల మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. జైలర్ చిత్రం మినహా మంచి సక్సెస్ కాలేదు. రజనీకాంత్ ఈ మధ్య కాలంలో నటించిన వేట్టయన్, కూలీ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా ఈయన వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం జైలర్–2 చిత్రాన్ని పూర్తిచేసిన రజనీకాంత్ తాజాగా ఆయన 173వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సహనటుడు కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించడం విశేషం. దీనికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కడుతున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్కు జంటగా నటించే కథానాయకి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల రజనీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలో ఇతర భాషలకు చెందిన ప్రముఖ తారలు నటించడం ఆనవాయితీగా మారింది. మరి ఇందులోనూ అలాంటి నటీనటులు నటించే అవకాశం లేకపోలేదు. ఈ విషయం పక్కన పెడితే ఇందులో నటి పూజా హెగ్డే, ప్రియాంక మోహన్ నటించబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మలు సహజంగా పోషించే గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. వీటితోపాటు ఒక సీనియర్ నటి కూడా నటించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి ‘ఛాంపియన్’ బ్యూటీ కొత్త సినిమా
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్కుమార్ ఇటీవల ఒక సూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఈయన సమీప కాలంలో కథానాయకుడిగా నటించిన బ్లాక్ మెయిల్ చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణనే పొందింది. తాజాగా జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడుగా నటించిన చిత్రం లక్కీ. నటి అనస్వర రాజన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పుష్ప కందస్వామి నిర్మించారు. ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదంతోపాటు ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందింది. తప్పిపోయిన లక్కీ అనే ఒక కుక్క పిల్ల, ఒక ఆటిజం చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. తప్పిపోయిన కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతిలో చిక్కడంతో దాన్ని హీరో ఎలా రక్షించాడు అన్నదే లక్కీ చిత్రంలోని ప్రధాన అంశం.నటి మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి కోవై సరళ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్ల వాయిస్ చోటు చేసుకుంటుంది. మంచి కుటుంబ కథాచిత్రంగా రూపొందిన లక్కీ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని గత 20వ తారీఖున నేరుగా జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. -
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. థియేటర్స్ రన్ విజయవంతమైన తర్వాత ఓటిటి ప్లాట్ఫారమ్లో కూడా ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైంది. జీ తెలుగు వారు ఈ ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 కి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జీ సంస్థ ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు. -
10 జంటలతో కపుల్ షో.. కంటెస్టెంట్స్ వీళ్లే!
రియాలిటీ షోలంటే జనాలకు భలే ఇష్టం. రీల్ లైఫ్లో సెలబ్రిటీలను చూసి ఆరాధించే ప్రేక్షకులు వారు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని తెగ తహతహలాడుతుంటారు. అందుకేగా బిగ్బాస్ షో అనేక భాషల్లో ఫేమస్ అయింది. బిగ్బాస్ తరహాలోనే హిందీలో ఇటీవల ద 50 అనే షో కూడా మొదలైంది. ఇప్పుడు తెలుగులో ఒక కపుల్ షో రాబోతోంది. అదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అనేది క్యాప్షన్.10 జంటలు - 70 రోజులుఈ షోలో సెలబ్రిటీ జంటలు మాత్రమే పాల్గొననున్నారు. అందులో పెళ్లయినవాళ్లున్నారు. పెళ్లి చేసుకోకుండా డేటింగ్లో ఉన్నవారూ ఉన్నారు. 10 సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజులపాటు ఉండనున్నారు. ఈ జంటల మధ్య ప్రేమ, రొమాన్స్, డ్రామా.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించనున్నారు. షో నిర్వాహకులు పెట్టే ప్రేమ పరీక్షలను వీరు ఎలా దాటుతారు? అన్నది ఆసక్తికరంగా ఉండనుంది.ఆ జంటలెవరంటే?ప్రస్తుతం సోషల్మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆ 10 జంటలెవరో ఓసారి చూసేద్దాం.. అమర్దీప్- తేజు, హరిత- హరీశ్, ప్రియాంక- శివకుమార్, అంజలి - పవన్ సంతోష్, నటరాజ్ మాస్టర్- నీతూ, సోనియా సింగ్- సిద్ధు, జబర్దస్త్ నూకరాజు- ఆసియా, సాండ్రా- మహేశ్బాబు, వాసంతి - పవన్ కల్యాణ్, శుభశ్రీ రాయగురు- అజయ్.అప్పుడే ప్రారంభం?వీరిలో అమర్దీప్, హరీశ్ (మాస్క్ మ్యాన్), ప్రియాంక జైన్, నటరాజ్ మాస్టర్, వాసంతి కృష్ణన్, శుభశ్రీ.. వీళ్లందరూ బిగ్బాస్ ద్వారా బుల్లితెర ఆడియన్స్కు దగ్గరైనవారే! మార్చి 2వ వారంలో ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ఈ షో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చిన బిగ్బాస్ అగ్నిపరీక్ష బాగానే హిట్టయింది. మరి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి! View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu) -
మగవాడికి తాళి కట్టి కాపురం? కోన వెంకట్ రియాక్షన్ ఇదే!
కోర్ట్ జంట శ్రీదేవి -రోషన్ మరోసారి జతగా కలిసి నటించిన చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీళ్లిద్దరూ బావమరదళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఈ మూవీ నుంచి ఊహించని గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో ప్రేమ కబుర్లు ఉంటాయనుకుంటే హీరో బ్రేకప్ బాధలో మునిగి తేలుతుంటాడు.ఫ్రెండ్ మెడలో తాళి కట్టిన హీరో'తాళి కట్టుడు కలిసుండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టి పోయిన దానికి కాదురా, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా' అంటూ స్నేహితుడి మెడలో మూడు ముళ్లు వేస్తాడు హీరో. ఈ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సీన్ చూసిన ఓ వ్యక్తి హీరోను లెస్బియన్ అనుకున్నాడట! ఈ విషయాన్ని బ్యాండ్ మేళం నిర్మాత కోన వెంకట్ తాజాగా వెల్లడించాడు.గే లవ్ స్టోరీయా?శనివారం నాడు బ్యాండ్ మేళం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా కోన వెంకట్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. వాలంటైన్స్ గ్లింప్స్ చూశాక నాకో ఫన్నీ మెసేజ్ వచ్చింది. గే లవ్స్టోరీని తెరపై తీసుకొస్తున్నందుకు థాంక్యూ సర్ అని ఓ అబ్బాయి మెసేజ్ పెట్టాడు. అది చూసి షాకైపోయాను. ఎమోషనల్గా ఫీలయ్యా..ఓహో.. మగవాడు మగవాడికి తాళి కట్టాడు కాబట్టి, వాళ్లిద్దరూ కాపురం చేసుకుంటారు, బెడ్రూమ్లో పాల గ్లాసు పట్టుకెళ్తాడు అనుకున్నట్లున్నాడు! చాలా ఎమోషనల్గా ఫీలయ్యాడు. బాబూ, ఇది గే లవ్స్టోరీ కాదు. మనసును తాకే లవ్ స్టోరీ. ఫన్తో పాటు ఎమోషన్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన బ్యాండ్ మేళం మార్చి 13న విడుదల కానుంది.చదవండి: మీ వల్లే ఇలా బతుకుతున్నా.. ఏడ్చేసిన వరలక్ష్మి -
ఇది నాకు మరో జీవితం.. స్టేజీపై ఏడ్చేసిన వరలక్ష్మి
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం సరస్వతి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రాధిక, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో వరలక్ష్మి సైతం కీలక పాత్ర పోషించింది. శనివారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వరలక్ష్మి భావోద్వేగానికి లోనైంది. నన్ను క్షమించండిఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల నా గొంతు పోయింది. అందుకు నన్ను క్షమించండి. మేము ఒక మంచి సినిమా తీశాం. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇన్నిరోజులుగా ఇండస్ట్రీలో బతుకుతున్నాను. ఇప్పుడు దర్శకురాలిగా లాంచ్ అయ్యాను. మీ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా సినిమా తీశాం. నిర్మాత బన్నీ వాసు సినిమా చూసి బాగుందన్నారు. ఆయన నోటినుంచి ఆ మాట వినగానే నేను సక్సెస్ అయిపోయా అనిపించింది.ఎమోషనలైన వరలక్ష్మిగోపీచంద్ మలినేని సర్ నా ఫ్రెండ్, గురువు, మెంటార్. ఆయనే నన్ను తెలుగులో రీలాంచ్ చేశారు. ఆయన వల్లే నేనీరోజు ఇక్కడ ఉన్నాను. థాంక్యూ సోమచ్ సర్. ఇది నాకు సెకండ్ లైఫ్. ఎక్కువ టెన్షన్స్ వల్ల ఎమోషనల్ అవుతున్నాను అంటూ వరలక్ష్మి శరత్కుమార్ ఏడ్చేసింది. నేను అంత ఈజీగా ఎమోషనల్ అవను. కానీ ఎప్పుడో ఒకసారి మనసారా ఏడ్చేయడం తప్పేం కాదు. అందుకోసమే ఈ పోరాటంఒకమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పోరాడుతున్న ప్రతి మహిళ కోసం నేను పోరాడుతున్నాను. ఇండస్ట్రీలో మహిళలు ఎదిగేందుకు సహకరించండి అని వరలక్ష్మి శరత్కుమార్ చెప్పుకొచ్చింది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి... హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. ఆ సినిమాతోనే గుర్తింపుగోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తెలుగు మూవీ క్రాక్లో జయమ్మగా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో వరలక్ష్మికి తెలుగులో ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు టాలీవుడ్లో గుర్తింపునిచ్చిన గోపీచంద్ మలినేనిని సరస్వతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా ఆహ్వానించి అతడిపై ప్రశంసలు కురిపించింది.చదవండి: అదే చివరి సినిమా అనుకున్నా: బాలీవుడ్ నటుడు -
నభా నటేష్ ‘డబుల్’ ఇంపాక్ట్
టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్కు ఈ వేసవి కాలం కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారబోతోంది. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు 'స్వయంభు', 'నాగబంధం' అనే రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైన కథా నేపథ్యాలతో రూపొందడం విశేషం. స్వయంభులో 'సుందరవల్లి' అనే ఒక హుందాతనమైన యువరాణి పాత్రలో నభా కనిపించబోతోంది. నాగబంధంలో 'పార్వతి' అనే పవర్ఫుల్ క్యారెక్టర్ను పోషిస్తోంది.ఒకే సీజన్లో ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలు విడుదల కావడం టాలీవుడ్లో ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రాల టీజర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.నభా నటేష్ ఈ చిత్రాల విజయంపై పూర్తి ధీమాతో ఉంది. కంటెంట్ కనుక ఆడియన్స్కు కనెక్ట్ అయితే, ఈ సమ్మర్ తర్వాత ఆమె స్టార్ ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. మొత్తానికి, ఈ సమ్మర్ నభా నటేష్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. -
అదే చివరి సినిమా అనుకున్నా.. రూ.1 కోటి పారితోషికం!
కొన్ని సినిమాలు కెరీర్నే మలుపు తిప్పుతాయి. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి మున్నాభాయ్ ఎంబీబీఎస్ అలాంటి సినిమానే! హీరో సంజయ్ దత్కు రైట్ హ్యాండ్గా ఉంటూ తన కామెడీ టైమింగ్, డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తాడు. వీరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది కన్నార్పకుండా చూస్తుంటారు. ఎంతిస్తే అంత చాలనుకున్నా..ఈ మూవీ తన కెరీర్లోనే టర్నింగ్ పాయింట్ అంటున్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. తాజాగా పింక్విల్లాతో మాట్లాడుతూ.. మున్నా భాయ్ సినిమాకంటే ముందు నేను పెద్దగా సంపాదించిందంటూ ఏమీ లేదు. ఎంతిస్తే అంత చాలనుకుని సినిమాలు చేసుకుంటూ పోయాను తప్ప ఎన్నడూ మంచి పారితోషికం కోసం గొడవపడలేదు. మున్నా భాయ్ ఎంబీబీఎస్ రిలీజయ్యాక కరోజు దర్శకనిర్మాత విపుల్ షా నాకు ఫోన్ చేశాడు. మున్నా భాయ్ MBBS మూవీలో ఒక దృశ్యంరెమ్యునరేషన్ రూ.1 కోటిఇక మీదట నువ్వు చేసే సినిమాలకు రూ.1 కోటి కంటే ఒక్క రూపాయి తక్కువ తీసుకున్నా నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ టాలెంట్ నీకు తెలియట్లేదు. ఎందుకిలా చేస్తున్నావు? అని క్లాస్ పీకాడు. అప్పుడు నా మేనేజర్తో ఎవరైనా అడిగితే నా రెమ్యునరేషన్ కోటి రూపాయలు అని చెప్పమన్నాను. అప్పటినుంచే నాకు కొంచెం ఎక్కువ డబ్బు రావడం మొదలైంది. నిజానికి మున్నాభాయ్ సినిమా ఆఫర్ నాకంటే ముందు చాలామందికి వెళ్లింది. నేను కూడా మంచి పొజిషన్లో ఉంటే రిజెక్ట్ చేసేవాడినేమో!చివరి సినిమా అనుకున్నా..ఇదే నా చివరి సినిమా అవుతుందనుకున్నాను. ఎందుకంటే మళ్లీ గూండాలా నటించమనే ఆఫర్లు వస్తాయి.. వాటిని చేయడం నావల్ల కాదని డిసైడయ్యాను. అనూహ్యంగా సినిమాకు మంచి స్పందన లభించింది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది అని అర్షద్ వార్సీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మున్నాభాయ్ ఎంబీబీఎస్కు రీమేక్గా తెలుగులో శంకర్దాదా MBBS తెరకెక్కగా ఇక్కడ కూడా ఘన విజయం అందుకుంది.చదవండి: కూతురు పుట్టిన ఏడాదికి పాప ఫోటో షేర్ చేసిన అంబటి అర్జున్ -
11 ఏళ్ల వయసు, అర్థరాత్రి క్యాబ్లో వెళ్తుంటే.. : ప్రియాంక చోప్రా
తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాతో షేర్ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్’. త్వరలోనే ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపించింది.‘మేము ఒకరోజు ఢిల్లీలోని ఓ హోటల్ నుంచి క్యాబ్లో బయటకు వెళ్తున్నాం. అర్థరాత్రి 11 గంటలు అవుతుంది. క్యాబ్లో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్యాబ్ డ్రైవర్ సడెన్గా రూట్ మార్చాడు. వేరే దారిలోకి కారుని తీసుకెళ్లాడు. ఆ దారిలో ఎవరూ లేకపోవడంతో ‘ఈ వైపు ఎందుకు వెళ్తున్నావు’ అని అమ్మ అడిగితే..‘షార్ట్కట్’ అని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అమ్మకు అనుమానం వచ్చింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి, వెంటనే వెనుక సీట్లో కూర్చోనే క్యాబ్ డ్రైవర్ గొంతు గట్టిగా పట్టుకుంది. మెయిన్ రోడ్డుపైకి వెళ్లాలని హెచ్చరించింది. అంతటి ఆగకుండా డ్రైవర్ని చెప్పదెబ్బ కొట్టిమరీ.. మెయిన్ రోడ్డు వైపుకి వచ్చేలా చేసింది. ఆ సమయంలో అమ్మ గట్టిగా అరిచింది కూడా. ‘టీనేజ్ వయసున్న నా కూతురితో ఉన్నాను. మర్యాదగా మెయిన్ రోడ్డువైపు వెళ్లండి’ అని సీరియస్ అయింది. అమ్మను అలా చూసి షాకయ్యాను. దాదాపు నాలుగు నెలల వరకు ఆమెను వాదించేందుకు సాహసం చేయలేదు. బహుషా ఒంటరిగా ఉంటే అమ్మ అంత గట్టిగా అరిచేది కాకపోవచ్చు. భయపడేది కూడా. కానీ పక్కన నేను ఉండడంతో..తల్లిలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో అలాంటి యాంగిల్, అంత ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘ది బ్లఫ్’ విషయానికొస్తే.. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తోంది. -
బ్యాండ్ మేళం: తిప్పుకుంటాన్నవ్ పాట రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. ఈసారి వీరు బావామరదళ్లుగా నటిస్తున్నారు. ఇటీవలే వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో హీరో హీరోయిన్కు బ్రేకప్ అయినట్లు చూపించారు.సాంగ్ రిలీజ్తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వదిలారు. 'బెల్లం చుట్టూ ఈగలెక్క.. మంచం చుట్టూ దోమ లెక్క.. గుడి సుట్టూ భక్తుని లెక్క.. బారు సుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్' అంటూ ఈ పాట కొనసాగుతుంది. హుషారుగా సాగే ఈ సాంగ్లో శ్రీదేవి- రోషన్ ఎనర్జిటిక్ స్టెప్పులేశారు.సినిమాబిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్ ఈ పాట పాడటంతో పాటు రోషన్తో కలిసి డ్యాన్స్ చేశాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు వెంకటేశ్ కాపు కొరియోగ్రఫీ అందించాడు. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చాడు. రాము రాథోడ్, అదితి భావరాజు ఆలపించారు. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ బ్యాండ్మేళం మూవీ మార్చి 13న విడుదల కానుంది. చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: ఆర్.మాధవన్ -
ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన చిత్రం ధురంధర్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న విడుదలవగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా ఆర్. మాధవన్ బయటపెట్టాడు.దుఃఖం ఆపుకోలేకపోయారుఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద ముఠాని పెంచి పోషించే రెహమాన్ బలోచ్ పాత్రలో అక్షయ్ ఖన్నా, పాకిస్తాన్ మేజర్గా అర్జున్ రాంపాల్ నటించారు. సినిమాలో 26/11 ముంబై దాడుల సన్నివేశాన్ని చిత్రీకరించగానే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ ఒక్కసారిగా ఏడ్చేశారు. షూటింగ్ అయ్యేవరకు బాధను గొంతులోనే దిగమింగుకున్నారు. దర్శకుడు కట్ చెప్పిన మరుక్షణం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అలాంటి పాత్రలు పోషించినప్పుడు వాటి ప్రభావం వారిపై కొన్నిరోజులపాటు ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.సినిమాధురంధర్ విషయానికి వస్తే ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ధురంధర్ 2 మార్చి 19న విడుదల కానుంది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ -
బాడీబిల్డర్ ఆ హీరో... బెండకాయ తిన్నా అరగదు....
పుష్టిగా కండలు తిరిగి ఉన్నవారిని చూస్తే సాధారణంగా ఆరోగ్యవంతులు అనుకుంటాం. ఎలాంటివి తిన్నా జీర్ణం చేసుకోగల సామర్ధ్యం ఉందని కూడా భావిస్తాం. కానీ అది నిజం కాదని కొంత మంది కండల వీరులు మనకి చెప్పకనే చెబుతుంటారు. అలాంటి కండల వీరుడే జాన్ అబ్రహాం. బాలీవుడ్ హీమ్యాన్స్లో ఒకరుగా పేరొందాడు. తెరమీద ప్రత్యర్ధుల బెండు తీసే ఈ హీరోకి కనీసం బెండకాయను తిని కూడా అరిగించుకునే శక్తి లేదట. సాక్షాత్తూ జాన్ అబ్రహాం ఫిట్నెస్ ట్రైనరే ఇటీవల ఈ విషయం వెల్లడించాడు.సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చన్నా ఇటీవల ఓ పోడ్ కాస్టర్తో మాట్లాడుతూ ‘‘జాన్ అబ్రహం గ్లాడ్ రాగ్స్ సూపర్ మోడల్గా ఉన్నప్పుడు నా దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చాడు. ఆ సమయలలో అతను రివటలా, చాలా సన్నగా ఉండేవాడు. తాను అందాల పోటీల్లో పాల్గొంటున్నాను కాబట్టి కేవలం 1-2 నెలల్లో భారీగా కండలు తిరిగిన శరీరంగా తనను మార్చాలని కోరుకున్నాడు. అప్పటికే అతను 67 నెలల నుంచి వ్యాయామం చేస్తున్నాడు. ఆ తర్వాత నేను అతనిని 92 కిలోల బరువు, కండలు తిరిగిన బాడీ బిల్డర్గా తయారు చేశాను’’అంటూ ఆయన గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా జాన్ అబ్రహం... ఫిజిక్లోని విశిష్టతలను కూడా అతను వివరించాడు. జాన్ శరీరం వ్యాయమ సమయంలో చాలా వేగంగా స్పందిస్తుందనీ, అతని అబ్స్ (ఉదర కండరాలు) ఒక వేలు లోతు కలిగి ఉంటాయని చెప్పాడు. అయితే అతని 100 శాతం ఫిజిక్ ఏ సినిమాలోనూ చూపించలేదని ట్రైనర్ అభిప్రాయపడ్డాడు. దాదాపు 90 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ కేవలం 45 శాతం ఫ్యాట్ మాత్రమే ఉండడం అంటే అలాంటి కండలు తిరిగిన శరీరం నమ్మశక్యం కాదని అది జాన్కి మాత్రమే స్వంతమని కొనియాడాడు. దీనికి కారణమైన జాన్ ఆహారపు అలవాట్లను వివరిస్తూ, 53 ఏళ్ల వయసులోనూ ఈ ఫిజిక్ మెయిన్టెయిన్ చేసేందుకు జాన్ చాలా కఠినంగా ఉంటాడని చెప్పాడు. కఠినమైన డైట్ కారణంగా ప్రస్తుతం అతని శరీరం కొన్ని ఆహారాలను జీర్ణం చేసుకోలేకపోతుందని తెలిపాడు. ‘‘ జాన్ అబ్రహాం... శాఖాహారి, కానీ అతను గుడ్లు మాత్రం ఆహారంగా తీసుకుంటాడు. అతను డైట్ విషయంలో మరీ ఎక్కువ కఠినంగా ఉంటాడు. అతను కొంచెం కూడా చక్కెర తినడు. ఒకవేళ తింటే అతనికి దగ్గు వస్తోంది. అలా కొన్ని ఆహార పదార్ధాల పట్ల అతని శరీరం మరీ సెన్సిటివ్గా మారిపోయింది. అందుకే నేను అతనికి అలా దేన్నీ కూడా పూర్తిగా ఆపవద్దని సలహా ఇస్తుంటాను’’ అంటూ వివరించాడు.‘అతను చాలా సంవత్సరాలుగా కఠినమైన డైట్లో ఉన్నాడు. అతను బెండకాయ కూర తింటే అతనికి కడుపునొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే తను చాలా సంవత్సరాలుగా వాటిని తినలేదు కాబట్టి మీరు అస్సలు తిననిది ఏదైనా అకస్మాత్తుగా తనలోకి వస్తే, శరీరం దానిని జీర్ణించుకోదు ఎందుకంటే అది ఒక నిర్దిష్ట ఆహారానికి బాగా అలవాటు పడింది. అందుకే నేరుగా చక్కెర కాకపోయినా, నేను అతనికి కొంత బెల్లం లేదా చక్కెర లను మరో రూపంలో తినమని చెబుతున్నాను’’ అంటూ జాన్ అభ్రహాం ట్రైనర్ వెల్లడించాడు. ఏదేమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారం కూరగయాల్ని కూడా అరిగించుకోలేని జాన్ అబ్రహాం పరిస్థితి...డైట్ రూట్లో ఉన్నవారికి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన సంగతే. -
ఏడేళ్లు విడివిడిగా నిద్ర.. మా ఇద్దరికీ స్లీప్ డివోర్స్: నటి
బాలీవుడ్ నటి అర్చన పూరణ్ సింగ్ అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవేవీ కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్లో ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తోంది. ఎటువంటి మొహమాటం లేకుండా పర్సనల్, ప్రొఫెషనల్.. అన్ని విషయాలను పంచుకుంటోంది. ఐ లవ్యూ చెప్పుకోవడం కాదుతాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఐ లవ్యూ చెప్పుకోవడంలో కాదు, దాన్ని చూపించడంలో ఉంటుంది. అయితే పెరుగుతున్న వయసును బట్టి ఈ ప్రేమ రూపాలు కూడా మారుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు. కాబట్టి మరోసారి మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకునే వీలు దొరికింది. నాకు ఆలస్యంగా పడుకోవడం అలవాటు. తనేమో త్వరగా నిద్రపోతాడు. చిన్న పనులే..అతడికి డిస్టర్బ్ అవకూడదని నేను ఎటువంటి శబ్ధాలు చేయను. హెడ్ఫోన్స్ పెట్టుకునే పాటలు వింటాను. పొద్దున ఆయన త్వరగా లేస్తాడు. అప్పుడు నేనింకా నిద్రలోనే ఉంటాను కాబట్టి తను కూడా నన్ను డిస్టర్బ్ చేయడు. సైలెంట్గా తన పనులు తాను చేసుకుంటాడు. ఈ చిన్నచిన్న పనులే ప్రేమను సూచిస్తాయి.ఈ లెక్కన విడాకులైనట్లే!నా భర్తకు గురక అలవాటు ఉంది. నాకేమో చిన్న అలికిడి అయినా చటుక్కున లేస్తాను. మళ్లీ నిద్రలోకి జారుకోవడం చాలా కష్టం. అందుకే భర్త పక్కన నేను పడుకోలేను. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని స్లీప్ డివోర్స్ అంటారు. ఐదు నుంచి ఏడేళ్లపాటు మేమిద్దరం ఇలాగే విడివిడిగానే నిద్రపోయాం. ఈ లెక్కన విడాకులు తీసుకున్నట్లే! (నవ్వుతూ)జీవితం చాలా చిన్నదిగత 10-15 ఏళ్లలో మా మధ్య ఇగో పూర్తిగా నశించిపోయింది. ముందు నువ్వే సారీ చెప్పాలన్న వాదన అనేదే మా మధ్య లేదు అని చెప్పుకొచ్చింది. అర్చన భర్త, నటుడు పర్మీత్ మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎన్ని పండుగలు, బర్త్డేలు ఉన్నాయని? ప్రతిదానికి గొడవపడుతూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది. అన్నింటినీ పక్కనపెట్టి సంతోషంగా బతికేయాలి అని చెప్పుకొచ్చాడు.చదవండి: అజిత్, విజయ్ మధ్య శతృత్వం? క్లారిటీ ఇచ్చిన షాలిని -
అజిత్, విజయ్ మధ్య శత్రుత్వం? ఎలా ఉంటారో చెప్పిన షాలిని
కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.షాలిని ఆసక్తికర వ్యాఖ్యలుహీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్లో షాలిని మాట్లాడుతూ.. అజిత్, విజయ్.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. అప్పుడు కూడా వివాదంఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించింది. అప్పుడు విజయ్ అజిత్కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్ స్పందిస్తూ.. . అజిత్ సర్కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్ ఒకరు. సినిమాఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్ సర్కు విజయ్ విషెస్ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్ చివరగా నటించిన సినిమా జన నాయగణ్. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్.. ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్పై వివాదం -
తిరుమల గుడిలో అలాంటి అనుభవం: శివానీ నగరం
హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడినుంచో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం కొన్ని గంటల తరబడి లైన్లో నిలబడి వేచి చూస్తారు. అయితే తాను మాత్రం 15 నిమిషాలు వెంకటేశ్వరస్వామివారిని తనివితీరా దర్శించుకున్నానంటోంది హీరోయిన్ శివానీ నగరం. 15 నిమిషాల దర్శనం కాకపోతే అక్కడ తనను చూసిన కొందరు భక్తులు దేవుడితో పాటు తననూ కీర్తించారని కామెంట్లు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివానీ నగరం మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్లాను. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. లిటిల్ హార్ట్స్ సక్సెస్ అనంతరం మళ్లీ తిరుమలకు వెళ్లాను. నన్ను కాసేపు ద్వారం దగ్గర నిల్చోబెడతామని చెప్పారు. ఏకంగా 15 నిమిషాలు గర్భగుడి ఎదుట నిల్చోబెట్టి దర్శనం చేయించారు. దేవుని గుడిలో నాగురించి..ఎవరూ నన్ను వెళ్లిపోమని తొందరపెట్టలేదు. ఒకవైపు నుంచేమో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. మరోవైపు నుంచి కాత్యాయని, భోం చేశావా? అంటున్నారు. అది వినగానే నేను షాకయ్యాను. దేవుడా.. ఇంక నాకేం వద్దు అనిపించింది. అదే సమయంలో అమ్మ కూడా.. 'నీవల్ల 15 నిమిషాల దర్శనం దొరికింది. థాంక్యూ బేటా.. నీకు తల్లినయినందుకు గర్వంగా ఉంది' అని కామెంట్ చేసింది. ఆ మాట వినగానే జీవితానికి ఇది చాలు అని ఉప్పొంగిపోయానంది. హీరోయిన్కు అంత ప్రాధాన్యత దేనికి?ఇది చూసిన నెటిజన్లు.. ఒకటీరెండు సినిమాలు చేసిన హీరోయిన్కు అంత ప్రాధాన్యత, అదే సామాన్య భక్తులను మాత్రం తోసేస్తారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివానీ డప్పు కొట్టుకుంటోందని సెటైర్లు వేస్తున్నారు. కాగా శివానీ నగరం.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. లిటిల్ హార్ట్స్ చిత్రంతో క్రేజ్ అందుకుంది. తాజాగా మరోసారి సుహాస్తో జతకట్టింది. అతడికి జంటగా నటించిన హే బలవంత్ మూవీ నేడే (ఫిబ్రవరి 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన సౌత్ లో సినిమాలో కనిపిస్తే చాలు చిన్న సినిమాలో చేసినా వాళ్ళను కూడా దేవుడి రేంజ్లో చూస్తారు లేకపోతే ఏమిటి దేవుడిపై మనసు లగ్నం చేయకుండా గర్భగుడిలో ఆమె నటించిన సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరుతో అరవడం ఏమిటి pic.twitter.com/pMLIqzDJIg— Kumar Reddy.Avula (@Kumar991957) February 20, 2026 చదవండి: ఎందుకిలా బాధపెడుతున్నారు? కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా -
మీవల్లే ఈ వేదన.. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా
సౌత్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్లాల్, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.రెండో పెళ్లంటూ ప్రచారంతీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.ఒంటరి ఆడదాన్ని అనేకదా!ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. మంచివాటిపై ఫోకస్ చేస్తా..తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక -
అమ్మ ఉగ్రరూపం.. పీక పట్టుకుని చెంప పగలగొట్టింది!
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా "ద బ్లఫ్" సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి (ఫిబ్రవరి 20) నుంచే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రియాంక తన తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.పక్కదారి పట్టడంతో..ప్రియాంక మాట్లాడుతూ.. అప్పుడు నాకు 11 ఏళ్లు ఉంటాయనుకుంటాను. ఒకసారి ఢిల్లీలో ఉండగా రాత్రిపూట అమ్మ, నేను బయటకు వెళ్లాం. క్యాబ్ బుక్ చేసుకుని కొంత దూరం వెళ్లగానే సడన్గా అమ్మ ముఖం ఎర్రబడింది. డ్రైవర్ పీక పట్టుకుని తిట్టడం మొదలుపెట్టింది. అతడు నెమ్మదిగా కారును మెయిన్ రోడ్ నుంచి మరోవైపు దారి తిప్పాడు. అది షార్ట్కట్ అని చెప్పాడు. 4 నెలలు కిక్కుమనకుండా..కారులో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. అమ్మ అతడి కాలర్ పట్టుకుని మెయిన్రోడ్ మీదుగానే కారును తీసుకెళ్లమని హెచ్చరించింది. అతడి చెంప కూడా పగలగొట్టింది. అమ్మను అలా ఉగ్రరూపంలో ఎన్నడూ చూడలేదు. ఆ సంఘటన తర్వాత దాదాపు నాలుగు నెలలవరకు ఎన్నడూ అమ్మతో గొడవపడలేదు. ఆరోజు నేను లేకపోయుంటే అమ్మ అంత సీరియస్ అయ్యేదో? లేదో? కానీ, హోటల్కు తిరిగి రాగానే అమ్మ నిలువెల్లా వణికిపోయింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.చదవండి: మలయాళ మూవీ చథా పచ్చ రివ్యూ -
నాకూ ప్రేమించాలని ఉంది: ప్రభాస్
ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ప్రభాస్. ఎంతసేపు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే తప్ప పర్సనల్ లైఫ్ను పట్టించుకోవడమే మానేశాడు. 46 ఏళ్లు వచ్చినా ఇంతవరకు పెళ్లి ముచ్చటే లేదు. ఆ ప్రస్తావన వచ్చినా కూడా ఓ చిన్న నవ్వు నవ్వి దాటవేస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం తనకు ప్రేమలో పడాలని ఉందంటున్నాడు.స్పెషల్ ఇంటర్వ్యూటాలీవుడ్లో ఇటీవల విడుదలై హిట్ కొట్టిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. సంతోశ్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే చిత్రనిర్మాణ సంస్థ అయిన యువీ క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది.ప్రేమలో పడాలనుందిఈ సందర్భంగా కపుల్ ఫ్రెండ్లీ హీరోయిన్ మానస.. ప్రభాస్ను ప్రేమ గురించి అభిప్రాయం అడిగింది. అందుకు సమాధానంగా ప్రభాస్.. ఇది నీ పర్సనల్ క్వశ్చన్ కదా అని నవ్వేశాడు. అలాగే తనకు ప్రేమించాలనుందని, ప్రేమలో పడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్ ప్రేమలో పడితే చూడాలనుందని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.చదవండి: చిరంజీవి, మోహన్లాల్.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే? -
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. అయితే తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్తో లవ్ ట్రాక్తో బాగా ఫేమస్ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు.పెళ్లికి వేళాయెకొంతకాలం క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్ వర్మ ప్రపోజల్కు ఎస్ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. లగ్న పత్రికఈ రోజు పునర్నవి - హేమంత్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్గా దిగిన పిక్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంది.చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం -
6సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. కొడుకు పేరు జహంగీర్!
ఛత్రపతి శివాజీ.. ఈ పేరు వినగానే తెలియని ధైర్యం ఒంట్లోకి వస్తుంది. తన మతాన్ని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ధీరశాలి. నేడు (ఫిబ్రవరి 19న) శివాజీ మహారాజ్ జయంతి. ఈ సందర్భంగా వెండితెరపై ఆరుసార్లు శివాజీగా వేషం వేసి మెప్పించిన నటుడెవరో చూసేద్దాం..ఆరు సార్లు శివాజీగా..ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత చిన్మయ్ మాండ్లేకర్.. ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా ఆరుసార్లు వెండితెరపై శివాజీ పాత్రను పోషించాడు. ఫర్జంద్, ఫత్తేశికస్త్, పవన్కైండ్, షేర్ శివరాజ్, సుబేదార్, శివరాయంచ అనే ఆరు మరాఠి సినిమాల్లో శివాజీగా వేషం కట్టాడు. కానీ ఒకే ఒక్క సంఘటన వల్ల ఇకపై ఎన్నటికీ శివాజీగా కనిపించనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అసలేం జరిగిందంటే?మరాఠి నటుడు చిన్మయ్ మాండ్లేకర్.. శివాజీ పాత్రలో నటించినందుకుగానూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ పొందాడు. కానీ ఆయన కుమారుడికి జహంగీర్ అనే పేరు పెట్టాడు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కుటుంబం మొత్తానిపై విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన చిన్మయ్.. ఈ ట్రోలింగ్ అన్యాయం అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. సంచలన నిర్ణయంవృత్తిపరంగా విమర్శలు చేస్తే ఓకే కానీ, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశాడు. తన కొడుకు, భార్య క్యారెక్టర్పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇది తప్పని అభిప్రాయపడ్డాడు. శివాజీ మహారాజ్ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఇకపై ఆయన పాత్రను వెండితెరపై చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.కుమారుడికి ఆ పేరు ఎందుకంటే?మరి కుమారుడికి జహంగీర్ పేరు ఎందుకు పెట్టాడంటే? జహంగీర్ జంషెడ్ నవ్రోజ్లో జన్మించాడు. భారతరత్న జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా స్ఫూర్తితో కుమారుడికి జహంగీర్ అని పేరు పెట్టాడు. ఇక చిన్మయ్ మాండ్లేకర్.. హిందీలో తేరే బిన్ లాడెన్, సమీర్, ద కశ్మీర్ ఫైల్స్, గాంధీ గాడ్సే: ఏక్ యుధ్ సినిమాల్లో నటించాడు. కాలాపాణి, దల్దల్ వంటి వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేశాడు.చదవండి: ఓటీటీలో థ్రిల్లర్ వెబ్ సిరీస్... రిలీజ్ ఎప్పుడంటే? -
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025: జ్యూరీ కమిటీలో కీలక మార్పు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025' జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా 'స్పెషల్ అవార్డ్స్' ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీకి చైర్మన్గా సీనియర్ నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్ర పరిశ్రమపై తమ్మారెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న లోతైన అవగాహనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 19, 2026న (ఉగాది పర్వదినం సందర్భంగా) ఈ పురస్కారాలను అత్యంత వైభవంగా అందజేయనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలు ఈ అవార్డులకు అర్హమైనవి. మొత్తం 17 విభాగాల్లో ఈసారి పురస్కారాలు ఇవ్వనున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ 'ఉత్తమ సామాజిక సందేశ చిత్రం', 'డాక్టర్ సి. నారాయణరెడ్డి' పేరుతో ప్రత్యేక అవార్డులను కూడా ప్రవేశపెట్టారు.ప్రస్తుతం వివిధ జ్యూరీ కమిటీల ఆధ్వర్యంలో సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే విజేతల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. -
అందుకే ‘ఎల్లమ్మ’ లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నా : దేవిశ్రీ
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ఫేం వేణు యెల్దండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని నానితో తెరకెక్కించాలనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నాని నో చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా చేయబోతున్నట్లు దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు కూడా. కానీ తమ్ముడు మూవీ రిలీజ్ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చివరకు దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ పట్టాలెక్కింది. టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు వదిలిన గ్లింప్స్కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. బీజీఎంతో పాటు దేవీ లుక్పై కూడా ప్రశంసలు వచ్చాయి. తనదైన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ..ఇప్పుడు నటనతోనూ ఆకట్టుబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమైంది. అయితే హీరోగా మారినప్పటికీ.. సంగీతాన్ని వదలబోనని అంటున్నాడు డీఎస్పీ. అంతేకాదు సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథ కాబట్టే ‘ఎల్లమ్మ’లో నటించడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎల్లమ్మ’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అందుకే ఒప్పుకున్నా.. సినిమాల్లో నటించాలని ఎప్పుటి నుంచో అనుకుంటున్నా. చాలా మంది దర్శకులు నన్ను హీరోగా చేయమని అడిగారు. సుకుమార్ దర్శకత్వంలోనే నేను హీరోగా పరిచయం కావాల్సింది. కానీ నాన్న చనిపోవడంతో బాధలో ఉండి నేనే నటించడానికి ఆసక్తి చూపించలేదు. త్రివిక్రమ్, హరీశ్ శంకర్ కూడా సినిమా చేస్తామని చెప్పారు. కానీ కుదరలేదు. నేను చాలా స్క్రిప్టులు విన్నాను. ఒక్కటి కూడా నాకు సెట్ అయ్యేలా అనిపించలేదు. కానీ ఎల్లమ్మ కథ వినగానే నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పా. నెలన్నరలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.నెలకు పది రోజులు మాత్రమే.. సినిమాల్లో నటించినప్పటికీ సంగీతానికి మాత్రం బ్రేక్ ఇవ్వను. మ్యూజికే నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే నటన. ఎల్లమ్మ కథ కూడా గొప్ప సంగీతంతో ముడిపడి ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది. పైగా నిర్మాత దిల్ రాజు కూడా నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు. ‘నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది. మిగతా రోజులన్నీ నీ సంగీతానికే కేటాయించుకో’ అని చెప్పారు. దర్శకుడు వేణు కూడా సపోర్ట్ చేశాడు. అందుకే ఈ సినిమా చేయాలని అనుకున్నాను.అప్పుడు ‘దేవి’..ఇప్పుడు ‘ఎల్లమ్మ’నేను సంగీతం అందించిన మొదటి సినిమా ‘దేవి’. ఎల్లమ్మకు మరో పేరు ఇది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కథతోనే హీరోగా పరిచయం అవుతున్నాను. ఇలా ఒక సంగీత దర్శకుడిగా, హీరోగా రెండూ ‘అమ్మవారి’ కథలతోనే పరిచయం అవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్సింగ్ సినిమా బీజీఎం పనుల్లో బిజీగా ఉన్నా. ఇది పూర్తయిపోయిన వెంటనే ‘ఎల్లమ్మ’ షూటింగ్లో పాల్గొంటా. ఎల్లమ్మ సినిమా అనేది నన్ను, నా సంగీతాన్నీ ప్రేమంచే ప్రతీ ఒక్కరికి నేను ఇస్తున్న బహుమతి’ అని దేశిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. -
జైళ్లలో స్మోకింగ్ జోన్ ఉండాలి: రాజ్పాల్ యాదవ్
చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్ తాత్కాలిక బెయిల్పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్ జోన్స్) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్ పూర్తయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.ఏం జరిగింది?రాజ్పాల్ యాదవ్, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్బౌన్స్ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.2019లో సెషన్స్ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్పాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్ జైలులో లొంగిపోయాడు. ఫిర్యాదుదారునికి రాజ్పాల్ యాదవ్ రూ.1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేసింది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్పాల్ యాదవ్.. హంగామా, భూల్ భూలయా, డ్రీమ్ గర్ల్ 2, బేబీ జాన్ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్ -
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
కన్నడ సీరియల్ నటి, బిగ్బాస్ ఫేమ్ నమ్రత గౌడ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం ఊపందుకుంది. బిగ్బాస్ కంటెస్టెంట్ కార్తీక్ మహేశ్తోనే ఏడడుగులు వేయనుందని గాసిప్. రియాలిటీ షో ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ, తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది నమ్రత.రహస్యంగా పెళ్లి చేసుకోనుఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నా రిలేషన్షిప్, పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాబట్టి దానిపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ చెప్తాను. దాన్ని రహస్యంగా ఉంచాల్సిన పని లేదు. నా పెళ్లి చీర కోసం ఏదో కొత్త రంగు సృష్టిస్తున్నారట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మా మధ్య ఉన్నది స్నేహమేఏదేమైనా ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అని కుండబద్ధలు కొట్టింది. కాగా కన్నడ బిగ్బాస్ పదో సీజన్లో నమ్రత, కార్తీక్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రేమాయణం నడుపుతున్నారని అభిమానులు ఫీలయ్యారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అని ఈ జోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరి చనువు చూస్తుంటే ఫ్రెండ్షిప్లా లేదని అభిప్రాయపడ్డారు.చదవండి: తల్లి కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగే హీరో -
ఏడేళ్లకు నటి గుడ్న్యూస్.. పొట్టపై మెహందీ డిజైన్
మలయాళ నటి ప్రీత ప్రదీప్ త్వరలో తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆమెకు తొమ్మిది నెలలు. మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డ ఆమె కుటుంబంలో భాగం కానుంది. ఈ క్రమంలో అందంగా ముస్తాబైన ప్రీత తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. అందులో తన పొట్టపై మెహందీ ఉంది. కమలం పువ్వుపై తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా డిజైన్ ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మీకంతా మంచే జరగాలని కామెంట్లు చేస్తున్నారు.నటిగాఇకపోతే ప్రీత- వివేక్ పెళ్లి 2019 ఆగస్టు 25న జరిగింది. పెళ్లయిన ఏడేళ్లకు తొలిసారి పేరెంట్స్గా ప్రమోషన్ పొందబోతున్నారు. కాగా ప్రీత ప్రదీప్.. కురుక్కు, సండే హాలీడే, ప్రేమసూత్రం, ఉయరే వంటి పలు సినిమాలు చేసింది. అలాగే బుల్లితెరపై ఓ సీరియల్లో నెగెటివ్ రోల్ పోషించింది. యాంకర్, డ్యాన్సర్గానూ తను సుపరిచితురాలే! View this post on Instagram A post shared by Preetha Pradeep (@preethspradeep) View this post on Instagram A post shared by Preetha Pradeep (@preethspradeep) -
ఆ హీరో తల్లి కాళ్లు కడిగి నీళ్లు తాగుతాడు!
బాలీవుడ్ నటుడు గోవిందా ఈ మధ్యకాలంలో సినిమా అప్డేట్స్ కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతడి ఎఫైర్స్ గురించే ఎక్కువ ప్రచారం జరిగింది. భార్య సునీత అహూజాతో విడిపోతున్నాడని కూడా రూమర్స్ రాగా అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది.ఆయన నుంచే ప్రేరణఅయితే గోవిందా వ్యక్తిత్వం ఎంతో ఉత్తమమైనదని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానంటున్నాడు నటుడి మేనల్లుడు వినయ్ ఆనంద్. తాజాగా ఓ పాడ్కాస్ట్లో విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. గోవిందా అంకుల్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేనే కాదు, ఆయన ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు దేశం మొత్తం ఆయన నుంచి స్ఫూర్తి పొందింది.కాళ్లు కడిగి ఆ నీళ్లుఆయన్ను, ఆయన డ్యాన్స్ను కాపీ కొట్టని స్టార్ హీరోలు లేరు. డ్యాన్స్ రానివారు కూడా ఆయన్ను చూసి స్టెప్పులేయడం మొదలుపెట్టారు. అమ్మమ్మ (గోవిందా తల్లి) పుట్టినరోజు నాడు ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగేవాడు. అలాంటి గొప్ప వ్యక్తికి అవకాశాలు తగ్గిపోవడం చూసి చాలా బాధపడ్డాను. తనకోసం కొన్ని ఆఫర్లు తీసుకొచ్చినా చేసేవాడు కాదు. ఈవెంట్స్ చేయమని అడిగినా నిరాకరించేవాడు. తన కారణాలు తనకు ఉండొచ్చు. మా మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.ఎన్నడూ ప్రశ్నించలేదుఆయన నాకు మామయ్య అయినప్పటికీ ఎందుకిలా తీసుకొచ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నారని ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆయన ఏం చెప్పినా ఓకే సర్ అంటుంటాను. దాదాపు 70 (హిందీ, భోజ్పురి) సినిమాల్లో హీరోగా నటించినా, పేరు, గుర్తింపు ఉన్నా ఆయన ముందు మాత్రం ఎప్పటికీ వినమ్రుడిగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: బేబి గర్ల్ మూవీ రివ్యూ -
రామ్ చరణ్ 'పెద్ది'కి భారీ డిజిటల్, ఆడియో డీల్
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి. నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి. -
హీరోకు తల్లిగా, భార్యగా, కూతురిగా నటించిన హీరోయిన్
హీరోయిన్లు కేవలం హీరోతో జోడీ కట్టడమే కాదు కొన్నిసార్లు అదే హీరోకు తల్లిగా, కూతురిగా కూడా నటించినవాళ్లూ ఉన్నారు. అలా మలయాళ స్టార్ మమ్ముట్టికి ఓ స్టార్ హీరోయిన్ తల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల తార మీనా.స్టార్ హీరోయిన్గా13 ఏళ్ల వయసుకే హీరోయిన్గా మారింది మీనా. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన మీనా మలయాళ స్టార్ మమ్ముట్టికి మాత్రం భార్యగా, కూతురిగా, తల్లిగా నటించింది.మమ్ముట్టికి జోడీగా..ఒరు కొచ్చుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి కూతురిగా నటించింది. 2001లో వచ్చిన రాక్షస రాజవు మూవీలో మమ్ముట్టి ప్రేయసిగా కనిపించింది. ఆ తర్వాత కరుత పక్షికల్, కద పరయుంబల్ సినిమాల్లోనూ మమ్ముట్టితో కలిసి నటించింది. 2014లో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిన మూవీ బాల్యకాలసఖి. ఇందులో మమ్ముట్టి తల్లిగా, భార్యగా మీనా యాక్ట్ చేసింది. చదవండి: జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: స్టార్ హీరో -
జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: అక్షయ్ కుమార్
భార్య పుస్తకాల రచయిత్రి, కానీ తాను మాత్రం ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా చదవలేదంటున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈయన హోస్ట్గా వ్యవహరిస్తున్న షో "వీల్ ఆఫ్ ఫార్చ్యూన్". తాజాగా ఈ షో ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయం చెప్పాడు అక్షయ్. నా భార్య ట్వింకిల్ ఖన్నా రచయిత్రి. నాకు తెలిసి తను రోజుకొక పుస్తకం అయినా చదివేస్తుంది.పుస్తకం చదివిన పాపాన పోలేదునేను మాత్రం ఇంతవరకు జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు. కాకపోతే అందరి ముఖాల్ని ఇట్టే చదివేయగలను. మనుషుల్ని చదవడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రస్తతం భూత్ బంగ్లా అనే హారర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. అలాగే వెల్కమ్ టు ద జంగిల్ అనే మరో ప్రాజెక్ట్ అతడి చేతిలో ఉంది.సినిమాఅక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా విషయానికి వస్తే.. బర్సాత్, జబ్ ప్యార్ కిస్సే హోతా హై, బాద్షా వంటి పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె పుస్తక రచయిత్రిగా మారింది. మిసెస్ ఫన్నీబోన్స్, పైజామాస్ ఆర్ పర్గివింగ్, వెల్కమ్ టు ప్యారడైజ్ వంటి ఎన్నో పుస్తకాలు రాసింది. ఇటీవల 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ 'అనే షోకి సహ వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.చదవండి: రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితమయ్యా..: అనురాగ్ కశ్యప్ -
వారణాసి, పెద్ది, ప్యారడైస్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది?
టాలీవుడ్లో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ సోమవారం వరకు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.📽️ ఎన్టీఆర్ - డ్రాగన్: తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.📽️ అల్లు అర్జున్ - AA22: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్లో జరుగుతోంది.📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. -
రెండుసార్లు గుండెపోటు, వీల్చైర్కే పరిమితం: దర్శకుడు
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ 2023లోనే రాసుకున్న కథ "కెనడీ". షూటింగ్ పూర్తయి చాలాకాలం అయిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తను కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొన్నాడు.2009 నుంచి..అతడు మాట్లాడుతూ.. మాగ్జిమమ్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కోసం చాలా ఖర్చుపెట్టాం. 2009 నుంచి నా ధ్యాసంతా ఆ సినిమాపైనే! ఈ కథను నెట్ఫ్లిక్స్ చదవకుండానే ఓకే చెప్పేసింది. మీరు దేనికి ఓకే చెప్పారో ఒకసారి చూసుకోండి అంటే ఒక్కరు తప్ప ఎవరూ స్క్రిప్ట్ చదవలేదు.పక్కన పడేసిన నెట్ఫ్లిక్స్ఏడాదిన్నర కాలంలో నేను 900 పేజీలు రాశాను. నా స్క్రిప్ట్ నచ్చకపోయుంటే నెట్ఫ్లిక్స్ ముందే చెప్పొచ్చుగా! సైలెంట్గా ఉండిపోయింది. తర్వాత సడన్గా తమ పాలసీలో కొన్ని మార్పులు చేస్తున్నామంటూ పలు వెబ్ సిరీస్, సినిమాలను రద్దు చేసింది. అందులో నా ప్రాజెక్ట్ ఒకటి. అయితే దానికి పరిహారంగా వేరే స్క్రిప్ట్ పంపించి వాటిని డైరెక్ట్ చేయమని అడిగింది. అవి యావరేజ్గా ఉన్నాయని, నాకు కొంచెం సమయం ఇవ్వండని అడిగాను. రెండుసార్లు గుండెపోటువాళ్లు మాత్రం మా దగ్గర 4 నెలలపాటు యాక్టర్స్ డేట్స్ ఖాళీగా ఉన్నాయని ఒత్తిడి చేశారు. నాకు కొంచెం సమయం ఇస్తే తప్ప వాటిని చేయలేనని చెప్పాను. నేను రాసిన ఒక షో వారికి బాగా నచ్చింది. కానీ దాన్ని మనీ హీస్ట్ ఇండియన్ వర్షన్గా మార్చి రాయమన్నారు. వాళ్ల పద్ధతి నాకసలు నచ్చలేదు. చాలా బాధపడ్డాను. ఎక్కువ ఒత్తిడి, బాధ వల్ల రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆస్తమాదాంతో రక్తం పలుచబడేందుకు మందులు వాడాను, కరోనా వ్యాక్సిన్ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇవి నా శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ చూపించాయి. ఆస్తమా వచ్చింది. దానికోసం స్టెరాయిడ్స్ వాడాను. ఎక్కువ డోసు మందులు వాడేసరికి నాకు డ్రగ్స్ వాడినట్లే అనిపించింది. తాగడం మొదలుపెట్టాను. జంక్ఫుడ్ ఆర్డర్ పెడుతూ నచ్చినట్లు తిన్నాను. ఎనిమిది నెలల్లోనే 35 కిలోలు పెరిగాను. వీల్చైర్కే పరిమితంనన్ను చూసి నా కూతురు భయపడిపోయింది. రిహాబిలిటేషన్ సెంటర్కు పంపింది. అలా మూడుసార్లు రిహాబిలిటేషన్కు వెళ్లాను. ఒకసారి అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు నా కుడి కాలుకి దెబ్బ తగిలింది. రక్తం పలుచబడే మందులు వాడుతున్నందున సర్జరీ చేయడం కుదరదన్నారు. కొన్ని నెలలపాటు వీల్చైర్లో ఉన్నాను. నెమ్మదిగా కోలుకుని ఇప్పుడిలా ఉన్నాను అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.చదవండి: మగవాళ్ల మందు పార్టీకి ఒంటరిగా రమ్మని పిలుపు: నటి -
మందుపార్టీకి ఒంటరిగా రమ్మన్నారు: బాలీవుడ్ నటి
ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్గా ఉన్న నటి వైష్ణవి మెక్డొనాల్డ్.. తర్వాత వెండితెరకు గుడ్బై చెప్పేసింది. గత కొంతకాలంగా బుల్లితెరపైనే సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించింది. వైష్ణవి మాట్లాడుతూ.. ఒక పెద్ద సినిమాలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. పోస్టర్స్, బ్యానర్స్ కూడా రెడీ అయ్యాయి. అందరూ మగవాళ్లే..కానీ తర్వాత మాత్రం మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే.. నేను ఎక్కడికి వెళ్లిన అమ్మను వెంట తీసుకునే వెళ్తాను. కానీ ఓ సాయంత్ర కాలం మీటింగ్ కోసం ఒంటరిగా రమ్మన్నారు. ఆ పార్టీలో అందరూ మగవాళ్లే ఉంటారని, కలిసి మందు తాగొచ్చని చెప్పారు. నాకది నచ్చలేదు. అమ్మ ఎల్లప్పుడూ నా వెంటే ఉండటం వాళ్లకూ నచ్చలేదు. హీరోకి నాపై ఆసక్తిషూటింగ్ కోసం నేను స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంటుందని ఆ నిర్మాణ సంస్థ నాకు పాస్పోర్ట్ తీసిపెట్టింది. కానీ మా అమ్మకు మాత్రం పాస్పోర్ట్ రెడీ చేయలేదు. పైగా హీరోకు నాపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అతడి ప్రపోజల్ రిజక్ట్ చేయడంతో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి నన్ను సినిమా నుంచి తీసేశారు. అది చాలా పెద్ద సినిమా. నేను అందరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని. సినిమా నుంచి సీరియల్ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకునేదాన్ని. దాంతో రానురానూ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలోనే శక్తిమాన్ సీరియల్కు ఓకే చెప్పాను. ఇది నా కెరీర్కు ఎంతో తోడ్పడింది అని చెప్పుకొచ్చింది. హిందీలో బాబుల్, సాంచా, మమ్మీ పంజాబీ, సూపర్ నాని వంటి పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై శక్తిమాన్, మే ఢిల్లీ హూ, కసౌటీ జిందగీ కే, మిలే జబ్ హమ్ తుమ్ వంటి పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది.చదవండి: నా విజయానికి నా ప్రతిభ కారణం కాదు: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ -
కన్నడలో హిట్ టాక్తో దూసుకెళ్తున్న తెలుగు సినిమా
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ అనే టైటిల్తో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నట్టుగా షెరాజ్ మెహదీ తెలిపారు.అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి.. అమ్మాయిల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కథాంశంతో షెరాజ్ మెహదీ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోగా, దర్శకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ మెప్పించారు. ఈ మూవీలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా వచ్చిన ‘ఓ అందాల రాక్షసి’ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్ను మెప్పిస్తోంది. -
ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నువ్వే: చిరంజీవి
ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉంటుందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి కొణిదెల. ఈరోజు (ఫిబ్రవరి 18న) సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగింది. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా నిలబడింది. నావాళ్లను ఎంతో ప్రేమగా..ఈరోజు తన పుట్టినరోజు, అలాగే అడ్వాన్స్ పెళ్లి రోజు జరుపుకుంటున్నందున నా హృదయం సంతోషంతో నిండిపోయింది. మన కుటుంబానికి నువ్వే కేంద్రబిందువు. మా అందర్నీ నీ ప్రేమతో బంధించేశావు. నా కుటుంబసభ్యులందర్నీ నీ సొంతవాళ్లలా చూసుకున్నావు. ప్రతి క్షణం వారికి తోడుగా ఉన్నావు. నా తల్లిదండ్రులకు నిజమైన కూతురిగా మారిపోయావు. వాళ్లెంత ప్రేమగా చూసుకున్నారో నువ్వూ అంతే ప్రేమగా చూసుకున్నావు.నా సక్సెస్కు కారణం నువ్వేనా విజయానికి నా టాలెంట్, స్వయంకృషి కారణం కాదు. నా సక్సెస్కు నువ్వే ప్రధాన కారణం. నువ్వు ప్రతి బాధ్యతను నీ భుజాన వేసుకున్నావు కాబట్టే నేను నా వృత్తిపై ఫోకస్ చేసి రాణించగలిగాను. కష్టాల్లో, వేడుకల్లో.. అన్నింటిలో నువ్వు మా చేయి పట్టుకుని ముందుకు నడిపించావు. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా బలం, నా సపోర్ట్ సిస్టమ్!నా ప్రతి అడుగులో..నీ పుట్టినరోజును, అలాగే రాబోతున్న మన పెళ్లిరోజును పురస్కరించుకుని ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీవల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ పలు ఫోటోలు షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండటానికి కారణమైన సురేఖకు మెగా అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు ❤️ Happy Birthday to dearest Surekha.From the day we got married on February 20, 1980, you have been my greatest strength. As we celebrate your birthday today and our wedding anniversary in advance, my heart is… pic.twitter.com/H0J6sE7kTK— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2026చదవండి: ఇన్నాళ్లకు కుదిరింది.. సంతోషంలో తనూజ, రీతూ -
లేనప్పుడే విలువ తెలుస్తుంది.. అనారోగ్యంపై తొలిసారి స్పందన
మలయాళ స్టార్ మమ్ముట్టి గతేడాది జూన్లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఆరోగ్యం కుదుటపడ్డాకే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. తాజాగా ఆయన తొలిసారి తన అనారోగ్యం గురించి మాట్లాడాడు. మనిషికి కంటిచూపు, వినికిడి చాలా ముఖ్యమైనవి. అయితే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే కొంత ఆందోళన కలుగుతుంది. నేను కూడా కొంతకాలం అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నాను. లేనప్పుడే విలువ తెలుస్తుందిచాలాకాలం రుచి, వాసన కోల్పోయాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తిరిగి పొందుతున్నాను. అయితే ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుంది. వినడం, వాసన గ్రహించడం, రుచి చూడటం వంటి సామర్థ్యాల ప్రాధాన్యత చాలామంది పట్టించుకోరు. వాటి శక్తి నెమ్మదించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడమని చెప్తాం. ఎందుకంటే మనం వినగలుగుతున్నాం. కానీ వినికిడి శక్తి లేనివారు ఏదీ అనకుండా సైలెంట్గా ఉంటారు. ఎవరెలా మాట్లాడినా వారికి తేడా ఉండదు. వినగలగడం కూడా ఒక వరం అని చెప్పుకొచ్చాడు.కెరీర్మమ్ముట్టి 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్లో జన్మించాడు. ఎల్ఎల్బీ డిగ్రీ చదివిన ఆయన రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. 1971లో అనుభవంగళ్ పాలిచకల్ మూవీలో ఓ చిన్నపాత్రతో నటన ప్రారంభించాడు. విల్కన్ ఉండూ స్వప్నంగళ్ సినిమాతో హీరోగా మారాడు. ఏడాదికి ఇరవైకి పైగా సినిమాలు చేశాడు. అలా దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకుగానూ మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు వరించింది. ప్రస్తుతం ఈయన పాత్ర, పేట్రియాట్ సినిమాల్లో నటిస్తున్నాడు.చదవండి: హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర అని పిలిచి అవమానం: సుహాస్ -
మారుతి కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ
దర్శకుడు మారుతికి ‘రాజాసాబ్’ సినిమా ఫలితం పెద్ద షాక్నే ఇచ్చింది. ఆ సినిమా పరాజయానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ విమర్శల బాణాలు మాత్రం మారుతి వైపే ఎక్కువగా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన మరో కొత్త స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారు. మళ్లీ ట్రాక్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మారుతి కేరళలో ప్రశాంతంగా కూర్చుని తన దగ్గర ఉన్న ఒక పాయింట్ను పూర్తి స్క్రిప్ట్గా మార్చారు. అయితే ఆ కథకు హీరో ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దృష్టి మాత్రం హీరో రామ్, హీరో వరుణ్ తేజ్లపై ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ సినిమా నిర్మాణం మైత్రీ మూవీస్తో జరగనుంది. మైత్రీలో మారుతి సినిమా ఎప్పటి నుంచో ప్లాన్లో ఉంది. కానీ ఇప్పటివరకు ఫైనల్ మాత్రం కాలేదు. చూస్తుంటే ఇప్పుడు ఆ అవకాశం నిజమయ్యేలానే ఉంది. ప్రస్తుతానికి రామ్ చేతిలో సినిమా లేదు. రెండు స్క్రిప్ట్లు వర్క్లో ఉన్నాయి. ఒకవేళ అవి కాకపోతే మారుతి స్క్రిప్ట్తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే యువి క్రియేషన్స్లో ఒక సినిమా చేస్తున్నారు. ఒకసారి మారుతి స్క్రిప్ట్ విన్న తర్వాత రామ్ లేదా వరుణ్ తేజ్ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో స్పష్టత వస్తుంది.అయితే ఈ ప్రాజెక్ట్పై పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మైత్రీ మూవీస్- మారుతి కాంబినేషన్ ఫైనల్ అయితే టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.


