breaking news
Cinema News
-
'బిగ్బాస్'లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ 'వినాయకుడు'
తెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. 'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టేశాడు. ఇతడి అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి? -
శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
ప్రతిసారి బిగ్బాస్ షోలోకి కమెడియన్స్ వస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాలో పొట్టి నరేశ్ అలియాస్ కమెడియన్ నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత పదేళ్లుగా పలు షోలతో అలరిస్తున్న ఇతడు.. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బిగ్బాస్ 10లోకి 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. -
బిగ్బాస్ 10లోకి 'టెంపర్' విలన్
ఈసారి బిగ్బాస్లోకి టాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. తన లుక్స్తోనే అందరినీ భయపెట్టే 'టెంపర్' వంశీ.. 9వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు. చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి? -
‘బిగ్బాస్’లోకి ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఎవరీ సీరియల్ బ్యూటీ!
బిగ్బాస్ 10వ సీజన్లో 6వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన చైత్ర రాయ్ స్వతహాగా కన్నడ. సొంత భాషలోనే తొలుత నటిగా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.చైత్ర కేవలం సీరియళ్లకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో ఓ సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాప పుట్టి కేవలం 10 నెలల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టేసింది. మళ్లీ తనదైన ప్రతిభ చూపించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటోంది.ప్రతి సీజన్లోనూ సీరియల్స్ నుంచి పాపులర్ నటీనటులను బిగ్బాస్ హౌస్లోకి తీసుకురావడం ఓ ఆనవాయితీ. ఈసారి చైత్ర రాయ్ని ఆ అవకాశం వరించింది. గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. 10 నెలల పాపని వదిలేసి వెళ్తున్న ఈమె షోలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి? -
Bigg Boss 10: తొలి కంటెస్టెంట్గా సీరియల్ బ్యూటీ!
ప్రతిసారి బిగ్బాస్లోకి సీరియల్ బ్యూటీస్ కచ్చితంగా వస్తారు. అలా ఈసారి ఆ కోటాలో వచ్చిన ముద్దుగుమ్మ దేబ్జానీ మోదక్. బిగ్బాస్ 10లోకి ఈమె కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఇప్పటికే సీరియల్స్, షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.సీరియల్స్తో అలరించిన ఈమె.. బిగ్బాస్తో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి? సీరియల్ ప్రేక్షకులు, లేడీ అభిమానుల నుంచి ఈమెకు మద్ధతు లభించే అవకాశముంది. టాస్కుల్లో ఫెర్ఫార్మెన్స్ బాగుంటే టాప్ కంటెండర్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. -
బిగ్బాస్ 10: హాట్ టాపిక్గా నాగార్జున రెమ్యునరేషన్
బిగ్బాస్ షో అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి గుర్తొచ్చే ఏకైన పేరు ‘కింగ్’ నాగార్జున. తెలుగులో ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తవ్వగా..మొదటి రెండు తప్ప మిగిలిన సీజన్లన్నింటికీ ఆయనే హోస్ట్గా చేశాడు. తెరపై స్టైలీష్ ఎంట్రీ ఇస్తూనే తనదైన మాటతీరుతో దారితప్పుతున్న ఆటను గాడిలో పెడుతూ..బిగ్బాస్ షోని విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే సీజన్ 10కి కొత్త హోస్ట్ వస్తాడని ప్రచారం జరిగినప్పటికీ..మళ్లీ నాగార్జుననే బరిలోకి దింపారు నిర్వాహకులు. దీని కోసం భారీగా పారితోషికం అందించారట. ఇప్పుడు నాగార్జున రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.సీజన్ 3కి రూ. 5 కోట్లు పారితోషికంగా తీసుకున్న నాగార్జున.. సీజన్ 9కి వచ్చేసరికి రూ. 35 కోట్ల వరకు తీసుకున్నాడట. తెలుగు బిగ్బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు నాగార్జునకే దక్కింది. ఇక సీజన్ 10కి వచ్చేసరికి పారితోషికం మరింత పెరిగినట్లు సమాచారం. బిగ్బాస్ 10 కోసం నాగార్జునకి రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులోనే స్పెషల్ ప్రోమోలు, ప్రమోషనల్ షూట్స్ కూడా ఉన్నాయట. దాదాపు 15 వారాల పాటు బిగ్బాస్ షో కొనసాగుతుంది. ఫినాలతో కలిపి మొత్తం 30 రోజుల పాటు నాగార్జున షోలో కనిపిస్తాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పారితోషికం విషయం నిజమే అయితే.. ఒక్కో రోజు రూ. కోటికిపైనే తీసుకుంటున్నల్లు లెక్క. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. అసలు పారితోషికం ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేరు.కాబట్టి ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. -
పందెం అంటే పోటీ కాదు.. తెలివి ‘మండాడి’ ట్రైలర్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. -
తెలుగులోకి మలయాళ హిట్ సినిమా.. ఫస్ట్లుక్ రిలీజ్
టీచర్స్ డే సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ ఫస్ట్లుక్ విడుదలైంది. జాతీయ అవార్డు గ్రహీత, ఉపాధ్యాయురాలు మారం పవిత్ర చేతుల మీదుగా ఈ పోస్టర్ను లాంచ్ చేశారు. నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహిస్తున్నారు. జయంత్ కీలక పాత్రలో నటిస్తుండగా.. తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్ స్కూల్ టీచర్గా కనిపించనున్నారు. మలయాళ హిట్ ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’కు ఇది రీమేక్. పాఠశాల సమస్యలు, విద్యావ్యవస్థతో పాటు కుటుంబ భావోద్వేగాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఈ సందర్భంగా జయంత్ మాట్లాడుతూ– ‘ ఇదో కొత్త తరహ చిత్రం. మనం రోజు స్కూల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థ గురించి మా సినిమాలో చెప్పటం జరిగింది’’ అన్నారు. దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ– ‘నేను ఈ సినిమా చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నా గత చిత్రం ‘లతా భగవాన్ ఖరే’, చిత్రానికి దేశవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చాయి. వాటితో పాటు ఫిలింఫేర్, నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాను. జయంత్ను హీరోగా పెట్టి నేను చేసిన ‘జయంత్ అండ్ జింగోపెన్’ మలయాళ సినిమా ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ అనే చిత్రం రీమేక్. మలయాళంలో ఈ చిత్రం 111 రోజలు ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండటంతో అంత పెద్ద విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు. -
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ సిద్ధమైంది. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన తెలుగు సిరీస్ ‘పంచనామా’ ఉదయ భాను ప్రొడక్షన్స్ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ రోజు( ఆదివారం) ట్రైలర్ విడుదలైంది.సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ అయిన జీ5లో స్రీమింగ్ కానుంది. ఇదో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో భరత్ పోలీస్ అధికారిగా కనిపించారు. ప్రవీణ్, ఆది, జోసఫ్ అనే ముగ్గురు ఎందుకు చెనిపోయారు.? కొద్ది రోజుల తరువాత దొరికిన చేతులు ఎవరివి? దొరికేలా ఎవరు చేశారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇందులో శివాజీ రాజా, మేథారెడ్డి, రూప లక్ష్మి, శ్రీజ తదితరులు నటిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్బాస్పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో -
బిగ్బాస్పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో
బిగ్బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో..ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాంచింగ్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోలో నాగార్జున ఓ మ్యాజిక్ కీని చూపిస్తూ ఇది ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ల తలరాతను మార్చుతుంది అని చెప్పడం ఈ సీజన్పై అంచానాలు పెంచేస్తోంది. ప్రోమో చూస్తుంటే గత సీజన్లకు మించి ఈసారి లాంచింగ్ ఎపిసోడ్ను గ్రాండ్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచుతోంది. బిగ్బాస్లో హీరో కార్తీక్ సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది.నాగార్జునకు సైతం షాక్!బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన హోస్ట్ నాగార్జున.. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తాను ఇలాంటి కాన్సెప్ట్ను చూడలేదని బిగ్బాస్తో చెప్పడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈసారి హౌస్లో ఏదో కొత్తగా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.ఒకేసారి మూడు భాషల్లో..మరోవైపు తెలుగు బిగ్బాస్తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్బాస్ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్లాల్.. నాగార్జునతో వర్చువల్గా భేటీ కావడం కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి కొత్త కంటెస్టెంట్లు, కొత్త కాన్సెప్ట్లు, గ్రాండ్ లాంచింగ్తో బిగ్బాస్ సీజన్ 10పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి బిగ్బాస్ హౌస్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
‘అంతా రాములోరు చూస్కుంటారు‘ గ్లింప్స్ విడుదల
పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రం బృందం గ్లింప్స్ని విడుదల చేసింది. వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సినిమాలో సంగీత్ శోభన్ మారుతి అనే గోదారి కుర్రాడులా కనిపిస్తున్నాడు. అనస్వర రాజన్ ‘శిరీష’గా వెండి తెరను పలకరించనుంది. -
Bigg Boss 10 Live Updates: బిగ్బాస్లోకి వచ్చిన కంటెస్టెట్లు వీళ్లే..
పదహారో కంటెస్టెంట్గా నిహర్ ముఖేశ్ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్బాస్ హౌస్లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్ వచ్చేశాడు. 16వ కంటెస్టెంట్గా లోపల అడుగుపెట్టేశాడు. ‘రయ్ రయ్ రారా’ సాంగ్కు డ్యాన్స్ వేస్తూ పదహారో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిహర్ ముఖేశ్. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చా. 10 సంవత్సరాల కిందట యాక్టర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సినిమాలో హీరో వరకు వచ్చా. యాక్టర్గా ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలా బిగ్బాస్లో కూడా నాకో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకుంటా. తెలుగు నాకు మాట్లాడటం రాదు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలుగు నా నాలుక మీద కాదు గుండెలో ఉంటుంది‘ అని తెలిపాడు.ముఖేశ్ విషయానికి వస్తే..రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుందిపదిహేనో కంటెస్టెంట్గా రోహిత్పదిహేనో కంటెస్టెంట్గా ఎంపిక చేసేందుకు బిందు మాధవి వచ్చారు. రోహిత్ని ఎంపిక చేశారు. నాగార్జున రోహిత్కి టాస్క్ ఇచ్చారు. గ్లాస్ తీసుకెళ్లి హౌస్లో ఉన్నవారిలో ఒకరి మీద వాటర్ వేయమన్నారు. అయితే ఇలా చేయలేనని రోహిత్ చెప్పాడు. అనంతరం వైట్ గోల్డ్ మెడల్ తీసుకుని హౌస్లోకి వెళ్లాడు. పద్నాలుగో కంటెస్టెంట్గా వర్షిణివిశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని ‘పుట్టా ముద్దుగా’. పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్లోకి అడుగెపెట్టింది యాంకర్ వర్షిణి. వర్షిణి విషయానికి వస్తే..వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్బాస్లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?పదమూడో కంటెస్టెంట్గా కృష్ణుడుతెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ‘నాలో చాలా యాంగిల్స్ అన్నీ హౌస్లో చూపిస్తా’ అని కృష్ణుడు తెలిపారు. కృష్ణుడు విషయానికి వస్తే.. అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?పన్నెండో కంటెస్టెంట్గా చరణ్ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బిగ్బాస్ హౌస్కి ఎంపికయ్యాడు చరణ్. ‘నేను ఉండే విధానమే నా బలం. చుట్టు ఉన్నవాళ్లని నవ్విస్తా. తండ్రి చిరంజీవిగారికి, మీకు పెద్ద అభిమాని‘ అని చరణ్ నాగార్జునతో తెలిపారు. నాగార్జున లైవ్లో తన తండ్రికి నమస్కారాలు తెలిపారు. వైట్ గోల్డ్ మెడల్ అందుకున్న అనంతరం చరణ్ హౌస్లోకి వెళ్లాడు. ఎవరీ చరణ్..ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.పదకొండో కంటెస్టెంట్గా జబర్దస్త్ నరేశ్పంజా సినిమాలోని భూమికి జానడు సాంగ్కి డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్ హౌస్లోకి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గూగుల్లో నరేశ్ అని వెతికితే బిగ్బాస్ నరేశ్ వచ్చేలా కష్టపడతానని తెలిపాడు. నరేశ్ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.పదో కంటెస్టెట్గా శ్రుష్టిమరో కంటెస్టెట్ని ఎంపిక చేసేందుకు జ్యూరీ ద్వారా ఎంపిక చేసేందుకు శ్రీముఖి వచ్చారు. శ్రుష్టిని ఎంపిక చేశారు. ఈమెకు సైతం నాగార్జున వైట్ గోల్డ్ మెడల్ అందించారు. తొమ్మిదో కంటెస్టెంట్గా టెంపర్ వంశీటెంపర్ సినిమాలో విలన్గా నటించి ఆకట్టుకున్న వంశీ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లాడు. తన సినీ కష్టాలను తెలియజేసేలా ఏవీని రెడీ చేసుకొని స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరంజీవి మీద ఉన్న ఇష్టం.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కాలేజీ పుస్తకాలు చదవలేదు. కానీ చిరంజీవి ఉన్న సినిమా పుస్తకాల్ని ఒక్కటీ విడిచిపెట్టలేదు’ అని వంశీ చెప్పారు. సినిమా కష్టాల కోసం వివరించారు. కట్టేకాలేంత వరకు సినిమాలు చేస్తూ ఉంటానన్నారు. దాదాపు 50 సినిమాలు చేశానని చెప్పారు. తర్వాత పలు పాటలకు డ్యాన్స్ చేశారు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు.చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?ఎనిమిదో కంటెస్టెంట్గా షాలినీఎనిమిదో కంటెస్టెంట్గా కామనర్స్ నుంచి ఒకరి పంపే అవకాశం జ్యూరీకి ఇచ్చాడు నాగార్జున. దీంతో నవదీప్ .. దీపక్, హేమంత్, షాలినీలను పిలిచాడు. వీళ్లలో నుంచి చివరగా షాలినీని సెలెక్ట్ చేసినట్లు నవదీప్ ప్రకటించాడు. నవదీప్ సార్ నన్ను ఎంపిక చేసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా అని ఆశ్చర్చపోయానని షాలనీ తెలిపారు.ఏడో కంటెస్టెంట్గా జబర్దస్త్ రాంప్రసాద్రాంప్రసాద్కు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లను చూసి వాళ్లు ఎం మాట్లాడుకుంటున్నారో మాకు లిప్ మూమెంట్ చెప్పాలని నాగార్జున అడిగారు. ఎలాగైనా మమ్మల్ని నవ్వించాలన్నారు. రాంప్రసాద్ నవ్వించే ప్రయత్నం చేశారు. రాంప్రసాద్ విషయానికొస్తే ..ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్కి రైటర్గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్తో కలిసిపోయాడు. ఇతడి టీమ్లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.ఆరో కంటెస్టెంట్గా చైత్ర రాయ్ అష్టాచెమ్మా సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు పేరు చైత్రరాయ్. భర్త పేరు ప్రశన్న శెట్టి. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో అమ్మగా, అక్కగా, భార్యగా పాత్రలు పోషిస్తున్నాను. ఒక నెగిటివ్ కామెంట్ వల్ల చాలా బరువు తగ్గారు . చిన్న బేబిని వదిలి బిగ్బాస్ హౌస్కి వచ్చినట్లు తెలిపారు. చైత్ర విషయానికొస్తే.. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.బిగ్బాస్ గ్రాండ్ లాంచ్లో తమిళ యాక్టర్స్ సూర్య, కార్తీ సందడి చేశారు. సర్దార్2 మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్లు బిగ్బాస్ షోకి వచ్చారు. ఐదో కంటెస్టెంట్గా అమన్బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్లోకి వెళ్లాడు. సీక్రెట్ టాస్క్హోస్ట్ నాగార్జున అమన్కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఒక రెడ్ బాక్స్ ఇచ్చి.. అందులో రెడ్ డాట్ ఉందని, హౌస్లోకి వెళ్లాక..వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికైనా ఇది తెలియకుండా పెట్లాలని అమన్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అమన్ కోసం ఒక స్వీట్ మెమోరీ అంటూ చిరిగిపోయిన టీషర్టును నాగార్జున అందించారు. వచ్చే శనివారానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలన్నారు. ఓ గోల్డ్ మెడల్ అందిచారు. నాలుగో కంటెస్టెంట్గా సుధీర్ రెడ్డినాలుగో నాలుగో కంటెస్టెంట్గా సుదీర్ వచ్చారు. సోషల్మీడియాలో ఇంటర్వ్యూ చేస్తూ అందరికి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. తనకు ఇంటర్వ్యూ చేయమని నాగార్జున కోరగా..‘నాకు మీలో బాగా నచ్చేది. బిజినెస్ మ్యాన్గా, హీరోగా బాగా రాణిస్తున్నారు. లైఫ్లో ఎదైనా వెలితి ఉందా?’ అని అడగ్గా టైమ్ సరిపోవడం లేదని నాగార్జున అన్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్బాస్ 10లో ఓ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? మూడో కంటెస్టెంట్గా సింగర్ ఝాన్సీ గోల్డేన్ టికెట్ సాధించి సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్గా వచ్చారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్తో గెలిచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగున్ రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగూన్ ఎంట్రీ ఇచ్చాడు. ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే శనివారానికి హౌస్కి వచ్చేసరికి కనీసం ముగ్గిరికి హౌస్లో దెయ్యం ఉందని నమ్మించాలి అని నాగార్జున అతనికి టాస్క్ ఇచ్చారు. త్రిగున్ నేపథ్యం ఇదే.. తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్బాస్లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.మొదటి కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్‘గిరిగిర గింగిరానివే’ పాటకి చిందులు వేస్తూ మొదటి కంటెస్టెంట్గా దేబ్జానీ మోదక్ వచ్చారు. ఎవరీ దేబ్జానీ మోదక్ కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.ఓ మ్యాజిక్ కీ ని నాగర్జున చూపించారు దాని కథ తెలుసుకునేందుకు బిగ్బాస్ హౌస్లోకి వెళ్లారు. హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జునకు బిగ్బాస్ స్వాగతం పలికారు. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు.బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్బాస్ సీజన్ 10’ ఎట్టకేలకు గ్రాండ్గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. పాటకు స్టెప్పులేస్తూ అలరించిన ఆయన.. ఈ సీజన్లో ఆట మరింత ఆసక్తికరంగా, సవాళ్లతో సాగబోతుందనే ఆయన చెప్పిన మాటలు, సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అసలు సందడి మొదలైంది. బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షో ప్రారంభం అయితే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్తో అలరించడానికి రేడీ అయింది. ఈ రోజు(సెప్టెంబర్ 6) బిగ్బాస్ 10 ప్రారంభం కానుంది. బిగ్బాస్ 10 ప్రోమో వచ్చేసిందిబిగ్బాస్ సీజన్ 10 మరికాసేపట్లో(సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు.గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా లాంచింగ్ గ్రాండ్గా ఉండబోతున్నట్లు పోమో చూస్తే అర్ధమవుతుంది. రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు.అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది. ఈ మూడు భాషల బిగ్బాస్ హోస్టులు(విజయ్ సేతుపతి, మోహన్ లాల్, సుదీప్) నాగార్జునతో వర్చువల్గా భేటీ అయ్యారు.‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో సాయత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు సీజన్ 10పై మరింత ఆసక్తిని పెంచేశాయి. పదో సీజన్ కు తగ్గట్టుగా దశావతారం అనే కాన్సెప్ట్తో సరికొత్త సర్ప్రైజ్లు ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ప్లాన్ చేశారట. మరి షో ఎలా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ ఎవరనేది మరికాసేపట్లో తెలిసిపోతుంది. అయితే షో ప్రారంభానికి ముందే నెట్టింట సీజన్ 10పై భారీ చర్చ జరుగుతోంది.తెలుగు బుల్లితెరపై ఇతర భాషల ‘బిగ్ బాస్’ హోస్ట్స్ సందడిబిగ్గాస్ 10 లాంచింగ్ని మరింత గ్రాండ్గా ప్లాన్ చేశారట. ఈ సారి అనేక సర్ప్రైజ్లతో లాంచింగ్ ఎపిసోడ్ని రూపొందించారట.అందులో భాగంగా ఇతర భాషల బిగ్బాస్ హోస్టులంతా తెలుగు బిగ్బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో వర్చువల్గా భేటీ అవుతారట. ఈ సారి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది.గెస్టులుగా కార్తీ, ఆనంద్ దేవరకొండబిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్కి తమిళ హీరో విజయ్తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారట. ఎపిక్ సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్ దేవరకొండ స్టేజ్పైకి రాబోతున్నారు. ఇక సర్దార్ 2 మూవీ ప్రమోషన్స్ కోసం కార్తీ కూడా బిగ్బాస్ షోకి వచ్చారట.బిగ్బాస్ 10లోకి 16 మందిఈ సారి హౌస్లోకి తొలి రోజే మొత్తం 16 మందిని పంపించబోతున్నారట. వారిలో సామాన్యుల కోటా నుంచి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది ఉన్నారు.హౌస్లోకి వెళ్లే సెలెబ్రెటీలు వీళ్లే..?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం బిగ్బాస్ 10లోకి వెళ్లే సెలెబ్రెటీల లిస్ట్ ఇదే. 1) ఆటో రాంప్రసాద్2) టెంపర్ వంశీ3) దేబ్జానీ మోదక్4)యాంకర్ వర్షిణి5) ముఖేష్ గౌడ6)చైత్రా రాయ్7) నటుడు కృష్ణుడు8) జబర్దస్త్ నరేశ్9) టెంపర్ వంశీ10)యాంకర్ సుధీర్ రెడ్డిఅగ్ని పరీక్ష నుంచి వెళ్లే ఆరుగురు వీళ్లే.. 1) ఝాన్సీ2) రోహిత్ నాయుడు3)శ్రష్టి4) చరణ్5)అమన్ మసూద్6)షాలిని పటేల్ -
అనుష్క సినిమాలకు గుడ్బై చెప్పినట్టేనా?
దశాబ్దానికి పైగా టాలీవుడ్లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్తో సర్ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. ఇక అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్తో వచ్చి మరో సూపర్ హిట్ కొడితే ఈ రూమర్స్ అన్నీ రూమర్స్గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది నుంచి మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి. -
కథలో దమ్ముంటే ప్రేక్షకులే ఆదరిస్తారు: శ్రీవిష్ణు
జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. టీజర్ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.‘జానకీరామ్.. కంగారు పడి ఏవో వాగ్దానాలు చేయకు . సినిమా హిట్ అవ్వకపోతే అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పుతా.. లాంటి డైలాగ్లు చెప్పకు. కథలో బలం ఉన్నప్పుడు ప్రేక్షకులే ఆదరిస్తారు’ అని చెప్పి నవ్వులు పూయించారు. కాగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మన అందరి కథ అంటూ..కాగా హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ప్రొడక్షన్ నెం 39‘ ( వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు.ఇదీ చదవండి: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియోసినిమా హిట్టయితే అమీర్ పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా… వద్దు ఖంగారు పడి వాగ్దానాలు చేయకు. - @sreevishnuoffl to his director Janaki pic.twitter.com/yCzVFzBvOV— Rajesh Manne (@rajeshmanne1) September 5, 2026 -
బూతు సినిమాలకు లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఎందుకు?
జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, ఆర్. నారాయణమూర్తి సెన్సర్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎక్కువ మంది చదివింది: పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు: అల్లరి నరేశ్సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు‘సెన్సార్ విషయంలో సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఓటీటీలలో ఎలాంటి సెన్సార్ లేకుండానే కంటెంట్ వస్తోంది. మరి తెరపై వచ్చే సినిమాలకు సెన్సార్ ఆంక్షలు ఎందుకు?. సినిమాల విషయంలో రాజకీయాలు మానుకోవాలి. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు పెద్దలు కఠినమైన ఆంక్షలు పెట్టకుండా సినిమా వాళ్ల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ ఏ రాజకీయ నేత సినిమాల్లోకి వచ్చి సూపర్స్టార్ కాలేదు. ప్రతి తెలుగు సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడుతోంది’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.షాక్ అయ్యా‘కామ్రేడ్ అనే పదం సెన్సార్ వాళ్లు వద్దంటే షాక్ అయ్యా. అసలు ఈ పదం అర్థం తెలుసా ఎవరికైనా? కామ్రేడ్ అంటే ఒక అమ్మ. ఒకే భావజాలంతో ఒకే లక్ష్యంతో.. ఓకే జీవనశైలితో ప్రజల కోసం వారి జీవితాలను వదిలేస్తారో వాళ్లే కామ్రేడ్స్. కామ్రేడ్ అని పిలుచుకోవడం మన అదృష్టం. అందువల్ల ఈ పదంపై సెన్సార్ వాళ్లు ఇబ్బందులు పెట్టవద్దు. కొన్ని సినిమాల్లో బూతులు ఉన్నా వదిలేస్తున్నారు. మరికొన్ని సినిమాలు మంచిగా ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇదీ చదవండి: తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు -
నవ్వులు పూయిస్తున్న శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్
జానకిరాం మారెల్ల దర్శకకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు టీజర్ విడుదలైంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.సీరియస్గా సాగే నక్సలైట్ నేపథ్యంలోనూ శ్రీవిష్ణు తనదైన శైలిలో నవ్విస్తూ, పూర్తి వినోదాత్మకంగా ఈ టీజర్ ఉంది. రాష్ట్ర హోంమంత్రిని ఎత్తుకెళ్లే సన్నివేశం హైలైట్గా కనిపిస్తోంది. రాధిక శరత్కుమార్, ఉపేంద్ర లమాయే, షైన్ టామ్ చాకో, మహిమా నంబియార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
సుమలత బహిరంగ క్షమాపణ చెప్పాలి: శేఖర్ మాస్టర్
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్కు, ఫెడరేషన్కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. తనపై సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని శేఖర్ మాస్టర్ తెలిపారు.తన ప్రమేయం లేకుండా ఎలాంటి నిరూపిత ఆధారాలు లేకుండా తన మనోభావాలు దెబ్బతినేలా సుమలత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై అభియోగాలు మోపి, నిందలు వేసి వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.పెద్దల మాటకు గౌరవంతో మౌనంఈ వివాదంపై మీడియా ముందుకు రావద్దని, గొడవలు వద్దని పెద్దలు సూచించారని శేఖర్ మాస్టర్ తెలిపారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు.యూనియన్ సభ్యుల కోసం ముందుంటా‘యూనియన్ సభ్యులకు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటా. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో ఎన్నో సాంగ్స్ను కూడా వదులుకున్నాను’ అని శేఖర్ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్పై ఫిర్యాదు -
‘పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు’
ఈవీవీ సత్యనారాయణ. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు వినోదాత్మక చిత్రాలంటే గుర్తు వచ్చే మొదటి డైరెక్టర్ ఈయన. సినిమా చేసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు చివరి వరకు కుర్చిలో కూర్చొపెట్టడంలో డైరెక్టర్ సత్యనారాయణకు వెన్నతో పెట్టిన విద్య. ఈయన తీసిన సినిమాలు అలాంటివి మరి. ‘ప్రేమ ఖైదీ’, ‘హలో బ్రదర్’, ‘అల్లుడా మజాకా’, ‘జంబలకిడి పంబ’, ‘కన్యాదానం’ వంటి మరెన్నో చిత్రాలు తీశారు. ‘జంబలకిడి పంబ’తో ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఈ మూవీ కోసం అల్లరి నరేష్ ఓ బ్రాడ్కాస్ట్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీరివర్స్ గేర్గా ..‘జంబలకిడి పంబ కథను నాన్న అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే రాసుకున్నారు. ఈ సినిమాని నరేశ్ గారిని హీరోగా పెట్టి తీశారు. అయితే కథ వినిపించినప్పుడు టైటిల్ పేరు ‘రివర్స్ గేర్’ అని ఫిక్స్ అయ్యారు. కథలో అంతా రివర్స్గా జరుగుతుంటది అని. రివర్స్ గేర్ అంటే బాగోదేమో, నెగెటివ్ టాక్ వెళ్తుంది అని నరేశ్గారు అభిప్రాయ పడ్డారు. తర్వాత మూవీ పేరుని ‘జంబలకిడి పంబ’గా ఫిక్స్ చేశారు. సగం చూసి వెళ్లిపోయారు..తర్వాత సినిమా కొనడానికి వచ్చే వాళ్లు మూవీ చూసి ఆడవాళ్లు మగాళ్లుగా అయిపోవడం ఏంటి.? అంతా డిఫరెంట్గా ఉందని.. ఇదోక పిచ్చి సినిమా అన్నారు. సినిమా సగం చేసే వెళ్లిపోయారు. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో నాన్న సొంతంగా రిలీజ్ చేశారు. ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే.. ఆ రోజు మధ్యలో వెళ్లిపోయిన వారినే 100 రోజల ఫంక్షన్కు చీఫ్ గెస్ట్లుగా వచ్చారు’ అని అల్లరి నరేశ్ తెలిపారు.ఇదీ చదవండి: ‘బిగ్బాస్’ కొత్త ఇల్లు సిద్ధం -
బిగ్బాస్ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్లోకి వెళ్లేది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 10) గ్రాండ్గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్ అయింది.తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్లో ఝాన్సీ హౌస్లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్ని కూడా హౌస్లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్, రాజకుమారి, రోహిత్, అమన్ కచ్చితంగా బిగ్బాస్ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, నరేశ్, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, ముఖేష్, చైత్ర రాయ్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, ఎక్స్ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు హౌస్లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్ 6) స్పష్టత రానుంది. సీజన్ 10కి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ . ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ను సైతం షేక్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు ప్రాణం పోసింది. తండ్రీకూతురు సెంటిమెంట్కి అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన ఇరుముడిని చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఇదీ చదవండి: బిగ్బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీఈ సినిమా వచ్చి చాలా రోజుల అవుతున్నా ఇంకా ఇరుముడి ఫీవర్ నడుస్తూనే ఉంది. పల్లె నుంచి పట్నం వరకు చిన్న, పెద్దా అని తేడా లేకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. . అయితే ఈ సినిమాను చూసేందుకు గ్రామల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లతో థియేటర్లకు తరలివెళ్లారు. ఇందులో వృద్ధులు, మహిళలే అధికంగా ఉండడం విశేషం. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.200 కోట్లకు పైగా..మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi Movie) బాక్సాఫీస్ వద్ద కేవలం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. రవితేజ తన సుదీర్ఘ సినీ కెరీర్లో రూ.200 కోట్ల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు.ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో IRUMUDI: టాలీవుడ్కి గత వైభవాన్ని గుర్తు చేస్తున్న రియల్ బ్లాక్బస్టర్ #IRUMUDI 🔥గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తరలివస్తున్న ప్రేక్షకులు… 3వ వారంలోనూ అదే జోష్, అదే సందడి 'ఇరుముడి' సినిమాని థియేటర్లలో ఒక పండగలా జరుపుకుంటున్నారు ❤️@RaviTeja_offl pic.twitter.com/oDRifTpyGd— H A N U (@HanuNews) September 4, 2026 -
బిగ్బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీ
బిగ్బాస్ సీజన్10 మరి కొద్ది గంటల్లో బుల్లితెర ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రేపు (సెప్టెంబర్ 6) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి తొలి కంటెస్టెంట్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బిగ్బాస్లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు. ఇలా ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచి మెయిన్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్గా రైతుబిడ్డ, జానపద గాయని ఝాన్సీ ఎంపికై ఛాన్స్ కొట్టేసింది.ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియోఅగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ హౌస్లోకి..బిగ్బాస్ తెలుగు-10లో సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్-2ను నిర్వహించారు. ఇందులో 15 మంది సామాన్యులు పోటీపడ్డారు. వారిలో సింగర్ ఝాన్సీ తన ఆటతీరు, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిపరీక్షలో ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమెనే మెయిన్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్గా ఎంపికైంది. ‘తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నాను. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో… మన పాటతో… మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ప్రతి అడుగులో మీ ప్రోత్సాహం కావాలి’ అని ఇన్స్టా వేదికగా ఝాన్సీ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Gundeboina jhansi (@singer_jhansi) -
కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మరో చిత్రం కావడంతో అంచానాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్లు, టీజర్ అభిమానులను అలరించాయి. ముఖ్యంగా ఇటీవలే వచ్చిన ఏషనాగుల పాట ఇప్పటికీ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్మీడియాలో రీపోస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేశ్, నాని ఇదే సాంగ్ను దసరా సినిమాలోని చమ్కీల సాంగ్తో మిక్స్ చేసి ఈ రెండు పాటలపై క్రాస్ ఓవర్ వీడియో చేశారు. అదికాస్త సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ50 మిలియన్లు దాటిన ఏషనాగుల..తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదట్లో ఈ సినిమా కోసం వచ్చిన కష్టాలను విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు. 25 షోలకు పడిపోయాం‘ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రానికి తొలుత దేశవ్యాప్తంగా 350కిపైగా షోలు దొరికాయి. ఇతర భారీ చిత్రాల విడుదలతో ఈ సినిమా షోల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రేక్షకులే ఈ సినిమాను నడిపించారు. పెద్ద సినిమాలు విడుదల కావడంతో మా షోలను థియేటర్లు తగ్గించాయి. ఒకానొక సందర్భంలో 250 షోల నుంచి 25 షోలకు పడిపోయాం. మల్టీప్లెక్స్లు కూడా ప్రధాన ప్రాంతాల్లో మా సినిమాను ప్రదర్శించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు’ అని విశాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీఆ పోస్టు ఇచ్చిన ధైర్యం..‘సాధారణంగా పోస్టులను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సమయంలో నా సినిమా ఆడలేదేమోనని లోలోపల బాధపడుతున్నా. అప్పుడు ఒక పోస్ట్ కనిపించింది. ‘నీ పని నువ్వు చేయి.. మిగతాది నేను చూసుకుంటాను’ అనే సందేశం ఉంది. మొదటి వారం చివర్లో ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.బాలీవుడ్ నుంచి సాయం..‘హనుమాన్ అంశ్’తో పాటు ‘అవారాపన్ 2’, ‘బత్వారా’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తాను ఆశించినంత మద్దతు లభించలేదని విశాల్ అన్నారు. ‘సినిమా విజయవంతం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కాగా రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.75 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని విశాల్ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: ఓటీటీలు సోమరిపోతుల కోసమే: నటుడు శివాజీ -
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
నిత్యం సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే యాంకర్ అనసూయ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తులసి కోమలవేణి అనే కన్నడ భక్తి పాటకు నృత్యం చేసి వీడియోను షేర్ చేశారు. కృష్ణుడుకి అంతా తెలుసు. నాకు అది చాలు అనే క్యాప్షన్ను చివర్లో జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నా: హీరో సుహాస్
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 10న రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా సుహాస్ ఓ ఇంటర్వ్యులో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అనుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించా..‘మంచి మంచి అవకాశాలు రావడం వల్ల సంతోషంగా ఉంది. డబ్బులు కూడా అనుకున్నదాని కంటే ఎక్కువగానే సంపాదించా. మండాడిలో పూర్తిస్థాయిలో విలన్గా నటించా. పాత్ర కూడా భయపెట్టే విధంగా ఉంటుంది. సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. షూటింగ్ సముద్రం మధ్యలో చేశాం. కొన్ని సందర్భాల్లో చావు నుంచి కూడా తప్పించుకున్నాం. సముద్రం లోపల షూటింగ్ అంటే కొంచం కష్టంగానే ఉంటుంది’ అని తెలిపారు.కాగా ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణికందన్ సహ–నిర్మాతగా వ్యవహరించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ రిలీజ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఎయిర్హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ -
ఎయిర్హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ
ఎయిర్హోస్టెస్గా ఉద్యోగం.. మంచి జీతం. తన తల్లి కల కోసం సినిమాలవైపు వచ్చింది. నటనపై ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్కు వచ్చింది యువ హీరోయిన్ రాశీ సింగ్. ‘శశి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో మరోసారి వెండి తెరపై కనిపించింది. ఛత్తీస్గడ్కు చెందిన ఈ భామ తన కెరీర్ విశేషాలను వెల్లడించింది. తన మాటల్లోనే..‘చిన్నప్పటి నుంచి నటిని కావాలని నిర్ణయించుకున్నా. నిజానికి మా అమ్మకు కూడా నటి కావాలనే కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల కాలేకపోయారు. ఆమె కల కోసం నన్ను ఇలా ప్రోత్సాహించారు. ఇప్పుడు నాలో ఆమెను చూసుకుంటున్నారు.గతంలో ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఎయిర్హోస్ట్గా పనిచేశా. ఆ ఉద్యోగం బాగానే ఉన్నప్పటికీ నా మనసంతా సినిమాల పైనే ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలేశా. తర్వాత మోడలింగ్ చేయడంతో పాటు కొన్ని ప్రకటనల్లో నటించా. గాడ్ఫాదర్ లేకపోవడంతో చాలా విషయాల్లో కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది.ఇదీ చదవండి: ‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’నాకు కెమెరా అంటే భయం ఉండేది కాదు. షూటింగ్ టైమ్లో నటనకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకున్నా. యాడ్స్లో పనిచేయడం కూడా కలిసొచ్చింది. మోడలింగ్ ద్వారా చాలామందిని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టా.ఎక్కువ మంది చదివింది: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి : అల్లరి నరేష్సినిమాలో నేను పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల నన్ను గుర్తుపట్టుకోవాలి. అందుకే తొందరపడకుండా కథలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నా. కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలో గుర్తుండుపోయే పాత్రలు చేయాలనేదే నా కోరిక’ అని రాశి సింగ్ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? -
‘ఓటీటీలు సోమరిపోతుల కోసమే’
బేబీ మూవీతో ఫేమస్ అయిన టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న నటుడు శివాజీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.ఎక్కువ మంది చదివింది: 100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి: అల్లరి నరేష్ఆ కిక్కే వేరు..‘సినిమా అనేది ఒక అద్భుతం. ఇది థియేటర్లలో మాత్రమే చూడాలి. 200 నుంచి 300 మంది మధ్య ఓ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. అంతేకాని ఓటీటీలో చూస్తూ.. జోమోటో వాడు వచ్చాడు.. స్విగ్గివాడు వచ్చాడని మూవీని ఆపి చూస్తే అంత మజా అనిపించదు. ఓటీటీ అనేది బాగా ఖాళీ ఉండి.. సోమరిబోతుల కోసం మాత్రమే. అని శివాజీ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా తాను నటించిన ‘90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ థియేటర్లలో రిలీజ్ అయింటే కచ్చితంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదన్నారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమా విషయానికి వస్తే..ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఈ రోజు (సెప్టెంబర్ 4)న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రష్మిక హాజరుకానున్నారు.ఇదీ చదవండి: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం Shocking Comments 😲 Actor #Sivaji about #90sWebSeries“OTT is for LAZY PEOPLE!!”If #90s had released in theatres, the film would have easily crossed ₹100 CR, according to Sivaji. pic.twitter.com/Wyrn4vJLHD— Milagro Movies (@MilagroMovies) September 3, 2026 -
‘ధర్మస్థ నియోజకవర్గం’ మూవీ రివ్యూ
టైటిల్:ధర్మస్థ నియోజకవర్గంనటీనటులు:సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ కుమార్, తదితరులునిర్మాత: మేరుం భాస్కర్దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోటసంగీతం: మహావీర్ ఏలేందర్ఎడిటింగ్ : సాయిబాబు తలారివిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026కథేంటంటే..ధర్మస్థల నియోజకవర్గం ఎమ్మెల్యే బైర్రాజు(సాయి కుమార్) ఓ సీనియర్ రాజకీయ నాయకుడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు. అదే నియోజకవర్గంలో వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి కాలేజీని నడుపుతూ అందులోనే డ్రగ్స్ దంగా చేస్తుంటారు. అక్కడ స్టూడెంట్స్కి విశ్వ(శివ కుమార్) ద్వారా డ్రగ్స్ అందించి.. వారిని డ్రగ్స్ బానిసలుగా మార్చేస్తుంటారు. ఇలా విద్యార్థులను చెడగొడుతున్న కాలేజీ యాజమాన్యం, విశ్వపై పోరాటం చేస్తుంది అదే కాలేజీ లెక్చరర్ అరుంధతి(వితిక షేరు). ఆమెకు అదే కాలేజీ స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా(రాయంచ కొక్కురు)తోడుగా ఉంటారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. తన కొడుకు హత్య వెనుక ఎమ్మెల్యే బైర్రాజు ఉన్నాడని తెలిసి టీ కొట్టు అమ్ముకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయాల్లోకి వస్తాడు. విద్యార్థుల సపోర్ట్తో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైర్రాజుపై పోటీకి దిగుతాడు. ధనబలం ఉన్న బైర్రాజుపై ఛాయ్వాలా ఈశ్వరయ్య గెలిచాడా లేదా? ఎన్నికల్లో గెలిచేందుకు బైర్రాజు వేసిన ఎత్తులను విద్యార్థులతో కలిసి ఈశ్వరయ్య ఎలా చిత్తు చేశాడు? బద్రి చావుకు కారణమైన వారిని ఎలా శిక్షించారు? ఈశ్వరయ్య గెలిచాక ధర్మస్థల నియోజకవర్గంలో వచ్చిన మార్పులు ఏంటి? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. పొలిటికల్ యాక్షన్ డ్రామాకి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. సరైన పాయింట్ ఎంచుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చ. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ని పాయింట్గా తీసుకొని దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి ఓ మంచి కథను రాసుకున్నాడు. అయితే దాన్ని స్క్రీన్పై అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు. క్రైమ్ డ్రామాకి పొలిటికల్ టచ్ ఇచ్చి గ్రిప్పింగ్గా కథను చెప్పిన విధానం బాగుంది. కానీ చాలావరకు కథనం ఊహకు అందేలా సాగుతుంది.ఫస్టాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం తిరుగుతుంది. డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడంతో... ఇంటర్వెల్ ట్విస్ట్... సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.సెకండాఫ్లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజు... ఈశ్వరయ్య చేసే పొలిటికల్ కాంపెయిన్... తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు... ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. అలాగే దుస్టుల సహవాసం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం.ఎవరెలా చేశారంటే..టీ అమ్ముకునే ఓ సామాన్య ఈశ్వరయ్య పాత్రలో సుమన్ చక్కగా నటించాడు.సెకండాఫ్లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఏడు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకుంటాడు. అయితే ఇలాంటి పాత్రలు ఆయన ఇప్పటికే చాలా పోషించడంతో కొత్తగా అనిపించదు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు.. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో చక్కగా నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, చివర్లో వరుణ్ సందేశ్, కాలకేయ ప్రభాకర్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతిక విషయాలకొస్తే.. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.సందర్భానుసారంగా రాసిన లిరిక్స్ ప్రేక్షకులను ఆలోచింప జేస్తాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఫస్టాప్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
జూ. ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ‘డ్రాగన్’లో పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నాడట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. నిజానికి డ్రాగన్ సినిమాలోకి అలియాను తీసుకుంటారనే ప్రచారం ఏడాది కిందటే నడిచింది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్ మరో రెండు వారాల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి చిత్రీకరణను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
త్రిష ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ‘గుడ్బై’ రూమర్స్కి చెక్
త్రిష హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం లండన్ లో ప్రారంభమైంది. కరుప్పు వంటి హిట్ చిత్రం తరువాత ఈమె నటించే చిత్రం గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఇంకా చెప్పాలంటే త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటి పలు నిరాధార వార్తల మధ్య త్రిష తన తాజా చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈమెతో పాటు నటి రాధిక శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రాజా కృష్ణ మీనన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ కోలీవుడ్లోకి రంగప్రవేశం చేస్తోంది. లోకోమోటివ్ గ్లోబల్ సంస్థతో కలిసి మనోరమా స్టూడియోస్ సంస్థ తమిళంలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రం కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకు ముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించినా, ఈ చిత్రం తనకు కొత్త అనుభవం ఇచ్చిందని దర్శకుడు రాజా కృష్ణ మీనన్ పేర్కొన్నారు. త్రిష, రాధిక శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ వంటి ప్రతిభావంతులైన నటీమణులు, సాంకేతిక వర్గంతో చేస్తున్న చిత్రం ఇది.దీన్ని తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇంకా. పేరు నిర్ణయించిన ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని దర్శకుడు చెప్పారు. -
‘ఐ యామ్ గేమ్’ ట్విటర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్ నేడు( సెప్టెంబర్ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే మలయాళ వెర్షన్లో యథాతథంగా విడుదల చేశారు.ఈ సినిమా చేసిన ప్రేక్షకులు తమతమ అభిప్రాయలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా ఫస్టాఫ్, దుల్కర్ నటన, విజువల్స్, నేపథ్య సంగీతంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్టాఫ్ మంచి వినోదాన్ని అందించిందని అంటున్నారు. ఇంటర్వ్ల్లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలుస్తాయంటున్నారు. #ImGame First Half Superb! 👌🔥The film gets off to a strong start with an excellent first 30 minutes, setting up the world and characters really well. The fantasy element and core plot then take some time to establish, but once that phase is done, the film picks up really well… pic.twitter.com/6Fu5ckIdmw— Balaji (@RDBalaji) September 3, 2026‘ఈ చిత్రం ఆరంభం అదిరిపోయింది. తొలి 30 నిమిషాలు అద్భుతంగా సాగుతూ కథా ప్రపంచాన్ని పాత్రలు చాలా చక్కగా పరిచయం చేస్తాయి. ఆ తర్వాత ఫాంటసీ అంశం, అసలు కథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. మళ్లీ కొన్ని సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తుంటాయి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. #ImGame is an overall entertaining watch with some really enjoyable moments. The VFX work stands out, while Jakes Bejoy’s music adds great energy throughout. I m game movie Rating - ⭐⭐⭐⭐ 4/5 ALL TIME BLOCKBUSTER ❤️🔥🔥!!@dulQuer delivers a super performance, and especially… pic.twitter.com/gHyl4xoSym— its cinema (@itscinemaoficl) September 3, 2026‘ఐ యామ్ గేమ్’ మంచి వినోదాన్ని ఇచ్చే చిత్రం. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. విజువల్ ఎఫెక్ట్ ఆకట్టుకునేలా ఉంటాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం సినిమాకు బలం. కీలక సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. #ImGame REVIEW: A terrific first half elevated by a surprising fantasy element, explosive pre-interval and interval blocks, and a show-stealing performance from Dulquer Salmaan. The second half slows down, shifting into a predictable familiar template with fewer surprises. The… pic.twitter.com/beckv7w3pZ— Lets Cinema (@letscinema) September 3, 2026‘ఊహించని ఫాంటసీ ఎలిమెంట్ సినిమాకి హైలెట్గా నిలిచింది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ తన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. #Imgame : A fantasy thriller from Nahas Hidhayath.DQ shines as Dan John.Myskkin as Villain good.Jakes BGM elevates. Screenplay keeps us hooked from Pre-interval .A banger first half with a decent second half 🔥Good watch 🏆 💥- (3.5/5) ✅ pic.twitter.com/KMBSRESFDa— ரோமன் 🎦 (@romanjebin) September 3, 2026 -
అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. ప్రస్తుతం ‘గాంధారి’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో వస్తున్న హింస, షాక్ వాల్యూతో కూడిన భారీ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘2015లో వచ్చిన సినిమాలను చూస్తే అది ఒక కలల కాలంలా అనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు కెరీర్ ప్రారంభించి ఉంటే.. నాకు అసలు కెరీర్ ఉండేది కాదు. ఇప్పుడు వస్తున్న చిత్రాలు అలా ఉన్నాయి. అప్పట్లో నచ్చిన చిత్రాలు చేసే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల కిందట ఫ్యామిలీతో ఓ సినిమా చూశాను. తర్వాత నేను సినిమాల నుంచి తప్పుకుంటేనే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు. అని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈమెదే.. ఎంతంటే..?నచ్చని సినిమాలు చేయలేను..‘ నా వృత్తి అంటే చాలా ఇష్టం. కానీ అదే పనిని గుడ్డిగా ప్రేమిస్తూ.. నచ్చని సినిమాలు చేయలేను. మనం చేసిన సినిమాలే ఫిల్మోగ్రఫీని నిర్ణయిస్తాయి. కాలం మారుతుంది. పదేళ్ల తర్వాత ఏదో ఒక కొత్త జానర్ రావచ్చు. కానీ చేసిన సినిమాలు మాత్రం అలాగే ఉంటాయి. ఎవరైనా భవిష్యత్తులో నా ఫిల్మోగ్రఫీని చూస్తే.. చేసిన సినిమాల గురించి నాకు కానీ, నాతో కలిసి పనిచేసిన వారికి కానీ ఇబ్బందిగా అనిపించకూడదు. అందుకే ప్రస్తుత ట్రెండ్ కంటే నా ఫిల్మోగ్రఫీకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అని తాప్సీ పేర్కొన్నారు.‘గాంధారి’తో మరోసారి..తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’కి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. కనికా ధిల్లాన్ కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మించారు. జాయ్పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, ఛాయా కదమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు (సెప్టెంబర్ 3) నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇదీ చదవండి: శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. అంత పెద్ద రిస్క్ చేస్తాడా? -
బిగ్బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈమెదే.. ఎంతంటే..?
బిగ్బాస్ తెలుగు మరో కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇప్పుడు పదో సీజన్ ప్రారంభం అయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ఆదివారం సెప్టెంబర్ 06న సాయంత్రం ఈ పదో సీజన్ ప్రారంభం కానుంది. దీనికీ నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ సారి ఎవరు ఎంట్రీ ఇస్తారనో అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి. సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీల పేర్లు ఈ కంటెంస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బిగ్బాస్ తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!రన్నరప్గా నిలిచినప్పటికీ..బిగ్బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి అని తెలుస్తోంది. బిగ్బాస్ సీజన్ 3లో 13వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి శ్రీముఖి.. తన ఆటతీరుతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. చివరి వరకు ఆమే విన్నర్ అనుకున్న ప్రేక్షకులకు ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. శ్రీముఖి రన్నరప్గా నిలిచింది. అయితే విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కంటే శ్రీముఖి ఎక్కువగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్ 100 రోజులకు గాను రూ.20 లక్షల రెమ్యునరేషన్తో పాటు విన్నర్ గా ప్రైజ్ మని రూ.50 లక్షలు తీసుకున్నాడట. అయితే శ్రీముఖి ఒక్క రెమ్యునరేషనే రూ.80 లక్షల వరకు తీసుకుందట. 100 రోజులకు గాను రోజుకు రూ.80 వేలు వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన విన్నర్తో పోల్చుకుంటే శ్రీముఖి 10లక్షలు ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది బిగ్బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అని సమాచారం.ఇదీ చదవండి: బిగ్బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?బిగ్బాస్ సీజన్ 10 విషయానికి వస్తే..ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు దాదాపు కన్ఫామ్ అయ్యాయని సమాచారం. ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేశ్, నూకరాజుతో పాటు ఎక్స్ప్రెస్ హరి పేరు కూడా ఈ సారి బలంగా వినబడుతుంది. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, తేజస్వీని గౌడ, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమాంచకం మూవీ రివ్యూ -
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించారు. ఈ మూవీని వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. సెప్టెంబర్ 3న ఈ మూవీని విడుదల చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించిన కథ ఎలా ఉంది? రివ్యూ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే?అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే ఓ కుర్రాడు బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అప్పులు చేసి స్టార్టప్ అని డబ్బులన్నీ వృథా చేస్తాడు. ‘రోమాంచకం’ అని అమ్మాయిల్ని, అబ్బాయిల్ని కలిపే ఓ డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలని చూస్తుంటాడు. అయితే టెస్టింగ్ క్రమంలో ఈ యాప్ ద్వారానే చెన్నైలో ఉండే మైథిలి (అనంతిక)తో పరిచయం పెంచుకుంటాడు. ఆమె కూడా అన్వేష్ ప్రేమలో పడిపోతుంది. మైథిలీ బర్త్ డే సందర్భంగా అన్వేష్ చెన్నైకి వెళ్లి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. అలా అన్వేష్ చెన్నైకి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అన్వేష్ ఫోన్ పోగొట్టుకుంటాడు. ఎలాగోలా మైథిలీకి ఫోన్ చేసి హోటల్కి రమ్మంటాడు. వస్తాను అని మైథిలీ చెబుతుంది. కానీ ఆ తర్వాత క్షణం నుంచి మైథిలీ ఫోన్ కలవదు. అన్వేష్ నంబర్ని అన్ని చోట్లా బ్లాక్ చేస్తుంది. మళ్లీ మూడు నెలల తర్వాత లైన్లోకి వస్తుంది. అసలు మైథిలీ ఎందుకు బ్లాక్ చేస్తుంది? మళ్లీ ఎందుకు లైన్లోకి వస్తుంది? అన్వేష్ కోసం ఆమె హైదరాబాద్కి ఎందుకు వస్తుంది? వచ్చాక ఏం జరుగుతుంది? ఆమె రాకతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటేజెన్ జీ మైండ్ సెట్ను బేస్ చేసుకుని కథను అల్లుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కథలో చాలా వరకు లాజిక్స్, ఎమోషన్స్ ఇలా ఏవీ కనిపించవు. ఇప్పుడు ఉన్న తరం కూడా ఇలానే ఆలోచిస్తుంటుంది. ఎందుకు అలా చేస్తున్నారు.. ఇలా ప్రవర్తిస్తుంటారు? అన్నది చెప్పడం కష్టం. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల పాత్రల్ని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. చాలా వరకు సిల్లీగా అనిపిస్తుంది. మరీ ఇలా ఉన్నారేంట్రా.. అని అనిపించొచ్చు. కథలో ఎక్కడా కూడా ఎమోషన్ అన్నది కనిపించదు. లాజిక్ అయితే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది. హీరో, అతని గ్యాంగ్ చేసే కామెడీ బాగుంటుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కాస్త ఫ్రెష్గానే అనిపిస్తుంది. పాటలు, కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఫ్లోలో సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్లో అయినా కథ సీరియస్ మోడ్లోకి వెళ్తుందని అనుకుంటే.. పొరబాటే. అసలు సినిమాలో ఎక్కడా కూడా సీరియస్ నెస్ కనిపించదు. చాలా వరకు ఎమోషన్ మిస్ అవ్వడం మైనస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కూడా ఫుల్ కామెడీగానే సాగుతుంది. లాజిక్స్, కథ గురించి ఆలోచించకుండా సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ఈ సినిమా కొంత వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా నటించారంటే?సుమంత్ ప్రభాస్ యాక్టింగ్, కనిపించే తీరు అంతా కూడా పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. అనంతిక మాత్రం తెరపై అందంగా కనిపిస్తుంది. ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువే. అయినా కనిపించినంత వరకు ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం తమ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్విస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా నవ్విస్తుంది. మిగిలిన కారెక్టర్స్ అందరూ కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. సాంకేతికంగా ఎలా ఉందంటే..విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్గానే కనిపిస్తుంది. పాటలు బాగుంటాయి. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది. జెన్ జీ ఆడియెన్స్ని టార్గెట్ చేసిన ఈ మూవీ కమర్షియల్గా ఏ రేంజ్ సక్సెస్ని సాధిస్తుందో చూడాలి. -
రామ్చరణ్ ఉంటే అద్భుతమే..‘ఇరుముడి 2’పై శివ నిర్వాణ క్లారిటీ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్చరణ్ క్యామియో ఇస్తారంటూ సినిమా రిలీజ్కు ముందు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చరణ్ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినదే కావడంతో ఈ వార్త వైరల్గా మారింది.తాజాగా ‘ఇరుముడి’ సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్లో చరణ్ నటిస్తారా? అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘చరణ్ మా సినిమాలో ఉంటే అద్భుతంగా ఉండేది. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు ఆయనను క్యామియోగా తీసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు. ఈ ప్రచారం సోషల్ మీడియాలోనే మొదట చూశాను. ఆ తర్వాత మీడియా మిత్రులు కూడా అడగడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పారు.అయితే కథకు సహజంగా అలాంటి పాత్ర అవసరమైతే చరణ్తో పనిచేయడం అద్భుతంగా ఉంటుందని శివ నిర్వాణ తెలిపారు. ముందుగా స్టార్ను అనుకుని పాత్రను సృష్టించడం తన విధానం కాదని స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టింది. మాలలో ఉన్న ఓ వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, ఆ వ్యక్తి తన కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పుల ఆధారంగా ఈ కథను చాలా సహజంగా అభివృద్ధి చేశాం. అందుకే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిందనే కారణంతో వెంటనే ‘ఇరుముడి 2’ కథ రాయలేను. మరో సహజమైన కథా పాయింట్ దొరికితేనే ఇరుముడి సీక్వెల్పై ఆలోచిస్తానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.'ఇరుముడి' సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అయ్యప్ప స్వామిలా పులిపై కూతురి పాత్రధారి కూర్చుని ఉండగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నిలబడి ఉన్నారు. మూడో వారాంతంలోకి వచ్చినా 'ఇరుముడి' జోరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ వారం వచ్చే సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ కనిపించట్లేదు. చూస్తుంటే ఈ వీకెండ్ కూడా రవితేజ తన హవా చూపించేలానే కనిపిస్తున్నాడు. -
ప్రభాస్ని కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు గోపాల్రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు(సెప్టెంబర్ 3) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.→ తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది.→ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్తై కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది.→ రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా.. డైరెక్టర్ వేణుగోపాల్ ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి.→ సందీప్ అన్న ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను.సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది.→ విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా.→ అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.→ హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది. -
‘ఓజీ 2’ అప్డేట్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన డైరెక్టర్!
పవన్ కల్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులకు ‘ఓజీ’ సీక్వెల్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు సుజీత్. ఈ మేరకు బుధవారం ‘ఓజీ యూనివర్స్’ పేరిట ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ‘ఓజీ’కి సీక్వెల్గా తెరకెక్కించే చిత్రం గురించి పవన్ కల్యాణ్తో సుజీత్, సంగీత దర్శకుడు తమన్ చేస్తున్న చర్చలు ఆస్తకి రేపుతున్నాయి. ‘యాన్ ఇండియన్ ఆరిజిన్.. సౌత్ఈస్ట్ ఎమోషన్.. వెస్ట్రన్ ప్రెజెంటేషన్..’ అనే మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. From the #OGUniverseTo the #OG…ALL LOVE for everything so far…And everything that begins from here :) 🧿🧿♥️♥️Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk— Sujeeth (@Sujeethsign) September 2, 2026 -
శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. అంత పెద్ద రిస్క్ చేస్తాడా?
ఒకప్పుడు ఓ భాషలో సినిమా హిట్ అయిందంటే చాలు.. మరో భాషలో రీమేక్ చేసేందుకు పోటీ పడేవారు. కథ నచ్చితే చాలు స్టార్ హీరోలు సైతం రీమేక్లకు సై అనేవారు. అయితే పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కంటే.. అదే సినిమాను డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేయడానికే మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో ఓ సూపర్హిట్ గుజరాతీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర కోసం మెగా పవర్స్టార్ రామ్ చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.రూ.50 లక్షలతో సినిమా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లుగత ఏడాది గుజరాతీలో విడుదలైన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. చిన్న బడ్జెట్తో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అదే దక్షిణాదిలో అయితే రూ.50 లక్షలతో సినిమా తీయడం సంగతి పక్కన పెడితే.. ఆ మొత్తంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం కూడా కష్టమేననే కామెంట్లు వినిపించాయి.ఈ నేపథ్యంలో ‘లాలో’ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ఈ రీమేక్లో కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రను రామ్ చరణ్తో చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.‘లాలో’ కథేంటి?‘లాలో – కృష్ణ సదా సహాయతే’ కథ విషయానికొస్తే.. లాలో అనే ఆటో డ్రైవర్ తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల భార్యతో గొడవపడి తీవ్రంగా కుంగిపోతాడు. జీవితంలో ఎదురైన సమస్యలను మర్చిపోవడానికి చెడు అలవాట్లకు బానిసవుతాడు. పరిస్థితులు మరింత దిగజారడంతో ఓ నిర్మానుష్య ప్రదేశంలో తలదాచుకుంటాడు. అలాంటి సమయంలో మనిషి రూపంలో శ్రీకృష్ణుడు అతని జీవితంలోకి వస్తాడు. లాలోతో స్నేహం చేస్తూ.. అతని జీవితాన్ని నెమ్మదిగా మార్చే ప్రయత్నం చేస్తాడు. పైకి చూస్తే చాలా సింపుల్గా అనిపించే కథే అయినప్పటికీ.. భావోద్వేగాలను బలంగా పండిస్తూ, కథలో మంచి లోతును చూపించడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రానికి అంకిత్ సకియా దర్శకత్వం వహించారు. ఎమోషనల్ కంటెంట్ ప్రధాన బలంగా నిలవడంతో చిన్న సినిమా కాస్తా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.తమిళ దర్శకుడికి రీమేక్ బాధ్యతలు?తెలుగు రీమేక్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేరును టీమ్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే శ్రీకృష్ణుడి పాత్రలో రామ్ చరణ్ నిజంగానే నటిస్తారా? లేదా ఈ ప్రాజెక్ట్ను పక్కన పెడతారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. చరణ్ ఓకే చెప్పిన తర్వాతే ఈ ప్రాజెక్ట్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘పెద్ది’ తర్వాత కొంత విరామం తీసుకున్న చరణ్.. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్సీ 17’ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇలాంటి సమయంలో ‘లాలో’ రీమేక్ చర్చ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.గతంలో రీమేక్ సినిమాలు టాలీవుడ్లో ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో రీమేక్లకు దాదాపుగా కాలం చెల్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ రీమేక్ రిస్క్ చేస్తాడా? ‘లాలో’ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెక్ అవుతాయి? శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్ కనిపిస్తారో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
అలా చేస్తే ప్రతి స్క్రిప్ట్ బ్లాక్బస్టర్ అవుతుంది : శివ నిర్వాణ
‘‘మారెమ్మ’ సినిమా ట్రైలర్ బాగుంది. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్రైలర్లో అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్, ఫొటోగ్రఫీ బాగున్నాయి. కథకి ఏం కావాలో అవి చేసుకుంటూ వెళ్తే ప్రతి స్క్రిప్ట్ బ్లాక్బస్టర్ అవుతుంది. బ్లాక్బస్టర్ కావడానికి కావాల్సిన అన్ని అంశాలు ‘మారెమ్మ’లోనూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ శివ నిర్వాణ పేర్కొన్నారు. హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ని హీరో రామ్ డిజిటల్ వేదికగా లాంచ్ చేశారు. ఇటీవల ‘ఇరుముడి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ ‘మారెమ్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ– ‘‘మారెమ్మ’ చిత్రంలో ఒక దున్నపోతుకు, మనిషికి మధ్య ఉండే అనుబంధం ఎలా ఉంటుందో థియేటర్లలో చూస్తారు. రవితేజగారు ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్ నచ్చింది... భావోద్వేగానికి గురయ్యారు’’ అని చెప్పారు. నాగరాజు మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్ ఎలా ఉందో అంతకు పది రెట్లు ఎక్కువ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన తెలంగాణ పల్లెటూరి సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మయూర్ రెడ్డి. -
కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ చేస్తాం: ప్రణయ్ రెడ్డి
‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? వాళ్ల ఫ్రెండ్స్లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? అనేది ‘రోమాంచకం’ సినిమాలో మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. 2 గంటల 20 నిమిషాల టైమ్లో ఎక్కడా బోర్ కొట్టదు’’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా విలేకరులతో చెప్పిన విశేషాలు. (చదవండి: మూడు వారాల్లోపే ఓటీటీలో కొత్త మూవీ స్ట్రీమింగ్)→ సినిమా నిర్మాణం సీరియస్గా చేయాలని టీమ్స్ను పెట్టుకుని చేసే మైండ్ సెట్లో మేం లేం. డైరెక్టర్ వేణుగోపాల్ మూడు నాలుగేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ మమ్మల్ని ఆకట్టుకోవడంతో ‘రోమాంచకం’ తీశాం. → ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాక సందీప్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. ఆయన ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మా మూవీ ఔట్పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. సుమంత్, అనంతిక బాగా నటించారు. వాసుకి వైభవ్ అద్భుతమైన సంగీతం అందించారు. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి ఇబ్బంది లేకుండా మా మూవీ చూడొచ్చు. → అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిల్మ్ మేకర్స్ ముందే జాగ్రత్తపడతారు. → ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ రిలీజ్ చేస్తాం... ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి, వచ్చే ఏడాది రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్గారితో మేం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ‘స్పిరిట్’ మూవీ పూర్తయ్యాక సందీప్, నేను కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. మంచి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా చిన్న చిత్రాలు నిర్మిస్తాం. -
బిగ్బాస్ 9 సీజన్లు..9మంది విజేతలు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్బాస్ హౌస్లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం.శివ బాలాజీ‘బిగ్బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్గా ఉన్నారు.కౌశల్ మండారెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్బాస్ హౌస్లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్!రాహుల్ సిప్లిగంజ్:మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు.అభిజీత్ దుద్దాల: నాలుగో సీజన్ విజేత అభిజీత్ దుద్దాల. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. బిగ్బాస్ విజయంతో మరింత పాపులర్ అయ్యారు. అనంతరం సినిమాలు, డిజిటల్ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరీర్ను కొనసాగిస్తున్నారు. నటుడిగా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.వీజే సన్నీ: ఐదో సీజన్ టైటిల్ను వీజే సన్నీ సొంతం చేసుకున్నారు. టెలివిజన్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. బిగ్బాస్ తర్వాత నటుడిగానూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులతో కెరీర్ను మార్చుకున్నారు. ఎల్.వీ. రేవంత్ : ఆరో సీజన్ విజేత ఎల్.వీ. రేవంత్. అప్పటికే ప్రముఖ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘ఇండియన్ ఐడల్’ విజేతగానూ నిలిచారు. బిగ్బాస్ టైటిల్ తర్వాత కూడా సంగీతానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో పలు పాటలు పాడుతూ.. సినిమాలు, మ్యూజికల్ ఈవెంట్లతో బిజీగా కొనసాగుతున్నారు.ఎక్కువమంది చదివింది: ‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’పల్లవి ప్రశాంత్ : ఏడో సీజన్లో ‘రైతు బిడ్డ’గా బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నారు. అయితే విజయం తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. బిగ్బాస్ ఫినాలే అనంతరం జరిగిన గొడవలు, వాహనాల ధ్వంసానికి సంబంధించి పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేయగా.. అనంతరం పల్లవి ప్రశాంత్కు బెయిల్ లభించింది. బిగ్బాస్కు ముందు రైతుగా, యూట్యూబర్గా గుర్తింపు పొందిన ఆయనకు టైటిల్ తర్వాత మరింత పాపులారిటీ వచ్చింది.నిఖిల్ మలియక్కల్: ఎనిమిదో సీజన్ విజేత నిఖిల్ మలియక్కల్. టెలివిజన్ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘గోరింటాకు’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్బాస్ విజయం ఆయన పాపులారిటీని మరింత పెంచింది. ప్రస్తుతం టెలివిజన్తో పాటు డిజిటల్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నారు.కల్యాణ్ పడాల: తొమ్మిదో సీజన్లో ‘సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్’ థీమ్తో బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన కల్యాణ్ పడాల విజేతగా నిలిచారు. దీంతో బిగ్బాస్ తెలుగు చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి కామనర్గా రికార్డు సృష్టించారు. ఫైనల్లో తనూజ పుట్టస్వామిపై విజయం సాధించిన కల్యాణ్కు రూ.40 లక్షల నగదు బహుమతితో పాటు ఓ ఎస్యూవీ లభించింది. మాజీ భారత సైనికుడైన కల్యాణ్కు ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అయితే విజయం తర్వాత ఓటింగ్ ప్రక్రియపై సోషల్ మీడియాలో జరిగిన చర్చ కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు పదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కొత్త విజేత ఎవరవుతారనేది బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: ‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే! -
‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’
ఒకప్పుడు తన అందం, గ్లామర్తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె.. కెరీర్ మొదట్లో తన ప్రవర్తన ఎలా ఉండేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఎం చెప్పారంటే..‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో నాలో చాలా గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. అయితే ఓ సందర్భంలో కొంతమంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవు. ఇలా ఉండటం మంచిది కాదు’ అని చెప్పారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా నా ప్రవర్తనను మార్చుకున్నాను’ అని నమిత తెలిపారు. తన వల్ల తోటి నటులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ‘నా ప్రవర్తన కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయం నాకు చాలా మంది చెప్పారు. ఆ తర్వాత నా తప్పును అర్థం చేసుకుని నన్ను నేను మార్చుకున్నాను’ అని నమిత పేర్కొన్నారు.ఎక్కువ మంది చదివింది: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!17 ఏళ్ల వయసులో..17 ఏళ్ల వయసులో మిస్ సూరత్గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.ఇదీ చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ -
ప్రభాస్‘స్పిరిట్’షూటింగ్.. హైదరాబాద్లోనే ఎందుకంటే?
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఎందుకు జరుపుతున్నారో ప్రణయ్ వంగా తెలిపారు.ఓ కార్యక్రమంలో పాల్లొన్న ప్రణయ్ వంగా స్పిరిట్ షూటింగ్ కోసం మాట్లాడుతూ.. ‘ముంబైతో పోలిస్తే హైదరాబాద్లో సినిమా నిర్మాణ వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ను ముంబై కేంద్రంగా తెరకెక్కించడం వల్ల 20% నుంచి 30% వరకు అధికంగా ఖర్చయింది. అదే హైదరాబాద్లో నిర్మించుంటే చాలా డబ్బులు ఆదా అయ్యేవి. ఆ అనుభవంతోనే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను హైదరాబాద్లోనే నిర్మిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండఎందుకు ఎక్కువ అంటే..‘ముంబైలో స్టూడియో స్థలం, మౌలిక వసతుల కొరత కారణంగా షూటింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడ సెట్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర వసతులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చిత్ర పరిశ్రమలో ఒకరికొకరు సహకరించే సంస్కృతి కూడా ఉంది. పని వేళల్లో కూడా మార్పు ఉంటుంది’ అని వెల్లడించారు. సినిమా విషయానికి వస్తే..పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న విడుదల కానుంది.ఎక్కువ మంది చదవింది: పెళ్లి పీటలెక్కనున్న బలగం బ్యూటీ.. వరుడు మ్యూజిక్ డైరెక్టర్ -
‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐయామ్ ది గేమ్’. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిదాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి2’కి సంబంధించిన అప్డేట్ను పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.‘ఇప్పటివరకు పది రోజుల షూటింగ్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రభాస్కు సమయం దొరకపోవడంతో లేట్ అవుతుంది. అతనికి సమయం దొరికాక పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తాం’ అని వెల్లడించారు.ఎక్కువమంది చదివింది: శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్2024లో విడుదలై..కాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. 2024 జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కల్కి2’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ తరహాలో ‘కల్కి2’కి సంబంధించిన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.Kalki Part 2 Update by Nag Ashwin:Only 10 days of shooting have been completed so far! #Prabhas pic.twitter.com/goJsSMHdJk— Movies4u Official (@Movies4u_Officl) August 31, 2026 -
మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి శ్రీవిష్ణు
ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు హీరో శ్రీవిష్ణు. కొంత గ్యాప్ తరువాత మరోసారి అదే జానర్లోకి ఎంటరయ్యాడు ఈ హీరో. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.నేటి యువత అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, జీవిత పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఇది మన అందరి కథ’ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. యానిమేషన్తో మొదలైన ఈ గ్లింప్స్ హీరో క్యారెక్టరైజేషన్ను ఆసక్తికరంగా పరిచయం చేసింది. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో సన్నీ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన మిడిల్ క్లాస్ పాత్రతో ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి చందు, రవి సంగీతమందించనున్నారు.ఈ సినిమా తరువాత హీరో రవితేజతో కలిసి 2027 సంక్రాంతి పండక్కి ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్లో నటించనున్నారని సమాచారం. -
శంకర్, మురుగదాస్ కాంబో..! తెరపైకి మరో క్రేజీ ప్రాజెక్ట్..?
తమిళ సినీ పరిశ్రమలో ఇద్దరు స్టార్ దర్శకులు శంకర్, ఏఆర్ మురుగదాస్ కలిసి పనిచేయనున్నారంటూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘మదరాసి’ విడుదలైన సమయంలో మురుగదాస్ పనితీరును శంకర్ ప్రశంసించడం కూడా ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. వీరిద్దరి కలయికపై వస్తున్న వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.శంకర్ టీమ్ కథతో మురుగదాస్?శంకర్ రైటింగ్ టీమ్ సిద్ధం చేసిన ఓ కథపై ఏఆర్ మురుగదాస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇది పూర్తిస్థాయి సినిమా కోసం జరుగుతున్న చర్చలా? లేక ప్రాథమిక కథా దశలోనే ఉందా? అనే దానిపై స్పష్టత రాలేదు. అలాగే ఈ ప్రాజెక్ట్లో శంకర్ కేవలం కథ అందిస్తారా? లేక మరేదైనా కీలక బాధ్యత తీసుకుంటారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ వార్తలపై అటు శంకర్, ఇటు మురుగదాస్గాని అధికారికంగా స్పందించలేదు.ఇదీ చదవండి: అందుకే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టా..: విష్ణుప్రియఎవరి సినిమాలతో వారు బిజీ..శంకర్ ఇటీవల రామ్చరణ్తో ‘గేమ్ ఛేంజర్’, కమల్హాసన్తో ‘ఇండియన్ 2’ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ‘వెల్పారి’ అనే చారిత్రక నవలను భారీ స్థాయిలో మూడు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ను రూపొందించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.మరోవైపు ఏఆర్ మురుగదాస్ ఇటీవల శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ‘మదరాసి’ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్, సూర్య, అజిత్కుమార్, రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులతోనూ ఆయన గతంలో సినిమాలు చేశారు. ప్రస్తుతం సన్నీ డియోల్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న హిందీ యాక్షన్ ఎంటర్టైనర్కు కూడా ఆయన దర్శకత్వం వహించనున్నారని సమాచారం. -
‘వేట’ ఓ గ్రామీణ కథ
అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో సందీప్ సరోజ్, సాత్విక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేట’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం సోమవారం(ఆగస్టు 31) ఘనంగా నిర్వహించారు. కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన నాగబాబుకి ధన్యవాదాలు. ‘వేట’ అనేది చిరంజీవి సినిమా టైటిల్. ఇది ఓ గ్రామీణ కథ. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా ఎస్ఆర్డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తున్నారు. చదవండి: గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా.. -
గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా..
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మరో వినూత్న కార్యక్రమం ముందడుగు పడింది. ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు.(ఎక్కువ మంది చదవింది: ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్’పై స్టార్హీరోల ప్రశంసలు)భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకెమెకిల్స్తో కూడిన కలర్స్తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను చిరంజీవి వివరించారు.చిరంజీవికి కృతజ్ఞతలు‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను అభినందిస్తూ, ‘సీడ్ గణేశ’ కార్యక్రమానికి మద్దతు తెలిపిన చిరంజీవికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రోత్సాహకరమైన మాటలు మరింత మందిని పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకల వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులు పొందుతూనే.. ప్రకృతి పరిరక్షణను మన బాధ్యతగా గుర్తించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ‘గణేశుడిని పూజిద్దాం.. మొక్కను పెంచుదాం.. ప్రకృతిని కాపాడుదాం’ అనే సందేశంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.This Ganesh Chaturthi, I am happy to have Megastar Chiranjeevi garu unveil and launch the #SeedGanesha campaign. 🙏Seed Ganesha is a small effort to bring together devotion and care for nature. Made with natural materials and seeds, the idol can be immersed at home after the… pic.twitter.com/iFcpX8D6En— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2026ఇదీ చదవండి: ‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’ -
‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని రామానాయడు స్డూడియోస్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.ఎక్కువమంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?‘అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి సందీప్ నన్ను చాలా నమ్మాడు. నాతో ఆ సినిమా చేయడానికి సందీప్, ప్రణయ్లు తమ పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. సినిమాపై, నాపై నమ్మకంతో అంతవరకు వెళ్లారు. ఇప్పుడు ఈ సినిమాకి గెస్ట్గా వచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సందీప్ పిలిచినప్పుడు రాకపోతే నేను బ్రతికి వేస్ట్. మన ఇద్దరి మధ్య ఉన్న బాండీంగ్లో థ్యాంక్స్ లాంటావి ఉండకూడదు. సందీప్ నాకు బ్రదర్ కాదు, స్నేహితుడు అంతకంటే కాదు. మా బాండింగ్ వేరే.’ అంటూ విజయ్ మాట్లాడుతూ భావోద్వేగం అయ్యాడు.‘రణబాలి’ విషయానికి వస్తే..హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా? -
నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా అంటూ ఎస్జే సూర్య ఆగ్రహం
తమిళ హీరో కార్తీక్కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీక్ నటించిన బ్లాక్బాస్టర్ మూవీ సర్దార్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్2’. పీఎస్ మిత్రన్ దర్శకుడు. సెప్టెంబరు 10న పాన్ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్లో పాల్గొన్న నటుడు ఎస్జే సూర్యకు అక్కడి సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్ బాటిల్లో నీరు అందించారు. దీనిని గమనించిన సూర్య తనదైన శైలిలో ‘నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా..?ఈ సర్దార్కి కూడా ఇదేనా’ అని కోపంగా అంటూ నవ్వులు పూయించాడు. పక్కనే ఉన్న హీరో కార్తీ తన వాటర్ బాటిల్ను సూర్యకు అందించారు.సినిమా కాన్సెప్ట్కి.. కాగా ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఆరోగ్యం పోతోంది అంటూ తీసిన సర్దార్ సినిమా కాన్సెప్ట్కి ఈ సంఘటన తోడు కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్గా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిష్ విజయన్ హీరోయిన్లు కాగా సీఎస్ సామ్ సంగీతం అందిస్తున్నాడు.When given WATER to SJSuryah in PLASTIC BOTTLE:#Karthi: Adhu Plastic Bottle Venam....#SJSuryah: Enga Vandhu, Plastic Bottle kudukaringa...#Sardar2 daaaa👊 pic.twitter.com/OMvdgWRS9W— AmuthaBharathi (@CinemaWithAB) August 29, 2026ఇదీ చదవండి: కింగ్తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది? -
కింగ్తో.. కింగే పోటీ.. ఆ రోజు ఏం జరగబోతోంది?
టైటిల్ ఏంటి? రిలీజ్ ఎప్పుడు? ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుంది? అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో నాగార్జున 67వ పుట్టినరోజు సందర్భంగా అతని 100వ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా గ్లింప్స్ కూడా వాళ్ల అంచనాలకు తగ్గట్టే ఉంది.అయితే సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ‘కింగ్100’ చిత్రాన్ని డెసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.. అయితే ఇక్కడే ఓ చిక్కముడి ఉంది. అదే రోజు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సినిమా ‘కింగ్’ కూడా అదే రోజు విడుదల కానుంది. దీంతో ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండటం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఆ రోజు ఎవరు విజయం సాధిస్తారోనని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.( చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే)డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది..‘కింగ్100’ నుంచి నిన్న(శనివారం)విడుదలైన గ్లింప్స్లో నాగార్జున స్టైలిష్, పవర్ఫుల్గా కనిపించారు. ‘ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. డబ్బున్నవాళ్లు.. డబ్బులేనివాళ్లు. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బు వచ్చాక కింగ్ అన్నారు. కానీ ఈ గుర్తింపు డబ్బు కంటే శక్తివంతమైనది. ఆ గుర్తింపును నిలబెట్టుకోవడానికి నేను పరుగెత్తుతూనే ఉండాలి’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.28 ఏళ్ల తర్వాత నాగ్,టబు జోడీ‘కింగ్100’లో టబు నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగర్జున, టబు ఈ జోడీ మరోసారి తెరపై కనిపించనుంది. వీరిద్దరూ తొలిసారి 1996లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత ‘ఆవిడ మా ఆవిడే’ (1998), ‘సిసింద్రీ’ (1999) సినిమాల్లోనూ కలిసి సందడి చేశారు.డిసెంబర్ 24న బిగ్ ఫైట్ఆర్.ఏ. కార్తీక్ రచన, దర్శకత్వంలో ‘కింగ్100’ తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సతీష్ కుమార్ ఎన్ ప్రొడక్షన్ డిజైనర్గా.. నవీన్ నూలి ఎడిటర్గా పనిచేస్తున్నారు. మరోవైపు షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ కూడా డిసెంబర్ 24నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదీ చదవండి: నాగ్ బర్త్డే పోస్ట్కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్పై ట్రోలింగ్! -
ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్’పై స్టార్హీరోల ప్రశంసలు
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాణించింది. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే యాశ్ నటించిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి కన్నడ చిత్రసీమ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. యశ్ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ఇలా చేయడానికి ధైర్యం కావాలి‘ఓ పాత్రను తెరపై ఆవిష్కరించేందుకు నటుడు ఎంతగా కష్టపడతాడో ‘టాక్సిక్’లో యశ్ చూపించాడు. కథ, పాత్రలు సినిమాల తరహాలో లేకపోయినా కొత్తగా ప్రయాణించడం తప్పు కాదు. మనసులో పుట్టిన ఆలోచనను తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. యశ్ ఈ సినిమాలో పూర్తిగా లీనమైపోయాడు. ఇలాంటి ప్రయోగం చేయడానికి ముందుకు వచ్చినందుకు హ్యాట్సాఫ్’ అంటూ రిషబ్ శెట్టి ప్రశంసించాడు.( యశ్ టాక్సిక్ వసూళ్లు.. రెండో రోజే తేల్చేశారు..!)‘సాధారణమైన, ఊహించని మార్గాన్ని ఎంచుకోకుండా కొత్తగా ప్రయత్నించారు. ఇలాంటి సినిమా చేయడానికి నమ్మకం, ధైర్యం అవసరం. టాక్సిక్ అసాధారణమైన, ప్రశంసించదగన ప్రయత్నం’ అంటూ కిచ్చా సుదీప్ సైతం పేర్కొన్నాడు.‘టాక్సిక్ ఒక ఫెయిరీ టేల్. కానీ పెద్దల కోసం. అద్భుతమైన సినిమా. సరికొత్త ప్రపంచం, పూర్తిగా కొత్త అనుభూతి. యశ్తో పాటు మొత్త చిత్రబృందానికి హ్యాట్సాఫ్’ అంటూ నటుడు ఉపేంద్ర పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. ‘టాక్సిక్’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్అసలు టాక్సిక్లో ఏం చూపించారంటే..గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కించారు. పోర్చిగీసు కాలం నాటి గోవా నేపథ్యాన్ని జోడించి తీశారు. యశ్ పోషించిన రాయా అనే పాత్ర నేరాలు చేయడానికి గల కారణాలు ఏంటి? అతడితో సోదరి అనుభందం ఏంటి? అనే అంశాల చుట్టు కథ నడుస్తూ ఉంటుంది. -
చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్ చిత్రసీమలో సినిమాల్లోని హీరోహీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ నటనతోనే కథను నడిపిస్తూ.. స్టార్ హీరోహీరోయిన్లతో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తద్వార మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరికి నిర్మాతలు సైతం మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. మరి టాలీవుడ్లో మంచి పారితోషికాలు అందుకున్న ఆ చిన్నారులు ఎవరు? వారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.ఇదీ చదవండి: నాగ్ బర్త్డే పోస్ట్కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్పై ట్రోలింగ్!నక్షత్రఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ.. ఇరుముడి సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ చిన్నారి. ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. ఈ సినిమాకు సుమారు రూ.10లక్షలు పారితోషికం తీసుకుందట. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.రేవంత్(బుల్లిరాజు)‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రేవంత్. ఇప్పుడు ఈపేరు కాస్త బుల్లిరాజుగా మారిపోయింది. ఈ చిత్రంలో వెంకటేశ్ తనయుడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం తెచ్చిన ఫేమ్ బుల్లిరాజుకు టాలీవుడ్లో మంచి డిమాండ్ను తీసుకొచ్చింది. అదే ఊపుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలోనూ నటించి సందడి చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలోనూ నటించి మెప్పించాడు. అయితే బుల్లిరాజు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటాడట. మూవీ బడ్జెట్ను బట్టి రోజుకు రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్.అల్లు అర్హ‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్ స్రీన్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ. ఈ సినిమాలో భరతుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమెకు నిమిషానికి రెండు లక్షలు చొప్పున పారితోషికం అందంచారట. అంటే 10 నిమిషాలకు రూ.20 లక్షల వరకు అందుకుందని సమాచారం.చదవండి:సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..?రోహన్అనేక సీరియల్స్తో తన నటనతో మెప్పించాడు రోహన్. బుల్లితెరపై కళ్యాణ వైభోగమే. సీరియల్తో పాపులార్ అయిన రోహన్. చెక్, వినయవిధేయరాయ వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత 90s వెబ్ సిరీస్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఒక్కరోజుకి రూ.30 వేల నుంచి 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న సమ్మర్ హాలీడేస్ చిత్రంతో మరికొద్దిరోజుల్లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.సితారసూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఇంకా వెండి తెరకు పరిచయం కాలేదు. కానీ సితార ఒక్కో యాడ్కి రూ. 15లక్షల నుంచి 25లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందట. అయితే వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని యాడ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా చిన్న వయసులోనే ఓ జ్యుయలరీ సంస్థకి బ్రాండ్కు ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార గతంలో ఓ ఇంటర్వ్యులో చెప్పారు. ( కొత్త సీన్లతో మళ్లీ అర్జున్రెడ్డి.. ) -
ఇమ్రాన్ హష్మీకి స్వైన్ ఫ్లూ.. ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పిన హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇమ్రాన్.. ఇటీవల ముంబైకి తిరిగి వచ్చిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఇన్ఫ్లూయెంజా ఏ, స్వైన్ ఫ్లూ తేలినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇమ్రాన్ హష్మీ అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఇమ్రాన్ ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పందించలేదు. మరోవైపు బెంగళూరులో శనివారం జరగాల్సిన తన లైవ్ ఈవెంట్కు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనారోగ్యం కారణంగానే కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అభిమానులకు తెలిపారు.అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయకుండా సెప్టెంబర్ 12కు వాయిదా వేసినట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసినవారు వాటిని భద్రంగా ఉంచుకోవచ్చని.. కొత్త తేదీన అవే టికెట్లు చెల్లుబాటు అవుతాయని నిర్వాహకులు వెల్లడించినట్లు సమాచారం. కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు అభిమానులకు ఇమ్రాన్ క్షమాపణలు చెప్పారు.ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్లో జోష్ మీదున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఆవారాపన్ 2’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలైన ‘ఆవారాపన్’కు సీక్వెల్గా రూపొందింది. దిశా పటానీ, షబానా అజ్మీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.విడుదలైన తొలిరోజు నుంచే ‘ఆవారాపన్ 2’కు మంచి స్పందన వచ్చింది. రెండో రోజునే ఈ చిత్రం రూ.33.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు మొత్తంగా ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది. -
నాగ్ బర్త్డే పోస్ట్కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్పై ట్రోలింగ్!
సినీ తారలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఉంటుంది. చిన్న తప్పు చేసినా దాన్ని క్షణాల్లో వైరల్ చేసి.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేదంటే ఉన్న పరువు కాస్తా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నటి ప్రగ్యా జైస్వాల్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కింగ్ నాగార్జునకు పుట్టినరోజు(ఆగస్టు 29) శుభాకాంక్షలు చెబుతూ ఆమె పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మంచి ఉద్దేశంతో పెట్టిన పోస్ట్ కాస్తా.. చివరకు మీమ్స్, ట్రోలింగ్కు కారణమైంది.అసలేం జరిగింది?నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా నాగార్జున ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్డే నాగార్జున గారు.. మీ ఎనర్జీ, ఛార్మ్ అద్భుతం’ అంటూ విషెస్ తెలిపింది. అయితే ఈ పోస్ట్కు బ్యాక్గ్రౌండ్లో ఓ ఆడియోను యాడ్ చేయడంతో అసలు చిక్కు వచ్చిపడింది.ఆడియోలో అసభ్యపదజాలంప్రగ్యా జైస్వాల్ ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీలో సెర్చ్ చేసి ఓ ఆడియోను తన స్టోరీకి జోడించింది. అయితే ఆ ఆడియోలో అసభ్యకరమైన పదజాలం ఉన్న విషయాన్ని ఆమె కానీ, ఆమె సోషల్ మీడియా టీమ్ కానీ గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. నాగార్జున పేరు కనిపించడంతో ఆ ఆడియోను పూర్తిగా వినకుండానే స్టోరీలో యాడ్ చేసి పోస్ట్ చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సీనియర్ స్టార్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న పోస్ట్లో అభ్యంతరకరమైన పదాలతో కూడిన ఆడియో రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్షాట్లు, స్క్రీన్ రికార్డింగ్లు క్షణాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విషయం గుర్తించిన ప్రగ్యా జైస్వాల్ వెంటనే ఆ స్టోరీని డిలీట్ చేసింది. అనంతరం ఆడియోను తొలగించి.. కేవలం నాగార్జున ఫొటో, విషెస్తో మరో స్టోరీని రీపోస్ట్ చేసింది.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రగ్యా చేసిన ఈ పొరపాటుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలుగు భాషపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్లే ఆ ఆడియోలోని పదాలను ఆమె గుర్తించలేకపోయి ఉండొచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే డిజిటల్, పీఆర్ టీమ్ల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని మండిపడుతున్నారు. -
నా పిల్లలే నా బలం..వారికే పూర్తి సమయం కేటాయిస్తా: నయనతార
రెండు దశాబ్దాలు దాటిన అగ్ర కథానాయకిగా నటిస్తున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో నయనతార ఒకరు. తమిళంలో అయ్యా చిత్రం ద్వారా కథానాయకిగా తన సినీ పయనాన్ని ప్రారంభించిన నయనతార ఆ తర్వాత వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్గా మారారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాదిలోని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి స్థాయికి ఎదిగారు. నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్తో పరిచయం ప్రేమగా మారి , అది పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన విషయం తెలిసిందే. వారికి ఉలగం, ఉయిర్ అని నామకరణం చేశారు. (చదవండి: ‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!)ఇకపోతే కెరియర్ పరంగా ఇప్పటికీ పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార నటించిన తాజా చిత్రాల్లో కన్నడంలో యష్తో కలిసిన పాన్ ఇండియా చిత్రం టాక్స్, అదేవిధంగా తను కథానాయకిగా నటించి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన హాయ్ చిత్రం ఇటీవల ఒకేసారి తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా నటి నయనతార ఒక భేటీలో పేర్కొంటూ నటిగా, అమ్మగా సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం అంత సులభమైన విషయం కాదన్నారు. అయితే కొడుకులు ఉయిర్, ఉలగం తనకు పెద్ద బలంగా నిలిచారన్నారు. కుటుంబ మద్దతు చాలా ముఖ్యం అన్నారు. తాను తన పిల్లలతో గడిపేటప్పుడు వారికే పూర్తిగా సమయాన్ని కేటాయిస్తానన్నారు. ఇతర పనులపై దృష్టి సారించనని, అదే తనకు మానసిక బలాన్ని చేకూరుస్తుందని నయనతార పేర్కొన్నారు. -
కోలీవుడ్లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి
తన కలను నెరవేర్చుకోవడానికి ఎంతగానో శ్రమించి, ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నటి భానుప్రియ. ఈమె పదహారు అణాల తెలుగు ఆడపడుచు కావడం విశేషం చాలా మంది తెలుగు తారలు మాదిరిగానే ఈమె కూడా తమిళంలో నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దీని గురించి ఆమె తెలుపుతూ ‘‘చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిచాలని కలలు కనేదాన్ని. లయోలో కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్ చదివాను. తరువాత పకృద్ధీన్ మాస్టర్ నాటక బృందంలో చేరాను. ఆ తర పలు ప్రముఖ టీవీ సంస్థల్లో పని చేసి తన కలను నెరవేర్చుకోవడానికి సినీ రంగప్రవేశం చేశాను. పకృద్ధీన్ మాస్టర్ ద్వారా కూళంగళ్ చిత్రంలో మొదటి సారిగా నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత నా సినీ పతనాన్ని ముందుకు తీసుకురావడానికి తాయ్ కిళవి చిత్రం అమిరింది . తాజాగా మొద రాతిరి చిత్రంలో నటుడు బక్స్కు భార్యగా దేవి అనే పాత్రలో నటించాను . అందులో తన పొత్రకం పలువురి ప్రశంసలు లభించాయి. తదుపరి వెట్రిమారన్ దర్శకత్వంలో రాజన్ వగైయారా చిత్రలో నటుడు కు కిశోర్ కు భార్యాగా నటిస్తున్నాను. దీనితో సంతానం కథానాయకుడుగా నటిస్తున్న లవ్ బైట్ చిత్రంలో, అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన ఓం చిత్రంలోనూ ముఖ్య పాత్రలు పోషిస్తున్నాను. ఇలా ప్రముఖ దర్శకుల చిత్రాల్లో తాను ఒక భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని నటి భానుప్రియ పేర్కొన్నారు. -
మరో కియారాను చూస్తారు!
పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. పేరెంట్హుడ్... ఇలా జీవితంలో ఎన్ని కొత్త దశలు వచ్చినా కెమెరాకు మాత్రం కియారా అద్వానీ బ్రేక్ చెప్పలేదు! వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, నటిగా తన ప్రయాణాన్నీ అంతే జోరుగా కొనసాగిస్తోంది. ఈ నిరంతర ప్రయాణం వెనుక ఉన్న విషయాలన్నీ ఆమె మాటల్లోనే!పేరులో చిన్న ట్విస్ట్!నా అసలు పేరు ఆలియా. సినిమాల్లోకి రాకముందు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ‘అంజానా అంజానీ’లో ప్రియాంక చోప్రా పోషించిన కియారా పాత్ర నాకు చాలా ఇష్టం. సల్మాన్ ఖాన్ కూడా అదే సూచించారు. అలా... నాకు ‘కియారా’ పేరు ఫిక్స్ అయిపోయింది.టీచర్ అవుతాననుకున్నా!మా అమ్మ టీచర్ కావడంతో.. చిన్నప్పుడు నేను కూడా అచ్చం అమ్మలాగే టీచర్ అవుదామనుకున్నా. కానీ జీవితం మనం అనుకున్నట్టే ఉండదు కదా! పిల్లలకు చదువు చెప్పాల్సిన నేను... ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాను.ఇన్నేళ్లకు... వర్షంలో తడిశా!ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు పక్కా సినిమాటిక్ వర్షపు సీన్ చేయలేదు. ‘టాక్సిక్’లో ఆ చాన్స్ వచ్చింది. స్క్రీన్ పై వర్షంలో తడుస్తూ కనిపించడం చాలా రొమాంటిక్గా ఉంటుంది కదా... కానీ షూటింగ్ సమయంలో మాత్రం ‘ఇంకెంతసేపు ఈ వర్షం!’ అనిపిస్తుంది!అది కనిపిస్తే డైట్కి బై చెప్తా!ఫిట్గా ఉండటానికి డైట్ చేస్తాను కానీ... తిండిని పూర్తిగా వదిలేయలేను! ముంబై మసాలా టోస్ట్ నా చిన్నప్పటి ఫేవరెట్. ఢిల్లీకి వెళ్తే మటర్ కుల్చా తినాల్సిందే. ఇంట్లో చేసే సింధీ వంటకాలంటే ఇంకా ఇష్టం. రాత్రి డార్క్ చాక్లెట్ కనిపిస్తే మాత్రం నా డైట్ కాస్త నన్ను వదిలేస్తుంది!కెరీర్కు ముందు, తర్వాత!‘టాక్సిక్’ సినిమాతో నేను ఇంతకుముందెప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తాను. నిజంగా చెప్పాలంటే... టాక్సిక్కి ముందు ఒక కియారా, తర్వాత మరో కియారాను ప్రేక్షకులు చూస్తారు.‘ధోనీ’తో... నా ఆట మొదలైంది!‘ఫగ్లీ’తో మొదలుపెట్టినా... ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ నా కెరీర్కు మంచి మలుపు. సాక్షి పాత్రను ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారని ఊహించలేదు. ఆ సినిమా తర్వాత ‘కియారా’ అనే పేరు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.బాడీగార్డ్లా చూసుకుంది!‘టాక్సిక్’ షూటింగ్ సమయంలో నా జీవితంలో చాలా ప్రత్యేకమైన దశ నడుస్తోంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ని. నేను సేఫ్గా ఉండేలా యశ్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. వాళ్లు సెట్లో సహనటులు, దర్శకురాలు కంటే... నా బాడీగార్డ్స్లా మారిపోయారు!నా బ్యాగ్లోని బుక్!ఖాళీ సమయం దొరికితే ఇంట్లో కూర్చొని స్కెచ్లు వేస్తుంటాను. అందుకే, నా బ్యాగ్లో ఎప్పుడూ స్కెచ్బుక్ ఉంటుంది. కొన్నిసార్లు అమెరికన్ సిరీస్లు, సైకలాజికల్ థ్రిల్లర్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తాను. షూటింగ్ ప్రపంచం నుంచి కాస్త బయటకు రావడానికి ఇవే నా చిన్న చిన్న ఎస్కేప్స్.ఫిట్నెస్ ఫైట్!ఫిట్నెస్ అంటే నాకు బోరింగ్ వర్కౌట్స్ మాత్రమే కాదు. ఎంఎంఏ, కిక్బాక్సింగ్ లాంటివి కూడా చేస్తాను. అవి ఫిట్గా ఉంచడంతో పాటు చాలా ఎనర్జీ ఇస్తాయి. పైగా యాక్షన్ సినిమాల్లో పనిచేసేటప్పుడు ఆ ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది. -
ఓటీటీలోక్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్విస్టులు ఊహించలేరు!
ప్రేక్షకులందు సినిమా ప్రేక్షకులు వేరయా...అది ఆటైనా, పాటైనా ...వేడుకేదైనా, వేదికేదైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కార్యక్రమం రూపుదిద్దుకుంటే మాత్రం చాలు ఆ కార్యక్రమం విజయవంతమైనట్లే. కాని సినిమా ప్రేక్షకులు మాత్రం వీటన్నిటికీ విభిన్నం. విషయాన్ని సూటిగా చెబితే సినీ ప్రేక్షకులు అలరించరు. అదే విషయానికి కాస్త మసాలా దట్టించి చెప్పాలనుకున్న విషయాన్ని వినూత్నంగా చివరాఖరిలో చెబితేనే సినిమా అలరిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పటితరం వైవిధ్యానికి పెద్ద పీట వేస్తోంది.ఆ నేపధ్యంలో వచ్చిన సినిమా ఉయిర్. ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇది మళయాళ సినిమా అయినా హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రముఖ మళయాళ రచయితలు షాజీ, నిఖిల్ రాసిన కథకు పద్మకుమార్ ప్రాణం పోసిన సినిమానే ఉయిర్. ఈ సినిమా ప్రారంభం నుండి శుభం కార్డు వరకు ప్రేక్షకుడిలో ఆమితాసక్తిని రేకెత్తిస్తూ ఆఖరి సన్నివేశం వరకూ ఉత్కంఠ రేపుతుంది. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం.కేరళలోని కన్నూర్ సమీప ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన బావిలో కుళ్ళిపోయిన స్థితిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడటంతో కథ ప్రారంభమవుతుంది. కొత్తగా విధుల్లో చేరిన సబ్ఇన్స్పెక్టర్ అజీబ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ జాయ్ పర్యవేక్షణలో అజీబ్ తన మొదటి పెద్ద కేసుగా దీన్ని తీసుకుంటాడు. ప్రారంభంలో ఎలాంటి క్లూస్ దొరకకపోయినా, ఆ శవం వేసుకోనున్న బట్టలు, చేతి గాజుల ఆధారంగా ఆ మహిళ కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన వలస కార్మికురాలు 'శోభ' అని గుర్తిస్తారు.విచారణ ముందుకెళ్ళేకొద్దీ ఇది సాధారణ హత్య కాదని దీని వెనుక పెద్ద మోసపూరిత కుట్ర దాగుందని అజీబ్ కు అర్థమవుతుంది. శోభ హత్య సమయంలో తప్పిపోయిన శోభ పిల్లల గురించి అజీబ్ ఆరా తీస్తుంటాడు. మరో వైపు అజీబ్కు చిన్నతనంలోనే తన సొంత చెల్లెలు తప్పిపోయిన చేదు జ్ఞాపకం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. దానికి ఈ హత్యకు ఓ లింకు కూడా ఉంటుంది. మరి శోభను హత్య చేసిన అసలు నేరస్థుడిని అలాగే శోభ పిల్లలను అజీబ్ వెతికి పట్టుకుంటాడా లేదా అన్నది మాత్రం ఉయిర్ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం ఊహకందని రీతిలో పరిగెడుతుంది. మస్ట్ వాచ్ థ్రిల్లర్ ఫర్ ది వీకెండ్. -
‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!
వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోకు ఒక్క హిట్ పడితే చాలు.. మళ్లీ పుంజుకోవడానికి అదే విజయమే ఊతమవుతుంది. ఇప్పుడు రవితేజ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘ఇరుముడి’తో హిట్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత రూ.100 కోట్ల వసూళ్లను అందుకున్నాడు. ‘ధమాకా’(2022) తర్వాత ఆయన నటించిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కొన్ని సినిమాలైతే కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి. దీంతో రవితేజ సినిమా వస్తుందంటే గతంలో కనిపించినంత హడావుడి కూడా కనిపించేది కాదు. కానీ ‘ఇరుముడి’ మాత్రం ఆ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. రవితేజలో మళ్లీ జోష్ నింపడమే కాకుండా.. ఆయన మార్కెట్పై కూడా కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చింది. దీంతో వచ్చిన విజయాన్ని ఎలాగైనా కొనసాగించాలని భావిస్తున్న రవితేజ.. తన లైనప్పై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.‘ఇరుముడి’ ఇచ్చిన ఊపు‘ఇరుముడి’ ఇంతటి బ్లాక్బస్టర్ కావడం అభిమానులకు మాత్రమే కాదు.. రవితేజకు కూడా ఎక్కడ లేని హుషారు తెచ్చిందట. హిట్ అయితే చాలనుకున్న సినిమాకు ఏకంగా రికార్డు స్థాయి వసూళ్లు(8 రోజుల్లో రూ. 150 కోట్ల గ్రాస్) రావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. రెండో వారంలో ‘టాక్సిక్’ కారణంగా స్క్రీన్లు తగ్గినా.. ఆ సినిమా టాక్ ప్రభావంతో ‘ఇరుముడి’కి మళ్లీ షోలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇలాంటి భారీ విజయం తర్వాత హీరోలు మరింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒక్కసారి వచ్చిన సక్సెస్ను కొనసాగించాలంటే తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇప్పుడు రవితేజ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు టాక్.రవితేజ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులుప్రస్తుతం రవితేజ చేతిలో రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీవిష్ణుతో కలిసి దిల్ రాజు నిర్మాణంలో హసిత్ గోలి తెరకెక్కించనున్న ఎంటర్టైనర్. ఈ సినిమాకు ‘దాగుడుమూతల దండాకోర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత లక్ష్మణ్ నిర్మించనున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రానికి కొంత హారర్ టచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే వరుస ప్రకారం చూస్తే ముందుగా హసిత్ గోలి సినిమా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ‘ఇరుముడి’ తర్వాత రవితేజకు వచ్చిన సక్సెస్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లు సమాచారం. ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.అయితే రెండు సినిమాలను సమాంతరంగా చేయడం కూడా ఒక ఆప్షన్గానే ఉన్నప్పటికీ.. రవితేజ లుక్లో మార్పులు చేయాల్సి రావడంతో అది అంత సులభం కాదని తెలుస్తోంది. మరోవైపు హసిత్ గోలి తెరకెక్కించనున్న ఎంటర్టైనర్లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉందని సమాచారం. స్క్రిప్ట్పై మరింత వర్క్ చేయడానికి సమయం అవసరం కావడంతో ఆ సినిమాను కొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం జరుగుతున్న చర్చలు నిజమైతే.. సెప్టెంబర్ మూడో వారం లేదా అక్టోబర్లో వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో హసిత్ గోలి సినిమా మొదలైతే సంక్రాంతి విడుదలను టార్గెట్గా పెట్టుకుని షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చలే తప్ప అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఏదేమైనా ‘ఇరుముడి’ విజయం రవితేజ ఆలోచనా విధానంలో మాత్రం గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. -
బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. కలెక్షన్స్ ఎంతంటే..?
చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో.. వరుస పరాజయాల తర్వాత ఓ విజయం పలకరించడం కూడా అంతే సహజమని మరోసారి నిరూపించాడు మాస్ మహారాజా రవితేజ. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోకు ఎట్టకేలకు ‘ఇరుముడి’తో హిట్ దొరికింది. అది కూడా మాములు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్.సినిమా రిలీజై వారం రోజులు గడిచినా ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్స్కి పోటెత్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు రూ.150 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అప్పుడెప్పుడో రూ. 100 కోట్లు.. రవితేజ ఖాతాలో రూ. 100 కోట్ల వసూళ్ల సినిమా పడి చాలా కాలమైంది. 2022లో వచ్చిన ధమాకా ఒక్కటే సెంచరీ కొట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. ఈ నాలుగేళ్లలో ఆయన 6 సినిమాలు చేస్తే.. వాటిలో ఏ ఒక్కటి కూడా హిట్ టాక్ని సంపాదించుకోలేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇరుముడితో హిట్ కొట్టి.. పాత లెక్కలన్నీ సరిచేశాడు. మరి ఇకపై ఈ మాస్ మహారాజ సినీ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. -
ఆ మహాగాయిని పాత్రలో నటించే హీరోయిన్ ఈమెనేనా?
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ గాయిని ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘జెర్సీ’ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. ఇందులో సుబ్బలక్ష్మిపాత్రను ఎవరు పోషిస్తారనే విషయం మాత్రం ఇంతకాలం స్పష్టత రాలేదు. తాజాగా ఈ పాత్రకోసం ఓ హీరోయిన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం సాయిపల్లవి, రుక్మిణి వసంత్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరిని కాదని మరో స్టార్ హీరోయిన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ హీరోయిన్ మరోవరోకాదు నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ విషయాన్ని ఎంఎస్ సుబ్బలక్షి జయంతి(సెప్టెంబర్ 16) సందర్భంగా అధికారికంగా చిత్రబృందం ప్రకటించనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్, తదితర విషయాలూ అదే రోజు ప్రకటించే అవకాశముంది.ఇకవేళ ఇదే జరిగితే ఛాలెంజే..సుబ్బలక్ష్మి పాత్ర రష్మికకు ఎంతో ప్రత్యేకమైనదే కాకుండా పెద్ద సవాలుగా మారనుంది. ఆమె ప్రశాంతమైన స్వభావం, వ్యక్తిత్వం, హావభావాలు, తెరపై కనిపించే గాంభీర్యాన్ని రష్మిక తన నటనలో చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇదే జరిగితే ఈ పాత్రను ఆమె ఎలా ఆవిష్కరిస్తుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.చదవండి: రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..? -
వయసు 67.. తెరపై 30లా.. నాగ్ డైట్ సీక్రెట్ తన మాటల్లోనే..
వయసు అనేది కేవలం క్యాలెండర్లో మారే సంఖ్యే తప్ప.. మనిషి కనిపించే తీరుకు, ఆలోచించే విధానానికి అది కొలమానం కాదని నిరూపిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులోనూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. మరి ఈ యవ్వన రహస్యం ఏంటి? దానికి నాగార్జున చెప్పిన సమాధానం ఏమిటి? గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్కు సంబంధించిన విషయాలను నాగార్జున స్వయంగా వెల్లడించారు. తన మాటల్లోనే..ఇదీ చదవండి: ‘కింగ్100’ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్రోజు మొదలయ్యేది అలా..👉 ఉదయం లేవగానే వర్కౌట్స్ చేయడం అలవాటు. జిమ్కు వెళ్లడం కుదరని రోజుల్లో వాకింగ్ లేదా స్విమ్మింగ్ను ఎంచుకుంటా. ఏదో ఒక కారణంతో వ్యాయామాన్ని మాత్రం వదులుకోను.వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా వర్కౌట్ చేస్తా. రోజుకు సుమారు గంటా 45 నిమిషాల పాటు వ్యాయామానికి సమయం కేటాయిస్తా. నిద్ర విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటా’ అని తెలిపారు. దీంతో పాటు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం కూడా ఫిట్నెస్ రొటీన్లో భాగమని తెలిపారు.👉 యంగ్గా కనిపించడానికి వర్కౌట్స్ ఒక్కటే సరిపోవు. మంచి ఆహారం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తీసుకోవడం నాకు అలవాటు. చికెన్, మటన్, ఫిష్ అన్నీ తింటా. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటా. ఆలస్యం చేయకుండా ఏడు లేదా ఏడున్నర గంటలలోపే పూర్తి చేసేస్తా.ఎప్పుడూ డైట్లో ఉండాల్సిన అవసరం లేదు👉 ఎప్పుడూ డైట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆదివారం అయితే నచ్చిన ఆహారాన్ని ఇష్టంగా తింటా. స్వీట్స్ అంటే చాలా ఇష్టం. రాత్రి వేళల్లో స్వీట్స్ ఎక్కువగా తింటా. స్వీట్ తినకపోతే నాకు రాత్రి నిద్ర పట్టదు. తినాలనిపించినప్పుడు ‘డైట్’ అనే ఆలోచనే రాదు. నచ్చింది తినాలనిపించినా.. ఏదైనా తాగాలనిపించినా.. వెంటనే చేసేస్తా. అయితే వర్కౌట్స్ క్రమం తప్పకుండా చేస్తూ ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. గోల్ఫ్ ఎందుకంటే..👉 నాగార్జున ఫిట్నెస్ జాబితాలో గోల్ఫ్ కూడా ఉంది. గోల్ఫ్ ఆడటం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని.. మానసికంగా కూడా తనకు ఎంతో ఉపయోగపడుతుందని నాగార్జున చెబుతున్నారు. గేమ్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించేందుకు ప్రయత్నించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇదీ చదవండి: బిగ్బాస్ సీజన్-10.. హౌస్లోకి చెన్నై లవ్ స్టోరీ నటుడు..! -
‘కింగ్100’ నుంచి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్ప్రైజ్ వచ్చేసింది. రా కార్తీక్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున వందో మూవీని ‘కింగ్100’గా ఖరారు చేశారు. నేడు నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ను చిత్రబృందం విడుదల చేసింది. నాగార్జున కొత్తగా కనిపిస్తున్నాడు. ‘మనుషుల్లో రెండు రకాలు..ఒకటి డబ్బు ఉన్నోల్లు, రెండు డబ్బు లేనోల్లు’ అనే డైలగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుటుంది. కాగా నాగార్జున వందో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. -
సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..? రిప్లై అదిరింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్మీడియాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్లో ఆసక్తికర విషయాలాన్ని వెల్లడించారు.ఇప్పటికే 11 కిలోలు పెరిగాను‘కొత్తగా తల్లులు కాబోతున్నవారూ.. ఎలా సాగుతోంది?’ అని ఓ అభిమాని సమంతను ప్రశ్నించారు. దీనికి ఓ అభిమాని ‘బరువు పెరుగుతోంది’ అని బదులిచ్చారు. దానికి స్పందించిన సమంత.. ‘నాకూ అదే అనిపిస్తోంది. ఇప్పటికే 11 కిలోలు పెరిగాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘ఈ మాతృత్వ దశను ఎంజాయ్ చేస్తున్నారా?’ అని మరో అభిమాని అడగగా.. ‘మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని సమంత బదులిచ్చారు. మరొకరు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు? అని అడగగా.. దానికి మీ అందరి సహాయం కావాలి అని బదులిచ్చింది.రాజ్తో కలిసి బేబీమూన్ఇటీవల సమంత భర్త రాజ్ నిడిమోరుతో కలిసి బేబీమూన్కు వెళ్లిన ఫొటోలను కూడా సోషల్మీడియాలో పంచుకున్నారు. కొత్త ప్రదేశాన్ని సందర్శిస్తూ ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు ఆ ఫొటోల్లో కనిపించాయి. అంతేకాకుండా తన వర్కౌట్ సెషన్స్కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు.‘మా ఇంటి బంగారం’ తర్వాత బ్రేక్సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం సమంత మాతృత్వం కోసం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కంగనా నోట అన్నయ్య..! రాఖీతో ముగిసిన మాటల యుద్ధం -
కంగనా నోట అన్నయ్య..! రాఖీతో ముగిసిన మాటల యుద్ధం
వారం రోజులుగా మాటల తూటాలతో హోరెత్తిన యోగా గురువు రామ్దేవ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మధ్య వివాదానికి రక్షాబంధన్ సందర్భంగా తెరపడింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్న ఈ ఇద్దరూ.. పండగ వేళ విభేదాలను పక్కనపెట్టారు. రామ్దేవ్ స్వీట్లు, బహుమతిని .. కంగనా ‘అన్నయ్య’గా అనుకుంటూ తనకు పంపిన స్వీట్లను స్వీకరించారు.ద్వేషానికి చోటుండకూడదంటూ..‘దేశంలో కారణం ఏదైనా ద్వేషం ఉండకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. అందకే మా మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా పక్కనపెట్టా. ఏ గోడవైనా మాట్లాడుకుంటే పరిష్కారమవుతుంది’ అని రామ్దేవ్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా కంగనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు. అంతేకాకుండా ఓ బహుమతి, స్వీట్లను పంపించినట్లు తెలిపారు.(ఇదీ చదవండి: రుక్మిణి తండ్రి వెనుక ఇంత చరిత్ర ఉందా..?)అన్నయ్యగా అంగీకరించిన కంగనారామ్దేవ్ పంపిన స్వీట్లు,బహుమతిని స్వీకరించి దీనిపై కంగనా సానుకూలంగా స్పందించారు. ‘పండగలు తప్పులను మర్చిపోవడానికి నా ‘అన్నయ్య’ రామ్దేవ్ పంపిన స్వీట్లను స్వీకరిస్తున్నాను. అన్నయ్యగా ఆయన చూపించిన ప్రేమను, పంపిన బహుమతిని తీసుకుంటున్నాను’ అని కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.రాజకీయ పార్టీలకూ సూచనరాజకీయ పార్టీలకు రామ్దేవ్ ఓ సలహా ఇచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం రాఖీలు కట్టుకోవాలన్నారు. అలా చేస్తే సమాజానికి మంచి సందేశం వెళ్తుందని, ఎలాంటి వివక్ష ఉండకూడదనే భావన ప్రజల్లో బలపడుతుందని పేర్కొన్నారు.అసలు గొడవ ఏంటి? జెన్జీల నిరసనకారులను కంగనా ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణించడంపై రామ్దేవ్ స్పందించడంతో వివాదం మొదలైంది. ఓ టీవీ కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. కంగనా అర్హతలు, వ్యక్తిగత జీవితంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరికి మాటల యుద్ధం మొదలైంది. రామ్దేవ్ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియాలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయొద్దని , రామ్దేవ్ హద్దులు దాటుతున్నారని తీవ్రంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: 'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే? -
జార్జ్కుట్టి.. ఈసారి అయినా లొంగిపోవయ్యా..!
2013లో వచ్చిన చిత్రం ‘దృశ్యం’. అప్పటి నుంచి ప్రారంభమైన దృశ్యం ఫ్రాంచైజీ మోహన్లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీక్వెల్స్ తీస్తూనే వచ్చారు. ఇటీవలే దృశ్యం4’ కూడా ఉంటుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ అప్డేట్ ఇచ్చారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో మరోసారి జార్ట్కుట్టి కుటుంబం, వరుణ్ హత్య కేసుపై మీమ్స్, జోకులు వైరల్ అవుతున్నాయి. ( ఇదీ చదవండి: దృశ్యం ఫ్రాంచైజీకి మరో సీక్వెల్ )ఎలా ట్రోల్ చేస్తున్నారంటే..జార్జ్కుట్టిగా మోహన్లాల్ మరోసారి తెరపై కనిపిస్తుండడంపై అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తూనే.. ‘ఇక ఈ కేసుకు ముగింపు పలకాలంటే అందరినీ అరెస్టు చేయడమే మార్గం’ అని సరదగా కామెంట్లు చేస్తున్నారు.‘వరుణ్ అస్థిపంజరం కూడా జార్జ్కుట్టి కుటుంబాన్ని ప్రశ్నిస్తుందేమో’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ‘ఆ వ్యక్తిని చంపింది నేనే.. నన్ను అరెస్టు చేయండి’ అంటూ మరో వ్యక్తి కేరళ పోలీసులను, మోహన్లాల్ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. మరి కొందరు ఈ ఫ్రాంచైజ్ను ‘ప్రధానమంత్రి అజయ్ దేవ్గణ్ రోజ్గర్ యోజన’ అంటూ సరదాగా ట్రోల్ చేశారు.దృశ్యం4 కథేంటి..మోహన్లాల్ జార్జ్కుట్టిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’ 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘దృశ్యం2’, ‘దృశ్యం3’ వరకు కొత్త కొత్త అంశాలతో కథను కొనసాగించారు. ఇప్పుడు ‘దృశ్యం4’లో ఈసారి జార్జ్కుట్టిని పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు? అతడి కుటుంబం ఎలాంటి సమస్యలో చిక్కుకోనుంది.? అనే కోణంలో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందోనని ఈ ప్రాంచేజీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘జార్జ్కుట్టి.. ఇక చాలించు.. ఈసారి అయినా లొంగిపో’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఎలా మొదలైందంటే..‘దృశ్యం’ సినిమాలో జార్జ్కుట్టి, అతడి భార్య రాణి, ఇద్దరు కుమార్తెల జీవితాల్లోకి వరుణ్ ప్రభాకర్ మరణం అనుకోని సమస్యను తీసుకొస్తుంది. జార్జ్కుట్టి పోలీసులకు చిక్కకుండా పక్కా స్కెచ్ వేస్తాడు. పోలీసు అధికారి కుమారుడు వరుణ్ కావడంతో అప్పటి నుంచి ఆ కేసు అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. -
కొత్త సీన్లతో మళ్లీ అర్జున్రెడ్డి.. ఈసారి ఎలా ఉంటుందంటే..!
నేటికి 9 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఈ సినిమాతో ఇటు డైరెక్టర్, అటు హీరో ఇద్దరూ వారివారి భవిష్యత్తులకు పునాదివేసుకున్నారు. 2017లో సంచలనం సృష్టించిన ఈ తెలుగు సినిమా.. తర్వాత హిందీలోనూ రీమేక్ అయ్యి మంచి విజయం సాధించింది. ప్రేమకథను ఇలా కూడా చూపించవచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ దేవరకొండ ఓ స్టార్ ఇమేజ్ సంపాదించేశాడు.అయితే ఇటీవల ఓ మూవీ ఈవెంట్లో డెరెక్టర్ సందీప్ రెడ్డి.. అర్జున్రెడ్డి సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. మళ్లీ ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చాడు. అయితే ఈసారి పూర్తి సినిమాను ఎటువంటి కటింగ్స్ లేకుండా విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే దీనికి కొంత సమయం కావాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై హీరో విజయ్ దేవరకొండతో కూడా మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఇప్పుడీ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.(చదవండి: పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్డేట్ వచ్చేసింది..)3.45 నిమిషాల నిడివితో..అయితే గతంలో ఈ సినిమా రీరిలీజ్ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. కట్ చేసిన సీన్లతో మొత్తం 3.45 నిమిషాల నిడివి గల సినిమాను అర్జున్ రెడ్డి మూవీ ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆస్టు 25న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నామని అప్పట్లో సందీప్ రెడ్డి తెలిపారు. అయితే అప్పట్లో విడుదల కాలేదు. ఈ సీన్లు ఉంటాయట..ఈ 3.45 నిమిషాల నిడిలో చాలా ఫన్నీ సీన్లు కూడా ఉన్నాయట. శివ, కమల్, విద్య, కీర్తి ఎలా క్లోజ్ అయ్యారు, అర్జున్ రెడ్డి స్కూల్ ఫ్రెండ్స్.. అతని బాల్యం, బుల్లెట్ బైక్ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్ కూడా ఉండబోతుదంట. ఇదే జరిగితే మళ్లీ ఈ సినిమా ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. కాగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ జంటగా తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. 2017లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో పాటు యూత్లో విపరీతమైన ట్రెండ్ సృష్టించింది. -
'అదే మాట శాశ్వతంగా గుడ్బై అవుతుందనుకోలేదు'
ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నివాళులు అర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి.. నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.‘ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరికి పరిచయం మొదలైంది. తను అప్పటికే ఇన్స్టిట్యూట్లో సీనియర్. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు తన అనుభవాలను పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. అలా ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలు చేశాం. నా సినిమాల్లో తనకు నటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. అలా మా అనుబంధం కొనసాగుతూ వచ్చింది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆ మాట శాశ్వతంగా గుడ్బై అవుతుందని అనుకోలేదు‘ఇటీవలే ఆయన ఓ సినిమా చేశారు. ట్రైలర్ లాంచ్ నన్ను చేయమన్నారు. కచ్చితంగా చేస్తానని చెప్పి చాలా సమయం మాట్లాడుకున్నాం. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పా. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్బై అవుతుందని అనుకోలేదు. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి అన్నారు.ఇదీ చదవండి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత -
కియారాకు సౌత్ కలిసిరావట్లేదా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి సౌత్ సినిమా పెద్దగా కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు సరసన నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మాత్రమే దక్షిణాదిలో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత దక్షిణాదిన ఆమె సినిమా చేసిన ప్రతిసారి ఏదో తేడా కొడుతోంది.అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్చరణ్తో చేసిన ‘వినయ విధేయ రామ’, తరువాత అదే హీరోతో చేసిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద నిరాశపరిచాయి. తాజాగా పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ సరసన నటించిన ‘టాక్సిక్’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్ వస్తోంది. దీంతో ‘భరత్ అనే నేను’ మినహా సౌత్లో కియారా సినిమాలు అన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి.ఇక త్వరలోనే కోలీవుడ్లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పాను. త్వరలోనే దాని గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఇటీవల టాక్సిక్ సినిమా ప్రచారంలో తెలిపింది. ఇక మరోవైపు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ కొత్త ఫ్లాట్ను కియారా కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్ పనుల కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
రాసింది ఒకటి.. తీసింది మరొకటి.. ‘టాక్సిక్’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్
గెలుపుకి కారణాలు వెతుకుతారో లేదో కానీ ఓటమికి మాత్రం కచ్చితంగా నిందితులను వెతుకుతారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే.. ఆ నింద హీరో కంటే ఎక్కువగా దర్శకుడిపైనే పడుతుంది. ‘టాక్సిక్’విషయంలోనూ అదే జరిగింది. యశ్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది.యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నా.. కథ, స్క్రీన్ప్లే, ఎడిటింగ్, నెమ్మదైన నేరేషన్, ఎమోషనల్ కనెక్ట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్దాస్ గతంలో చెప్పిన ఓ మాటలకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తను సినిమా తీసిన విధానం గురించి మాట్లాడుతూ.. ‘నేను రాసింది ఒకటి. తీసింది మరొకటి. ఎడిటింగ్ చేసింది ఇంకొకటి. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ’ అని గీతూ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. సినిమా తెరకెక్కించే క్రమంలో స్క్రిప్ట్ రాసిన విధానం, షూటింగ్లో వచ్చిన మార్పులు, చివరగా ఎడిటింగ్లో రూపుదిద్దుకున్న సినిమా ఒకేలా ఉండకపోవచ్చని ఆమె వ్యాఖ్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘టాక్సిక్’ విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్న వేళ ఈ పాత వ్యాఖ్యలు మళ్లీ చర్చలోకి వచ్చాయి.#Toxicthemovie Director #GeetuMohandas 🧐Evlo talented ah irukkura directors nalla scripts oda Producer kedaikkama irukaanga😑4 Years of #Yash Call Sheet…Producers Amount Ellam waste pandra Director dha ivanga…#TOXIC - TRASH 🚶🏻♂️ pic.twitter.com/iNW3D550BT— 𝚅𝚎𝚗𝚔𝚊𝚝 𝙶𝚅 (@Itz_Venkatesh55) August 26, 2026 -
నిన్న రామ్చరణ్...నేడు చిరంజీవి... ‘ఇరుముడి’పై ‘మెగా’ ప్రశంసలు
ఇరుముడి.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై రష్మిక, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఎక్స్ వేదికగా తమ రివ్యూని ఇచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించానన్నారు. ఈ మేరకు ఎక్స్లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. (చదవండి: 'ఇరుముడి' సక్సెస్.. చరణ్ ప్రశంసలు)‘ఇరుముడి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నా ప్రియ సోదరుడు రవితేజకి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. త్రినాథ్ పాత్రను తన భుజాలపై మోశాడు. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను భావోద్వేగంతో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బేబీ నక్షత్ర(ఈ చిత్రంలో రవితేజ కూతురుగా నటించింది)కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు. చిత్ర బృందానికి, నిర్మాతలకు, నవీన్ యెర్నేని, ఇతరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక చిరంజీవి ట్వీట్పై రవితేజ కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్య..థ్యాంక్యూ సో మచ్’ అని రీట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)ఇరుముడి విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా, బేబీ నక్షత్ర, సాయి కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.108.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻Director @ShivaNirvana, you…— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2026 -
కోట్లు సంపాదించా.. ఇప్పుడు ఫలితం లేదు: షకీలా
షకీలా పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఒకప్పుడు చిత్రసీమలో ఆమెకు ఉండే క్రేజ్ అలాంటిది. నిజానికి ఈమె మలయాళి యాక్టర్ అయినా.. సీమశాస్త్రీ, అల్లరి పిడుగు, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ మరింత దగ్గరయ్యారు. ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో భారీ క్రేజ్ సంపాదించిన ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బాధగా ఉంది..‘నేను ఎప్పుడు తప్పు చేయలేదు. కానీ బాధ పడుతున్నాను. నా సినిమాలు చూడమని ఎవరినీ బ్రతిమలాడలేదు. ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను కాకుండా నా డబ్బునే కోరుకున్నారు. దాదాపు రూ.4 కోట్లు సంపాదించా. అయితే ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. పెద్ద అక్క దగ్గర భద్రంగా ఉంది. దాంతో ఆమె చాలా మంచిగా సెటిల్ అయ్యారు’అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఆమె రాకపోవడమే మంచిది..మీకు నమ్మించి మోసం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ..‘నా పెద్దక్క నన్ను చూసి చాలా ఏళ్లు అయింది. ఆమె నా దగ్గరకి రావడం లేదని చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు రాకపోతేనే మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకి ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బులేదు’ అని షకీలా చెప్పుకొచ్చారు. తన కెరీర్ను కొందరు స్టార్ హీరోలు నాశనం చేశారన్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. ఐపీఎస్ అవుతా..తన జీవితాన్ని మరోసారి ప్రారంభించే అవకాశం వస్తే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఐపీఎస్ కావాలని కోరుకుంటానని షకీలా తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లడం తనకు నచ్చేది కాదని ఉపాధ్యాయులు కొట్టడంతో చదువుపై ఆసక్తి పోయిందని చెప్పారు.ఇటీవలే ఆసుపత్రిలో..కాగా ఇటీవలే మెడ నొప్పికారణంగా ఆసుపత్రిలో చేరారు. అతిగా ఫోన్ ఉపయోగించడం కారణంగా తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని షకీలా తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రమవడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకు సూచించారు.ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్డేట్ వచ్చేసింది.. -
టాక్సిక్ ఫస్ట్డే కలెక్షన్స్ : డివైడ్ టాక్.. అయినా దుమ్ములేపింది!
‘స్టార్’ పవర్ ఉంటే నెగెటివ్ టాక్ కూడా ‘నీటిమీద రాతే’ అని టాక్సిక్ మూవీ వసూళ్లు నిరూపించాయి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తెలుగు ప్రేక్షకులు అయితే చాలా వరకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఆశించిన స్థాయిలో సినిమా లేదని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలు న్యూస్ వెబ్సైట్లు కూడా ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూనే ఇచ్చాయి. (చదవండి: టాక్సిక్ మూవీ రివ్యూ)అయితే ఈవేవి ‘టాక్సిక్’ కలెక్షన్స్కు అడ్డుగా మారలేదు. తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది రాకింగ్ స్టార్ పవర్ ఏంటో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్కు చూపించింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రానికి ఇండియాలో రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. వీటిలో హిందీ వెర్షన్ అత్యధికంగా రూ. 55 కోట్లు వసూలు చేయగా.. తెలుగులో రూ. 16 కోట్లు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కన్నడలో రూ. 23.3 కోట్లు, తమిళంలో రూ. 5.5 కోట్లు, మలయాళంలో రూ. 1.3 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. -
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్డేట్ వచ్చేసింది..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. తొలిత ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ రష్మికకు గాయం కావడంతో విడుదల తేదీని మార్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మికకు గాయం..రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఓ పాట షూటింగ్ చేస్తుండగా ఈమెకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తు తం కోలుకోవడంతో త్వరలోనే మూవీ షూటింగ్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: సన్నీ లియోన్పై కేసు.. కొట్టేసిన కోర్టు -
సన్నీ లియోన్పై కేసు.. కొట్టేసిన కోర్టు
సినీ నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్, మేనేజర్ సన్నీ రాజనీపై 2024లో దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను సెషన్స్ కోర్టు కొట్టేసింది. తెలుగు సినిమా విషయంలో రూ.70 లక్షలకు పైగా కమీషన్ బకాయి పెట్టారంటూ ఓం ప్రకాశ్ జైన్ చేసిన ఆరోపణలపై ఈ పిటిషన్ దాఖలైంది. తన వల్లే సన్నీ లియోన్కు ఓ సినిమాలో అవకాశం వచ్చిందని, ఒప్పందం ప్రకారం రూ.1.75 కోట్ల పారితోషికానికి సంబంధించి 10 శాతం ఇన్సెంటివ్గా తనకు చెల్లించాల్సి ఉందని జైన్ అందులో పేర్కొన్నారు. అయితే కొంత మొత్తం మాత్రమే చెల్లించి, మిగిలిన కమీషన్ను ఇవ్వలేదని ఆరోపించారు.2024లో ఫిర్యాదు..ఈ వ్యవహారంలో మోసం, నమ్మకద్రోహం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డారంటూ జైన్ ఫిర్యాదు చేశారు. 2024లో మేజిస్ట్రేట్ కోర్టు ఆ ఫిర్యాదును తిరస్కరించడంతో ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారం వాణిజ్య లావాదేవీకి సంబంధించినదేనని అదనపు సెషన్స్ జడ్జి పి.ఏ.సానే తెలిపారు. రికార్డుల్లో టాక్స్ ఇన్వాయిస్, రెండు ఫామ్ 16-ఏ కాపీలు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ధ్రువపత్రాలు జైన్కు అనుకూలంగా ఉన్నట్లు కోర్టు గుర్తించింది.ఇలా నిర్ధారించలేం..అయితే కేవలం చెల్లింపులు జరగకపోవడం వల్లే మోసం లేదా నమ్మకద్రోహం నేరాలు నిర్ధారించలేమని స్పష్టం చేసింది. మొదటి నుంచే మోసం చేసినట్లు ఆధారాలు ఉంటేనే వాణిజ్య వివాదం.. క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంటూ జైన్ రివిజన్ పిటిషన్ను కొట్టేసింది.ఇదీ చదవండి: నాకు యాక్టింగ్ నేర్పిస్తావా నక్షత్రా..!: హీరో ధనుష్ -
LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్తో లోకేష్ ప్రయోగం ఎందుకు?
లోకేష్ కనగరాజ్ పేరు వినగానే LCU గుర్తుకు వస్తుంది. ఈ దర్శకుడు తీసిన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఆయన ఆ సినిమాలను పక్కన పెట్టి మరీ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం.. దాదాపు ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్కు అడ్వాన్స్ ఇచ్చిందట. మరోవైపు అల్లు అర్జున్తో సినిమా చేయాలనే ఆలోచన కూడా కొంతకాలంగా ఉందని లోకేష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ రెండు కమిట్మెంట్లు ఇప్పుడు కలవడంతో AA23 పట్టాలెక్కింది.ఇక ఖైదీ 2 ఆలస్యానికి ఆ సినిమా హీరో కార్తి షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయి. రజినీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అదే సమయానికి కార్తి కూడా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో లోకేష్కు వచ్చిన గ్యాప్లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. మైత్రీ నిర్మిస్తున్న AA23 సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో అడవి, గుర్రం, జంతువుల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రపంచాన్ని హింట్ చేశారు. అయితే ఆ సినిమా కథపై మాత్రం ఎలాంటి ఇంకా క్లారిటీ లేదు.LCUతో కనెక్షన్లు లేకుండా లోకేష్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అల్లు అర్జున్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఖైదీ 2నే అని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే ఇది LCUకి బ్రేక్ మాత్రమే.. ముగింపు కాదు! -
నటి ఫిర్యాదు.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను మోసం చేశాడంటూ సదరు నటి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హైదరాబాద్ పోలీసులు పవన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్.. ఆ తర్వాత ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సినిమాలతో పాటు పలు వెబ్సిరీస్లకు కూడా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో ‘ఆకాశంలో ఒకతార’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
స్పిరిట్ Vs వారణాసి.. సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు!
వచ్చే ఏడాది వేసవిలో నెల రోజుల గ్యాప్లో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలు కావడంతో ఈ గ్యాప్ సరిపోతుందా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతోంది.ఈ విషయంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సరదాగా స్పందించారు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అని చెప్పిన ఆయన.. అవసరమైతే వారణాసి చిత్రం కోసం కాస్త జరగడానికి తమకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య నెల రోజుల పైనే తేడా ఉండటంతో సాద్యమైనంతవరుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అయితే అదే టైమ్లో స్పిరిట్ మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా వస్తుందని కూడా మరోసారి క్లారిటీ ఇచ్చాడు.రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్కు ఇంకా 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్కు ఎక్కువ సమయం కేటాయిస్తానని సందీప్ వంగ తెలిపారు. అలాగే తన గత చిత్రాలకు వచ్చినట్టే ఈ సినిమాకు కూడా ‘A’ సర్టిఫికేట్ ఖాయమని చెప్పారు.యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. -
మరికొన్ని గంటల్లో ‘టాక్సిక్’ రిలీజ్.. టీమ్ స్పెషల్ రిక్వెస్ట్!
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups)’ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే.. చిత్ర బృందం ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసింది. ఈ సినిమా తమకు కేవలం ఒక మూవీ మాత్రమే కాదని, ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రేమ, శ్రమతో రూపొందించిన సినిమా అని టీమ్ తెలిపింది.సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్, నటీనటుడు, క్రూ మెంబర్ ఎంతో కష్టపడ్డారని, ప్రేక్షకులు కూడా ఈ సినిమాను థియేటర్లో చూడాలని కోరింది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆసక్తి, అంచనాలు తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని పేర్కొంది.అయితే.. సినిమా చూసే సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలని టీమ్ కోరింది. థియేటర్లలో సన్నివేశాలను మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సినిమాలోని కీలక సన్నివేశాలు, ట్విస్టులు లేదా స్పాయిలర్లను ముందుగానే బయటకు చెప్పడం వల్ల సినిమా చూడబోయే వారికి అసలు అనుభూతి దూరమవుతుందని తెలిపింది.ప్రతి ఒక్కరూ ఎలాంటి స్పాయిలర్ లేకుండా ‘Toxic’ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తాము అనుభవించినట్లుగానే తర్వాతి ప్రేక్షకుడు కూడా సినిమాను ఆస్వాదించాలని చిత్ర బృందం కోరింది. అందుకే.. సినిమా నుంచి ఎలాంటి క్లిప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా సహకరించాలని అభిమానులను అభ్యర్థించింది. View this post on Instagram A post shared by Yash (@thenameisyash) -
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
చాలాకాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. శివ నిర్వాణ దర్శకత్వం ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్ని రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. రవితేజ, బేబీ నక్షత్రల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ తన కథ, కథనంతో అందరినీ ఎమోషనల్ గురి చేశాడని చెబుతున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ రోజే ఈ చిత్రంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని.. ఇరుముడి తన మనసుని ఎంతగానో హత్తుకుందని ట్వీట్ చేసింది.(చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)‘నిన్న నాకు ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం లభించింది. అసలు ఎంత మంచి సినిమానో ఇది. ఊహించని విధంగా నా మనసును ఎంతగానో హత్తుకుంది. సాధారణంగా చిన్నతనంలో మనకేదైనా జరిగినా లేదా ఏదైనా మనల్ని బాధించినా, అమాయకత్వంతో మన మొదటి స్పందన పెద్దవాళ్లకు చెప్పడమే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు నిజం అర్థమవుతుంది.. ఏం జరిగినా సరే నోరు మూసుకుని ఊరుకోవాలని మనకు చెబుతారు... ఈ సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజ్. కచ్చితంగా ప్రస్తావించాల్సిన, మాట్లాడాల్సిన ఒక విషయాన్ని ఈ చిత్రం ఎత్తిచూపింది. (చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్లో వార్నర్)రవితేజ సర్, మీకు అభినందనలు.. ఈ విజయం సాధించినందుకు మీ తరఫున నేను ఎంతో సంతోషిస్తున్నాను.. నక్షత్రకు నా అభినందనలు.. సినిమాలో నువ్వు సూర్యకాంతిలా మెరిసావు, నీ నవ్వు నా పెదవులపై చిరునవ్వు నింపింది.. శివ నిర్వాణ గారికి శుభాకాంక్షలు.. మీరు ఈ విజయానికి అన్ని విధాలా అర్హులు.. మీ గురించి చాలా చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి అభినందనలు. ఇంతటి సుందరమైన చిత్రాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు’ అని రష్మిక ట్వీట్ చేసింది. Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026 -
‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు? హీరోయిన్లకూ ఎక్కువే!
కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’తో రేపు(ఆగస్ట్ 26) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రాకింగ్ స్టార్ యశ్. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. 1940 నుంచి 1970 మధ్య కాలంలో గోవా నేపథ్యంలో సాగే మాఫియా ప్రపంచాన్ని ఇందులో చూపించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.యశ్ 'రాయ' అనే పవర్ఫుల్ మాఫియా పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే అందులో యశ్ పారితోషికం కూడా భారీగానే ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 50 కోట్లను తీసుకున్నాడట. అంతేకాదు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. దీంతో లాభాల్లోనూ యశ్కి వాటా రాబోతుంది. ఇలా నిర్మాతగా, నటుడిగా మొత్తంగా రూ. 100-120 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందట. యశ్తో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారట. కియారా అద్వానీ రూ. 15 కోట్లు, నయనతార రూ. 15-18 కోట్లు, హ్యూమా ఖురేషి రూ. 2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ రుక్ష్మిణి వసంత్ కూడా రూ. 3 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.2,000..? మరి 'టాక్సిక్'కి ఎంతో తెలుసా?
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నయనతార తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మొదటి జీతం గురించి వెల్లడించింది. తాజాగా నయనతారను ఆమె తొలి ఉద్యోగం గురించి అడిగారు. దీనికి స్పందించిన నయనతార.. తన మొదటి పని ఓ మ్యాగజైన్ కవర్ షూట్ అని గుర్తుచేసుకుంది. ఓ ఫ్యాషన్ కార్యక్రమం కోసం తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో తనకు వచ్చిన పారితోషికం కేవలం రూ.2,000 నుంచి రూ.3,000 వరకు మాత్రమే అని నయనతార చెప్పింది. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన తన కెరీర్.. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగే స్థాయికి చేరుకోవడం విశేషం.నయనతార చాలా కాలంగా సౌత్లో లేడీ సూపర్స్టార్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మోడలింగ్ ద్వారా సినీరంగం దృష్టిని ఆకర్షించిన ఆమె 2003లో ‘మనస్సినక్కరే’ సినిమాతో నటిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యాగజైన్లో నయనతార ఫొటోలు చూసిన దర్శకుడు సత్యన్ ఆమెకు తొలి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ‘అయ్యా’, ‘చంద్రముఖి’ చిత్రాలతో తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది.రజనీకాంత్తో చేసిన చంద్రముఖి సినిమా నయనతార కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఆమె పాపులర్ అయింది. అదే టైమ్లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. అవి సక్సెస్ కావడంతో తిరుగులేని లేడీ సూపర్స్టార్గా క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలతో లేడీ సూపర్స్టార్గా ఎదిగిన నయనతార 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’తో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అంటే.. కేవలం రూ.3 వేలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. ఇక పాన్ ఇండియా స్టార్ హీరో యశ్తో ఆమె నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. -
నటుడు అరెస్ట్.. 28 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం..!
‘దేవా’ చిత్రంలో నటించిన మోడల్ రోహుల్లా మెహ్దీని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి 28 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న తెలుస్తోంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దహిసర్ చెక్ నాకా వద్ద డ్రగ్స్ సరఫరా చేసేందుకు రోహుల్లా మెహ్దీ రానున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ రాజేంద్ర కాంబ్లే ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సమాచారం అందిన విధంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మెహ్దీ, అతడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి ఐదు రోజులు రిమాండ్ విధించినట్లు సమాచారం. ఎవరీ రోహుల్లా మోహ్దీ..రోహుల్లా మెహ్దీ జమ్మూకాశ్మీర్లోని బుద్దామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ముంబైలోని గోరేగావ్ నివసిస్తున్నట్లు వెల్లడించారు. నటుడిగా, మోడల్గా రాణిస్తున్న మోహ్దీ.. షాహిద్ కపూర్ నటించిన ‘దేవా’ చిత్రంలోనూ కనిపించాడు. పలు వెబ్సరీస్లోనూ నటించాడు. ఇదీ చదవండి: వరుసగా విలన్ పాత్రలు.. బాబీ డియెల్ రియాక్షన్ ఇదే.. -
వరుసగా విలన్ పాత్రలు.. బాబీ డియెల్ రియాక్షన్ ఇదే..
‘ఆష్రమ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొంది చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు బాబీ డియోల్. అయితే ఈ విజయమే తనకు మరో సమస్య తెచ్చిపెట్టిందని ఆయన అంటున్నాడు. వరుసగా విలన్ పాత్రలే వస్తుండడంతో తాను ఓకే తరహా పాత్రలకు పరిమితమవుతున్నానని..దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని ఓ సందర్భంలో తెలిపాడు.బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా..జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని మాట్లాడుతూ.. ‘ ఒక నటుడు ఓ తరహా పాత్రలో విజయవంతమైతే.. అలాంటి పాత్రలే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. నా విషయంలోనూ అదే జరుగుతోంది. దాని నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.ఇటీవల తాను నటించిన ‘బందర్’ పూర్తిగా భిన్నమైన చిత్రమని చెప్పాడు. ‘ విలన్ పాత్రల్లో ఎన్నో రకాలుంటాయి. ఒక్కో పాత్రకు ఒక్కో షేడ్ ఉంటుంది. అలాంటి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఇకపై కొన్ని వెబ్సిరీస్ల్లోనూ విభిన్నమైన పాత్రలు చేయబోతున్నా’ అని వెల్లడించాడు. కాగా ‘యానిమల్’, ‘కంగువ’, ‘ఆల్ఫా’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు చేయడంతో బాబీ డియోల్ విలన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. -
‘రాకా’లో రకరకాల వింతలు చూశా.. మంచు లక్ష్మీ వీడియో వైరల్
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్, బన్నీ లుక్ మినహా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా.. ఇటీవల విడుదలైన పోస్టర్ ఈ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందనే ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా నటి మంచు లక్ష్మీప్రసన్న చేసిన వ్యాఖ్యలు ‘రాకా’పై అంచనాలను మరింత పెంచుతున్నాయి.తాజాగా తాను ‘రాకా’ మూవీ సెట్ నుంచి వస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించింది. అల్లు అర్జున్ తనను ఎప్పటినుంచో సినిమా సెట్ చూసేందుకు పిలుస్తున్నాడని.. తాజాగా ముంబైలోని ‘రాకా’ సెట్కు వెళ్లి వచ్చానని ఆమె తెలిపింది. అక్కడ చూసిన భారీ సెట్, విభిన్నమైన జంతువులను చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది.‘రాకా సెట్ చూసి నోరు వెళ్ళబెట్టాను. వచ్చి కారులో కూర్చునే దాకా నా నోరు మూతబడలేదు. 'రాకా'లో రకరకాల వింతలు నేను చూశాను. అంతరా నుంచి వింత జంతవులు తీసుకొచ్చారు అనుకుంటా. నేను ఇంతకు ముందెన్నడూ అలాంటి జంతువులను చూడలేదు. బన్నీ లాంటి మనుషులను గానీ, ఎన్నో డిపార్మెంట్స్ తో కూడిన ఇలాంటి సెట్ ని గానీ నేనెప్పుడూ చూడలేదు. మామూలుగా లేదు. పిచ్చెక్కిపోయింది. వావ్ అనిపించేలా ఉంది. నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఈ సినిమా కోసం ఆగలేకపోతున్నాను. ఇంకా ఎన్నో విషయాలను షేర్ చేసుకోవాలని ఉంది కానీ, బయటకు చెప్పలేను’ అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.ఇప్పటికే భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్తో తెరకెక్కుతున్న సినిమాగా ‘రాకా’పై ఆసక్తి నెలకొంది. తాజాగా మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇంతకీ అల్లు అర్జున్, అట్లీ కలిసి తెరపై ఎలాంటి అద్భుతాలను చూపించబోతున్నారో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. Actress #ManchuLakshmi after visiting the sets of #Raaka 🥵#AlluArjun pic.twitter.com/LVkKUnszWL— Arjun 🪓 (@ArjunVc_Online) August 22, 2026 -
నేను చేసింది తప్పే.. ఆమె చాలా మంచిది : ఈశ్వర్ సాయి
ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి ఇటీవల ఓ అమ్మాయితో గదిలో ఉండగా.. అతని భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈశ్వర్ సాయి పేరు నెట్టింట వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ అతన్ని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి స్పందించాడు. తాను చేసింది తప్పేనని..ఒత్తిడితో అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకే మాధురికి కనెక్ట్ అయ్యా.. గత కొన్నాళ్లుగా నేను ఒత్తిడిలో ఉన్నా. ఇంట్లో భార్యతో గొడవలు జరిగాయి. చాలా ప్రెజర్ ఉంది. అప్పుడే నాకు మాధురి కనెక్ట్ అయింది. నాకున్న ప్రెజర్కి..ఆమె చూపించిన కేరింగ్కి అట్రాక్ట్ అయ్యా. నాకు చాలా నచ్చింది. ఆమెతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. కానీ మేమిద్దరం రిలేషన్ స్టార్ట్ చేసింది మాత్రం రెండున్నర నెలల క్రితమే. ఆమెతో ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యాను.చేసింది తప్పే.. నేను చేసింది తప్పే. నేను ఉన్న ప్రేజర్లో ఆ తప్పు చేశా. ఆ సమయంలో మాధురితో కనెక్ట్ అవ్వడం కరెక్టే అనిపించింది. మ్యూచల్గానే మా ఇద్దరి మధ్యన రిలేషన్ నడిచింది. ఇది ఒప్పుకుంటున్నా. ఇలా చేయడం తప్పే కానీ..నా భార్య ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం 200 శాతం తప్పు. కూర్చొబెట్టి మాట్లాడితే అందరి జీవితాలు బాగుండేవి. ఈ వీడియో పెట్టేసరికి ..ఇప్పుడు నేను బయటకు రాలేని పరిస్థితి. నాతో పాటు నా భార్య జీవితం కూడా నాశనం అయినట్లే కదా. ప్రస్తుతం నా మైండ్ పని చేయట్లేదు. అమ్మనాన్నలతో పాటు అత్తమామలను కూడా ఫేస్ చేయలేకపోతున్నా. నా భార్యను అయితే అసలే ఫేస్ చేయలేదు.అందుకే నేనొక్కడినే వేరే చోటుకి వచ్చేశా. ఇప్పుడు నేను సోషల్ మీడియాకు ఎంటర్టైనర్గా మారిపోయా. నాతో పాటు నా భార్య, మాధురి జీవితాలు కూడా నాశయం అయ్యాయి.మాధురికి చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా.. మాధురి చాలా మంచి అమ్మాయి. నా వల్ల ఆమె జీవితం చాలా ఎఫెక్ట్ అయింది. ఫ్యామిలీ మొత్తం ఆమె మీదనే ఆధారపడి ఉంది. తమ్ముడిని చదివించడంతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఆమె కెరీర్ నాశనం అయింది. ఆమెకు చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నా. నా భార్య తరపున కూడా ఆమెకు సారీ చెబుతున్నా. అంతకు మించి నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఒక్క చిన్న తప్పు చేసినంత మాత్రనా..మా క్యారెక్టర్నే ప్రశ్నిస్తున్నారు. నా గురించి తెలియని వాళ్లు కూడా నాపై నెగెటివ్గా మాట్లాడుతున్నాను. మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే. చూడనిది 90 శాతం ఉంది. అవన్నీ చెప్పి ఈ ఇష్యూని మరింత పెద్దది చేయాలని లేదు.ఇల్లీగల్ ఎఫైర్ వద్దు.. ఫైనల్గా అందరికి చెప్పేది ఒక్కటే. దయచేసి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోకండి. ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయొద్దని కోరుకుంటున్నా. చూశారు కదా. మేము చేసిన ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ముగ్గురి కెరియర్ నాశనం అయ్యాయి. ఇప్పటివరకు బిల్డ్ చేసుకున్న కెరియర్, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. జనాల్ని ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రజలందరికీ క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ ఈశ్వర్ సాయి ఎమోషన్ అయ్యాడు. -
Zarna Garg: హాస్యనటికి వింత అనుభవం.. బాత్రూమ్లోనే గంటపాటు..
ప్రముఖ హాస్యనటి జర్ణా గార్జ్ ప్రస్తుతం తన కామెడీ స్పెషల్ ‘ది మిలియన్ డాలర్ ఎక్స్క్యూసెస్’ టూర్తో ప్రపంచవ్యాపంగా పర్యటిస్తున్నారు. జర్మనీలోని ఓ షోకు వెళ్లిన ఆమెకు ఓ వింత అనుభవం ఎదురైంది. అక్కడి బాత్రూమ్లోకి వెళ్లి డోర్ ఓపెన్ కాకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు అందులోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి క్లిష్టంగా మారిందని తెలిపారు. ఆ గదిలో చిక్కుకున్నా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘తెరవడానికి, మూయడానికి సాధ్యం కాని పరిస్థితిలో బాత్రూమ్ డోర్ ఉండడం చాలా వ్యగ్యం. ఇది షేక్స్పియర్ వివాదంలా ఉంది’ అని జర్ణా ఘాటుగా స్పందించారు. భారతీయ-అమెరికన్ స్టాండ్-అప్ హాస్యనటి అయిన జర్ణా 'ఎ నైస్ ఇండియన్ బాయ్' అనే అమెరికన్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. సోషల్మీడియాలో ఆమెకు సుమారు 2మిలియన్స్కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Zarna Garg (@zarnagarg) -
‘జాంబీ రెడ్డి2’ అప్డేట్ వచ్చేసింది
బాలనటుడిగా అందరి ప్రశంసలు పొంది ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమయ్యాడు తేజ సజ్జా. నేడు (శనివారం) అతని పుట్టినరోజు కావడంతో పీపుల్స్ మీడియా అభిమానులకు ఆసక్తికరమైన అప్డేట్ను అందించింది. ‘జాంబీ రెడ్డి నెక్ట్స్ లెవల్’ అంటూ ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ రోబోతోందటూ ప్రకటించింది. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా ‘జాంబీ రెడ్డి’. 2021లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘జాంబీ రెడ్డి2’ కు సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027లో ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో విడుదల కానుంది. -
భర్త చనిపోతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి? అనసూయ పోస్ట్ వైరల్!
సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపైనా ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియోలో మహిళలపై కొనసాగుతున్న కొన్ని సంప్రదాయాల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, గజ్జెలు వంటి వాటిని ఎందుకు తీసేయాలనే అంశంపై తన ఆలోచనలను పంచుకున్నారు.వీడియోలో అనసూయ ఇలా మాట్లాడారు.‘ఒక ఆలోచన మూడేళ్ల నుంచి నన్ను తినేస్తోంది. మూడేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. బొట్టు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జెలు ధరించి చాలా అందంగా రెడీ అయ్యేది. కానీ నాన్నగారు చనిపోయిన అవన్నీ అమ్మకు దూరమయ్యాయి.మనకు బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు ఇవన్నీ ఎవరు పరిచయం చేశారు? మా అమ్మకు మా అమ్మమ్మ.. నాకు మా అమ్మ. అలాగే గోరింటాకు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ వేసుకోవడం వంటి వాటిని కూడా మనకు పెళ్లికి ముందే అమ్మలు, అమ్మమ్మలు పరిచయం చేశారు. అలాంటప్పుడు వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టాలి? భర్త చనిపోగానే బొట్టు, గాజులు, గజ్జెలు ఎందుకు తీసేయాలి? అలా ఎక్కడ రాసి ఉంది? ఒకవేళ ఇవన్నీ పెట్టుకోవద్దని అనుకుంటే.. అమ్మమ్మ చనిపోయినప్పుడే అమ్మ కూడా వాటిని మానేయాలి కదా. అది పర్సనల్ చాయిస్లా ఉండాలి. ఇది నా ఆలోచన మాత్రమే.నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలి. ఒక మహిళ బొట్టు పెట్టుకోవాలా? వద్దా? గాజులు ధరించాలా? వద్దా? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలి’అని అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కంగనా vs తాప్సీ..ఈసారి తల్లిదండ్రుల వరకు వెళ్లిన వివాదం!
మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్లలో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంటారు. సినిమాల ఎంపిక దగ్గరి నుంచి వ్యక్తిగత అభిప్రాయాల వరకు ఏ విషయంలోనైనా ఓపెన్గా మాట్లాడే ఈ ఇద్దరి మధ్య గతంలో పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించడంతో వీరి మధ్య వార్ మళ్లీ హాట్ టాపిక్గా మారింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కంగనాతో తనకున్న విభేదాలపై మాట్లాడారు. వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తాను కంగనాను వ్యక్తిగతంగా కలవలేదని చెప్పారు. కంగనాపై తన అభిప్రాయం తన పెంపకం, మాట్లాడే విధానం, ఆలోచనా తీరును ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కంగనా ఎలా స్పందిస్తారనేది ఆమె పెరిగిన వాతావరణం, ఆమె విధానానికి సంబంధించిన విషయమని తాప్సీ పేర్కొన్నారు.తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తాప్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన సినిమా ప్రమోషన్ల కోసం, మీడియా హెడ్లైన్స్లో నిలిచేందుకు తాప్సీ తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఈసారి తాప్సీ తన పెంపకం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావించడంతో కంగనా కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.తాప్సీని ఉద్దేశించి కంగనా ‘చౌకబారు కాపీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటారని పేర్కొంటూ.. తాను మాత్రం ఎలాంటి వాదనలోనూ ఎదుటివారి తల్లిదండ్రుల గురించి మాట్లాడనని అన్నారు. అనంతరం తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.అయితే కంగనా–తాప్సీ మధ్య ఈ వివాదం ఇప్పటిది కాదు. 2019లో ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా సమయంలో కంగనా సోదరి రంగోలి చందేల్.. తాప్సీని ఉద్దేశించి ‘సస్తీ కాపీ’ (చౌకబారు కాపీ) అనే పదాన్ని ఉపయోగించడంతో తొలిసారి వీరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కంగనా.. తాప్సీతో పాటు స్వరా భాస్కర్ను ‘బి-గ్రేడ్ నటీమణులు’గా అభివర్ణించడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలతో పాత వివాదం మరోసారి తెరపైకి రావడం, దానికి కంగనా మరింత ఘాటైన పదజాలంతో స్పందించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.ప్రస్తుతం తాప్సీ నటించిన ప్రతీకార నేపథ్య డ్రామా ‘గాంధారి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు, వాటికి కంగనా ఇచ్చిన కౌంటర్తో మరోసారి ఈ ఇద్దరు నటీమణుల మధ్య వివాదం వార్తల్లో నిలిచింది. మరి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేక మరోసారి ఇద్దరి నుంచి కౌంటర్లు వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
నిజంగా ‘టాక్సిక్’ రూ.2,000 కోట్లు కొల్లగొడుతుందా?
పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.2,000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటించగా, నిర్మాత దిల్ రాజు కూడా ఇదే మాటను రిపీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం నిజంగా రూ.2,000 కోట్లు సాధించాలంటే ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ వంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలను మించి సినిమా ఆడాల్సి ఉంటుంది. అయితే ‘టాక్సిక్’పై ఉన్న క్రేజ్ కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే కాదని అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్లో యశ్కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు భారీ ప్లస్గా మారుతోంది.అయితే ఈ రూ.2,000 కోట్ల స్టేట్మెంట్తో టాక్సిక్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు హీరో యశ్ మాత్రం ఇలాంటి అతిశయోక్తి వ్యాఖ్యలకు దూరంగా ఉన్నాడు. అయితే ‘టాక్సిక్’తో తన టార్గెట్ ఏంటో మాత్రమే స్పష్టంగా చెబుతున్నాడు. ఇక ఈ భారీ అంచనాలను ‘టాక్సిక్’ నిజం చేస్తుందా? లేక రూ.2,000 కోట్లు కేవలం ప్రచార మాటగానే మిగిలిపోతుందా? అన్నది ఈ చిత్రం బాక్సాఫీస్ రిజల్ట్తోనే తేలనుంది. -
రూ.కోటి ప్రశ్న.. సమాధానం ఇదే
‘కౌన్ బనేగా కరోడ్పతి-18’లో ఐఐటీ బాంబే టాపర్ యోగేశ్ సాహు రూ.50 లక్షలు గెలుచుకున్నారు. ఆగస్టు 19న ప్రసారమైన ఎపిసోడ్లో హాట్సీట్పై కూర్చున్న 23 ఏళ్ల యోగేశ్.. రూ.కోటి ప్రశ్న వద్ద తడబడ్డారు. అన్ని లైఫ్లైన్లు పూర్తవడంతో ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించినా సరైన సమాధానాన్ని గుర్తించలేకపోయారు. దీంతో రూ.50 లక్షలతో ఆటను ముగించారు.ఇంతకీ ఆ రూ.కోటి ప్రశ్న ఏంటి?ప్రశ్న: 1943లో ముంబయిలోని మహాలక్ష్మి రేస్కోర్స్లో జరిగిన తొలి ఇండియన్ డెర్బీలో విజేతగా నిలిచిన బరోడా మహారాజుకు చెందిన గుర్రం ఏది? A) ప్రిన్సెస్ బ్యూటిఫుల్B) రీగల్ డొమైన్C) స్టార్ ఆఫ్ గ్వాలియర్D) ప్రిన్స్ ప్రదీప్.సరైన సమాధానం.. ప్రిన్సెస్ బ్యూటిఫుల్ప్రిన్సెస్ బ్యూటిఫుల్. 1943 జనవరి 30న ముంబైలోని మహాలక్ష్మి రేస్కోర్స్లో జరిగిన తొలి ఇండియన్ డెర్బీలో ఆమె విజేతగా నిలిచింది. బరోడా మహారాజు గైక్వాడ్కు చెందిన ప్రిన్సెస్ బ్యూటిఫుల్కు ఎం.సి. పటేల్ శిక్షణ ఇచ్చారు. ఆస్ట్రేలియన్ జాకీ ఎడ్గర్ బ్రిట్ స్వారీ చేశారు. ఆ ఏడాది ప్రిన్సెస్ బ్యూటిఫుల్ ఇండియన్ 1000 గినీస్, ఇండియన్ 2000 గినీస్ రేసుల్లోనూ విజయం సాధించింది. తొలి ఇండియన్ డెర్బీ విజేతకు అప్పట్లో రూ.35 వేల ప్రైజ్మనీ అందించారు. ఎనిమిది దశాబ్దాలు దాటినా ఈ రేసు భారత గుర్రపు పందేల చరిత్రలో ప్రముఖ ఈవెంట్గా కొనసాగుతోంది. ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్లు ఇవే -
‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్లు ఇవే
రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. విడుదలైన తొలిరోజుకే భారీ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.14.80 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించినట్లు సాక్నిల్క్ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.24.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది.ఏపీ తెలంగాణ నుంచే రూ.15 కోట్లుతొలిరోజు ‘ఇరుముడి’ వసూళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.15కోట్లు గ్రాస్ వచ్చినట్లు అంచనా. కర్ణాటక నంచి 1.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ.34 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి 36 లక్షలు వసూళయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ రూ.17.20 కోట్లకు చేరింది. ఓవర్సీస్లో రూ.7 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.24.20 కోట్లకు చేరాయి. -
DC MOVIE: ‘డీసీ’ విజయం వెనుక.. ఇంత కఠోర శ్రమనా!
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీసీ’. రూ.100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నటుడిగానూ ఆరంగేట్రం చేశారు. అయితే సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన పడిన కష్టం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.50 రోజుల పాటు..లోకేశ్ బాడీని ఫిట్గా మార్చుకునేందుకు ఏకంగా 50 రోజుల పాటు కఠినమైన వర్కౌట్ రొటీన్ను ఫాలో అయ్యారట. ఆయన ట్రైనర్ తాజాగా షేర్ చేసిన వీడియోలో జిమ్లో లోకేశ్ కసరత్తులు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెయిట్ లిఫ్టింగ్తో పాటు అప్పర్, లోయర్ బాడీ వర్కౌట్స్ చేస్తూ బైసెప్స్, కండరాలను టోన్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారే క్రమంలో లోకేశ్ చూపించిన అంకితభావాన్ని ట్రైనర్ ప్రశంసించారు.అరుణ్ మాథేశ్వరన్కు నాలుగో చిత్రం‘డీసీ’ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘రాకీ’ (2021), ‘సాని కాయిదమ్’ (2022), ‘కెప్టెన్ మిల్లర్’ (2024) చిత్రాలను ఆయన తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ అందించగా.. జీకే ప్రసన్న ఎడిటింగ్, పీసీ స్టంట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, సంజన కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఆడుకలం నరేన్, తలైవాసల్ విజయ్, కస్తూరి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదీ చదవండి: షూటింగ్లో అస్వస్థత..! డూప్ స్థానంలో సల్మాన్ ఖాన్ -
పాన్ మసాలా వివాదం.. అక్షయ్కు ఊహించని ప్రశ్న
పాన్ మసాలా ప్రకటనలపై వివాదం కొనసాగుతున్న వేళ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ను జర్నలిస్ట్.. ‘అందరూ కుంకుమపువ్వు అమ్ముతున్నారు.. మీరు ఏసర్ అమ్ముతున్నారా?’ అంటూ సరదాగా ప్రశ్నించినట్లు వీడియో వైరల్ అవుతోంది. అక్షయ్ ప్రశ్నకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా నవ్వుతునే ఉండిపోయినట్లు కనిపిస్తోంది. పాన్ మసాలా ప్రకటనను ప్రస్తావిస్తూ..ఆగస్టు 20న ఓ సంస్థ అక్షయ్ కుమార్ను భారత్లో తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులు ఆయనతో ముచ్చటించారు. ఇదే సమయంలో ఓ మహిళా జర్నలిస్ట్.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్ నటించిన పాన్ మసాలా ప్రకటనను ప్రస్తావించింది. ఈ సందర్భంగా ‘సబ్ కేసర్ బేచ్ రహే హై, ఆప్ ఏసర్ బేచ్ రహే హై?’(‘అందరూ కుంకుమపువ్వు అమ్ముతున్నారు.. మీరు ఏసర్ అమ్ముతున్నారా?’) అంటూ ప్రశ్నించినట్లు వీడియోలో తెలుస్తోంది. ప్రకటనలపై వివాదంషారుఖ్, అజయ్, టైగర్ నటించిన ప్రకటనపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.గతంలో అక్షయ్ కుమార్ కూడా పాన్ మసాలా బ్రాండ్ ప్రకటన విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ ప్రకటనకు దూరమయ్యారు. దీంతో తాజాగా జర్నలిస్ట్ వేసిన ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి మాత్రం అక్షయ్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా నవ్వడంతో ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. Reporter: Sab kesar bech rahe hai aap Acer bech rahe hai😭Akshay Kumar's reaction to this is pure gold.He even shared that to convince his wife about choosing a brand he has to explain everything to her down to the absolute scientific reason.🤌✨ pic.twitter.com/pcr0r7FyU7— ᴅᴇᴀᴅ ᴋɪʟʟᴇʀ (@ReignOfBateman) August 20, 2026ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే! -
నటుడిగా ఎదిగి.. చిరంజీవిగా నిలిచి
చిరంజీవి.. ఈ పేరు వింటేనే ఓ మాస్ ఇమేజ్ కళ్లముందు కదులుతుంది. తెరపై ఆయన వేసే ఒక్క స్టెప్కు థియేటర్ ఊగిపోతుంది. ఆయన చెప్పే ఒక్క డైలాగ్కు అభిమానులు పండగ చేసుకుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డులు, అవార్డులు, అరుదైన ఘనతలు ఆయన ఖాతాలో చేరాయి. నటుడిగా మొదలైన ప్రయాణం మెగాస్టార్గా మారింది. తెరపై స్టార్డమ్తో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం.పోలీసు కుటుంబంలో పుట్టి..చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. పవన్ కల్యాణ్, నాగబాబు అన్నదమ్ములు. తండ్రి వెంకట్రావు పోలీసు శాఖలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా కుటుంబం పలు ప్రాంతాల్లో నివసించడంతో చిరంజీవి విద్యాభ్యాసం కూడా వివిధ ప్రాంతాల్లో సాగింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరంజీవి.. కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించేవారు. నటుడిగా మారాలన్న లక్ష్యంతో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1976లో శిక్షణ పొందారు. అక్కడే తన నటనా ప్రతిభకు మరింత పదును పెట్టుకున్నారు.‘పునాదిరాళ్లు’తో తొలి అడుగు..సినిమా రంగంలో చిరంజీవి తొలి అడుగు ‘పునాదిరాళ్లు’తో పడింది. అయితే ఈ సినిమా కంటే ముందే ఆయన నటించిన ‘ప్రాణం ఖరీదు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1978లో విడుదలైన ఈ సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తొలి రోజుల్లో విలన్, క్యారెక్టర్ తరహా పాత్రలు చేసేవారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హీరోగా గుర్తింపు..1982లో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిరంజీవి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అదే ఏడాది వచ్చిన ‘శుభలేఖ’ ఆయనలోని నటుడికి మరో కోణాన్ని చూపించింది.అయితే 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిరంజీవి కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస విజయాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగి ‘మెగాస్టార్’గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.జాతీయ స్థాయిలో గుర్తింపు..చిరంజీవి తన నటనకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు నంది అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నారు.రాజకీయాల్లోకి ఎంట్రీసినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజా సమస్యలపై తనదైన ఆలోచనలతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.మళ్లీ వెండితెరపైకి..రాజకీయ ప్రస్థానం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. ‘ఖైదీ నంబర్ 150’ తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’, ‘విశ్వంభర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడుతున్నారు.చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..చిరంజీవి పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం ఆయన సేవా కార్యక్రమాలు. 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు.. నేత్రదానంపై అవగాహన కల్పించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఈ ట్రస్ట్ను సందర్శించారు.కరోనా సమయంలోనూ చిరంజీవి తన వంతు సాయం చేశారు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడంతో పాటు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) ద్వారా సినీ కార్మికులకు అండగా నిలిచారు. -
‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. టికెట్ ధర ఎంతటే..?
యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే సుమారు రూ.1.06కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు 204 ప్రాంతాల్లో 589 షోలకు కలిపి 5,500 టికెట్లు అమ్ముడయ్యాయట. విడుదలకు ముందు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.బుక్మైషోలోనూ మార్క్ ఇక బుక్మైషోలో ‘టాక్సిక్’కు ఇప్పటికే 10లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన 13వ భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ నిలిచింది. యశ్ కెరీర్లో కేజీఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన రెండవ చిత్రమిది కావడం విశేషం.నేడు భారత్లో అడ్వాన్స్ బుకింగ్స్?ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. భారత్లో బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యశ్ క్రేజ్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.టికెట్ ధరలు భారీగా ఉండే ఛాన్స్తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియం షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండొచ్చని సమాచారం.‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి భారత్ అడ్వాన్స్ బుకింగ్స్పైనే ఉంది.ఇదీ చదవండి: ‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి? -
‘అమీర్ లోగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘అమీర్ లోగ్నటీనటులు:ఎంసీ హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులునిర్మాణ సంస్థ: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్నిర్మాత: మాధవి రెడ్డి సోమదర్శకుడు: రమణారెడ్డి సోమసంగీతం: స్మరణ్ సాయిఎడిటర్: రోహిత్ పెనుమత్సవిడుదల తేది: ఆగస్ట్ 21, 2026కథేంటంటే..హైదరాబాద్ పాతబస్తీకి చెందిన శ్రీను(హరి మున్నంగి), మల్లేష్(శశిధర్ కొచ్చర్ల కోట), రఫీక్(మనోజ్ ఆవుల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకుండా, ఏ పని లేకుండా బస్తీలో అల్లరి చేస్తూ తిరగడం వాళ్లకు అలవాటు. క్రికెట్ గ్రౌండ్ విషయంలో గొడవలు పడటం, ఇంట్లో తల్లిదండ్రుల చేత తిట్లు తినడం.. ఇలా వాళ్ల జీవితం సరదాగా సాగిపోతుంటుంది. వాళ్లకు అక్కలా ఉండే గీత(వేద జలంధర్) మాత్రం ఎప్పటికప్పుడు మంచి చెడు చెబుతుంటుంది. ఆమె పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలో శ్రీనుకు ఆఫీస్ బాయ్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. మొదట్లో స్నేహితులిద్దరూ శ్రీనును ఆటపట్టించినా.. ఆ తర్వాత వాళ్లు కూడా తమకు నచ్చిన పనులను ఎంచుకుంటారు. రఫీక్ బైక్ మెకానిక్గా, మల్లేష్ క్యాబ్ డ్రైవర్గా సెటిల్ అవుతారు. అయితే ఓ రోజు శ్రీను ఆఫీస్లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో.. క్రికెట్ విషయంలో శ్రీను బెట్టింగ్ కడతాడు. పాతబస్తీ పోరగాళ్లు, సాఫ్ట్ వేర్ టీమ్లు కలిసి క్రికెట్ ఆడతారు. ఇందులో పాతబస్తీ పోరగాళ్లు ఓడిపోతారు. అయితే బెట్టింగ్ డబ్బులు తీసుకోకుండా.. బిర్యానీ పార్టీ ఇవ్వమని సాఫ్ట్వేర్ టీమ్ అడుగుతుంది. దీంతో పాతబస్తీకి చెందిన చాచాని బ్రతిమిలాడి బిర్యానీ వండించి..వాళ్లకు పార్టీ ఇస్తారు. చాచా వండిన బిర్యానీ తిని సాఫ్ట్ వేర్ బ్యాచ్ ఫిదా అవుతారు. అది చూసి టీమ్ హెడ్ రవికి బిర్యానీ పాయింట్ పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఈ ముగ్గురుతోనే `కిర్రాక్ బిర్యానీ` పాయింట్ స్టార్ట్ చేస్తాడు. మరి ఈ బిర్యానీ బిజినెస్ సక్సెస్ అయ్యిందా? రవిలో వచ్చిన మార్పేంటి? చివరికి బిర్యానీ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..‘అమీర్ లోగ్’లో కథ కంటే హైదరాబాద్ పాతబస్తీ నేటివిటీనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్థానిక యాస, జీవన విధానం, స్నేహితుల మధ్య సరదా గొడవలు, కామెడీ.. ఇవన్నీ సినిమాకు ఒక సహజమైన ఫీల్ను తీసుకొచ్చాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దర్శకుడు దాన్ని హైదరాబాద్ బస్తీ బ్యాక్డ్రాప్లో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ, వారి జీవితాల్లో వచ్చే మార్పులు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఫస్టాఫ్లో పాత్రలను పరిచయం చేయడానికి కొంత ఎక్కువ సమయం తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ దగ్గర నుంచి కథలో వేగం పెరుగుతుంది. సెకండాఫ్లో స్నేహం, భావోద్వేగాలు, కామెడీని కలిపి కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బిర్యానీ చుట్టూ కథను మలుపులు తిప్పడం సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చింది. అయితే కొన్ని సన్నివేశాలను మరింత కుదించి , స్క్రీన్ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు రమణారెడ్డి సోమ ఎంచుకున్న కథ బాగుంది కానీ , దాన్ని ఆకట్టుకునేలా, కమర్షియల్గా మెప్పించేలా చేయడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే..శ్రీను పాత్రలో ఎంసీ హరి, మల్లేష్గా శశిధర్, రఫీక్గా మనోజ్ తమ పరిధిలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కొత్త నటులైనా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా స్నేహితులుగా కలిసి కనిపించే సన్నివేశాల్లో వారి కాంబినేషన్ సినిమాకు ప్లస్గా నిలిచింది. గీత పాత్రలో వేద జలంధర్ స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగానే ఉన్నప్పటికీ, కథలో హీరోల జీవితాలను మార్చే కీలకమైన పాత్రగా కనిపిస్తుంది. చాచా పాత్రలో విశ్వేందర్ రెడ్డి భావోద్వేగాలను చక్కగా పలికించారు. రావణ్ నిట్టూరు, సాయి యోగి తదితరులు తమకు పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. పాటలు పాత బస్తీ జీవితాలను ఆవిష్కరించేలా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ రోహిత్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. మాధవి రెడ్డి సోమ నిర్మాణ విలువలు పర్వాలేదు. -
‘టాక్సిక్’కు ‘ఏ’ సర్టిఫికేట్..! కంటెంట్ సంగతేంటి?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. ఈ నెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా సెన్సార్ బోర్డు( CBFC) ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు ఉండనుందట.అనుమతి ఎలా ఇస్తారంటూ..కన్నడ భాషలో కేవలం రెండు నుంచి మూడు పదాలు మాత్రమే మ్యూట్ చేశారట. ఇప్పటికే యాశ్ ఈ సినిమాపై స్పందిస్తూ ఇది పెద్దవాళ్లకి మాత్రమే అని సూచించాడు . అయితే సెన్సార్బోర్డు ఎలాంటి సన్నివేశాలు తొలగించకపోవడంపై సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దవాళ్లకి మాత్రమే అన్నప్పుడు ఒక్క సీన్ కూడా తొలగించకుండా అనుమతి ఎలా ఇస్తారంటూ సోషల్మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.కాగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నయనతార, కియారా, హుమా ఖురేషి, తదితరులు కీలక పాత్రలు వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదీ చదవండి: ‘మూకుత్తి అమ్మన్2’ చిత్రానికి భారీ ఓటీటీ డీల్ -
స్పిరిట్ నుంచి దీపిక తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా?
రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపిక పదుకోన్ తప్పుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. పని గంటల విషయం కారణంగానే ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు కారణం మరొకటంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.దీపిక రెమ్యూనరేషన్తో పాటు సినిమా నెట్ ప్రాఫిట్లో 10 శాతం వాటా కోరినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ఈ డీల్ వర్కవుట్ కాదని భావించిన 'స్పిరిట్' చిత్రబృందం మరో హీరోయిన్ కోసం చూడాలని నిర్ణయించిందట. అదే సమయంలో కథ, పాత్రలకు సంబంధించిన వివరాలు కూడా ఆమె పీఆర్ టీమ్ ద్వారా మీడియాలోకి లీక్ కావడంపై సందీప్ తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాడు. దీంతో దీపికను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ప్రణయ్ పేర్కొన్నారు.ఇక స్పిరిట్లో సౌత్ కొరియా స్టార్ హీరో డాన్ లీ నటిస్తున్నారన్న వార్తలకు కూడా చెక్ పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఫ్యాన్స్ హంగామా చూసి ఒక దశలో డాన్ లీ కోసం కాస్త గట్టిగానే ఆలోచించాడట. అయితే హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఆయన పాత్ర సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనను సందీప్ రెడ్డి విరమించుకున్నారట. అలాగే చిరంజీవి స్పిరిట్లో నటిస్తున్నారన్న ప్రచారం కూడా కేవలం పుకారేనని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. వాయిస్ టీజర్లో ఆయన స్వరం వినిపించినా సినిమాలో కనిపించరట. -
అనుపమ ఎవరినీ నిందించలేదు.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే: అదితి శంకర్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా మాజీ ప్రియుడితో ఉన్న బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. రెండేళ్ల పాటు ఆ బంధంలో నరకం చూశానంటూ అనుపమ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ అంశంపై నటి అదితి శంకర్ స్పందించారు. అనుపమ తన అనుభవాన్ని ధైర్యంగా, నిజాయతీగా పంచుకున్నారని ప్రశంసించారు.‘వన్స్మోర్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ వ్యాఖ్యల గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘అనుపమ ఇంటర్వ్యూ చూశాను. ఆమె కామెంట్స్పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కానీ, తాను ఎదుర్కొన్న ఇబ్బందిని అంత ధైర్యంగా పంచుకున్నందుకు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆమె మాటల్లో నిజాయతీ కనిపించింది’ అని అదితి అన్నారు.అనుపమ ఎవరినీ నిందించడానికి లేదా కించపరచడానికి ఈ విషయాలను బయటపెట్టలేదని అదితి అభిప్రాయపడ్డారు. ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నారని, అది చాలామందికి అవగాహన కలిగించే విషయమని పేర్కొన్నారు.‘చాలామంది పురుషులు, మహిళలు తీవ్రమైన మానసిక ఘర్షణలతో కూడిన బంధాల్లో ఉంటున్నారు. తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా కొన్నిసార్లు వారికి అర్థం కాదు. ఇలాంటి విషయాల గురించి అనుపమలా ఓపెన్గా మాట్లాడటం వల్ల.. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి తమ బంధం గురించి ఆలోచించే అవకాశం, కొంత స్పష్టత లభిస్తుంది’అని అదితి తెలిపారు.అనుపమ ఏం చెప్పారు?మాజీ బాయ్ఫ్రెండ్ పేరును ప్రస్తావించకుండా ఇటీవల అనుపమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో ఓ బంధం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి ప్రవర్తన కారణంగా ఒక నటిగా, మహిళగా తనను తాను నిందించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండేళ్ల పాటు ఆ బంధంలో తాను నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ధైర్యంగా ఉండాలని, తన అనుభవాన్ని పంచుకున్నందుకు అభినందిస్తూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. అనుపమకు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. -
టాలీవుడ్ స్టార్స్ @ భక్తి.. ఎవరికెవరు ఏ దేవుడంటే ఇష్టం?
సినిమా తారలు అంటే అభిమానులకు తెరపై కనిపించే గ్లామర్, స్టైల్, యాక్షన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ తెర వెనుక చాలామంది హీరోహీరోయిన్లు ఆధ్యాత్మికతకు, దైవభక్తికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. షూటింగ్ ప్రారంభించే ముందు దేవుడిని ప్రార్థించడం దగ్గరి నుంచి.. ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలను సందర్శించడం వరకు తమ నమ్మకాన్ని చాటుకుంటుంటారు. కొందరికి శివుడు ఇష్టదైవం అయితే.. మరికొందరు వెంకటేశ్వరస్వామి, గణేశుడు, హనుమంతుడిని ఆరాధిస్తుంటారు. మరి టాలీవుడ్లో ప్రముఖ తారలు ఎవరెవరు ఏ దేవుడిని ఎక్కువగా కొలుస్తారో ఓసారి చూద్దాం.చిరంజీవి – ఆంజనేయస్వామిమెగాస్టార్ చిరంజీవికి ఆధ్యాత్మికతపై నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఆయన ఎంతో భక్తితో కొలుస్తారని పలుమార్లు వెల్లడైంది. తనకు ఇష్టమైన దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటుంటారు. ఆంజనేయస్వామి భక్తుడిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది.రామ్ చరణ్- అయ్యప్పమాలఇండస్ట్రీలో దేవుడు మాల అనగానే చాలామందికి మెగాహీరో రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఎందుకంటే కార్తీకమాసంలో అయ్యప్ప మాలలో కనిపిస్తుంటాడు. అందరూ స్వాములు చేసినట్లే చెప్పులు వేసుకోకుండా నిత్య పూజలు చేస్తూ కఠినమైన దీక్షని పాటిస్తాడు. ఓ తెలుగు హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ మనసులోని భక్తి మాత్రం మారలేదు.జూనియర్ ఎన్టీఆర్ – దైవభక్తితో ప్రత్యేక అనుబంధంఎన్టీఆర్ కుటుంబం కూడా తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులే. రెండేళ్ల క్రితం కర్ణాటకలోని మూకాంబిక, ఉడుపి శ్రీకృష్ణ, కేశవనాథేశ్వర ఆలయాల్ని తల్లితో కలిసి తారక్ దర్శించుకున్నాడు. ఇంటిలోనూ నిష్టగా పూజలు చేస్తుంటాడు.మహేశ్బాబు – తిరుమల వెంకన్నపై నమ్మకంసూపర్స్టార్ మహేశ్బాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో దేవుడి ఆశీస్సులు తీసుకోవడం ఆయన కుటుంబానికి ఆనవాయితీగా ఉంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే మహేశ్కు శ్రీరాముడు అంటే కూడా చాలా ఇష్టం.బన్నీకీ దైవ భక్తి ఎక్కువే..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా దైవభక్తిని పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి సందర్భాల్లో ఆయన కనిపించారు. తన జీవితంలో కుటుంబం, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పలు సందర్భాల్లో చాటుకున్నారు.ప్రభాస్ – శివుడిపై ప్రత్యేక అభిమానంప్రభాస్ పెద్దగా గుళ్లుగోపురాలు తిరిగినట్లు కనిపించాడు గానీ శివుడు-శ్రీరాముడికి భక్తుడు. తన సినిమాల్లో (బాహుబలి, ఆదిపురుష్ వంటివి) పౌరాణిక, ఆధ్యాత్మిక పాత్రలు చేసేటప్పుడు ప్రత్యేక ఉపవాసాలు, నియమాలు పాటిస్తూ ఉంటాడు. గతంలో 'ఆదిపురుష్'లో తనకెంతో ఇష్టమైన రాముడి పాత్ర కూడా చేశాడు.నయనతార – తిరుమల వెంకన్నదక్షిణాదిలో లేడీ సూపర్స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార.. వెంకటేశ్వర స్వామి & రాజరాజేశ్వరి దేవి ఆలయాలని దర్శించుకుంటూ ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి వీఐపీ హడావుడి లేకుండా తిరుమల శ్రీవారిని గతంలో దర్శించుకుంది. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, యాగాలు కూడా గతంలో చేసినట్లు గుర్తు. భర్త విఘ్నేష్ శివన్తో కలిసి పలు ప్రముఖ దేవాలయాలను దర్శించిన సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సమంత – ఆధ్యాత్మికత, యోగాస్టార్ హీరోయిన్ సమంత కూడా ఆధ్యాత్మికత, యోగా, ధ్యానానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రకృతితో మమేకం కావడం, ధ్యానం చేయడం వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమెకు ఆధ్యాత్మిక జీవనశైలి కూడా ఎంతో ముఖ్యమైనదిగా కనిపిస్తుంది.అనుష్క శెట్టి- శివుడుప్రస్తుతం యాక్టింగ్ దాదాపుగా తగ్గించేసిన అనుష్క శెట్టి.. శివుడు-అమ్మవారికి పరమ భక్తురాలు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలను రహస్యంగా దర్శించుకుంటూ, ఆధ్యాత్మిక ఆశ్రమాలలో గడుపుతూ ఉంటుందని సమాచారం.జాన్వీ..తిరుపతిహీరోయిన్ జాన్వీ కపూర్ అయితే తిరుమల శ్రీవారిని ఎప్పటికప్పుడు దర్శించుకున్నట్లే కనిపిస్తూ ఉంటుంది. తన ప్రతి మూవీ విడుదలకు ముందు మెట్ల మార్గంలో కొండపైకి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటుంది. పైన చెప్పిన వాళ్లే కాదు హీరోయిన్ మీనాక్షి చౌదరితో పాటు పలువురు చిన్న సెలబ్రిటీలు కూడా తిరుమల, కామాఖ్య, జ్యోతిర్లింగాల దర్శనాలు చేసుకుంటూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు.సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఎప్పటికప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుని, నియమ నిష్టలతో శబరిమల యాత్రకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామిపై తనకున్న అపార భక్తిని చాటుకుంటూ ఉంటారు. -
రానా, నాగ్ అయిపోయింది.. ఇప్పుడు రామ్ టర్న్?
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో ఆసక్తి రేపుతోంది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో, కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్లో తెలుగు యువ హీరో రామ్ పోతినేని నటించబోతున్నాడు. అయితే ఇది నెట్టింట మరో రచ్చకు దారి తీసింది.రజనీకాంత్ అల్లుడిగా కనిపిస్తాడా? లేక విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సినిమాలో రామ్కు జోడీగా రాశీఖన్నా నటించనున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు రజనీ సినిమాలో రామ్ లాంటి తెలుగు స్టార్ నటించడంపై అభిమానుల్లోనూ భిన్నమైన చర్చ జరుగుతోంది.నాగ్ తర్వాత రామ్ వంతు?లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. నాగార్జున పోషించిన సైమన్ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నాగార్జున లాంటి స్టార్ను.. మరీ చీప్గా ప్రజెంట్ చేయడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత రజనీ ‘వెట్టైయాన్’ చిత్రంలో నటించిన రానాకు కూడా ప్లాపే పడింది.ఇప్పుడు అదే నేపథ్యంలో రామ్ పేరు తెరపైకి రావడంతో.. ‘రానా, నాగ్ తర్వాత ఇప్పుడు రామ్ వంతా?’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రజనీ సినిమాలో పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోతే మాత్రం అది రామ్ కెరీర్కు పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.పాపం.. రామ్రామ్ పోతినేనికి ఈ సినిమా కీలకంగా మారే అవకాశముంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆయనకు ఆ స్థాయిలో విజయం దక్కలేదు. వారియర్ పేరిట ద్విభాషా చిత్రం చేసినా ఆడలేదు. పైగా సంజయ్ దత్, ఉపేంద్ర వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసినా.. రామ్ కెరీర్కు మాత్రం పెద్దగా బూస్ట్ రాలేదు. దీంతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం రావడం ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందనే అభిప్రాయం ఒకవైపు ఉంది. రజనీ సినిమాకు ఉన్న క్రేజ్, పాన్ ఇండియా మార్కెట్ దృష్ట్యా రామ్కు కొత్త ప్రేక్షకులను చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. తేడా కొడితే పరిస్థితి ఏంటన్నదానిపైనా జోరుగా చర్చ నడుస్తోంది.రజనీకీ అంతే..మరోవైపు రజనీకాంత్ కెరీర్లోనూ ప్రతి సినిమా ఇప్పుడు కీలకమే. ‘జైలర్’కు ముందు, కూలీ కూడా ఆశించిన స్థాయిలో చిత్రాలేవీ ఆడలేదు. రెమ్యునరేషన్ ఆకాశాన్ని అంటుతూ.. కలెక్షన్లు రాక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రజనీ తదుపరి చిత్రాలు(జైలర్-2, ధర్మన్ చిత్రాలు) కచ్చితంగా హిట్లు కావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తమిళంలో నటించడం.. ఇప్పుడు కోలీవుడ్తో పాటు మన దగ్గరా చర్చకు దారి తీసింది. -
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హీరోయిన్ త్రిష పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్కు త్రిష సెల్యూట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా నటి సంజన స్పందించారు. విజయ్ పాలనపై మాట్లాడే ధైర్యం లేకే కొందరు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు.విజయ్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సంజన ప్రశంసించారు. ప్రజా సమస్యలపై ఆయన వేగంగా స్పందిస్తూ.. తన పాలనతో ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్ పరిపాలనలో లోపాలు చూపించలేకే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.‘విజయ్ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు’ అని సంజన వ్యాఖ్యానించారు.ఇక త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంతో గొప్ప నటి అని సంజన అన్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వారి బంధం గురించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష పేరు ఆయనతో ముడిపెట్టి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. -
సూర్యలోని విశ్వాసమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయానికి కారణం: వెంకీ
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో నటి రాధిక శరత్ కుమార్, భవానీశ్రీ, సునిల్ రెడ్డి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను వెంకీ అట్లూరి నిర్వహించారు. జీవీ.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు, తమిళం భాషల్లో విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఒక స్టార్ హోటల్లో థ్యాంక్స్ మీట్ను నిర్వహించారు.ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ నటుడు సూర్య తనకు చాలా కాలంగా తెలుసు అన్నారు. ఈ చిత్రంలో ఆయన ఎంతో పరిపక్వతతో నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం గురించి ఒక్క నెగిటివ్ విమర్శ వస్తుందని చూశానని, అయితే అన్ని పాజిటివ్ విమర్శలే రావడం విశేషం అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రతి విషయంలోనూ చాలా క్లియర్గా ఉన్నారన్నారు. తనకు బాగా నచ్చిన చిత్రం సూర్యవంశం అనీ, ఆ తరువాత విశ్వనాథ్ అండ్ సన్స్ అని పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర ప్రివ్యూను మీడియా మిత్రులతో కలిసి చూశానని, దీంతో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డానని, అయితే ఆ తరువాత ప్రతి ఒక్కరూ బాగుందని అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు దర్శకత్వం వహించిన వాథ్తి, లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని, తాజాగా తమిళంలో చేసిన విశ్వనాథ్ అండ్ సనన్స్ చిత్రానికి గాను విజయాన్ని అందించారని పేర్కొన్నారు. నటుడు సూర్యలోని విశ్వాసమే ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం అని దర్శకుడు వెంకీ అట్లూ రి పేర్కొన్నారు. కాగా నటుడు సూర్య చైన్నెలో లేని కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేదు. -
మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర చేశాను : వేద జలంధర్
‘‘అమీర్ లోగ్’ చిత్రకథ హైదరాబాద్లోని ఓ బస్తీ నేపథ్యంలో జరుగుతుంది. బస్తీ అన్నది సహజంగా ఉండాలని ఇక్కడి ఓ బస్తీలోని గృహాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం’’ అని వేద జలంధర్ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వేద జలంధర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమీర్ లోగ్’లో నేను చేసిన గీత పాత్ర పక్కింటి అమ్మాయిలా, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న ఓ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది’’ అని చెప్పారు. -
ఒక్కసారి పలకరించు తమ్ముడు.. నటుడు బ్రహ్మానందం అన్నయ్య ఆవేదన
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వృద్ధాప్యంలో ఉన్న తనను తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి ‘ఎలా ఉన్నావ్ అన్నయ్య?’ అని పలకరిస్తే చాలని ఆయన అన్నారు.తమ కుటుంబంలో ఆరుగురు సంతానం ఉండగా అందులో నలుగురు ఇప్పటికే చనిపోయారు. ప్రస్తుతం తాము ఇద్దరమే మిగిలాం. అయితే తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు మళ్లిన కాలంలో తోడబుట్టిన వారు ఒకరికొకరు తోడుగా ఉండాలనే ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ‘ఏరా అన్నయ్య.. ఎలా ఉన్నావ్?’ అని ఒకేఒక్క మాట అడుగుతాడేమో అని నేను ప్రతి రోజూ ఆశగా చూస్తున్నాను. ఈ సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవారు వచ్చి పలకరిస్తే, చిన్నవారికి అది ఎంతో సంతోషంగా ఉంటుందని ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.ఇటీవల బ్రహ్మానందం తన స్వగ్రామానికి వచ్చినా తనను కలవకుండానే వెళ్లిపోయారు. గతంలో బ్రహ్మానందం తనకు ఇల్లు కట్టించడంతో పాటు పిల్లల పెళ్లిళ్లకు సాయం కూడా చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. మిగతా తోడబుట్టిన వారికి కూడా బ్రహ్మానందం సాయం అందించాడు. తన తమ్ముడు తన కుటుంబానికి గతంలో సాయం చేసినట్లు అంగీకరిస్తూనే.. చాలా ఏళ్ల నుంచి తనని కలవకపోవడం, పలకరించకపోవడం పట్ల ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.వృద్ధాప్యం లో అన్నయ్య అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్న బ్రహ్మానందం గారి తోడబుట్టిన అన్నయ్య..మేము ఆరుగురు సంతానం నలుగురు చనిపోయారు ఉన్నది ఇద్దరమే , ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది నేను ఒక్కడినే,ఈ మధ్యనే వచ్చాడు ఊరికి,కనీసo పలకరించకుండా పోయాడుతమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ ఎలా… pic.twitter.com/901plLBjun— AVM (@AvmNews7) August 19, 2026బ్రహ్మానందం చదువు కోసం చిన్నతనంలోనే అత్తిలి వెళ్లిపోయాడు. అక్కడే లెక్చరర్గా ఉద్యోగం కూడా సంపాదించాడు. అనంతరం అక్కడే ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఆ పెళ్లి తమ తండ్రికి నచ్చకపోయినా తామంతా నచ్చజెప్పి తన పెళ్లికి వెళ్లాము. ఆ తర్వాత బ్రహ్మానందం సినిమాల్లో అవకాశం సంపాదించి హైదరాబాద్కు వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు.‘‘నాకు డబ్బు అవసరం లేదు. తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే చాలు’’ అంటూ శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. -
వెంకటేశ్-కల్యాణ్రామ్ మూవీకి క్రేజీ టైటిల్.. ‘జనవరి 12 విడుదల’
అనిల్ రావిపూడి ప్రమోషన్స్ అంటే మామూలుగా ఉండవు..తన సినిమాల ప్రచారంలోనూ కొత్తదనం చూపించే ఆయన.. తాజాగా మరోసారి తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ప్రకటించే విషయంలోనూ ఓ ఫన్నీ ఐడియాను తీసుకొచ్చారు. టైటిల్తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఒకేసారి రివీల్ చేసి ఆసక్తి పెంచారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, కల్యాణ్రామ్ బావా బామ్మర్ది పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.తాజాగా చిత్రబృందం సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించింది. ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేసింది. అంతేకాదు.. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాప్షన్ను కూడా జత చేసింది. టైటిల్ వినగానే ఇది సినిమా విడుదల తేదీ అనుకుంటే.. అదే సినిమా పేరుగా ఉండటం విశేషం.టైటిల్ ప్రకటన కోసం రూపొందించిన వీడియోలో వెంకటేశ్, కల్యాణ్రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి.. అనిల్ రావిపూడిని సినిమా పేరేంటని అడుగుతారు. అందుకు ఆయన పదే పదే ‘జనవరి 12 విడుదల’ అని చెబుతుంటారు. తొలుత అది రిలీజ్ డేట్ అని భావించిన హీరోలు.. చివర్లో అదే సినిమా టైటిల్ అని తెలుసుకుని సరదాగా స్పందిస్తారు.టైటిల్ రివీల్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ప్రత్యేకంగా నివాళి అర్పించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’లోని కామెడీ సీక్వెన్స్ను గుర్తు చేసేలా వీడియోను రూపొందించారు. ఇలా తన కామెడీ మార్క్తో పాటు పాత తరం హాస్యాన్ని కలిపి టైటిల్ అనౌన్స్మెంట్ను కూడా ఓ ఎంటర్టైనింగ్ వీడియోగా మార్చారు.సంక్రాంతి బరిలో..‘జనవరి 12 విడుదల’ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్తో మంచి అనుబంధం ఉండటంతో ఈ చిత్రంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. వెంకటేశ్, కల్యాణ్రామ్ కాంబినేషన్, అనిల్ రావిపూడి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
20 రోజులకే ఓటీటీలోకి సూపర్ స్టార్ వారసుడి సినిమా!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. జులై 30న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది.‘శ్రీనివాస మంగాపురం’కథేంటంటే..పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.The MOST INTENSE LOVE STORY of the Season is Coming Home ❤️🔥#SrinivasaMangapuram Streaming on @PrimeVideoIN from Tomorrow, August 20th 🔥#JaiKrishnaGhattamaneni #RashaThadani @themohanbabu @DirAjayBhupathi @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @sahisuresh @gullapallikumar… pic.twitter.com/gAmL53yUru— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 19, 2026 -
రామ్ పోతినేని పెద్ద మనసు.. శశిభవ్యతతో వీడియో కాల్
హీరో రామ్ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నాడు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశిభవ్యతకు అండగా నిలిచారు. తన అభిమాన నటుడు రామ్ పేరు చెబితేనే ఉత్సాహంగా స్పందించే శశిభవ్యత పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలను తెలుసుకున్న ఆయన.. వెంటనే స్పందించారు. బుధవారం స్వయంగా శశిభవ్యతతో వీడియో కాల్లో మాట్లాడి ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా ఆమెకు అవసరమైన మందులు, ఇతర వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశిభవ్యత. మూడు తరాలుగా కుటుంబంలో మేనరికపు వివాహాలు జరగడంతో ఆమె ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా శశిభవ్యకు తరచూ ఫిట్స్ రావడంతో పాటు నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండటంతో తల్లిదండ్రులే ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.శశిభవ్యతకు మతిస్థిమితం సరిగా లేకపోయినా హీరో రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టం. ఆయన పేరు చెబితేనే ఆమెలో ఉత్సాహం కనిపిస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు రామ్ సినిమాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను ఆమెకు చూపిస్తూ అన్నం తినిపించడం, మందులు వేయించడం చేస్తున్నారు.ఈ విషయం మీడియా, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో రామ్ పోతినేని దృష్టికి కూడా వెళ్లింది. శశిభవ్యత పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు.వీడియో కాల్ సందర్భంగా శశిభవ్యత తల్లిదండ్రులతో రామ్ మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు శశిభవ్యతకు సంబంధించిన వైద్య రిపోర్టులు తనకు అందాయని తెలిపారు. ఇకపై ఆమెకు అవసరమైన మందులు, ఇతర వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.శశిభవ్యను సంతోషంగా ఉంచాలని, వైద్యులు సూచించిన విధంగా సరైన సమయానికి మందులు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అవసరమైన సహాయం అందించేందుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఏడాదిగా మందుల ఖర్చులు భరిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడుమరోవైపు శశిభవ్యత కుటుంబానికి ఇప్పటికే కొంతకాలంగా స్థానికంగా సహాయం అందుతోంది. వైఎస్సార్సీపీ నాయకుడు రామ సతీష్ గత ఏడాది కాలంగా శశిభవ్యకు అవసరమైన మందుల ఖర్చులను భరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని నిరంతరం మందుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న శశిభవ్యకు ఒకవైపు స్థానికంగా రామ సతీష్ నుంచి ఏడాదిగా సహాయం అందుతుండగా.. మరోవైపు తన అభిమాన హీరో రామ్ పోతినేని స్వయంగా స్పందించి భరోసా ఇవ్వడం కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది.Hero #Ram connected with his fan Shashi, who has been bravely battling health issues, over a video call. ❤️Ram assured Shashi of his complete support and promised to take care of his medical needs. A truly heartwarming gesture from the star. 🙏❤️#RamPothineni @ramsayz…— Hari SaaHo (@HariSaaho19) August 19, 2026 -
‘భగీర.. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే’.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క ‘భగీర’ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన జీవితంలో భగీరతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘భగీర.. నువ్వు నా జీవితంలోకి పెంపుడు శునకంలా వచ్చావు. కొంత కాలంలోనే మా కుటుంబ సభ్యుడిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరితో ప్రతి రోజూ నా అలసటను దూరం చేశావు. ఇప్పుడు చెప్పలేని బాధను మిగిల్చి వెళ్లావు. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి’ అంటూ భగీరకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు.ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే భగీర ఆయన కుటుంబంలో ఎంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందో అర్థమవుతోంది. షూటింగులు, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి చేరుకున్న తర్వాత పెంపుడు జంతువులతో సమయం గడపడం ఎన్టీఆర్కు ఎంతో ఇష్టమట. ముఖ్యంగా భగీరతో ఆయనకు మంచి అనుబంధం ఉండేదట.అందుకే భగీరను కోల్పోవడం ఎన్టీఆర్కు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన కొంతకాలం షూటింగులకు దూరంగా ఉండనున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
మరో మహిళతో గదిలో.. భార్యకు పట్టుబడ్డ ‘బాసింగ బలాలు’ హీరో
తెలంగాణ ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి వివాదంలో చిక్కుకున్నాడు. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో అతని భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి బెడ్పై కూర్చుని ఉండగా.. ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం అర్థరాత్రి జరిగినట్లు సమాచారం.ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు, సదరు మహిళా ఫోక్ ఆర్టిస్ట్కు మధ్య సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు, దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక ఈశ్వర్ సాయి ‘బాసింగ బలాలు’ ఫోక్ సాంగ్తో ఇటీవల మరింత పాపులర్ అయ్యారు. ఈ పాటలో ఆయనతో పాటు వైష్ణవి సోనీ నటించారు. విడుదలైన కొద్ది రోజులకే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారి భారీగా వ్యూస్ సొంతం చేసుకుంది. పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభించింది.మరోవైపు మాధురి రాథోడ్తోనూ ఈశ్వర్ సాయి గతంలో పలు ఫోక్ సాంగ్స్లో కలిసి కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’, ‘ప్రమీల’ వంటి పాటల్లో వీరిద్దరూ కలిసి నటించారు.భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులుఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్యఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి pic.twitter.com/FNmtrKUA7E— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026 -
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాలి. అనంతరం వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాకు జమ చేయాలి. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకు కూడా వర్తిస్తాయి.ఈ నాలుగు చిత్రాల నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి, ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారాన్ని కల్పించారు.ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా, వృద్ధి సినిమాస్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. సంబంధిత నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి, టీజీఎఫ్డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాతలకు సూచించింది. -
మోహన్లాల్ అదిరిపోయే సర్ప్రైజ్.. ఒకేసారి 7 సినిమాలు!
మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యువ హీరోలతో పోటీ పడేలా వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న ఆయన.. తాజాగా తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకేసారి ఏకంగా ఏడు కొత్త సినిమాలను ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.మోహన్లాల్ ప్రకటించిన ఈ ఏడు చిత్రాలకు మలయాళ చిత్రసీమలోని ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహించనున్నారు. ప్రియదర్శన్, జీతూ జోసెఫ్, సత్యన్ అంతికాడ్, దిలీశ్ పోతన్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్, జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కొందరితో మోహన్లాల్కు ఇప్పటికే విజయవంతమైన కాంబినేషన్లు ఉన్నాయి. మరికొందరితో తొలిసారి కలిసి పనిచేయనున్నారు.ముఖ్యంగా జీతూ జోసెఫ్తో మోహన్లాల్ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘దృశ్యం’ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రియదర్శన్తోనూ మోహన్లాల్ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లు తెరపైకి రానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇక సత్యన్ అంతికాడ్, దిలీశ్ పోతన్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్, జూడ్ ఆంథనీ జోసెఫ్ వంటి విభిన్న శైలులున్న దర్శకులతో మోహన్లాల్ సినిమాలు చేయనుండటం విశేషం. దీంతో ఈ ఏడు చిత్రాల్లో విభిన్న కథలు, జానర్లను చూసే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ ఏడు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్పైకి వెళ్తుందనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. మరోవైపు మోహన్లాల్ ఇప్పటికే ‘అతిమనోహరం’ షూటింగ్లో పాల్గొంటున్నారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా క్రిస్మస్ 2026 సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మోహన్లాల్ ‘తుడక్కం’, ‘దృశ్యం 3’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏడు సినిమాలను ప్రకటించడం ద్వారా ఆయన కెరీర్ ఎంత జోరుగా సాగుతోందో మరోసారి స్పష్టమైంది. 66 ఏళ్ల వయసులోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న మోహన్లాల్.. రాబోయే రోజుల్లో ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. Exciting stories, exciting journeys and some very special filmmakers.Here’s a glimpse of my seven upcoming projects with:• Vishnu Mohan• Anoop Sathyan• Priyadarshan• Dileesh Pothan• Sathyan Anthikad• Jude Anthany Joseph• Jeethu Joseph— Mohanlal (@Mohanlal) August 18, 2026 -
‘ఓహో..నీకు పీరియడ్స్ సమయమా’ అని చులకనగా చూసేవాడు: అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై వరుసగా మాట్లాడుతున్నారు. గత రెండేళ్లుగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు, మానసిక వేధింపులు తనపై ఎంతటి ప్రభావం చూపాయో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడి ప్రవర్తన కారణంగా ఒక నటిగా, మహిళగా తాను తీవ్రంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. తన మాజీ ప్రియుడు ప్రతిసారి తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేవాడని తెలిపారు. తాను ఏదైనా విషయంపై అతడిని ప్రశ్నిస్తే.. ‘ఓహో.. నీకు పీరియడ్స్ సమయమా? ఇంకా రాలేదా? మూడ్ స్వింగ్స్ కదా’ అంటూ చులకనగా చూసేవాడని, ఇలాంటి మాటలు తనపై తీవ్ర ప్రభావం చూపించాయని చెప్పారు.‘నేను నటినైనందుకు, ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక మహిళనైనందుకు సిగ్గుపడే పరిస్థితిలోకి నెట్టేశాడు. ఆ మాటలు విన్న తర్వాత నాపై నాకే అసహ్యం వేసేది’అని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంబంధం తన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కెరీర్పైనా ప్రభావం చూపిందని ఆమె వెల్లడించారు. షూటింగ్ సమయంలో కూడా ఆ బాధను నియంత్రించుకోలేక క్యారవాన్లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు.. చివరికి తన సొంత తమ్ముడితో చనువుగా ఉండటానికి కూడా భయపడే స్థాయికి తాను వెళ్లిపోయానని తెలిపారు.‘ఒకప్పుడు నాకు పెద్ద కుటుంబం కావాలని, 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్ని. కానీ ఆ సంబంధంలో ఎదురైన అనుభవాల తర్వాత పిల్లలే వద్దనుకునే స్థాయికి నా ఆలోచనలు మారిపోయాయి. ఒక మహిళగా పుట్టినందుకే కదా ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది’ అనే భావన తనలో కలిగిందని అన్నారు. అయితే, అనుపమ తన మాజీ ప్రియుడి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె గతంలో ధ్రువ్ విక్రమ్తో ఉన్నట్లు ప్రచారం జరిగిన సంబంధాన్ని కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలకు ముడిపెడుతున్నారు. అయితే, అనుపమ మాత్రం తన మాజీ ప్రియుడి గుర్తింపును వెల్లడించలేదు. ఇటీవల బ్రేకప్ రూమర్లపై స్పందించిన ఆమె.. తన సోషల్ మీడియా పోస్టులు తన జీవితంలో ఓ మహిళగా తాను ఎదుర్కొన్న మార్పులు, స్వీయ అన్వేషణకు సంబంధించినవేనని స్పష్టం చేశారు.ప్రేమమ్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’, ‘టిల్లు స్క్వేర్’, ‘డ్రాగన్’, ‘పరదా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. -
ట్రెండ్ మారింది..‘టాక్సిక్’కు టికెట్ రేట్లు పెంచుతారా?
యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు దగ్గరవడంతో ఇటీవల వచ్చిన పలు సినిమాల టికెట్ రేట్లను పెంచకుండా రిలీజ్ చేయడం ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడం వంటి అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల టికెట్ రేట్లు పెంచకుండా విడుదలైన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, ‘కొరియన్ కనకరాజు’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘లెనిన్’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో టికెట్ రేట్లు పెంచకపోవడం వల్లే థియేటర్లకు ఫుట్ఫాల్ పెరుగుతోందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక జీవో ఇంకా రాలేదు కానీ, పెంపు దాదాపు ఖరారైందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.ఉదయం 6 గంటల ఎర్లీ మార్నింగ్ షోకు రూ.500–600 వరకు, రెగ్యులర్ షోలకు టికెట్పై రూ.50 వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. ఇటీవల వచ్చిన సినిమాల అందుబాటు ధరలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ‘టాక్సిక్’కు ఇంత భారీ రేట్లు పెడితే ఏపీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అప్పటికి టికెట్ ధరలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.యశ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'రాకీ భాయ్' పాత్రతో యశ్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయిన విషయం తెలిసిందే. గీతూ మోహన్దాస్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కియారా–సైఫ్ జోడీగా థ్రిల్లర్ సినిమా!
కియారా అద్వానీ, సైఫ్ అలీఖాన్ తొలిసారి కలిసి నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రచయిత్రి, నిర్మాత కనికా ధిల్లాన్ తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సినిమాలో వీరిద్దరూ జోడీగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో కనికా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభించే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.దర్శకురాలిగా కనికా..కనికా ధిల్లాన్ ఇప్పటికే ‘మన్మర్జియాన్’, ‘కేదార్నాథ్’, ‘జడ్జ్మెంటల్ హై క్యా?’, ‘హసీన్ దిల్రుబా’, ‘రష్మి రాకెట్’, ‘రక్షాబంధన్’, ‘డంకీ’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు. ‘హసీన్ దిల్రుబా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’తో థ్రిల్లర్ కథలను తెరకెక్కించారు. ‘దో పట్టీ’ చిత్రానికి రచనతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంతో మెగాఫోన్ పట్టనున్నారు.కాగా, కియారా ప్రస్తుతం యశ్ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు సైఫ్ అలీఖాన్.. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైవాన్’లో అక్షయ్కుమార్తో కలిసి నటిస్తున్నారు. తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మోహన్లాల్, అనూప్ సత్యన్ కాంబోలో సినిమా..!
మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శకుడు అనూప్ సత్యన్తో కలిసి ఆయన ఓ చిత్రాన్ని చేయనున్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. నిర్మాతలు బిను జార్జ్ అలెగ్జాండర్, ఆంటోని పెరుంబవూర్లో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం నవంబర్లో సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం.దర్శకుడు అనూప్ మాట్లాడుతూ.. ‘తండ్రి సత్యన్ ఆంథికాడ్ చిత్రాల శైలికి పూర్తిగా ఇది భిన్నంగా ఉంటుంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, భావోద్వేగాల వంటి అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. మోహన్లాల్కు గత వారమే కథ వినిపించా.. ఆయనకు నచ్చడంతో సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. -
గిన్నిస్ రికార్డా? బిగ్బాస్ అవకాశమా? ధనుష్ స్పందన ఇదే..
బిగ్బాస్.. అగ్నిపరీక్ష ఎంపిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారుతోంది. పోటీలో భాగంగా నిర్వాహకులు ఇస్తున్న కొన్ని టాస్క్లపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్ ధనుష్ మంజునాథ్ చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కన్నడ బిగ్బాస్ అగ్నిపరీక్షలో భాగంగా ధనుష్ తన గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ను చించేయడంతో ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. రియాలిటీ షోలో అవకాశం కోసం జీవితంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన గుర్తింపును ఎలా ధ్వంసం చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నించారు.డూప్లికేట్ మాత్రమే.. ఇప్పటికే ఈ ఎంపిక ప్రక్రియలో గోమయాన్ని ముఖానికి పూసుకోవడం, ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటి టాస్క్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ధనుష్ చర్య కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు కారణమైంది. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించిన ధనుష్.. తాను చించేసింది అసలు గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ కాదని స్పష్టం చేశారు. టాస్క్ కోసం నిర్వాహకులు తనకు డూప్లికేట్ కాపీని ఇచ్చారని అసలు సర్టిఫికెట్ను భద్రంగా ఉంచుకున్నానని వెల్లడించారు.అవకాశాన్ని వదులుకోనంటూ..అంతేకాకుండా గిన్నిస్ రికార్డును మరోసారి సాధించే అవకాశం ఉండొచ్చని, కానీ కన్నడ బిగ్బాస్లో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. వేలాది మంది దరఖాస్తు చేసుకున్న వారిలో తనను ఎంపిక చేసిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదని తెలిపారు. ధనుష్ వ్యాఖ్యలు బిగ్బాస్ వంటి రియాలిటీ షోలకు యువత ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మరోసారి స్పష్టం చేశాయి. ఈ షో ద్వారా గుర్తింపు, సినిమా అవకాశాలు, బ్రాండ్ ఒప్పందాలు, మరింత ప్రజాదరణ లభిస్తాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది షో ముగిసిన తర్వాతే తేలనుంది.ఇదీ చదవండి: నెలకు రూ.33 లక్షలు.. బిగ్బీ కొత్త లీజు ఒప్పదం! -
నెలకు రూ.33 లక్షలు.. బిగ్బీ కొత్త లీజు ఒప్పదం!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందంతో వార్తల్లో నిలిచారు. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ప్రముఖ పోషకాహార సంస్థకు లీజుకు ఇచ్చారు. లింక్ రోడ్డులోని సిగ్నేచర్ భవనంలో ఉన్న సుమారు 8,428 చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయ స్థలాన్ని అమితాబ్ బచ్చన్ లీజుకు ఇచ్చినట్లు సమాచారం.అద్దె రూపంలో రూ.21.88 కోట్లు..ఈ ఒప్పందం ప్రకారం ఆయనకు నెలకు రూ.33 లక్షల అద్దె రానుందట. 2026 ఆగస్టు 15 నుంచి ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుందట. మొత్తం కాలానికి అద్దె రూపంలో సుమారు రూ.21.88 కోట్లు వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచేలా ఒప్పందంలో నిబంధనను చేర్చినట్లు తెలుస్తోంది.మరోసారి చర్చ..అద్దెకు తీసుకున్న సంస్థకు కార్యాలయ స్థలంతో పాటు తొమ్మిది పార్కింగ్ స్థలాలను కూడా వినియోగించుకునే హక్కు కల్పించారట. ఈ లావాదేవీలో భాగంగా రూ.1.98 కోట్ల భద్రతా డిపాజిట్ను చెల్లించినట్లు సమాచారం.ఇప్పటికే ముంబైలో పలు విలాసవంతమైన నివాసాలు, వాణిజ్య భవనాలను కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్.. ఇటీవల అయోధ్యలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: 15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్పై అప్డేట్ -
నయనతార గుండు చేయించుకున్నారా?..ఫోటోలు వైరల్!
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమైన ఫొటో.. ఏది మార్ఫింగ్ చేసిన చిత్రం అనేది గుర్తించడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఏఐ సాయంతో మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడం తరచూ కనిపిస్తోంది. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార విషయంలోనూ ఇలాంటి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నయనతార గుండు చేయించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో నిజం లేదని తెలుస్తోంది.నిజానికి నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్తో కలిసి ఈ ఏడాది ఏప్రిల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నయనతార తెలుపు రంగు కుర్తా, లెగ్గింగ్స్తో పాటు ఆకుపచ్చ రంగు దుపట్టాలో కనిపించారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వారికి అభివాదం చేశారు. అయితే అప్పటి ఫొటోలను తీసుకుని నయనతార తలనీలాలు సమర్పించినట్లుగా ఏఐ టెక్నాలజీతో మార్చి, ఆ వీడియో, ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.నయనతార గుండు చేయించుకున్నారా? అసలు నిజం ఇదే!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నయనతార గుండు ఫొటోలు నిజం కావని తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారంటూ వైరల్ చేస్తున్న ఈ చిత్రాలు.. ఆమె ఏప్రిల్లో తిరుమలకు వచ్చినప్పటి ఫొటోలను AIతో మార్ఫింగ్ చేసినవిగా… pic.twitter.com/wb3y86bmfY— Tupaki (@tupaki_official) August 18, 2026 -
15 ఏళ్లకే డ్రగ్స్, మద్యం.. ఆత్మహత్యాయత్నం: మైఖేల్ జాక్సన్ కుమార్తె
ప్రముఖ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కుమార్తె, గాయని పారిస్ జాక్సన్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజుల గురించి తొలిసారి మాట్లాడారు. కౌమారదశలోనే డిప్రెషన్, మాదకద్రవ్యాల వ్యసనం, చికిత్స పొందని మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడినట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె తన గత అనుభవాలను పంచుకున్నారు.తండ్రి మరణం తర్వాత కుంగిపోయా2009లో తన తండ్రి మైఖేల్ జాక్సన్ మరణించిన తర్వాత తన జీవితంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయని పారిస్ చెప్పారు. అయితే అంతకుముందు నుంచే తనలో ఒంటరితనం, మానసిక ఆందోళన వంటి సమస్యలు ఉండేవని ఆమె పేర్కొన్నారు. చిన్నతనం నుంచే తనలో ఒకరకమైన ‘దీర్ఘకాలిక ఒంటరితనం’ ఉండేదని, అది తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, మద్యం, డ్రగ్స్ వంటి సమస్యలకు దారితీసిందని వివరించారు.15 ఏళ్లకే డ్రగ్స్..తనకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడే తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. అప్పటికే డ్రగ్స్, మద్యం వినియోగం మొదలైందని, చికిత్స పొందని మానసిక సమస్యలతో అవి కలిసిపోవడంతో పరిస్థితి మరింత విషమించిందని చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సూచనతో ఆమెను ఉటాలోని ఓ చికిత్సా కేంద్రానికి పంపించారు. అయితే అక్కడి అనుభవం తనకు మరింత మానసిక గాయాన్ని మిగిల్చిందని పారిస్ అన్నారు.పీడకలలు వచ్చాయిఆ కేంద్రంలో గడిపిన కాలం తన మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని పారిస్ తెలిపారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు, మూడు సంవత్సరాల పాటు ఆ కేంద్రానికి తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో పీడకలలు వచ్చేవని చెప్పారు. శారీరకంగా లేదా లైంగికంగా తనపై దాడి జరగలేదని, అయితే మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఆమె పేర్కొన్నారు.మళ్లీ ఆత్మహత్యాయత్నంచికిత్స తర్వాత కూడా పారిస్ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. డ్రగ్స్ వినియోగం, మద్యం, నిద్రలేమి ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు. ఒక దశలో వారాల పాటు ప్రతి రాత్రి గంట లేదా రెండు గంటలకు మించి నిద్రపోలేదని వెల్లడించారు. అదే సమయంలో మరోసారి తన జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచనలకు లోనయ్యానని చెప్పారు.ఆ సమయంలో తాను ఒక ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు తనలో ఎలాంటి భావనలు కలిగాయో కూడా వివరించారు. ఓ సారి మద్యంలో ప్రిస్క్రిప్షన్ మందులను కలిపి తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత మేల్కొన్నానని, అప్పట్లో తన ప్రయత్నం విఫలమైందన్న నిరాశ కలిగిందని చెప్పారు.మద్యం, డ్రగ్స్ తన జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయో అర్థమై, చివరకు వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత ఆరేళ్లుగా మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే వ్యసనం నుంచి బయటపడటం అంటే మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని పారిస్ స్పష్టం చేశారు. కొంతకాలం తర్వాత కూడా ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు తిరిగి రావడంతో మానసిక వైద్యుల సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం సంగీతంపై దృష్టి సారించిన పారిస్ తన రెండో ఆల్బమ్ ‘హ్యాపియెస్ట్ డే ఆఫ్ మై లైఫ్’ను ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ఈ ఆల్బమ్ తన మానసిక ఆరోగ్య ప్రయాణంలోని కొన్ని అనుభవాలను కూడా ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు. -
‘ఇరుముడి’లో రామ్ చరణ్.. టీమ్ క్లారిటీ!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని ఓ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా రామ్ చరణ్ టీమ్ స్పందించింది.‘ఇరుముడి’ సినిమాలో ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ అంటూ సాగే పాటలో రామ్ చరణ్ అయ్యప్ప మాలధారణలో కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. ఈ పాటలో ఆయన ప్రత్యేకంగా కనిపించనున్నారని, ఇది సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఉండబోతోందంటూ అభిమానులు, నెటిజన్లు చర్చించుకున్నారు.ఈ ప్రచారానికి ‘ఇరుముడి’ ప్రీరిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. సినిమాలోని ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ పాటలో అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని ఆయన చెప్పడంతో.. ఆ సర్ప్రైజ్ రామ్ చరణ్నే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో మెగా అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది.అయితే తాజాగా ఈ వార్తలకు చెక్ పడింది. రామ్ చరణ్ ‘ఇరుముడి’ సినిమాలో నటించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. సినిమాలో రామ్ చరణ్ కనిపించనున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయొద్దని కూడా రామ్ చరణ్ టీమ్ విజ్ఞప్తి చేసింది.దీంతో ‘ఇరుముడి’లో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారనే ప్రచారానికి తెరపడినట్లైంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో జీవీ ప్రకాశ్ చెప్పిన సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో కొనసాగుతోంది. ఆ సర్ప్రైజ్ ఏమిటన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది. -
త్రిష.. నిన్ను ప్రేమించకుండా ఉండడానికి ఒక్క కారణం చెప్పు?
హీరోయిన్ త్రిష మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె అందమైన లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు నెట్టింట వైరల్గా మారాయి. చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించడంతో అభిమానులు ప్రశంసలతో కామెంట్లు చేస్తున్నారు.త్రిష షేర్ చేసిన ఈ ఫొటోలకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు చేసిన కామెంట్ ప్రస్తుతం ప్రత్యేకంగా నిలిచింది. త్రిష అందాన్ని ప్రశంసిస్తూ ఖుష్బు చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది.త్రిష పోస్ట్కు స్పందించిన ఖుష్బు.. ‘నిన్ను ప్రేమించకుండా ఉండేందుకు నాకు ఒక్క కారణం చెప్పు. లోపల, బయట అత్యంత అందమైన వ్యక్తివి నువ్వే’ అంటూ ప్రశంసించారు. త్రిష అందం కేవలం బయటికి మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిత్వం కూడా ఎంతో అందంగా ఉందనే అర్థం వచ్చేలా ఖుష్బు చేసిన ఈ కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.ఖుష్బు చేసిన ఈ వ్యాఖ్యకు త్రిష అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తమ అభిమాన నటిపై సినీ ప్రముఖులు ఇలాంటి ప్రశంసలు కురిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష ఫొటోలతో పాటు ఖుష్బు చేసిన కామెంట్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.కాగా, త్రిష ప్రస్తుతం తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆమెకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫొటోలు మరోసారి త్రిషపై నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
‘అమీర్ లోగ్’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది: దర్శకుడు
‘‘అమీర్ లోగ్’ చిత్రంలో అన్నిరకాల వాణిజ్య అంశాలుఉన్నాయి. ఈ సినిమా కేవలం యువతకి మాత్రమే కాదు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలతో కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ నెల 21న విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో రమణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘అమీర్ లోగ్’ సినిమాని బస్తీలోనే షూట్ చేయాల్సి రావడంతో సింక్ సౌండ్ని వాడాం. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ చాలా బాగా నటించారు. ‘అమీర్ లోగ్’కి రానాగారి సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ వీఎన్ ఆదిత్యగారు అమితాబ్గారి ‘ఝుండ్’, రణ్వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చడం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. -
బ్రేకప్పై ధృవ్ విక్రమ్ పరోక్ష స్పందన.. ఏమన్నాడంటే?
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల తన జీవితంలో నుంచి ఓ వ్యక్తి దూరమయ్యాడని, ఇప్పుడు తాను స్వేచ్ఛగా ఉన్నానంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ నటుడు, సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ధృవ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. సినీ రంగంలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలపై నిశిత పరిశీలన, విమర్శలు సహజమే. వాటిని తట్టుకుని వన్ మ్యాన్ ఆర్మీలా ముందుకు సాగాలి. ప్రతి నటుడి జీవితంలో నెగెటివ్ అంశాలు కూడా ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. తమపై వచ్చే విమర్శలు ఇబ్బంది పెట్టినప్పటికీ.. వాస్తవానికి, తన విలువలకు కట్టుబడి ఉండటం ముఖ్యం. నిజాయితీగా ఉంటే ఎలాంటి విమర్శలు తనను ప్రభావితం చేయలేవని తెలిపాడు.అయితే ధృవ్ తన వ్యాఖ్యల్లో అనుపమ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆయన వ్యాఖ్యలు అనుపమ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు స్పందనగానే భావిస్తున్నారు.అనుపమ స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలోనూ పలు మూవీస్ చేసింది. అయితే ధ్రువ్తో 'బైసన్' సినిమా చేస్తున్న టైంలో హీరోహీరోయిన్లు అయిన ధ్రువ్ విక్రమ్, అనుపమ మధ్య ప్రేమ పుట్టిందనే టాక్ బయటకు వచ్చింది. అందుకు తగ్గట్లే కొన్ని వ్యక్తిగత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే లేటెస్ట్గా అనుపమ.. బ్రేకప్ తర్వాత తనకు స్వాతంత్రం వచ్చిందనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టింది.ఇక మరో పోస్టులో.. ఈ రోజు ప్రశాంతత నన్ను చేరుకుంది. ఒకప్పుడు నాదేనని మరిచిపోయిన జీవితాన్ని మరోసారి ప్రేమించడం ప్రారంభించా. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నా. ఇకపై నా జీవితం పూర్తిగా నాదే అని రాసుకొచ్చింది. దీంతో అనుపమ బ్రేకప్ రూమర్స్ నిజమేనా అని మాట్లాడుకుంటున్నారు.ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యే 'మరీచిక', లాక్ డౌన్ లాంటి సినిమాలతో వచ్చింది గానీ ఫ్లాప్స్ ఎదుర్కొంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'భోగి' మూవీ చేస్తోంది. -
ముంబై అండర్వరల్డ్ కథతో ఆర్జీవీ.. సరికొత్త ప్రయోగం
దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి క్రైమ్ జానర్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటుడు హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ముంబైలోని ఓ పోలీసు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.తొలుత ఈ ప్రాజెక్ట్ను వెబ్సిరీస్గా రూపొందించాలని నిర్మాతలు భావించినప్పటికీ కథలోని పాత్రల బలం, యాక్షన్ అంశాలను దృష్టిలో పెట్టుకుని రామ్గోపాల్ వర్మ దీన్ని రెండు భాగాల సినిమాగా తెరకెక్కించాలని సూచించినట్లు టాక్.2027లో కొన్ని నెలల వ్యవధిలో..టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించి, 2027లో కొన్ని నెలల వ్యవధిలో థియేటర్లలో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘పోలీస్ కంపెనీ’లో దయా నాయక్ చిన్ననాటి నుంచి ముంబై పోలీస్ వ్యవస్థలో ఆయన ఎదిగిన తీరును చూపించనున్నారట. 1990ల చివరి దశ, 2000ల ప్రారంభంలో ముంబై అండర్వరల్డ్పై పోలీసులు చేపట్టిన ఆపరేషన్లు కథలో ప్రధానాంశంగా ఉండనున్నాయని తెలుస్తోంది.ఇదీ చదవండి: బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ -
బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆమెకు పార్టీ కండువా కప్పి అధికారికంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.సినీ రంగంలో కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేష్టి వర్మ ఇటీవల కాలంలో చేసిన పాటలు విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రంలోని ‘సుసేకి’ పాటకు ఆమె అందించిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు కూడా ఆమె పనిచేశారు. హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో పలు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పనిచేశారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. గతంలో జానీ మాస్టర్పై ఆమె లైంగిక వేధింపులు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గతంలో జానీ మాస్టర్పై కేసు..గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చిన ఈమె.. అతడిపైనే ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రేష్టి వర్మ ఆరోపణలు, ఫిర్యాదు చేయడం వల్ల జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు జైలులో ఉంచారు. తర్వాత బెయిల్పై బయటకొచ్చిన జానీ.. ప్రస్తుతం ఆడపాదడపా పాటలు చేస్తున్నారు.జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో గతంలో స్పందించిన జనసేన అప్పటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాద్లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించింది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే నా ఇంటిపేరు ‘బచ్చన్’ -
రెండో వారంలోనూ జోరు కొనసాగిస్తున్న సినిమా
లోకేశ్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం డీసీ. తొలిరోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలై 10 రోజులు పూర్తయినా ఈ సినిమా వసూళ్ల జోరులో ఏ మాత్రం తగ్గడంలేదు. మొదటి వారంలో..మొదటి వారంలో ఈ చిత్రం ఇండియాలో బాక్సాఫీస్ వద్ద రూ.41.9 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. రెండో వారంలో కూడా ఆదివారం ఒక్కరోజే రూ.4.5 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే తొలి ఆదివారం వచ్చిన రూ.9.55 కోట్లతో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా తగ్గింది. రెండో వారంలో మొత్తం రూ.12.86 కోట్లను వసూలు చేసిన 'డీసీ'.. మొత్తం నెట్ కలెక్షన్లు రూ.54.76 కోట్లకు చేరుకున్నాయి. గ్రాస్ వసూళ్లు సుమారు రూ.64.62 కోట్లుగా నమోదయ్యాయి.ఈ వసూళ్లతో 'పరాశక్తి', 'యూత్', 'బ్లాస్ట్' చిత్రాలను అధిగమించిన 'డీసీ'.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం రూ.62.46 కోట్లతో ఉన్న 'తాయ్ కిళవి' చిత్రానికి చేరువలో ఉంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారం ముగిసే నాటికి ఆ చిత్రాన్ని కూడా అధిగమించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘సాV3’లో కొత్తగా కనిపిస్తా : హీరో సామ్రాట్
సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సాV3'. లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్పై వి. విజయ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణమాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన టీజర్ విడుదల కార్యక్రమానికి పలువురు బిగ్బాస్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. 'సాV3' నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని తెలిపింది.ఈ చిత్రంలో తాను ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నానని హీరో సామ్రాట్ అన్నారు. టీజర్కు వస్తున్న స్పందన ఆనందంగా ఉందని హీరో డీమోన్ పవన్ పేర్కొన్నారు. దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ.. సినిమాలో టీజర్లో చూపించిన దానికంటే మరింత బలమైన కథాంశం ఉంటుందని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. -
‘ఇరుముడి’ వేడుకలో బూతు పదాలు.. రవితేజపై నెటిజన్స్ ఫైర్!
ఈ మధ్య సినిమా ఈవెంట్స్లో నటీనటులు బూతు పదాలు మాట్లాడటం కామన్గా మారిపోయింది. స్టేజ్పై మాట్లాడుతున్నామనే విషయం మర్చిపోయి.. ఫ్లోలో నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఓ సినిమా వేడుకలో చేసిన పదప్రయోగం చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో రవితేజ, సీనియర్ నటుడు అజయ్ ఘోష్ కూడా సినిమా వేదికపై చేసిన కొన్ని పదప్రయోగాలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతున్నాయి.హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదికైంది. కార్యక్రమం మొత్తం సందడిగా సాగినప్పటికీ.. రవితేజ, అజయ్ ఘోష్ మాట్లాడిన సమయంలో వినిపించిన ఒకట్రెండు అసభ్య పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ తన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను పొగిడే క్రమంలో అనుకోకుండా బూతు పదాలను వాడేశాడు. (చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!)మరో సందర్భంలో రవితేజ కూడా అభ్యంతరకరంగా భావించే ఓ పదాన్ని ఉపయోగించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని అడగగా 'ముదురు ము...' అని రవితేజ అంటాడు. ఒక స్టార్ హీరో..చిన్న పిల్లను అలా అనడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ప్రేమతో అన్నా సరే.. వేదికపై అలాంటి బూతు పదాన్ని వాడడం కరెక్ట్ కాదంటూ రవితేజను ట్రోల్ చేస్తున్నారు.(చదవండి:‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్కి షాకింగ్ ప్రశ్న.. రియాక్షన్ ఇదే!)సాధారణ కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి పదాలు వినిపిస్తే.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తులకు ‘ఇరుముడి’ అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోనే బూతు పదాలు వినిపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. -
ప్రముఖ టిక్టాక్స్టార్ను కాల్చి చంపిన దుండగులు
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాక్, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షంసు బీబీ(28) అలియస్ అయేషా గిలామనా దారుణ హత్యకు గురయ్యారు. ఆగస్టు 14న టాక్సిలా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కాల్పులు జరిపారు. మెడపై బులెట్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు కొద్దిసేపటి ముందు కాశి అనే వ్యక్తి ఫోన్చేసి బయటకు రమ్మన్నాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరితో పాటు సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఈ సమయంలో మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అదే సమయంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో ఆమె సోదరి తీవ్రంగా గాయపడింది.డబ్బు లావాదేవీల విషయంలో కౌసర్, జావేద్ అలియాస్ షాహీన్ అనే ఇద్దరితో తన కుమార్తుకి విభేదాలు ఉన్నాయని అయేషా తండ్రి ఫజల్ సాహిబ్ జాదా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా.. టిక్టాక్లో సుమారు 13లక్షల మంది అనుచరులను సంపాదించుకున్న అయేషా అంత్యక్రియలకు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారని వార్తలు వెలువడ్డాయి. దీంతో సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. -
‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్కి షాకింగ్ ప్రశ్న.. రియాక్షన్ ఇదే!
మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న హీరోయిన్ మాళవిక శర్మకు కేరళ మీడియాతో తొలి ఇంటరాక్షన్లో వింత అనుభవం ఎదురైంది. తన తాజా చిత్రం ‘ఖలీఫా: ది ఇంట్రో’ ప్రమోషన్లో భాగంగా కేరళ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ ఆమెను బీఫ్ గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మాళవిక కొంత అసహనంగా స్పందించినట్లు వీడియోలో కనిపించింది. అయితే ఆమె ప్రశాంతంగానే సమాధానం ఇస్తూ.. తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశారు.మహారాష్ట్రకు చెందిన మాళవిక శర్మ తెలుగు సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘నేల టికెట్’, ‘రెడ్’, ‘హరోమ్ హరా’, ‘భీమా’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం మలయాళ చిత్రంతో మరో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఖలీఫా: ది ఇంట్రో’ చిత్ర బృందంతో కలిసి కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇందులో భాగంగా కేరళ మీడియా ప్రతినిధులతో మాళవిక తొలిసారి మాట్లాడారు. మీడియా సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ రిపోర్టర్.. ‘మీకు బీఫ్ నచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో మాళవిక కొంత ఇబ్బందికి గురైనట్లు వీడియోలో కనిపించింది. అనంతరం ఆమె.. ‘నేను వెజిటేరియన్ను. కాబట్టి బీఫ్ ట్రై చేయలేదు’ అని సమాధానం ఇచ్చారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాళవికను అడిగిన ప్రశ్నపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. సినిమా ప్రమోషన్కు సంబంధించిన విషయాలపై ప్రశ్నలు అడగకుండా, ఆమె వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి ఇలాంటి ప్రశ్న అడగడం ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం మీడియా ఇంటరాక్షన్లో ఇలాంటి ప్రశ్నలు ఎదురుకావడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు.Kerala saaar beef saar 🤧 - Malavika Sharma, from Maharashtra- Acted in Khalifa, a Malayalam movie- Came to do promotion in Kerala- Met Kerala media for the first time- Within 2 minutes, they asked, “Did you like beef?”- She felt irked but replied she’s a vegetarianWill… pic.twitter.com/Zpff0x0Xmu— S Kumar (@SKumararchives) August 17, 2026ఇదిలా ఉంటే, ‘ఖలీఫా: ది ఇంట్రో’తో మాళవిక శర్మ మలయాళ ప్రేక్షకులను పలకరించనున్నారు. మరోవైపు కన్నడలో ‘బృందావిహారి’ అనే చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో తెలుగు దాటుకుని ఇతర భాషల పరిశ్రమల్లోనూ తన మార్కెట్ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
దర్శన్ కేసు: జైలులో నటి పవిత్ర గౌడకు ఊహించని షాక్!
రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి పవిత్ర గౌడకు జైలులో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్కు తరలించినట్లు సమాచారం. ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉన్న బ్యారక్లో ఉన్న పవిత్ర గౌడను.. ఏకంగా 16 మంది ఖైదీలు ఉన్న బ్యారక్కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. జైలులో భద్రతా చర్యలను కఠినతరం చేసిన నేపథ్యంలోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం.ఇటీవల మాజీ ఎంపీ ప్రజ్జ్వల్ రేవన్న ఉన్న బ్యారక్లో మొబైల్ ఫోన్ లభ్యమైన విషయం తెలిసిందే. ఈ వార్త వైరల్ కావడంతో, జైలు నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ ఎలా లోపలికి వెళ్లిందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన తర్వాత జైలులోని ఖైదీల కదలికలపై నిఘాను మరింత పెంచినట్లు తెలుస్తోంది.డీజీపీ అలోక్ కుమార్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును సందర్శించి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. జైలు పరిసరాలు, ఖైదీల బ్యారక్లు, భద్రతా వ్యవస్థను పరిశీలించిన అధికారులు.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి పవిత్ర గౌడను కూడా మరో బ్యారక్కు తరలించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇద్దరు ఖైదీలు ఉన్న బ్యారక్లో ఉన్న ఆమెను 16 మంది ఖైదీలు ఉండే బ్యారక్కు మార్చడం చర్చనీయాంశంగా మారింది. అయితే పవిత్ర గౌడను ఈ విధంగా బదిలీ చేయడానికి సంబంధించిన అధికారిక కారణాలు పూర్తిగా వెల్లడికావాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్తో పాటు పవిత్ర గౌడపై కూడా ఆరోపణలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం కేసు న్యాయపరమైన ప్రక్రియలో ఉండగా.. జైలు అధికారులు భద్రత విషయంలో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
రవితేజపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఈ నటుడు మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఆ పిల్లోడు (రవితేజ)తో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ.. ఆయనతో పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని అన్నారు.రవితేజలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూశానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ‘నీలాంటి తాత్వికుడితో పనిచేశాను. వీళ్లందరికీ నువ్వొక హీరోలా కనిపిస్తావు. కానీ నేను నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తిని చూశా. నిజంగా ఉన్నది ఉన్నట్లు.. మొహమాటం లేకుండా మాట్లాడటం.. నిజంలో బతకడం.. నిజంగా ఉండడం మీకే చెల్లింది’అని రవితేజను ప్రశంసించారు.నేను అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో పని చేశా.. కానీ రవితేజతో నా అనుబంధం..రవితేజలో ఒక జిడ్డు కృష్ణమూర్తి వున్నాడు.- Ajay Ghosh#Irumudi Grand Pre-Release Event pic.twitter.com/e063kqVf17— idlebrain.com (@idlebraindotcom) August 16, 2026 -
ఇరుముడి డిఫరెంట్ మూవీ.. ఆ సీన్లు మనసుల్నీ తాకుతాయి: రవితేజ
‘‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్లా ఉంటుంది. కొన్ని పాత్రలు ఆడియన్స్కు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో స్వాసికను చూస్తే భయం వేస్తుంది. నేను, నక్షత్ర కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మనసుల్ని తాకుతాయి. కావేరి పాత్రలో ప్రియ చక్కగా నటించింది. మైత్రీ బేనర్లో నాకు ఇది మూడో సినిమా. భవిష్యత్లో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘మల్లెపూల పల్లకి..’ పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఓ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులు, నా అభిమానులు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. డిఫరెంట్ రవన్నను (రవితేజ) చూడబోతున్నారు (ఫ్యాన్స్ను ఉద్దేశించి). జీవీ ప్రకాశ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శివ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను’’ అని అన్నారు. ‘‘మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. సాధారణ తండ్రి, కూతుళ్ల కథ ఇది. మన అమ్మాయిలను ఇలా చూసుకోవాలని మనకు అనిపిస్తుంది’’ అని శివ నిర్వాణ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘అయ్యప్ప స్వామి దీక్షతో ఉన్న ఓ భక్తుడి బ్యాక్డ్రాప్లో ఉండే థ్రిల్లింగ్ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్, ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఆర్ఆర్ చేయడం సవాల్గా అనిపించింది’’ అన్నారు జీవీ ప్రకాష్ కుమార్. ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి..’ పాట పాడిన ఒరిజినల్ సింగర్ డప్పు రాంబాబు, ఒరిజినల్ కంపోజర్ సుంకర ఆంజనేయులు, లిరిసిస్ట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ చిత్రసంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటను రీ క్రియేట్ చేశారు. -
హీరోయిన్కు బ్యాడ్ టైమ్.. సినిమా కష్టాలు.. వ్యాపారంలోనూ నష్టాలు!
కెరీర్ ఊపులో ఉన్నప్పుడే కొంతమంది హీరోయిన్లు తెలివిగా వ్యవహరిస్తుంటారు. సినిమాల పైనే ఆధారపడకుండా ప్లాన్-బితో వారికి తెలిసిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అలానే ఓ ప్రముఖ హీరోయిన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఎప్పటికైనా సినిమా అవకాశాలు తగ్గుతాయని ముందే ఊహించిన ఈ హీరోయిన్.. కెరీర్ ఊపందుకున్నప్పుడే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం సౌత్లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు కానీ.. గతంలో సంపాదించిన మొత్తంతో ఇప్పటికీ చాలా ప్రశాంతంగానే ఉందట.అయితే తాజాగా ఆమె పెట్టిన పెట్టుబడుల్లో కొన్ని ఇబ్బందుల్లో పడినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అమెరికా వాణిజ్య విధానాలు, దేశీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులు వంటి కారణాలతో కొన్ని వ్యాపారాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయట. అయితే తనకు బాగా తెలిసిన జిమ్ బిజినెస్ మాత్రం ఆమెకు బాగా కలిసి వచ్చిందని సమాచారం. కానీ ఇతరుల సలహాలతో పెట్టుబడి పెట్టిన కొన్ని వ్యాపారాలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదట. వాటి నుంచి బయటపడలేక, కొనసాగించలేక ఆమె సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తన పెట్టుబడులను రక్షించుకోవడానికి ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉండే వారితో ఆమె ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. నష్టాల నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. -
ట్రైన్లో ఆర్పీఎఫ్ సిబ్బందితో గొడవ.. నటిపై కేసు..!
టీవి నటి అంతరా బెనర్జీ రైలులో చేసిన హంగామా వివాదాస్పందంగా మారింది. అరావళి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సమయంలో సీటు విషయంలో తలెత్తిన వివాదం ఆమె అరెక్టుకు దారితీసింది అని తెలిసింది. ఆర్పీఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా రేజర్ బ్లేడ్తో ఓ కానిస్టేబుల్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షూటింగ్ నిమిత్తం సూరత్కు వెళ్తున్న అంతరా బెనర్జీ స్లీపర్ క్లాస్ టికెట్తో ఏసీ కోచ్లోకి ప్రవేశించారు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడి సీటులో కూర్చోవడంతో వివాదం ప్రారంభమైంది. సీటు ఖాళీ చేయాలని ఆర్పీఎఫ్ అధికారులు కోరినా ఆమె నిరాకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు వెళ్లిన ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యామినీకాంత్ మిశ్రాతో ఆమె వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రేజర్ బ్లేడ్తో ఓ కానిస్టేబుల్పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి రోజు ఆమెను బోరివలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ఎవరీ అంతరా బెనర్జీకోల్కతాలో జన్మించిన అంతరా బెనర్జీ 2012లో టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘గుమ్రాహ్ ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్’, ‘సావధాన్ ఇండియా’, ‘బడో బహు’, ‘లాల్ ఇష్క్’ వంటి సీరియల్లో నటించారు. ‘కసౌటీ జిందగీ కే సీరియల్’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘రాగిణే ఎంఎంఎస్ రిటర్న్-2’ వెబ్ సిరీస్లోనూ నటించారు. -
క్రిష్, చంద్రబోస్ చేతుల ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట రిలీజ్
‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.సినిమా కథాంశానికి అనుగుణంగా ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని పేర్కొంది. పాట విడుదల కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, నిర్మాత మెరుం భాస్కర్, సంగీత దర్శకుడు యేలెంధర్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ హనుమతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘‘మా సినిమా పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి అడుగులోనూ చంద్రబోస్ గారు మాకు అండగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.ఈ చిత్రంలో నటరాజ్, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్ర వారపు, వితిక షేరు, వరుణ్ సందేశ్, కస్తూరి, హారిక, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్రపతి శేఖర్, ఐ డ్రీమ్ అంజలి, సత్య ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్!
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్స్కి వెళ్లి మాత్రమే చూసేవాళ్లు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఓటీటీల ద్వారా నేరుగా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయి..మంచి విజయం సాధిస్తున్నాయి. అలా నేరుగా ఓటీటీలో విడుదలైన ఓ తెలుగు ఆంథాలజీ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై దూసుకెళ్తోంది. అదే ‘డార్క్ సీక్రెట్స్’.అప్సరరాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి ప్రధాన పాత్రలల్లో నటించిన ఈ చిత్రానికి అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. ఇటీవల అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చి..డిజిటల్ తెరపై దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో ఉన్న టాప్ 10 ఇండియన్ సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఈ చిత్రం ఉంది. వివిధ భాషల చిత్రాలతో పోటీ పడుతూ దేశవ్యాప్తంగా ఈ స్థాయికి చేరుకోవడం చిత్ర బృందానికి ప్రత్యేకమైన విజయంగా చెప్పవచ్చు. చిన్న చిత్రాలకు కూడా ఓటీటీ వేదికలు ఎంతటి అవకాశాలు కల్పిస్తున్నాయో ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి నిరూపిస్తోంది.‘డార్క్ సీక్రెట్స్’ కథ విషయానికొస్తే.. మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే చిత్రమిది. ఇదొక ఆంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి. ప్రతి కథలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఒక రహస్యం, ఆ రహస్యం బయటపడినప్పుడు జరిగే పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. -
పాన్మసాలా ప్రచారాలు ఆపాలంటూ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్మసాలా ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్’ పాన్మసాలా ప్రకటనలకు సంబంధించిన ప్రచార కంటెంట్ను 15రోజుల్లో తొలగించాలని వీరికి ఆదేశించింది.ఈ నోటీసులు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాయ్ జారీ చేశారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆదేశాలను పాటించకపోతే 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఏ హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల ప్రచారంపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ నోటీసులు పంపించినట్లు పేర్కొంది.కాగా నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలను ఇప్పటికీ సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్నాయి. పాన్మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో ప్రముఖుల భాగస్వామ్యంపై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రముఖ బెంగాలీ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్(71) కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గతంలో ఆసుపత్రిలో చేరారు. ఆయన మరణవార్త విని బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెన్ను భాగంలో గాయపడటంతో తొలిత ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయన్ని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి దిగజారడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.1996లో సినీ ప్రయాణం: 1996లో విడుదలైన ‘దాము’ చిత్రంతో రాజా సేన్ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓ బాలుడు, ఏనుగు మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ఆత్మీయ స్వజన్’, ‘దేశ్’, ‘దేబీపక్ష’, ‘కృష్ణకాంతేర్ విల్’, ‘లాబొరేటరీ’, ‘మాయా మృదంగ’, వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన ‘దేశ్’ చిత్రంలో జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు డ్యాక్యుమెంటరీల రూపకల్పనలోనూ రాజాసేన్ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ రవీంద్ర సంగీత గాయని సుచిత్రా మిత్రతో పాటు పలువురు ప్రముఖుల జీవితాలపై ఆయన డాక్యుమెంటరీలు రూపొందించారు. -
‘ఆస్మాన్’ ఫస్ట్లుక్ రిలీజ్.. సింహాన్ని చూసినట్లు అనిపిస్తోంది: శాంతి శ్రీహరి
మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆస్మాన్’. రాయంచ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో ఈ సినిమాను వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 15) నటుడు శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ‘ఆస్మాన్’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి సతీమణి, నటి శాంతి శ్రీహరి మాట్లాడుతూ– ‘‘పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా మేఘాంశ్ వర్క్ చేస్తున్నాడు. శ్రీహరిగారు కూడా అలానే నటించేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి. ఈ సినిమాతో మేఘాంశ్కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ మేఘాంశ్ని చిన్నపిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్ చూసిన తర్వాత సింహాన్ని చూసినట్లు అనిపించింది’’ అన్నారు. ‘‘సెట్లో ఎప్పుడూ ఓ పండగ వాతావరణం కనిపించేది’’ అన్నారు మేఘాంశ్ శ్రీహరి. ‘‘ఆస్మాన్’ సినిమా ఆడియన్స్ను ఆశ్చర్యపరుస్తుంది’’ అని చెప్పారు రామ్ నందన్. ‘‘రియల్స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా సెట్స్లో మేం అందరం ఆశ్చర్యపోయేలా యాక్ట్ చేస్తున్నాడు మేఘాంశ్’’ అని చెప్పారు వెంకటేష్ కొండారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి, కెమెరామేన్ షోయబ్, నటుడు రవివర్మ మాట్లాడారు. నాన్నలాగే నన్నూ ఆశీర్వదించండి: మేఘాంశ్ శ్రీహరిస్వర్గీయ నటుడు శ్రీహరి జయంతి(ఆగస్ట్ 15) వేడుకలను ప్రతీ ఏడాదిలాగానే బాచుపల్లిలోని మండపం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి సతీమణి శాంతి శ్రీహరి, హీరో మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ ‘ఈరోజు నాన్నగారి 62వ బర్త్ డే. ఆయన జయంతిని నిర్వహించాం. నాన్నగారి జయంతి సందర్భంగా నేను నటించిన ఆస్మాన్ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నాన్నగారికి అందరూ ఆశీర్వదించినట్లే నన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.‘శ్రీహరి ఈరోజు మన మధ్య లేకపోయినా ఎప్పటికీ మన హృదయంలోనే ఉంటాడు’అని శాంతి శ్రీహరి అన్నారు. -
అవసరమైతే కండోమ్ యాడ్ కూడా చేస్తా : యష్
కన్నడ స్టార్ హీరో యష్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కనిపించిన బోల్డ్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఈ పాటను ఏకంగా కండోమ్ ప్రకటనతో పోల్చుతూ ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై యష్ స్పందించారు.ఓ టీవీ షోలో పాల్గొన్న యష్కు ‘తబాహీ’ పాటపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ‘అవసరమైతే కండోమ్ ప్రకటన కూడా చేస్తాను. కానీ అందుకు డబ్బులు తీసుకుని చేస్తాను. అలా ఉచితంగా చేయను’ అని యష్ వ్యాఖ్యానించారు. ఆయన సమాధానంతో కార్యక్రమంలో ఉన్న ప్రేక్షకులంతా గట్టిగా నవ్వారు. విమర్శలను సీరియస్గా తీసుకోకుండా హాస్యభరితంగా స్పందించడం ద్వారా యష్ ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చారు.ఇక టాక్సిక్ చిత్రంలోని బోల్డ్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సాధారణంగా అందరికీ ఉద్దేశించిన కథ కాదని, పెద్దలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫెయిరీ టేల్ అని ఆయన స్పష్టం చేశారు. ‘పిల్లలు ఇంట్లో ఉండాలి. ఈ చిత్రాన్ని చూడకూడదు’ అని ఆయన అన్నారు. దీంతో సినిమాలోని కంటెంట్ ఏ వర్గం ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే దానిపై మరింత స్పష్టత వచ్చింది.గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
అదృష్టం అంటే ఈ హీరోయిన్నే..పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్
ప్రస్తుతం కోలీవుడ్లో నటి మమిత బైజు టైమ్ నడుస్తుందనే చెప్పవచ్చు. వరుస విజయాలతో ఈ మాలీవుడ్ చిన్నది దూసుకుపోతోంది. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన డిగ్రీ కూడా పూర్తి చేయని మమిత బైజు ఇప్పుడు మలయాళం, తమిళం , తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా దూసుకుపోతోంది.బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదట్లో బాలనటిగా కొన్ని చిత్రాలు నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే 2024 ఈ అమ్మడికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఆ ఏడాదిలో మలయాళం లో కథానాయకిగా నటించిన ప్రేమలు చిత్రం మమిత బైజు జీవితాన్నే మార్చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయం తో మలయాళం లోనే కాకుండా తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమంలోనూ ఈమె పేరు మారుమ్రోగింది. ఇకపోతే అదే సంవత్సరంలో మమిత బైజు రెబల్ అని చిత్రంతో కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మమిత బైజు కు మాత్రం ఇక్కడ మంచి సక్సెస్ఫుల్ బాటను అమర్చింది.నటుడు ధనుష్ ,విజయ్ ,ప్రదీప్ రంగనాథన్ ,సూర్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను పొందింది. తాజాగా జంటగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రంలో మమిత బైజు నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ప్రతిభకు లక్కు తోడైతే అది మమిత బైజు లా ఉంటుంది అని కూడా అంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ఆయా పాత్రలో లీనమై నటించడం వల్లే ఈమె వరసగా సక్సెస్ అందుకుంటుందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తమిళం మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ పాతికేళ్ల పరువాల భామ తమిళంలో నటుడు కార్తీకి జంటగా నటిస్తున్న చిత్రం నిర్మాణ దశలో ఉంది. -
సూర్యతో సినిమా.. రిక్వెస్ట్ కాదు డిమాండ్: త్రివిక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లాక్ అయిందంటూ అప్పట్లో చాలా స్టోరీలు వచ్చాయి. నిజానికి అవి రూమర్స్ కావు. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి గతంలో ప్రయత్నించారు. అయితే కథ విషయంలో ఇద్దరికీ సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. శనివారం నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్మీట్కి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, యూనిట్కి అభినందనలు తెలిపారు.త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేను సూర్యతో ఇప్పటికే ఓ సినిమా చేయాలి. కానీ సూర్యకు నచ్చే కథను నేను చెప్పలేకపోయాను. అయితే త్వరలోనే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని నిండుసభలో ప్రకటించారు. నా భార్య సూర్యకు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో తను నన్ను కోరుతున్నారు. “అది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, సూర్యను కలిసేందుకు తన భార్య ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ షూటింగ్కి వెళ్లి, ఆయనతో ఫొటో కూడా దిగినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.అందరూ ఒక్కటై సక్సెస్ చేశారు – సూర్య‘‘వెంకీ అట్లూరిగారు తెలుగు. నేను తమిళ్, రవీనా టాండన్ మేడం మహారాష్ట్ర, మమిత బైజు కేరళ... ఇలా వేర్వేరు ప్రాంతాలవాళ్లం కలిసి చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాని మీరందరూ (ప్రేక్షకులు) ఒక్కటై అద్భుతంగా ఆదరించారు. మాకు సక్సెస్, గౌరవాన్ని, ప్రేమను ఇవ్వడంతో పాటు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు మరిన్ని తీసే ప్రోత్సాహం అందించినందుకు థ్యాంక్స్’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా నటించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మమిత బైజు హీరోయిన్గా నటించిన ఈ మూవీలో రాధిక శరత్కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న (శుక్రవారం) విడుదలైంది. సూర్య మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాలను వసూళ్లతో కొలవలేం. ప్రేక్షకులు పొందిన అనుభూతిలోనే ఈ సినిమా అసలు విజయం దాగుంది. ఇలాంటి మంచి సినిమా ఇచ్చిన వెంకీ అట్లూరికి ధన్యవాదాలు. మా మూవీకి శుక్రవారంతో పోల్చితే శనివారానికి వసూళ్లు డబుల్ అయ్యాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ రాసినప్పుడు యాక్షన్, డార్క్ హ్యూమర్, ఘోస్ట్, దైవం నేపథ్యంలోని మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఒక కుటుంబ కథా చిత్రంతో వస్తామన్నప్పుడు నిర్మాతలు కొంచెం నిరుత్సాహపరుస్తారు. కానీ, వంశీగారు ప్రోత్సహించారు’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. ‘‘ఈ మూవీ ఊటీ షెడ్యూల్లో సూర్యతో పాటు నేనూ ఉన్నాను. ముంబైలోని నా ఫ్రెండ్స్ ఊటీకి వచ్చారు. అయితే వారు వచ్చింది నా కోసం కాదు... సూర్య కోసం (నవ్వుతూ)’’ అన్నారు రవీనా టాండన్. కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్తోనే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. అలానే రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. -
ఫ్యామిలీ పోషణ కోసం చీర, జాకెట్ కట్టుకున్నా: నటుడు
‘జబర్దస్త్’ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడ శాంతి స్వరూప్. తెరపై ఎప్పుడు లేడీ గెటప్లో కనిపిస్తూ..తనదైన కామెడీతో నవ్విస్తుంటాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అయితే చాలా మంది ఆర్టిస్టుల్లాగే శాంతి స్వరూప్ కూడా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. తాజాగా ఓ న్యూస్ చానల్ నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న శాంతి స్వరూప్.. తన పర్సనల్ లైఫ్తో పాటు సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.తాగి కక్కింది ఊడ్చేవాడినిప్రతి రోజు రాత్రి పడుకునే ముందు నేను అనుభవించిన కష్టాలన్నీ గుర్తు చేసుకుంటా. తినడానికి తిండి లేక గుడిలోకి వెళ్లి ప్రసాదాలు తినేవాడిని. ఏ ఏ చర్చిలోకి వెళ్లి అన్నం తిన్నానో గుర్తు చేసుకుంటా. రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రూంలో ఉండేవాడిని. వాళ్లు తాగి కక్కితే ఊడ్చి ఎత్తేవాడిని. నాన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవు..2007లో మా నాన్న చనిపోయాడు. అప్పుడు నేను అసిస్టెంట్గా చేస్తున్నా. తినడానికి ఏమి లేదు. అంత్యక్రియలు చేయడానికి రూ. 2000 కావాలి. నా దగ్గరు రూపాయి లేదు. మా ఐదు మంది అన్నదమ్ములు తలా ఇన్ని పైసలు వేసుకుంటున్నాను. నేను మా సార్కి ఫోన్ చేసి డబ్బులు అడుక్కొని అంత్యక్రియలు పూర్తి చేశా. నేను ఇప్పుడు ఉన్నట్లుగా ఉండి ఉంటే.. మా నాన్న ఇంకా బతికేవాడు’ అంటూ శాంతి స్వరూప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఫ్యామిలీ పోషించుకోవడం కోసం చీర, జాకెట్ కట్టుకున్నానేను రూమ్ రెంట్ కోసం వెళ్తే చాలా మంది ‘వద్దండి..లేడీ గెటప్స్’ఇవ్వలేం అంటారు. మేము కేవలం లేడీ గెటప్ మాత్రమే వేస్తున్నాం. ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో తెలియనప్పుడు నేను ఈ చీర, జాకెట్ కట్టుకొని పైన విగ్గు పెట్టుకొని ఇలా ఉండబట్టే.. నా ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నా. నేనేం తప్పు చేయట్లేదే? చిల్లరపనులేవి చేయట్లేదు.పెళ్లి చేసుకోను..ఇదే ఇంటర్వ్యూలో ‘నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?’ అని హోస్ట్ అడగ్గా.. ‘ఎవరినీ పెళ్లి చేసుకోను. నా లైఫ్ ఇలా ఉంది. లేడీ గెటప్లు వేసుకునేవాడివి అని వేరేలాగా అంటే వచ్చే వాళ్లకు బాధ అవుతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లు రారు. కాళ్లు చేతులు బాగున్నంతవరకు కష్టపడతాను. ఒంట్లో బాగలేకపోయినా చూసేవాళ్లు ఎవరూ లేరు. నేనే క్యాబ్ బుక్ చేసుకొని ఆస్పత్రికి వెళ్లి వస్తాను. నాది ఒక దుర్భరమైన జీవితం. కాళ్లు చేతులు బాగున్నప్పడే, నిద్రలోనే చనిపోతే బాగుంటుందని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ శాంతి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అమ్మాయిలు చెడిపోయారుఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘అమ్మాయి కానీ, అబ్బాయిలు ఏదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. కొంతమంది అమ్మాయి అయితే ఫోన్ చేసి..‘నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్.. వచ్చేస్తా’ అని అగుతున్నారు. మీకు ఇబ్బంది అవుతుందని చెబితే.. ‘పర్వాలేదండి.. కమిట్మెంట్ ఇవ్వడానికైనా రెడీ’ వాళ్లే అంటున్నారు. డైరెక్టర్లు కూడా ‘నేను మీకు ఇస్తాను..నువ్వు నాకేమి ఇస్తావు’ అని అడుగుతున్నారు. అమ్మాయిలు పూర్తిగా చెడిపోతున్నారు. శని, ఆదివారం వస్తే.. హైదరాబాద్లోని ప్రతి పార్కు.. లవర్స్తో నిండిపోతుంది. పెళ్లి తర్వాత జరగాల్సిన పనులన్నీ పెళ్లికి ముందే అయిపోతున్నాయి’ అంటూ శాంతి అసహనం వ్యక్తం చేశాడు. -
‘ముంబైలో కంటే గోవాలోనే ప్రశాంతత దొరుకుతుంది’
నటిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా తన ప్రయాణిన్ని కొనసాగిస్తున్న పరుల్ గులాటి ఓ ఇంటర్య్వూలో ఆసక్తి కరమైన విషయాలను పంచుకుంది. ‘ గోవా అంటే నాకు ఎంతో ఇష్టం. ముంబైలో కంటే గోవాలోనే ప్రశాంతత దొరుకుతుంది. ఆలోచించడానికి, కొత్త విషయాలను సృష్టించడానికి , జీవితాన్ని ఆస్వాదించడానికి గోవా అవకాశం కల్పిస్తుంది. ముంబైలో ఎంజాయ్ చేయడం ఇష్టం కానీ విశ్రాంతి పొందాలంటే గోవానే సరైన ప్రదేశం’ అని తెలిపింది.నటన కోసం మాట్లాడుతూ.. ‘ సవాళ్లతో కూడిన పాత్రలు చేయాలని ఉంది. ప్రముఖ కవయిత్రి అమృతా ప్రీతమ్కు సంబంధించిన పాత్రలు ఏవైనా ఉంటే నటించాలని ఉంది. ఆమె కవిత్వాలు చిన్నప్పుడు నుంచి చదువుతూ పెరిగాను’ అని వెల్లడించింది. సోషల్ మీడియాలో తనను మాల్కిన్ అని పిలుస్తారని చెప్పిన పారుల్.. ఫాలోవర్లు అవకాశాలు తీసుకురావచ్చేమో కానీ దీర్ఘకాలం కెరీర్లో నిలబెట్టిదే మాత్రం ప్రతిభేనని స్పష్టం చేసింది. వ్యాపార రంగంలోకి రావడం వల్ల జీవితంలోని ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పారుల్ తెలిపింది. -
చాలా అమెచ్యూరీష్గా ఉంది బాసూ!
సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య జరిగే వార్ కొత్త విషయం కాదు. తమ అభిమాన హీరో గొప్పంటే.. తమ హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు సెటైర్లు, మీమ్స్, ట్రోల్స్తో విరుచుకుపడుతుంటారు. అయితే ఈ పోరు హద్దులు దాటినప్పుడు అది కేవలం అభిమానుల మధ్య గొడవగా మిగలకుండా.. హీరోల ఇమేజ్, వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపించే స్థాయికి చేరుతోంది. తాజాగా ఓ సీనియర్ హీరోను టార్గెట్ చేస్తూ వచ్చిన మీమ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది.తాజాగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఒకే మీమ్ టెంప్లెట్తో హడావిడి నడిచింది. సదరు సీనియర్ హీరోను ట్రోల్ చేసేలా నడిచిందా వ్యవహారం. అయితే దీనిపై వాయు వేగంతో స్పందించిన ఆయన టీం.. ఆ పోస్టులను డిలీట్ చేయిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజీలకు నోటీసులు పంపించారు. మరికొన్ని పేజీలను ఏకంగా సస్పెండ్ చేయించారు. దీంతో ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.‘‘ఎంత అధికారం అండ ఉన్నంత మాత్రాన.. ఇలా కట్టడి చేయడమేంటి?’’ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీమ్స్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని, ఇది చాలా అమెచ్యూరిష్ నిర్ణయమంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే స్థాయికి వెళ్లినప్పుడు చర్యలు తప్పవని సమర్థిస్తున్నారు.సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల్లో ఈ పోటీ ‘కులం కార్డు’ తెచ్చి మరీ ఒక్కోసారి తీవ్ర స్థాయికి చేరుతుంది. హీరోలపై ప్రశంసలు, విమర్శలు సాధారణమే అయినా.. కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు వివాదాలకు కారణమవుతున్నాయి.ఇటీవల ఓ దిగ్గజ నటుడిని లక్ష్యంగా చేసుకుని వరుసగా మీమ్స్ రావడం చర్చనీయాంశమైంది. ఒక దశలో అది కేవలం సరదా ట్రోలింగ్ కాకుండా.. ఓ సినిమా కోసం ప్రణాళికాబద్ధమైన ప్రచారంలా మారిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే అదే వ్యవహారం తిరిగి విమర్శలు చేసిన వారిపైనే ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే సదరు హీరోను టార్గెట్ చేసిన మీమ్స్పై ఆయన టీం స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శకు ఇలాంటి చర్యలే పరిష్కారమా? అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు.‘‘అవతలివారిపై రాళ్లు వేశాక.. తిరిగి మనపై పడుతున్నప్పుడు ‘విక్టిమ్ కార్డ్’ ప్లే చేయడం సరికాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ ఆ హీరోకు, ఆ కాంపౌండ్లోని హీరోలకు, వాళ్లను డిఫెండ్ చేస్తున్న అభిమానులకు కొందరు హితవు పలుకుతున్నారు. అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ.. అది వ్యక్తిగత దూషణలు, కక్షల స్థాయికి చేరకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మీమ్స్, ట్రోల్స్ యుగంలో సెలబ్రిటీలను విమర్శించడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజమే అయినా.. పరిమితులు దాటినప్పుడు వచ్చే పరిణామాలపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.


