breaking news
Cinema News
-
Jinn Movie: ‘నన్ను మీరే కాదు... ఎవ్వరూ పట్టుకోలేరు’
అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాశ్ తుమినాడ్, రవి భట్, సంగీత లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ‘జిన్ అనేది ఉండుంటే ఒకసారి వచ్చి నా చేతిని టచ్ చేయాలి, నన్ను మీరే కాదు... ఎవ్వరూ పట్టుకోలేరు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘థియేటర్స్లో కరెక్ట్గా భయపెడితే ఆడియన్స్ హారర్ చిత్రాలను ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘జిన్’ ట్రైలర్ నచ్చింది’’ అన్నారుసోహెల్ మాట్లాడుతూ .. ‘తెలుగు ఆడియెన్స్ అన్ని భాషల చిత్రాల్ని, అన్ని భాషల టెక్నీషియన్లను ఆదరిస్తుంటారు. ‘జిన్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. స్పూకీ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ బాగుంది. జిన్లో గుడ్ జిన్ ఉంటుంది.. బ్యాడ్ జిన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ .. ‘‘మా ‘జిన్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసేందుకు డబ్బులు పెట్టి నిర్మించిన నిఖిల్ గారికి థాంక్స్. మా చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆడియెన్స్ అందరూ మా మూవీని చూడండి. మీరు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తామ’ని అన్నారు. -
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
పాన్ ఇండియా సినిమాకే కేరాఫ్గా మారింది టాలీవుడ్. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జ, నిఖిల్ లాంటి కుర్ర హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తూ తమ పాపులారిటినీ పెంచుకుంటున్నారు. అదే జోష్లో మన సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్లో నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వడం లేదు.మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్ల పాటు సినిమాలను ఆపేసినా కూడా ఆయన మార్కెట్ చెక్కుచెదరలేదు. కానీ పాన్ ఇండియా మార్కెట్లో మాత్రం చిరంజీవి ఫ్లాప్ అవ్వాలి. గాడ్ ఫాదర్ చిత్రంతో పాన్ ఇండియాలో మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరో నటించినా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దరుణంగా బోల్తా పడింది. దీంతో చిరు పాన్ ఇండియా ప్రయత్నాలు వదిలేసి.. మళ్లీ లోకల్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ పక్కా తెలుగు సినిమా. ఇక్కడ హిట్ అయితే చాలు..పాన్ ఇండియా అవసరం లేదనుకొని, అదే రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక బాలయ్య కూడా పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. అఖండ 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ చిరంజీవి కంటే దారుణమే ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 కోసం ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేశాడు. హిందీతో డైలాగులు చెప్పి అలరించాడు. కానీ అవేవి థియేటర్స్కి రప్పించలేకపోయాయి. బాలీవుడ్లో అఖండ 2 అట్టర్ ఫ్లాప్ అయింది.ఇక వెంకటేశ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో రాణించాలని ‘సైంధవ్’తో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథలపైనే ఫోకస్ పెట్టాడు.మనో సీనియర్ హీరో నాగార్జున కూడా అంతే. పాన్ ఇండియా పై ఆయనకు మోజే లేదు. సోలోగా రాణించాలనే ఆశే లేదు. కుబేర, కూలి, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కానీ.. హీరోగా మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా టాలీవుడ్ సీనియర్లంతా పాన్ ఇండియా మార్కెట్ వద్ద ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా హిట్ కొడతారో చూడాలి. -
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరీ బ్యూటీ!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమా గుర్తుందా? చూసిన వాళ్లు అయితే ఆ సినిమాను అంత ఈజీగా మార్చిపోరులేండి. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకంటారా? అదే సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన ఓ చిన్నారు గుర్తుంది కదా? మతి స్థిమితం లేని నాన్నతో సైగలు చేస్తూ మాట్లాడి..మనకు కన్నీళ్లు తెప్పించింది. ఆ సినిమా విజయంలో విక్రమ్తో పాటు ఆ చిన్నారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ చిన్నారు ఇప్పుడు హీరోయిన్గా కాదు కాదు.. ‘పాన్ ఇండియా హీరోయిన్’ మారిపోయింది. ఆమె పేరు సారా అర్జున్!రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’లో హీరోయిన్గా నటించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. పది రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ సారా అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు.ఏడాదిన్నరకే నటనబాలీవుడ్ నటుడు అర్జున్ కూతురే సారా అర్జున్. 2005లో ముంబైలో పుట్టింది. ఏడాదిన్నర వయసులోనే ఓ యాడ్లో నటించి మెప్పించింది. తొలి యాడ్కి మంచి స్పందన రావడంతో సారాకు వరుస ఆఫర్లు వచ్చాయి. చిన్నవయసులోనే దాదాపు 100పైగా వాణిజ్య ప్రకటనల కోసం నటంచింది. . మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి బడా సంస్థల యాడ్స్లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.ఆరేళ్లకే వెండితెరపైకోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ఓ యాడ్ తీశాడు. అందులో సారా నటించింది. ఆమె అమాయకత్వం చూసి మురిసిపోయిన విజయ్.. తన మూవీ ‘దైవ తిరుమగల్’లో చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘నాన్న’ టైటిల్తో రిలీజైంది. విక్రమ్ కూతురుగా నటించిన సారా.. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం'పొన్నియన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్లో నటించింది. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సారా చరిత్ర సృష్టించింది.అసిస్టెంట్ డైరెక్టర్గానూ..సారాకి మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటుంది. ‘డంకీ’ సినిమాకిగాను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసింది.డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడే కథక్, హిప్మాప్ నేర్చుకుంది. కరాటేతో పాటు మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా’ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది. -
ఊరి నేపథ్యం ‘దండోరా’.. ప్రేక్షకుల ఊహకు అందదు : డైరెక్టర్
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మురళీకాంత్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని అసమానతలపై కథ చెప్పాలనుకుని, నాకు ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ‘దండోరా’ సినిమా కథ రాసుకున్నాను. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టే వరకు జరిగే కథే ‘దండోరా’. ఈ సినిమా కథ ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఓ వ్యక్తిని ఆ ఊర్లో ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది? అన్నదే కథ. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. బిందు మాధవి, మనిక, రాధ్య, మౌనిక... ఇలా వీరు చేసిన పాత్రలు, తీసుకునే నిర్ణయాలే టర్నింగ్ పాయింట్స్గా ఉంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో ప్రేక్షకుల ఊహకు అందదు. ముందుగా ఈ మూవీ కోసం వేరే టైటిల్ అనుకున్నాను. ఇది నాకు మూడేళ్ల జర్నీ. ‘అంతిమ యాత్ర’ అనే వర్కింగ్ టైటిల్ను అందరూ చూసి డల్గా ఉందని అనుకున్నారు. మనం మంచి కథను, మంచి సౌండింగ్తో చెబుతున్నాం కదా.. టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్గా ఉండాలని నిర్మాత అన్నారు. అలాంటి టైంలో ఓ ఫ్రెండ్ ‘దండోరా’ అని సలహా ఇచ్చారు. అలా ఈ మూవీకి కరెక్ట్ టైటిల్ దొరికినట్టు అయింది’ అన్నారు -
పతంగ్ సినిమాకి హిట్ కళ కనిపిస్తోంది
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఇదొక కొత్త రకమైన సినిమా. ట్రైలర్ చూడగానే సూపర్ థ్రిల్ ఫీలయ్యాను. యూత్కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. వంశీ పూజిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పేరు విస్కి. పక్కా హైదరాబాదీగా మాస్ ΄ాత్ర చేశాను. తెలుగు సినిమా గర్వంగా ఫీలయ్యేలా ఈ ‘పతంగ్’ చిత్రం ఉంటుంది. నా పుట్టినరోజున ఈ సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కంటెంట్ పరంగా పెద్ద సినిమా ఇది. పతంగుల పోటీ సన్నివేశాలను చాలా కష్టపడి తీశాం. నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన మా అమ్మానాన్నకు హిట్ ఇవ్వబోతున్నాను’’ అన్నారు ప్రణవ్ కౌశిక్. ‘‘ఈ సినిమా ఆడియన్స్కు రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్ను ఇస్తుంది’’ అని చె΄్పారు సహ నిర్మాత రమ్య వేములపాటి. ఈ కార్యక్రమంలో రాహుల్ మోపిదేవి, ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, సంపత్ మక తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం 9కల్లా సెట్లో.. అర్దరాత్రి వరకు షూటింగ్స్తోనే బిజీ!
వయసు మీద పడుతుంటే ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. అందులోనూ 80 దాటిందంటే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ బిగ్బీ అమితాబ్ బచ్చన్ మాత్రం 83 (తన వయసు) అనేది జస్ట్ నంబర్ మాత్రమేనని, తానింకే కుర్రవాడినేనంటున్నారు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి.కేబీసీ షో హోస్ట్గా..అమితాబ్ సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే షోను హోస్ట్ చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కేబీసీ 17వ సీజన్ రన్ అవుతోంది. ఈ షోకి ఇటీవలే ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్ మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్, షరీబ్ హష్మీ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేబీసీ అనుభవాలను పంచుకున్నాడు షరీబ్ హష్మీ. అంతా కలలా ఉందిఆయన మాట్లాడుతూ.. అమితాబ్ (Amitabh Bachchan) గారిని కలిశానంటే ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. ఆ అనుభవాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా జర్నీ గురించి అడిగినప్పుడు ఆయన నాతోనే మాట్లాడారా? అని గాల్లో తేలిపోయాను. కానీ, ఆయన ఎనర్జీకి మాత్రం దండం పెట్టాల్సిందే! ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్క రోజులోనే మూడు ఎపిసోడ్ షూటింగ్స్ పూర్తి చేస్తారు. పొద్దున తొమ్మిదికల్లా సెట్కు వస్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు. మేము హాజరైన ఎపిసోడ్ షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. అలసట లేకుండా..మేమందరం కాసేపైనా ఓ చిన్న కునుకు తీస్తే బాగుండు అన్నట్లుగా ఉన్నామా? ఆయన మాత్రం నిద్రను దరిచేరనీయకుండా యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఆయన అంత సెద్ద సూపర్ హీరో అయ్యారు అని షరీబ్ (Sharib Hashmi) చెప్పుకొచ్చాడు. ఇటీవల అమితాబ్ సైతం ఓ బ్లాక్లో తాను ఉదయం ఐదున్నర గంటల వరకు పని చేసినట్లు తెలిపారు. ఇదంతా చూసిన అభిమానులు మీకున్న ఎనర్జీ, డెడికేషన్కు హ్యాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కాంతార హీరోయిన్కు బాలీవుడ్లో ఆఫర్ -
కాంతార హీరోయిన్కు బాలీవుడ్ ఆఫర్!
సౌత్లోని భారీ బడ్జెట్ సినిమాలకు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ఈ మధ్య పరిపాటి అయిపోయింది. అయితే దక్షిణాదిలో టాలెంట్ నిరూపించుకుంటున్న భామలకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపొస్తోంది. అందుకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద ఉదాహరణ.. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్కు జంటగా ఓ సినిమా చేస్తోంది. తాజాగా మరో సౌత్ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రుక్మిణి వసంత్..నాలుగేళ్లు గ్యాప్2019లో బీర్బర్ ట్రయాలజీ మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి. అదే ఏడాది అప్స్టార్స్ అనే హిందీ మూవీలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం తనకు ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సప్త సాగరదాచె ఎల్లో అనే కన్నడ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో డ్రాగన్ఈ సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి టైటిల్తో విడుదలై మంచి స్పందన రాబట్టింది. దీని సీక్వెల్ కూడా సక్సెస్ అవడంతో పాటు రుక్మిణి అందానికి అందరూ ఫిదా అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా మెప్పించలేకపోయింది. కాంతార: చాప్టర్ 1 చిత్రంతో మరోసారి సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యష్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ నుంచి పిలుపుబాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రుక్మిణి (Rukmini Vasanth) మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి హిందీ సుపరిచితమైన భాషే అంది. ఒక బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని.. భగవంతుడి దయ ఉంటే త్వరలోనే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేసింది.చదవండి: తిండీనిద్ర మానేసి మందు తాగుతూ ఉన్నా: ఊర్వశి -
తిండీనిద్ర మానేసి మందు తాగడం.. మాజీ భర్త వల్లే!
చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 350కి పైగా సినిమాలు చేసింది. 2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి సంతానం. రెండో పెళ్లిఅయితే భార్యాభర్తలు ఎంతోకాలం కలిసుండలేదు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో చెన్నైకి చెందిన శివప్రసాద్ను పెళ్లాడింది. వీరికి ప్జాపతి అని ఓ కుమారుడు సంతానం. ఇటీవలే శివప్రసాద్ దర్శకుడిగా మారిపోయాడు. తన మొదటి పెళ్లి ఎందుకు విఫలమైందన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందరూ కలిసి తాగేవారుఊర్వశి మాట్లాడుతూ.. మొదటిసారి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ వాతావరణమే తేడాగా అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ ఆధునిక జీవన విధానాన్ని కొనసాగించేవారు. కలిసి తాగడం, తినడం చేసేవారు. తల్లీపిల్ల తేడా లేకుండా అంతా ఒక్కచోట కూడి సిట్టింగ్ చేసేవారు. వాళ్ల మధ్య నేను ఇమడగలుగుతానా? లేదా? అని భయపడ్డాను.షూటింగ్ అవగానే తాగడంఅడ్జస్ట్ అవడానికి ప్రయత్నించాను. వాళ్ల పద్ధతుల్ని నేర్చుకున్నాను. షూటింగ్స్కు వెళ్లడం.. రాగానే మందు కొట్టడం ఇదే పని! నన్ను నేను కోల్పోతున్నాను అన్న విషయం నెమ్మదిగా అర్థమైంది. అప్పటికే ఇంటి పోషణ బాధ్యత నా భుజాలపై పడింది. ఇష్టం లేని పనులు బలవంతంగా చేయాల్సి వచ్చింది. ఆరోగ్యం నాశనం చేసుకున్నానా అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించేవారు కాదు. గొడవలు జరిగేవి.. అప్పుడు కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండీనిద్ర మానేసి మరీ తాగుతూ కూర్చునేదాన్ని. చేజేతులా ఆరోగ్యం నాశనం చేసుకున్నాను. నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్లే ఈ వ్యసనం నుంచి బయటపడ్డాను అని ఊర్వశి చెప్పుకొచ్చింది. -
నువ్వు నాకు నచ్చావ్ రీరిలీజ్ మాత్రమే కాదు!
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కె విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్తో ప్రపంచవ్యాప్తగా రీరిలీజ్ చేయనున్నట్లుగా స్రవంతి రవికిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీరిలీజ్ కాదు, నూతన సంవత్సరాన్ని (2026 జనవరి 1) కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని చెప్పారు. A story that made generations smile and continues to touch hearts across ages! ❤️A True Masterpiece in Telugu cinema, #NuvvuNaakuNachav returns with a theatrical re-release on Jan 1st, 2026! A #Trivikram Writings.Overseas Release by @PrathyangiraUS @VenkyMama… pic.twitter.com/RvFCMZOa0j— Sri Sravanthi Movies (@SravanthiMovies) December 14, 2025 -
నిధి అగర్వాల్తో 'రాజాసాబ్' డ్యాన్స్.. ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సెకండ్ సాంగ్ ప్రోమోతాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది. It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025 -
తమిళ్లో నాకు ఛాన్సులివ్వరు, ఇక్కడ ఆ ఐక్యత లేదు!
మాస్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ దిట్ట. కిక్ నుంచి మొదలుపెడితే అఖండ 2 వరకు ఎన్నో సినిమాలకు బ్లాక్బస్టర్ సంగీతం అందించాడు. మాస్కే పరిమితం కాకుండా క్లాస్, లవ్ ఎంటర్టైనర్ సినిమాలకు సైతం మంచి మ్యూజిక్ కొట్టాడు. అప్పుడప్పుడూ తమిళ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే తమిళంలో తనకు అంతగా అవకాశాలివ్వడం లేదంటున్నాడు తమన్.ఇండస్ట్రీ కలుషితంతాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ కలుషితమైపోయింది. ఇక్కడ వెన్నుపోట్లే ఎక్కువయ్యాయి. మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అనిరుధ్కు తెలుగులో సినిమా ఛాన్స్ రావడం చాలా ఈజీ. కానీ నాకు తమిళంలో అవకాశం రావడం చాలా కష్టం. అక్కడ నాకు అవకాశాలివ్వరు.ప్రాంతీయభావం ఎక్కువతమిళనాడులో ప్రాంతీయభావం ఎక్కువ. వేరేవాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ, ఇక్కడ ఆ ఐక్యత లేదు. దేశంలో ఎక్కడినుంచి వచ్చినా మనవాళ్లు యాక్సెప్ట్ చేస్తారు. పోటీని నేను తప్పుపట్టను. అది మంచిదే! దర్శకులు వేరేవాళ్లను రిఫర్ చేస్తున్నారంటే వాళ్లేం కోరుకుంటున్నారో అది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. తమిళ, కన్నడ, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్లందరూ తెలుగులో పని చేస్తున్నారు. పీఆర్తో పనివాళ్లందరూ పీఆర్ టీమ్ను పెట్టుకుని బాగా పని చేసుకుంటున్నారు. వారి వారి ఇండస్ట్రీలలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం వాళ్లను పిలిచి మరీ కోట్లు ఇస్తాం. వాళ్లేదో తెలుగు సినిమా అని కసితో చేయరు. ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారని పని చేస్తారంతే! మనం అలా ఫేక్గా బతకలేం. అభిమానులకు ఏం కావాలో అందుకు తగ్గట్లు కష్టపడతాం అని తమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్లేటు పట్టుకుని లైన్లో నిల్చోవాలా? నా వల్లకాదు! -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘అడవి’.. స్టార్ హీరోల చూపులన్నీ అటువైవే!
టాలీవుడ్లో ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టోరీల హవా నడిచేది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు లవ్స్టోరీ, కామెడీ ఎంటర్టైన్మెంట్ రాజ్యమేలాయి. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ స్టోరీలపై ఆసక్తి చూపిస్తున్నారు. పిరియాడిక్, హిస్టారికల్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. అడవి నేపథ్యంలో వచ్చిన కాంతార 1&2 బాక్సాఫీస్ని షేక్ చేసింది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురమ్ భీమ్ ఎపిసోడ్తో పాటు అల్లూరీ యాక్షన్ సీన్ అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ సినిమా విజయం కీలక పాత్ర పోషించాయి. ఇలా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన కథలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో .. మరికొంత మంది స్టార్ హీరోలు కూడా అడవి నేపథ్యం కథలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.అందులో అతిపెద్ద సినిమా ‘వారణాసి’. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ మూడు గెటప్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలన్నీ అడవి నేపథ్యంలోనే సాగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.అక్కినేని హీరో నాగచైతన్య కూడా అడవి బాటనే పట్టారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ అడ్వెంచరస్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలోని కీలక సీన్లన్ని అడవి నేపథ్యంలోనే తెరకెక్కస్తున్నారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఇక మేగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా అడవినే నమ్ముకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ కథ మొత్తం అడవి నేపథ్యంలోనే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుది.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) కథ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లోనే సాగుతుందట. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీన్ ఈ సినిమాకే హైలెట్ అవుతుందట. శ్రీవిష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘హైందవ’ చిత్రాల్లో కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాపే హైలెట్ కానుందనే టాక్ వినిపిస్తోంది. -
ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లికోసం ప్లానింగ్!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్ 2 అనే పాడ్కాస్ట్లో వెల్లడించాడు. ఈ పాడ్కాస్ట్కు అర్జున్ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు. ఆరేళ్లుగా డేటింగ్అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!మొదటి పెళ్లికాగా అర్జున్ రాంపాల్.. 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.ఎవరీ గాబ్రియెల్లా?గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్ చేసింది. పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది. ఇష్క్ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్ డ్యాన్సర్గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే.. ఆంఖేన్, డాన్, ఓం శాంతి ఓం, ఈఎమ్ఐ, హౌస్ఫుల్, రాజ్నీతి, చక్రవ్యూహ్, సత్యాగ్రహ, ధాకడ్, ధురంధర్ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించాడు.చదవండి: రెండోసారి విడాకులు తీసుకోబోతున్న దర్శకుడు! -
మెస్సీ అంటే ఇష్టం లేదు: అల్లు అర్హ
ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెస్సీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం నాడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసి అభిమానులు ఆనందంతో గెంతులేశారు. మెస్సీ మైదానంలో సరదాగా ఆడుతూ గోల్స్ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. ఈ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ సైతం వెళ్లారు.అర్హ, అయాన్ వీడియో వైరల్మెస్సీ కోసం వచ్చావా? అని ఓ విలేఖరి అడిగితే.. కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానని ఆన్సరిచ్చాడు అయాన్. ఫుట్బాల్లో ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే రొనాల్డో అని చెప్పాడు. తర్వాత అర్హను ప్రశ్నలడిగారు. మెస్సీ అంటే ఇష్టమా? అని అడగ్గా.. తనకు ఇష్టం లేదని అర్హ నిర్మొహమాటంగా బదులిచ్చింది. మెస్సీ మ్యాచ్కు వచ్చి మెస్సీ అంటేనే ఇష్టం లేదని చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.Ayaan bhAAi asalu vere unnadu😂🤣Yela ra asalu ila 😭💯📈Entertainer "Ayaan" bolthe 💥🥁#ayaan #alluarjun pic.twitter.com/ekWkTYEHe6— sai (@nenupapinii) December 14, 2025 చదవండి: థియేటర్లో సుమ కన్నీళ్లు -
ప్రేమంటే ఇదేరా.. ఫస్ట్ చాయిస్ ఎవరంటే?
కథ రాసుకోవడంతో సినిమా అయిపోదు, అక్కడే అసలు కథ మొదలువుతుంది. ఆ కథలోని పాత్రల ఎంపిక దగ్గరే దర్శకనిర్మాతలు మల్లగుల్లాలు పడుతుంటారు. విక్టరీ వెంకటేశ్ "ప్రేమంటే ఇదే రా" సినిమా విషయంలో ఇదే జరిగింది. జయంత్ సి. పరంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది.ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్యఇందులో వెంకీ సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాను తీసుకున్నారు. అయితే ప్రీతి కంటే ముందు చాలామందినే సంప్రదించారు. ఆ విషయం గురించి జయంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఫస్ట్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నాం. తనకు కథ బాగా నచ్చి డేట్స్ కూడా ఇచ్చింది. కానీ అప్పటికే తన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తిదీంతో ఆమె ఐరన్ లెగ్ అని పక్కన పెట్టాం. అలా తనను వద్దని వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్లాం. అమీషా పటేల్, రేణూ దేశాయ్ను స్క్రీన్ టెస్ట్ చేశాం. భూమిక చావ్లా, రీమా సేన్.. ఇలా చాలామందిని అనుకున్నాం. ఇంకో మూడునాలుగురోజుల్లో ముహూర్తం ఉందనగా రామానాయుడు స్టూడియోలో ఒంటరిగా కూర్చుని.. ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలి? అని తల పట్టుకున్నాను. ఐదు నిమిషాల్లో హీరోయిన్ ఫిక్స్సరిగ్గా అప్పుడే అనిల్ కపూర్ వచ్చి పలకరించాడు. నా సమస్య చెప్పాను. ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన ప్రీతి జింటాను తీసుకోమని సలహా ఇచ్చాడు. తర్వాతి రోజే తనతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆమెతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే తనే నా మూవీ హీరోయిన్ అని ఫిక్సయ్యాను అని చెప్పాడు. అలా ప్రేమంటే ఇదే రా మూవీతో ప్రీతి జింటా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.రీరిలీజ్ వాయిదా1998లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్టయింది. రమణ గోగుల.. నైజాం బాబులు, నాలో ఉన్న ప్రేమ వంటి హిట్ సాంగ్స్ అందించారు. అన్నీ కలిసొస్తే నేడు (డిసెంబర్ 13న) ప్రేమంటే ఇదేరా రీరిలీజ్ అయ్యేది. కానీ, ప్రస్తుతానికి వాయిదా పడింది.చదవండి: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలు వీళ్లే -
సస్పెన్స్ థ్రిల్లర్ గా మ్యాజిక్ మూవ్ మెంట్స్
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు. హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ - చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం అన్నారు.నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ - నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా అన్నారు. -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..అఖిల్ - జైనబ్కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్తో ఏడడుగులు వేశాడు. జూన్ 6న ఎంతో గ్రాండ్గా ఈ వెడ్డింగ్ జరిగింది.సమంత- రాజ్ నిడిమోరుహీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!అభిషన్ జీవింత్- అఖిలటూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఓ సినిమా ఈవెంట్లో ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.అవికా గోర్- మిలింద్ చంద్వానీచిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది.అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్సింగర్ అర్మాన్ మాలిక్ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది.హీనా ఖాన్- రాకీ జైస్వాల్బుల్లితెర నటి హీనా ఖాన్ కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్ 4న పెళ్లి చేసుకున్నారు.ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.అర్చన- బీఆర్ శరత్కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగింది.వీళ్లే కాకుండా సారా ఖాన్- క్రిష్ పాఠక్.. సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. -
పాకీజాకు ఆశ్రయం కల్పించిన కోనసీమ వాసి
ఒకప్పటి సినీ నటి వాసుకి (పాకీజా) కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె మోహన్బాబు హిట్ సినిమా ‘అసెంబ్లీ రౌడీ’తో టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఈ మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, మేజర్ చంద్రకాంత్, బ్రహ్మ ఇలా అనేక సినిమాలో ఛాన్స్ దక్కింది. దీంతో పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది. అయితే, ఆమె దుర్భర జీవితం గడుపుతున్న విషయం సోషల్మీడియాలో కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆత్రేయపురంలోని శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం ఆమె ఆయన నిర్వహిస్తున్న ఆశ్రమంలోనే పాకీజా ఉన్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో పాకీజా కొంత కాలంగా ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే ఆమె ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. ఆమెకు ఏపీ ప్రభుత్వం నుంచి పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆమెకు కాస్త ఆసరాగా ఉంటుందని ప్రభుత్వాన్ని కేశవరావు కోరారు. ఇప్పటికే తన వద్ద చాలామంది వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తనను తెలుగువారికి పరిచయం చేసిన మోహన్బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిదని పాకీజా అన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మంచు విష్ణు తన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. తన కళ్లకు శస్త్రచికిత్స చేయించారని ఆమె తెలిపారు. పాకీజాకు ఇప్పటికే చిరంజీవి ఆర్థిక సాయం చేశారనే విషయం తెలిసిందే. -
2026లో ‘మెగా’ బ్లాస్ట్.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!
ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్,ఫ్లాప్ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్తో అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ పక్కకు పెడితే.. చరణ్(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్ డిబెట్ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ కానుంది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్లో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్లో రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్ ’కూడా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్లోనే రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. -
25 ఏళ్లుగా డిన్నర్కే వెళ్లలేదంటున్న స్టార్ హీరో!
సినిమా తారలకు ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కాదు, కాదు వాళ్లే ఆంక్షలు పెట్టుకుని బతుకుతుంటారు. నోరు కట్టేసుకుంటారు, స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరు, ఒక్కమాటలో చెప్పాలంటే నచ్చినట్లు జీవించలేరు. ఎంతసేపూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలన్న తాపత్రయంలో ఉంటారు. అందుకోసం తమ శరీర సౌష్టవాన్ని నిత్యం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.25 ఏళ్లుగాఅయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం చీటింగ్ డే అంటూ కొన్నిసార్లు అన్నీ పక్కనపెట్టి నచ్చింది ఆరగిస్తుంటారు. అది బిర్యానీ అయినా, ఐస్క్రీమ్ అయినా! కాస్త గ్యాప్ దొరికితే వెకేషన్కో, డిన్నర్కో బయటకు వెళ్తుంటారు. కానీ అలా తాను డిన్నర్కు వెళ్లి 25 ఏళ్లు అయిందంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.వాళ్లే ఉన్నారుతాజాగా రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్కు హాజరైన సల్మాన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేనెప్పుడూ కుటుంబం, ఫ్రెండ్స్ అంటూ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను. కానీ నా జీవితంలో కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ను కోల్పోయాను. దీంతో ఇప్పుడు నాతో నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఎన్నో ఏళ్లకొద్దీ నాతో సావాసం చేస్తున్నారు.అదే నా పనినేను బయట డిన్నర్కు వెళ్లి 25 ఏళ్లవుతోంది. ఎంతసేపూ షూటింగ్, ఎయిర్పోర్ట్, హోటల్, ఈవెంట్.. ఆ వెంటనే షూటింగ్.. ఇదే నా పని. అలా అని ఈ విషయంలో నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. వారికోసం నేను కష్టపడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. మర్చిపోయాడా?అయితే సల్మాన్ ఖాన్ పలువురు సెలబ్రిటీలతో గతంలో డిన్నర్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆనాటి విషయాల్ని సల్మాన్ మర్చిపోయాడా? లేదంటే అప్పుడు తినకుండానే బయటకు వచ్చేశాడా? అన్నది తనకే తెలియాలి! ప్రస్తుతం సల్మాన్ ఖాన్ (Salman Khan).. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నాడు. -
దగ్గరివాళ్లే ద్రోహం చేశారు.. రెండేళ్లవుతోంది: నటి
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టాక తనను చూసుకోవడంతోనే సరిపెట్టుకున్న రిచా చద్దా ఇప్పుడు మళ్లీ సెట్స్లో అడుగుపెట్టింది. అయితే అనుకున్నదానికంటే ఆలస్యంగానే సెట్లో రీఎంట్రీ ఇచ్చానంటోంది రిచా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.ద్రోహం చేశారుదాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ పనిలో నిమగ్నమయ్యాను. వీలైనంత త్వరగా సెట్లో అడుగుపెట్టాలనుకున్నాను.. కానీ నా శరీరం, మనసు అందుకు సిద్ధపడటానికి చాలా సమయమే తీసుకుంది. వీటిని పక్కనపెడితే ఇండస్ట్రీలో అత్యంత దగ్గరి వ్యక్తులే నాకు ద్రోహం చేశారు. ఈ రంగంలో కొందరికి మాత్రమే నీతి నిజాయితీ అనే విలువలు ఉంటాయని అర్థమైంది. వాళ్లను క్షమిస్తానేమో కానీ..వాళ్లకు ఆత్మనూన్యతా భావం ఎక్కువ. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, పక్కపవాళ్లనూ సంతోషంగా ఉండనివ్వరు. ఎలా అంటే పక్కవాళ్ల జీవితంలోని ఆనందాన్నంతా పీల్చేస్తుంటారు. అయితే ఇదంతా కొత్తేమీ కాదు.. గురు దత్ 70 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటివాళ్లను నేను క్షమిస్తానేమో కానీ జరిగినదాన్ని మాత్రం మర్చిపోను.నాకంటూ లైఫ్ ఉందిపాప పుట్టకముందు నేనెలా ఉండేదాన్నో నాకే గుర్తులేదు. చాలామంది ఏదో ఒక కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండమని చెప్తున్నారు. నాకంటూ ఓ జీవితం ఉంది. ఆ లైఫ్లో జరిగే ప్రతీది చెప్పడం నాకిష్టం లేదు. అసలు సోషల్ మీడియాలో ప్రతీది షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఎవరైనా ఒంటరితనం పోతుందా? లేదా మనమేదో రిచ్ అని చెప్పడానికా? అయినా నేను ఆల్రెడీ రిచే (Richa) అని చెప్పుకొచ్చింది.సినిమారిచా చద్దా (Richa Chadha).. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, ఫర్కీ, సర్బ్జిత్, లవ్ సోనియా, గోలియో కీ రాస్లీల రామ్లీల, షకీల, సెక్షన్ 375 వంటి పలు సినిమాల్లో నటించింది. చివరగా హీరామండి వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) -
96 మ్యాజిక్ రిపీట్ అవుతుందా!
96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్.భాస్కర్ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్, గౌరికిషన్ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్ స్టూడియోస్ పతాకంపై కన్నదాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిఈ మూవీ ద్వారా రాజ్కుమార్ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, రెడిన్ కింగ్స్లీ, డీఎస్ఆర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. 96 మ్యాజిక్ రిపీట్!జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్ ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ల మ్యాజిక్ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్ను ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్.రామచంద్రన్ చాయాగ్రహణం, ఎంఎస్.జోన్స్ రాబర్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
భర్తతో గొడవ.. నిద్రమాత్రలు మింగిన బుల్లితెర నటి
బుల్లితెర నటి రాజేశ్వరి (39) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్థానిక సైదాపేటకు చెందిన రాజేశ్వరి ప్రస్తుతం ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సిరకడిక్క ఆశై సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మి, పనివిళుమ్ మలర్వనమ్.. ఇతర సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించారు.నిద్రమాత్రలు మింగి పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి స్థానిక ముత్తియల్పేటలో నివసిస్తూ వచ్చారు. అయితే ఈమెకు, భర్తకు మధ్య చాలాకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. దీంతో రాజేశ్వరి ఇటీవల సైదాపేటలోని తన తల్లి ఇంటికి వచ్చి అక్కడి నుంచే షూటింగ్లకు వెళ్తుండేవారు. ఇటీవల భర్తతో మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నటి గురువారం రాత్రి అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని స్పృహ కోల్పోయారు. చికిత్స పొందుతూ మృతితొలుత ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి స్థానిక కీల్పాక్కమ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే సైదాపేట పోలీసులు కీల్పాక్కమ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
హారర్ థ్రిల్లర్ ‘జిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ రోజుల్లో వైవిధ్యభరితమైన కథలు ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. కథలో స్టఫ్ ఉండాలే గానీ, కొత్త నటీనటులైనా సరే సినిమా సూపర్ సక్సెస్ అవుతోంది. సరిగ్గా అదే ఫార్ములాను తీసుకొని ఓ డిఫరెంట్ జానర్ లో "జిన్" అనే ఓ సరికొత్త సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ చిన్మయ్ రామ్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తుండగా.. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడమే గాక అంచనాలు నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మంచి హైప్ నడుమ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు జిన్ అనే టైటిల్ ప్లస్ పాయింట్. కథనే కాదు టైటిల్ లో కూడా వైవిద్యం ఉండటంతో ఈ సినిమా సులువుగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కథకు యాప్ట్ అయ్యే పలు లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఖర్చుకు నిర్మాతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని, ఈ మూవీ థియేటర్స్ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసి ఉంటాం కానీ ఇది అన్నింటిలో డిఫరెంట్ అవుతుందని అంటున్నారు. -
సినిమా టికెట్ల రేట్లు పెంపుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు ప్రతిసారి వివాదాస్పదంగా మారుతుంది. ప్రభుత్వ టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం.. దాన్ని సవాల్ చేస్తూ ఎవరో ఒకరు కోర్టుమెట్లు ఎక్కడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపుపై కూడా ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ సందర్భంగా హైకోర్టు.. ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సినిమా టికెట్ల రేట్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై టికెట్ ధరలకు పెంచమని సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ తమ వద్దకు రావొద్దని కోరారు.. హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరిమన్నారని మంత్రి ప్రశ్నించారు. తక్కువ ధరలు ఉంటేనే ఫ్యామిలీ మొత్తం వచ్చి సినిమా చూస్తుందని, అందుకే ఇకపై తెలంగాణలో రేట్లను పెంచబోమని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కాగా, అఖండ 2 మూవీ టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ షోలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వ్యూలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. దీంతో రాష్ట వ్యాప్తంగా అఖండ 2 టికెట్ల రేట్లు యాథావిధిగా కొనసాగనున్నాయి. -
క్యాన్సర్తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్లో మెరుస్తోంది పద్మక్క అలియాస్ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..దయచేసి కాపాడండికొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్పే, గూగుల్పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ వాహిని?వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.చదవండి: భరణి అవుట్.. సెకండ్ ఫైనలిస్ట్గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్ -
సౌత్ టు నార్త్.. స్టార్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?
రతి అగ్నిహోత్రి.. ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్స్తో కలిసి నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చీకటి రోజుల్ని చూసింది. ఇటీవలే ఆమె (డిసెంబర్ 10) 65వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గురించి నేటి ప్రత్యేక కథనం.స్టార్ హీరోయిన్భారతీరాజా పుతియ వార్పుగల్ (1979) మూవీతో రతి అగ్నిహోత్రిని బిగ్ స్క్రీన్కు పరిచయం చేశాడు. ఫస్ట్ సినిమాకే విజయం కైవసం చేసుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఏడాదికి 8 నుంచి 10 సినిమాలు చేసుకుంటూ పోయింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీలో ఏక్ దుజే కే లియే, కూలీ వంటి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.తెలుగులో సినిమాలుతెలుగులో చిరంజీవి పున్నమినాగు, శోభన్బాబు జీవిత రథం, ఎన్టీఆర్తో తిరుగులేని మనిషి, కలియుగ రాముడు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు, వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.. ఇలా అనేక సినిమాలు చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.వైవాహిక బంధంలో సమస్యలుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రతి అగ్నిహోత్రికి పెళ్లిపై ప్రగాఢ విశ్వాసం. అందుకే వైవాహిక బంధంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చాలవరకు భరించింది. ఓపిక నశించిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈమె 1985లో ఆర్కిటెక్ట్ విర్వానీని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కుమారుడు తనూజ్ సంతానం. ఇతడు ప్రస్తుతం బాలీవుడ్లో, హిందీ సిరియల్స్లో నటుడిగా కొనసాగుతున్నాడు.30 ఏళ్లు నరకంఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్తూ ఎమోషనలైంది రతి అగ్నిహోత్రి. ఆమె ఏమందో తన మాటల్లోనే చూద్దాం.. పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తాను. అందుకే ఇంట్లో ఏం జరిగినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. 30 ఏళ్లు నరకం అనుభవించినా ఏనాడూ దాన్ని పైకి కనబడనివ్వలేదు. కొడుకు పుట్టాక వాడే నా మొదటి ప్రాదాన్యత. ఏదో ఒకరోజు ఈ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూశాను. భరించడం నా వల్ల కాక..ఎవరికీ చెప్పుకోలేని చోట కొట్టేవాడు. ఆ గాయాలు ఎవరికీ కనబడేవి కావు. 54 ఏళ్ల వయసులో కూడా నాపై దాడి జరిగింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నాకు వయసు మీదపడుతోంది, నేను ఇంకా బలహీనమవుతున్నాను. ఇలాగే భరిస్తూ పోతే ఏదో ఒకరోజు నా చావు తథ్యం అనిపించింది. అప్పుడు ధైర్యం కూడదీసుకుని 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. గృహ హింసను భరించాల్సిన అవసరం లేదని ఆలస్యంగా తెలుసుకున్నాను అంది. ఏం చేస్తోందంటే?ఈ విషయంలో కుమారుడు తల్లి పక్షానే నిలబడ్డాడు. కాకపోతే కొన్నాళ్లకు తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేశాడు. విడాకులైతే అవలేదు, కానీ ఇద్దరూ కలిసి మాత్రం ఉండటం లేదు. ప్రస్తుతం రతి ఎక్కువగా పోలాండ్లోనే ఉంటుంది. అక్కడ తన సోదరి అనితతో కలిసి రెస్టారెంట్ నడుపుతోంది. యాక్టింగ్ కన్నా వంట చేయడం బాగా వచ్చంటోంది. -
ధనుష్ రిజెక్ట్ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు
ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాతశ్యాన్ రోల్డణ్ సంగీతాన్ని, మహేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 30లోకి అడుగుపెడితే..కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు. ధనుష్ రిజెక్ట్దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. హీరోగాఅలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్.. విదూతో ఆడిషన్ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? ఎలా మారిపోయిందో!
సినిమా రంగుల ప్రపంచం. ఇక్కడ తారలు అందాన్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు డైటింగ్ పేరుతో నచ్చింది తినలేరు. శరీరాకృతిని నియంత్రించుకోవడానికి, వీలైతే జీరో సైజ్కు మారడానికి కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్, స్విమ్మింగ్పూల్లో గడుపుతుంటారు. కొందరు యోగా కూడా చేస్తుంటారు. ఇన్ని చేసినా, అందరూ స్టార్ హీరోయిన్లు అవుతారా ? అంటే అది వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంఅలా అందం, అభినయంతో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగింది అలనాటి నటి రాధ. ఈమె సోదరి అంబిక కూడా హీరోయిన్గా రాణించారు. అయితే రాధ వివాహానంతరం నటనకు స్వస్తి పలికారు. ఆమెకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లు ఇద్దరూ తల్లి బాటలోనే పయనించే ప్రయత్నం చేశారు. పెద్ద కూతురు కార్తీక.. జీవాకు జంటగా నటించిన కో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తొలి చిత్రం తరువాత మంచి విజయాలు లేక కనుమరుగయ్యారు. అలా కనిపించి ఇలా కనుమరుగురాధ రెండవ కూతురు తులసి 14 ఏళ్ల వయసులోనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేశారు. అయితే తొలి చిత్రంతోనే అపజయాన్ని చవి చూసింది. దీంతో ఈమె కూడా తిరుగు టపా కట్టాల్సి వచ్చింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ వారసురాళ్లు సినిమా రంగంలో నిలదొక్కుకోకపోవడం ఆశ్చర్యమే. ఆ మధ్య కార్తీక వివాహం జరిగింది. ఆ సమయంలో తులసి రూపం చూసి తనేనా? అని ఆశ్యర్యపోయారు. బొద్దుగా తులసితాజాగా భారీకాయంతో ఉన్న తులసి ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇంకా పెళ్లి కాని ఈ అమ్మడి వయసు 28 ఏళ్లే. నటి రాధ వివాహానంతరం బరువు పెరిగితే, ఆమె కూతురు పెళ్లికి ముందే ఇలా బరువు పెరగడంతో తనకేమైందని అభిమానులు ఆరా తీస్తున్నారు. Tulasi Nair ( Radha 's Daughter & Kadal Movie Heroine ) Now And Then ! pic.twitter.com/EOassELTJ2— TamilaninCinema Akilan (@TamilaninCinema) December 8, 2025 -
‘అఖండ 2: తాండవం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : అఖండ 2: తాండవంనటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంటరచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనుసంగీతం: తమన్ ఎస్ ఎస్సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్,సంతోష్ డేటాకేఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: డిసెంబర్ 12, 2025 సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘అఖండ 2’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Akhanda 2 Review In Telugu).ఎలా ఉందంటే.. బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో జనాలకు ఓ అంచనా ఉంది. అందులోనూ బోయపాటితో సినిమా అంటే.. లాజిక్ అనే పదాన్ని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఈ విషయం తెలిసి థియేటర్స్కి వెళ్లినా కూడా మన ఊహకు మించిన అనుభవం ఈ సినిమాలో ఎదురవుతుంది. లాజిక్స్ పక్కకి పెట్టి చూసినా కూడా సినిమాలోని కొన్ని సీన్లకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. దైవశక్తితో కథను ప్రారంభించిన బోయపాటి మధ్యలో దృష్టశక్తిని తీసుకొచ్చి.. చివరిలో దేశభక్తితో ముగించాడు. మధ్య మధ్యలో సనానతధర్మం గురించి క్లాసులు తప్పితే..ఒక్క సీన్ కూడా ఆకట్టుకునేలా ఉండదు. అసలు కథనమే ఊహకందేలా సాగితే..ఇక ఆసక్తి ఎలా పెరుగుతుంది?ఇక యాక్షన్ సీన్ల దగ్గరకు వస్తే..ప్రతిసారి త్రిశూలాన్ని అటు తిప్పడం..ఇటు తిప్పడం తప్ప కొత్తగా ఏమి ఉండదు. పైగా కొన్ని యాక్షన్ సీన్లు చూసినప్పుడు.. ‘బాలయ్య సినిమా కదా..అంతే..అంతే’అనుకోవాల్సిందే. మనిషిని తలకిందులు చేసి హారతి ఇవ్వాలన్నా.. త్రీశూలంతో హెలికాఫ్టర్ రెక్కల్ని గిరగిరా తిప్పాలన్నా... ఒక్కడే చైనా వెళ్లి ఆర్మీ సైన్యాన్ని మొత్తాన్ని చంపాలన్న.. ‘బాలయ్య సినిమాల్లోనే సాధ్యం’ అని మన మనసుకు నచ్చజెప్పుకోకపోతే.. క్లైమాక్స్ వరకు థియేటర్స్లో కూర్చోలేం. అసలే రొటీన్ కథ.. దానికి తోడు యాక్షన్ సీన్లు కూడా రొటీన్గా ఉండడంతో కథనం మొత్తం సాగదీతగా అనిపిస్తుంది.అఖండ సినిమాకు కొనసాగింపుగా కథను ప్రారంభించారు. ఆ చిత్రంలోని చిన్నపాప పెరిగి పెద్దదై.. సైటిస్ట్గా మారుతుంది. మరోవైపు అఖండ సోదరుడు బాలమురళీకృష్ణ ఎమ్మెల్యే అయినట్లు చూపించారు. బాలయ్య 1 ఎంట్రీ సీన్కో ఎలివేషన్.. బాలయ్య 2 ఎట్రీ సీన్తో ఎలివేషన్ అవి తప్ప మొదటి అరగంట కథే ఉండదు.పైగా శివుడు ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో బాలకృష్ణ ఎలివేషన్ తప్ప.. శివుడికి ఎలివేషన్ ఉండదు. ఒకటి రెండు సీన్లలో శివుడిని పవర్ఫుల్గా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ మొత్తం రొటీన్గా సాగుతూ...ఇంటర్వెల్ సీన్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు. విరామానికి ముందు వచ్చే యాక్షన్ సీన్లు బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే..నార్మల్ ప్రేక్షకులు మాత్రం ‘అరె..ఎంట్రా ఇది’ అనుకుంటారు. ఉన్నంతలో సెకండాఫ్లో కథనం కాస్త పరుగులు తీస్తుంది. అయితే ప్రతిసారి అఖండ రావడం..ఓ క్లాస్ తీసుకోవడం బోర్ అనిపిస్తుంది. ఇక సినిమాలో బాలయ్య చెప్పే కొన్ని డైలాగులు అయితే.. అక్కడ సీన్తో సంబంధమే ఉండదు. పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడు కానీ ఒక్కటి కూడా అర్థం కాదు. పైగా ఇప్పుడెందుకు ఈ డైలాగు చెప్పాడు? అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆది పినిశెట్టి పాత్ర కూడా అనవసరంగా చొప్పించినట్లు అనిపిస్తుంది. దైవశక్తి కాన్సెప్ట్ ఉంది కాబట్టి.. దుష్టశక్తి సీన్లను కూడా చూపించాలనుకొని ఆది పాత్రను క్రియేట్ చేశారనిపిస్తుంది. ఆ పాత్ర ఎపిసోడ్ మొత్తం తీసేసినా.. అసలు కథకు ఎలాంటి ఇబ్బంది కలగదు. క్లైమాక్స్కి ముందు వచ్చే యాక్షన్ సీన్లు కొంతమేర ఆకట్టుకుంటాయి. మొత్తంగా అఖండ 2 బాలయ్య అభిమానులకు కాస్త నచ్చవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా చూసి నీరసంగా నిట్టూరుస్తూ బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. బాలయ్య ఎప్పటి మాదిరే తెరపై హుషారుగా కనిపించే ప్రయత్నం చేశాడు.అయితే ఈ సారి మాత్రం తెరపై ఆయన వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కనిపిచ్చింది. ముఖ్యంగా అఖండ పాత్రలో ఆయన ముసలితనం మొత్తం బయటపడింది. ఇక యంగ్ బాలకృష్ణ పాత్ర లుక్ బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు ఉన్నా.. ఒక్కటి కూడా అర్థం కాదు. మాస్ పాట కోసం ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకోకపోగా..ట్రోలింగ్కి మెటీరియల్గా మిగిలిపోయాయి. విలన్గా ఆది పినిశెట్టి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాలో అనవసరం అనే ఫీలింగ్ కలుగుతుంది. సంయుక్త పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. శివుడు పాత్ర చేసిన నటుడు బాగా నటించాడు. పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. (Akhanda 2 Movie Positives And Negatives)సాంకేతిక విభాగాల పనితీరు విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రామ్ప్రసాద్, సంతోష్ డేటాకే సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.(Akhanda 2 Review) -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
‘అఖండ 2’ సినిమాకు మరో భారీ షాక్.. హైకోర్టులో పిటిషన్!
మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సిన అఖండ-2 కు ఊహించని షాక్ తగిలింది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్కి అనుమతించిన న్యాయస్థానం.. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది.కాగా, ఇప్పటికే అఖండ 2(Akhanda 2 ) రిలీజ్ ఒకసారి వాయిదా పడింది. ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని సెటిల్ చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సతీష్ కమల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ప్రీమియర్స్ని రద్దు చేయడంతో పాటు టికెట్ల రేట్ల పెంపుకు ఇచ్చిన మోమోని సస్పెండ్ చేయాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. మరికాసేపట్లో హైకోర్టు(Telangana High Court) దీనిపై విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మరోసారి అఖండ 2 సినిమా హాట్ టాపిక్ అయింది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.అఖండ 2 విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. -
ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్, సినిమాలివే!
సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల సమాచారానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రామాణికమైన వేదిక Imdb..2025 సంవత్సరానికి గాను ఇండియాలోని టాప్ 10 వెబ్ సిరీస్, సినిమాలను ప్రకటించింది.1) టైటిల్: ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్నటీనటులు: బాబీ డియోల్, లక్ష్య లల్వానీ, సాహెర్ బాంబా, మోనా సింగ్, అన్యా సింగ్, గౌతమీ కపూర్దర్శకత్వం: ఆర్యన్ ఖాన్ (షారుఖ్ ఖాన్ కుమారుడు)ఓటీటీ: ‘నెట్ఫ్లిక్స్’2) టైటిల్: బ్లాక్ వారెంట్నటీనటులు: జహాన్ కపూర్, అనురాగ్ ఠాకూర్, పరం వీర్ సింగ్, రాహుల్ భట్దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానే - సత్యాన్షు సింగ్ ఓటీటీ : 'నెట్ ఫ్లిక్స్'(7 ఎపిసోడ్స్)3) టైటిల్: పాతాళ్లోక్ సీజన్-2నటీనటులు: జైదీప్ అహ్లవత్, గుల్పనాగ్, ఇష్వాక్ సింగ్, విపిన్ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్ తమాంగ్దర్శకత్వం: అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో4) టైటిల్:పంచాయత్ సీజన్ 4నటీనటులు: జితేంద్ర కుమార్, నేనా గుప్తా,రఘుబీర్ యాదవ్బి,శ్వపతి సర్కార్, సునీత రాజ్వార్, శాన్విక దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా - అక్షత్ఓటీటీ:'అమెజాన్ ప్రైమ్ వీడియో5) టైటిల్: మండల మర్డర్స్నటీనటులు: వాణీ కపూర్, వైభవ్ రాజ్, సుర్విన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్, జమీల్ఖాన్, అదితి సుధీర్దర్శకత్వం: గోపి పుత్రన్, మనన్ రావత్ఓటీటీ: నెట్ఫ్లిక్స్6) టైటిల్: ఖాఫ్నటీనటులు: మోనిక పన్వర్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి దర్శకత్వం: పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో7) టైటిల్: స్పెషల్ ఓపీఎస్2నటీనటులు: కేకే మేనన్, తాహిర్ రాజ్ బాసిన్, కరణ్ థాకర్, వినయ్ పాఠక్, విపుల్ గుప్త, సయామీ ఖేర్, ప్రకాశ్రాజ్దర్శకత్వం: నీరజ్ పాండేఓటీటీ:జియో హాట్స్టార్8) టైటిల్: ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2)నటీనటులు: జీత్, ప్రొసెన్ జిత్ ఛటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగ్ధ సింగ్ దర్శకత్వం: డెబాత్మ మండల్, తుషార్ కాంతి ఓటీటీ: నెట్ఫ్లిక్స్9) టైటిల్: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3నటీనటులు: మనోజ్ బాజ్పాయి, ప్రియమణి, షరీబ్ హష్మి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, సందీప్ కిషన్దర్శకత్వం: రాజ్ అండ్ డీకే, సుమన్ కుమార్, తుషార్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో10) క్రిమినల్ జస్టీస్ 4నటీనటులు: పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషన్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, మీతా వశిష్ట్, శ్వేతా బసు ప్రసాద్, ఖుషీ భరద్వాజ్దర్శకత్వం : రోహన్ సిప్పిఓటీటీ: హాట్స్టార్టాప్ 10 సినిమాలివేసయారామహావతార్ నరసింహఛావాకాంతారా: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1కూలీడ్రాగన్సితారే జమీన్ పర్దేవారెయిడ్ 2లోక ఛాప్టర్ 1: చంద్ర -
ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సినిమాలు చూడం: హీరో కార్తి
‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.⇢ నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.⇢ కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.⇢ డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.⇢ నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.⇢ హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.⇢ నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.⇢ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.⇢ ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి. -
బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ.. లుక్ అదిరింది!
బిగ్ బాస్ గేమ్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్ సీజన్ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్బాస్ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్ను పోస్టర్లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. -
‘నా తెలుగోడు ’లో ఆ నాలుగు అంశాలు చూపించబోతున్నాం
హరనాథ్ పోలిచర్ల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నా తెలుగోడు’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రీరీలీజ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ సందర్భంగా హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ... తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎలా మంచి కోసం పోరాడేవాడు, ప్రతిభావంతుడు, కష్టపడేవాడు అనేది ఈ సినిమాలో చూపించాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నాలుగు అంశాలను చూస్తాం. అమ్మ గురించి, డ్రగ్స్ పై అవగాహన, సైనికుడు జీవితం గురించి, బాల శిశువులను కాపాడే ప్రయాణం పై ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ అంశాలు అన్నింటినీ ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూస్తాం. ఈ సినిమా కోసం నా చిత్ర బృందం అందరూ నాకు ఎంతో అండగా నిలబడ్డారు. శివ మంచి సంగీతాన్ని అందించారు. ప్రేక్షకులు అందరూ డిసెంబర్ 12వ తేదీన సినిమాను చూసి, సినిమాలోని అంశాలను మీ మనసులోకి తీసుకుంటారు అని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరోయిన్ సుఫియా తన్వీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పాత్ర పోషించడం కాదు, జీవించాను. ఈ పాత్ర పోషించినందుకు గాను నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రేక్షకులు అంతా ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.‘ఈ చిత్రంలో నా పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. కాబట్టి నా పాత్ర గురించి బయటకు ఏమి చెప్పలేకపోతున్నాను’అని హీరోయిన్ నైరాపాల్ అన్నారు. -
ఇండస్ట్రీలో అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు: నటి యామిని భాస్కర్
సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్య చాలా మంది బహిరంగంగా మాట్లాడుతున్నారు. పలువురు హీరోయిన్లు తమకు ఎదురైన వేధింపుల గురించి మీడియాతో పంచుకుంటున్నారు. అంతేకాదు అలాంటి వేధింపులు వస్తే..ఎలా డీల్ చేయాలో కూడా సలహాలు ఇస్తూ.. నూతన నటీనటులుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా నటి యామిని భాస్కర్(yamini Bhaskar) కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిచింది. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎదవలు ఉంటారని.. ధైర్యంగా ఎదురుతిరిగితేనే కెరీర్లో రాణిస్తామని చెబుతోంది.రభస(2014) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల, భలే మంచి చౌకబేరమ్, కొత్తగా మా ప్రయాణం ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా నటిస్తూ వచ్చింది. నర్తనశాల రిలీజ్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన యామిని.. ఇప్పుడు ‘సైక్ సిద్ధార్థ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా కొంతమంది ఎదవలు ఉంటారు. నా కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఆనీ.. మధ్యలో కొంతమంది తగిలారు. వాళ్లని ఎలా డీల్ చేయాలో అర్థం కాక.. సినిమాలనే వదులుకున్నాను. కొన్నిసార్లు మనల్ని డ్యామినేట్ చేసేవాళ్లు ఉంటారు. మేల్ ఈగో చూపిస్తూ.. అమ్మాయిలను ఇబ్బంది చేస్తుంటారు. అప్పట్లో నాకు కాస్త భయం ఉండేది. వాళ్ల గురించి మాట్లాడలేకపోయా. సైలెంట్గా ఉండేదాన్ని. దీంతో అందరూ నాకు యాటిట్యూడ్ అనుకున్నారు. కానీ అలాంటి వాళ్లకు దూరంగా ఉండడం బెటరనీ నేను భావించా. అయితే ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అయితే లేరు. కొంతమంది మంచి వాళ్లు కూడా ఉన్నారు. అమ్మాయిలను గౌరవిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇక కేవలం మగవాళ్లు మాత్రమే ఇబ్బంది పెడతారని నేను చెప్పట్లేదు. ఇక్కడ అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాళ్లు ఉన్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ రంగంలోనే కాదు ఎక్కడైనా ఇలాంటి వాళ్లు ఉంటారు. మన ప్రవర్తనను బట్టి..మనమేంటో తెలుసుకుంటారు’ అని యామిని చెప్పుకొచ్చారు. అలాగే తనకు గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆర్ఎక్స్ 100 చాన్స్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? తదిరల విషయాలను కూడా సాక్షితో పంచుకుంది. అవి తెలుసుకునేందుకు ఈ వీడియోని చూసేయండి -
సినిమాల్లో అవకాశాలు లేవ్.. చాలా బాధపడ్డా!
49 ఏళ్ల వయసులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది టాలీవుడ్ నటి ప్రగతి. పవర్ లిఫ్టింగ్లో మూడేళ్లుగా ప్రతిభ చూపిస్తోన్న ఈ నటి ఇటీవల టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్ట్రస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నాలుగు మెడల్స్ సాధించింది. డెడ్ లిఫ్ట్ విభాగంలో గోల్డ్ మెడల్, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించింది. ఓవరాల్గా సిల్వర్ పతకం వచ్చిందని పేర్కొంది.సినిమాల్లో అవకాశాలు రాలేఅయితే క్రీడల వైపు అడుగులు వేయడానికి గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. స్పోర్ట్స్కు 100% ఎలా ఇచ్చానో, సినిమాల్లో కూడా అంతే మనసు పెట్టి యాక్ట్ చేశాను. కాకపోతే సినిమాల్లో నా టాలెంట్ చూపించుకునే అవకాశం దొరకలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత గొప్ప అవకాశాలు నాకు రాలేదు. కొన్ని పాత్రలకు నన్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న బాధ అయితే ఉంది. డిప్రెషన్లోకి వెళ్లకుండా..అది చాలా బెంగగా ఉండేది. ఒకానొక సమయంలో ఛాన్సులు తగ్గిపోయాయి. వాళ్లిచ్చిన అవకాశాలు నాకు నచ్చలేదు. నేను కోరుకుంది వారివ్వలేదు. ఆ బాధ నెమ్మదిగా డిప్రెషన్కు మారుతుందేమోనన్న భయం ఉండేది. అప్పుడు నేను స్పోర్ట్స్లో అడుగుపెట్టాను. ఇక్కడ నా సాయశక్తులా కష్టపడి ఎదిగాను. వెయిట్ లిఫ్టింగ్ వల్ల అందం పోతుందని నేను అనుకోలేదు. నేను అందంగానే ఉంటాను. మానసిక ధైర్యంపైగా ఈ క్రీడలో అడుగుపెట్టాక మానసికంగా మరింత ధృడంగా తయారయ్యాను. ఏదొచ్చినా నేను చూసుకోగలను అన్న ధ్యైర్యం వచ్చింది. ప్రస్తుతం తమిళ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాను. జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో సినిమా సెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే గర్వంగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను అని ప్రగతి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) చదవండి: కల్యాణ్ను విధుల్లో నుంచి తొలగించలేదు -
వీళ్లంతా ‘హిట్’ దర్శకులే.. కానీ సినిమాల్లేవు!
చిత్ర పరిశ్రమలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ జాతకాలు తారుమారు కావడానికి ఒక్క శుక్రవారం చాలు. సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే.. గతంలో బ్లాక్ బస్టర్స్ అందించినా.. కొత్త ప్రాజెక్టు అయితే చేతికి రాదు. ముఖ్యంగా దర్శకుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఫ్లాపులున్న దర్శకుడితో సినిమా చేసేందుకు అటు నిర్మాతలు..ఇటు హీరోలు వెనకడుగు వేస్తుంటారు. ఒక్కప్పుడు వాళ్లు వరుస హిట్లు అందించినా.. ఫ్లాపులొస్తే అది ‘గత చరిత్ర’గానే మిగిలిపోతుంది. అలా ఒకప్పుడు చరిత్ర సృష్టించి..ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులపై ఓ లుక్కేద్దాం.కొరటాల శివ:2013లో 'మిర్చి'తో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన శివ, మహేష్ బాబు ‘శ్రీమంతుడు' (2015), ఎన్టీఆర్ 'జనతా గారేజ్' (2016), 'భరత్ అనే నేను' (2018)లతో వరుస హిట్లు అందించి స్టార్ డైరెక్ట్గా మారిపోయాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్తో తీసిన ‘ఆచార్య(2022)’ డిజాస్టర్ అయింది. దీంతో కొరటాలపై నెగెటివ్ టాక్ మొదలైంది. ఎన్టీఆర్తో తీయాల్సిన దేవర కూడా పట్టాలెక్కదనుకున్నారు. కానీ ఆచార్య రిలీజ్కి ముందే దేవర చిత్రం ఫిక్స్ అయిపోయింది. శివపై నమ్మకంతో ఎన్టీఆర్ చాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్గా నిలిచినా..క్రెడిట్ మాత్రం ఎన్టీఆర్కే వెళ్లింది.ఇక దేవర 2 ఉంటుందని ప్రకటించి..ఏడాదిన్నర అవుతుంది. కొరటాల చేతిలో అదొక్క ప్రాజెక్టే ఉంది. కానీ అది కూడా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. కృష్ణ వంశీఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ కృష్ణ వంశీ. ఒకప్పుడు ఆయన సినిమా అంటే మినిమమ్ హిట్ అనే గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటే..కనీస ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. ‘నక్షత్రం’(2017) అనే సినిమా తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకొని ‘రంగమర్తాండ’అనే సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి విమర్శకులు ప్రశంసలు అయితే దక్కాయి కానీ..కలెక్షన్స్ మాత్రం రాలేదు. రంగమార్తండ తర్వాత కృష్ణ వంశీ నుంచి మరో చిత్రం రాలేదు.వీవీ వినాయక్..హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో వీవీ వినాయక్ స్పెషలిస్ట్. ఆది, దిల్, ఠాకూర్, బన్నీ, లక్ష్మీ, యోగి, కృష్ణ, ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను టాలీవుడ్కి అందించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. టాలీవుడ్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘ఇంటిలిజెంట్’. సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ 2018 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా చేయలేదు. ‘ఛత్రపతి’చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్లో హిందీలో రీమేక్ చేశాడు. 2023లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత వినాయక్ నుంచి మరో చిత్రం రాలేదు. వెంకటేశ్లో ఓ సినిమా ఉంటుందని టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. సురేందర్ రెడ్డి‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ సినిమాలో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. కానీ 2023లో వచ్చిన ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో.. సురేందర్ రెడ్డికి అవకాశాలు తగ్గిపోయాయి. రవితేజతో ఓ సినిమా ఉంటుందని టాక్ ఉంది. కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు.వంశీ పైడీపల్లిమున్నా’ (2007) మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు వంశీ పైడీపల్లి. కెరీర్ మొత్తంలో ఆయన తీసిన తెలుగు సినిమాలు కేవలం ఐదు(మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) మాత్రమే. అవన్నీ సూపర్ హిట్ చిత్రాలే. అదే ఊపుతో తమిళ్లో విజయ్తో ‘వారిసు’(తెలుగులో వారసుడు) తెరకెక్కించాడు. 2023లో విడుదలైన ఈ చిత్రం తమిళ్లో సూపర్ హిట్ అయినా..తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత కూడా వంశీ నుంచి మరో సినిమా రాలేదు.శ్రీను వైట్లస్టార్ హీరోలతో కూడా కామెడీ చిత్రాలను తీసి నవ్వించిన స్టార్ డైరెక్ట శ్రీనువైట్ల. ఒకప్పడు ఆయన సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేశాయి. కానీ గత కొన్నాళ్లుగా ఆయన ఖాతాలో హిట్ లేదు. గోపిచంద్ ‘విశ్వం’తో కమ్ బ్యాక్ అవుతాడని అనుకుంటే.. అది భారీ డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన చేతిలో కొత్త ప్రాజెక్టులేవి లేదు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ తీస్తాడనే పుకార్లు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. కానీ విశ్వం రిలీజ్ తర్వాత ఢీ సీక్వెల్ని పక్కన పెట్టేశారు. వీరితో పాటు శ్రీకాంత్ అడ్డాల, శివ నిర్వాణ, పరశురాం లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా కొత్త కబురు చెప్పట్లేదు. మరి వీరి నుంచి బ్లాక్ బస్టర్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. -
అజిత్ ఆశీర్వాదం తీసుకున్న హీరో శింబు
సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సహజమే. అయితే ఒక నటుడికి మరో నటుడు అభిమానం కావడం కాస్త అరుదు. అలా సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు గాంచిన స్టార్ హీరో అజిత్కు శింబు వీరాభిమాని కావడం విశేషం. ఈ విషయాన్ని శింబు బహిరంగంగానే పలు వేదికలపై చెప్పారు. ఒక నటుడిగా తనకు అజిత్ మార్గదర్శి అని చెప్తూ ఉంటారు. తాజాగా శింబు.. అజిత్పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫేవరెట్ హీరోను కలిసిన శింబుఅజిత్ సినిమాలతోపాటు కార్ రేస్లపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేసుల్లో పోటీ చేసి పథకాలను పొందారు. తాజాగా మలేషియాలో జరుగుతుననన్న కార్ రేస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఈవెంట్ కోసం మలేషియా వెళ్లిన శింబు ప్రత్యేకంగా అజిత్ను కలిసి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అజిత్ జట్టు కోసం చేసిన జెర్సీ ధరించడం విశేషం.ఆశీర్వాదంశింబు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అజిత్కు తెలిపి, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇలా అజిత్, శింబు కలుసుకోవడం మరో విశేషం. అజిత్తో కలిసి శింబు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్తో వన్స్ మోర్అజిత్ మలేషియాలో జరుగుతున్న కార్ రేస్ ముగిసిన తరువాత తన తర్వాతి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతారని తెలిసింది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబోలో ఇంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం వచ్చిందన్న విషయం తెలిసిందే! #SilambarasanTRமலேசியா Racing Circuitல் அஜித் குமாரை சந்தித்த சிம்பு#Simbu #Silambarasan #AK #Ajithkumar #AjithKumarRacing #Ajith #Malaysia #STR #Atman pic.twitter.com/OqE9vo7ptB— Actor Kayal Devaraj (@kayaldevaraj) December 6, 2025 -
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు! -
స్క్రిప్ట్ తో వస్తే.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమలతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చిత్ర పరిశ్రమకు కావాల్సిన సదుపాయలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, అక్కడ 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’లో మంగళవారం సినీ, వినోద రంగాలపై చర్చ ఏర్పాటు చేశారు. ఈ చర్చలో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా, టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
ఆసక్తికరంగా ఆది పినిశెట్టి ‘డ్రైవ్’ ట్రైలర్!
ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు."డ్రైవ్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్ లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్ ను ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూవ్ మెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. ప్రజా మీడియా కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో ఉంచుతూ ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు, జే అతన్ని పట్టుకున్నాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో "డ్రైవ్" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. -
ఆ కల నెరవేరదేమో! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
ఫస్ట్ సినిమాకే జాతీయ అవార్డు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. కలర్ ఫోటో చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు సందీప్ రాజ్. తర్వాత గుడ్ లక్ సఖి, ముఖచిత్రం వంటి మూవీస్కు రచయితగా పని చేశాడు. అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగానూ మెప్పించాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా రెండో సినిమా చేస్తున్నాడు సందీప్. అదే "మోగ్లీ".మోగ్లీ వాయిదా?యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా, సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 12న అఖండ విడుదల చేస్తే మోగ్లీకి పెద్ద దెబ్బ పడటం ఖాయం! దీంతో ఈ మూవీని పోస్ట్పోన్ చేసుకోక తప్పేలా లేదు.మరో దర్శకుడు తీయాల్సిందిఈ క్రమంలో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలు నేను కాకుండా మరో డైరెక్టర్ తీయాల్సింది. సినిమా అంటే పడిచచ్చేవాళ్లు, వృత్తిపై నిబద్ధత ఉన్నవారే ఈ రెండు సినిమాల్లో భాగమయ్యారు. ఈ రెండు చిత్రాల్లోని కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా?దురదృష్టవంతుడిని1. అంతా బాగా జరుగుతుందనుకునే సమయంలో వాటి రిలీజ్ విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం.. 2. ఆ దురదృష్టం నేనేనేమో! నాక్కూడా అలాగే అనిపిస్తోంది. దర్శకత్వం- సందీప్ రాజ్ అన్న టైటిల్ను థియేటర్లో చూసుకోవాలన్న నా కల రోజురోజుకీ మరింత కష్టమవుతోంది. వెండితెరకు నేనంటే ఇష్టం లేదేమో! ఎంతో చెమటోడ్చి, రక్తం చిందించి, ప్యాషన్తో మోగ్లీ సినిమా చేశాం. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ.. ఇలా అందరూ ఎంతగానో కష్టపడ్డాం. కనీసం వారికోసమైనా మోగ్లీకి మంచి జరగాలని ఆశిద్దాం అని సందీప్ రాజ్ రాసుకొచ్చాడు. Maybe Colour Photo and Mowgli deserved another DIRECTOR instead of me. These movies were made by a group of passionate people who can do anything for their profession.The common points between both films are:1. Facing bad luck with their release, just when everything seemed to…— Sandeep Raj (@SandeepRaaaj) December 9, 2025చదవండి: ప్రియుడితో బ్రేకప్.. పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్ -
ప్రియుడితో బ్రేకప్! పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్!
ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది హీరోయిన్ నివేదా పేతురాజ్. మధురైలో పుట్టి దుబాయ్లో పెరిగిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్న్యూస్ చెప్పింది.బ్రేకప్కానీ ఈ పెళ్లి పట్టాలెక్కేట్లు కనిపించడం లేదు. వీరిద్దరూ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేకాదు, నివేదా, రజిత్ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు. దీంతో క్రికెటర్ స్మృతి మంధానలాగే వీరి పెళ్లి కూడా రద్దయినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నివేదా పేతురాజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమానివేదా పేతురాజ్.. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మెంటల్ మదిలో మూవీతో తెలుగులో రంగప్రవేశం చేసింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్, దాస్ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఓటీటీలో పరువు, కాలా అనే వెబ్ సిరీస్లలో యాక్ట్ చేసింది. ఒకానొక సమయంలో కాల్షీట్స్ సమస్య కారణంగా జూనియర్ ఎన్టీఆర్తో నటించే ఛాన్స్ చేజార్చుకుంది.చదవండి: పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు -
జవాన్లపై పాట అభినందనీయం
‘‘దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్లపై ‘దీక్ష’ చిత్రంలో ఒక పాట పెట్టడం అభినందనీయం. మనం క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లే. నిర్మాతలు తమ సినిమాల్లో జవాన్లను సపోర్ట్ చేస్తూ చూపించాలి’’ అని నటుడు సుమన్ తెలిపారు. కిరణ్ హీరోగా, అలేఖ్య రెడ్డి, ఆక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దీక్ష’. డీఎస్ రెడ్డి సమర్పణలో ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో పి.అశోక్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ–‘‘దేశం కోసం ్ర΄ాణాలర్పించిన మురళి నాయక్కు ఒక ΄ాటని మా సినిమా ద్వారా అంకితం చేశాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు తుమ్మల ప్రసన్నకుమార్, డీఎస్ రెడ్డి, సి. కల్యాణ్, నటీనటులు ఆక్సా ఖాన్, మౌనిక రెడ్డి, కిరణ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వైస్ చైర్మన్ ఎత్తరి గురురాజ్, జనరల్ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి ΄ాల్గొన్నారు. -
నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. సీక్వెల్కు ప్లానింగ్
రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాల్లో నరసింహ (తమిళంలో పడయప్ప) ఒకటి. 1999లో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. థియేటర్లు కిక్కిరిసిపోయాయి. భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ మూవీలో నరసింహ పాత్రతో పాటు నీలాంబరి పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది.25 ఏళ్ల తర్వాత రిలీజ్ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తోంది. రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో రజనీ తన సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు. రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆడవాళ్లు గేట్లు బద్దలు కొట్టుకుని మరీ థియేటర్ వచ్చి నరసింహ చూశారు. ఇలాంటి సంఘటన నా 50 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ చూడలేదు. నరసింహ సీక్వెల్జైలర్, రోబో వంటి ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ చూస్తున్నాం.. అలాంటప్పుడు నరసింహకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. దానికి నీలాంబరి అని టైటిల్ పెట్టాలనుకుంటున్నాం. నరసింహకథ నేనే రాశాను. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలలో నందిని పాత్ర ఆధారంగా నీలాంబరి పాత్ర రాసుకున్నాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. కేవలం ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనేదే నా ఉద్దేశం. ఐశ్వర్యరాయ్ ఫస్ట్ ఛాయిస్ఈ మూవీలో నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్ను అనుకున్నాం. తనకోసం రెండుమూడేళ్లైనా ఎదురుచూడాలనుకున్నాం. కానీ ఆమెకు ఆసక్తి లేదని తెలిసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్.. ఇలా చాలా పేర్లు అనుకున్నాం. అప్పుడు దర్శకుడు రవికుమార్ రమ్యకృష్ణ పేరు సూచించాడు. మొదట్లో తను చేయగలదా? అనుకున్నాను. కానీ చివరకు తను అద్భుతంగా నటించింది. క్లైమాక్స్లో మైసూర్ వేలాది మందితో సీన్ షూట్ చేశాం.ఆమె కూడా..జయలలితను ఆదర్శంగా తీసుకుని నీలాంబరి పాత్ర డిజైన్ చేసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె సినిమా చూడాలని ఆశపడింది. అలా తనకోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా.. ఆమెకు సినిమా చాలా బాగా నచ్చింది. అప్పటి సీఎం కలైంగర్ కరుణానిధి కూడా సినిమా చూశాడు అని రజనీకాంత్ (Rajinikanth) చెప్పుకొచ్చాడు.చదవండి: నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా -
ఆ ఒక్క సంఘటనతో 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం!
ఎన్టీఆర్.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్ అయినా, మాస్ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్, హరిన్ ఇద్దరూ యాక్టింగ్నే ఎంచుకున్నారు.హీరోగా ఎంట్రీకళ్యాణ్ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్, రౌడీ బాబాయ్, అత్తగారు జిందాబాద్, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.ఆ విషాదంవల్లే..నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్దాస్ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు. 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్లో కళ్యాణ్ లుక్ పవర్ఫుల్గా ఉంది. కాగా ఎన్టీఆర్ నామకరణం చేసిన వైజయంతి మూవీస్ సంస్థతోనే కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్ 25న విడుదలవుతోంది.చదవండి: రాత్రిపూట మనోజ్ ఫోన్కాల్.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్ నటుడు -
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఉండవంటున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ మూడో సీజన్ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.జీవితంలో మర్చిపోలేనుతాజాగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ అంతా ఓ చిట్చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ సీజన్ 1 రిలీజైనప్పుడు మనోజ్ రాత్రిపూట నాకు ఫోన్ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్కాల్ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అభద్రతా భావం ఎక్కువఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్ చేసి నీ యాక్టింగ్ బాగుంది, నీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ బాజ్పాయ్, జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ అనే వెబ్ సిరీస్లో, చిట్టగ్యాంగ్ మూవీలో నటించారు.చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి -
వైకల్యం, అవమానాలు అధిగమించి గీత రచయితగా..
ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అన్నారో కవి. అది పాటకే పరిమితం కాదు, వాస్తవం. ప్రపంచంలో చాలా మంది తమలోని వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. పలు అవమానాలను, అవహేళనలను దాటుకుని అకుంఠిత దీక్షతో ఎదిగిన వారెందరో.. అలాంటి స్ఫూర్తిదాయకులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలా తన వైకల్యాన్ని అధిగమించి గీత రచయితగా రాణిస్తున్న కవి కరుణాకరన్. ఆత్మస్థైర్యం ఎక్కువఈయనకు రెండు కాళ్ళు పని చేయవు. వీల్చైర్లోనే కూర్చుంటారు. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే ఒక వ్యక్తి సాయం అవసరం. అయితే కరుణాకరన్కు ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకు కారణం తనకున్న ప్రతిభ. ముఖ్యంగా సినీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న రచయిత. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావు. అందుకోసం నిరంతర శ్రమ, పట్టుదల, ప్రయత్నం అవసరం. ఈయన పాటలు ఏం రాస్తారులే?అంగవైకల్యం అనే లోపం వల్ల చాలా అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నానని అంటున్న కరుణాకరన్ ఇప్పుడు ప్రముఖ సినీ గీతా రచయితగా రాణిస్తున్నారు. పోరాడే గుణం మాత్రమే అపజయాలను చెదరగొడుతుంది అంటున్న ఈయన తన సినీ ప్రయాణమే ఒక పోరాటం అన్నారు. దివ్యాంగుడైన ఈయన పాటలు ఏం రాస్తారులే అని పలువురు పరిహాసం చేశారన్నారు. అలా సినీ ఎంట్రీఅలా తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిన ఘటనలను అధిగమించి, పలువురు తనపై ఉంచిన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతోను ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడు, దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మార్గ దర్శకత్వం, తన అన్వేషణ, ప్రతిభ, ప్రయత్నాలతోనే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. వల్లభ ఫస్ట్ మూవీదివంగత ప్రముఖ గీత రచయిత వాలి తనకు గొప్ప శక్తి అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న దర్శకులకు, సంగీత దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో శింభు నటించిన వల్లభ చిత్రం ద్వారా ఈయన గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు అవరోధాలను అధిగమించి పలు చిత్రాలకు పాటలు అందించారు. మంచి పేరుఇటీవల విడుదలైన నిర్వాకం పొరుప్పల్ల, కిణరు చిత్రాలకు ఈయన రాసిన పాటలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మకుటం చిత్రం, వెబ్ టుడే తదితర చిత్రాలకు కరుణాకరం పాటలను రాస్తున్నారు అదేవిధంగా తెలుగు, మలయాళం, హిందీ ఇతర భాషల నుంచి అనువాదం అవుతున్న చిత్రాలకు ఈయన మాటలు, పాటలు అందిస్తున్నారు. -
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ని సౌత్ బ్యూటీస్ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంటే.. బాలీవుడ్ భామలు మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. వరుస అపజయాల కారణంగా పాన్ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు.అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటేబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్ మాత్రం పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.హిట్ కోసం కృతి ఎదురుచూపులుబాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్ లేదు. ధనుష్తో కలిసి నటించిన 'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్ టాక్ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.కియారాకు వరుస షాకులుఅందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్ ఛేంజర్ వరకు ఇలా ఆమె నటించిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.‘కండీషన్ల’తో రిస్క్ చేస్తున్న దీపికబాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్ని రిస్క్లో పెడుతోంది. స్పిరిట్లో ప్రభాస్కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్ నచ్చక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి షారుఖ్ ఖాన్ ‘కింగ్’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరొకటి అల్లు అర్జున్-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్ అంటూ దీపికా తన కెరీర్ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. ఒవైపు సౌత్ స్టార్ల డామినేషన్..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్ కెరీర్ డేంజర్ పడింది. బాలీవుడ్లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్గా భారీ హిట్ పడాల్సిందే. -
60 ఏళ్లకు లవ్లో పడాలనుకోలే..
అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్లో ఉంటారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.మూడోసారి ప్రేమలో..రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్లో లవ్లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్షిప్లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గొడవల్లేవ్వైవాహిక బంధంలో సక్సెస్ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయినప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. ఫస్ట్ పెళ్లికిరణ్ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్, కిరణ్.. ఆమె పేరెంట్స్.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. రెండో పెళ్లికొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ (Aamir Khan).. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్ -
‘మహానటి’కి మరణం లేదు: వెంకయ్య నాయుడు
అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో మహానటిగా చెరగని ముద్ర వేశారు సావిత్రి. శనివారం (డిసెంబరు 6) ఆమె 90వ జయంతిని పురస్కరించుకుని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ కిశోర్ నిర్వహణలో హైదరాబాద్లో ‘సావిత్రి మహోత్సవం’ని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ– ‘‘మహానటికి మరణం లేదు. ప్రతి చిత్రంలో ఆమె పాత్ర మాత్రమే కనిపించేది తప్ప సావిత్రి కనిపించేది కాదు’’ అన్నారు.ఈ వేదికపై ‘మహానటి’ చిత్రనిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్లను, అలాగే రచయిత సంజయ్ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరించారు. అదే విధంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి పాటల పల్లవులను ఆలపించారు. ఇంకా సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. -
15 ఏళ్లుగా పోరాటం.. గ్లామర్ ఉన్నా నో లక్!
పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. 2010లో వచ్చిన తమిళ చిత్రం ఒర్ ఎరవుతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తననెవరూ గుర్తించకపోయేసరికి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఆహా, మాయ సీరియల్స్ చేసింది. 2013-2018 వరకు ప్రసారమైన దైవమగళ్ సీరియల్తో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఇందులో వాణి అందం, నటన చూసి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అలా 2019లో తెలుగులో ఏకైక మూవీ 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోయిన్గా చేసింది.సీన్స్ కట్ఆ మరుసటి ఏడాది తమిళంలో చేసిన ఓ మై కడవులే పెద్ద విజయం సాధించింది. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మహాన్లో కీలక పాత్రలో నటించినప్పటికీ చివర్లో ఆమె నటించిన సీన్స్ అన్నీ ఎత్తేశారు. సినిమాలు చేస్తుందే కానీ అనుకున్నంత గుర్తింపయితే రాలేదు. ఆ మధ్యలో తమిళ్ రాకర్స్, సెంగళం, చట్నీ సాంబార్ అని వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది.వివాదంవాణి భోజన్.. నటుడు జైతో సహజీవనం చేస్తోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని వాణి ఖండించింది. కష్టపడి బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతడితో కలిసున్నానని రాయడం చాలా చీప్ అని ఆవేదన వ్యక్తం చేసింది. కోరికసెంగళం అనే వెబ్ సిరీస్లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించిన ఈ బ్యూటీకి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో పాలిటిక్స్లో అడుగుపెడతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే గంగూభాయ్ కథియావాడి వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి వాణి భోజన్ (Vani Bhojan)కు అలాంటి ఆఫర్స్ ఎప్పుడొస్తాయో, తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో!
మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కల్యాణ్ చక్రవర్తి( వెండితెరపై కనిపించనున్నారు. రోషన్, అనస్వరా రాజన్ హీరో హీరోయిన్లుగా, కల్యాణ్ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ మూవీ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కీలకమైన రాజి రెడ్డి పాత్రలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి(Nandamuri Kalyan Chakravarthy) నటించినట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘1980లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన కల్యాణ్ చక్రవర్తి మా ‘ఛాంపియన్’ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. చిరంజీవిగారి ‘లంకేశ్వరుడు’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన తర్వాత, ఆయన నటన నుంచి విరామం తీసుకుని, మళ్లీ 35 ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
గత సినిమా ఆడలేదు, అందుకే గ్యాప్ తీసుకున్నా..
త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈషా’. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చివరి సినిమా ఆడలేదుఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా నా గత చిత్రం ‘ఫాదర్.. చిట్టి.. ఉమా.. కార్తీక్’ను మంచి కంటెంట్తో తీసినా ఎందుకో ప్రేక్షకాదరణ దక్కలేదు. దీంతో ప్రేక్షకులకు ఎలాంటి కథలు నచ్చుతున్నాయనే ఆలోచనలో పడ్డాను. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ‘ఈషా’ కథను శ్రీనివాస్ మన్నె చెప్పగా ఆసక్తిగా అనిపించి ఈ చిత్రం చేశాం. దేవుడుంటే దెయ్యం కూడా..దేవుడు ఉన్నాడని నమ్మితే, దెయ్యం కూడా ఉందని నమ్ముతారు. నేనేతై అన్నీ నమ్ముతాను. మూఢ నమ్మకానికి, నమ్మకానికి మధ్య ఉన్న క్లాష్ ‘ఈషా’ సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రియాలిటీ ఎక్కువగా ఉంటుంది. కష్టపడేతత్వం, ప్యాషన్, ఓర్పు... ఇవన్నీ శ్రీనివాస్లో చూశాను. ఈ సినిమా చూశా.. చాలా బాగుంది. థ్రిల్లర్ సినిమాలో విజువల్, సౌండ్ చాలా ముఖ్యం. సక్సెస్ రావట్లేఈ చిత్రంలో ఈ రెండూ బాగుంటాయి. ఇక కోవిడ్ తర్వాత సినిమా వ్యాపారం పూర్తిగా మారిపోయింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు నిర్మిస్తే కానీ సక్సెస్ రావడం లేదు. మా సంస్థలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకనే బ్యాక్ టు బ్యాక్ కాకుండా క్వాలిటీ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని దామోదర ప్రసాద్ (KL Damodar Prasad) అన్నారు.చదవండి: బిగ్బాస్ ట్రోఫీకి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? -
ప్రధాని మోదీ ఈ సినిమా చూసేలా ప్రయత్నిస్తాను: మంత్రి కోమటిరెడ్డి
‘‘ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న గుమ్మడి నర్సయ్యను ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా తీస్తుండటం అభినందనీయం. ఈ సినిమాతో అయినా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో వెండితెరకు రానుంది. ఆయన పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కనిపించనున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో నల్లా సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారు కూడా ఈ సినిమా చూసేలా ప్రయత్నిస్తాను. అన్ని భాషల్లో ఈ చిత్రం తీయాలి’’ అని సూచించారు. ‘‘రాజకీయం అంటే ఉద్యోగమో, వ్యాపారమో కాదు... ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తు చేయడం కోసం ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు పరమేశ్వర్ హివ్రాలే. ‘‘మా సినిమా రిలీజ్ తర్వాత రాజకీయాల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను’’ అని నల్లా సురేష్ రెడ్డి తెలిపారు. ‘‘గుమ్మడి నర్సయ్యగారిలాంటి మంచి మనిషి పాత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని శివరాజ్ కుమార్ చెప్పారు. ‘‘నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు గుమ్మడి నర్సయ్య. ఈ సినిమా ప్రారంభోత్సవంలో కొత్తగూడెం, పిన΄ాక ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, ΄ాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తదితరులు ΄ాల్గొన్నారు. -
సినిమాలో అన్ని పాటలు పాడిన రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాలది హిట్ కాంబినేషన్. మొదట్లో వీరి కాంబోలో రూపొందిన కాదలన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో చిత్రం రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఐదు పాటలకు బాణీలు కట్టి పాడింది రెహమానే కావడం విశేషం. ఇలా తన ఆల్బమ్లో అన్ని పాటలు పాడటం రెహమాన్కు ఇదే మొదటిసారి!అది రిపీట్ అవాలని..ఈ సినిమా పేరు మూన్ వాక్ (Moon Walk Movie). దీన్ని బిహైండ్స్ వుడ్స్ సౌత్ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవహస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మల శ్రీధర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడిన జెంటిల్మన్, కాదలన్ అనుభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావించానన్నారు. ఆ ప్రయత్నమే మూన్ వాక్ అన్నారు. రెండు వారాల రిహార్సల్స్ఇందులో సంగీతానికి, డ్యాన్స్కు కొరతే ఉండదన్నారు. ఈ మూవీలోని ప్రతి పాటకు ప్రభుదేవా రెండు వారాలు రిహార్సల్స్ చేసి నటించారని చెప్పారు. గత మూడేళ్లుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు.చదవండి: అప్పుడే తెలిసిపోయింది -
‘అండర్ గ్రౌండ్కి వెళ్లడానికి రెడీ’ అన్న హీరోయిన్
ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్ సందేశ్ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్ బ్యూటీ... దురదృష్టవశాత్తూ... హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్సిరీస్లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల మహారాణి అనే వెబ్సిరీస్ 4వ సీజన్ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది. ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది. నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది. ‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి ఫోటోషూట్లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది. ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్ గ్రౌండ్( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది. గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్ ఫైల్స్, సీరియస్ మెన్, జూబ్లీ, త్రిభువన్ మిశ్రా సిఎ టాపర్ వంటి పలు వైవిధ్య భరిత చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది. ‘‘నేను ముందు ప్రేక్షకురాలిని ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె. -
కొడుకుని చూడక పదేళ్లు! అమ్మ కనిపిస్తే పక్కింటావిడ అని!
దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు బండి సరోజ్ కుమార్. ప్రస్తుతం ఈయన మోగ్లీ మూవీలో కీలక పాత్రలో నటించాడు. యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా బండి సరోజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఎవరితో టచ్లో లేనుఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. మాది మధ్యతరగతి కుటుంబం. కానీ, చిన్నప్పటినుంచే నేను చాలా ధనవంతుడిని అని ఫీలయ్యేవాడిని. మా అమ్మ స్కూల్కి వస్తే కూడా పక్కింటావిడ అని చెప్పేవాడిని. డబ్బుల గురించి కాదు కానీ ఎప్పుడూ అందరికంటే పైన ఉండాలని ఆశపడేవాడిని. అమ్మానాన్నకు టచ్లో లేను. వాళ్ల ఫోటో కూడా నా దగ్గర లేదు. భార్యాబిడ్డకు దూరంఅందరికంటే నేను తేడాగా ఎందుకున్నానని ఆలోచించాను. మామూలుగా ఉండాలని ప్రయత్నించాను. సీరియస్గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత ఈ జీవితమంతా ఫేక్ అనిపించింది. నా భార్య ఏడాది వయసున్న నా కొడుకును తీసుకొచ్చి చూపిస్తే నాలో ఎటువంటి చలనం లేదు. అంటే నాకు కడుపు తీపి లేదు. కొడుకుని చూసి పదేళ్లవుతోంది. వాళ్లందరికీ దూరంగా ఉన్నాను.సిగరెట్లు మానేశా..నాకు కేవలం సినిమాలపైనే ఆసక్తి ఉంది. దేనిపైనా నాకు వ్యామోహం లేదు. అంతకుముందు అమ్మాయిలను ఇంటికి పిలిచేవాడిని. కానీ, ఏడాదికాలంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. అప్పట్లో వెయ్యికి పైగా సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు పూర్తిగా మానేశాను. కాకపోతే మోగ్లీ సినిమాలో మాత్రం సిగరెట్లు తాగుతూ కనిపిస్తాను అని బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) చెప్పుకొచ్చాడు.సినిమాబండి సరోజ్ కుమార్ నిర్బంధం, నిర్బంధం 2, మాంగళ్యం, పరాక్రమం సినిమాల్లో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించాడు. పోర్కాలం, అస్తమానం అనే తమిళ సినిమాలకు దర్శకరచయితగానూ పని చేశాడు.చదవండి: ఇమ్మాన్యుయేల్ తొండాట.. బయటపెట్టిన నాగార్జున -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘దురంధర్’.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ను ఆదిత్య ధర్ తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్ని రాబట్టి.. హిట్ టాక్తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్వీర్ సింగ్ ఖాతాలో హిట్ పడిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. వీకెండ్లోగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్గా మాధవన్ నటించారు. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. -
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు. శోభారాజు రియాక్షన్2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే..వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందిఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్సైజ్లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. బహుమతులు ఏమిచ్చారంటే?ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
అఖండ 2.. టాలీవుడ్కి ఓ గుణపాఠం!
సినిమా అనేది కూడా ఒక వ్యాపారం. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్లకు ఉంటాయి. స్టార్ హీరో సినిమా అయినా..‘లెక్కల్లో’ తేడా వస్తే.. ఆగిపోవాల్సిందే. దానికి మంచి ఉదాహరణే ‘అఖండ 2’. అన్ని అనుకున్నట్లుగా సాగితే నిన్ననే(డిసెంబర్ 5) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఈ పాటికి హిట్టో, ఫ్లాపో అనే విషయం కూడా తెలిసిపోయేది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రీమియర్స్ని రద్దు చేసిన నిర్మాతలు.. ఆ తర్వాత కొన్ని గంటలకే సినిమా విడుదలనే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.వాయిదా కామన్ కానీ.. సినిమా విడుదల వాయిదా అనేది ఇండస్ట్రీలో కామన్. అనుకున్న తేదికి రిలీజ్ కానీ సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు దాదాపు అనుకున్న తేదికి రిలీజ్ కావు. షూటింగ్ ఆసల్యం అవ్వడం లేదా.. ఓటీటీ బిజినెస్ కాకపోవడం..ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.. ఇలా వివిధ కారణాలతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే అవన్నీ వాయిదా వేసిన విషయం కనీసం రిలీజ్కి వారం, పది రోజలు ముందే చెప్పేవి. కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని..కొన్ని గంటల్లో థియేటర్స్కి రావాల్సిన సినిమా..ఆగిపోవడం అనేది ‘అఖండ 2’(Akhanda 2) విషయంలో మాత్రమే జరిగింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఇప్పటి వరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నామని చెప్పినప్పటికీ.. 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిందనే విషయం దాచలేని సత్యం.అలెర్ట్ కాకపోతే ఇబ్బందులు తప్పవు!ఫైనాన్స్ ఇష్యూలతో సినిమా రీలీజ్ ఆలస్యం అవడం అనేది ఇండస్ట్రీలో తరచు జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీ పెద్దలు చొరవ చేసుకొని సమస్యలను పరిష్కరించి రిలీజ్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరిగింది. చివరి నిమిషయంలో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో సినిమా విడుదల అయింది. అఖండ 2 విషయంలోనూ అదే జరుగుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ సంఘటన టాలీవుడ్కి ఓ గుణపాఠం అనే చెప్పాలి. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే సినిమాను విడదల చేయాలి. అంతేకానీ ఫైనాన్షియల్ ఇష్యూని తేలిగ్గా తీసుకొని.. తర్వాత చూసుకుందాంలే అని వస్తే మాత్రం..‘అఖండ 2’ పరిస్థితే వస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతలు చేతులు ఎత్తేస్తారని తెలిసి..కొంతమంది ఫైనాన్షియర్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఏదైనా ఉంటే రిలీజ్కు ముందే చూసుకోవాలని వారి ఆలోచన. ఇక్కడ వారిని కూడా తప్పుపట్టలేం. ఇలాంటి సమస్యలను నిర్మాతలు రిలీజ్కు ముందే పరిష్కరించుకుంటే మంచిది. లేదంటే ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. -
తండ్రయిన వెంటనే ఖరీదైన కారు కొన్న హీరో
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 7న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఆడించడంలోనే ఈ దంపతులిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాబు పుట్టాక తొలిసారి ఓ ఖరీదైన వస్తువు కొన్నారు.లగ్జరీ కారులెక్సస్ బ్రాండ్కు LM350h 4S మోడల్ కారును తమ సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.3.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ ఈ కారును నడుపుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారులో ప్రీమియం సౌండ్తో పాటు 48 ఇంచుల హెచ్డీ డిస్ప్లే ఉంది. సీటింగ్ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.అదో కొత్త ఫీలింగ్ఇకపోతే ఈ ఏడాది తనకు ఎక్కువ సంతోషాన్నిచ్చిన క్షణం.. తాను తండ్రవడమేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విక్కీ కౌశల్. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఒక మ్యాజికల్ మూమెంట్ అని పేర్కొన్నాడు. ఈ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతానని తనకు తెలుసని.. బాబును చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనసుకెంతో ప్రశాంతంగా అనిపించిందన్నాడు. అలాంటి అనుభూతి అంతకుముందెన్నడూ కలగలేదని గుర్తు చేసుకున్నాడు. కాగా విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)చదవండి: అఖండ 2.. ఇప్పట్లో రిలీజ్ లేనట్లేనా? -
నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్..: దర్శకుడు
తొలి సినిమాతో 'సింహరాశి'తోనే ఇండస్ట్రీలో తన పేరు మారుమోగిపోయేలా చేశాడు దర్శకుడు వి. సముద్ర. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, ఎవడైతే నాకేంటి, మహానంది, పంచాక్షరి.. ఇలా ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విశేషాలను పంచుకున్నాడు.లారెన్స్ను పరిచయం చేశా..సముద్ర మాట్లాడుతూ.. మొదట్లో అనేకమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చిరంజీవి హిట్లర్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సమయంలోనే చిరంజీవికి తొలిసారి లారెన్స్ను పరియం చేశాను. 'అబీబీ అబీబీ..' పాటలో సిగ్నేచర్ స్టెప్పును లారెన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమా తర్వాత లారెన్స్ వెనక్కు తిరిగి చూసుకోలేదు.నాగార్జున పిలిచి మరీ..అనుష్కతో నేను పంచాక్షరి సినిమా తీశాను. నాగార్జున (Nagarjuna Akkineni) మేకప్మెన్ చంద్ర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించాడు. నాగార్జున నన్ను ఓసారి గోవాకు పిలిచి.. శ్యామ్ప్రసాద్రెడ్డి అరుంధతి తీశాడు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్.. ఇక్కడుంది చంద్ర, నా మేకప్మెన్. అంత పెద్ద నిర్మాత కాదు. వీడి లైఫ్ జాగ్రత్త.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నాగార్జున తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా బాగా చూసుకుంటాడు.గోరుముద్దలుమహానంది సమయంలో అనుష్క (Anushka Shetty) నాకు గోరుముద్దలు పెట్టేది. అప్పుడెలా అన్నం తినిపించిందో పంచాక్షరి సమయంలోనూ అలాగే ప్రేమగా తినిపించింది. అలా నాకు గోరుముద్దలు పెట్టిన హీరోయిన్లు మరెవరూ లేరు. తర్వాత తను స్టార్ హీరోయిన్గా మారాక తన నడవడికలో కొంత తేడా వచ్చినట్లు అనిపించింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ తను చాలా మంచి అమ్మాయి అని సముద్ర (V Samudra) చెప్పుకొచ్చాడు.చదవండి: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు: ఇంద్రజ -
పెళ్లయిన వారానికే రాహుల్ సిప్లిగంజ్ హనీమూన్
అలా పెళ్లయిదో లేదో ఇలా వెకేషన్ చెక్కేశాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. హరణ్యతో ఇటీవలే (నవంబర్ 27న) అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో క్రికెటర్స్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా భార్యతో కలిసి హనీమూన్ వెళ్లిపోయాడు రాహుల్.వెకేషన్లో కొత్త జంటమాల్దీవుల్లో కొత్త దంపతులు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లయిన వారానికే హనీమూన్ వెళ్లిపోయి ఏకాంతంగా సేద తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు దంపతులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రాహుల్ నేపథ్యంరాహుల్ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
ఏడేళ్లు సీరియల్స్.. సినిమాల్లో కలిసిరాని లక్!
అందం, టాలెంట్ ఉంటే సరిపోదు కూసింత అదృష్టం కూడా ఉండాలి. పాయల్ రాజ్పుత్కు లక్ మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. నేడు (డిసెంబర్ 5) పాయల్ రాజ్పుత్ 33వ బర్త్డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..సీరియల్ నటిగా..1992 డిసెంబర్ 5న ఢిల్లీలో పాయల్ జన్మించింది. చిన్ననాటి నుంచే సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉంది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమె ఇష్టాన్ని కాదనుకుండా నచ్చింది చేయమని ప్రోత్సహించారు. అలా సీరియల్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టింది. 2010 నుంచి ఏడేళ్లపాటు హిందీలో పలు సీరియల్స్ చేసింది. చన్నా మేరేయా (2018) అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్గా మారింది.ఫస్ట్ మూవీతో క్రేజ్ఈ మూవీలో పాయల్ను చూసిన తెలుగు దర్శకుడు అజయ్ భూపతి ఫిదా అయ్యాడు. అలా ఆర్ఎక్స్ 100 మూవీతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్మార్ఖాన్ వంటి సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. కెరీర్అలాంటి సమయంలో అజయ్ భూపతి మంగళవారం సినిమాతో తనకు ఘన విజయాన్ని అందించాడు. ఈ హిట్టు తనను మళ్లీ నిలబెట్టేలా చేసింది. మరో కమర్షియల్ హిట్టు పడితేనే పాయల్ (Payal Rajput) కెరీర్ పుంజుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలు చేస్తోంది. మరి మున్ముందైనా మంచి సక్సెస్ వస్తుందేమో చూడాలి!చదవండి: ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నా.. ఖాళీగా ఉన్నా ఓకే! -
'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ-2’ నేడు(డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు విడుదలకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకున్న సినిమా.. సడెన్గా ఆడిపోవడానికి గల కారణాలు ఏంటి?షాకిచ్చిన మద్రాసు హైకోర్టుఅఖండ 2 చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు రూ. 28 కోట్ల బాకీ ఉందని, ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలను ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్పై మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది.28 కోట్ల బాకీ సంగతేంటి?ఈరోస్ ఇంటర్నేషనల్(Eros International Media Ltd) - 14 రీల్స్ సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అఖండ 2(Akhanda 2: Thaandavam) సినిమాతో ఈరోస్కు ఎలాంటి సంబంధం లేదు. కానీ గతంలో 14 రీల్స్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన ‘1-నేక్కొడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. ఆ చిత్రానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలమవడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు. ఆ నష్టాలను పూడ్చేందుకు మహేశ్ బాబు మరో చిత్రం ‘ఆగడు’ కూడా అదే సంస్థకు ఇచ్చారు. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 14 రీల్స్( 14 Reels Entertainment)-ఈరోస్ మధ్య రెవెన్యూ షేరింగ్, సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి. 14 రీల్స్ సంస్థ తమకు రూ. 28 కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈరోస్ కోర్టు మెట్లు ఎక్కింది.పేరు మార్చిన ఫలితం లేదు!14 రీల్స్-ఈరోస్ మంధ్య కోర్టు కేసు కొన్నేళ్లుగా నానుతూ ఉంది. కొన్నేళ్ల కిత్రం ఈరోస్ ట్రిబ్యునల్కి వెళ్లగా.. 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ 14 రీల్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021లో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. ఇలా కోర్టులో పిటిషన్స్ వేస్తూ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పైగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ పేరును కాస్త ‘14 రీల్స్ ప్లస్’గా పేరు మార్చి.. అఖండ 2 సినిమాను నిర్మించారు. అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒక్కటే అని.. ఈరోస్ ఆధారాలతో సహా కోర్టుకు అప్పజెప్పడంతో.. రిలీజ్ చేయొద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు మరికొంత మంది ఫైనాన్షియర్లు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవకు దిగినట్లు సమాచారం. అఖండ 2 చిత్రానికి ఐవివై ఎంటర్టైన్మెంట్తో పాటు మరో మగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ల అమౌంట్ కూడా సెటిల్ చేయకుండానే రిలీజ్కి వచ్చేశారట. దీంతో వాళ్లు కూడా విడుదలను అడ్గుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమస్యలు అన్నీ క్లియర్ అయితేనే..అఖండ-2 రిలీజ్ డేట్పై స్పష్టత వస్తుంది. -
శంకర్ సినిమాలో హీరో సూర్య!
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్ సిగ్నల్?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
‘అఖండ- 2’ ప్రీమియర్ షోలు రద్దు
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2:తాండవం ప్రీమియర్స్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ 2(Akhanda 2) . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ చిత్రం రేపు(డిసెంబర్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీలీజ్కి ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్స్ బాలయ్య బొమ్మ పడుతుందని ఆశించిన అభిమానులకు చివరి నిమిషంలో మేకర్స్ షాకిచ్చారు. “ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్” అంటూ నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. అయితే ఓవర్సీస్లో మాత్రం యాథావిధిగా ప్రీమియర్స్ షోలు ఉంటాయని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. #Akhanda2 Premieres scheduled for today are canceled due to technical issues. We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025 -
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి. -
మా సినిమాకు శృంగారం ఇతివృత్తమే కానీ అసభ్యత ఉండదు: దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్". ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ - నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో బంగారు పాదం అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా. మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది. మా చిత్రాన్ని పొయెటిక్ గా రూపొందించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం...నుంచి కొన్ని కవిత్వాలు మా సినిమాలో ఉపయోగించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది అన్నారు.నటుడు బుగత సత్యనారాయణ మాట్లాడుతూ - నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను కళ్లకు కట్టినట్లు మా డైరెక్టర్ ప్రసాద్ ఈ చిత్రంలో చూపించారు. ఆయన తన భుజాలపై ఈ సినిమాను వేసుకుని తెరకెక్కించారు. ఈ మధ్య చిన్న చిత్రాలే ఘన విజయాలు సాధిస్తున్నాయి. మా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.నటుడు జోగారావు మాట్లాడుతూ - ఇటీవలే నేను ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా కూడా నాకు నటుడిగా గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చిన్న చిత్రాలను ఆదరించినప్పుడే మాలాంటి ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ కు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. ప్రేక్షకులు, మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ - "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాకు డీవోపీగా వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. మాకున్న రిసోర్సెస్ లో విజువల్ గా మంచి క్వాలిటీ ఉండేలా సినిమా చేశాం అన్నారు. -
దయచేసి అలాంటివాళ్లు ఈ సినిమా చూడొద్దు: బన్నీవాసు
సినిమా చూసేందుకు థియేటర్స్కి రండి అంటూ ప్రేక్షకులను వేడుకుంటున్న ఈ రోజుల్లో.. నిర్మాత బన్నీ వాసు మాత్రం మా సినిమా చూసి ఇబ్బంది పడొద్దని కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాదు థియేటర్స్కి వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే మా బాధ్యత కూడా కాదని ముందే చెబుతున్నాడు. అయితే ఈ హెచ్చరిక హార్ట్ వీక్ ఉన్నవాళ్లకి మాత్రమే అంటున్నాడు బన్నీవాసు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ వాసు(Bunny Vasu)..త్వరలోనే ‘ఈషా’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ఈ మూవీ గ్లింప్స్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని.. థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా భయపడడం ఖాయమన్నారు.(చదవండి: భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్తోనే వణికించిన ‘ఈషా’)‘దెయ్యాలు, ఆత్మలు అంటే నేను భయపడను. ఎక్కడైన హంటింగ్ ప్లేస్ ఉందంటే ప్రత్యేకంగా వెళ్లి చూసొస్తాను. ఈషా సినిమా గురించి చెప్పినప్పుడు రొటీన్గానే ఉంటుందని కూర్చున్నాను. హారర్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారనేది మాకు తెలుసు కాబట్టి.. సినిమా చూసినప్పుడు భయం కలగలదు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నాలుగు సార్లు భయపడ్డాను. దెయ్యం మేకప్ ఎలా వేస్తారో, షూటింగ్ ఎలా చేస్తారో..ఇలా అన్ని తెలిసిన నేను కూడా భయపడ్డాను. తెలిసి కూడా భయపడే సినిమా ఇది. ఎడిటింగ్ మీద, సౌండింగ్ మీద ఎంతో గ్రిప్ ఉంటేనే ఇలాంటి సినిమా వస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ చాలా అద్బుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. చివరి 15 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 12న థియేటర్స్కి రండి భయపడి ఎంజాయ్ చేయండి. కొంచెం హార్ట్ వీక్ ఉన్నవాళ్లు మాత్ర దయచేసి ఈ సినిమాను చూడకండి. థియేటర్స్కి వచ్చిన తర్వాత ఏమైన అయితే మమ్మల్ని అడగొద్దు. ముందే చెబుతున్నా..హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూస్తే ఇబ్బంది పడతారు’ అని బన్నీ వాసు చెప్పారు. -
భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్తోనే వణికించిన ‘ఈషా’
తెలుగులో ప్రాపర్ హారర్ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. కామెడీ హారర్ చిత్రాలు తరచు వస్తున్నాయి కానీ.. పూర్తిగా భయపెట్టే చిత్రాలేవి రావట్లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు ‘ఈషా’ వచ్చేస్తుంది. త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్కి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లింప్స్ని విడుదల చేశారు మేకర్స్. సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం రెండు సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఆత్మలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
భర్తపై ఫేక్ న్యూస్.. రకుల్ ప్రీత్ ఏమన్నారంటే..
సినిమావాళ్లపై గాసిప్స్ కామన్. కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్పై కూడా రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. చాలామంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ లిస్ట్లోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వస్తుంది. క్లిక్స్ కోసం రాసే వార్తలపై స్పదించాల్సిన అవసరం లేదంటోంది ఈ టాలీవుడ్ బ్యూటీ. ఇటీవల రకుల్(Rakul Preet Singh) భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani) సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘బడే మియా.. ఛోటే మియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడనని.. కంపెనీ మూసేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రకుల్ స్పందించింది. ‘ఆర్థికంగా నష్టపోయిన సంగతి నిజమే కానీ..కంపెనీ మూసేశారనడం పచ్చి అబద్ధం అన్నారు. క్లిక్స్ కోసం కొందరు తప్పుడు వార్తలు రాస్తుంటారని.. వాటిని పట్టించుకోబోమని చెప్పారు. ‘క్లిక్స్ కోసం ఏమైనా రాసేవాళ్లు ఉన్నారు. ఆ వార్తల్లో ఒక్కశాతం కూడా నిజం ఉండదు. అసలు నిజమేంటో నాకు తెలుసు కాబట్టి..అలాంటి వార్తలను పట్టించుకోను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల మౌనంగా ఉండడమే బెటర్. సమయం వచ్చినప్పుడు నిజానిజాలు ఏంటో ప్రేక్షకులకు తెలుస్తాయి. జాకీ భగ్నానీపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు.. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నేను దగ్గర నుంచి చూశాను. కంపెనీ మూసేశారని రాశారు. అతడు నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆర్థికంగా చాలా నష్టం కలిగింది. కానీ, కంపెనీ మూసివేయలేదు. ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాతకు అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఒకనొక సమయంలో అమితాబ్బచ్చన్కు కూడా ఇలానే జరిగింది. ఎదిగేక్రమంలో ఇలాంటి ఒడుదొడుకులు సహజం. వాటిని తట్టుకొని నిలబడితేనే విజయం వరిస్తుంది’ అని రకుల్ చెప్పుకొచ్చింది.కాగా, రూ. 400 భారీ బడ్జెట్తో జాకీ భగ్నానీ నిర్మించిన ‘బడే మియా.. ఛోటే మియా’ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి..డిజాస్టర్గా నిలిచింది. అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ నటించిన చిత్రం అయినప్పటికీ.. కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. -
సింగర్ తల్లి నోట పాట.. వీడియో వైరల్
హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్కిరణ్, జీఎం సుందర్, శిల్పామంజునాథ్, ఆనంద్రాజ్, కరుణాకరన్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ప్రతాపంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న తెరపైకి రానుంది.ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్ చిత్రంలోని 'రాజా విన్ పార్ర్వై రాణి ఇన్ పక్కం..' పాటకు రీమిక్స్ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్ నారాయణన్ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్ సూపర్.. అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్, అతిథిరావ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) -
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్ను ఏవీఎం బ్యానర్లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ్రాకర్స్ అనే వెబ్సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. -
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది. దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. -
యంగ్ హీరో సినిమా.. క్లైమాక్స్ కోసమే రూ. 20 కోట్లతో భారీ సెట్!
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీం నానక్రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.అద్భుతమైన యాక్షన్కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్గా మైండ్ బ్లోయింగ్ ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
అరడజను సినిమాలు.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్పై ఫోకస్ పెట్టాడని, అక్కడ వరుసగా ఆరు సినిమాలు నిర్మించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెడుతూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని దిల్ రాజు(Dil Raju) కోరారు.‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకూ ఈ రూమర్స్ను నమ్మొద్దు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. కాగా, అక్షయ్ కుమార్తో దిల్ రాజు నిర్మించే సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. -
ఆ ఇద్దరు హీరోల స్నేహ చిహ్నం ఈ పురాతన బైక్.. స్పెషల్ ఏంటంటే..?
షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన జై–వీరు (అమితాబ్–ధర్మేంద్ర) మోటార్ సైకిల్ బాలీవుడ్లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పురాతన మోటార్ సైకిల్ 1942 బిఎస్ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్ సైకిల్ తిరిగి వెలుగులోకి వచ్చింది.ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఎఫ్ఎఫ్ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ’డిఐపిఆర్) కమిషనర్ ఎడిజిపి హేమంత్ నింబాల్కర్ అంటున్నారు.ఈ చిత్రంలో వినియోగించిన బైక్ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి బెంగళూరు బిజినెస్ కారిడార్ చైర్పర్సన్ ఎల్కె అతిక్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్ నింబాల్కర్ వివరించారు. ఈ బిఎస్ఎ మోటార్సైకిల్ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్సైకిల్ను బ్రిటిష్ సంస్థ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. ఈ బైక్స్ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు. సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్ సైన్యం ఈ మోడల్ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంవైబి 3047 కాగా ఇది ఛాసిస్ నంబర్ ఎం 20 116283 , ఇంజిన్ నంబర్ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్పవర్ను అందించే 500 సిసి సింగిల్–సిలిండర్ సైడ్–వాల్వ్ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్ ఇంధన ట్యాంక్తో వచ్చింది. దీనిలో ముందు భాగంలో గిర్డర్ ఫోర్కులు వెనుక పెద్ద క్యారియర్ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్లు ఉన్నాయి యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్బార్లు ఫుట్రెస్ట్లను కాన్వాస్లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు. -
రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ
సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని.. అదే కేసును కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని హేమ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈ కేసుపై స్పందిస్తూ.. డ్రగ్స్ తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందన్నారు.‘నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం వందశాతం అబద్దం. కానీ బర్త్డే పార్టీకి వెళ్లింది నిజం. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ పార్టీకి అందరూ ఫ్యామిలీతో వచ్చారు. అది రేవ్ పార్టీ కాదు.. వందశాతం బర్త్డే పార్టీనే. నేను పార్టీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికింది. కానీ మీడియా మొత్తం రెడ్హ్యాండెడ్గా దొరికిన హేమ రాసేసింది. ఇది చూసి నాకు తెలిసివాళ్లంతా ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాకు రోజుకు 500 పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరికి సమాధానం చెప్పాను. ఇక ఫోన్ కాల్స్ వల్ల వచ్చే తలనొప్పి భరించలేక.. ఓ వీడియో తీసి పెట్టాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు’ అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. -
18 కిలోలు తగ్గాను.. నచ్చకపోతే క్షమాపణలు చెబుతా: నందు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు అయింది. నా నటన గురించి ఇప్పటివరకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. ‘సైక్ సిద్ధార్థ’ సినిమా నచ్చకపోతే ప్రెస్మీట్ పెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటూ సినిమాలు చేస్తాను. గెలిచేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు శ్రీ నందు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు, యామినీ భాస్కర్ జోడీగా నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ నందు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలా, యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకులు రాఘవేంద్రరావు, సాయిరాజేశ్, అనుదీప్గార్లు మా సినిమా చూసి, అభినందించారు. ఈ చిత్రం కోసం నేను పద్దెనిమిది కిలోలు తగ్గాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు వరుణ్ రెడ్డి. ‘‘చాలా గ్యాప్ తర్వాత నా సినిమా రిలీజవుతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు యామినీ భాస్కర్. -
అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు.. సీపీఐ నారాయణ ఫైర్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘అఖండ 2:తాండవం’. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లో రూ. 100, సింగిల్ స్క్రీన్లలో రూ. 75 పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్స్కి కూడా అనుమతి ఇస్తూ.. టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించింది.పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చినట్లుగా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా సీపీఐ నారాయణ(CPI Narayana ) కూడా అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై స్పందించారు. వందల కోట్లలో సినిమాలు తీసి.. ఆ భారం సామాన్య ప్రజలపై వేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కు లేదుఅఖండ 2( Akhanda 2 ) చిత్రానికి టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రకటన వల్లే కదా ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుట్టుకొచ్చేంది. కోట్ల కోట్ల రూపాయలను ఖర్చు చేసి సినిమా తీసి.. ఆ భారమంతా ప్రజలపై వేస్తాననడం ఎంత వరకు న్యాయం? ఇలాంటి విలువలైన సినిమాలను చూడడానికి ఇష్టపడని ప్రజానీకం.. ఐబొమ్మ రవిలాంటి వాళ్లు చేసిన పైరసీని ఎంకరేజ్ చేనస్తున్నారు. మీరే కదా రవిని సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కులేదు.రవి లాంటివాళ్లు పుడుతూనే ఉంటారుసంక్రాంతి పండుగ సందర్భంగా ఐదారు సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచుతారు. ఇలా పెంచుకుంటూ పోతున్నంత కాలం ఐబొమ్మ రవిలాంటి వాళ్లు వస్తూనే ఉంటారు. వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు. ఇది స్వయంకృతాపరాధం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే..ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి’ అని నారాయణ అన్నారు. -
ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు తక్కువే ఉన్నాయి: ‘ఆంధ్రకింగ్..’ నిర్మాత
‘‘ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో మనం చాలా ఎమోషన్స్ చూశాం. కానీ, ఓ స్టార్ హీరో, ఫ్యాన్కి మధ్య ఉన్న భావోద్వేగాన్ని చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ని కూడా టచ్ చేసిన సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఇలాంటి భావోద్వేగం ప్రపంచంలో ఎక్కడా లేదు... మన తెలుగు సినిమాకే సొంతం. మనం సినిమా లవర్స్... మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది’’ అన్నారు రామ్ పోతినేని. మహేశ్బాబు పి. దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 27న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. నెక్ట్స్ వీక్ అద్భుతమైన రన్ ఉంటుందని నమ్ముతున్నాం. నేటి నుంచి థియేటర్స్ని విజిట్ చేసి, ఫ్యాన్స్ని కలుసుకుంటాం’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మహాలక్ష్మిలాంటి మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు భాగ్యశ్రీ. ‘‘ఇక్కడి నుంచి మా సినిమా చాలా లాంగ్ వెళ్లబోతోంది’’ అని మహేశ్బాబు పి. పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ మాట్లాడారు. -
నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు
యాంకర్గా, హీరోగా నందు అందరికీ సుపరిచితుడు. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అతడు అన్నుకుంత సక్సెస్ చూడలేకపోయాడు. అది తల్చుకుని తాజా ఈవెంట్లో ఎమోషనలయ్యాడు. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వరుణ్రెడ్డి దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్రెడ్డితో పాటు నందు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.నేనంటే చిన్న చూపు: నందు ఎమోషనల్ఇటీవల రిలీజైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 2న) సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందు భావోద్వేగానికి లోనయ్యాడు. అతడు మాట్లాడుతూ.. ట్రైలర్ ఈవెంట్కు ఇంత ఎమోషనల్ అవడం మీకు ఓవర్గా అనిపించొచ్చు. కానీ ఇదంతా నాకు ఒక జర్నీ. (కన్నీళ్లు తుడుచుకుంటూ) ఇది పీఆర్ స్టంట్ అయితే కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతోందని ఓ పాడ్కాస్ట్ వాళ్లు చెప్పారు. నేనంటే అందరికీ చాలా చిన్నచూపు.సక్సెస్ రాలే..పెళ్లిచూపులు సినిమాలో నేను సెకండ్ హీరోగా చేశాను. అందులో చేసిన హీరో పెద్ద హీరో అయ్యాడు. అందులో మంచి రోల్ చేసిన ప్రియదర్శి మంచి హీరో అయిపోయాడు. నాకు పేరొచ్చింది, కానీ సక్సెస్ రాలేదు. నా ప్యాషన్ సినిమా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నా నటనకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చాను.సినిమా నచ్చకపోతే..ఆర్సీబీలో విరాట్ కోహ్లి వంటి ప్లేయర్ ఉన్నాసరే ఐపీఎల్ కప్పు గెలవడానికి 18 ఏళ్లు పట్టింది. వాళ్లు ఈసారి కప్ నమ్దే అన్నారు. నేను కూడా ఈసారి హిట్టు నమ్దే అంటున్నా.. సినిమా చూడండి. మీకు నచ్చకపోతే ప్రెస్మీట్ పెట్టి మీ అందరికీ క్షమాపణలు చెప్తాను. కానీ ఫెయిలైనా ఇక్కడే ఉంటా.. చచ్చేవరకు సినిమాలే చేస్తా అని నందు (Actor Nandu) చెప్పుకొచ్చాడు. సైక్ సిద్దార్థ మూవీ (Psych Siddhartha Movie) డిసెంబర్ 12న విడుదల కానుంది.చదవండి: బిగ్బాస్ 9: దుమ్ము దులిపిన ఇమ్మూ, తనూజ.. రేసులో ఆమె అవుట్ -
నన్ను కాదు, వాళ్లను ఆరాధించండి: హీరో
కోలీవుడ్లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో శివకార్తికేయన్ ఒకరు. వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాస్తవాలు మాత్రమే ప్రచారంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పేరుతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్లో చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని, వాటిని ఎవరెవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలకు బదులుగా అసత్య ప్రచారాలే ఎక్కువ వైరలవుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని, ఇది వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటివారే ఇష్టంతనకే మంచి మేధాశక్తి ఉంటే దర్శకులను విసిగించేవాడినని అన్నారు. అదేవిధంగా తనను ఆరాధించే అభిమానులు వద్దని, వారి తల్లిదండ్రులను, దైవాన్ని ఆరాధించేవారంటే ఇష్టమని పేర్కొన్నారు. తనను ఒక స్నేహితుడిగా, సోదరుడిగా భావించే అభిమానులే తనకు కావాలన్నారు. అలాంటి ఫ్యాన్స్ను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ శిక్షకుడు, పద్మ భూషణ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాపింయన్ గుకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాప్ నటీనటులకు, అభిమానులకు మధ్య అనుసంధానంగా నిలిచే యాప్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
పసుపు అంటిన పది నోటు ఎక్కడ.. ఆసక్తికరంగా ‘పైసావాలా’ ట్రైలర్!
కంటెంట్ ఉంటే చాలు హీరోహీరోయిన్లను పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో స్టార్స్ని కంటె కంటెంట్ని నమ్ముకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కంటెంట్తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రిలీజ్ చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ట్రైలర్ విషయానికొస్తే..‘హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఫోన్, పర్సు మిస్ అయింది. అందులోనే హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే అవుతుందంటూ’ ఓ మహిళ..హీరోకి చెప్పే సీన్తో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరగడం.. ఈక్రమంలో బెరిదింపులు, హత్యలు.. కొత్త కొత్త పాత్రల ఎంట్రీతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. చివరిలో తొమ్మిది పాత్రలను చూపిస్తూ..వీరిలో అపరాధి ఎవరంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్గా, ఎంజే సూర్య ఎడిటర్గా వ్యవహరించారు. డిసెంబర్ 12న విడుదల కానుంది. -
ఆ తర్వాతే నటించడం మానేస్తా : కమల్ హాసన్
71 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు విశ్వనటుడు కమల్ హాసన్. యంగ్ హీరోలకు ధీటుగా ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల ఆయనను రాజ్యసభ పదవి వరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీనీ కెరీర్పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో నటించబోరనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ అవుతానని చెప్పారు. తాజాగా ఆయన నటి మంజు వారియర్తో కలిసి కేరళలో అర్ట్ అండ్ లిటరేచర్పై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పదవి విరమణపై ఎదురైన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు.‘నన్ను రిటైర్ అవ్వమని ఎవ్వరూ అడగడం లేదు. కానీ కొన్నిసార్లు నాకే ఇక సినిమాలు ఆపేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. కానీ నా శ్రేయోభిలాషులు, అభిమానులు మాత్రం సినిమాలు ఆపోద్దని చెబుతున్నారు. ‘ఒక మంచి సినిమా తీసి సినిమాలు ఆపేయండి’ అని సలహాలు ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసమే ఎదురు చూస్తున్నాను’ అని కమల్(Kamal Haasan) చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఓ బ్లాక్ బస్టర సినిమా తీసి సినీ కెరీర్కి గుడ్బై చెప్పాలని కమల్ భావిస్తున్నాడు. మరి ఆ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవల ఆయన ‘థగ్లైఫ్’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్కి 2 చిత్రం ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్తో విక్రమ్ 2 కూడా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. -
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్
డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్-రాజ్ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అటు సామ్(Samantha)కి, ఇటు రాజ్కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. (చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!)ఇదిలా ఉంటే.. సామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. గతంలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్గా మాట్లాడారు.‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్గా అయిపోయి.. గాసిప్లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్ని ఒక ఎంటర్టైన్మెంట్లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్స్టాఫ్ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025 -
‘వన్ బై ఫోర్’.. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు: వెంకటేశ్ పెద్దపాలెం
వెంకటేశ్ పెద్దపాలెం హీరోగా, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోయిన్లుగా నటించిన యాక్షన్, క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’. ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేశ్ పెద్దపాలెం మాట్లాడుతూ– ‘‘నాది మదనపల్లి అని గర్వంగా చెప్పుకుంటున్నాను. టంగ్ స్లిప్ అనే పాయింట్తో ఈ క్రైమ్ డ్రామా సినిమా తీశాం. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమా తెరకెక్కించారు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నామ’ని అన్నారు. ‘‘తెలుగులో సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ సినిమాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు రంజన రాజేష్. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అని రోహిత్ రాందాస్, దర్శకుడు పళని తెలిపారు. అపర్ణ మల్లిక్, హీనా సోని, కొరియోగ్రాఫర్ సాగర్ వేలూరు మాట్లాడారు. -
ఓటీటీలో వరుణ్ సందేశ్ కొత్త వెబ్ సిరీస్.. రిలీజ్ ఎప్పుడంటే?
కొత్తబంగారు లోకం హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘నయనం’. ఈ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్లర్ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు.ఫస్ట్ లుక్ రిలీజ్సోమవారంనాడు ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించనున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.వెబ్సిరీస్లో వరుణ్ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్గా కనిపించబోతున్నాను. పోస్టర్ గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్ను మరింతగా ఎలివేట్ చేసినట్లయింది అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) చదవండి: ఆ కారణాల వల్లే దివ్య ఎలిమినేట్ -
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీళ్లిద్దరూ ఆ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మల్చుకోవాలని భావిస్తున్నారట! నేడు (డిసెంబర్ 1న) కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలిదే పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. బరి తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అని రాసుకొచ్చింది.అందుకే అక్కడ!కాగా సమంత.. సమయం దొరికితే చాలు ఈషా ఫౌండేషన్కు వెళ్తుంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటుంది. ఆ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే సామ్.. తన పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలనుకుంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉందిపెళ్లి- విడాకులురాజ్ నిడిమోరు (Raj Nidimoru)- శ్యామలిదే 2015లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య సమస్యలు రావడంతో 2022లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు సమంత (Samantha Ruth Prabhu)- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్లో వీరి వివాహం జరిగింది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్గా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. 2021 అక్టోబర్లో చైసామ్ విడాకులు తీసుకున్నారు.చదవండి: బిగ్బాస్ 9: తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య -
నా ఫ్రెండ్ రాసుకున్న స్టోరీ లైన్.. తను చనిపోయినా..
రామ్కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు చాలెంజ్లు ఉన్నాయి. కుటుంబం నేపథ్యంలో కుటుంబం గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలియజేసే ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ఆయన చనిపోవడంతో..బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా చిత్రంగా ఉంటుంది. దర్శకుడు ఉదయ్ శర్మ తనకు కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకోగలిగిన మంచి దర్శకుడు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా స్నేహితుడు విక్రమ్ ఒక స్టోరీ లైన్ను సినిమాగా చేయాలనుకున్నాడు. కానీ ఆయన చనిపోవడంతో తన ఫ్రెండ్ ఉదయ్ ఆ లైన్ను కథగా మార్చి, సినిమా చేస్తున్నాడని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా సుకుమార్గారి ఐడియాతో ఉంటుంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. పదహారేళ్ల కల నెరవేరింది‘‘హీరో కావాలనుకున్న నా పదహారేళ్ల కల ఈ సినిమాతో నిజమైంది’’ అని చెప్పారు రామ్కిరణ్. ‘‘నా తొలి చిత్రానికి మణిశర్మగారు సంగీతం అందించడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను’’ అన్నారు ఉదయ్ శర్మ. ‘‘మా హెచ్ఎన్జీ బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. ప్రేక్షకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని మహదేవ్ గౌడ్ మాట్లాడారు. -
లవ్ ఫెయిల్... సరదాగా నవ్వించే మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఫెయిల్యూర్నాటి దేవదాసు నుండి నేటి గర్ల్ ఫ్రెండ్ వరకు ప్రేమను ఓ అందమైన దృశ్య కావ్యంగా చిత్రీకరించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సక్సెస్ఫుల్ ప్రేమ ముందుగా ఫెయిల్యూర్తోనే పుడుతుంది. అది ఏ కాలమైనా, ప్రాంతమైనా, భాష అయినా ఇదే సిద్ధాంతం. అందుకేనేమో ఈ థీమ్తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా పదిలంగా నిలిచిపోతాయి. కానీ ఓ సీరియస్ ప్రేమ అయిన స్వీట్కు కామెడీ అనే కారం తగిలిస్తే ఎలా ఉంటుందో తెలిపేదే ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’.ఎలా ఉందంటే?ఈ సినిమా పేరుతోనే దర్శకుడు ప్రేక్షకుడికి కాస్తంత గిలిగింతలు పెట్టించాడు. కాస్త లోతుగా గమనిస్తే సెటైరికల్ మోడ్లో మహా గమ్మత్తుగా ఉందీ టైటిల్. శశాంక్ ఖేతన్ ఈ కథ రాసి, దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.సన్నీ సంస్కారి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనన్యకు వినూత్న రీతిలో... ఇంకా చెప్పాలంటే బాహుబలి సెటప్లో కాస్త భారీగానే ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. సెటప్, గెటప్ అంతా బాగానే ఉన్నా అనన్య మాత్రం కోటీశ్వరుడైన విక్రమ్తో తన తల్లిదండ్రులు తనకు పెళ్ళి నిర్ణయించారని సంస్కారికి ససేమిరా నో చెబుతుంది. ఇది విన్న సన్నీ బాగా బాధపడి ఎలాగైనా అనన్యను సొంతం చేసుకోవాలని విక్రమ్ గురించి ఆరా తీస్తాడు. తులసీ కుమారి అనే అమ్మాయితో ఇటీవలే విక్రమ్కు బ్రేకప్ అయిన విషయం తెలుసుకొని తులసీ కుమారిని కలవడానికి వెళతాడు. ఈ లోపల అనన్య, విక్రమ్ల పెళ్ళి ఆహ్వాన పత్రిక సన్నీతో పాటు తులసీ కుమారికి కూడా అందుతుంది. తులసీతో కలిసి సన్నీ ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఓ కుట్ర పన్నుతాడు (Sunny Sanskari Ki Tulsi Kumari Movie Review). మరి... సన్నీ ప్లాన్ సక్సెస్ అయి, అనన్యను పెళ్ళి చేసుకుంటాడా? అలాగే విక్రమ్, తులసీ కుమారి మళ్ళీ కలిసిపోతారా? అన్న విషయం మాత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలోనే చూడాలి. వరుణ్ తన ఈజ్తో... అలాగే జాన్వీ తన క్రేజ్తో యూత్ని బాగా అలరించే సినిమా ఇది. అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్షన్ అనిపించినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు... సరికదా సరదాగా సాగిపోతుంది. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
టాలీవుడ్ నవంబర్ రివ్యూ.. 35లో మూడు మాత్రమేనా?
టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్ నెల గడిచిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్ హీరోల హిట్ చిత్రాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.సెంటిమెంట్ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్ కూడా భారీ ఫ్లాప్తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్ 1న విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడలేదు.ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్ఫ్రెండ్, జటాధర, ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశాయి.ఇక రెండోవారం(నవంబర్ 14) కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంది.ఇక నవంబర్ 21న అల్లరి నరేశ్ ‘12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, పాంచ్ మినార్తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్ అయింది. ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక నవంబర్ చివరివారంలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలుకా’తో, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్ తాలుకా చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టుకోలేకపోయింది. రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్ రీటా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్లో అయిన టాలీవుడ్కి బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందో చూడాలి. -
ఆయనతో పదేపదే కిస్ సీన్ చేయనన్న హీరోయిన్
షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్ వంటి హీరోలతో ఎక్కువగా జోడీ కట్టింది జూహీ చావ్లా. అలా సన్నీ డియోల్తో లూటెరే అనే హిట్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ విశేషాల గురించి నిర్మాత సునీల్ దర్శన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'జూహీ కెరీర్లో ముఖ్య పాత్ర పోషించిన సినిమాల్లో లూటెరె ఒకటి. దివ్య భారతిని కాదని..ఆమె నటించిన సుల్తానాత్ (1986), ఖయామత్ సే ఖయామత్ టక్ (1988) సినిమలను నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. తను చాలా బాగా యాక్ట్ చేయగలదు. అందుకే లూటెరె మూవీలో తనను హీరోయిన్గా తీసుకున్నాం. నిజానికి దివ్య భారతి అప్పుడు ట్రెండింగ్లో ఉంది. తను ఈ సినిమాలో భాగం కావాలని కోరుకుంది. కానీ, ఆమె ఈ పాత్రకు సరిపోదని భావించాం. దర్శకుడు ధర్మేశ్, నేను.. తనను కాదని జూహీ చావ్లాను తీసుకున్నాం.గ్లామర్గా చూపించాంఅయితే ఈ సినిమాలో మే తేరీ రాణి తు రాజా అని ఓ బీచ్ సాంగ్ ఉంటుంది. అందులో ఆమె బీచ్లో షర్ట్ ధరించి నీళ్లలో తడవాల్సి ఉంటుంది. అప్పటిదాకా పక్కింటి అమ్మాయి ఇమేజ్తో ఉన్న జూహీ చావ్లా.. సడన్గా గ్లామర్గా కనిపించాలంటే కొంత భయపడింది. కానీ కథ మొత్తం చెప్పాకే తను సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కాబట్టి చేయక తప్పలేదు. ముద్దు సన్నివేశంఅలాగే హీరోతో ముద్దు సన్నివేశం ఉంటుందని కూడా చెప్పాం. అలా మొదట్లో సీన్ షూట్ చేశాం. అయితే ఔట్డౌర్లో ఆ సీన్ తీస్తే బాగుంటుందనుకున్నాం. అంతా సిద్ధం చేసుకున్నాక జూహీ రాలేదు. తనకు వేరే షూటింగ్ ఉందని సాకు చెప్పి తప్పించుకుంది. సినిమాకు ఆ సన్నివేశం కీలకమని, ఏదో సంచలనం కోసం దాన్ని షూట్ చేయట్లేదని దర్శకుడు అన్నాడు.రీటేక్కు ఒప్పుకోలేదుఅలా సన్నీ డియోల్ , జూహి (Juhi Chawla)తో ముద్దు సీన్ తీశారు. అప్పటికీ అది సరిగా రాలేదని రీటేక్ చేయాలన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జూహి.. కాంట్రాక్ట్లో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటిస్తానని చెప్పాను. అది ఆల్రెడీ చేశానుగా అని వాదించింది. అందుకని ఆమెను బలవంతం చేయకుండా ఫస్ట్ తీసిన సీన్ను అలాగే ఉంచాం. ఆ సినిమా జూహీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది' అని సునీల్ దర్శన్ (Suneel Darshan) చెప్పుకొచ్చాడు.చదవండి: కాంతార దైవాన్ని దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ స్టార్ -
తిరుపతిలో దేవగుడి చిత్ర యూనిట్ సందడి
పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం దేవగుడి . ఈ చిత్రం డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుపతి , గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో, విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ సందడి చేసింది .ఈ సందర్భంగా గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం కళాశాలలో ప్రదర్శించారు. హీరో కావాలని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. Dఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19 విడుదల కానుందని, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు బెల్లం రామ కృష్ణారెడ్డి.సినిమాలో ఓ పాటకు హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేసి అలరించారు. -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్లో కన్నడ నటుడు శివ రాజ్కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్ను ప్రత్యేకమైన కాన్సెప్ట్తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
దేవతను దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ హీరో
ఎంతో అట్టహాసంగా కొనసాగిన ఇఫీ (అంతర్జాతీయ చలనచిత్రోత్సవ) వేడుకలు శుక్రవారం (నవంబర్ 28న) విజయవంతంగా ముగిశాయి. గోవాలో ఈ ముగింపు వేడుకకు కాంతార హీరో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సైతం హాజరయ్యాడు. కానీ అత్యుత్సాహంతో రణ్వీర్ చేసిన కామెంట్స్పై కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?స్టేజీపై రణ్వీర్ మాట్లాడుతూ.. నేను కాంతార: చాప్టర్ 1 థియేటర్లో చూశాను. రిషబ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఆడ దెయ్యం అతడి శరీరంలో ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశం అయితే అమేజింగ్ అంటూ ఆ సీన్ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే తనను కాంతార 3లో చూడాలనుకుంటే రిషబ్ను మీరే ఒప్పించండి అని ప్రేక్షకులను కోరాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఒక నటుడిగా స్టేజీపై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేది కూడా తెలీదా? దైవాన్ని పట్టుకుని దెయ్యం అంటాడేంటి? దేవతను కించరిచే హక్కు ఈయనకెక్కడిది? అని మండిపడుతున్నారు.కాంతార విశేషాలురిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్బస్టర్గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. #RanveerSingh literally called chavundi mata a ghost and mimicked her in funny way Isn't this Blasphemy pic.twitter.com/iJ1bAjRCLs— Tyler Burbun (@BurbunPitt) November 29, 2025 చదవండి: ప్రకాశ్ రాజ్ భార్యగా ఛాన్స్.. ఐదుగురితో కాంప్రమైజ్ అడిగారు -
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.నెల తిరగకముందే ఓటీటీలోనవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్ఫ్రెండ్ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.కథేంటంటే?The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్ఫ్రెండ్ చూసేయండి.. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్.. అంతమాటన్నాడా? -
బ్రహ్మానందాన్ని తిట్టిన రాజేంద్రప్రసాద్
రానురానూ రాజేంద్రప్రసాద్ తీరు అద్వాణ్నంగా తయారవుతోంది. మైక్ దొరికితే చాలు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి. ఏళ్లకొద్దీ అనుభవం ఉంటే ఏం లాభం? సభామర్యాదను పాటించకుండా స్టేజీపైనే బూతులు మాట్లాడుతున్నాడు. తాజాగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందంను కించపరుస్తూ మాట్లాడాడు.ఈవెంట్లో నోరు జారిన రాజేంద్రప్రసాద్శనివారం నాడు స:కుటుంబానాం సినిమా ఈవెంట్కు బ్రహ్మానందంతో పాటు రాజేంద్రప్రసాద్ హాజరయ్యాడు. బ్రహ్మానందం ప్రసంగం ముగిసిన తర్వాత రాజేంద్రప్రసాద్కు మైక్ ఇచ్చారు. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందంగారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్లు మాట్లాడటం.. అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. నటుడిపై ఆగ్రహంఇంతలో సడన్గా బ్రహ్మానందం (Brahmanandam)తో నువ్వు ముసలి ** కొడుకువి అంటూ నోరు జారాడు. ఆ మాటకు షాకైన బ్రహ్మానందం ఎవరు? అని అడగ్గానే నేనే అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని మండిపడుతున్నారు. వివాదాలతో సావాసంవివాదాలు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)కు కొత్తేమీ కాదు. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ను అసభ్య పదజాలంతో సంబోధించాడు. ఓ ఈవెంట్లో ఎవరూ చప్పట్లు కొట్టకపోతే బ్రెయిన్ పోయిందా? చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లేనట్లే అని చులకనగా మాట్లాడాడు. మరో ఈవెంట్లో కమెడియన్ అలీని దారుణంగా తిట్టాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్షమాపణలు చెప్తూ మరోసారి నోరు జారనని హామీ ఇచ్చాడు. ఇంతలోనే బ్రహ్మానందాన్ని కించపరిచేలా కామెంట్స్ చేసి విమర్శలపాలయ్యాడు.చదవండి: డైరెక్టర్ మా ఇంటికొచ్చి మరీ నీచంగా..: నటి -
క్రికెట్ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ G.O.A.T.. రంగంలోకి టాప్ టెక్నీషియన్!
‘సుడిగాలి’ సుధీర్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీవోఏటీ’. క్రికెట్ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాను మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ను మాత్రం ప్రముఖ సంగీతదర్శకుడు మణిశర్మ అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాత శనివారం అధికారికంగా తెలిపారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. సుధీర్(Sudigali Sudheer) కెరీర్లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్తో దూసుకుపోయి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు హిట్ అంటూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటున్నాయి. దీంతో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది. -
ప్రకాశ్రాజ్ భార్యగా ఛాన్స్... ఐదుగురితో కాంప్రమైజ్!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది మాధవి. మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల సీరియల్స్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని, వచ్చినా కమిట్మెంట్ అడుగుతున్నారని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి మాట్లాడింది.లావుగా ఉన్నానని..'అన్నీ ఉన్నా ఆఫర్స్ రావటంలేదు. ఆడిషన్స్కు వెళ్తేనేమో మీరా మాధవిగారు.. మీరు తెలుసు అనేస్తారు. సీరియల్స్లో అయితే డిమాండ్ ఉంది. సినిమాల్లోనే.. పిలుస్తున్నారు కానీ ఫైనల్ చేయడం లేదు. కొన్నిసార్లు లావుగా ఉన్నానని రిజెక్ట్ చేస్తారు. ఆడవారికి ఒక వయసు దాటాక హార్మోన్ల సమస్యలు వస్తాయి.. లావైపోతాం. దానికి మనమేం చేయలేం.. మరి వీళ్లంతా నేను సన్నగా ఉన్నప్పుడు ఏం చేశారో..?ఇంటికి వచ్చి మరీ..12 ఏళ్ల క్రితం ఒక దర్శకుడు ఫోన్ చేశాడు. తనింకా ఆఫీస్ పెట్టలేదని, ఇంటికొచ్చి మాట్లాడతానన్నాడు. నేను ఉత్సాహంతో సరే, రండి సర్ అన్నాను. అప్పుడు ఇంట్లో అమ్మ, నేను, పనిమనిషి ఉన్నాం. ఆయన వచ్చాక నన్నోసారి నడవమన్నారు. ఆడిషన్ చేస్తున్నారేమోనని నడిచి చూపించాను. అప్పుడు డ్రెస్లో ఉండేసరికి చీర కట్టుకుని రమ్మన్నాడు. సరే అని చీర కట్టుకుని రెడీ అయి ముందు నిల్చున్నాను. చెప్పు తీసుకుని కొడతా..ఆయన నన్ను ఎగాదిగా చూసి కాస్త నీ నడుము చూపించు అన్నాడు. వెంటనే కోపంతో నువ్వు లేరా.. చెప్పు తీసుకుని కొడతా, బయటకు పో అని గెంటేశాను. ఒకవేళ ఆయన తలుపేసి ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి? అని నిలువెల్లా వణికిపోయాను. మరో సంఘటన.. 100% లవ్ సినిమా చేశాక నాకో ఫోన్ కాల్ వచ్చింది. ప్రకాశ్రాజ్ పక్కన భార్య పాత్ర.. ఐదుగురితో కాంప్రమైజ్ కావాలి అని అడిగారు. ఆ టైప్ కాదన్నాను100% లవ్లో కూడా కాంప్రమైజ్ ఇచ్చారని మాకు తెలిసింది అన్నాడు. అలాంటిదేమీ లేదు, కావాలంటే వాళ్లను అడగండి అని చెప్పాను. అలాంటి మార్గం ఎంచుకుంటే అదే పని చేసుకునేదాన్ని.. నేనలా కాదు, సారీ అని చెప్పాను. మంచి అవకాశం అని బలవంతం చేశారు, కానీ నేను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. మాధవి (Mirchi Madhavi) చివరగా గుప్పెడంత మనసు సీరియల్లో మెప్పించింది. ప్రస్తుతం గోపీచంద్ సినిమాతో పాటు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చేస్తోందిచదవండి: OTT: గుల్మొహర్ మూవీ రివ్యూ -
గుల్మొహర్ రివ్యూ.. మనసును హత్తుకునే సినిమా
ఇల్లు అంటే కేవలం నాలుగు గదులు అంతేనా? కాదు, ఇల్లు అంటే కుటుంబంలో ఒక భాగం. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు, అలకలకు, కోపతాపాలకు, రహస్యాలకు, విషాదాలకు.. ఇలా అన్నిరకాల జ్ఞాపకాలకు నిలువెత్తు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉన్న సొంతింటిని వీడాలంటే కన్నతల్లికే దూరమవుతున్నట్లు మనసు తల్లడిల్లుతుంది. అలా ఇంటి చుట్టూ తిరిగే కథ గుల్మొహర్.అందరి ఇంటి కథమనోజ్ బాజ్పాయ్, షర్మిల ఠాగోర్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన మూవీ గుల్మొహర్. రాహుల్ చిట్టెల, అర్పిత ముఖర్జీ ఇల్లు, అందులో ఉండే కుటుంబం గురించి కథ రాసుకున్నారు. చూడటానికి సింపుల్గా ఉన్నా కొన్ని సన్నివేశాలు మనసును కదిలిస్తాయి. కుసుమ్ బాత్రగా షర్మిల నటన ఆకట్టుకుంటుంది. అందరి ఇంట్లోలాగే తను కూడా ఇంటిపెద్దగా, నాయినమ్మగా పెత్తనం చెలాయిస్తుంటుంది. కానీ, తన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు.కథఅందరం కలిసికట్టుగా జీవించాలనుకునే వ్యక్తి అరుణ్ (మనోజ్ బాజ్పాయ్). కానీ అతడి కుమారుడు ఆది (సూరజ్ శర్మ) భార్యతో కలిసి విడిగా ఉండాలనుకుంటాడు. తండ్రి సాయం లేకుండా సొంతంగా తన కాళ్లపై నిలబడాలనుకుంటాడు. అది అరుణ్కు నచ్చదు. కుటుంబం ఎప్పుడూ ఒకేచోట ఉండాలన్నది అతడి విధానం. ఇంతలో అతడి తల్లి కుసుమ్ కూడా పుదుచ్చేరిలో ఇల్లు కొన్నానని, ఒక్కతే అక్కడ ఉండబోతున్నానని చెప్పి బాంబు పేలుస్తుంది. ఇది ఎవరికీ మింగుడు పడకపోయినా ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు.ఎలా ఉందంటే?చేతి ఐదువేళ్లు ఒకేలా ఎలా ఉండవో.. ఇంట్లోని మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కొరిది ఒక్కో స్వభావం. దాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు. (Gulmohar Movie Review) క్లైమాక్స్లో మనోజ్ తన నటనతో ఏడిపించేశాడు. ఆ ఇంట్లో చివరి హోలీ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. అది చూశాక మన మనసులు కూడా కాస్త తేలికపడతాయి. అందర్నీ ఇంతలా మెప్పించిన ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం జియో హాట్స్టార్లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
అందాల ఆరబోత.. నేను చేయట్లేదా?: రకుల్
ఒకప్పటి హీరోయిన్లను ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు బొద్దుగా ఉండేవారు. ఈ తరం కథానాయికలు సైజ్ జీరోపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. డైటింగ్ పేరుతో నోళ్లు కట్టేసుకుంటారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందుంటారని చెప్పక తప్పదు. పెళ్లి తర్వాతఅలా వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత స్లిమ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కారణం.. మళ్లీ నటించడానికి రెడీ అవడమే. హీరోయిన్ రకుల్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈమె కోలీవుడ్లో చివరగా నటించిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చింది. అది తప్పుఆ తర్వాత దక్షిణాదిలో తనకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అందాలారబోతతో పలు ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీని గురించి రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అనే భావన ఉందని తెలిపింది. అయితే అది తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని పేర్కొంది. తనకు సంబంధించినంతవరకు అందాల ఆరబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. అందం హద్దులను పెళ్లి చెరిపేయదని.. పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. -
‘లవ్ డేస్’ హిట్ కావాలి: దర్శకుడు సముద్ర
నవీన్, కుసుమ చందక జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్ను అందించాలని కోరుకుంటున్నాను. మనస్పూర్తిగా ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.నిర్మాత మాదల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సురేష్ లంకలపల్లి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రయాణంలో అతని డెడికేషన్ నాకు చాలా నచ్చింది. ఆయనతోనే మళ్లీ నెక్ట్స్ సినిమా కూడా చేయబోతోన్నాం. భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేస్తాను. నేను చేయనున్న నాలుగో సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారు. నవీన్, కుసుమ, ఆదిత్య ఇలా అందరూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. మా మూవీ టైటిల్, గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ .. ‘నిర్మాత వెంకట్ గారి వల్లే ఈ కథ, ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. నవీన్ కటౌట్ బాగుంటుంది. కుసుమకి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆదిత్యకి తెలుగు అంతగా రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పాడు. ఈ మూవీలో ప్రతీ ఒక్కరి పాత్ర బాగుంటుంది’ అన్నారు. -
దయచేసి నా పిల్లల ఫోటోలను వాడకండి.. నటి విజ్ఞప్తి
భర్తపై గృహహింస కేసు నమోదు చేయడంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భర్త పీటర్ హాగ్ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఇటీవల ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సెలీనాపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. జాతీయ మీడియాలో ఆమెపై వరుస కథనాలు వస్తున్నాయి. వారి పిల్లల ఫోటోలను సైతం మీడియాలో చూపిస్తున్నారు. ఈ పరిణామాలతో బాధపడుతున్న సెలీనా జైట్లీ(Celina Jaitly )... మీడియాకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వివాదంలోకి తన పిల్లలను లాగొద్దని..వారి ఫోటోలను మీడియాలో ప్రసారం చేయొద్దని కోరింది. ‘నా గురించి రాసే వార్తల్లో మా పిల్లల ఫోటోలను వాడొద్దని మీడియాకు వేడుకుంటున్నా. నా విజ్ఞప్తిని అర్థం చేసుకొని.. అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఓ తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నాను’ అంటూ ట్వీట్ చేసింది సెలీనా జైట్లి.పిల్లల గోప్యత, మానసిక భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సెలీనా విజ్ఞప్తికి సోషల్ మీడియాలో అనేక మంది మద్దతు తెలిపారు. అదే సమయంలో కొందరు మీడియా సంస్థలు ఇప్పటికీ పిల్లల ఫొటోలతోనే కథనాలు ప్రచురిస్తుండటం విమర్శలకు దారితీసింది.సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ 2010లో ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సెలీనా జైట్లీ ఆస్ట్రియాలోని వియన్నాలో తన కవల పిల్లలతో కలిసి ఉంటున్నారు. సెలీనా పెట్టిన గృహహింస కేసు డిసెంబర్ 12న విచారణకు రానుంది. pic.twitter.com/QLPr2BgnOV— Celina Jaitly (@CelinaJaitly) November 28, 2025 -
గుడ్న్యూస్ చెప్పిన 'జాట్' విలన్
బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా శుభవార్త చెప్పాడు. 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రణ్దీప్ హుడా నటి లిన్ లైశ్రామ్ను 2023లో పెళ్లి చేసుకున్నాడు. నేడు (నవంబర్ 29న) వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేశారు. అందులో దంపతులిద్దరూ పచ్చని చెట్ల మధ్య చలి మంట కాచుకుంటున్నారు. త్వరలో బుజ్జి పాపాయిఈ పోస్ట్ కింద.. రెండేళ్ల ప్రయాణం, ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది.. అని క్యాప్షన్ జోడించారు. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రణ్దీప్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లిన్ లైశ్రామ్.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, ఉమ్రిక, రంగూన్ వంటి పలు సినిమాలు చేసింది. సినిమా నటుడు రణ్దీప్ (Randeep Hooda).. రిస్క్, లవ్ కిచిడీ, జన్నత్ 2, హీరోయిన్, మర్డర్ 3, హైవే, సుల్తాన్, లవ్ ఆజ్ కల్, భాగీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించాడు. చివరగా జాట్ సినిమాలో విలన్గా నటించాడు. ప్రస్తుతం అమెరికన్ ఫిలిం మ్యాచ్బాక్స్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) చదవండి: శ్రావణ భార్గవితో విడాకులు.. హేమచంద్ర ఏమన్నాడంటే? -
ఆ నటుడికి రుణపడి ఉన్న కృష్ణవంశీ.. ఏం చేశాడంటే?
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్ తొలినాళ్లలో రామ్గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతేకాదు తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నాడు. రెండో సినిమా నిన్నేపెళ్లాడతా, మూడో మూవీ సింధూరం చిత్రాలకు ఏకంగా జాతీయ అవార్డులు గెల్చుకోవడం విశేషం. ఈయన చివరగా రంగమార్తాండ సినిమా తెరకెక్కించాడు.కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులుఅయితే కృష్ణవంశీ కెరీర్ తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కడుపు నిండా తిండి తినలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కోసారి నాలుగైదు రోజుల వరకు ఆకలి కేకలతో అలమటించేవాడట! అంత ఆకలిగా ఉన్నా సరే.. ఎవరైనా పిలిస్తే వెళ్లేవాడు కాదట. కారణం.. ఎవరికీ రుణపడి ఉండటం ఆయనకు ఇష్టముండదు.తిండి లేక అలమటించాడుఓసారి కృష్ణవంశీ (Director Krishna Vamsi) ఐదు రోజులుగా తిండి లేక అలమటించాడు. అప్పుడు బ్రహ్మాజీ తిందాం రమ్మని పిలిచాడు. ఆ రోజు ఒంట్లో ఓపిక లేక కాదనలేకపోయాడట! అతడితో కలిసి వెళ్లి భోజనం చేశాడు. అయితే అతడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని అప్పటినుంచి మథనపడటం మొదలుపెట్టాడు.కృతజ్ఞతతో..అలా సింధూరం సినిమా రాసుకున్నప్పుడు బ్రహ్మాజీ (Brahmaji) హీరోగా ఎందుకు చేయకూడదు? అని ఆలోచించాడు. స్టార్స్తో తీస్తే డబ్బులు వస్తాయి. కానీ, బ్రహ్మాజీతో తీస్తే సంతృప్తి లభిస్తుందని ఆలోచించాడు. బ్రహ్మాజీ అన్నం పెట్టాడనే కృతజ్ఞతతో అతడిని హీరోగా పెట్టి సింధూరం తీశాడు. అది పెద్దగా ఆడకపోయినా తర్వాతి సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలా ఒక్కపూట అన్నం పెట్టినందుకు బ్రహ్మాజీ కృతజ్ఞత తీర్చుకున్నాడు కృష్ణవంశీ.చదవండి: చీప్ పాత్రలు చేయను: రాశీఖన్నా -
శ్రావణ భార్గవితో విడాకులు? స్పందించిన హేమచంద్ర
టాలీవుడ్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడిపోయి మూడేళ్లవుతోంది. కానీ, ఇంతవరకు ఈ విషయాన్ని ఈ జంట ధ్రువీకరించలేదు. అసలు దానిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన హేమచంద్రకు విడాకుల విషయంపై ప్రశ్న ఎదురైంది.మీకేంటి ఉపయోగం?దానిపై హేమచంద్ర మాట్లాడుతూ.. విడాకుల వార్త నిజమా? కాదా? ఎవరైనా కావాలని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారా? అన్న విషయాలు పక్కన పెడితే.. ఈ విషయం గురించి తెలుసుకోవడం వల్ల మీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? ఏదైనా పనికొస్తుందంటే చెప్పండి.. అప్పుడు దీని గురించి మాట్లాడతాను. నాపై వచ్చే కామెంట్స్ను నేనస్సలు పట్టించుకోను. ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదు.పనికిమాలిన విషయాలను పట్టించుకోనుమీ అందరికీ నేను సింగర్గా తెలుసు. ఆ పని గురించి అడగండి. నా మాటల వల్ల ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు. పనికిమాలిన విషయాల గురించి పట్టించుకోను. నా పర్సనల్ విషయాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుంటే ఒక షో ఏర్పాటు చేయండి. అక్కడ అందరం కలుసుకుందాం. నీకు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలనుంది? అని నేను అడుగుతా.. కరెక్ట్ సమాధానం చెప్పారంటే అప్పుడు నేను జవాబిస్తాను. పెళ్లిచివరగా నేను ఏం చెప్తానంటే నాకు సమయం వచ్చినప్పుడే ఈ విషయం గురించి మాట్లాడతాను అని హేమచంద్ర చెప్పుకొచ్చాడు. హేమచంద్ర (Hema Chandra)-శ్రావణ భార్గవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు జంటగా యాంకరింగ్ కూడా చేశారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016లో పాప శిఖర చంద్రిక పుట్టింది. ఎవరి దిష్టి తగిలిందో.. ఏమో.. కానీ ఈ జంట చాలాకాలంగా విడివిడిగానే జీవిస్తున్నారు.చదవండి: అలా హీరోయిన్ అయ్యా: కృతీ శెట్టి -
సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ఏ ఓటీటీలో ఉందంటే?
సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా వెబ్ సిరీస్లు రూపొందుతున్నాయి. సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటే వెబ్ సిరీస్లు ఇంకా ముందుకెళ్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో వెబ్ సిరీస్ల నిర్మాణం అధికం అవుతోంది. అలా తాజాగా జీ 5 ఓటీటీ సంస్థ రేకై అనే వెబ్ సిరీస్ ముందుకు తీచ్చింది. ప్రముఖ నవలా రచయిత రాజేశ్ కుమార్ రాసిన క్రైమ్ నవల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఇది. ఈయన ఇంతకు ముందు రాసిన పలు క్రైమ్ నవలలు బహు ప్రాచుర్యం పొందాయి.అలా ఆయన తాజాగా రాసిన నవల ఆధారంగా రూపొందిన రేకై వెబ్ సిరీస్కు ఎం.దినకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.సింగారవేలన్ నిర్మించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్గా రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇంతకు ముందు పలు సినిమాలు, వెబ్ సిరీస్ రూపొందాయి. వాటికి భిన్నంగా ఉత్కంఠభరిత కథ, కథనాలతో రూపొందిన వెబ్ సిరీస్ రేకై . కథఒక ఐస్ ట్రక్ అనూహ్యంగా ప్రమాదానికి గురవుతుంది. దీంతో దాని డ్రైవర్ మృతి చెందుతాడు. అయితే ఆ ట్రక్లో ఓ మొండి చేయి బయట పడుతుంది. అది ఎవరిది? దాని వెనుక ఉన్న హంతకులు ఎవరన్న ఇన్వెస్టిగేషన్తో కథ మొదలవుతుంది. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. అదే సమయంలో ఆ మొండి చెయ్యి రేఖలతో మరో ఆరుగురి రేఖలు కనుగొనబడతాయి. దీంతో కేసు విచారణ క్లిష్టంగా మారుతుంది. మరో పక్క డిపార్టెమెంట్లోనూ కొందరు ప్రముఖులు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరో పక్క మానవ అవయవాల రాకెట్ దందా పెద్ద స్థాయిలో జరుగుతోందనే విషయాన్ని పోలీస్ అధికారులు చేధించగలిగారా? లేదా? ఇలా పలు ఊహకు అందని సంఘటనలతో కథ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్లో బాలహాసన్, పవిత్ర జనని, బోపాలన్ ప్రగదీశ్, వినోదిని వైద్యనాథన్, శ్రీరామ్.ఎం, అంజలిరావ్, ఇంద్రజిత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్తో హీరోయిన్ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్ను చేసింది.ఉప్పెనతో హీరోయిన్గా17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.తమిళ సినిమాలుదీంతో కేవలం టాలీవుడ్నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్ సరసన నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్లో ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించింది.హీరోయిన్ ఎలా అయ్యానంటే?వా వాద్దియార్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంది. దర్శకుడు ఫోన్ చేసి..వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది. -
కూతురి పేరు వెల్లడించిన గేమ్ ఛేంజర్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. కియారా- సిద్దార్థ్జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు. సిద్దార్థ్లోని స అక్షరాన్ని, కియారా(Kiara Advani) లోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సరాయా అంటే అరబిక్లో యువరాణి అని అర్థం. అయితే పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. కేవలం సాక్సులు తొడిగిన పాప కాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్ చేశారు. ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దార్థా- కియారా 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 15న వీరికి కూతురు పుట్టింది.సినిమాలుసినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేశ్బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్చరణ్ సరసన 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు చేసింది. ఈ ఏడాది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ల మల్టీస్టారర్ 'వార్ 2' మూవీలో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా చివరగా 'పరమ సుందరి' సినిమా చేశాడు. ప్రస్తుతం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్' మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) చదవండి: -
సౌత్లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు.. నచ్చట్లేదు!
కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నచ్చట్లే..కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ దర్బార్లోనూ నెగెటివ్ రోల్ చేశాను. కాకపోతే రజనీ సర్తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. కంటెంటే కింగ్ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి చివరగా కేసరి వీర్, నడానియన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్, హెరా ఫెరి 3 మూవీస్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.చదవండి: తనూజతో అతి చేసిన యావర్.. చివరి కెప్టెన్ ఎవరంటే? -
కామెడీ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలోకి..
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్ మినార్. రాజ్తరుణ్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ సర్ప్రైజ్గా స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు.కథేంటంటే..కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్కాయిన్ స్కామ్ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్ బుక్ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: బిగ్బాస్ హౌస్ చివరి కెప్టెన్ ఎవరంటే? -
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్హాసన్(Kamal Haasan) తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
బ్లూ, ఎల్లో కలిస్తే గ్రీన్ ఒస్తాది.. సాంగ్ విన్నారా?
టాలీవుడ్ నటుడు, నందు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ (Psych Siddhartha Movie). పేరుకు తగ్గట్లే సినిమాలో బూతులకు కొదవే లేదు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యామిని భాస్కర్ హీరోయిన్. ఇటీవల రిలీజైన టీజర్ మొత్తం బూతులతోనే నిండిపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బ్లూ ఎల్లో కలిపితే రెడ్ అవుతాది అంటూ సాగే ఈ పాట వెరైటీగా ఆకట్టుకుంటోంది.వదిలేసి వెళ్లిపోయిందిసిగరెట్స్ లంగ్స్కు అస్సలు మంచిది కాదు.. అయినా అందరూ ఇంటర్వెల్లో కాలుస్తారు. ఆల్కహాల్.. లివర్కు అస్సలు మంచిది కాదు. అయినా అందరూ బేబీ సినిమా చూసొచ్చి తాగుతారు. అట్లనే లవ్.. హార్ట్కు అస్సలు మంచిది కాదు. అయితే మీరందరు లవ్ చేసిర్రని తెలుసు.. నేను కూడా అట్లనే చేశిన.. కానీ, ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందిరా అంటూ ఏడుపందుకున్నాడు నందు. ఆ తర్వాత అసలు పాట మొదలైంది.కలర్స్ సాంగ్'బ్లూ, ఎల్లో కలిసినాయంటే గ్రీన్ ఒస్తాది.. రెడ్, ఎల్లో కలిసినాయంటే ఆరెంజ్ ఒస్తాది.. బ్లాక్.. నలుపాయే జిందగీ నువ్వెళ్లిపోతే చెలి' అంటూ పాట సాగింది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు. పాట వెరైటీగా భలే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: దండం పెడ్తా.. పంపించు బిగ్బాస్: అడుక్కున్న సోహైల్ -
6 ఏళ్లకే నటిగా.. 19 ఏళ్ల వయసులో హీరోయిన్గా!
చిన్న వయసులో వెండితెరపై అడుగుపెట్టి తర్వాత హీరోయిన్గా రాణించినవారు చాలామంది ఉన్నారు. పైన కనిపిస్తున్న ఈ క్యూట్ పాప కూడా మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది. 20 ఏళ్లు కూడా నిండకముందే హీరోయిన్గా సినిమాలు చేసింది. ఇంతకీ తనెవరో గుర్తుపట్టారా? ఆ పాపే 'బుట్టబొమ్మ' అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). చైల్డ్ ఆర్టిస్ట్గా..ఈ మలయాళ కుట్టి బాలనటిగా యాక్ట్ చేసిన మొదటి చిత్రం 'కద తుదరున్ను'. అప్పుడు తన వయసు ఆరేళ్లే! విశ్వాసం సినిమాలో అజిత్- నయనతార కూతురిగా నటించింది. అప్పటినుంచి తనను కుట్టి నయనతార అని పిలుస్తూ ఉంటారు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా మలయాళ, తమిళ భాషల్లో దాదాపు 15 సినిమాలు చేసింది. తెలుగులో ద ఘోస్ట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిసింది. 19 ఏళ్ల వయసులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా మారింది. కానీ, తర్వాత మళ్లీ తెలుగులో కనిపించనేలేదు. సినిమాలుమలయాళంలో ఓ మై డార్లింగ్, కింగ్ ఆఫ్ కొత్త.. తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం(తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా), ఇంద్ర, పీటీ సర్ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక మూవీ చేస్తోంది. యూట్యూబర్లో రెండు,మూడు షార్ట్ ఫిలింస్ కూడా చేసింది. రెండేళ్ల క్రితం ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్ వైరలయింది. అది చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ అది రియల్ పోస్టర్ కాదు, రీల్ పోస్టర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ బుట్టబొమ్మ తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) చదవండి: హిట్టు మూవీ.. థియేటర్లలో ఫ్రీ టికెట్ -
హిట్టు మూవీ.. ఫ్రీగా చూసేయండి.. థియేటర్ల లిస్ట్ ఇదే!
రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie).. చాలామంది ఈ సినిమా మీద మనసు పారేసుకున్నారు. జనాలను అంత బాగా మెప్పిస్తోందీ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రయూనిట్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళందరికీ ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఫ్రీ టికెట్ తీసుకోండిఈ విషయాన్ని నిర్మాత వేణు ఊడుగుల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఏ థియేటర్కు అయినా వెళ్లండి. కౌంటర్ దగ్గరకు వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకోండి.. ఉచితంగా సినిమా చూడండి.. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమే అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో ఏరియా.. అక్కడున్న థియేటర్ల వివరాలను సైతం పొందుపరిచాడు. ఆ లిస్ట్ కింద చూసేయండి..థియేటర్ల లిస్ట్విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబవిజయనగరం: కృష్ణరాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్కాకినాడ: పద్మప్రియ కాంప్లెక్స్శ్రీకాకుళం: సూర్య మహల్తణుకు: శ్రీ వెంకటేశ్వరఏలూరు: అంబిక కాంప్లెక్స్విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్గుంటూరు: బాలీవుడ్ఒంగోలు: గోపిమచిలీపట్నం: సిరి కృష్ణనెల్లూరు: సిరి మల్టీప్లెక్స్కావలి: లత 2 షోస్, మానస 2 షోస్చిత్తూరు: గురునాథ్తిరుపతి: జయ శ్యామ్కర్నూలు: ఆనంద్నంద్యాల: నిధికడప: రవిరాయచోటి: సాయిఅనంతపురం: ఎస్వీ సినీ మాక్స్హిందూపూర్: గురునాథ్సినిమాఈ ఆఫర్ ఈరోజు (నవంబర్ 27న) మాత్రమే వర్తిస్తుంది. సినిమా విషయానికి వస్తే.. అఖిల్, తేజస్విని జంటగా నటించిన మూవీయే రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేశారు. ఈ చిత్రం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: సాయిలు సవాల్ విని భయమేసింది: దర్శకుడు బాబీ -
'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విటర్ రివ్యూ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం'ఆంధ్ర కింగ్ తాలూకా'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Andhra King Taluka Talk)ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్డ్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘రామ్ ఖాతాలో హిట్ పడిందా? ఆంధ్రకింగ్ తాలుకా కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. (Andhra King Taluka Movie Twitter Review)ఎక్స్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని..రామ్ వన్మ్యాన్ షో అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మహేశ్ మరోసారి హార్ట్ఫుల్ డ్రామాని తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. నిడివి కాస్త ఎక్కువ ఉండడం, ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం మైనస్ అని చెబుతున్నారు. #AndhraKingTaluka A Satisfactory Fanism/Love Story that’s predictable and too lengthy, yet maintains a decent feel-good vibe throughout!The film blends a hero & fan track with a love story to form an interesting drama. Both halves stay true to the core storyline and offer a few…— Venky Reviews (@venkyreviews) November 27, 2025 ఆంధ్రకింగ్ ఊహించదగ్గ ఫ్యానిజమ్, లవ్స్టోరి. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు మహేశ్ మరో మంచి హార్ట్ఫుల్ డ్రామాని తెరకెక్కించాడు. రామ్ నటన అదిరిపోయింది. సినిమాలో హీరో పాత్రకి ఉపేంద్రని ఎంపిక చేయడం సరైన నిర్ణయం. అద్భుతంగా నటించాడు. ఊహకందేలా ఉన్నప్పటికీ..చాలా నిజాయితీగా ఈ కథను చెప్పారంటూ ఓ నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు. Chala manchi Katha...Chala manchi cinema...Every fan of any hero will easily connect to it...Writing chala bavundhi...A small parallel that is drawn in 2nd half is too beautiful...A Meaningful and Heartwarming STAR - FAN story...BONAFIDE BLOCKBUSTER 💯 RAPO🤩❤️ #AndhraKingTaluka— SRUJAN (@SRUJAN_JGM) November 27, 2025 చాలా మంచి సినిమా. ప్రతి హీరో అభిమాని ఈ సినిమాకు కనెక్ట్ అవుతాడు. రైటింగ్ చాలా బాగుంది. సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది. మినింగ్ఫుల్& హార్ట్వార్మింగ్ స్టార్-ఫ్యాన్ స్టోరీ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#AndhraKingTaluka Review : "Emotional & Engaging"Rating: (3/5)⭐️⭐️⭐️Positives:👉#RamPothineni delivers one of his finest performance👉Strong dialogues & Solid writing by @filmymahesh 👉Soulful songs & Second half👉The Climax lands beautifully, leaving a warm impact…— PaniPuri (@THEPANIPURI) November 26, 2025 ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ మూవీ ఇది. రామ్ తన ఫెర్మార్మెన్స్తో అదరగొట్టాడు. డైలాగులు బాగున్నాయి. పాటలు, సెంకడాఫ్ బ్యూటిఫుల్గా ఉంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్. ఓవరాల్గా ఆంధ్రకింగ్ చాలా బాగుంది అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.💥 Comeback confirmed! #AndhraKingTaluka is winning hearts with its emotional depth & layered storytelling.🔥 First half sets the tone, second half hits hard with drama & that Ramayanam scene everyone’s talking about!What’s your favorite moment so far? Drop it below! 👇— Brat Dot AI (@BratDotAI) November 27, 2025#AndhraKingTaluka – Raka RakaAa mass oobi nundi bayatiki vachchi, kothaga decent ga cinema chesadu.E cinema ni mundu theatre lo enjoy cheyandi.Own fans definitely enjoy chestaru,Movie lovers ki kuda maximum ga convincing ga untundi.I hope it makes some good profits 😊 pic.twitter.com/7jTnyN8t5f— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) November 26, 2025#AndhraKingTalukaReview:The first half is decently engaging with a well written hero fan relationship even though they do not meet. The chemistry between #RamPothineni and Bhagyashri Borse feels sweet and natural. Ram is really good and delivers one of his finest performances…— Movies4u Reviews (@Movies4uReviews) November 27, 2025@ramsayz anna, #AndhraKingTaluka was an absolute BLAST! 🔥Pure emotion, fun, vibes, and full-on entertainment.#Jagadam has always been my all-time favorite… and this gave me that same emotional high.You delivered on another level, anna. Please keep giving us gems like this 🤗— శ్రీ (@SreeNTR_12) November 27, 2025 -
కలిసిరాని సినిమాలు.. స్టార్ హీరోయిన్ అయ్యేదెప్పుడో?
కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్లీడర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.బ్రేక్అయినా ప్రియాంక మోహన్ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్కు జంటగా డాక్టర్ అనే చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో అదే హీరోతో డాన్ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్హిట్ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది. ఉపయోగపడని ఓజీపవన్కల్యాణ్కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్ కెరీర్కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్కు ఉపయోగపడలేదు. ఈ సినిమాలపైనే ఆశలుకాగా ప్రస్తుతం కెవిన్కు జంటగా ఒక చిత్రం, మేడ్ ఇన్ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్ అయితేనే ప్రియాంకమోహన్కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతోంది. -
సోషియో ఫాంటసీ కథతో ‘వానర’
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది."వానర" చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. "వానర" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
నలుగురిలో నవ్వులు.. నాలుగోడల మధ్య నరకం
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం... తెరపై హీరోయిన్లు మెరిసే నక్షత్రాల్లా కనిపిస్తారు. అందం, గ్లామర్, అభిమానుల ఆరాధన – ఇవన్నీ వారి జీవితంలో బయటి ముఖం మాత్రమే. కానీ ఆ కెమెరాలు ఆఫైన తర్వాత, ఆ లైట్లు ఆరిపోయిన తర్వాత... చాలా మంది తారలు తమ ఇంటి నాలుగు గోడల్లో తీవ్రమైన గృహహింసకు గురవుతున్నారు.సాధారణ గృహిణులతో పోల్చితే వీరి బాధ రెట్టింపు – ఎందుకంటే వారి నొప్పి ప్రైవేట్గా మిగలకుండా, మీడియా ట్రయల్గా మారుతుంది. అందుకే కొందరు కెరీర్ నాశనం అవుతుందనే భయంతో ఆ బాధను భరిస్తున్నారు... మరికొందరు మాత్రం ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించి, తమ భర్తలపై గృహహింస కేసులు పెట్టి ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు గాను ఆమె ఈ కేసు పెట్టి.. రూ. 50 కోట్ల నష్ట పరిహారం అడిగారు. సెలీనా జైట్లీ మాదిరే గతంలోనూ పలువురు బాలీవుడ్ తారలు తమ భర్తలు పెట్టే హింసను భరించలేక న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం.రతి అగ్నిహోత్రి1980లలో బాలీవుడ్లో హీరోయిన్గా రాణించిన రతి, 1985లో అనిల్ విర్వానీని వివాహం చేసుకున్న తర్వాత 30 సంవత్సరాలు శారీరక, మానసిక హింసకు గురయ్యారు. 2015లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి, గృహ హింస కేసు దాఖలు చేశారు. ఆమె కుమారుడు వితర్ణ్ సహాయంతో ఈ అంశాన్ని బయటపెట్టారు.కరిష్మా కపూర్సూపర్స్టార్ కరణ్ జోహర్ సోదరి కరిష్మా తన మాజీ భర్త సంజయ్ కపూర్తో విడాకుల సమయంలో భావోద్వేగ, శారీరక హింసను ఆరోపించింది. "నన్ను వస్తువులా చూశారు" అని చెప్పుకుంది. డైవోర్స్ తర్వాత కూతుళ్ల కస్టడీ కోసం ఇంకా లీగల్ ఫైట్ లో ఉంది. కాగా, కరిష్మా, సంజయ్ల వివాహం 2003లో జరగ్గా.. పదేళ్ల తర్వాత 2014లో విడాకులు తీసుకున్నారు.యుక్తా మూక్కే:మిస్ వరల్డ్ 1999 యుక్తా తన భర్త ప్రిన్స్ తులి మీద 2013లో గృహహింస కేసు పెట్టింది. కొట్టడంతో పాటు మాటలతో మానసికంగా వేధించాడంటూ భర్తపై కేసు పెట్టింది. ‘పిల్లల కోసం సహించాను, కానీ ఇక భరించలేను’ అంటూ అప్పట్లో యుక్తా ఎమోషనల్ అయింది.శ్వేతా తివారీ టీవీ సీరియల్స్లో ప్రసిద్ధి చెందిన శ్వేతా, మొదటి భర్త్ రాజా చౌధరీ మీద 2009లో గృహ హింస కేసు పెట్టి విడాకులు తీర్చుకున్నారు. రెండో భర్త్ అభినవ్ కోహ్లీ మీద కూడా హింస ఆరోపణలు చేశారు. ఆమె కథ ధైర్యానికి చిహ్నం.రాఖీ సావంత్ బిగ్ బాస్ స్టార్ రాఖీ, 2023లో భర్త్ అదిల్ ఖాన్ దుర్రానీ మీద గృహ హింస, మోసం కేసులు దాఖలు చేశారు. వివాహం తర్వాత 8 నెలల పాటు తనను శారీరకంగా వేధించాడని, ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో అదిల్ అరెస్టయ్యారు.డింపీ గంగూలీ'బిగ్ బాస్' ఫైనలిస్ట్ డింపీ, 2014లో భర్త్ రాహుల్ మహాజన్ మీద శారీరక హింస కేసు దాఖలు చేశారు. చేతులు, కాళ్లు గాయపడిన ఫోటోలు వైరలయ్యాయి. గన్ చూపించి బెదిరించాడని ఆరోపించారు. -
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కామెడీ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ది పెట్ డిటెక్టివ్’. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిచారు. అక్టోబర్ 16న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది. -
ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్
ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దొంగల్లా పరిగెట్టారుఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్ అవగానే సడన్గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా? ఒక ఫిలింమేకర్కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?గుండెల్లో పెట్టుకున్నారుమావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం -
నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. దర్శకుడు భావోద్వేగం
తెలుగు దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి మరణవార్తను సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులుబాపును తల్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. బాపు.. నువ్ లేకుండానే తెల్లారింది. నువ్ లేకుండానే ఓదెల లేచింది.. నువ్ లేకుండానే ఇల్లూ లేచింది. కల్లాపితో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది.. “ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు.. “ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు! చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది. భుజంపై ఎత్తుకెళ్లావ్గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నిన్నే కదా అనిపిస్తోంది. నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక.. మనం దున్నిన జంబు అరక.. పత్తి మందుకు పంపు.. పల్లి చేను లో సద్ది.. మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు.. ఇక అన్నీ జ్ఞాపకాలేనా? దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు.. మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు.. ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా? నీ ప్రేమ నాకు మళ్లీ కావాలిఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా.. అంటూ ఎమోషనలయ్యాడు. సంపత్ నంది విషయానికి వస్తే ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాలకు తెరకెక్కించాడు. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2, బ్లాక్ రోజ్ చిత్రాలకు కథ అందించాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 'భోగి' సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Sampath Nandi (@isampathnandi) -
నటికి లవ్ లెటర్ రాశా: శివాజీ రాజా
చిన్న సినిమాగా వచ్చిన "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ (Raju Weds Rambai Movie)కి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు.ప్రేమలేఖశివాజీ రాజా మాట్లాడుతూ.. అనిత చౌదరి, నేను చాలా సినిమాలు చేశాం. మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్ లెటర్ రాయమన్నాడు. అచ్చ తెలుగు భాషలో, పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాశా.. ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా! ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు..యూనిట్ అందరికీ ఇచ్చింది. నాకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్లెటర్ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా- అనిత.. రాజు వెడ్స్ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. అనిత.. గోల్మాల్, సంతోషం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మథుడు, తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ చేసింది.సినిమాశివాజీ రాజా.. ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి, మావిచిగురు, నిన్నే ప్రేమిస్తా, మురారి, నరసింహనాయుడు, నీ స్నేహం, వర్షం, మొగుడ్స్ పెళ్లాంస్ ఇలా అనేక సినిమాలు చేశాడు. బుల్లితెరపై అమృతం సీరియల్లో యాక్ట్ చేశాడు. అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు.చదవండి: అమ్మను అవమానించారు: మృణాల్ ఠాకూర్ -
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే! ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు. మరాఠి, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామమ్ చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మధ్య తరగతి అమ్మాయినిఅలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో పాటు నాలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ భామ బెంజ్ కారు కొన్నారట. దీని గురించి మృణాల్ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు. అవమానంచిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకకు వెళ్లానని.. అక్కడ తమ బంధువులు కారులో వెళుతూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు. అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇప్పుడు తమ బంధువుల్లో బెంజ్ కారు ఉన్నది తమకు మాత్రమేనని మృణాల్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలుసా..?
బాలీవుడ్ లెజెండ్, 'హీ-మ్యాన్' ధర్మేంద్రకు కేవలం నటనపైనే కాదు, ఆహారం, ఆతిథ్యంపై కూడా మక్కువ ఎక్కువ. ఆయన సినీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పంజాబీ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాజెక్టే ఈ 'గరం ధరం - ధాబా తే ఠేకా'.రెస్టారెంట్ ప్రత్యేకతలు ఇవే.. 'గరం ధరం ధాబా' కేవలం భోజనశాల కాదు, ధర్మేంద్ర అభిమానులకు ఒక ఆలయం లాంటిది. ధర్మేంద్ర వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమా లలోని ముఖ్య ఘట్టాలు, డైలాగ్లు ఈ ధాబాలోని ప్రతి గోడపై కనిపిస్తాయి.సందర్శకులను ఆకర్షించే థీమ్..ఈ రెస్టారెంట్ మొత్తం బాలీవుడ్ థీమ్తో అలంకరించి ఉంటుంది. ధర్మేంద్ర క్లాసిక్ చిత్రాల పోస్టర్లు, అద్భుతమైన డైలాగ్స్ గోడలపై కనిపిస్తాయి.ఐకానిక్ ఆర్ట్ వర్క్స్.. ధర్మేంద్ర వివిధ రూపాల పోర్ట్రెయిట్లు, గ్రాఫిటీ ఆర్ట్ ఈ స్థలాన్ని నింపుతాయి. 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'ట్యాంకీ' సీన్, జై-వీరు ప్రయాణించిన ఐకానిక్ కారు మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.'దేశీ' ఇంటీరియర్ తో..ఇటుక గోడలు, రంగుల దీపాలు, పాతకాలపు హెడ్లైట్స్, చేతిపంపులు వంటివి ధాబాకు దేశీ రూపాన్ని ఇస్తాయి. హర్యానాలోని ముర్తల్లో ప్రారంభించిన మొట్టమొదటి అవుట్లెట్ 1,200 మంది కూర్చునే సామర్థ్యంతో, 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద ధాబాగా ప్రసిద్ధి చెందింది.రుచికరమైన ఆహారం, దేశీ ఫ్లేవర్స్.. ఈ ధాబాలో నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలకు పెద్ద పీట వేస్తారు. రుచిలో రాజీ పడకుండా, ఇంటి భోజనాన్ని తలపించేలా ఇక్కడ వడ్డిస్తారు.మఖానీ పరాఠాలు, దాల్ మఖానీ, గలోటి కబాబ్లు, తందూరి పనీర్ టిక్కా, బిర్యానీ, వివిధ రకాల రుచికరమైన కూరలు ఇక్కడ లభిస్తాయి.ప్రత్యేక మెనూ ఏమిటంటే..?మెనూలో కొన్ని వంటకాలకు ఆయన సినిమాల పేర్లు పెట్టి, 'ధరం జీ స్పెషల్' అనే ప్రత్యేక పేజీని కూడా ఉంచారు. క్విర్కీ డ్రింక్స్ 'వీరూ కీ ఘుట్టీ', 'ప్యారే మోహన్ మసాలా నింబు' వంటి మోక్టైల్స్ ను బంటా అంటే దేశీ స్టైల్ సీసాలలో అందిస్తారు. ధాబా ఆవిర్భావం..ధర్మేంద్ర రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు చాలా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా లతో కలిసి భాగస్వామ్యంలో మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించారు.మొదటి ఔట్లెట్ ప్రారంభమైందిలా..ఫిబ్రవరి 23, 2018 న హర్యానాలోని ప్రసిద్ధ ఫుడ్ స్టాప్ ముర్తల్లో ఈ 'గరం ధరం ధాబా' తన మొదటి బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ముర్తల్ బ్రాంచ్ విజయవంతం అయిన తర్వాత, దీని శాఖలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఘజియాబాద్ అర్థాలా, మోహన్ నగర్), నోయిడా, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి అనేక ప్రదేశాలలో విస్తరించాయి.'హీ-మ్యాన్' రెస్టారెంట్.. 'గరం ధరం' విజయం తర్వాత, ధర్మేంద్ర కర్నాల్లో 'ఫామ్-టు-ఫోర్క్' కాన్సెప్ట్తో 'హీ-మ్యాన్' అనే తన రెండవ రెస్టారెంట్ను కూడా ప్రారంభించారు. ఈ 'గరం ధరం ధాబా' ధర్మేంద్ర అభిమానులకు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దేశీ జీవనశైలి గురించి గుర్తుచేసే ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- సాక్షి స్పెషల్ -
‘రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్ ఎంతంటే?
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం .. తొలిరోజే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ "రాజు వెడ్స్ రాంబాయి" బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుండటం విశేషం."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. -
హీరో అవుతానంటే కమెడియన్ అన్నారు: శివకార్తికేయన్
ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.సినిమాల్లోకి వస్తావా?టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.కామెడీ పాత్రలే సెట్టు!ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు. నేను మర్చిపోయా.. కానీ!నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.చదవండి: నా ముఖం చూస్తేనే లవ్ ఫెయిల్యూర్: ధనుష్ -
లవ్ ఫెయిల్యూర్.. అద్దం ముందు నిలబడి..: ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 'తేరే ఇష్క్ మే' సినిమాతో బాలీవుడ్లో సందడి చేయనున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.లవ్ ఫెయిల్యూర్సినిమా ప్రమోషన్స్లో ధనుష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్ ఫెయిల్యూర్ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్ ఫెయిల్యూర్ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టంఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్ మే సినిమాలో శంకర్ పాత్ర కూడా చాలెంజెస్తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్ ఎల్. రాయే తెరకెక్కించాడు.చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు రాజాసాబ్ డైరెక్టర్ క్షమాపణలు -
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు దర్శకుడు మారుతి క్షమాపణలు
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ హారర్ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.మారుతిపై ట్రోలింగ్సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్ వార్ 2 రిలీజ్ సమయంలో తన రెండు కాలర్స్ పైకి ఎగరేసి చూపించారు.క్షమాపణలు చెప్పిన మారుతిఇప్పుడు మారుతి.. ప్రభాస్ కటౌట్కి కాలర్ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు.నా ఉద్దేశం అది కాదుముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు. Dear Venky…Felt like clarifying this personally.First I sincerely apologise to every fan. It was never my intention to hurt or disrespect anyone. Sometimes in the flow of words things come out differently from what we truly mean and I regret that it was received in the wrong…— Director Maruthi (@DirectorMaruthi) November 24, 2025 చదవండి: అందంగా రెడీ అయిన ఖుష్బూ.. ముఖం కడుక్కోమన్న కమల్ -
23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట
బుల్లితెర జంట అశ్లేష సావంత్ (Ashlesha Savant)- సందీప్ బస్వాన (Sandeep Baswana) పెళ్లిపీటలెక్కారు. వీళ్లది రెండు మూడేళ్ల ప్రేమ కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ప్రేమబంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఈమేరకు తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని బృందావన్ చంద్రోదయ ఆలయం ఈ పెళ్లికి వేదికగా మారింది.ఆ గుడికెళ్లాకే..నవంబర్ 16న ఈ పెళ్లి జరగ్గా ఆలస్యంగా బయటకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. అశ్లేష, నేను ఏప్రిల్లో బృందావనానికి వెళ్లాం. అక్కడి రాధాకృష్ణుడి గుడి మమ్మల్ని కట్టిపడేసింది. ఆ ట్రిప్ తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. 23 ఏళ్లుగా జంటగా ఉన్న మేము అలా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాం. అలా మొదలైందిమా పేరెంట్స్ ఈ శుభవార్త కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. సింపుల్గా మా పెళ్లి జరుపుకున్నాం. కృష్ణుడి గుడిలో వెడ్డింగ్ జరగడం కన్నా ఉత్తమమైనది ఇంకేముంటుంది? అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అశ్లేష వయసు 41 కాగా, సందీప్ వయసు 47. వీరిద్దరూ 2002లో వచ్చిన 'క్యూంకీ సాస్బీ కభీ బహుతీ' సీరియల్లో కలిసి నటించారు. కొన్నిసార్లు షూటింగ్ ఆలస్యమైనప్పుడు అశ్లేష తన ఇల్లు దూరంగా ఉండటంతో సందీప్ ఇంటికి వెళ్లి అక్కడే బస చేసేది. సీరియల్స్అలా వీరిమధ్య బంధం మొదలైంది. చాలా ఏళ్లుగా వీరు కలిసే జీవిస్తున్నారు. ప్రస్తుతం అశ్లేష.. జనక్ సీరియల్ చేస్తోంది. గతంలో అనుపమ సీరియల్లో నెగెటివ్ పాత్ర పోషించింది. సందీప్ చివరగా 'అపొల్లెనా- సప్నోకీ ఉంచి ఉడాన్' సీరియల్లో కనిపించాడు. View this post on Instagram A post shared by 𝑨𝒔𝒉𝒍𝒆𝒔𝒉𝒂 🧿 (@ashleshasavant) చదవండి: బిగ్బాస్9: 12వ వారం నామినేషన్స్లో ఎవరంటే? -
సిక్స్ప్యాక్తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
మంగాత్త, జిల్లా, అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్, మానాడు వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra). కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్కు తయారయ్యారు. ఫుల్ వర్కవుట్స్తో సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధంగా ఉన్నారు. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుందన్నారు. పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాజాగా మహత్ రాఘవేంద్ర ఓ సినిమాలో హీరోగా నటించనున్నారని సమాచారం.ఈ మూవీలో ఆయేనకు జంటగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట! ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని.. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Raghavendra Mahat (@mahatofficial) -
ఐబొమ్మ రవి విలనా? హీరోనా?
పైరసీ అనేది చట్టరిత్యా నేరం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఓ రకంగా అది మరణ శాసనం. అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి. పోలీసులను అభినందించాలి. కానీ ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోలీసులను ద్వేషిస్తూ.. రవికి మద్దతుగా లక్షలాది మంది నిలుస్తున్నారు. ‘రవి మా రాబిన్హుడ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు? ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది గళం విప్పడం వెనక కారణం ఏంటి? స్టార్స్ ఏమంటున్నారు? సామాన్యులు ఏమంటున్నారు?చట్టం ప్రకారం రవి( iBomma Ravi) చేసింది నేరం. కొత్త సినిమాను పైరసీ చేయడమే కాకుండా.. హెచ్డీ ప్రింట్ని సామాన్యులకు ఉచితంగా అందించాడు. అయితే ఇదోదే సంఘ సేవ అయితే కాదు. ఫ్రీగా సినిమా చూపిస్తూనే.. వెనకాల ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్, గేమింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడని పోలిసులు చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిగత డేటాని కూడా దొంగిలించాడని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, సోషల్ మీడియాలో అతనిపై పాజిటివ్ పోస్టులు పెట్టడం అనేది ఆందోళనకరమైన విషయమే. అయితే తాము ఎందుకు రవికి మద్దతు తెలపాల్సి వస్తుందో కూడా కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే..రెండు బలమైన కారణాల వల్లే రవికి సామాన్యుల మద్దతు లభిస్తుందనే విషయం తెలుస్తోంది.సామాన్యుడిని దూరం చేశారు!సినిమా అనేది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఓ వినోదం. కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. సామాన్యులు థియేటర్స్కి రావాలంటే భయపడిపోతున్నారు. టికెట్ల రేట్లను అంతలా పెంచేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలంటే దాదాపు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది. పాప్ కార్న్తో పాటు కూల్డ్రింక్స్ రేట్లు కూడా భారీగానే ఉంటుంది. పైగా భారీ బడ్జెట్ సినిమా అంటూ టికెట్ల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్ షో, ప్రీమియర్ షో అంటూ ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని సామాన్యుడికి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్సైట్ ఉచిత వినోద సాధనంగా మారింది. రూ. 30 ఉండే పాప్ కార్న్ని రూ. 700 వరకు అమ్ముతుంటే సినిమా ఎలా చూస్తామని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.క్వాలిటీ కంటెంట్.. ఓ వ్యక్తి సినిమాకు వచ్చేదే ఎంటర్టైన్మెంట్ కోసం. అన్ని మర్చిపోయి హాయిగా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేయడానికి థియేటర్స్కి వస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెట్టిన డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాయి. రిలీజ్ ముందు వరకు భారీ హైప్ క్రియేట్ చేసుకొని..టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. తీరా థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకుడికి తలపోటు తెప్పించి బయటకు పంపిస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణం అవుతుంది. నాసిరకం సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి థియేటర్స్కి వెళ్లడం కంటే.. ఇంట్లో కూర్చోని ఫోన్లో చూడడం బెటర్ అనే భావనకు ప్రేక్షకులు వచ్చారు. రిలీజైన గంటల్లోనే తన ఫోన్లోకి సినిమా వచ్చేస్తే.. సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాలిసిందేముంది? ఇదే ఇప్పుడు సామాన్యుల దృష్టిలో రవిని హీరోగా చేసింది. సినీ ప్రముఖులు ఏమంటున్నారు?రవి అరెస్ట్ పట్ల సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవిని రాబిన్ హుడ్ అంటూ పొగడడాన్ని ఆర్జీవీ తప్పుబట్టాడు. టికెట్లు పెరిగాయాని పైరసీ తీసి అందరికి చూపిస్తానంటే.. ఈ లెక్కన బంగారం దుకాణాన్ని దోచుకొని అందరికి ఉచితం ఎందుకు పంచట్లేదు? BMW కార్లను కొట్టేసి మురికి వాడల్లో ఉన్నవాళ్లకి ఇవొచ్చు కదా అని లాజిక్తో ప్రశ్నించాడు. అంతేకాదు పైరసీ చేసినవాడిని కాదు పైరసీ చూసిన వాళ్లను కూడా అరెస్ట్ చేయడమే దీనికి సరైన పరిష్కారం అని సలహా ఇచ్చాడు. ఇక సినీ నిర్మాత సి. కల్యాణ్ అయితే పైరసీని చేసిన రవికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎలా హానికరమో, పైరసీ సినిమాలు అదే స్థాయిలో హానికరం అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉటుందని, ఇల్లీగల్గా ముమ్మాటికే తప్పే అని అని దిల్ రాజు అన్నారు. ఏదీ ఉచితంగా రాదు. సినిమాలు ఉచితంగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. వెబ్సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు. పర్సనల్ డాటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు. పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు’’ అని అన్నారు రాజమౌళి. మొత్తానికి సామాన్యులకు రవి హీరోగా కనిపిస్తే.. సినీ స్టార్స్కి మాత్రం విలన్గా కనిస్తాడు. కొంతమంది మాత్రం రవి చేసింది తప్పని అంటూనే.. రేట్ల విషయంలో సినిమా పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
హ్యాపీ బర్త్డే లవర్.. శోభిత లవ్లీ విషెస్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitaya Akkineni) బర్త్డే నేడు (నవంబర్ 23). తన 39వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన అర్ధాంగి, హీరోయిన్ శోభిత (Sobhita Dhulipala) కూడా భర్తకు ఆన్లైన్ వేదికగా బర్త్డే విషెస్ తెలియజేసింది. భర్తను ప్రియుడిగా..హ్యాపీ బర్త్డే లవర్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఇద్దరూ ఓ చోట ఆగిపోగా.. చై ప్రేమగా భార్యకు స్వెటర్ తొడిగాడు. ఇది చూసిన జనాలు భార్యంటే ఎంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చై జర్నీ జోష్తో మొదలైంది. రెండో సినిమా ఏ మాయ చేసావెతో మంచి హిట్టందుకున్నాడు. ఈ మూవీ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లు తిరిగేసరికి పెద్దలను ఒప్పించి సామ్ను పెళ్లి చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్బయట చాలా చలాకీగా, ఖుషీగా కనిపించే ఈ జంట మధ్య రానురానూ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2017లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చై-శోభితతో ప్రేమలో పడ్డాడు. సోషల్ మీడియాలో మొదలైన చాటింగ్ ప్రేమకు దారి తీసింది. అలా మరోసారి పెద్దలను ఒప్పించి చై-శోభిత 2024 డిసెంబర్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సమంత.. ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: సినిమా కొనేందుకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే! -
'ఆమె'పై అనుమానం.. ఓటీటీలో ఈ మలయాళ చిత్రం చూశారా?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం అవిహితమ్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు అన్నది నాటి నానుడైతే అనుమానమొచ్చినా ఆనందమొచ్చినా ఆపుకోలేరన్నది నేటి మాట. అనుమానమొస్తే మాత్రం అది తెలుసుకునేంతవరకు నిద్రపట్టదు కొందరికి. తమకు సగమే తెలిసిన గోరంత విషయాన్ని కొండంత చేసి, అవతలి వాళ్ళలో అనుమానపు బీజాలు నాటే బడా బాబులు చాలామందే ఉంటారు. మరీ ముఖ్యంగా ఇలాంటివాళ్ళ వల్లే పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల గాలివార్తలకు కొదవ లేకుండా పోతుంది. వాళ్ళను దృష్టిలో ఉంచుకుని రాసిన కథే ఈ ‘అవిహితమ్’. వైవిధ్యానికి పెద్ద పీట వేసుకుంటూ తమ ప్రేక్షక పరిధిని ఈ ఓటీటీ కాలంలో పెంచుకుంటూ పోతున్న మలయాళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన మరో మణిమాణిక్యమే ఈ ‘అవిహితమ్’. ఇది నిజంగా హాస్యప్రియమ్ అని చెప్పాలి. చిన్న పాయింట్తో దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకుడిని కదలకుండా కట్టిపడేశారు ఈ సినిమా దర్శకుడు సెన్నా హెగ్డే. ఈ ‘అవిహితమ్’లో అంతలా ఏముందో ఓసారి చూద్దాం. అది ఓ మారుమూల పల్లెటూరు. ప్రకాశన్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్తో మందు పార్టీ ముగించుకుని తన ఇంటికి వెళ్ళబోతుండగా దొంగతనంగా సన్నిహితంగా ఉన్న ఓ జంటను వడ్రంగి మాధవన్ ఇంటి పరిసరాల్లో చూసి అవాక్కవుతాడు. ఆ జంట ప్రతి రోజూ ఓ సమయంలో కలవడంతో పాటు ఆ జంటలో మాధవన్ వదిన నిర్మల ఉందన్న విషయాన్ని గుర్తుపట్టి, ఇదే విషయాన్ని ఊళ్ళో కాస్త పెద్ద తరహాగా వ్యవహరించే టైలర్ వేణన్నకు చెబుతాడు ప్రకాశన్. మాధవన్కు ఈ విషయాన్ని ఆ వేణన్న చేరవేస్తాడు. మాధవన్ ఈ విషయాన్ని తన తండ్రికి, అలాగే తన సోదరుడు ముకుందన్కు చెబుతాడు. అలా మెల్లమెల్లగా ఊరంతా ఈ విషయం పాకి పోతుంది. ఆ జంటను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఊరంతా ఏకమై ఓ పెద్ద ఆపరేషనే చేపడతారు. మరి... ఈ ఆపరేషన్లో ఆ జంట దొరికిపోతుందా? దొరికిన తరువాత మాధవన్ కుటుంబంతో పాటు ఊరి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని ‘అవిహితమ్’లోనే చూడాలి. ఈ సినిమా మొత్తం ఓ అనుమానంతో ప్రారంభమైతే చూసే ప్రేక్షకులకు కూడా ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలనే తపన అంతకంతకూ పెరుగుతుంది. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ ‘అవిహితమ్’ హాస్యప్రియమ్ కాబట్టి ఇది ప్రేక్షకప్రియమ్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
డబ్బుల్లేవన్న ఓటీటీ.. కట్ చేస్తే జాతీయ అవార్డులు!
12th ఫెయిల్ (12th Fail Movie).. అందరినీ కంటతడి పెట్టించిన సినిమా. అందరి మనసులు గెల్చుకున్న మూవీ. కానీ ఈ సినిమా రిలీజ్కు ముందు దీన్ని కొనేందుకు ఓటీటీలు వెనకడుగు వేశాయంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra). ఈయన ఇప్పటితరానికి 12th ఫెయిల్ డైరెక్టర్గా తెలుసు.. కానీ ఇతడు పరిండా, 1942:ఎ లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వినోద్ చోప్రా తాజాగా 56వ ఇఫీ(ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకకు హాజరయ్యాడు. థియేటర్లో రిలీజ్ చేయొద్దన్నారు'అన్స్క్రిప్ట్డ్: ద ఆర్ట్ అండ్ ఎమోషన్ ఆఫ్ ఫిలింమేకింగ్' పేరిట జరిగిన చర్చలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 12th ఫెయిల్ తీసినప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాదన్నారు. నా భార్యతో సహా అందరూ దీన్ని థియేటర్లో రిలీజ్ చేయొద్దన్నారు. ఇలాంటి సినిమాను ఎవరూ వెళ్లి చూడరని చెప్పారు. ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం.. జనాలు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం నాకుందన్నాను.దర్శకుడు విధు వినోద్ చోప్రాడబ్బుల్లేవన్న ఓటీటీనా నమ్మకం నిజమైంది. థియేటర్లలో ఏడు నెలలపాటు ఆడింది. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే సినిమా చూశాక తమ దగ్గర కొనేంత డబ్బు లేదని చెప్పింది. మీకు సినిమా అర్థం కాలేదేమో అన్నాను. అందుకో వ్యక్తి.. సినిమాలో చూపించిన మనుషులు నిజ జీవితంలో ఉండరు అన్నాడు. అలా వారు మా సినిమాను కొనేందుకు ఇష్టపడలేదు అని గుర్తు చేసుకున్నాడు. తర్వాత సినిమా బ్లాక్బస్టర్ హిట్టవడం జియో హాట్స్టార్లో రిలీజవడం చకచకా జరిగిపోయాయి. జాతీయ అవార్డులు మొన్నటి మొన్న (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో) రెండు జాతీయ అవార్డులు సైతం సాధించింది. 12th ఫెయిల్ మూవీ విషయానికి వస్తే ఇందులో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించగా మేధా శంకర్ హీరోయిన్గా నటించింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ- ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషిల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2023 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: చెత్త అమ్ముకునేవాడిని..షాప్ అమ్ముకునే దుస్థితి: జబర్దస్త్ కమెడియన్ -
ఫ్యామిలీ మ్యాన్-3.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ఓటీటీ వెబ్ సిరీస్లతో ‘ఫ్యామిలీ మ్యాన్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి భాగం 2019లో రిలీజై..బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన సిరీస్గా రికార్డుకెక్కింది. 2021లో రెండో సీజన్ రాగా..అది కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మూడో సీజన్(The Family Man 3 ) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (చదవండి: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’ రివ్యూ)ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్లో పాకిస్థాన్-మయన్మార్తో కలిసి భారత్పై చైనా చేస్తున్న కుట్రలు, భారత్ -మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులను చూపించారు. సీజన్ 3 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ రిలీజ్ తర్వాత మనోజ్ బాజ్పేయి తో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన వారి పారితోషికంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎవరెంత పుచ్చుకున్నరనేదానిపై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీజన్ 3కి గాను శ్రీకాంత్ తివారి పాత్ర పోషించిన మనోజ్ బాజ్పేయి రూ. 20-22కోట్ల మేరకు పారితోషికం పుచ్చుకున్నారట. ఇక ఈ సిరీస్లో విలన్ పాత్ర చేసిన జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు తీసుకున్నాడట. మనోజ్ బాజ్పేయికి జోడీగా నటించిన ప్రియమణి ఈ సీజన్కి రూ. 7 కోట్ల వరకు అదించినట్లు సమాచారం.మీరా పాత్ర పోషించిన నిమ్రత్ కౌర్ కూడా రూ. 8-9 కోట్ల వరకు తీసుకున్నారట. నిడివి తక్కువే అయినప్పటికీ దర్శన్ కుమార్ కూడా దాదాపు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కీలక పాత్రలో నటించిన సీనియర్ నటి సీమా బిస్వాస్, విపిన్ శర్మ రూ. 1-2 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెమ్యునరేషన్లకు దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. -
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా, చైతన్య జొన్నలగడ్డ కీ రోల్ చేసిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్లో సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శనివారం చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బబుల్గమ్, హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించాను కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన వెంకన్న పాత్రకు, సినిమాకూ మంచి స్పందన లభిస్తుండటం హ్యాపీ. నేను లీడ్ రోల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా పనుల్లో ఉన్న నాకు దివ్యాంగుడు వెంకన్న రోల్ చేసే చాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పి, తన పేరు ఉపయోగించుకోవాలనుకోలేదు. ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే సిద్ధును మా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు పిలవడం లేదు.‘రాజు వెడ్స్ రాంబాయి’లో నా నటనను మెచ్చుకుంటూ సిద్ధు మెసేజ్ చేశాడు. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. పవన్ డైరెక్షన్లోనే రాజశేఖర్గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో నటించాను’’ అన్నారు. అవకాశం వస్తే సిద్ధుతో కలిసి నటిస్తా’ అని అన్నారు. . -
ఇఫీలో అమరన్ సినిమా
గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్హాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్కు గౌరవ మైలురాయి అయింది.ఇఫీలో అమరన్భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.మేజర్ ముకుంద్ జీవితకథఅశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్కు పంపడం గమనార్హం.చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? -
‘తెలంగాణ రైజింగ్ 2047’లో చిత్ర పరిశ్రమది కీలకపాత్ర : భట్టి విక్రమార్క
‘1970లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను స్థాపించడం ఒక అద్భుతం’ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున ఆహ్వానం మేరకు శనివారం ఆయన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుని గుర్తుచేసుకున్నారు. ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించిన నాటి నుంచే సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్మార్క్లలో ఒకటిగా ఎదిగింది. అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన ‘రోల్ నం.52’ను నేను చూశాను. ఎంతో అర్థవంతమైన కథతో రూపొందిన ఆ సినిమా అందరి హృదయాలను హత్తుకుంది’’ అంటూ ప్రశంసలు కురిపించారు.ఇక తెలంగాణ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ దార్శనికతను ఆయన హైలైట్ చేస్తూ, “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతును మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. అన్నపూర్ణ కళాశాల నుండి వెలువడుతున్న అసాధారణ ప్రతిభ గురించి అక్కినేని నాగార్జున స్వయంగా మాట్లాడారని, అది తన సందర్శనకు ప్రేరణనిచ్చిందని ఆయన అన్నారు. ‘సినిమా రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే మేటిగా అభివృద్ధి చేయడంలో తనతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని నాగార్జున అన్నారు. -
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
దీపావళికి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్ను స్క్రీన్షాట్ తీసిన ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్బ్యాక్ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్మెంట్ -
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా?
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ (Mohanlal) బిజీ యాక్టర్. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. ఈ ఏడాదైతే ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాల్లో కనిపించాడు (ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, కన్నప్ప, హృదయపూర్వం). ప్రస్తుతం వృషభ, దృశ్యం 3, పేట్రియాట్, రామ్ వంటి పలు సినిమాలు చేస్తున్నాడు.హీరో కోసం 80 ఏళ్ల వృద్ధురాలుదృశ్యం 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళలోని అయిమురిలో ఓ చర్చి దగ్గర ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ విషయం తెలిసి ఓ 80 ఏళ్ల వృద్దురాలు అక్కడికి చేరింది. కొత్తగా కొన్న చీర కట్టుకుని మనవడు శ్యామ్ను వెంటేసుకుని లొకేషన్లో అడుగుపెట్టింది. కానీ జనం రద్దీ అధికంగా ఉండటంతో లోనికి ఎవరినీ అనుమతించలేదు. అందరూ దూరం నుంచే మోహన్లాల్ను చూసి సంతోషించారు. అయినా లీలామణి అమ్మకు తృప్తి తీరలేదు.మహిళా అభిమానిని కలిసిన మోహన్లాల్చూశాకే తిరిగెళ్తా!ఆయన్ను కచ్చితంగా దగ్గరినుంచి చూసి తీరాల్సిందేనని భీష్మించుకుంది. ఆయన్ను కలిసేవరకు తిరిగి వెళ్లే ప్రసక్తేలేదని మొండిగా కూర్చుంది. ఈ విషయం హీరో చెవిన పడింది. సాయంత్రం ఐదు గంటలకు లీలామణి అమ్మను కలిశాడు. తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఇంట్లో అందరూ బాగున్నారా? అని యోగక్షేమాలు అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ నెమ్మదిగా ఓ కోరిక కోరింది. ముట్టుకోవాలని కోరికనేను మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? అని అడిగింది. అందుకు మోహన్లాల్ నవ్వుతో అంగీకారం తెలుపుతూ ఆమెను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. హీరో కోసం పాట కూడా పాడాలనుకుంది, కానీ అక్కడ అంత సమయం దొరకలేదని చెప్తోంది. మోహన్లాల్ సినిమా వస్తుందంటే చాలు టీవీకి అతుక్కుపోతుంది లీలామణి. ఆయన నటించిన వాటిలో ఆరం తంపురన్ మూవీ తనకెంతో ఇష్టమని చెప్తోంది. చివరగా తన పిల్లలతో కలిసి తుడరుమ్ సినిమా చూశానంది. దృశ్యం 1, 2 సినిమాలను చూశానని, మూడో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నానంది.చదవండి: దర్శన్ ఎలాంటివాడో మీఅందరికీ తెలుసు..: హీరో భార్య -
మీ ప్రేమ చూస్తుంటే కళ్లలో నీళ్లు..: దర్శన్ భార్య
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan) కటకటాలపాలయ్యాడు. ప్రియురాలి కోసం దర్శన్ ఊచలు లెక్కపెడుతుంటే.. ఆయన నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ భార్య కష్టపడుతోంది. ప్రకాశ్ వీర్ దర్శకత్వం వహించిన డెవిల్ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయిపోయింది. వచ్చే నెల డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.నోట మాట రాలేదుదీంతో సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ తరపున అతడి భార్య విజయలక్ష్మి మీడియా ముందుకు వచ్చింది. ఇటీవలే ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైంది. తాజాగా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేనెప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదు. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో జనం ముందుకు రావడం.. వాళ్లందరూ డి బాస్ అంటూ నినాదాలు చేయడం చూసి చాలా సంతోషించాను. నిర్మాతలే అన్నదాతలువాళ్లు చాలాసేపటివరకు అలా నినాదాలు చేస్తూ నన్ను మాట్లాడనివ్వలేదు. అభిమానుల ప్రేమాభిమానాలకు నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓపక్క సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంటే దర్శన్ డెవిల్ సినిమా రిలీజ్ గురించే ఆందోళన చెందాడు. నిర్మాతలే మన అన్నదాతలు. నా వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదు అని చెప్పాడు. అభిమానులు కురిపించిన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీ అందర్నీ ఆయన సెలబ్రిటీలుగా అభివర్ణించాడు.అభిమానులంటే ప్రేమఅభిమానులు ఆయన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? దర్శన్ మంచి మనిషి అని వాళ్లకు బాగా తెలుసు. అభిమానులకు ఓ విషయం చెప్పమన్నాడు. తన గురించి కంగారు పడొద్దని, తన సినిమాలకు సపోర్ట్ చేయమని కోరాడు. తనెంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా ఆటోలపై దర్శన్ అనే స్టిక్కర్ కనిపిస్తే వెంటనే ఆటోవాలాను కలిసి థాంక్యూ చెప్తాడు. అభిమానులంటే ఆయనకు అంతిష్టం. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ఇప్పటికీ వృద్ధాశ్రమంలో ఉన్న ఓ కళాకారుడి బాగోగులను దర్శనే చూసుకుంటున్నాడు. నేను తన సినిమా సెట్స్కు పెద్దగా వెళ్లేదాన్ని కాదు. రాజస్తాన్, బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ అయినప్పుడు మాత్రం నేను, మా కొడుకు వినిశ్ తనకు తోడుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా, మానసికంగా అలిసిపోయేవాడు. నడుమునొప్పి, వెన్ను నొప్పి తట్టుకోలేక పెయిన్కిల్లర్ ఇంజక్షన్స్ తీసుకుని డెవిల్ సెట్కు వెళ్లేవాడు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా దెబ్బలు తగిలించుకున్నాడు. హీరోయిన్కు సలహాఅప్పుడు దర్శకనిర్మాతలు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. హీరోయిన్ రచనతో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేనున్నానని ఇబ్బందిగా ఫీలవద్దని రచనతో అన్నాను. ఇకపోతే నేను ఇంట్లోనే ఉండి సింపుల్గా బతకడానికే ఇష్టపడతాను. కానీ కొన్ని నెలలుగా మా జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయి. నేను బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.కన్నీళ్లు దిగమింగుకునిఓ పక్క పని, మరోపక్క పోలీసులు, లాయర్స్ను కలవడం, నా కొడుకును చూసుకోవడం.. ఇలా అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తోంది. దర్శన్కు, ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎన్నోసార్లు ఏడ్చాను. ఆ బాధ దర్శన్ ఇట్టే కనిపెట్టేస్తాడు. అందుకే తనను కలవడానికి వెళ్లినప్పుడు బలవంతంగా చిరునవ్వు పులుముకునేదాన్ని. అంతా బానే ఉందని అబద్ధాలు చెప్తుంటాను అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: ఏయ్, ఏం పొడిచావ్? సీరియల్ స్టార్.. ఏడుపొక్కటే వచ్చంటూ గలీజ్ పంచాయితీ


