breaking news
Cinema News
-
Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్.. వీళ్లు కన్ఫార్మ్!
ఊహకందని మార్పులు..ఊహించని మలుపులు. డబుల్ హౌస్తో డబుల్ జోష్తో మీ ముందుకు వచ్చేసింది బిగ్బాస్ నైన్ అంటూ బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో.. తొమ్మిదో సీజన్ నేడు(సెప్టెంబర్ 7) గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించారు. వారు ఎవరనేది గుర్తుపట్టకుండా ప్రోమోని కట్ చేశారు. అయితే తొలి రోజే ఓ కంటెస్టెంట్కి షాకిచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.ఓ కంటెస్టెంట్ హౌస్లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రెండు హౌస్ల ఉండబోతున్నాయి. టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లబోతున్నారట. వారిలో 9 మంది డైరెక్ట్గా హౌస్లోకి వెళ్లగా, మిగతా 5 మంది అగ్ని పరీక్షలో గెలిచిన వాళ్లు వెళ్తారు. సెలెబ్రిటీ లిస్ట్లో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, తనూజ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. కామనర్స్గా కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వెళ్లే అవకాశం ఉంది. -
SIIMA 2025: ఉత్తమ నటి సాయి పల్లవి.. కోలీవుడ్, మాలీవుడ్ విజేతలు వీళ్లే!
దుబాయ్ వేదికగా ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు. కోలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా అమరన్, మలయాళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ ఎన్నికయ్యాయి. ఇక తమిళ్లో ఉత్తమ నటి అవార్డ్ను అమరన్కు గాను సాయి పల్లవికి లభించింది. ఉత్తమ నటుడిగా ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ (ది గోట్ లైఫ్) నిలిచాడు. తమిళంలో అమరన్, మహారాజా, లబ్బర్ పండు చిత్రాలకు, మలయాళంలో ది గోట్ లైఫ్ చిత్రానికి అత్యధిక అవార్డులు వచ్చాయి. ‘సైమా’ విజేతలు (కోలీవుడ్)ఉత్తమ చిత్రం : అమరన్ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి(అమరన్)ఉత్తమ నటి : సాయి పల్లవి(అమరన్)ఉత్తమ విలన్ : అనురాగ్ కశ్యప్(మహారాజా)ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాశ్ (అమరన్)ఉత్తమ కమెడియన్ : బల శరవణన్(లబ్బర్ పందు)ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : కార్తి (మెయ్యజగన్)ఉత్తమ నటి(క్రిటిక్స్): దుషారా విజయన్ (రాయన్)ఉత్తమ దర్శకుడు(క్రిటిక్స్): నిథిలన్ సామినాథన్(మహారాజ)ఉత్తమ నూతన దర్శకుడు: తమిళరాసన్(లబ్బర్ పందు)‘సైమా’ విజేతలు (మాలీవుడ్)ఉత్తమ చిత్రం : మంజుమ్మల్ బాయ్స్’ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ది గోట్ లైఫ్)ఉత్తమ నటి : ఊర్వశి(ఉళ్లోళుక్కు)ఉత్తమ విలన్ : జగదీష్(మార్కో)ఉత్తమ సంగీత దర్శకుడు : దిబు నినన్ థామస్(ఏఆర్ఎం)ఉత్తమ కమెడియన్ : శ్యామ్ మోహన్(ప్రేమలు)ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : ఉన్ని ముకుందన్(మార్కో)ఉత్తమ నూతన దర్శకుడు: జోబూ జార్జ్(పని)ఉత్తమ నూతన నటుడు(క్రిటిక్స్) : కేఆర్ గోకుల్(ది గోట్ లైఫ్) -
Mirai: విడుదలకు ముందే రూ.20 కోట్ల లాభం!
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు.అందుకే థియేటర్స్లో ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం లేదు. ఒకవేళ జరిగిన లాభాలు లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా రిలీజ్కి ముందే రూ. 20 కోట్ల లాభాలను సంపాదించింది. అదే ‘మిరాయ్’.ట్రైలర్తోనే...హనుమాన్తో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన తేజ సజ్జా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. విలన్గా మంచు విష్ణు, హీరో తల్లిగా శ్రియ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు భారీ స్పందన లభించింది. మూవీ విజువల్ వండర్లా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. వీఎఫెక్స్ అదిరిపోయింది. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలే వీఎఫెక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్లు ట్రైలర్తోనే తెలిసిపోతుంది. ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే..?సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే రిలీజ్కు ముందే ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయి. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 45 కోట్ల ఆదాయం వచ్చిందట. రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం లేదు. పెట్టిన ఖర్చును కూడా వెనక్కి తెచ్చుకోలేపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తేజ సజ్జా లాంటి కుర్ర హీరో సినిమా రిలీజ్కు ముందే లాభాలు తెచ్చిపెట్టడం టాలీవుడ్కి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. -
థియేటర్స్లో రూ.2000 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్!
హారర్ సినిమాకు థియేటర్స్లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను కాస్త భయపెట్టాలే కానీ.. ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే అన్నిభాషల్లోనూ ఈ జానర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత హాలీవుడ్లో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ వచ్చింది. అదే వెపన్స్. . జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి స్టార్స్ నటించారు. ఆగస్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం..తొలి రోజే బ్లాక్బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 23.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ చిత్రం.. సడెన్గా ఓటీటీలోకి వచ్చి సర్ప్రైజ్ చేసింది.ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 9 నుంచి నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు వీల్లేదు. ఓటీటీలో చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. థియేటర్స్లోకి వెళ్లి చూసేంత సమయం లేని హారర్ ప్రియుల కోసం రెంట్ విధానంలో ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. థియేటర్స్లో బాగా ఆడుతున్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఓటీటీలోనూ అదే స్థాయి కలెక్షన్స్ రాబటితే ఇబ్బంది లేదు..కానీ ఏమాత్రం తేడా జరిగినా..అది మేకర్స్ స్వయంకృత అపరాధమే అవుతుంది. వెపన్స్ కథేంటంటే.. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్. ఒక రోజు తెల్లవారుజామున 2:17 గంటలకు ఒకే క్లాస్కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వారంతా కనిపించకుండా పోతారు. వాళ్లు ఎలా వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అనేది తెలుసుకోవడమే ఈ సినిమా కథ. రూ. 335 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. -
OTT: రొమాన్స్ కాదు.. బ్రొమాన్స్.. ఎలా ఉందంటే..?
టైటిల్ : బ్రొమాన్స్నటీనటులు: మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ తదితరులుదర్శకత్వం: అర్జున్ డి. జోస్ఓటీటీ: సోనీ లివ్ఓటీటీలు వచ్చాక ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించడం మరింత సులభతరం అయిపోయింది. ఏ కొత్త సినిమా వచ్చినా నెల రోజుల్లోపే ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నారు. ఓటీటీలు రావడంతో కంటెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కంటెంట్ బాగుంటే ఏ మూవీనైనా ఆడియన్స్ వదలడం లేదు. ఏ భాషలో వచ్చినా కథ బాగుంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇక మలయాళ సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. క్రైమ్, కామెడీ జోనర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అలాంటి జోనర్లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్కు వచ్చేసిన మలయాళ సినిమా బ్రొమాన్స్. టైటిల్తోనే ఆసక్తి పెంచేసిన బ్రొమాన్స్.. సినిమా ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..షింటో (శ్యామ్ మోహన్), బింటో (మాథ్యూ థామస్) ఇద్దరు అన్నదమ్ములు. అమ్మా, నాన్నతో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ప్రతి విషయంలో అన్నతో తమ్ముడు బింటోను పోలుస్తూ ఉంటారు. ఇది నచ్చని బింటో అన్న అంటే అంతగా ఇష్టముండదు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. బింటో ఎప్పుడు రీల్స్ పిచ్చిలో పడి లైఫ్ను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఊహించని విధంగా బింటో అన్న షింటో మిస్సింగ్ అవుతాడు. ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం లేని అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు? చివరికీ అన్న షింటోను కనిపెట్టాడా? లేదా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..సాధారణంగా అన్నదమ్ముల స్టోరీ అనగానే సగటు ఆడియన్స్ ఎమోషనల్ డ్రామా అనుకుంటే పొరపాటే. కథ ప్రారంభంలో ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ముల అనుబంధం చూడగానే ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే.. ఎమోషనల్ టచ్ ఇచ్చి.. కామెడీ పండించాడు. ఒకవైపు అన్న అంటే పడని తమ్ముడు.. అతను మిస్సింగ్ అయ్యాడని తెలిశాక జరిగే పరిణామాలు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఆ తర్వాత అన్న కోసం ఆరా తీసే క్రమంలో షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) బింటోకు సాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ డాక్టర్ ఐశ్వర్య, ఎస్సై టోనీ నుంచి ఊహించని ట్విస్ట్లు ఎదురవుతాయి. ఈ సన్నివేశాలు సీరియస్గా అనిపించినా.. ప్రతి సీన్లో కామెడీ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.అన్నదమ్ముల సెంటిమెంట్ అనే లైన్ తీసుకున్న డైరెక్టర్.. కథను పూర్తిగా కామెడీ యాంగిల్లోనే తీసుకెళ్లాడు. అన్న కోసం వెతుకుతున్న బింటో.. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ సాయం తీసుకుంటాడు వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను తెగ నవ్విస్తాయి. అలా బింటో అన్న కోసం వెతుకున్న టీమ్లో కీలక మెంబర్ పాత్ర పోషిస్తాడు. తన అన్నను ఏమైనా అంటే విపరీతమైన కోపంతో ఊగిపోయే బింటోకు కొరియర్ బాబు రూపంలో గట్టి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఎస్సై ఎంట్రీ ఇవ్వడంతో కథ కామెడీతో పాటు ఆసక్తికరంగా మారుతుంది. కేరళలో మొదలైన కథ.. కర్ణాటకకు షిప్ట్ అయ్యాక కథలో వచ్చే సీన్స్ ఆడియన్స్లో నవ్వులు పూయిస్తాయి. ప్రతి సీన్లో కామెడీని ఇరికించే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్కు ముడిపెట్టి ఫుల్ కామెడీ వైపు నడిపించిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కేవలం కామెడీపైనే దృష్టి పెట్టడంతో సగటు ప్రేక్షకుడికి కథతో ఎమోషనల్ టచ్ మిస్సయింది. ఆ విషయంలో డి జోస్ మరింత ఫోకస్ చేయాల్సింది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే అక్కడ కూడా సీరియస్నెస్ ఉన్నప్పటికీ.. ఫైట్ సీన్ ఆద్యంతం నవ్వులు తెప్పించాడు. క్లైమాక్స్లో ఎమోషనల్ టచ్ ఇచ్చినా.. అంతగా ఆడియన్స్కు కనెక్ట్ చేయడంలో భావోద్వేగాలు పండించలేకపోయాడు. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. నవ్విస్తూనే ఎండ్ కార్డ్ పడేశాడు. ఓవరాల్గా చూస్తే సీరియస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్లో ఫుల్గా నవ్వుకోవాలంటే..ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు లేనందున ఫ్యామిలీతో చూసేయొచ్చు.ఎవరెలా చేశారంటే...ప్రేమలు మూవీతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైన మాథ్యు థామస్ తన పాత్రలో మెప్పించాడు. షింటోగా శ్యామ్ మోహన్ తన పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్గా సంగీత్ ప్రతాప్ పాత్ర కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శ్యామ్ మోహన్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. గోవింద్ వసంత నేపథ్య సంగీతం బాగుంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. చామన్ చాకో కొన్ని అనవసర సీన్స్ను కట్ చేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా ఫర్వాలేదపించారు. -
ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది : నిర్మాత
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన హారర్ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాహు గారపాటి మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా ‘కిష్కింధపురి’ చిత్రం మాత్రం వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్, దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్, రేడియోతో దెయ్యానికి ఉన్న కనెక్షన్ ఇవన్నీ మా సినిమాలో కొత్తగా ఉంటాయి. ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదు. కొన్ని షాకింగ్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్గారి ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమా కథ అనుకున్నప్పుడే అనుపమను హీరోయిన్గా అనుకున్నాం. అనుపమ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నెల రోజులు కష్టపడి, దాదాపు రూ. 2 కోట్లతో ఓ రేడియో స్టేషన్ సెట్ వేశాం. సినిమాలోని కీలక సన్నివేశాలు ఇక్కడే జరుగుతాయి. తొలి భాగం వినోదాత్మకంగా, సెకండాఫ్లో సీరియస్ హారర్ ఫిల్మ్గా టర్న్ అవుతుంది. ‘కిష్కింధపురి’ అనే ఊర్లో జరిగే కథ కనుక ‘కిష్కింధపురి’ అని టైటిల్ పెట్టడం జరిగింది. మా సినిమా థియేటర్స్లో ఆడియన్స్ను తప్పక ఎంగేజ్ చేస్తుంది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాన్– థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఓటీటీ డీల్స్ కుదరని కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి. సినిమాల రిలీజ్ డేట్స్ ప్రభావితం అవుతున్నాయి. చూస్తుంటే ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయినట్లుంది. ఇక సినీ కార్మికుల సమ్మె ప్రభావం మా బ్యానర్లో (ఈ సినిమాకు సుస్మితా కొణిదెల మరో నిర్మాత) నిర్మిస్తున్న చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తాం. కాకపోతే అక్టోబరులో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాం. కానీ నవంబరు కల్లా పూర్తి చేస్తాం. ఓ పదిహేను రోజులు తేడా అంతే’’ అని అన్నారు. -
‘ప్రొద్దుటూరు దసరా’ ఎంగేజింగ్గా ఉంది: దర్శకుడు కరుణ కుమార్
‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్గా, అద్భుతంగా అనిపించింది’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం..ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొడుతూ. ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తెరకెక్కించారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్, పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐని వాడుకుని గొప్పగా చూపించారు. ఇంటర్నేషనల్ వైడ్గా డాక్యుమెంటరీలను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శిస్తుంటారు. డాక్యుమెంటరీ అనేది దృశ్యరూపంలో ఉండే చరిత్ర. ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తాను. యశ్వంత్ మ్యూజిక్, నిఖిల్ కెమెరా వర్క్ గొప్పగా వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. -
శ్రీదేవికి తక్కువ పారితోషికం.. నిర్మాతలే రాజమౌళికి ఎక్కించి చెప్పారు!
బాహుబలి సినిమా (Bahubali Movie)తోనే పాన్ ఇండియా ట్రెండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ను ఏలాయి. దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తరణకు బాహుబలి తోడ్పడింది. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమాలో దివంగత హీరోయిన్ శ్రీదేవి (Sridevi) నటించాల్సిందట!ఇప్పటికీ నా దగ్గరే..శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని అనుకున్నారు. మరి అదెందుకు కార్యరూపం దాల్చలేదన్నదానిపై శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) స్పందించాడు. బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవి అభిమానిని అని రాజమౌళి పంపిన మెసేజ్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సినిమా కోసం ఆమె చెప్పిన సూచనలు విన్నాక ఆయనకు శ్రీదేవిపై గౌరవం రెట్టింపైంది. కానీ, నిర్మాతల వల్ల ఆ సినిమా తను చేయలేకపోయింది.చాలా తక్కువ పారితోషికంరాజమౌళి మా ఇంటికి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన గది నుంచి బయటకు వెళ్లగానే నిర్మాతలు ఎంటరయ్యేవారు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకు శ్రీదేవి తీసుకున్నదానికంటే కూడా తక్కువే ఇస్తామన్నారు. ఆమె చిన్న నటి కాదు కదా! తనవల్ల సినిమాకు కూడా ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. తమిళం, హిందీలోనూ కొంత పాపులారిటీ వస్తుంది. అలాంటప్పుడు నా భార్యను ఒక మెట్టు దిగి సినిమా చేయమని నేనెందుకు చెప్తాను?రివర్స్లో చెప్పారుకానీ నిర్మాతలు మాత్రం రాజమౌళికి అంతా రివర్స్లో చెప్పారు. హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం తనే కావాలంటోందని చాడీలు చెప్పారు. మేము అడిగిందొక్కటే.. మా పిల్లలకు హాలీడేస్ ఉన్నప్పుడు పెద్ద షెడ్యూల్ పెట్టుకోమన్నాము. అంతకుమించి పెద్ద డిమాండ్లేమీ చేయలేదు. కానీ నిర్మాతలు రాజమౌళికి వేరేవిధంగా ఎక్కించారు. నిర్మాత శోభు యార్లగడ్డకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఇలాంటి పుకార్లు సృష్టించాడు. తను ప్రొఫెషనల్గా ఉండదని కామెంట్ చేశాడు. రూ.10 కోట్ల డిమాండ్?అదే నిజమైతే రాకేశ్ రోషన్, యష్ చోప్రా, రాఘవేందర రావు.. వీళ్లందరూ తనతో ఎలా పని చేశారు? ఆమెను అన్ప్రొఫెషనల్ అని ఎలా అంటారు? అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా బాహుబలి రిలీజైన సమయంలో శ్రీదేవి డిమాండ్లపై పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకుగాను రూ.10 కోట్లు, 10 ఫ్లైట్ టికెట్స్, హోటల్లో ఓ అంతస్తు మొత్తం తనకే కావాలని శ్రీదేవి డిమాండ్ చేసిందని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ కామెంట్స్ విని బాధపడ్డ శ్రీదేవి.. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. 300కి పైగా సినిమాలు చేశాను. అలాంటి డిమాండ్లు చేసే ఈ స్థాయికి చేరాననుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండేదాన్నా? నా గురించి అలా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. నిర్మాతలే రాజమౌళికి ఇలా నాగురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు! కానీ, ఇలా పబ్లిక్గా మాట్లాడకపోయుంటే బాగుండేది అని విచారం వ్యక్తం చేసింది. దీంతో రాజమౌళి సైతం పబ్లిక్గా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడ్డాడు. కాగా శ్రీదేవి 2018లో మరణించింది. బాహుబలి విషయానికి వస్తే మొదటి భాగం 2015లో రెండో భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.చదవండి: నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ -
ఓటీటీలో వెబ్ సిరీస్లదే హవా.. ఏ భాషలో ఎక్కువ చూస్తున్నారంటే..?
భారత్లో ఓవర్ ద టాప్ (ఓటీటీ) వేదికలు వైవిధ్యమైన కంటెంట్తో వీక్షకుల మది దోచుకుంటున్నాయి. ప్రధానంగా వెబ్ సిరీస్లకు జనం పట్టం కడుతున్నారు. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వెబ్ సిరీస్లదే హవా. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. అంతేగాక టాప్–10లో మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఇవే ఉండడం చూస్తుంటే వీక్షకుల ఆసక్తి ఇట్టే అర్థం అవుతోంది. ‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ హిందీ సిరీస్ ఏకంగా 2.77 కోట్ల మంది వ్యూయర్స్తో దేశంలో టాప్లో నిలిచింది. టాప్–50లో అయిదు సినిమాలు, అయిదు రియాలిటీ షోలు చోటు సంపాదించాయి. భాషల పరంగా చూస్తే హిందీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్–50 జాబితాలో అత్యధికంగా 16 సిరీస్, సినిమాలు, రియాలిటీ షోలతో జియో హాట్స్టార్ ముందంజలో ఉంది. -
నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్ కౌంటర్
కొందరు సెలబ్రిటీలతో సెల్ఫీ వరకే ఆగరు.. నన్ను పెళ్లి చేసుకుంటావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా! అని సినిమా డైలాగులు కూడా పేలుస్తుంటారు. అలా చాలామంది హీరోయిన్లకు ఇలాంటి ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. అందరూ ఇవి చూసి ఓ చిన్న నవ్వు నవ్వేసి లైట్ తీసుకుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్ అవంతిక మోహన్ (Avantika Mohan)కు కూడా ఇలాంటి ప్రపోజలే వచ్చిందట! కాకపోతే ఆ కుర్రాడికింకా 17 ఏళ్లే! నువ్వింకా పిల్లాడివిపదేపదే పెళ్లి చేసుకోమని మెసేజ్లు చేస్తూ ఉండటంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది అవంతిక. కొంతకాలంగా నాకు మెసేజ్లు చేస్తూ ఉన్న ఓ చిన్ని అభిమానికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకింకా 16 లేదా 17 ఏళ్లు ఉంటాయనుకుంటా.. జీవితమంటే ఏంటో నీకింకా పూర్తిగా తెలీదు. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నావ్.. కానీ, నువ్వింకా చిన్నపిల్లాడివి. మ్యారేజ్కు బదులుగా పరీక్షల కోసం ఆలోచించాల్సిన వయసులో ఉన్నావ్!నేను తల్లి అనుకుంటారునీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్య అనుకోరు, నీ తల్లిగా పొరబడుతారు. కాబట్టి బుద్ధిగా చదువుకో.. సరైన సమయం వచ్చినప్పుడు నీ లైఫ్లోనూ మంచి లవ్స్టోరీ ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది. అవంతిక.. యక్షి- ఫేత్ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ధీరమ్ మూవీ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈమె సినిమాలతో పాటు పలు సీరియల్స్ చేసింది. 2017లో అనిల్ కుమార్ను పెళ్లాడగా వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు సంతానం.చదవండి: బిగ్బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్తో తేల్చేసిందిగా! -
మగాళ్లూ..కన్యత్వం గురించి లైట్ తీస్కోండి..అది ఒక్కరాత్రి మేటర్
సెలబ్రిటీల వ్యాఖ్యలు ఇటీవల రేపుతున్నంత దుమారం మరేవీ రేపడం లేదనేది వాస్తవం. విభిన్న రకాల మాధ్యమాలు అందుబాటులోకి రావడం, వాటిలో వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం, అనేక వేదికల మీద ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు.. వాటిలో ఏ కాస్త తేడా ఉన్నా అవి స్వల్ప కాలంలోనే వైరల్ అయి ఆ సెలబ్రిటీల గొంతులో పచ్చి వెలక్కాయలా మారడం చూస్తూనే ఉన్నాం.అదే విధంగా ఇటీవల మరో సెలబ్రిటీ చేసిందంటూ వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలు పెను సంచలనం కలిగించాయి. సంప్రదాయాలకు, నైతికతకు విలువిచ్చే భారతీయుల మనోభావాలు గాయపడే విధంగా మాజీ మిస్ వరల్డ్ ప్రస్తుత హాలీవుడ్ నటి, పాశ్చాత్యుడిని పెళ్లాడిన ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు సరసన రాజమౌళి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ మధ్య ఆమె ‘కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది, కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి‘ కాబట్టి మగవాళ్లు కన్యల కోసం వెదకి వేసారి పోవాల్సిన అవసరం లేదనీ మనిషిగా పరస్పర మర్యాదలు ముఖ్యం అంటూ ఆమె చేసిందన్న వ్యాఖ్యల్ని అనేక మాధ్యమాలు హైలెట్ చేశాయి.సహజంగానే ఈ వ్యాఖ్యలు చాలా త్వరగా వైరల్ కావడంతో విపరీతమైన దుమారం చెలరేగింది. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచీ పాశ్చాత్య పోకడల్ని ఇష్టపడే వ్యక్తిగా ప్రియాంక చోప్రా కు ఉన్న పేరు ఈ వ్యాఖ్యలు ఆమే చేసిందంటూ అత్యధికులు నమ్మేందుకు కూడా దోహదం చేసింది. గత కొంత కాలంగా ప్రియాంక మన బాలీవుడ్ సినిమాల కంటే ..హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుండడం వంటివి కూడా దీనికి కొంత వరకూ కారణం. ఈ నేపధ్యంలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ చిచ్చు రాజుకున్న కొన్ని రోజుల తర్వాత తీవ్రత గమనించిన ప్రియాంక నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె ఖండించారు. ఆ మాటలు తనవి కాదంది, ‘ఏదైనా సరే ఆన్లైన్లో ఉన్నంత మాత్రాన అది నిజం కాదు‘ అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను ఖండించారు. తనదిగా సూచించే ఈ కోట్ నకిలీదని వైరల్ కావడానికి పన్నిన వ్యూహమని ఆమె ఇన్స్ట్రాగామ్లో స్పష్టం చేసింది. ఇలా వైరల్ అయ్యేందుకు కూడా కల్పిత కంటెంట్ సృష్టిస్తున్నారని ఆన్లైన్ విశేషాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు దాన్ని థృవీకరించుకోవాలని చోప్రా తన అభిమానులను కోరారు. -
బిగ్బాస్ 9 లో యూట్యూబ్ సెన్సేషన్? ఒక్క పోస్ట్తో తేల్చేసిందిగా!
తిన్నాతిరం పడతలే, ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటత్తుండు, నా పేరే ఎల్లమ్మ.. వంటి పాటలతో యూట్యూబ్లో నెస్సేషన్ అయింది ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ (Nagadurga Gutha). నాలుగేండ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకుంది. పద్నాలుండేగ్ల వయసులో పేరిణి నాట్యం నేర్చుకుంది. నృత్యకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆమె నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం కూడా స్థాపించింది. లాక్డౌన్లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫోక్ సాంగ్స్ క్వీన్ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్లో అందంగా స్టెప్పులేసింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్లో నటించే ఛాన్స్ వచ్చిందట! అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్గా అడిగారట! కానీ ఆ అవకాశాలను తిరస్కరించిన నాగదుర్గ.. నటన అంటే ఇష్టమే కానీ నాట్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల అని చెప్పుకొచ్చింది. పీహెచ్డీ పట్టా చేతికొచ్చాకే సినిమాల గురించి ఆలోచిస్తానన్న ఈమె కలివి వనం అనే ఒకే ఒక్క సినిమాలో మాత్రం నటిచింది.బిగ్బాస్పై ఆసక్తి లేదుఇంతలో నాగదుర్గ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొననుందని ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై నాగదుర్గ స్పందించింది. తాను బిగ్బాస్ 9వ సీజన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ షోకి వెళ్లాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని తెలిపింది. కాబట్టి ఈ ప్రచారానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టమని కోరింది. అయితే త్వరలోనే ఓ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.చదవండి: దృశ్యం నటుడు కన్నుమూత -
దృశ్యం నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇక లేరు. హిందీలో దృశ్యం, సూర్యవంశి వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన శుక్రవారం మరణించారు. నటుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆశిష్ (Actor Ashish Warang) మరణ వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు షాకవుతున్నారు. దర్శకనిర్మాత అరిణ్ పాల్ సోషల్ మీడియా వేదికగా నటుడి మృతి పట్ల సంతాపం ప్రకటించాడు. మృదుస్వభావిఆశిష్ చనిపోయారని తెలిసి షాకయ్యాను. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించినందుకు గర్వంగా ఉంది. ఆయన మృదుస్వభావి, కళపట్ల అంకితభావంతో మెదిలేవాడు. ప్రతి సీన్లోనూ ప్రాణం పెట్టి యాక్ట్ చేసేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. కాగా ఆశిష్.. అక్షయ్కుమార్ 'సూర్యవంశీ', అజయ్ దేవ్గణ్ 'దృశ్యం' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాణి ముఖర్జీ 'మర్దానీ' సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arin Paul (@arinpaul) చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే! -
మా సినిమా ఆ కోవకి చెందుతుంది : జేడీ చక్రవర్తి
‘‘జాతస్య మరణం ధ్రువం’ పేరు సజెస్ట్ చేసింది నేనే. టైటిల్ క్రెడిట్ నాకే వస్తుంది (నవ్వుతూ). మలయాళం నుంచి వచ్చే సినిమాలు బావుంటాయని అంటాం. మా ‘జాతస్య మరణం ధ్రువం’ ఆ కోవకి చెందిన సినిమా... అందరికీ నచ్చుతుంది’’ అని జేడీ చక్రవర్తి తెలిపారు. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్, ప్రీతీ జంగియాని ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో స్క్రీన్ప్లే, ట్విస్టులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘చాలా బలమైన స్క్రిప్ట్ ఇది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అద్భుతంగా ఉంటుంది’’ అని శ్రవణ్ జొన్నాడ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని సీరత్ కపూర్ చెప్పారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘΄ాన్ ఇండియా స్థాయిలో రూ΄÷ందించిన ఈ సినిమాని అదే స్థాయిలో విడుదల చేస్తాం’’ అని తెలి΄ారు. -
ఓటీటీలో అదరగొడుతున్న స్పై సిరీస్.. రెండు కథలు ఒకటే!
ఏ ఎండకాగొడుగు అన్న నానుడి వినే ఉంటారు. కాని ఇప్పుడు ఓటిటిల్లో దీనినే ఏ ట్రెండ్ కా స్టోరీ అన్న విధంగా నడుస్తోంది. ఆగష్టు 15 అనగానే , ఆ తేదీకి ముందు తరువాత నెలల్లో దేశభక్తి సినిమాలు రావడం పరిపాటే. ఇలా ప్రస్తుతం ఓటిటి సిరీస్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇదే నేపధ్యంలో సరిగ్గా వారం రోజుల వ్యవధిలో రెండు దిగ్గజ ఓటిటిల్లో రెండు సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిలో జియో హాట్ స్టార్ వేదికగా సలాక్కార్ ఒకటి అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సారే జహా సే అచ్చా మరొకటి. వీటిలో విశేషం ఏమిటంటే రెండు కథాంశాలు దాదాపు ఒకటే. పాత్రలు, కథను నడిపించిన తీరు తప్ప రెండూ అన్నిటికీ అన్నీ సమానమే.అంతలా వీటిలో ఉన్న కథాంశమేమిటో ఓ సారి చూద్దాం.1960 నుండి 1990 సంవత్సర కాలంలో భారతదేశానికి యుద్ధాలు, ఇతర దేశాల నుండి కవ్వింపు చర్యలు లాంటివి ఎన్నో జరిగాయి. సరిగ్గా పాకిస్తాన్ భారత్ తో యుద్ధం జరిగిన ఆ సమయంలో పాకిస్తాన్ దేశం న్యూక్లియార్ బాంబును తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాని ఆ ప్రయత్నాలన్నీ మన దేశానికి సంబంధించిన గూఢాచార సంస్థ రా నాశనం చేసింది. తమ సంస్థ ద్వారా పాకిస్తాన్ లోకి గూఢాచారులను పంపి పాకిస్తాన్ న్యూక్లియార్ బాంబు తయారీని సమర్ధవంతంగా ఎదుర్కుంది.ఇప్పుడు పైన చెప్పుకున్న రెండు టీవి సిరీస్ లలో ఇదే కథా నేపధ్యం. 1978 లో పాకిస్తాన్ దేశం జనరల్ జియా నేతృత్వంలో ఉంది. ఆ సమయంలో ఆదిర్ దయాళ్ అనే గూఢాచారి ఇండియన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పాకిస్తాన్ లో ప్రవేశిస్తాడు. పాకిస్తాన్ లోని ఓ ప్రాంతంలో న్యూక్లియార్ బాంబు తయారవుతుందని తెలుసుకోని ఆ ప్రయత్నాలను నాశనం చేయడమే జియో హాట్ స్టార్ లో 5 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సలాక్కార్ కథ.1972 లో పాకిస్తాన్ దేశం భారత్ తో షిమ్లా ఒప్పందం తరువాత ఆ దేశ నేత అయిన జుల్ఫికర్ అలీ భుట్టో వేరే దేశాల నుండి విడిభాగాలు తెప్పించి పాకిస్తాన్ లో న్యూక్లియార్ బాంబు తయారు చేయాలనుకుంటాడు. ఈ ఆపరేషన్ కి ఐయస్ఐ హెడ్ అయిన ముర్తజా మాలిక్ ని నియమిస్తాడు. మాలిక్ ఆపరేషన్ ని పాకిస్తాన్ లోనే ఉన్న భారత గూఢాచారి విష్టు సర్వనాశనం చేస్తాడు.ఇదే నెట్ ఫ్లిక్స్ లో 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సారే జహా సేఅచ్ఛా సిరీస్ కథ.రెండు సిరీస్ లు థ్రిల్లర్ జోనర్ తో వచ్చినవే.చూసే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయనడంలో సందేహమే లేదు. చరిత్రలో కనమరుగైన మన గూఢాచారుల కథలు ఇవి. వర్త్ ఫుల్ వాచ్ -
అమ్మాయిలూ.. ప్రెగ్నెంట్ అవడం ఈజీ!: బాలీవుడ్ నటి
అన్నీ అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? కష్టసుఖాల్నే కాదు ఇంటిపనినీ సమంగా పంచుకుంటాడు బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు. భార్యకు అన్నివిధాలుగా అండగా ఉండే ఇతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. రాజ్కుమార్ భార్య, నటి పాత్రలేఖ (Patralekha) జూలై నెలలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అయితే అంతకన్నా ముందు ఆమె తన ఎగ్స్ (అండాలను) భద్రపరిచింది.ప్రెగ్నెన్సీయే సులువుఈ విషయం గురించి పాత్రలేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట నేను నా అండాలను భద్రపరిచాను. కానీ, ఇప్పుడు వాటి సాయం లేకుండా సహజంగా గర్భం దాల్చాను. నాకు తెలిసినంతవరకు ఎగ్స్ భద్రపరచడం కన్నా ప్రెగ్నెన్సీయే ఈజీ అనిపిస్తోంది. ఎగ్స్ ఫ్రీజ్ చేసే ప్రక్రియ కాస్త కఠినంగా ఉంటుంది. దాని గురించి మా డాక్టర్ ముందుగా మాకెటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అయిపోయాక నాకు తెలియకుండానే కాస్త డల్ అయ్యాను. కాబట్టి నేనేమంటానంటే.. అమ్మాయిలూ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి బదులు ప్రెగ్నెంట్ అవడానికి ట్రై చేయండి. కిట్లో నెగెటివ్ రిజల్ట్నేను సహజంగా గర్భం దాల్చాను. నిజానికి ప్రెగ్నెన్సీ కిట్లో కూడా నెగెటివ్ ఫలితమే చూపించింది. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ను కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ విషయం బయటపడింది. మూడు నెలలవరకైనా ఈ విషయం బయటకు చెప్పకూడదనుకున్నాం. కానీ గతేడాది డిసెంబర్లో ఓ ఈవెంట్కు వస్తామని రాజ్, నేను ఓ ఈవెంట్కు మాటిచ్చాం. సడన్గా రామని హ్యాండిస్తే మాట పోతుందని ఏప్రిల్లో ఆ ఈవెంట్కు వెళ్లాం. దానికంటే ముందు నెలలో అంటే మార్చిలో నేను గర్భం దాల్చాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే! -
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్తో ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్టర్మ్ కోచింగ్కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్టర్మ్ కోచింగ్కి పంపిస్తారు. అక్కడే అఖిల్కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్గా, రొటీన్గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. -
లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన బాలీవుడ్ బ్యూటీ.. మంచి బేరమే!
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) లగ్జరీ ఫ్లాట్ అమ్మేసింది. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెలలో విక్రయించింది. దాదాపు 182 గజాల వైశాల్యంలో ఉన్న తన ఫ్లాట్ను రూ.5.30 కోట్లకు అమ్మింది. గతంలో అంటే 2018లో మలైకా ఇదే ఫ్లాట్ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐదున్నర కోట్లకు విక్రయించింది. అంటే దాదాపు రెండు కోట్ల మేర లాభాలను ఆర్జించింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మలైకా అరోరా చయ్య చయ్య పాటతో సెన్సేషనల్ అయింది. హిందీలో అనేక స్పెషల్ సాంగ్స్లో తళుక్కుమన్న ఆమె తెలుగులో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి ఐటం సాంగ్స్తో అలరించింది. బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది.థామాలో స్పెషల్ సాంగ్ప్రస్తుతం రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న థామ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మ్యాడ్డాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్లో నాలుగో చిత్రంగా ‘థామా’ తెరకెక్కుతోంది.చదవండి: అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత -
అన్ని సినిమాలు మహావతార్, సయారాలు కావుగా!: నిర్మాత
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.310 కోట్లు కొల్లగొట్టింది మహావతార్ నరసింహ మూవీ (Mahavatar Narsimha). అటు బాలీవుడ్లో కొత్తవారితో తీసిన సయారా చిత్రం ఏకంగా రూ.580 కోట్లు దాటేసింది. ఈ రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే! అయతే కొత్తవారితో తీసిన ప్రతి సినిమా సయారాలా సెన్సేషన్ హిట్ అందుకోలేదంటున్నాడు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్.భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్.. ఎందుకు?తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ (Karan Johar) విడుదల చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో కరణ్ జోహార్ పాల్గొన్నాడు. అక్కడ.. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవడానికి పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం లేదా స్టార్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. ఏది కారణం? అని ఓ ప్రశ్న ఎదురైంది.ఎవర్నీ తప్పుపట్టలేంఅందుకు కరణ్ స్పందిస్తూ.. ప్రతి సినిమాకు దాని ఫలితం ముందే రాసిపెట్టి ఉంటుంది. పెద్ద హీరోలతో తీసిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్టయిన రోజులున్నాయి. కాకపోతే పరిస్థితులు సరిగా లేవు. అందుకే ఇప్పుడందరూ సినిమాను మరోసారి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మనం ఎవరినీ తప్పుపట్టలేము. అలాగే కొత్తవారితో పెద్ద సినిమా తీసినప్పుడు అవి సక్సెస్ అయిన రోజులున్నాయి, అలాగే ఫెయిలైన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.దరిదాపుల్లోకి కూడా రాలేవ్సంగీతాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చే ప్రతి సినిమా సయారాలా హిట్టవలేదు. యానిమనేషన్ సినిమాలు కూడా ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ మహావతార్ నరసింహకు దరిదాపుల్లోకి కూడా రాలేవు అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.చదవండి: సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ! -
అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ
అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(2023) తర్వాత ఆమె నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Ghaati Movie Review ). కథేంటంటే..శీలావతి.. ఖరీదైన గంజాయి. ఇది ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. అక్కడ పండిన గంజాయి పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. శీలావతికి బావ దేశిరాజు అంటే చాలా ఇష్టం. అప్పులు తీర్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రిష్ సినిమాల్లో కథ చాలా సింపుల్గా, హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న పాయింట్ని పట్టుకొని దానికి ఎమోషల్ జోడించి.. ఆలోచింపజేసే డైలాగులతో కథనాన్ని నడిపిస్తుంటాడు. గమ్యం, వేదం, కంచె సినిమాల నేపథ్యం అలానే సాగుతుంది. ఘాటి కథను కూడా అలానే నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమాల్లోలాగా ఎమోషన్ని ఇందులో పండించలేకపోయాడు. డైలాగులు కూడా అంత గొప్పగా ఏమి లేవు. కథ నేపథ్యం బాగున్నా..దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంతో క్రిష్ పూర్తిగా సఫలం కాలేదు. ఘాటీలు, వారి వృత్తి నేపథ్యాన్ని వివరిస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల ఎంట్రీ చాలా సహజంగా ఉంటుంది. శీలావతి గంజాయి సరఫరా.. రైల్వే స్టేషన్ నుంచి డబ్బులు తీసుకునేక్రమంలో వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక గంజాయి స్మగ్లింగ్ వెనుక హీరోహీరోయిన్లు ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత..కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. తొలి అర్థభాగం మొత్తం ఎలాంటి ట్విస్టులు, హైమూమెంట్స్ లేకుండా కథనం చాలా సింపుల్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే ఆ సీన్తో సెకండాఫ్ ఎలా ఉండబోతుందో ఈజీగా ఊహించొచ్చు. ద్వితియార్థం మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామానే. కథనం మొత్తం అక్కడక్కడే తిరుగుతూ సాగదీతగా అనిపిస్తుంది. ఒకదాని వెనుక మరోకటి యాక్షన్ సీన్లు వస్తూ ఉంటాయి. అయితే గుహలో నాయుడు ముఠాతో చేసే యాక్షన్ సీన్, తలనరికే ఎపిసోడ్ తప్ప..మిగతావేవి ఆకట్టుకోలేవు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అనుష్క కోసం ఇరికించినట్లుగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సింపుల్గా, ఉహకందేలా ఉంటుంది. బాధితురాలు నేరస్తురాలిగా మారడం.. ఆ తర్వాత తను ఎంచుకున్న మార్గాన్ని వదిలి.. తన వర్గాన్ని మంచి దారిలో నడిపించడం కోసం ప్రయత్నించడం.. ఇదే ఘటి కథ. అయితే తన వర్గాన్ని మంచి దారిలో తీసుకొచ్చేందుకు శీలావతి చేసే పోరాటం ఆసక్తికరంగా మలిచి ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. శీలావతి పాత్రకి అనుష్క న్యాయం చేసింది. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీసింది. కానీ ఆ సీన్లను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. చాలా చోట్ల ఇరికించినట్లుగా, కొన్ని చోట్ల అతిగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లను బాగానే నటించింది. కానీ అరుధంతి, బాహుబలి, భాగమతిలో ఉన్న అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. దేశిరాజుగా విక్రమ్ ప్రభు బాగానే నటించాడు. చైతన్యరావు తొలిసారి విలన్గా నటించి మెప్పించాడు. అయితే ప్రతిసారి గట్టిగా అరవడం తప్ప.. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రవీంద్ర విజయ్ విలనిజం కూడా అంతంతమాత్రమే. పోలీసు ఆఫీసర్గా జగపతి బాబు అక్కడక్కడ కనిపిస్తాడు. ఆయన పాత్ర ఎంటర్టైనింగ్గా మలిచారు. కానీ అది తెరపై వర్కౌట్ కాలేదు. జాన్ విజయ్, రాజు సుందరం, వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ సంగీతం ఓకే. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
సెంచరీలతో స్టార్ హీరో దూకుడు.. మరో హాఫ్ సెంచరీ!
ప్రేక్షకుల్ని మెప్పించడం, వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటారు. కానీ ఈ సీనియర్ హీరో మాత్రం అదంతా తనకు మామూలు విషయం అన్నట్లుగా వరుస హిట్లతో స్పీడుమీదున్నాడు. ఆయనే మలయాళ స్టార్ మోహన్లాల్ (Mohanlal). 2025లో ఇప్పటివరకు మూడు హిట్స్మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం హృదయపూర్వం. సత్యన్ అంతికడ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ వెల్లడించింది. దీనికంటే ముందు మోహన్లాల్ ఈ ఏడాది ఎంపురాన్ (లూసిఫర్ సీక్వెల్), తుడరుమ్ సినిమాలతో పలకరించాడు. ఈ రెండు కూడా మంచి విజయాలే అందుకున్నాయి. కేవలం రూ.28 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన తుడరుమ్ ఏకంగా రూ.230 కోట్లు వసూలు చేసింది. హృదయపూర్వం సినిమా స్టిల్మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధికంరూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఎంపురాన్ ఏకంగా రూ.260 కోట్లు సాధించింది. మలయాళ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి చిత్రంగా ఎంపురాన్ రికార్డు సృష్టించింది. ఓపక్క హీరోలు ఒక్క హిట్టు కోసం పరితపిస్తుంటే.. మోహన్లాల్ మాత్రం కేవలం ఆరు నెలల్లోనే వరుసగా మూడు హిట్లు సాధించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు.నెక్స్ట్ ఏంటి?మోహన్లాల్ నెక్స్ట్ మూవీ ‘వృషభ’ ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ కానుంది. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కీలక పాత్ర పోషించాడు. ఈ పాన్ ఇండియా సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. అలాగే సూపర్ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం పార్ట్ 3'లోనూ మోహన్లాల్ భాగం కానున్నాడు. ఈ మూవీ వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) చదవండి: మజిలీ తర్వాత మారిపోయా.. లవ్స్టోరీ మిస్సవుతున్నా.. -
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది: దుల్కర్ సల్మాన్
‘‘కల్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లిలాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం. చంద్ర పాత్ర కోసం తను తప్ప మా మైండ్లోకి వేరే ఎవరి పేరు రాలేదు. నన్ను ఎలాగైతే మీవాడిగా భావించారో అలాగే నేను నిర్మించిన ‘కొత్త లోక’ చిత్రాన్ని కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. కల్యాణీ ప్రియదర్శన్ లీడ్ రోల్లో, నస్లెన్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1: చంద్ర’. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.బడ్జెట్ గురించి ఆలోచించలేడొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ఆగస్టు 29న నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవానికి దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ గురించి ఆలోచించలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు’’ అని చెప్పారు. రూ.30 కోట్లు ఎక్కువనాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళంలో రూ.30 కోట్లు అనేది చాలా ఎక్కువ. నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ని అభినందించాలి’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నాగవంశీ. కల్యాణీ ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఉంది’’ అన్నారు డొమినిక్ అరుణ్. తండ్రి రియాక్షన్ ఇదే!ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా నటించనున్నట్లు తండ్రి ప్రియదర్శన్కు చెప్పగా నువ్వా.. యాక్షన్ హీరో పాత్రలోనా! అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత చెయ్యి, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు.చదవండి: కమెడియన్కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం -
కమెడియన్కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవల పక్షవాతం రావడంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు.వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అతడికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్.. మనం సైతం సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్నారు. సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో రామచంద్ర నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వెంకీ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్నాడు. ఆనందం, సొంతం, దుబాయి శీను, కింగ్, లౌక్యం వంటి పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు. పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. View this post on Instagram A post shared by Manamsaitham _kadambari kiran (@kadambarikiran) చదవండి: మజిలీ తర్వాత మారిపోయా.. లవ్స్టోరీ మిస్సవుతున్నా: చై -
మజిలీ తర్వాత మారిపోయా.. లవ్స్టోరీ మిస్సవుతున్నా..: నాగచైతన్య
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాగచైతన్య (Naga Chaitanya). జోష్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చి నేటికి (సెప్టెంబర్ 5) 16 ఏళ్లు పూర్తవుతుంది. ఇన్నేళ్లలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. కొన్నిచోట్ల తడబడ్డా రెట్టింపు వేగంతో ముందుకు వచ్చి సూపర్ హిట్లు కొట్టాడు. తాజాగా తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.సినిమానే నా జీవితంఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. వెనక్కు తిరిగి చూసుకుంటే సంతృప్తిగా ఉంది. సినిమానే నా జీవితం అని అర్థమవుతోంది. మొదట్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు కష్టంగా అనిపించేది. కానీ రానురానూ పరిణతి పెరిగింది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని పరీశీలిస్తున్నాను. ఫలితాన్ని కాకుండా, సినిమా నుంచి వచ్చిన అనుభవంతో ముందుకు వెళ్లాలని నాన్న చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపించాయి.అక్కినేని ఫ్యామిలీ అంటేనే..మజిలీ, లవ్స్టోరీ సినిమాలు చేశాక నా ఆలోచనా విధానమే మారిపోయింది. అక్కినేని కుటుంబం అంటేనే ప్రేమమయం. తాత మొదలుకొని మేం చేసిన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వ్యక్తిగతంగా నాక్కూడా లవ్ స్టోరీలంటేనే ఇష్టం. ఈ మధ్య వాటిని బాగా మిస్ అవుతున్నా.. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనే ఆతృత కంటే కూడా ఆరునెలలు లేటైనా మంచి సినిమాతోనే రావాలనుకుంటున్నాను.ట్రోలింగ్..సోషల్ మీడియా అనగానే ట్రోలింగ్ అని చాలామంది భయపడతారు. కానీ అక్కడ మన గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. నన్ను ప్రేమించేవాళ్లు, విమర్శించేవాళ్లు.. ఇద్దరూ ఉంటారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటాను అని చై చెప్పుకొచ్చాడు. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు.చదవండి: 9 వారాల వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. వీడియో -
500 ఎకరాల నుంచి అంతా పోగొట్టుకుని.. సైలెన్సర్ స్టోరీ ఇదే!
కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని పాత్రలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా పెదవులపై చిరునవ్వు వస్తుంటుంది. అలాంటి పాత్రలో నటించి సినిమా విజయంలో భాగమయ్యాడు సత్యన్ (Tamil Actor Sathyan). ఇతడు స్నేహితుడు (తమిళంలో నంబన్) మూవీలో సైలెన్సర్గా నటించాడు. క్లాస్ ఫస్ట్ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని హీరో ముప్పుతిప్పలు పెడుతూ ఉంటాడు. ఈ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుంటారు.500 ఎకరాల ఆసామిఇదే కాదు, రాజా రాణి, తుపాకి, గజిని, పులి, రాధే శ్యామ్, జిగర్తాండ డబుల్ ఎక్స్.. ఇలా 70కిపైగా సినిమాల్లో నటించాడు. నిర్మాత మదంపట్టి శివకుమార్ ఏకైక కుమారుడే సత్యన్. శివకుమార్కు 500 ఎకరాల పొలం, ఐదు ఎకరాల విస్తీర్ణంలో పెద్ద బంగ్లా ఉండేవి. విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ పైకి కలర్ఫుల్గా కనిపించే సినిమా ప్రపంచం ఆ ఆస్తిని కర్పూరంలా కరిగించేసింది. శివకుమార్ నిర్మాతగా మారడంతోనే కష్టాలు మొదలయ్యాయి. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు, భారీ నష్టాలు మూటగట్టుకున్నాడు. దాన్నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులు కూడా అమ్ముకున్నాడు.హీరోగా అట్టర్ ఫ్లాప్నిజానికి సత్యన్ కమెడియన్ అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. 2000వ సంవత్సరంలో ఇలయవన్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాల్ని ఎదుర్కొంది. కొడుకును హీరోగా పెట్టి 'కన్న ఉన్నై తెడుకిరెన్' అని మరో సినిమా చేయగా అది కూడా ఘోర పరాజయం పాలైంది. ఈ రెండు ఫ్లాపులు వారి కుటుంబాన్ని ఆర్థికంగా మరింత దెబ్బతీశాయి. తండ్రి మరణం తర్వాత పరిస్థితి మరింత అధ్వాణ్నంగా మారడంతో సత్యన్.. బంగ్లాను కూడా అమ్మక తప్పలేదు.టాప్ కమెడియన్.. అయినా!హీరోగా కలిసొచ్చేలా లేదని సత్యన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే స్థిరపడిపోయాడు. కమెడియన్గా, హీరో ఫ్రెండ్ పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. స్నేహితుడు, రాజా రాణి వంటి చిత్రాలు అతడిని టాప్ కమెడియన్గా నిలబడెట్టాయి. కానీ పోగొట్టుకున్న ఆస్తులు మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయాడు. ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇతడికి దగ్గరి బంధువు అవుతాడు. సత్యరాజ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సత్యన్ తండ్రే పాకెట్మనీ ఇచ్చేవాడు!చదవండి: అంత భయం దేనికి? విజయ్ దేవరకొండకు కౌంటర్! -
అంత భయం దేనికి? విజయ్ దేవరకొండకు కౌంటర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆంగ్ల భాష ఆధిపత్యం గురించి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడాడు. చాలా ఏళ్ల క్రితం పాశ్చాత్యులు మన దేశానికి వచ్చి వారి భాషను మనపై రుద్దడం వల్లే ఇప్పటికీ ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతున్నామన్నాడు. దానివల్లే హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోందని, ఫలితంగా వారి బడ్జెట్లు, నటీనటుల పారితోషికాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నాడు. అందుకే హాలీవుడ్లో ఎక్కువ..హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఒక్క సినిమాకు తనకంటే వంద రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఎక్కువమంది ఆయన భాష (ఇంగ్లీష్)లో సినిమాలు చూడటం వల్లే ఇది సాధ్యమైందన్నాడు. కాబట్టి దక్షిణాది సినిమాలు బాలీవుడ్లో విస్తరించినట్లే.. భారతీయ సినిమాలు కూడా పశ్చిమ దేశాల్లో ఎక్కువగా విస్తరించాలని అభిప్రాయపడ్డాడు. విజయ్ అభిప్రాయాన్ని కొందరు విదేశీయులు ఏకీభవించలేదు. వారిలో కంటెంట్ క్రియేటర్ ఫర్హాన్ ఒకరు. హీరోపై అసహనంఅయితే విజయ్ను తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో చేయగా దాన్ని డిలీట్ చేయించాడని అసహనం వ్యక్తం చేశాడు. ఒక యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో నా వీడియో డిలీట్ చేయించాడు.. నేను చెప్పే కథ ద్వారా తనెవరో మీరే తెలుసుకోండి.. ఒక సింహం, పులి కలిస్తే వచ్చేది 'లైగర్'.. నాకు అర్జున్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. తనెప్పుడూ సమయానికి రెడీగా ఉండడు (అర్జున్ రెడ్డి) అంటూ ఆ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పకనే చెప్పాడు.నేను ఏకీభవించలేదుఎక్కువమంది ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలుంటాయి, ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉంటాయి.. వారి సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతాయి అని సదరు హీరో అన్నాడు. దాన్ని నేను ఏకీభవించలేదు. విదేశాల్లో కూడా అనేక భాషలున్నాయి. చాలా భాషల్లో తక్కువ బడ్జెట్తో వచ్చిన చిత్రాలు హిట్లు కొడుతున్నాయి. కానీ భారీ బడ్జెట్తో తీసిన ఆయన సినిమా మాత్రం విజయవంతం కాలేకపోయింది అని చెప్పాను. అంతే.. దాన్ని తట్టుకోలేక డిలీట్ చేయించాడు.సినిమాఇప్పుడా వీడియోను సోషల్ మీడియాలో మళ్లీ అప్లోడ్ చేస్తే కచ్చితంగా తీసేయిస్తాడు. మరీ ఇంత అభద్రతాభావానికి లోనైతే ఎలా? ఎవరో ముక్కూమొహం తెలియని వ్యక్తి విమర్శించినా తట్టుకోలేవా? అని ప్రశ్నించాడు. ఇకపోతే అతడు విజయ్ను విమర్శిస్తూ చేసిన వీడియో ఒకటి యూట్యూబ్లో ఇంకా అలాగే ఉంది. కాగా విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, గీతా గోవిందం, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్, కింగ్డమ్ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Farhan Balaporia (@farhan_balaporia) చదవండి: అఫీషియల్: ఓటీటీలో 'కూలీ' రిలీజ్ ఎప్పుడంటే? -
భారత్లో అవతార్ రీరిలీజ్.. ఎప్పుడంటే?
"అవతార్: ఫైర్ అండ్ యాష్" కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు 20th Century Studios ఓ గొప్ప బహుమతి ఇవ్వనుంది. జేమ్స్ కామెరూన్ మాస్టర్ పీస్ "అవతార్: ది వే ఆఫ్ వాటర్" అక్టోబర్ 2న భారతీయ థియేటర్స్లో ఒక వారంరోజుల పాటు 3D లో రీరిలీజ్ కానుంది. 2022 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) గెలుచుకుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ 3D వర్షన్ ద్వారా పండోరా ప్రపంచాన్ని మరోసారి చుట్టేయండి.“ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వకండి. ఈ మనోహరమైన లోకాన్ని ముందే చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th Century Studios ఇండియా ప్రతినిధులు తెలిపారు. "అవతార్: ఫైర్ అండ్ యాష్" విషయానికి వస్తే ఈ మూవీ ఇండియాలో ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. చదవండి: నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తెను: బిగ్బాస్ బ్యూటీ -
అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేశా.. నా భార్య తిట్టింది: నిర్మాత
కొందరు దర్శకనిర్మాతలు కొన్ని సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. ఆర్య సినిమాలో కూడా ఓ డైరెక్టర్, ఓ నిర్మాత చిన్న సీన్లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను తాజాగా ఓ ఈవెంట్లో ప్రదర్శించారు. అది చూసిన నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తనలో తానే నవ్వుకున్నాడు. 20 ఏళ్ల కింద షూట్ చేసిన ఆ సన్నివేశం తాలూకు జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు. నా భార్య తిట్టిందిబన్నీ వాసు మాట్లాడుతూ.. ఆర్య సినిమా చివరి రోజు షూటింగ్.. ఆరోజు ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు రాలేదు. దాంతో దిల్ రాజు ఆఫీస్ క్యాషియర్ శ్రీధర్, వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు, నేను.. ముగ్గురం నటించాం. సుకుమార్గారిదే ఆలోచన.. మీరు ముగ్గురూ వేస్ట్గా పడున్నారు కదా.. ముందుకు రండి అని మాపై సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్ చూశాక మా ఆవిడ చాలా తిట్టింది. అప్పటినుంచి నేను ఎక్కడా కనబడలేదు. ఈ మధ్య మిత్రమండలి సినిమా కోసం నాతో ఏదో రీల్ చేయించారు. అది చూశాక కచ్చితంగా నేనే ట్రోల్ అవుతానని అనిపించి ఆ రీల్ బయటకు వదల్లేదు అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.నిర్మాతగా..కాగా బన్నీ వాసుది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయమవగా వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అలా అతడు గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేరాడు. తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో పార్ట్నర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఈమధ్యే స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరిట కొత్త బ్యానర్ ప్రారంభించాడు. ఈ బ్యానర్పై బన్నీ వాసు.. మిత్ర మండలి సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సీన్ లో ఉంది దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్ , ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు. 😃#LittleHearts #Aarya pic.twitter.com/bmvACGNF8s— Suresh PRO (@SureshPRO_) September 3, 2025 చదవండి: తండ్రి కాబోతున్న యంగ్ హీరో -
అందుకే మదరాసి టైటిల్ పెట్టాను: ఏఆర్ మురుగదాస్
‘‘మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ‘మదరాసి’ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఈ మూవీలో హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు విలన్. అందుకే టైటిల్ ‘మదరాసి’ అని పెట్టాను’’ అని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెలిపారు. శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జోడీగా విద్యుత్ జమాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ మాట్లాడుతూ– ‘‘వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పటికే ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ‘మదరాసి’ కథ రాశాను. ఈ కథ మొత్తం తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అయినప్పటికీ ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్ ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనకు మాస్లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది. విద్యుత్ జమాల్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. అయితే ‘మదరాసి’ కథ నచ్చడంతో విలన్గా చేసేందుకు ఒప్పుకున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ ఎన్వీ ప్రసాద్గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. దక్షిణాది ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రస్తుతం మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుండటం సంతోషం. ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ, చివరకు అది పట్టాలెక్కలేదు. అందువల్లే దాదాపు ఐదేళ్లు గ్యాప్ వచ్చింది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
నేను క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది.. సారీ అమ్మా!
పిల్లలు ఎక్కడికి వెళ్లినా సరే జాగ్రత్త అని చెప్తుంటారు పేరెంట్స్. అందులోనూ వాతావరణం సరిగా లేనప్పుడు టూర్లు, ట్రిప్పులు అని బయటకు వెళ్తే కాస్త కంగారుపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తిరిగొచ్చేస్తారా? అని ఎదురుచూస్తుంటారు. చెప్పిన మాట వినకుండా ట్రిప్పులో ఏమైనా సాహసాలు చేసేందుకు ఒడిగట్టారని తెలిస్తే ఇంటికొచ్చాక తల్లి చేతిలో అక్షింతలు పడటం ఖాయం!సారీ అమ్మమెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) పరిస్థితి కూడా అంతే! తాజాగా ఆమె తన ట్రిప్కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఓ జలపాతానికి దగ్గరగా వెళ్లి సంతోషంతో గెంతులేసింది. 'నేను సురక్షితంగా ఇంటికి వచ్చేయాలని మా అమ్మ నాకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ నేనేమో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, సారీ అమ్మ' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు నిహారిక వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. ఈ సరదా వీడియో నెట్టింట వైరల్గా మారింది.నటిగా, నిర్మాతగా..నిహారిక కొణిదెల నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా! ఒక మనసు, సూర్యకాంతం, డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్, మద్రాస్కారన్ మూవీస్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్పై ఓటీటీలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. హలో వరల్డ్ సిరీస్లో నిహారిక నటించింది కూడా! నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే తొలి సినిమా థియేటర్లో రిలీజ్ చేయగా ఇది బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తన బ్యానర్లో మరో మూవీ రూపుదిద్దుకుంటోంది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: అనుష్క కోసం ప్రభాస్ ఎంట్రీ.. 'ఘాటీ' స్పెషల్ గ్లింప్స్ -
‘శీలావతి’.. నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది: అనుష్క
‘‘నేను సినిమాల్లోకి భయం భయంగా వచ్చాను. అయితే రెండు దశాబ్దాల జర్నీ పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్ల ప్రయాణాన్ని ఊహించలేదు. ఈ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ని, స్టార్డమ్ని సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఇందుకు ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి కృతజ్ఞతతో ఉంటా’’ అని హీరోయిన్ అనుష్క శెట్టి చెప్పారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానున్న సందర్భంగా అనుష్క పంచుకున్న విశేషాలు. → ‘ఘాటీ’లో నేను చేసిన శీలావతి క్యారెక్టర్లో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. నా కంఫర్ట్ జోన్ని దాటి చేసిన సినిమా ఇది. శీలావతి నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సరోజ (‘క్రిష్’ డైరెక్షన్లో చేసిన ‘వేదం’ సినిమాలోని పాత్ర), శీలావతి వంటి అద్భుతమైన పాత్రలు ఇస్తున్న క్రిష్గారికి థ్యాంక్స్. → క్రిష్గారు, చింతకింది శ్రీనివాస్గారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. షూటింగ్ లొకేషన్స్కి వెళ్లిన తర్వాత ఒక కొత్త పాత్ర, సంస్కృతి, ఒక కొత్త విజువల్ని ప్రేక్షకులకి చూపించబోతున్నామనే ఎగ్జయిట్మెంట్ కలిగింది. ప్రతి మహిళ సాధారణంగా, సున్నితంగా కనిపించినప్పటికీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక బలమైన స్తంభంలాగా నిలబడుతుంది. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి’ వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేశాను. ‘ఘాటీ’లో చేసిన శీలావతి పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య గంజాయి. క్రిష్గారు సమాజానికి దగ్గరగా ఉండే కథలనే ఎంచుకుంటారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఘాటీ’లో చక్కని సందేశం కూడా ఉంది. → నేను చేసిన చాలా సినిమాలు కష్టంతో కూడుకున్నవే. ‘ఘాటీ’లోనూ ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. షూటింగ్ కోసం పెద్ద పెద్ద కొండలు ఎక్కేవాళ్లం. ఇలాంటి ఒక వైవిధ్యమైన కథని నమ్మి, నాపై నమ్మకం ఉంచి ఇంత గ్రాండ్ స్కేల్లో ఈ సినిమా చేసినందుకు రాజీవ్ రెడ్డి, సాయిబాబుగార్లకు, యూవీ క్రియేషన్స్వారికి ధన్యవాదాలు. క్రిష్గారు రాసిన మూడు ΄ాటల్లో ‘కుందేటి చుక్క...’ అంటూ ఆయన చేసిన పదప్రయోగం నాకు చాలా ఇష్టం. షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను... పుస్తకాలు చదువుతాను... సినిమాలు చూస్తాను. ప్రస్తుతం క్రిష్గారు ఇచ్చిన ‘మహాభారతం’ చదువుతున్నాను. రెండేళ్లుగా ఎక్కువగా కుటుంబంతోనే సమయం గడుపుతున్నాను. →‘ఘాటీ’ని ఆంధ్ర–ఒరిస్సా సరిహద్దుల్లో షూట్ చేసినప్పుడు నన్ను చూడడానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడం హ్యాపీగా అనిపించింది. రాజమౌళిగారు లాంటి దర్శకుడు ‘బాహుబలి’ లాంటి చిత్రాలని అద్భుతంగా తీయడం వల్లే అన్ని వైపులా రీచ్ అయింది. మంచి సినిమా చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. నేను ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ నన్ను ‘అరుంధతి’గానే గుర్తుపడుతున్నారు. → ‘బాహుబలి: ది ఎపిక్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిగా ఉంది. ‘ఛత్రపతి’ సినిమా సమయం నుంచి ప్రభాస్తో నాకు మంచి స్నేహం ఉంది. మేము కలిసి నటించిన సినిమాల్లో మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటే అది ఆయా ΄ాత్రల గొప్పదనం. ఇక బలమైన కథ కుదిరితే ఔట్ అండ్ ఔట్ నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. మొదటిసారి మలయాళంలో ‘కథ నార్’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో ఓ కొత్త సినిమా ప్రకటన ఉంటుంది. -
అల్లు కనకరత్నమ్మ మృతికి ప్రధాని సంతాపం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి పట్ల ధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కనకరత్నమ్మ తన కళ్లను దానం చేయడం గొప్ప విషయం అని.. ఒక జీవితానికి వెలుగునిచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కష్ట సమయంలో అల్లు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోదీ ఓ సందేశాన్ని పంపారు. ప్రధానమంత్రి తెలిపిస సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని కోకాపేటలోని అల్లు కుటుంబ ఫామ్హౌస్లో జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. -
వద్దు వద్దంటూనే మళ్లీ హోస్ట్గా.. కన్నడ బిగ్బాస్ ఎప్పటినుంచంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభానికి రెడీ అయింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా ఉన్నాడు. ఈసారి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కన్నడ బిగ్బాస్ కొత్త సీజన్ కూడా ఇదే నెలలో షురూ అవనుంది. ఈ షో నేను చేయను, నా వల్ల కాదు అని కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) పక్కకు తప్పుకున్నాడు. కానీ, షో నిర్వాహకులు బతిమాలి మళ్లీ ఆయన్నే హోస్ట్గా ఒప్పించారు.ఈ నెలలోనే..ఈమేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కర్ణాటక సాంప్రదాయాలు, రకరకాల మనుషులను, సినిమా, సీరియల్స్, రీల్స్.. ఇలా చాలానే చూపించారు. అవన్నీ చూస్తుండగా సడన్గా డిష్ పోతుంది. అప్పుడు కిచ్చా సుదీప్ కాఫీ చేత పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. సర్.. సెట్, కంటెస్టెంట్లు రెడీ, ఏడు కోట్ల కన్నడిగులు రెడీ.. మరి మీరు అని కొంత బెరుకుతో అమ్మాయి అడగ్గా నేనూ రెడీ అంటూ కాఫీ సిప్ చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో చెప్పాడు సుదీప్. చివర్లో సెప్టెంబర్ 28 నుంచి బిగ్బాస్ ప్రారంభం అని ప్రకటించారు. View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
గెస్ట్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్కే ఛాన్స్.. :శివకార్తికేయన్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మదరాసి (Madarasi Movie). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్తో కలిసి శివకార్తికేయన్ ప్రమోషన్స్కు హాజరయ్యాడు.గెస్ట్ రోల్ఈ సందర్భంగా హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. మదరాసి మూవీలో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోను పెట్టుకుంటారు? అని యాంకర్ సుమ అడిగింది. అందుకు శివకార్తికేయన్ ఓ క్షణం ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అని బదులిచ్చాడు. మీపై వచ్చిన రూమర్స్ గురించి చెప్పండి అని సుమ అడిగింది. అందుకు హీరో.. అమరన్ మూవీ టైంలో నేను 8 ప్యాక్ బాడీ చేసినట్లుగా ఫోటో సృష్టించారు. అందులో నా ముఖాన్ని సాగదీశారు. స్టెరాయిడ్స్ వాడానని రూమర్నేను స్టెరాయిడ్స్ వాడటం వల్లే ఆరోగ్యం చెడిపోయిందని రాశారు. అది చూసి లైట్ తీసుకున్నా అని తెలిపాడు. తెలుగు హీరోతో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం వస్తే నానితో కలిసి నటించాలనుందన్నాడు. ఇక మదరాసి విషయానికి వస్తే.. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రుక్మిణి.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభమైందని అప్డేట్ ఇచ్చింది. ఎన్టీఆర్తో మదరాసి హీరోయిన్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ ప్రాంతాలు క్రియేట్ చేసినట్లు ‘డ్రాగన్’ మూవీలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని భోగట్టా! గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.చదవండి: మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి వార్నింగ్ -
మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి హెచ్చరిక
ప్రేమలో ఇన్వెస్ట్ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్ అనే ఓ డేటింగ్ యాప్లో ఉన్నట్లు తెలిపాడు. రణ్వీర్ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి. ప్రేమలో ఇన్వెస్ట్?నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్ బాగోలేదు. కాబట్టి లవ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది. మార్కెట్ బాగోలేదుఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్ మార్కెట్ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్పై ఫోకస్ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్వీర్ షోరే.. గతంలో పూజా భట్ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి2010లో నటి కొంకణసేన్ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్వీర్ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్లో కనిపించాడు. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) తల్లి సరోజ గతేడాది మరణించింది. తల్లి లేదన్న బాధ నుంచి హీరో ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. అది ఆయన మాటలు చూస్తేనే అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్కు హాజరైన సుదీప్ తల్లిని తల్చుకుని ఎమోషనలయ్యాడు. బాధ ఎలా ఉంటుందో అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి దాన్ని అనుభవిస్తున్నాను. మా అమ్మ ఎప్పుడూ హాల్లో ఓ కుర్చీలో కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఇంటికి వెళ్లగానే ఆ కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటోంది!ఎమోషనల్నా ఫోన్లో గ్యాలరీ ఓపెన్ చేసి ఏడాది కిందటి ఫోటోలు చూసినప్పుడు.. అమ్మతో కలిసున్న రోజులు, ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎమోషనలైపోతున్నాను. నాకు తెలియకుండానే ఏడ్చేస్తున్నాను. అన్నింటికంటే కూడా మా నాన్నను ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నాను. అమ్మతో 50 ఏళ్లు కలిసున్నాడు. తనెంత కుమిలిపోతున్నాడో! ఈ బాధ భరించలేకపోతున్నాము అని చెప్పుకొచ్చాడు. కాగా సుదీప్ తల్లి సరోజా 2024 అక్టోబర్ 20న అనారోగ్యంతో కన్నుమూశారు.చదవండి: కాబోయే అత్తకు బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్. -
కాబోయే అత్తకు బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్..
బుల్లితెర నటి కీర్తి భట్ (Keerthi Bhat) సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో తన లైఫ్ జర్నీ చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో వేదన పడింది. ఎవరూ లేని తాను ఓ అనాథ పాపను దత్తత తీసుకుంది. కానీ బిగ్బాస్కు వెళ్లేముందే ఆ పాప చనిపోయింది. ఎన్నో కష్టాలుప్రేమించిన వ్యక్తి అనుమానంతో విషం కక్కుతుంటే బ్రేకప్ చెప్పి ఆ బాధ నుంచి బయటకు వచ్చింది. ఇలా ఎన్నో బాధలను పంటికింద భరిస్తూ యాక్టింగ్ అనే టాలెంట్నే నమ్ముతూ బతికేస్తోంది. రెండేళ్ల క్రితం కీర్తి, హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాబోయే కోడలు వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా.. మాకు పాప ఎందుకు, నువ్వే మాకు పాప.. కావాలంటే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుందాం అని విజయ్ పేరెంట్స్ కీర్తితో అన్నారు.అత్తకు సర్ప్రైజ్ఈ విషయాన్ని కీర్తి ఓ షోలో చెప్తూ.. అలాంటి అత్తమామలు దొరకడం తన అదృష్టం అంటూ వారిలోనే తన పేరెంట్స్ను చూసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. తాజాగా తనకు కాబోయే అత్తకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె పుట్టినరోజునాడు చిన్న ప్రైవేట్ థియేటర్ బుక్ చేసింది. అక్కడికి అత్తమామను తీసుకెళ్లి వారితో కేక్ కట్ చేయించింది. తర్వాత వాళ్లతో కలిసి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే అత్తమ్మా.. నీ నవ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని కీర్తి క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: బిగ్బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్! -
గుడ్ న్యూస్ చెప్పిన ఇలియానా.. ఇప్పుడే కాదు కానీ..
ఇలియానా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు..ఇలా స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే పిల్లలు పుట్టడంతో గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇలియానా రీఎంట్రీ ఇస్తే బాగుండని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇలియానా(Ileana D'cruz). త్వరలోనే మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇస్తానని చెప్పింది.తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తల్లిగా పూర్తి సమయాన్ని నా ఇద్దరి పిల్లలకే కేటాయిస్తున్నాను. ఇప్పుడే సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అభిమానులు నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను. నటన అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానికంటే ముందు నా పిల్లల బాగోగులు చూసుకేనే బాధ్యత నాకుంది. అందుకే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. అయితే అది ఎప్పుడు, ఏ సినిమా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. రీఎంట్రీ ఇచ్చే ముందు నేను మానసికంగానే కాకుండా శారీరకంగానూ కొన్ని మార్పులు చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది’ అని ఇలియానా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఇలియానా వెండితెరపై మెరవనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా, 2006లో దేవదాస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా చేసింది. 2023లో మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకొని..అదే ఏడాది చివరిలో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఈ ఏడాది జులైలో రెండో కొడుకు పుట్టినట్లు ఇలియానా ప్రకటించింది. -
మర్యాదగా నా ఫోటోలను డిలీట్ చేయండి: హీరోయిన్ వార్నింగ్
అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్న ఇ-కామర్స్ వెబ్సైట్లకు హీరోయిన్ సోనాక్షి సిన్హా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వెంటనే వాటిని డిలీట్ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసే సోనాక్షి.. కొన్ని బ్రాండెడ్ వెబ్సైట్లలో తన ఫోటోలను చూసి ఆశ్చర్యపోయానని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.‘నేను ఎక్కువగా ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తుంటాను. ఒక నటిగా కొత్త కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తుంటాను.అలాంటప్పుడు ఆ డ్రెస్ వివరాలు దాని బ్రాండ్కు క్రెడిట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అంతమాత్రనా నా ఫోటోలను మీ వెబ్సైట్లలో వాడుకోవడం ఎంతవరకు ఆమోదయోగ్యం? నన్ను సంప్రదించకుండా, నా అనుమతి లేకుండా నా ఫోటోలను ఎలా ఉపయోగించుకుంటారు? నైతిక బాధ్యత వహించరా? ఇలా చేయడం సరైన పద్దతి కాదు. నేను మీ వివరాలను వెల్లడించకముందే నా ఫోటోలను తొలగించండి. లేదంటే.. చట్టపరమైన చర్యలు తప్పవు’ అని సోనాక్షి వార్నింగ్ ఇచ్చింది. గతంలో అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ కూడా అనుమతి లేకుండా పలు కంపెనీలు తమ ఫోటోలను ఉపయోగించడాన్ని విమర్శించారు.సోనాక్షి కెరీర్ విషయానికొస్తే.. ఆ మధ్య ‘హీరామండీ’ వెబ్సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘నికితా రాయ్’ ఇటీవల రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. -
థియేటర్, ఓటీటీ తేడా చూడను.. కథ, నా పాత్ర నచ్చితే చాలు : శివానీ నాగారం
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో కాత్యాయని అనే కాలేజ్ గర్ల్గా చేశాను. ప్రేక్షకులు తమని తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలోని అఖిల్ (మౌళి తనుజ్ పాత్ర), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే కళాశాల రోజులు, అలాగే విద్యార్థిగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి... మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది’’ అని శివానీ నాగారం తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ నాగారం మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సాయి మార్తాండ్ కథ, నా పాత్ర చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్గా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. మా సినిమా కంటెంట్ నచ్చడంతో ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటిగార్లు రిలీజ్ చేస్తున్నారు. దాంతో మా సినిమా ఓవర్సీస్లోనూ విడుదలవుతోంది. ఇక థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడను. కథ, నా పాత్ర నచ్చితే వెబ్ సిరీస్లు కూడా చేస్తాను. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నేను, సుహాస్ కలిసి ‘హే భగవాన్’ సినిమా చేస్తున్నాం. మరో రెండు చిత్రాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
లలితం... అజరామరం ఆయన పాట!
“రమేశ్ నాయుడు ఈ పదం సంగీత ప్రియులకు అమృతంలా తోస్తుంది. తన వేలి చివరల నుంచి సంగీతాన్ని అలలుగా విసిరేసే స్వర బ్రహ్మ ఆయన! గుండెను లాలించి మత్తులో ఓలలాడించే మెలొడీలు సృష్టించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఈ తరానికి రమేశ్ నాయుడి పేరు తెలియకపోవచ్చు. కానీ “శివరంజని, ‘మేఘ సందేశం’, ‘ముద్ద మందారం’, “శ్రీవారికి ప్రేమలేఖ, “స్వయంకృషి లాంటి సినిమాల కోసం ఆయన స్వరపరిచిన పాటలు మాత్రం సుపరిచితం. మాధుర్య ప్రధానమైన పాటలే కలకాలం నిలుస్తాయని రమేశ్ నాయుడు గట్టిగా నమ్మేవారు. సాహిత్యానికే బాణీలు కట్టేవారు. అందుకే ఆ పదాల సొగసు చెక్కు చెదరదు, భావం నేరుగా మనసును తాకుతుంది.ఇదీ రమేశ్ నాయుడి స్వర ప్రస్థానం!పసుపులేటి రమేశ్ నాయుడు 1933, నవంబర్ 25న కృష్ణాజిల్లా కొండపల్లిలో జన్మించారు. తెలుగు కంటే హిందీ పాటలే ఆయన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న కోరికతో ఇల్లొదిలి బొంబాయి చేరుకున్నారు. కొన్నాళ్ళు ఢక్కాముక్కీలు తిన్నాక బి.ఆర్. చోప్రాను చేరుకోగలిగారు. ఆయన కోరిక మేరకు కొన్ని బాణీలు కట్టారు. అవి చూసి ఆశ్యర్యపోయిన చోప్రా ఆయన్ను AMV కంపెనీకి రికమెండ్ చేశారు. అలా 14 ఏళ్ళ వయసులోనే రమేశ్నాయుడు AMV కంపెనీలో పని చేశారు. 16 ఏళ్ళ వయసులో “బంద్వల్ పహీజ్ఙా అనే మరాఠీ సినిమాకి సంగీతం అందించారు. హిందీలో ఆయన చేసిన ఏకైక సినిమా “హామ్లెట్“. 1954లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం ఆయన్ను నిరాశపరిచింది. ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రమేశ్ నాయుడు మద్రాసు వచ్చేశారు. 1957లో ప్రముఖ నటి సి. కృష్ణవేణి నిర్మించిన “దాంపత్యం సినిమాకు సంగీతం అందించారు. అదే ఆయనకు తొలి తెలుగు చిత్రం.1959లో “మనోరమ సినిమా కోసం హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రమేశ్ నాయుడు ఏకంగా నాలుగు పాటలు పాడించారు. కానీ పేరు వస్తున్న టైంలో కలకత్తాకి మకాం మార్చారు. అక్కడ ఒక బెంగాలీని పెళ్ళి చేసుకున్నారు. అక్కడే పదేళ్ళ పాటు బెంగాలీ, నేపాలీ, ఒరియా సినిమాలకు పని చేశారు.1972లో “అమ్మ మాట సినిమాతో తెలుగులో రమేశ్ నాయు డి ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో సినారె రాసి, ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన మాయదారి సిన్నోడు అనే మత్తెక్కించే పాటను అంతే గమ్మత్తుగా స్వరపరిచారు. 1973లో హీరో కృష్ణ నిర్మించిన “దేవుడు చేసిన మనుషుల్ఙు సినిమాలో విన్నారా అలనాటి వేణుగానం ఎంత హాయిగా ఉంటుందో ఈశ్వరి పాడిన మసక మసక చీకటిలో ఐటమ్ సాంగ్ అంత కవ్విస్తుంది.రాజశ్రీ పాటల రచయితగానే మనందరికీ తెలుసు. కానీ ఆయన సంగీత దర్శకత్వంతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 1975లో ఆయన డైరెక్ట్ చేసిన “చదువుసంస్కారం సినిమాకి రమేశ్ నాయుడు సంగీతం అందించారు. ఇందులోని దీపానికి కిరణం అనే పాట లలితంగా ఉంటుంది.“సీతా ఔర్ గీతాకి రీమేక్ గా నాగిరెడ్డి, చక్రపాణి 1973లో తీసిన “గంగమంగ, అదే ఏడు వచ్చిన “జీవితం సినిమాలు, 1974లో వచ్చిన “చందన నాయుడు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చందన సినిమా కోసం జానకమ్మ పాడిన పొన్నపూలా ఉయ్యాలా అనే పాట నిజంగా పొన్నపూల పరిమళాన్ని వెదజల్లుతున్నంత గొప్పగా ఉంటుంది. ఇందులో ఆయనే స్వయంగా పాడిన ఓ రామ చక్కని బంగారు బొమ్మ కంట తడి పెట్టిస్తుంది.ఆ ముగ్గురు!రమేశ్ నాయుడు స్వర యాత్రను గొప్ప మలుపు తిప్పింది మాత్రం తెలుగు సినిమాకే మూల స్తంభాల్లాంటి ముగ్గురు దర్శకులు! ఆ ముగ్గురు దర్శకరత్న దాసరి నారాయణరావు, హాస్య బ్రహ్మ జంధ్యాల, విజయ నిర్మల! ఈ ముగ్గురు దర్శకుల మొదటి సినిమాలకు స్వర కల్పన చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.దాసరి నారాయణరావుతో...దాసరితో రమేశ్ నాయుడి అనుబంధం 1972లో వచ్చిన “తాతమనవడు సినిమాతో మొదలైంది. దర్శకుడిగా దాసరికి ఇది మొదటి సినిమా. ఇందులో రమేశ్ నాయుడు స్వరం కూర్చి, రామకృష్ణ పాడిన అనుబంధం ఆత్మీయత అనే పాట ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. దాసరి దర్శకత్వం వహించిన “రాధమ్మ పెళ్లి(1974) కోసం రమేశ్ నాయుడు స్వయంగా పాడిన టైటిల్సాంగ్ఆర్ద్రతతో మనసును బరువెక్కిస్తుంది.1976లో బాలచందర్ డైరెక్ట్ చేసిన “అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాను దాసరి తెలుగులో “తూర్పు పడమరగా తీశారు. తమిళ పాటల్నేయథాతథంగా వాడకుండా కొత్త బాణీలు కట్టే స్వేచ్ఛనిచ్చారు. స్వరములు ఏడైనా అంటూ సి. నారాయణరెడ్డి గుప్పించిన తాత్వికతను రమేశ్ నాయుడి బాణీలో అంతే చక్కగా పలికించారు సుశీలమ్మ. ఇందులో ‘శివరంజని నవరాగిణి’ అంటూ సినారె రాసిన క్లిష్టమైన సాహిత్యానికి శివరంజని రాగంలో రమేశ్ నాయుడు చేసిన స్వర కల్పన అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకుంది. ఈ పాటకు కొనసాగింపుగానే 1978లో దాసరి “శివరంజని సినిమా తీశారని చెబుతారు. ఈ సినిమా కోసం జోరు మీదున్నావు తుమ్మెదా అంటూ కల్యాణి రాగంలో సుశీలమ్మ పాడిన పాటను ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేం. నవమి నాటి వెన్నెల నీవు వెన్నెలంత మెత్తగా అనిపిస్తుంది. సందమామ వచ్చాడమ్మా అంటూ చందమామలా చల్లగా తాకే పాట, అభినవ తారవో లాంటి పాటలు రమేశ్ నాయుడి పనితనానికి మచ్చుతునకలు.“చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రభంజనం. దాసం గోపాలకృష్ణ రాసిన నాటకాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారూ దాసరి. ఈ సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే అనే పాటకు రమేశ్ నాయుడికి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వచ్చింది. ఇక చూడు పిన్నమ్మ అనే కొంటె పాట గొప్ప ట్రెండ్క్రియేట్చేసింది.దాసరి డైరెక్షన్ లో వచ్చిన “కల్యాణి (1979) కోసం దాసం గోపాలకృష్ణ రాసిన గుబులు పుట్టిస్తావు అనే పాటలో నాయుడు గారు ఒకే సాహిత్యాన్ని రెండు బాణీలతో పలికించి గొప్ప ప్రయోగం చేశారు. ఇందులోనే లలిత కళారాధనలో అనే పాట చిరస్థాయిగా నిలిచిపోయింది.1982లో దాసరి, రమేశ్ నాయుడు కాంబినేషన్ లోనే వచ్చిన సినిమా “జయసుధ, నాయుడు గారికి బాగా నచ్చిన రాగాల్లో ఒకటైన కల్యాణిలో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లో ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో అంటూ సినారె చిక్కటి పదాలతో చక్కటి కవితలల్లారు. ఇదే సినిమాలో గోరువెచ్చని సూరీడమ్మా అనే పాట తేలికైన మాటలతో హాయిగా సాగిపోతుంది.1983లో దాసరి, రమేశ్ నాయుడు, అ కాంబినేషన్ లో రెండు గొప్ప సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి “బహుదూరపు బాటసారి అయితే రెండోది “మేఘ సందేశం! పాటల తేనెపట్టు లాంటి ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మకరందపు చుక్క. ఆకులో ఆకునై పాట వినని తెలుగువారుండరేమో! కృష్ణశాస్త్రి కవితను రమేశ్ నాయుడు ఇలా అద్భుతంగా మలిచారు. దేవులపల్లి వారే రాసిన ముందు తెలిసెనా ప్రభూ, సిగలో అవి విరులో, శీతవేళ రానీయకు లాంటి పాటలు, వేటూరి విరచించిన నిన్నటి దాకా శిలనైనా లాంటి స్వర ముత్యాలు, రాధికా కృష్ణా, ప్రియే చారుశీలే వంటి జయదేవుని అష్టపదుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాడనా వాణి కల్యాణిగా అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట ఆయనకు శాస్త్రీయ సంగీతంతో సమానమైన పేరు తెచ్చి పెట్టింది.ఈ పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఆకాశ దేశాన మరో ఎత్తు. జేసుదాస్ పాడిన ఈ పాట నాయుడు గారికి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. ఈ పాట రాసిన వేటూరి వారు కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయన రికార్డింగ్ కి వెళ్ళే టైంకి స్టూడియోలో అతి తక్కువ వాయిద్యాలు ఉన్నాయట. ఈ కొన్ని వాయిద్యాలతో నాయుడు గారు సంగీతం ఎలా పుట్టిస్తారో చూద్దాం అనుకున్నారట. కానీ కాసేపటికి జేసుదాస్ గొంతులో నుంచి తను రాసిన సాహిత్యం అత్యద్భుతమైన పాటగా జాలువారడం చూసి పులకించిపోయారట.విజయ నిర్మలతో...1973లో వచ్చిన “మీనా విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఈ సినిమా విజయంలో రమేశ్ నాయుడు స్వరపరిచిన మల్లె తీగ వంటిది ఎంత హాయిగా ఉంటుందో పెళ్ళంటే నూరేళ్ళ పంట అంత విషాదాన్ని పలికిస్తుంది. శ్రీరామ నామాలు శతకోటి అన్న పాట మెత్తగా మనసును మీటుతుంది.విజయ నిర్మల దర్శకత్వం వహించిన “దేవదాసు(1974) కమర్షియల్ హిట్ కాకపోయినా ఆరుద్ర రాసి, రమేశ్ నాయుడు స్వరపరిచిన కల చెదిరింది, పొరుగింటి దొరగారికి పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.ఏఎన్నార్, కృష్ణ హీరోలుగా విజయ నిర్మల డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ “హేమాహేమీలు(1979). ఇందులోని ఏ ఊరు ఏ వాడ, నువ్వంటే నాకెంతో ఇష్టం అనే రెండు క్లబ్ సాంగ్స్బాగా పాపులర్అయ్యాయి.1980లో విజయ నిర్మల డైరెక్ట్చేసిన “సంఘం చెక్కిన శిల్పాలు కోసం రమేశ్ నాయుడి స్వర కల్పన పలికెను ఏదో రాగం అన్నట్లు హాయిగా సాగిపోతుంది. ఈ సినిమా కోసం 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత రావు బాల సరస్వతి పోయి రావే అమ్మా అనే పాట పాడారు.ఇక రమేశ్ నాయుడు, విజయ నిర్మల కాంబినేషన్ లోనే వచ్చిన “భోగిమంటలు (1981) సినిమాలలో భోగి మంటల పాట, అరవైలో ఇరవై వచ్చింది అనే పాట కూడా జనానికి బాగా గుర్తుండిపోయాయి.జంధ్యాలతో...జంధ్యాలతో నాయుడి గారి స్వర యాత్ర విలక్షణమైనది. కామెడీ, మెలొడీ కలగలిపిన చక్కటి కలబోత ఈ ఇధ్దరిది. దీనికి వేటూరి కలం తోడైతే ఇక చెప్పేదేముంది? 1981లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “ముద్ద మందారం. ఇందులోని ముద్దుకే ముద్దొచ్చే, అలివేణీ ఆణిముత్యమా, నీలాలు కారేనా లాంటి పాటలు సినిమాని ఎవర్గ్రీన్గా మార్చాయి.మనసా తుళ్ళిపడకే అమృతం ఒలికే ఈ పాట “శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోనిది. సప్త స్వరాలతో నిండుగా మోగే సరిగమపదని స్వరధార అనే పాట నాయుడు గారి సంగీత జ్ఞానానికి మచ్చుతునక. సాహిత్యానికే బాణీలు కట్టే ఆయన ఈ పాటలో వేటూరి వారు ప్రస్తావించిన అన్ని రాగాలకూ న్యాయం చేస్తూ అద్భుతమైన రాగమాలికను వెలయించారు.కళాతపస్వి ప్రేరణతో జంధ్యాల తీసిన సినిమా “ఆనంద భైరవి. పిలిచిన మురళికి అంటూ మువ్వలా మోగే పాటకు రమేశ్ నాయుడు ఆనంద భైరవి రాగంలో స్వరం కూర్చితే, వేటూరి అందమైన ఆ మాటకు పల్లవిలోనే చోటిచ్చేశారు. నెమ్మదిగా సాగే ఆనంద భైరవి రాగంలో ఇంత వేగంగా పాటను కూర్చడం గొప్ప ప్రయోగమని చెబుతారు.ముళ్ళపూడి వారి రెండు జెళ్ళ సీత పాత్ర పేరుతోనే జంధ్యాల 1983లో “రెండు జెళ్ళ సీత అనే సినిమా తీశారు. ఇందులోని కొబ్బరి నీళ్ళా జలకాలాడి అనే అల్లరి పాటను రమేశ్ నాయుడు ఎంత అందంగా మలిచారో! ఇందులోనే మందారంలో మధురిమలై, రెండు జెళ్ల సీత తీపి గుండె కోత లాంటి పాటలు కూడా శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.అలక పానుపు ఎక్కనేల అనేది “శ్రీవారి శోభనం సినిమాలోని పాట. ఈ పాటలో పడుచు పిల్లకు, పండు ముసలికి జానకమ్మతోనే పాడించారు రమేశ్ నాయుడు గారు. ఇందులోనే చంద్ర కాంతిలో చందన శిల్పం అన్న పాటలో అటు వేటూరి వారి మాటలు, ఇటు నాయుడు గారి బాణీ వెన్నెల విరజిమ్ముతాయి.నువు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు ఒక ప్రియుడు ప్రియురాలిని పొగడ్డానికి ఇంత కంటే గొప్ప మాటలు కావాలా? 1985లో జంధ్యాల తీసిన “మొగుడు పెళ్ళాలు సినిమా కోసం వేటూరి రాశారీ పాట. అంతే అందంగా స్వరాలు కూర్చారు రమేశ్ నాయుడు.జంధ్యాల, రమేశ్ నాయుడు, వేటూరి వారి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అహ నా పెళ్ళంట. 1987లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయి లాంటిది. కథలోకి చక్కగా ఇమిడిపోయేలా రమేశ్ నాయుడు కూర్చిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.వేటూరి ఏమన్నారంటే...రమేశ్ నాయుడితో ఉన్న ఆత్మిక బంధాన్ని వేటూరివారు తను రచించిన “కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. అభూత కల్పనలు అక్షర సత్యంగా మారిన అపురూప సంఘటన పేరే “రమేశ్నాయుడు అంటూ ఆయన పరిచయ వాక్యాలు రాసుకున్నారు. “నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయన కోసం రాసిన పడవ పాట ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది అంటూ “ఆశాజ్యోతి లోని ఏరెల్లిపోతున్నా నీరుండిపోయింది అన్న పాటను గుర్తు చేసుకున్నారు.మరికొన్ని స్వర ముత్యాలు!పెద్దగా ఆడని కొన్ని సినిమా లు రమేశ్ నాయుడి బాణీల వల్ల గుర్తింపు వచ్చిన సందర్భాలున్నాయి. 1979లో విడుదలైన “మంగళ తోరణాలు అనే సినిమాలో సుశీలమ్మ ఏమయ్యిందంటే నే చెప్పలేను అంటే బాలు ఏమీ కాలేదంటే నేనొప్పుకోను అని బదులిచ్చే తీరు శ్రోతలను సమ్మోహనపరుస్తుంది.70ల్లో సుశీలమ్మ, 80ల్లో జానకమ్మ నాయుడు గారి పాటలకు ఊపిరి పోశారు. ఆయన సంగీత దర్శకత్వంలో శైలజ పాడ్డం తక్కువే. అలా ఆవిడ పాడిన అతి కొన్ని పాటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది “కొత్త నీరు సినిమాలోని ఊగిసలాడకే మనసా అనే పాట.ఇక 1980లో దాసరి సమర్పించిన “సుజాత అనే సినిమాలో ఉంగరం పడిపోయింది. అనే పాటను నాయుడు గారు చాలా సరదాగా కంపోజ్ చేశారు. పాటంతా ‘పోతే పోనీ’ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది.1985లో విడుదలైన ‘సువర్ణ సుందరి ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమాలోని ఇది నా జీవితాలాపన పాటకుగాను నాయుడు గారు, బాలు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఊహవో ఊపిరివో పాట కూడా మనసును రంజింపజేస్తుంది.కళాతపస్వితో...1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “స్వయంకృష్ఙి రమేశ్ నాయుడి ఆఖరి సినిమా. ఈ సినిమాలో ఆయన పారా హుషార్ అంటూ హుషారెత్తిస్తారు, సిగ్గూ పూబంతి అంటూ సిగ్గుల మొలకలేయిస్తారు. ఇక సిన్నీ సిన్నీ కోరికలడగా అయితే జానకమ్మ గొంతులో హాయిగా సాగిపోతుంది. రమేశ్ నాయుడు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంబినేషన్ లో వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఇది చెప్పుకోదగ్గది.“స్వయంకృషి సినిమా సాధించిన ఘన విజయం చూడకుండానే రమేశ్ నాయుడు సినిమా రిలీజ్ అయిన రోజునే అంటే 1987 సెప్టెంబరు 3న, 54 ఏళ్ళ వయసులో సుదూర స్వర తీరాలకు తరలిపోయారు. ఆయన మరికొంత కాలమున్నా... మొదటి నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైనా, మన పాటల దశ, దిశ మరోలా ఉండేదేమో!మెరుపులా మెరిశావు... వలపులా కురిశావు...కన్నుతెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు!వేటూరి రాసిన ఈ పదాలు రమేశ్ నాయుడి స్వర యాత్రకు చక్కగా సరిపోతాయి. అద్భుతమైన స్వర నిధులను రాశిగా పోసిన ఆయన శ్రోతలు తేరుకునేలోపే మాయమైపోయారు కదా మరి!- శాంతి ఇశాన్ -
ముద్దంటే చేదే అంటున్న స్టార్స్... ఎందుకు?
ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణమయ్యాయి. ముఖ్యంగా లిప్కిస్ సీన్స్ అయితే దాదాపుగా సగం సినిమాల్లో అంతకన్నా ఎక్కువగా వెబ్సిరీస్లలో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మన భారతీయ సంప్రదాయ జీవనశైలి దృష్ట్యా ఇప్పటికీ ఆ తరహా దృశ్యాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునో లేక వ్యక్తిగతంగా అసౌకర్యంగా అనిపించో పలువురు సినీ తారలు తాము అలాంటి దృశ్యాలు, ముఖ్యంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించమనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా దక్షిణాది నటుడు విశాల్ కూడా చేరారు. ఇటీవలే తన పెళ్లి నిశ్చితార్ధం చేసుకున్న ఈ హీరో ఇకపై తెర ముద్దులకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.అలా ఆన్ స్క్రీన్ కిస్లకు దూరంగా ఉండే నటుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన ఎప్పటినుంచో లిప్కిస్ సీన్ల కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటువంటి సన్నివేశాలు తనకు అసౌకర్యకరం అనిపిస్తాయనీ, తన అభిమానులు కూడా కుటుంబంతో కలిసి చూడలేరని అంటున్నాడు. అదే విధంగా తొలినాళ్ల నుంచీ షారూఖ్ ఖాన్ కూడా అదే బాటలో ఉన్నాడు. అయితే జబ్ తక్ హై జాన్ , జీరో సినిమాల్లో మాత్రం దర్శక నిర్మాతల కోరిక మేరకు తప్పనిసరై చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక మళయాళ స్టార్ ఉన్నీ ముఖుందన్ కూడా ఆన్ స్క్రీన్ కిస్సింగ్కు విముఖమే. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం వల్ల అలాంటి స్క్రిప్ట్స్ ఆయన దగ్గరకు రావు. ప్రేమ ప్రదర్శనకు కిస్ తప్పనిసరి కాదంటున్న ఆయన; కుటుంబ ప్రేక్షకులందరు చూడగలిగే చిత్రాలు మాత్రమే చేస్తానంటున్నాడు. అయితే మార్కో పేరుతో ఈ హీరో భయంకరమైన హింసను చూపించడంతో కుటుంబ సమేతంగా వచ్చిన వారు ధియేటర్లు వదిలి వెళ్లిపోవడం గమనార్హం. నటి జెనీలియాలాగే ఆమె భర్త నటుడైన రితేశ్ దేశ్ముఖ్ సైతం ముద్దంటే చేదే అంటున్నాడు. మన హీరోల్లో శర్వానంద్ది కూడా ఇదే పంథా అయితే మహా సముద్రం వంటి ఒకటి రెండు సినిమాల్లో మాత్రం కొంచెం పక్కకి జరిగినట్టు కనిపిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబులతో లిప్ టు లిప్ టచ్ చేసిన కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి అనంతరం పెదాలపై ముద్దులకు నో అని చెప్పేసింది. అలాగే మహానటి సినిమా ద్వారా సాధించిన క్లీన్ ఇమేజ్ను కాపాడుకుంటూ కీర్తి సురేష్ కూడా వాటికి దూరంగానే ఉంటోంది. ఒక తెలుగు చిత్రంలో కధ ప్రకారం లిప్–కిస్ సన్నివేశం ఉందని చెప్పడంతో ఆమె ఆ సినిమా అవకాశాన్ని కాదనుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా నో కిస్సింగ్ ప్లీజ్ అంటున్నారు. దాదాపు 18ఏళ్ల పాటు లిప్ కిస్లకు, మితిమీరిన ఎక్స్పోజింగ్కు దూరంగా ఉన్న తమన్నా ఇప్పుడు ఆ రెండింటికీ సై అంటున్నారు. దక్షిణాది హీరో హీరోయిన్లు ఇంకా ఈ ముద్దు సీన్ల విషయంలో ముదిరిపోయినట్టు కనిపించడం లేదు గానీ బాలీవుడ్ మాత్రం ఓ రేంజ్లో ముదిరిపోయింది.ఈ సందర్భంగా ఈ కిస్సింగ్ సీన్లకు సంబంధించి హీరో హీరోయిన్లు అందరూ ఒకెత్తయితే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఒక్కడే ఒకెత్తుగా చెప్పాలి. సినిమాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ తెరపై ముద్దుల పంట పండిస్తున్న ఈయన సీరియల్ కిస్సర్ కిరీటం అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా నిలిచాడు. ముద్దులు పెట్టి పెట్టి ముఖం మొత్తిందో లేక కొత్తగా వచ్చిన భార్య తిట్టిందో గానీ ఈ హీరో ఇక లిప్ కిస్లకు నో అంటూ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ ఏడేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత కాలం క్రితం వరకూ కఠినంగానే అమలు చేసిన ఇమ్రాన్ ఆ తర్వాత తన నిర్ణయానికి కొన్ని సవరణలు చేశాడు. ‘‘కండలు చూపించని సల్మాన్ను ముద్దులు కురిపించని ఇమ్రాన్ను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు’’ అంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆయన... తన భార్య కోరిక మేరకు ఎడా పెడా ఆ సీన్లు చేయనని. తప్పనిసరైతేనే ఓకే అంటానంటున్నాడు. -
అందుకే తెలుగు సినిమాలకు రూ. 1000 కోట్లు వస్తున్నాయి : శివ కార్తికేయన్
‘‘నా సినిమాలు ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’, ‘మహావీరుడు’, ‘అమరన్’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ‘మదరాసి’(Madharaasi ) సినిమాను కూడా ఆదరించాలి. విజయం కంటే మీరు (ప్రేక్షకులు) చూపించే ప్రేమే నాకు చాలా ప్రత్యేకం’’ అని శివ కార్తికేయన్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ , రుక్మిణీ వసంత్ జోడీగా నటించిన చిత్రం ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. (చదవండి: ఈ వ్యక్తిత్వం మీరు.. తండ్రిని గుర్తు చేసుకుని ఎన్టీఆర్ పోస్ట్)హైదరాబాద్లో నిర్వహించిన ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ కార్తికేయన్(Sivakarthikeyan) మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, మహేశ్బాబుగార్లను డైరెక్ట్ చేసిన మురుగదాస్గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా నిర్మాత తిరుపతి ప్రసాద్గారు మంచి కంటెంట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. నిర్మాతగా ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం.. అందుకే తెలుగులో తరచుగా వెయ్యికోట్ల కలెక్షన్స్ రాబడుతున్న చిత్రాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.(చదవండి: ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ) ‘‘మా సినిమా ఆరంభంలో రుక్మిణి అప్కమింగ్ హీరోయిన్ . కానీ, ఇప్పుడు ఎన్టీఆర్– ప్రశాంత్నీల్ సినిమా, యశ్ ‘టాక్సిక్’, రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్ వంటి చిత్రాలు చేస్తున్నారు’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ‘‘మదరాసి’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రుక్మిణీ వసంత్. -
అలా డిమాండ్ చేయడంలో అర్థం లేదు : బన్నీ వాసు
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్ర కథ బాగుంది. యూత్ కంటెంట్తో మంచి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత ఉండదు.. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. మా చిత్రం చూసి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు’’ అని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్పై ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ–‘‘సినిమాలకు ప్రేక్షకులు రావాలని మనం డిమాండ్ చేయడంలో అర్థం లేదు. సినిమా బాగుంటే వాళ్లే వస్తారు. మల్టీప్లెక్స్లో ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది నిజమే. అయితే మూవీ బాగుంటే ప్రేక్షకుడు ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోజుకి ఐదు షోలు వేయాలని ప్రభుత్వం ఆదేశించినా పాటించడం లేదు.. ఇక్కడ నిబంధనలు ఎన్నో ఉంటాయి. కానీ, పాటించడమే అసాధ్యం’’ అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘బన్నీ వాస్గారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. దానికి తగినట్లే నిర్మాతలూ మారాల్సి ఉంది’’ అని తెలిపారు. -
తను లేకుండా ఇకపై ఏ సినిమా చేయను: కూలీ డైరెక్టర్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. మానగరం, ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో వరుస బ్లాక్బస్టర్స్ కొట్టి ఇతడు ఇటీవలే కూలీ సినిమా తెరకెక్కించాడు. రజనీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన ఈ మూవీ దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది.ఆయన లేకుండా సినిమా చేయనుతాజాగా ఈయన కోయంబత్తూరులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశాడు. మీ సినిమాల్లో సంగీతం కోసం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయం కోరతారా? అన్న ప్రశ్నకు లోకేశ్ ఇలా స్పందించాడు. నేను అనిరుధ్ లేకుండా ఏ సినిమా చేయను. ఒకవేళ అతడు సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే అప్పుడు ఏఐ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు లేవు అని చెప్పాడు.అది జరగకుండానే డైరెక్టర్ అయిపోయాఇదే సదస్సులో లోకేశ్ ఇంకా మాట్లాడుతూ.. నేను రూ.4వేలతో షార్ట్పిలిం చేశా. కెమెరా ఎవరిదగ్గరైతే ఉందో వాడే సినిమాటోగ్రాఫర్, ల్యాప్టాప్ ఉన్నవాడే ఎడిటర్. కాబట్టి ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు పెద్ద బడ్జెట్లు అవసరం లేదు. ఎవరైనా దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకున్నాను. కానీ అది జరగకుండానే డైరెక్ట్ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. కాగా లోకేశ్ తెరకెక్కించిన మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలకు అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహించాడు. Director #LokeshKanagaraj drops a BIG STATEMENT! 😮"In future as well, I wouldn't do any films without @anirudhofficial" pic.twitter.com/nTicUPOWCZ— Anirudh FP (@Anirudh_FP) September 1, 2025చదవండి: బిపాసా బసు వివాదం.. మరో స్టార్ హీరోయిన్పై మృణాల్ ఠాకూర్ -
ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉంటారు: హీరో
విజయ రామరాజు ప్రధాన పాత్ర పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakrabarty). విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించగా శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమా సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.ఆరేళ్ల కష్టం..ఈ సందర్భంగా డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ.. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే ఇంకా చాలామంది సినిమా చూడలేదు. ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే ఇలాంటి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి. హీరో విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమాకోసం పనిచేశారు. ఈ సినిమా కోసం హీరోయిన్ సిజా రోజ్ ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది అని తెలిపాడు.నా గుండెల్లో ఉంటారుహీరో విజయరామరాజు మాట్లాడుతూ.. మాకు సపోర్ట్ చేసిన హనురాఘవపూడి గారికి, వెట్రిమారన్ గారికి, అడివి శేష్ గారికి, సంపత్ నంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను ఏదైనా పెర్ఫార్మన్స్ చేశాను అంటే ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మా నిర్మాత శ్రీని గారు లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. ఆరేళ్లుగా ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉంటారు అని పేర్కొన్నాడు.చదవండి: ఓటీటీకి మంచు విష్ణు కన్నప్ప.. డేట్ ఫిక్స్ -
పోలీస్ స్టేషన్లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్
కెరీర్ మొదట్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma). తర్వాత ట్రాక్ తప్పి అన్నీ ఫ్లాపులే తీశాడు. ఇటీవలే తన తప్పు తెలుసుకున్న ఆర్జీవీ.. ఇకపై మంచి సినిమాలే చేస్తానని శపథం చేశాడు. అప్పుడే సిండికేట్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ తర్వాత సిండికేట్ గురించి మళ్లీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దాన్ని పక్కనపెట్టి ఓ హారర్ సినిమా చేస్తున్నాడు. అదే పోలీస్ స్టేషన్ మే భూత్. యు కాంట్ అరెస్ట్ ద డెడ్ అన్నది క్యాప్షన్!కాంబినేషన్ రిపీట్బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది! ఇందులో జెనీలియా హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా పోస్టర్ గ్లింప్స్ను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరి వల్లయినా మనకు భయం వేస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం.. మరి పోలీసులే భయపడితే వాళ్లెక్కడికి పరుగుతీస్తారు? అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ గ్లింప్స్ ఏఐ వీడియో అని తెలుస్తోంది.కథ అదేనా?పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమా విషయానికి వస్తే.. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ చనిపోతారు. వాళ్లందరూ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్స్టర్స్ పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే సినిమా కథ అని తెలుస్తోంది! A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot pic.twitter.com/eMOyusT8iy— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025 చదవండి: జున్ను కాలికి ఫ్రాక్చర్.. అర్ధరాత్రి నొప్పితో ఏడుపు.. చూడలేకపోయా! -
జున్ను కాలికి ఫ్రాక్చర్.. అర్ధరాత్రి నొప్పితో ఏడుపు.. చూడలేకపోయా!
టాలీవుడ్ హీరో నాని (Nani) సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి తప్పకుండా సమయం కేటాయిస్తాడు. కుటుంబంతో కలిసి వెకేషన్స్కు వెళ్లడమే కాకుండా పండగలను కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇటీవల వినాయక చవితి రోజు నాని తన ఫ్యామిలీతో గణపతి పూజ చేశాడు. ఈ పూజలో నాని కుమారుడు అర్జున్ శ్లోకాలు చదివాడు. అర్జున్ను నాని ముద్దుగా జున్ను అని పిలుచుకుంటాడు.జున్ను కాలికి ఫ్రాక్చర్అయితే ఇటీవల జున్ను కాలికి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయిందట! ఆ విషయాన్ని నాని 'జయమ్ము నిశ్చయమ్మురా' షోలో వెల్లడించాడు. నాని మాట్లాడుతూ.. పిల్లలకు దెబ్బ తగిలినా, ఏదైనా జబ్బు చేసినా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ సమయంలో వారి ముఖం చూడలేము. గతేడాది జున్ను సైకిల్ మీద నుంచి పడటంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. కాలు కాస్తంత పక్కకు జరిపినా సరే.. నొప్పి అని విలవిల్లాడిపోయేవాడు. వాడు కదలడానికి లేదు, లేవడానికి లేదు. బాత్రూమ్కు కూడా మేమే తీసుకెళ్లేవాళ్లం. ఒక్కోసారి అర్ధరాత్రిళ్లు లేచి నొప్పిగా ఉందని ఏడ్చేవాడు.అర్ధరాత్రి లేచి సారీ చెప్పాడువాడిని చూసుకునే క్రమంలో అంజుకు, నాకు సరిగా నిద్రుండేది కాదు. ఒకరోజు రాత్రి జున్ను సడన్గా లేచి నా చేయి పట్టుకుని సారీ నాన్న అన్నాడు. నాకెందుకు సారీ చెప్తున్నావురా? అంటే నా వల్ల మీ అందరికీ నిద్ర ఉండట్లేదు కదా అన్నాడు. అంత చిన్న పిల్లాడికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో అంటూ హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సినిమాల విషయానికి వస్తే.. నాని చివరగా హిట్: ద థర్డ్ కేస్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani)చదవండి: సూపర్స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే? -
సీక్రెట్గా పెళ్లి.. తొలిసారి భర్తతో మీడియా ముందుకు హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి (Nargis Fakhri) ఈ ఏడాది ఫిబ్రవరిలో సీక్రెట్గా పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony Beig)ను పెళ్లాడింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో వివాహ తంతు పూర్తి చేసుకుని అట్నుంచటే కొత్త దంపతులు స్విట్జర్లాండ్ వెళ్లారు. అయితే తనకు మ్యారేజ్ అయిందని నర్గీస్ ఎక్కడా చెప్పలేదు, అలాగే పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయలేదు. ఇంతవరకు జంటగా కనిపించిందీ లేదు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తొలిసారి భర్తతో కనిపించిందీ బ్యూటీ. ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఆగస్టు 30న జరిగిన ఓ కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది.పెళ్లయ్యాక తొలిసారి..వీరితో కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan) కూడా జత కలిసింది. రెడ్ కార్పెట్పై నర్గీస్, ఫరా ఖాన్ జంటగా ఫోటోలు దిగారు. అనంతరం ఫరా.. నీ భార్య పక్కన వచ్చి నిల్చో అంటూ టోనీని పిలిచింది. దీంతో వారిద్దరి పెళ్లి జరిగిపోయిందని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. నర్గీస్ ఫక్రి.. మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్ఫుల్ 3, అమావాస్... తదితర సినిమాల్లో నటించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ అలరించింది. చివరగా హౌస్ఫుల్ 5 మూవీలో కనిపించింది. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.288 కోట్లు రాబట్టింది. View this post on Instagram A post shared by Buzzzooka Prime (@buzzzookaprime) -
రూ. 40 కోట్ల బడ్జెట్..300 కలెక్షన్స్.. ఆస్తులన్నీ అమ్ముకున్నాం : డైరెక్టర్
పాన్ ఇండియా హీరోలు..స్టార్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్.. ఇవన్నీ ఉన్నా కూడా థియేటర్స్కి ప్రేక్షకులు రాలేకపోతున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే కాస్తో కూస్తో జనాలు థియేటర్స్కి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యానిమేషన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. అదే ‘మహావతార్ నరసింహా’.బడా చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే.. ఈ మూవీ మాత్రం ఐదు వారాలుగా థియేటర్స్లో సందడి చేస్తూనే ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తీసే క్రమంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.దేవుడిని నమ్మేవాడిని కాదు..మాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లో దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడే ఉంటే..కొందరికి కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించేవాడిని. అయితే కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు రావడంతో కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలు, భగవద్గీతా చదివాను. దీంతో నేను కృష్ణ భక్తిడిగా మారిపోయా. అప్పుడే వీఎఫ్ఎక్స్ ఉపయోగించి త్రీడీలో ప్రహ్లాదుడు-నరసింహా స్వామి కథను తీయాలనుకున్నా. దాదాపు ఐదేళ్ల క్రితం మహావతార్ నరసింహ కథకి బీజం పడింది.ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఈ సినిమా కోసం మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మొదట్లో మా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిదంతా కొన్నాళ్లకే అయిపోయింది. నా భార్య దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ సినిమాకే ఖర్చు చేశాం. బడ్జెట్ ఊహించనంత పెరిగిపోయింది. ఇన్వెస్టర్లను వెతికాం. కొంతమంది పెట్టుబడి పెడతామని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. అలా దాదాపు వంద మందికి పైగా నిర్మాతలను, ఇన్వెస్టర్లను కలిశాం. చివరకు నా భార్య నగలు, కారు, ఇష్టంగా కట్టుకున్న ఇళ్లు కూడా అమ్మేసి సినిమా నిర్మాణానికి ఖర్చు చేశాం.ఎవరు చూస్తారంటూ భయపెట్టారుసినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. రోజుకు 16 గంటలు పని చేసేవాళ్లం. నెలాఖరు రాగానే టీమ్ జీతాల కోసం ఎక్కడ అప్పులు తేవాలని నా భార్య ఆలోచించేంది. ఇలా మా అవస్థలేవో మేం పడుతుంటే.. మరికొందరు ‘దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు.. సినిమా పోతే మీ పరిస్థితి ఏంటి? అని కొంతమంది భయపెట్టేవాళ్లు. కానీ నా భార్య, నేను ఒక్కటే అనుకున్నాం. ఒకవేళ సినిమా పోతే.. ‘అది మన ఖర్మ’ అనుకొని వదిలేసి.. గతంలో మాదిరి మళ్లీ వీఎఫ్ఎక్స్ పనులు చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాం. చాలా ఇబ్బందులు పడి జులై 25న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల వరకు రాబట్టింది. మా ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది’ అని అశ్వి కుమార్ అన్నారు. -
ది కంజురింగ్: లాస్ట్ రైట్స్.. రియల్ స్టోరీ!
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ఇంతకుముందు వచ్చిన కంజురింగ్ ఫ్రాంచైజ్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ ఫ్రాంచైజ్లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ది కంజురింగ్: లాస్ట్ రైట్స్. మైఖెల్ చావ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని న్యూ లైన్ సినిమా సమర్పణలో ది సఫ్రాన్ కంపెనీ, యాన్ అటామిక్ మాన్స్టర్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు చిత్ర కింది వివరాలను తెలిపారు. ఇది 1980–90 మధ్య జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం అని చెప్పారు. ఇంతకుముందు వచ్చిన కంజురింగ్ ఫ్రాంచైజ్లో కంటే భారీ బడ్జెట్లో రూపొందిన మూవీ అని పేర్కొన్నారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్కు గురిచేస్తుందన్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లం భాషల్లో విడుదల చేస్తోంది. చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య -
సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం కాదు: రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్.. పేరు వినగానే, హీరోయిన్గానే కాకుండా ఫిట్నెస్ అండ్ హెల్త్ గుర్తొస్తుంది. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఉంటూనే ఉంటాయి. నటిగానే కాకుండా ఆమె ఫిట్నెస్, డ్యాన్స్, స్పోర్ట్స్, సోషల్ యాక్టివిటీస్, ఆంత్రప్రెన్యూర్షిప్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. రకుల్ గురించి ఇంకొన్ని విషయాలు...నాన్న ఆర్మీ ఆఫీసర్రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీలోని సిక్కు కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి కుల్వీందర్ సింగ్ ఆర్మీ ఆఫీసర్గా పని చేసేవారు. దాంతో ఆమె ఆర్మీ స్కూల్లోనే స్కూలింగ్ చేసి, ఆపైన జీసస్ అండ్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. రకుల్ ప్రీత్ జాతీయ స్థాయి గోల్ఫ్ ప్లేయర్. అంతేకాదు, ఎంతో ఆసక్తితో భరతనాట్యం కూడా నేర్చుకుంది. అలాగే ఆమెకు గుర్రపు స్వారీ చేయడం కూడా చాలా ఇష్టం.మోడలింగ్మోడలింగ్ను కెరీర్గా ఎంచుకున్నాక, రకుల్ 18 ఏళ్లకే కన్నడ సినిమా ‘గిల్లి’ ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ‘ఫెమినా’ మిస్ ఇండియా–2011లో రకుల్ ఐదో స్థానంలో నిలిచింది. అందులోనే పాంటలూన్స్ మిస్ ఫ్రెష్ ఫేస్, ఫెమినా మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, పీపుల్స్ చాయిస్ మిస్ ఇండియా టైమ్స్ వంటి టైటిల్స్ గెలుచుకుంది.కోవిడ్ టైంలో..‘మనకంటూ ప్రత్యేకంగా టైమ్ కేటాయించుకోవాలి. ఎవరి సంతోషం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. దానికోసం ఎవరిపైనా ఆధారపడొద్దు’ అన్నది రకుల్ అభిప్రాయం. రకుల్ తన సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరిచిపోలేదు. కోవిడ్ సమయంలో వంద కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా, క్రౌడ్ ఫండింగ్ చేసి పేదలకు డొనేషన్స్ అందించింది. 2017లో రకుల్ ‘తెలంగాణ బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయింది.నాన్న నుంచే వచ్చాయి..2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీ (Jackky Bhagnani)ని గోవాలో వివాహం చేసుకుంది. మొదట ఓవర్సీస్లో పెళ్లి వేడుకలు జరపాలనుకున్నారట! కాని, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలనే ఆలోచనతో గోవాలోనే ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ‘సక్సెస్ అంటే పేరు, డబ్బు కాదు. మనసుకు నచ్చిన పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడం. చిన్నప్పటి నుంచి నాన్న నుంచి వచ్చిన డిసిప్లిన్, పంక్చువాలిటీ నన్ను ఎప్పటికీ హ్యాపీ లైఫ్ వైపే తీసుకెళ్తాయి.ఇష్టందానివల్లే చేయాల్సిన పనిలో రెండు నిమిషాలు ఆలస్యమైనా నాకు ప్యానిక్ అటాక్ వచ్చేస్తుంది. సోషల్ ఎంటర్టైనర్స్ చేయడం నాకు చాలా ఇష్టం. వాటితో సమానంగా సోషల్ రెస్పాన్సిబుల్ సినిమాలూ చేయాలని ఉంది. ఫ్యాషన్, డ్రెస్సింగ్ విషయానికొస్తే, నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే ఎంచుకుంటాను’ అని చెబుతుందిపర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. 2047 నాటికైనా మనమంతా కాలుష్యరహిత దేశంలో ఉంటామని ఆశిస్తున్నాను. ప్రతి భారతీయ పౌరుడు బాధ్యతగా ఉంటేనే ప్లానెట్ ఎర్త్ బాగుంటుంది.– రకుల్ప్రీత్ సింగ్ -
అలా చేయలేను.. అందుకే ‘షో’ కి నన్ను పిలవరు : బిగ్బాస్ ఫేం కీర్తి భట్
బుల్లితెరపై రోజూ రకరకాల షోలు ప్రసారం అవుతుంటాయి. ఒక చానల్లో కామెడీ షో..మరో చానల్లో డ్యాన్స్ షో.. ఇంకో చానల్లో సింగింగ్ షో.. ఇలా నిత్యం పదుల సంఖ్యల్లో షోలు టెలికాస్ట్ అవుతుంటాయి. అయితే ఈ షోలలో ఎక్కువగా సీరియల్ నటీనటులలతో పాటు ‘బిగ్బాస్’ మాజీ కంటెస్టెంట్స్ కనిపిస్తుంటారు. యాంకర్గానో..జడ్జిగానో..టీమ్ లీడర్గానో..లేదా స్పెషల్ గెస్ట్ గానో ఏదో ఒకరకంగా వాళ్లు టీవీల్లో సందడి చేస్తుంటారు. శ్రీముఖి, లాస్య, శివజ్యోతి, అరియానా, శోభా శెట్టి, విష్ణుప్రియ..ఇలా చాలామంది బిగ్బాస్ ప్లేయర్స్ ఇప్పుడు వరుస షోలతో బిజీ అయిపోయారు. కానీ బిగ్బాస్తో ఎంతో పేరు సంపాదించున్న కీర్తి భట్ మాత్రం ఎలాంటి షోలలో కనిపించడం లేదు. బిగ్బాస్ షో టెలికాస్ట్ అయ్యే చానల్లో సైతం ఆమె కనిపించడం లేదు. తాజాగా దీనికి గల కారణాన్ని బయటపెట్టింది కీర్తి భట్. అందరిలానే తాను గ్లామర్ షో చేయనని..వాళ్లు చెప్పినట్లుగా చిన్న చిన్న దుస్తులు ధరించలేనని..అందుకే తనని ఏ షోకి పిలవరని అంటోంది. అడుక్కోవడం నచ్చదునేను గతంలో ఒక ఇంటర్వ్యూలో ‘అమ్మాయిలు గ్లామర్గా ఉంటేనే బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్లు చెప్పినట్లుగా మోకాళ్ల వరకు దుస్తులు వేసుకునే వాళ్లకే అవకాశం ఇస్తారు. నేను అలా చేయలేను. అందుకే నాకు అవకాశాలు రావు’ అని చెబితే కొంతమంది పర్సనల్గా తీసుకొని ఫీలయ్యారు. నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పింది నిజం. అలా అని వాళ్ల డ్రెసింగ్పై కామెంట్స్ చేయడం సరికాదు. నేను అలా వేసుకోలేను. చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు. చాన్స్ ఇవ్వమని నేను ఎవరిని అడిగే రకం కూడా కాదు. అలా అడిగితే ఛీప్ అయిపోతాం. ఎంత కష్టం వచ్చినా ఇంకొకరి సహాయం తీసుకోకూడదనే వ్యక్తిత్వం నాది.ఎవరూ సపోర్ట్ చేయలేదుబిగ్బాస్ వల్ల నా కెరీర్కి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఆ షో వల్ల నేను జనాలకు దగ్గరైన మాట నిజమే. కానీ కెరీర్ పరంగా మాత్రం ఏం యూజ్ కాలేదు. షో ద్వారా వచ్చిన ఫేంతో నాకు అవకాశాలు రాలేదు. టాప్ 5, 10లో ఉన్నవాళ్లను ఆఫర్స్ వచ్చాయి. అలా కొంతమందికి బిగ్బాస్ షో కలిసొచ్చింది. నా వరకు అయితే ఈ షోతో నా కెరీర్లో ఎలాంటి మార్పులు రాలేదు. అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ప్రవర్తను మార్చుకున్నా. బిగ్బాస్కి వెళ్లే ముందు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఎవరు ఎవరికీ లేరు. మనం దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడారు. నేను చాలా త్వరగా మనుషులను నమ్మేస్తాను. కొంచెం మంచిగా మాట్లాడితే నా వాళ్లే అనుకుంటాను. అన్ని చెప్పేస్తా. ఇప్పుడు నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం పోయింది’ అని కీర్తి భట్ చెప్పుకొచ్చింది. కాగా కార్తీకదీపం, మనసిచ్చిచూడు వంటి సీరియళ్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి..బిగ్బాస్ సీజన్ 6లో పాల్గొని.. తనదైన ఆటతీరుతో టాప్ 3 లో స్థానం సంపాదించుకుంది. సింగర్ రేవంత్ ఆ సీజన్ విన్నర్గా నిలిచాడు. -
ధనుష్ కంటే గొప్ప నటులెవరున్నారు?: ఆదిపురుష్ డైరెక్టర్
తమిళ స్టార్ ధనుష్ (Dhanush).. ఎలాంటి పాత్రలోనైనా జీవించేయగలడు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగలడు. అందుకే రెండుసార్లు (ఆడుకాలం, అసురన్ సినిమాలకుగానూ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ చేస్తున్నాడు. ఆదిపురుష్ ఫేం ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు.కలాం బయోపిక్ఈ సినిమాకు కలాం: ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా (Kalam: The Missile Man of India Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. మే నెలలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఓం రౌత్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను కలాంను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన గురించి వెండితెరపై చెప్పినప్పుడు మరెంతో మంది ఇన్స్పైర్ అవుతారు.ధనుష్ ఎందుకంటే?ధనుష్ అద్భుతమైన యాక్టర్. ఆయనకంటే గొప్ప నటుడు మరొకరు లేరు. కలాం బయోపిక్లో నటించేందుకు ధనుష్ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్, టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.సినిమాధనుష్ విషయానికి వస్తే ఇటీవలే శేఖర్ కమ్ముల 'కుబేర'తో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అతడి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై రిలీజ్కు రెడీ అవుతోంది. ఓం రౌత్ విషయానికి వస్తే.. బయోపిక్తోనే దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. బాలగంగాధర్ తిలక్ బయోపిక్ 'లోకమాన్య: ఏక్ యుగపురుష్' మూవీతో దర్శకుడిగా మారాడు. తానాజీ, ఆదిపురుష్ సినిమాలు తెరకెక్కించాడు.చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి! -
అల్లు అర్జున్ ‘ఇంటి’ పేరు ‘అల్లు’ కాదా?. మహేశ్ ‘ఇంటి’పేరు ఘట్టమనేని కాదా?
‘‘మన్నాత్’’ అనగా మనసా వాచా కోరుకున్నవన్నీ నిత్యం జరుగుతాయని వ్యక్తం చేసే ఆకాంక్ష. ‘‘జన్నత్’’ అనగా స్వర్గం అదే క్రమంలో వస్తుంది మన్నాత్ కూడా. ఇంతకీ ఈ మన్నాత్ అనే పదం మన దేశంలో ఇంత పాప్యులర్ కావడానికి కారణం ఏమిటో తెలుసా? అది బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు కావడమే. ఇంటిపేరు అంటే మనం అనుకునేది కాదండోయ్.. సాధారణంగా ఇంటి పేరు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? వంశపారం పర్యంగా మన పేరు కు ముందు వస్తున్న ఇనీషియల్ కదా. వాడుకలో ఎందుకని అలా మారిందో గానీ నిజానికి అది వంశం పేరు. చాలా మంది తమ నివాస భవనాలకు పెట్టుకునే పేర్లను కూడా ఇంటి పేరు అనే పేర్కొంటారు. తాము స్వంతం చేసుకున్న ఇంటికి పేర్లు పెట్టడం అనేది సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలకు కూడా సాధారణమే.గత 2001లో షారుఖ్ ఖాన్ ఒక ‘విల్లా వియెన్నా’ని కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా సెలబ్రిటీల ఇళ్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మన్నాత్. అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అనే స్టేటస్ నుంచి మొదలై ఈ ఇంటి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది.ఈ నేపధ్యంలో మరికొందరు తారలు పెట్టుకున్న ఇళ్ల పేర్లు పరిశీలిస్తే...బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి పేరు కూడా ఆయన లాగే బాగా పాప్యులర్. ఆయన ఇంటి పేరు ‘జల్సా’’‘‘జల్సా’’ అంటే ఆనందం సంబురాలకు ప్రసిద్ధి అనేది మనకు తెలిసిందే. జూహూలో ఉన్న ఈ బంగ్లా, బచ్చన్ అభిమానులకు నిత్య సందర్శనీయ ప్రదేశంగా మారింది.అదే విధంగా మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆయన భార్య సీనియర్ నటి కాజోల్ లు నివసించే ఇంటి పేరు భక్తి భావనలకు చిరునామాగా ఉంటుంది. వీరి ఇంటి పేరు‘శివ శక్తి’’ ఈ పేరులో శివుడి శక్తి తో పాటు దైవ భక్తి కూడా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా రాజకీయ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా నివసించే భవనం పేరు రామాయణ్.. తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలసి వచ్చేలా ఆయన ఇంటికి పేరు పెట్టారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన 27 అంతస్థుల సౌధానికి అంటిల్లా అని నామకరణం చేశారు. బోలెడన్ని విలాసాలు, రహస్య సంపదలు ఉన్న 15వ శతాబ్ధపు ద్వీపం పేరట ఇది.అలాగే బాలీవుడ్ యువ జంట రణబీర్ కపూర్ అలియాభట్లు తాజాగా అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. దీనికి కృష్ణరాజ్ బంగ్లా అంటూ పేరు పెట్టారు. తన నానమ్మ కృష్ణ కపూర్ తాతయ్య రాజ్ కపూర్ ల పేర్లు కలిసి వచ్చేలా అలా నామకరణం చేశారు.ఇక మన టాలీవుడ్ స్టార్స్ సైతం తమ తమ ఇళ్లకు పేర్లు తమ అభిరుచులకు అనుగుణంగా పెడుతున్నారు అయితే ప్రస్తుతానికి అవి మరీ బాలీవుడ్ స్థాయిలో పాప్యులర్ కాకపోయినా, అన్ని విషయాల్లోనూ బాలీవుడ్ని అధిగమిస్తున్న మన టాలీవుడ్ స్టార్స్ ఇంటి పేరు పాప్యులారిటీలోనూ పోటీ పడతారేమో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి బ్లెస్సింగ్ అనే పదం ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఉన్న విశాలమైన ఉద్యానవనం కు అల్లు గార్డెన్స్ అని పేరు పెట్టారు.జూబ్లీహిల్స్లోని తన భవనానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పద్ధతిగా చాలా మంది తెలుగువారి ఇళ్లకు ఉండే పేరును తలపించేలా శ్రీ లక్ష్మీ నిలయం అనే పేరు పెట్టారు. ఇక టాలీవుడ్ రౌడీ...విజయ్ దేవరకొండ మాత్రం ఇంటి పేరునీ తన వంశం పేరునీ ఒకటి చేసేశారు. ఆయన ఇంటికి దేవరకొండ హౌస్ అని పేరు పెట్టడం ద్వారా. -
‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్ ట్వీట్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.(చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, చిరంజీవి, రామ్చరణ్..)‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ సంతాప ప్రకటనపై అల్లు అర్జున్(Allu Arjun ) స్పందించాడు. ‘సంతాపం ప్రకటించినందుకు థ్యాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని బన్నీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. -
‘గోన గన్నారెడ్డి’ పాత్ర నేనే చేయాల్సింది.. : విక్రమ్ ప్రభు
‘‘తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. నేను దర్శకుడిని అవుదామనుకుంటే నటుణ్ణి అయ్యాను. చిరంజీవి, నాగార్జునగార్లకు నేను పెద్ద అభిమానిని. వాళ్ల సినిమాలను ఎన్నోసార్లు థియేటర్స్లో చూశాను. నా అభిమాన హీరోలు ఉన్న టాలీవుడ్లో నేను డైరెక్ట్గా ‘ఘాటీ’ వంటి తెలుగు సినిమా చేయడం ఎగ్జైటింగ్గా అనిపిస్తోంది’’ అని అన్నారు నటుడు విక్రమ్ ప్రభు. అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో దేశీరాజు అనే పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నేను మాట్లాడే భాష నాకు సవాల్గా అనిపించింది. అనుష్కగారికి నేను పెద్ద అభిమానిని. ఆమె తన కళ్లతోనే అన్ని హావభావాలు పలికించగలరు. నిజానికి అనుష్కగారి ‘రుద్రమదేవి’ సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్రను నేనే చేయాల్సింది. కానీ కుదర్లేదు. క్రిష్గారు నా గత సినిమాల్లోని చాలా సన్నివేశాల గురించి చెబుతూ, నన్ను దృష్టిలో పెట్టుకునే దేశీరాజు క్యారెక్టర్ను రాసుకున్నానని చెప్పిన మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ని ఎంజాయ్ చేశాను. మా నాన్నతో (తమిళ నటుడు ప్రభు) స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. కానీ, ఇరికించినట్టుగా ఉండకూడదు. మంచి కథ కుదిరితే చేస్తాం’’ అని అన్నారు. -
హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!
భోజ్పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh).. ఓ స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్ (Anjali Raghav)ను అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరలయింది. హీరోయిన్ అసౌకర్యంగా ఫీలవుతున్నా సరే పదేపదే అతడు ఆమె నడుము తాకాడు. లోలోపల ఇబ్బందిగా ఫీలైనప్పటికీ పైకి మాత్రం అంజలి నవ్వుతూ కనిపించింది. లక్నోలో 'సైయా సేవా కరే' పాట ప్రమోషనల్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది.ఏదో ఉందని చెప్పడం వల్లే..తాజాగా ఈ ఘటనపై అంజలి స్పందించింది. కొందరు నన్ను కూడా తప్పుపడుతున్నారు. ఆమె కూడా ఎంజాయ్ చేస్తోంది, నవ్వుతోంది అని కామెంట్స్ చేశారు. నా అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లు టచ్ చేస్తుంటే నేను సంతోషపడతానా? దాన్ని ఆస్వాదిస్తానని ఎలా అనుకుంటున్నారు? పవన్ సింగ్ నా నడుము దగ్గర ఏదో ఉందన్నారు. నేను నా చీర తట్టుకుందేమో, లేదా జాకెట్ ట్యాగ్ ఏమైనా ఉందా? అని చూస్తున్నాను. ఏడ్చేశా..ట్యాగ్ అలాగే మర్చిపోయానా? ఏంటి? అని నవ్వాను. ఈవెంట్ అయిపోయాక నా టీమ్ను పిలిచి చూడమంటే అక్కడ ఏమీ లేదన్నారు. అప్పుడు నాకు బాధ, కోపం రెండూ తన్నుకుంటూ వచ్చాయి. ఏడ్చేశాను కూడా! అనుమతి లేకుండా ఏ ఆడపిల్లను కూడా తాకకూడదు. అందులోనూ అసభ్యంగా తాకితే అస్సలు ఒప్పుకోము. ఇకపై నేను భోజ్పురిలో పని చేయను అని చెప్పుకొచ్చింది. అంజలి రాఘవ్.. భోజ్పురిలో ప్రైవేట్ సాంగ్స్లో యాక్ట్ చేసింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Anjali Raghav (@anjaliraghavonline) View this post on Instagram A post shared by Anjali Raghav (@anjaliraghavonline) చదవండి: ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్ -
‘జిగ్రీస్’ కి సపోర్ట్గా కిరణ్ అబ్బవరం
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవల ఈ మూవీ టీజర్ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందల లభించింది. ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, కామెడీ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా తొలి పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశాడు.అనంతరం కిరణ్ మాట్లాడుతూ..‘ఈ పాట చాలా ఎనర్జీటిక్గా ఉంది. కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్గా ఉంది, లిరిక్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. టీజర్ నేను ముందే చూశాను, చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, అందుకే కొత్త వాళ్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్తో పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ అన్నారు.బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'మంచి ఫుడ్ తిన్నా క్యాన్సర్.. షోఆఫ్ చేయకు' ట్రోలర్పై నటి ఫైర్
బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal) ఒకప్పుడు క్యాన్సర్ను జయించింది. ఆరోగ్యంగా ఉండేందుకు తను ప్రయత్నిస్తుంటే ఓ వ్యక్తి ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అది చూసిన చవీ మిట్టల్కు ఒళ్లు మండిపోయింది. సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఆమె సరదాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో తను స్వీట్ పొటాటోస్ తింటోంది. అవతలి వ్యక్తి ఫ్రై చేసిన స్నాక్స్ ఇస్తుంటే వద్దని తిరస్కరించింది. అయినా క్యాన్సర్ వచ్చిందిగా!ఈ వీడియో కింద ఓ వ్యక్తి.. నువ్వు ఆరోగ్యానికి మంచివైనవాటిని ఏరికోరి ఎంచుకుని తింటున్నా సరే క్యాన్సర్ (Cancer) వచ్చింది. నీ మీద నువ్వే జోక్ వేసుకున్నట్లు ఉంది. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకో, కానీ షో ఆఫ్ చేయకు. ఎవరినీ ఎగతాళి చేయకు. హెల్తీ ఫుడ్ తింటావో, తినవో అది నీ ఇష్టం. కొంచెం అన్హెల్తీ ఫుడ్ తినమని ఎవరైనా అడిగినప్పుడు దాన్ని మరీ సీరియస్గా తీసుకోనక్కర్లేదు.క్యాన్సర్ అంటే జోకా?సలహాలు అసలే ఇవ్వనక్కర్లేదు అని కామెంట్ చేశాడు. దానిపై చవీ తీవ్రంగా స్పందించింది. క్యాన్సర్ అంటే జోక్ కాదు అని మండిపడింది. మంచి ఆహారపు అలవాట్లు పాటించినప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, క్యాన్సర్ వారియర్స్కు ఈ నెగెటివ్ కామెంట్ పెట్టిన వ్యక్తి తరపున నేను క్షమాపణలు చెప్తున్నా.. ఇలాంటి నెగెటివ్ మనుషుల వల్ల మీ ఆలోచనలు, పద్ధతులు మార్చుకోకండి. నష్టపోతే వదిలేస్తామా?అనారోగ్యం, క్యాన్సర్ అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండదు. మనం చేయాల్సిందల్లా మన జాగ్రత్తలో మనం ఉండటం! వ్యాపారంలో కూడా కొన్నిసార్లు నష్టపోతాం, అలా అని దాన్ని వదులుకోం కదా! ఇదీ అంతే! ఆరోగ్యంగా ఉండేందుకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు విజయం సాధించలేకపోయినంత మాత్రాన వెనకడుగు వేయకూడదు అని రాసుకొచ్చింది. క్యాన్సర్ను జయించిన నటిచవీ మిట్టల్.. 2022 ఏప్రిల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ప్రారంభదశలోనే మహమ్మారిని గుర్తించి వెంటనే చికిత్స మొదలుపెట్టింది. ఆపరేషన్ కూడా చేయించుకుంది. తర్వాత క్యాన్సర్ను జయించినట్లు ప్రకటించింది. మరుసటి ఏడాది కాస్టోకోన్డ్రైటిస్ వ్యాధి బారిన పడింది. ఈమె ఏక్ వివాహ్.. ఐసా భీ, పల్ పల్ దిల్కే సాత్ వంటి చిత్రాల్లో నటించింది. సీరియల్స్బుల్లితెరపై ఘర్కీ లక్ష్మి బేటియా, నాగిన్, బందిని, ఏక్ చుట్కీ ఆస్మన్, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్లో యాక్ట్ చేసింది. రచయిత, నిర్మాతగానూ గుర్తింపు పొందింది. డైరెక్టర్ మోహిత్ హుస్సేన్ను 2004లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు అరీజా, కుమారుడు అర్హం సంతానం. View this post on Instagram A post shared by Chhavi Mittal (@chhavihussein) చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, రామ్చరణ్.. వీడియో -
పాడె మోసిన అల్లు అర్జున్, రామ్చరణ్.. వీడియో
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) ఇక లేరు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి అల్లు అర్జున్, మైసూర్ నుంచి రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. ముగిసిన అంత్యక్రియలునానమ్మ పార్థివదేహాన్ని చూసి అల్లు అర్జున్ (Allu Arjun) భావోద్వేగానికి లోనయ్యాడు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి వచ్చి కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు అర్జున్, అల్లు అయాన్, చిరంజీవి, రామ్చరణ్... కనకరత్నమ్మ పాడె మోశారు. అల్లు అరవింద్.. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. pic.twitter.com/TrESutLN43— C/o.AlluArjun (@CareOfAlluArjun) August 30, 2025 -
సాయిధన్సికతో విశాల్ పెళ్లి.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ త్వరలోనే తన బ్యాచిలర్ జీవితానికి శుభం కార్డు వేయబోతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.(చదవండి: ఇదే నా లాస్ట్ బ్యాచిలర్ బర్త్డే.. ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించను) సాయి ధన్సిక, విశాల్ కలిసి ఒక్క సినిమా చేయలేదు కానీ.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో సాయి ధన్సికనే తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామనే విషయాన్ని కూడా అప్పుడే చెప్పింది. అయితే విశాల్ మాత్రం సడెన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి షాకిచ్చాడు.ఏజ్ గ్యాప్పై చర్చవిశాల్తో ప్రేమలో ఉన్నానని సాయి ధన్సిక ప్రకటించిన వెంటనే వీరిద్దరి మధ్య ఉన్న వయసు తేడాపై నెటిజన్స్ ఆరా తీశారు. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మరోసారి ‘ఏజ్ గ్యాప్’పై నెట్టింట చర్చ మొదలైంది. విశాల్కి నిన్నటితో 48 ఏళ్లు నిండాయి. 1977 ఆగస్టు 29న విశాల్ జన్మించాడు. ఇక సాయి ధన్సిక 1989 సెప్టెంబర్ 20న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. విశాల్ కంటే సాయి ధన్సిక అంత చిన్నదా అని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడే పెళ్లి.. ?నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడే విశాల్ ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఇప్పుడు నడిగర్ భవనం దాదాపు పూర్తయినట్లే. అన్ని పనులు అయిపోతే.. తన బర్త్డే రోజే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇంకా రెండు నెలల పని పెండింగ్లో ఉందట. అందుకే బర్త్డేకి ఎంగేజ్మెంట్ చేసుకొని ఆగిపోయాడు. రెండు నెలల తర్వాత నడిగర్ సంఘం భవనంలోనే విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా విశాలే ప్రకటించాడు. సాయి ధన్సిక సినీ విషయానికొస్తే .. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ కూతురి గా నటించి మెప్పించింది. ‘షికారు’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది. -
కుమారుడి పెళ్లి.. ఎంతో స్పెషల్ అంటూ నటుడి భావోద్వేగం
తమిళ నటుడు ప్రేమ్ కుమార్ (Tamil Actor Prem Kumar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ప్రేమ్కుమార్ తనయుడు కౌశిక్ సుందరం.. పూజిత మెడలో తాళికట్టాడు. వీరిద్దరి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. రెక్కలు విప్పుకుని ఎదిగే కొడుకుని చూస్తుంటే తండ్రికి ఎంతో గర్వంగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకం..ఆగస్టు 28 మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా కొడుకు పెళ్లి అనే బంధంతో జీవితంలో ముందడుగు వేశాడు. అది చూసి తండ్రిగా నా మనసు ఉప్పొంగిపోతోంది. నూతన వధూవరులు కౌశిక్- పూజిత జంట సుఖసంతోషాలతో కలకాలం కలిసుండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరిద్దరూ గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించినవారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. సినిమాఈ పెళ్లి వేడుకకు హీరో శివకార్తికేయన్ హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమానికి హీరో కార్తీ అటెండయ్యాడు. ప్రేమ్ కుమార్.. ధనం, గురుసామి, బిర్యానీ, ఖిలాడీ, సర్కార్, కాపన్, విక్రమ్ వేద, హీరో, మాస్టర్, తునివు(తెగింపు), కంగువా, రెట్రో.. వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఈనాడు (2009) సినిమాలో ఫ్రాన్సిస్గా యాక్ట్ చేశాడు. ఓటీటీలో సుడల్: ద వోర్టెక్స్ వెబ్ సిరీస్లో మెరిశాడు. As a parent, nothing rivals the feeling of pure pride in watching your kid grow and spread their wings in their life with style. In that regard, 28th of August will always be a very special day for our family.My boy took a very big step yesterday, and as a father, my heart is… pic.twitter.com/POfWmAljRw— Prem Kumar (@premkumaractor) August 29, 2025 చదవండి: స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ -
ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్
'నడిగర్ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి' అని శపథం చేశాడు స్టార్ హీరో విశాల్ (Vishal). దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నిన్న (ఆగస్టు 29న) విశాల్ 48వ బర్త్డే.. ఈ పుట్టినరోజే తన పెళ్లిరోజు కానుందని గతంలో ప్రకటించాడు. కానీ ఇంకా నడిగర్ సంఘం భవంతి పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హీరోయిన్ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు.చివరి బ్యాచిలర్ బర్త్డే..నిశ్చితార్థం తర్వాత విశాల్ మాట్లాడుతూ.. ఇది నా చివరి బ్యాచిలర్ బర్త్డే. ఎంగేజ్మెంట్ విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవంతి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంకో రెండు నెలల్లో అది పూర్తయిపోతుంది. ఈ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నప్పుడే ధన్సిక, నేను కలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాం. మేమిద్దరం ఇంతవరకు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు. అలాంటి సీన్లు చేయనుబిల్డింగ్ ప్రారంభోత్సవం అయిన మరుసటిరోజే నా పెళ్లి జరుగుతుంది. నా బ్యాచిలర్ లైఫ్ ముగియబోతోంది. కాబట్టి నేను చాలా మారాలి. అలా అని రొమాంటిక్ సినిమాలు చేయననుకునేరు, చేస్తాను! కానీ ఇకమీదట ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చాడు. విశాల్ ప్రస్తుతం 'మకుటం' మూవీ చేస్తున్నాడు. నిర్మాత ఆర్బీ చౌదరి కెరీర్లో ఇది 99వ చిత్రంగా రాబోతోంది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Vishal (@actorvishalofficial)చదవండి: ఐశ్వర్యరాయ్ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు! -
అల్లు అరవింద్ తల్లి మృతి.. వైఎస్ జగన్ సంతాపం
దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న బాధపడుతున్న కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2025 -
ఐశ్వర్యరాయ్ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు!
మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty), హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) జంటగా నటించిన చిత్రం కందుకొండైన్ కందుకొండైన్ (Kandukondain Kandukondain). 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీలో టబు, అజిత్, అబ్బాస్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీకి మొదట మమ్ముట్టిని అనుకోలేదంటున్నాడు దర్శకుడు రాజీవ్ మీనన్.దివ్యాంగుడిగా నటించలేమన్నారుతాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ మీనన్ మాట్లాడుతూ.. ఈ మూవీలో కథానాయకుడి పాత్ర కోసం చాలామంది హీరోలను సంప్రదించాను. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో హీరో యుద్ధంలో పాల్గొని కాలు కోల్పోతాడు. మరోవైపు తాగుబోతుగా మారతాడు. అది విన్నాక ఏ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దివ్యాంగుడిగా నటించలేమని మొహం మీదే చెప్పారు. మమ్ముట్టి మాత్రం..కానీ, మమ్ముట్టి అదొక లోపంగా అస్సలు భావించలేదు. వెంటనే ఒప్పేసుకున్నాడు. మేజర్ బాలాగా నటించాడు. మేజర్ బాలా యుద్ధంలో కుడి కాలు కోల్పోతాడు. దీంతో ఒకవైపు ఒరిగి వంగుతూ నడుస్తాడు. కానీ సెట్లో ఒక్కోసారి తను కోల్పోయింది కుడి కాలా? ఎడమ కాలా? అని మర్చిపోయేవాడు. మళ్లీ వచ్చి అడిగేవాడు. అప్పుడు సరదాగా నవ్వుకునేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.చదవండి: అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం -
స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ
ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయింది మమిత బైజు (Mamitha Baiju). ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్తో, దళపతి విజయ్తో సినిమాలు చేస్తోంది. అయితే ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంటోందీ బ్యూటీ. నాకు పెద్దగా గుర్తింపు లభించని సమయంలో హీరో సూర్య సర్తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎగిరి గంతేశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. అప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కానీ ఇప్పుడు సూర్య సర్తో ఓ సినిమా చేస్తున్నందుకు చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.అప్పుడు మిస్సయిన ఛాన్స్..బాలా డైరెక్ట్ చేసిన వణంగాన్ మూవీలో మొదట సూర్య, మమిత బైజును సెలక్ట్ చేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. కానీ పలు కారణాల వల్ల సూర్య, మమిత బైజు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకుడు బాలా.. అరుణ్ విజయ్ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) చదవండి: ‘మారీశన్’ మూవీ రివ్యూ: ఒక్క సీన్ కూడా ఊహించలేరు! -
బాబును ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయా.. ఏడ్చేసిన సీరియల్ నటి
డబ్బు పెద్ద జబ్బు మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు నటి హరిత (Actress Haritha). ప్రెసిడెంట్గారి పెళ్లాం, చినరాయుడు, పేకాట పాపారావు, దొంగపోలీస్.. ఇలా అనేక సినిమాల్లో నటించింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. దాదాపు 80 సీరియల్స్లో హీరోయిన్గా చేసిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ముద్దమందారం సీరియల్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.ఏడ్చేసిన హరితతాజాగా ఆమె తన పర్సనల్ లైఫ్, కెరీర్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. హరిత మాట్లాడుతూ.. మా అన్నయ్య, చెల్లి (హీరోయిన్ రవళి) వీళ్లే నా బెస్ట్ఫ్రెండ్స్. పెళ్లయ్యాక నా భర్త జాకీ, ఇప్పుడు నా కూతురు బెస్ట్ఫ్రెండ్ అయ్యారు. అయితే పగలూరాత్రి తేడా లేకుండా షూటింగ్స్లోనే మునిగిపోయేదాన్ని. దాంతో పిల్లలను చూసుకునేందుకు కొంతకాలంపాటు పనిమనుషులను పెట్టాను. కొన్నిసార్లయితే బాబును ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లేదాన్ని అంటూ ఏడ్చేసింది.నటుడి సలహా లెక్క చేయలేదుసినిమా నుంచి సీరియల్స్వైపు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. సింగన్న మూవీలో హీరోయిన్గా చేశా.. చీకటి సూర్యులు సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించా.. సీరియల్స్ ఆపేస్తే మంచి హీరోయిన్ అవుతావని ఆర్.నారాయణమూర్తి చెప్పారు. కానీ, నేనసలు పట్టించుకోలేదు.. సీరియల్ ఛాన్సులు వస్తూ ఉన్న కొద్దీ చేసుకుంటూ పోయాను. అలా బుల్లితెరపైనే సెటిలయ్యాను. తమిళంలోనే ఎక్కువ ప్రాజెక్టులు చేశా.. హీరోయిన్గా 80కి పైగా సీరియల్స్ చేశాను. బాడీ షేమింగ్నాకు బాబు పుట్టాక హైదరాబాద్కు షిఫ్టయ్యాను. చిన్నప్పటినుంచి నేను చబ్బీగానే ఉండేదాన్ని. మా అన్నయ్య నన్ను బండ అని పిలిచేవాడు. పాప పుట్టినప్పుడు చాలా బరువు పెరిగిపోయా.. 98 కిలోలకు చేరాను. నేను లావుగా ఉండటంతో చాలామంది బాడీ షేమింగ్ చేసేవారు. కొన్నిసార్లు బాధపడ్డాను. అప్పుడే డైటింగ్ మొదలుపెట్టాను. తిండికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న నేను 15 ఏళ్లుగా డైటింగ్ చేస్తూనే ఉన్నాను అని హరిత చెప్పుకొచ్చింది.చదవండి: నన్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: యశ్ తల్లిపై హీరోయిన్ ఫైర్ -
ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ‘మయూఖం’
వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా "మయూఖం" అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ -మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో "తాల్" అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రోమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అన్నారు.హీరో కుశ్ లవ్ మాట్లాడుతూ - "మయూఖం" చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ ఫార్మెన్స్ నచ్చుతుంది, మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు. హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ - "మయూఖం" సినిమాలో హీరోయిన్ గా నేను పర్పెక్ట్ గా సెట్ అవుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్స్. నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. మీ అందరినీ థియేటర్స్ లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నా. "మయూఖం" చిత్రాన్ని మీరంతా సపోర్ట్ చేయండి. అన్నారు. -
నన్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు: యశ్ తల్లిపై హీరోయిన్ ఫైర్
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash), హీరోయిన్ దీపికా దాస్ వరుసకు కజిన్స్ అవుతారు. కానీ, ఎక్కడా తమ చుట్టరికాన్ని బయటకు చెప్పకుండా ఎవరి కెరీర్ వారే నిర్మించుకున్నారు. అయితే యశ్ తల్లి పుష్ప ఇటీవల నిర్మాతగా మారి కొత్తలవాడి సినిమా తీసింది. ఆగస్టు 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్లో పుష్ప.. దీపికా దాస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఆమె గురించి ఎందుకు?నెక్స్ట్ సినిమాలో దీపికా దాస్ను ఎంపిక చేసుకునే ఆలోచనలున్నాయా? అన్న యాంకర్ ప్రశ్నపై పుష్ప అసహనం వ్యక్తం చేసింది. అస్తమానూ ఆమె గురించే ఎందుకు అడుగుతారు? రమ్య రక్షిత.. ఇలా ఇండస్ట్రీలో వేరే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. దీపిక పెద్ద స్టార్ హీరోయినా? ఆమె ఏం సాధించిందని తన గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు? అని మండిపడింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది.గౌరవం ఇవ్వడం నేర్చుకోండిరెండు కుటుంబాల మధ్య సఖ్యత లేదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా ఈ వివాదంపై దీపికా దాస్ స్పందించింది. కొత్తగా ఇండస్ట్రీకి కొత్త ఆర్టిస్టులకు పరిచయం చేయాలనుకునేవారు, ముందుగా ఆ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. సినీ ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు సంపాదించుకునేందుకు ఎవరి పేరు కూడా వాడుకోలేదు. అవతల ఉన్నది అమ్మ అయినా పుష్పమ్మ అయినా సరే.. నా గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.అందుకే మౌనంగా ఉన్నాఏదో వారిపట్ల గౌరవంతో ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను తప్ప భయంతో కాదు! నేను పెద్దగా ఏదీ సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నాగురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా? కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అని ఘాటుగా రియాక్ట్ అయింది. నాగిని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న దీపికా దాస్ కన్నడ బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. పలు సినిమాల్లో కథానాయికగా నటించింది.చదవండి: ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు.. ఆమెకు చాలా డబ్బిచ్చా..: సన్నీలియోన్ -
‘అర్జున్ చక్రవర్తి' మూవీ రివ్యూ
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1980-96 మధ్యకాలంలో సాగుతుంది. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య(దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. అర్జున్ తన మేనల్లుడు అని చెప్పుకుంటూ.. అతన్ని గొప్ప కబడ్డీ ప్లేయర్ని చేయాలని భావిస్తాడు. రంగయ్య స్పూర్తితో అర్జున్ కూడా కబడ్డీ నేర్చుకుంటాడు. జిల్లా స్థాయిలో ఆడుతున్న సమయంలో దేవకి(సిజా రోజ్)తో ప్రేమలో పడతాడు. ఓ కీలక మ్యాచ్ కోసం దేవకిని దూరం పెడతాడు. దేశం తరపున ఆడి బంగారు పతకం సైతం సాధిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ కారణంతో అతను కబడ్డీ ఆటను దూరం పెట్టి తాగుడుకు బానిసవుతాడు. కబడ్డీనే ప్రాణంగా భావించే అర్జున్.. ఆ ఆటను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? కోచ్ కులకర్ణి (అజయ్) రాకతో అర్జున్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తన మాదిరే గ్రామీణ యువతను కబడ్డీ ఆటగాళ్లుగా తీర్చి దిద్దాలనే అర్జున్ లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక కబడ్డీ క్రీడాకారుడి జీవిత కథతో తెరకెక్కిన సినిమా ఇది. అనాథ అయిన ఒక కుర్రాడు.. కబడ్డీ ఆటలో గొప్ప పేరు సంపాదించా..తనలాంటి చాంపియన్లను తయారు చేయడానికి అకాడమీ నెలకొల్పాలనుకుంటాడు.కానీ అతని ప్రయత్నం ఫలించదు. ఇక తన జీవితమే ముగిసిపోయిందనుకున్న దశలో తిరిగి ఆటలోకి వచ్చి మళ్లీ ఛాంపియన్గా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా కథ. మన తెలుగులో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. జెర్సీ తరహాలో ఈ కథ కూడా చాలా ఎమోషనల్గా సాగుతుంది. అయితే ఆటకు సంబంధించిన సన్నివేశాలు మాత్రం ఉత్కంఠ భరితంగా రాసుకున్నా.. తెరపై మాత్రం అది అనుకున్నంతగా పండించలేకపోయారు. కొన్ని చోట్ల సినిమాటిక్గా అనిపిస్తుంది. ఫస్టాఫ్లో రివర్స్ స్క్రీన్ప్లేతో అర్జున్ కథ, జిల్లా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఎలా గెలిచాడు? దేవకితో ప్రేమాయణం చుట్టూ తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం చాలా ఎమోషనల్గా సాగుతుంది. ప్రభుత్వ అధికారి అర్జున్కి చేసిన అన్యాయం తెరపై చూస్తుంటే బాధతో పాటు కన్నీళ్లు కూడా వస్తాయి. అయితే రంగయ్య-అర్జున్ మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్గా ఉన్నప్పటికీ..కాస్త సాగదీతగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్లో హీరో మళ్లీ ఆట కోసం సిద్ధం అవ్వడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఎవరెలా చేశారంటే..అర్జున్ చక్రవర్తి పాత్రకి విజయ రామరాజు వందశాతం న్యాయం చేశాడు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం అంతా తెరపై కనిపించింది. లుక్ని మార్చుకోవడమే కాదు.. నటన పరంగానూ మెప్పించాడు. ఇక రంగయ్యగా దయానంద్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సిజా రోజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంది. అజయ్ కోచ్ పాత్రలో పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విఘ్నేష్ బాస్కరన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలం. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, విజువల్స్ 80,90 ల కాలానికి తగ్గట్టు బాగానే చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్ 2.75/5 -
అభిమాన నేత కోసం భర్తనే చంపి...రొమ్ము కోసేసినా..
దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది తమ పోరాటాలకు, అప్పుడు అందించిన సేవలకు తగిన గుర్తింపును పొందారు. అయితే స్వాతంత్య్ర యోఢులుగా గుర్తింపు పొందిన వారిలో అత్యధికులు పురుషులే కాగా.. అలా వెలుగులోకి వచ్చిన మహిళలు తక్కువ మందే. అలాంటి వారిలో నీరా ఆర్య ఒకరు. ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో భారతీయులకు తెలియని ఆ పేరు ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇప్పుడీ గుర్తింపు రావడానికి ఆమె జీవిత కధ బయోపిక్గా తెరకెక్కడం కూడా ఓ కారణం. భారత జాతీయ సైన్యంలో మొదటి మహిళా గూఢచారి నీరా ఆర్య. దేశం పట్ల నిస్వార్థ అంకితభావం కలిగిన నీరా ఆర్య సాహసోపేతమైన కథ కన్నడ చిత్ర నిర్మాత దర్శకత్వం వహించిన చిత్రం ద్వారా వెలుగులోకి వస్తోంది.ఉత్తరప్రదేశ్కు చెందిన నీరా ఆర్య(Neera Arya) మార్చి 5, 1902న బాగ్పత్ జిల్లాలోని ఖేక్రా నగర్లో ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి, సేథ్ ఛజ్జుమల్, ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త, ఆయన నీరా ఆమె సోదరుడు బసంత్ లకు కోల్కతాలో విద్యాభ్యాసం చేయించారు. చిన్నప్పటి నుంచీ, నీరా తన దేశ శ్రేయస్సు, జాతీయతా భావాల పట్ల బలమైన మక్కువను చూపించేవారు. ఆ మక్కువతోనే పాఠశాల చదువు పూర్తి చేసిన తర్వాత, ఆజాద్ హింద్ ఫౌజ్లోని రాణి ఝాన్సీ రెజిమెంట్లో సైనికురాలిగా చేరారు.అయితే ఆమె తండ్రి ఆమెను బ్రిటిష్ ఆర్మీ అధికారి, సిఐడి ఇన్ స్పెక్టర్ అయిన శ్రీకాంత్ జై రంజన్ దాస్కు ఇచ్చి పెళ్లి చేశారు. తండ్రి మాట కాదనలేక పెళ్లి చేసుకున్నప్పటికీ... ఆ దంపతులు ఇద్దరివీ భిన్నమైన నమ్మకాలు భిన్నమైన దారులుగా మారాయి, ఒకరు బ్రిటిష్ ప్రభుత్వం కోసం పనిచేస్తుంటే మరొకరు భారతదేశపు అజాద్ హింద్ ఫౌజ్ కోసం.. చేస్తుండడం ఇద్దరి మధ్య గొడవల్ని సృష్టించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో నీరా భాగమని శ్రీకాంత్ తెలుసుకుని, అతను ఆమె నుంచి ఏదో ఒకలా నేతాజీ గురించిన సమాచారం పొందడానికి ప్రయత్నించాడు. అయితే నీరా అతను ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా చెప్పడానికి నిరాకరించేది.ఒక రోజు, నీరా బోస్ను కలిసేందుకు వెళుతుండగా శ్రీకాంత్ ఆమెను రహస్యంగా అనుసరించాడు. చెంత తుపాకీతో సహా స్థావరాన్ని చేరుకున్న శ్రీకాంత్ అక్కడ దాడికి పాల్పడి బోస్ డ్రైవర్ను కొట్టడం మొదలుపెట్టాడు.భర్తను చూసి అవాక్కయిన నీరా.. ఆ సమయంలో బోస్ను రక్షించడానికి ఏ మాత్రం సంకోచించకుండా తన భర్త శ్రీకాంత్ను చంపేసింది.దీని ఫలితంగా బ్రిటిష్ వారు ఆమెను అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలుకు పంపారు. కానీ ఆమె తన దేశం కోసం ప్రేమించడం పోరాడటం అప్పుడూ ఆపలేదు. ఆమె జైలు శిక్ష సమయంలో, నీరా భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గురించి, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గురించి సమాచారం వెల్లడిస్తే ఆమెకు బెయిల్ ఇస్తామని ప్రలోభ పెట్టినా కూడా తన అభిమాననేత గురించి చెప్పడానికి ఆమె నిరాకరించింది. అంతేకాదు తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి జైలు అధికారులపై ఖాండ్రించి ఉమ్మివేసింది.దీంతో ఆమె అక్కడ చిత్ర హింసలకు గురయ్యారు. సుభాష్ చంద్రబోస్ తన గుండెల్లో ఉన్నారని చెప్పినందుకు శిక్షగా ఆమె రొమ్ములు కూడా కత్తిరించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ క్రూరమైన హింస ఎదుర్కున్నా, నీరా విధేయురాలిగా ఉండి, ఆజాద్ హింద్ ఫౌజ్ మొదటి మహిళా గూఢచారిగా బోస్ తో గుర్తింపు దక్కించుకుంది. నీరా ఆర్య జీవిత కధ∙ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో రూపా నాయర్ బాలీవుడ్లో నటిగా దర్శకురాలిగా అరంగేట్రం చేయనున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న రచయిత వరుణ్ గౌతమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. -
'నాకు పెళ్లయింది, అతడే నా భర్త..': జాన్వీ కపూర్
ప్రేమిస్తున్నానని ఎవరైనా వెంటపడినప్పుడు కొందరు తమకు ఆల్రెడీ పెళ్లయిందని అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. అలా తను కూడా ఈ అబద్ధం చెప్పానంటోంది దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). విదేశాల్లో ఉన్నప్పుడు ఎవరైనా తనతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తే పెళ్లి అనే ఒక్కమాటతో గండం గట్టెక్కానంటోంది.జాన్వీకపూర్, ఓరీపెళ్లయిందని చెప్పా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నాకు పెళ్లయిందని చాలాసార్లు అబద్ధమాడాను. అయితే ఇండియాలో కాదు.. అమెరికా లాస్ ఏంజిల్స్లో ఉన్నప్పుడు కొందరు వెయిటర్లు వారి ఫోన్ నెంబర్ ఇచ్చేవారు. నేను ఏదీ ఆర్డర్ చేయకముందే వారు ఏదైనా వంటకాలు తెచ్చి నా ముందుంచేవారు. అలా ఒకసారి ఓరీతో ఉన్నప్పుడు.. అతడినే నా భర్తగా పరిచయం చేసి తప్పించుకున్నాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. సినిమాజాన్వీకి ఇంకా పెళ్లవలేదు కానీ, శిఖర్ పహారియాతో ప్రేమలో ఉంది. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మోడల్ ఓరీ.. జాన్వీకి మంచి స్నేహితుడు. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన పరమ సుందరి నేడు (ఆగస్టు 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. ప్రస్తుతం సన్నీ సంస్కారికీ తులసి కుమారి మూవీ చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్, సాన్య మల్హోత్రా, రోహిత్ సరఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: 8 ఏళ్లుగా భార్య సంపాదనతో బతుకుతున్నా..: డైరెక్టర్ -
శివాజీ సినిమా రిజెక్ట్.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు
రజనీకాంత్ (Rajinikanth) నటించిన బ్లాక్బస్టర్ చిత్రాల్లో శివాజీ (Sivaji Movie) ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమాలో తలైవాను ఢీ కొట్టే విలన్గా నటించమని మొదట సత్యరాజ్ను సంప్రదించారట! రజనీతో సమానంగా పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన నో చెప్పారట! నేనెంత కష్టపడ్డా సరే.. రజనీకాంత్ వచ్చి స్టైల్గా ఏదో ఒకటి చేసేసరికి తనకే గుర్తింపు వస్తోందని బాధపడేవారట! శివాజీలో విలన్గా చేస్తే మరి తను హీరోగా నటించే మూవీలో రజనీ విలన్గా నటిస్తాడా? అని ఎదురు ప్రశ్నించాడని ప్రచారం జరిగింది. విలన్గా ముద్ర వేస్తారని..రజనీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించారంటూ ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించాడు సత్యరాజ్ (Sathyaraj). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పుడు నేను హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నాకంటూ మళ్లీ మార్కెట్ సృష్టించుకునే పనిలో పడ్డాను. సరిగ్గా ఆ సమయంలో డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమా ఆఫర్ చేశాడు. ఒక్కసారి విలన్గా చేస్తే ఇక అన్నీ ప్రతినాయకుడి పాత్రలే వస్తాయి. అందుకే తిరస్కరించాను అని క్లారిటీ ఇచ్చాడు.39 ఏళ్లు పట్టింది!కాగా సత్యరాజ్.. విలన్ దగ్గర పనిచేసే రౌడీల్లో ఒకరిగా కెరీర్ మొదలుపెట్టాడు. నూరవత్తు నాల్ (1984) చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత మెయిన్ విలన్గా మారాడు. ఓపక్క విలనిజం పండిస్తూనే మరో పక్క హీరోగానూ మారాడు. రజనీకాంత్తో కలిసి పలు సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. వీరిద్దరూ చివరగా నటించింది 1986లో వచ్చిన మిస్టర్ భరత్ మూవీలో! ఇందులో రజనీ తండ్రిగా సత్యరాజ్ యాక్ట్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది. శివాజీ, ఎంతిరన్ (రోబో) సినిమాలకు నో చెప్పుకుంటూ పోయిన సత్యరాజ్ ఎట్టకేలకు కూలీ చిత్రంలో రజనీ ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు.చదవండి: ఆ టాలీవుడ్ హీరో అంటే ఫుల్ క్రష్.. సురేఖవాణి కూతురు సుప్రీత -
కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. టీజర్ రిలీజ్
'గోలీసోడా', గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు,ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కథానాయకుడు. ఆయన చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జరుపుకుంటోన్న ఈ చిత్రానికి వినాయక చవితి పర్వదినాన 'గాడ్స్ అండ్ సోల్జర్'గా టైటిల్ని ఫిక్స్ చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్.. ప్రముఖ తమిళ కథానాయకులు విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యలతో పాటు మాస్ కా దాస్ విశ్వక్సేన్ తమ ఎక్స్ అకౌంట్ వేదికగా టైటిల్ను ట్విట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు.దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ '' గోలీసోడాలోని రఫ్నెస్ను, న్యూ చాప్టర్లో ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఈ టైటిల్ టీజర్కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ టీజర్తో మా సినిమాపై ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. ఈ సందర్బంగా మా టైటిల్ టీజర్ను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి మమ్ములను సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు' అన్నారు. రాజతరుణ్, సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిసున్నాడు. -
అలా చేయడం నచ్చలేదు.. అందుకే తెలుగు సినిమాల నుంచి తప్పుకున్నా!
ఆనంద్ మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది కమలినీ ముఖర్జీ. స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి.. ఇలా పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. చివరగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసిన ఆమె 2016 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.విభిన్న పాత్రల్లో..తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో నేను అన్ని రకాల ఎమోషన్స్ ఉండే అమ్మాయిగా నటించాను. చాలా సినిమాల్లో నేను అమ్మానాన్న లేని అనాథగానే కనిపించాను. బలమైన స్త్రీ పాత్రలు చేశాను. అదే సమయంలో చాలా సున్నితమైన అమ్మాయిగానూ కనిపించాను. కానీ, రానురాను అలాంటి బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్లో రాలేదు.అందుకే వెనకడుగు వేశా..గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లేదనిపించింది. మూవీ పూర్తయ్యాక నేను పోషించిన పాత్ర చూసుకుని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను కూడా! దానికోసం నేను గొడవపడాలని, రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే.. గోవిందుడు అందరివాడేలే తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుని టాలీవుడ్కు దూరంగా ఉన్నాను. అలా అని నాకు ఎవరిపైనా కోపం లేదు.టాలీవుడ్ నుంచి తప్పుకున్నా..సినిమాలో చాలా జరుగుతుంటాయి. దర్శకుడు ఓ సీన్ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో, బాగోలేదనో దాన్ని ఎడిటింగ్లో తీసేస్తుంటారు. ఆ విషయాన్ని మాకు చెప్పరు. ఒక మాటైనా చెప్పకుండా మన సీన్, డైలాగులు తీసేస్తే బాధనిపిస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకుని ఇతర భాషల్లో చేశాను.పెళ్లిమలయాళ మూవీ పులి మురుగన్(2016) తర్వాత నాకు పెళ్లయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. చిన్నప్పుడు చదువుకే కేటాయించాను. పెద్దయ్యాక సినిమాలు చేశాను. ఇప్పుడు భార్యగా కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను అని కమలినీ ముఖర్జీ చెప్పుకొచ్చింది.చదవండి: అఫీషియల్: వచ్చేవారమే బిగ్బాస్ 9 ప్రారంభం -
సినీ నిర్మాతగా మారిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మాతగా మారారు. సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో ‘వేదవ్యాస్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు" హలో ... కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్" అంటూ బొకే అందించగా ఆమె "థాంక్యూ సర్ " అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు.ఈ సందర్భంగా దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - నా లైఫ్ లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాం. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆదరణ, అభినందనలు పుణికిపుచ్చుకున్న నేను ఎదిగి ఈ రోజు 43వ చిత్రం "వేదవ్యాస్" తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నారు.నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ - ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో మనం సినిమా చేద్దామని ప్రతిపాదించాను. అలా అనుకున్న ప్రాజెక్ట్ ఈ రోజు "వేదవ్యాస్"గా తయారైంది. కృష్ణారెడ్డి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి, మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో మూవీ నిర్మిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, ఇంజినీరింగ్ కాలేజ్ లు నిర్వహిస్తున్న విద్యావేత్తగా, రియల్ ఎస్టేట్ లో వ్యాపారంలోనూ కొనసాగుతున్నాను. కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ - నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పటి నుంచి ఇప్పిటిదాకా ఎస్వీ కృష్ణారెడ్డి అలాగే ఉన్నారు, అంతే ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్ల కాంబినేషన్ లో "వేదవ్యాస్" సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి కి మొదటి సినిమా అయినా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు. -
‘రానూ బొంబాయికి రాను’.. బడ్జెట్ 5 లక్షలు.. కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కోపాటకి మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. పెళ్లి బరాత్ మొదలు ఏ ఈవెంట్కి వెళ్లిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాటలు ఒకెత్తు.. ‘రాను బొంబాయికి రాను..’ పాట మరో ఎత్తు. ఫోక్ సాంగ్స్లో ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు ఆ పాటకు రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో అటు వారిద్దరు ఫేమస్ అయిపోయారు. అయితే ఈ పాటకు చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయంపై రకరకాల పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా డ్యాన్సర్ లిఖిత క్లారిటీ ఇచ్చింది.రెండు రోజుల షూటింగ్.. ఖర్చు ఎంతంటే..రాము రాథోడ్ అన్నతో ముందుగా రెండు పాటలు అనుకున్నాం. ‘రాను బొంబాయికి..’ రెండో పాట. ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. ముందుగా ప్రొమో విడుదల చేశాం. అది బాగా వెళ్లింది. ఈ పాట కోసం చేసిన రీల్కి ఒకే రోజు మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో మేం కొన్ని మార్పులు చేశాం. పాట బాగా వెళ్లేలా ఉందని..రెండో రోజు వేరే చోట షూట్ చేశాం. అలా ఈ పాట కోసం మొత్తం రెండు రోజులు కేటాయించాం. ఇది హిట్ అవుతుందని తెలుసు కానీ..ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నా పేరు తెలియకపోయినా..‘రాను బొంబాయి రాను’ అమ్మాయి అంటూ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు.రూ.కోటి వచ్చింది నిజమే కానీ.. ఈ పాటను రామ్ రాథోడ్ తన యూట్యూబ్ నుంచే రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది నిజమే. అయితే రామ్ రాథోడ్ అన్నయ్య విల్లా కొన్నాడు.. బెంజ్ కారు కొన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన ఏమి కొనలేదు. ఇక నా రెమ్యునరేషన్ విషయానికొస్తే.. రెండు రోజులకు ఎంత మాట్లాకున్నామో అంతే ఇచ్చేశాడు. భారీగా లాభం వచ్చింది కదా అని మేం ఎక్కువ అడగలేదు. ఎంత చెప్పారో అంతే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇవ్వాలా వద్దా? అనేది వాళ్ల ఇష్టం. నేను అయితే ఏమి ఆశించడం లేదు. మేం పడిన కష్టానికి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని లిఖిత చెప్పుకొచ్చింది. కాగా, ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ అందించడమే కాకుండా ప్రభతో కలిసి చక్కగా ఆలపించాడు కూడా. శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. రామ్ రాథోడ్ తన సొంత డబ్బులతో ఈ పాటను తెరకెక్కించాడు. -
17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్లో చిక్కుకుపోయిన హీరో మాధవన్!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల జనజీవనం స్థంభించిపోయింది. కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల తాను జమ్మూ కశ్మీర్లో చిక్కుకుపోయానంటున్నాడు తమిళ హీరో ఆర్.మాధవన్ (R Madhavan). ప్రస్తుతం ఇతడు లెహ్లో ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత మరోసారి..తన హోటల్ రూమ్ బయట పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆగస్టు నెలాఖరుకే లద్దాఖ్లో మంచు కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో నేను ఇక్కడే చిక్కుకుపోయాను. అదేంటోకానీ లద్దాఖ్కు షూటింగ్కు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. 2008 ఆగస్టులో 3 ఇడియట్స్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇలాగే..పాన్గాంగ్ సరస్సు వద్ద ఆ మూవీ షూటింగ్ జరిగింది. అప్పుడు కూడా సడన్గా మంచు కురవడంతో ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఈ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉంది. దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. కనీసం ఈరోజైనా వాతావరణం కాస్త కుదుటపడితే నేను ఇంటికెళ్లిపోతాను అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్కు 17 ఏళ్ల తర్వాత వర్షం అన్న క్యాప్షన్ను జత చేశాడు. ఆర్ మాధవన్.. చివరగా ఆప్ జైసా కోయ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ధురంధర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: సింగర్తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి -
సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్గా ‘కర్మణ్యే వాధికారస్తే’
బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం కర్మణ్యే వాధికారస్తే. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే మధుర ఆడియో ద్వారా విడుదల అయినా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ‘కర్మణ్యే వాధికారస్తే' అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం "పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు". టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు 'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు.ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్, స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే ట్రైలర్ విడుదలై సోషల్ మీడియా లో ట్రేండింగ్ అయింది. ఇప్పుడు మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధం గా ఉంది. -
మైథాలజీ జోనర్లో ‘శివం శైవం’.. పోస్టర్ రిలీజ్
దినేష్ కుమార్, అన్షు, రాజశేఖర్, జయంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శివం శైవం’. ఈ చిత్రానికి సాయి శ్రీనివాస్ ఎంకే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను దర్శకుడు వీరశంకర్ విడుదల చేసి టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులు ఫ్రెష్ ఫీల్ని ఇచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాత సాయి శ్రీనివాస్ చెప్పారు. ‘గ్రామీణ నేపథ్యంతో మైతాలజీ జోనర్లో ఓ డిఫరెంట్ కథ చెప్పాం.మా టీం మెంబర్స్ చాలా కష్టపడి ఈ సినిమా ని ఇష్టంగా చేస్తున్నాం.సాంగ్స్ , నేపథ్యం సంగీతం సినిమా చాలా సపోర్టు అవుతుంది.ప్రతి ఒక్కరూ మా సినిమా కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని సాయి శ్రీనీవాస్ అన్నారు. -
ఆమె నాకు దేవుడిచ్చిన వరం.. భార్యను వదిలేసి ప్రియురాలిపై ప్రశంసలు!
ఓపక్క భార్యకు విడాకులు.. మరోపక్క సింగర్తో రిలేషన్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి (Ravi Mohan). ఇతడు ఆర్తి రవిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత దంపతులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ విడాకులకు మూడో వ్యక్తికే కారణమని సంచలన ఆరోపణలు చేసింది ఆర్తి. ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు, సింగర్ కెనీషా అంటూ ప్రచారం జరిగింది.పార్ట్నర్షిప్గుడికి వెళ్లినా, బయట పార్టీకి వెళ్లినా రవి, కెనీషా (Kenishaa Francis) జంటగా కనిపిస్తూ ఉండటంతో వీరిమధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఆమెపై తనకున్న ప్రేమను పరోక్షంగా చెప్పకనే చెప్పాడు రవి. తన సొంత బ్యానర్ రవి మోహన్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కెనీషాతో కలిసి వచ్చాడు. అంతే కాదు, తన బ్యానర్లో ఆమెను పార్ట్నర్గా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏకైక కారకురాలు కెనీషా! నా జీవితంలో తనలా ఇంతవరకు ఎవరూ సాయం చేయలేదు. కెనీషా ఎమోషనల్జీవితంలో ఏమీ తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు పంపిన బహుమతి కెనీషా. నేనెవరు?అనేది నాకు తెలిసేలా చేసింది. రవి మోహన్ స్టూడియోలో కెనీషాకి కూడా భాగముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకరుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు. అతడి స్పీచ్ వింటున్నప్పుడు కెనీషా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన జనాలు.. మీరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్ -
విశాల్ మరో ప్రయోగం.. యంగ్, మిడిల్ ఏజ్..ఓల్డేజ్ లుక్!
వైవిధ్యమైన కథలు, పాత్రలతో ఆకట్టుకుంటున్న వెర్సటైల్ హీరో విశాల్.. తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అయ్యాడు. తన తాజా చిత్రం ‘మకుటం’లో మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించి అలరించబోతున్నాడు. విశాల్ 35వ ప్రాజెక్ట్గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది.ఇక ఈ మూవీలో విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు. -
హీరోయిన్ని టచ్ చేస్తానంటే నో చెప్పా.. జీవిత ఏం అన్నారంటే..: డైరెక్టర్
రాజశేఖర్( Rajasekhar) పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రాల్లో అంకుశం, సింహారాశి కచ్చితంగా ఉంటాయి. నైంటీస్ జనరేషన్కి అంకుశం ఫేవరేట్ అయితే.. ఆ తర్వాతి తరానికి ‘సింహారాశి’ మాత్రమే గుర్తుంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఉన్నప్పటికీ.. హీరో మాత్రం ఆమెను టచ్ కూడా చేయడు. కథ ప్రకారం ఆయన ఆడవాళ్లను ముట్టుకోవద్దు. అయితే పాటల్లో మాత్రం ముట్టుకోవడానికి రాజశేఖర్ ట్రై చేశాడట. కానీ డైరెక్టర్ వద్దని చెప్పడంతో పాటల్లో కూడా హీరోయిన్ని టచ్ చేయలేదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకుడు సముద్ర చెప్పాడు.‘మా కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం సింహారాశి. అందులో రాజశేఖర్ అద్భుతంగా నటించాడు. కథ ప్రకారం ఆయన అమ్మాయిలను టచ్ చేయొద్దు. ఎందుకంటే ప్లాష్ బ్యాక్లో తల్లి తనను పట్టుకోకుండా పెంచి పెద్ద చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. తన తల్లి తాకని ఈ శరీరాన్ని ఎవరూ తాకొద్దని హీరో ఒక సన్యాసిలా బతుకుతాడు. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి, అతన్ని మార్చి ఎలా పెళ్లి చేసుకుంది’ అన్నది సింహారాశి కథ.సినిమా అన్నాక సాంగ్స్ కచ్చితంగా ఉంటాయి. పాటలన్నీ బాగా వచ్చాయి. అవి చూసి రాజశేఖర్ ఆనందంతో డ్యాన్స్ చేసేవాడు. ఓ సాంగ్ కోసం ఊటీకి వెళ్లాం. షూటింగ్ చేస్తుంటే.. హీరోయిన్(సాక్షి శివానంద్)ని పట్టుకోవాలని కొరియోగ్రాఫర్ చెప్పాడు. నేను మాత్రం హీరోయిన్ని టచ్ చేయొద్దని చెప్పా. అప్పుడు రాజశేఖర్ వచ్చి ‘అదేంటి? ఇది డ్రీమ్ కదా.. డ్రీమ్లో కూడా అమ్మాయిని పట్టుకోవద్దా?’ అని అడిగాడు. డ్రీమ్ అయినా..లైవ్ అయినా.. అసలు అమ్మాయినే పట్టుకోవద్దని చెప్పా. ‘లేదు సముద్ర, ఫ్యాన్స్ గోల చేస్తారు. నేను పట్టుకుంటా’ అని రాజశేఖర్ అన్నారు. ‘సార్.. మీకు దండం పెడతా..వద్దు వదిలేయండి’ అని చెప్పా. జీవిత కూడా నాకే సపోర్ట్ చేసింది. ‘అన్ని చేశారు కదా బంగారం.. డైరెక్టర్ ఏదో కుతూహల పడుతున్నాడు విను’ అని చెప్పింది. జీవిత చెప్పడంతో రాజశేఖర్ హీరోయిన్ని పట్టుకోకుండానే పాటను పూర్తి చేశాడు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు. -
భర్తతో వినాయక చవితి సెలబ్రేషన్స్.. లావణ్య బేబీ బంప్ ఫోటో వైరల్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. మేలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఆమె తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. నేడు (ఆగస్టు 27) వినాయక చవితి సందర్భంగా ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసింది. అందులో భర్త వరుణ్ తేజ్తో కలిసి గణపయ్య ముందు కూర్చుంది. వరుణ్ నేలపై కూర్చోగా.. లావణ్య ప్రెగ్నెంట్ కావడంతో కుర్చీపై కూర్చుని దేవుడికి రెండుచేతులతో నమస్కరిస్తోంది. అదే సమయంలో కెమెరావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఇందులో లావణ్య బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది.సినిమావరుణ్ తేజ్, లావణ్య 'మిస్టర్' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి లవ్ను పెద్దలు అర్థం చేసుకుని పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2023లో వరుణ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఇటలీలో వివాహం, హైదరాబాద్లో రిసెప్షన్ జరిగాయి. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లు చేసింది. ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో ఆమె సతీ లీలావతి సినిమాలో నటించింది. అదింకా విడుదల కావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) చదవండి: టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్ -
ఒక్కసారిగా కళ్లముందుకు.. మనసంతా సంతోషంగా ఉంది: నిహారిక
నిన్నటి రోజు నాకెంతో ప్రత్యేకం అంటోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela). తన రెండు ప్రపంచాలు ఒకేసారి కళ్ల ముందు తిరిగాయంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా రెండు ప్రపంచాలు ఒకే చోటకు చేరాయి. ఒకటేమో కెమెరా ముందుకు వచ్చాను.. అందుకోసం తయారయ్యాను, డ్యాన్స్ చేశాను, చాలా సరదాగా ఉన్నాను. మరొకటేమో.. నా ప్రొడక్షన్ హౌస్లో రెండో సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీకి సంబంధించిన పనులు చూసుకున్నాను.రెండూ ఇష్టమే..యాక్టింగ్, ప్రొడక్షన్.. ఈ రెండూ నాకెంతో ఇష్టమైనవి. వీటిలో ఏది ఎక్కువ? అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజాయితీగా నిజం చెప్పాలంటే నేను ఏదో ఒకదాన్ని అస్సలు ఎంపిక చేసుకోలేను. యాక్టింగ్ అనేది నా ప్యాషన్... సినిమాలు ప్రొడ్యూస్ చేయడమనేది.. నేను ఎదగడానికి తోడ్పడింది, అందుకోసం నేనెంతో కష్టపడ్డాను. కాబట్టి రెండూ ముఖ్యమైనవే!కళ్లముందు..నిన్న అదే రుజువైంది. మాటల్లో చెప్పకపోయినా చేతల్లో తెలిసిపోయింది. ఓ రియాలిటీ షోకు గెస్ట్గా వెళ్లి కెమెరా ముందు కనపడ్డాను. ఆ పక్కనే ఉన్న బిల్డింగ్లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఆఫీస్కు వెళ్లి నిర్మాతగా నా నెక్స్ట్ సినిమా పనులు చూసుకున్నాను. నా జర్నీ అంతా ఒక్కసారిగా కళ్లముందు తిరిగేసరికి మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చింది.నిహారిక జర్నీ..నిహారిక కొణిదెల.. ఒక మనసు, సూర్యకాంతం, డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్, మద్రాస్కారన్ మూవీస్ చేసింది. ప్రస్తుతం మంచు మనోజ్తో వాట్ ద ఫిష్ మూవీలో యాక్ట్ చేస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్పై ఓటీటీలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే తొలి సినిమా రిలీజ్ చేయగా ఇది బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తన బ్యానర్లో మరో మూవీ రూపుదిద్దుకుంటోంది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela)చదవండి: ప్రియురాలికే తన ఫ్లాట్ అద్దెకిచ్చిన 'వార్ 2' హీరో -
‘కన్యాకుమారి ’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్యాకుమారి నటీనటులు: గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ, భద్రం.. తదితరులునిర్మాణ సంస్థ: రాడికల్ పిక్చర్స్నిర్మాత : సృజన్ అట్టాడదర్శకత్వం: సృజన్ అట్టాడసంగీతం: రవి నిడమర్తి సినిమాటోగ్రఫీ: శివ గాజుల, హరిచరణ్విడుదల తేది: ఆగస్ట్ 27, 2025నటి మధు శాలిని ప్రెజెంటర్గా ఈ ‘కన్యా కుమారి’(Kanya Kumari Review) సినిమాని నేడు వినాయకచవితి సందర్భంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా టీజర్ రిలీజయినప్పుడు అందులో హీరోయిన్ గబగబా చీరల గురించి డైలాగ్ చెప్పడంతో ఆ టీజర్ వైరల్ అయి సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి కన్యాకుమారి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కన్యాకుమారి కథేంటంటే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది. తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిందా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఇది ఒక రొటీన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. టీజర్, ట్రైలర్స్ తో మాత్రం సినిమాపై ప్రమోషన్స్ లో ఆసక్తి కలిగించారు. టైటిల్ కి తగ్గట్టు కథ మొత్తం కన్యాకుమారి చుట్టే తిరుగుతుంది. ఫస్టాఫ్ అంతా క్యూట్ లవ్ స్టోరీతో, వ్యవసాయానికి లింక్ చేసి బాగానే నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా కాస్త బాగానే ఉంటుంది. సెకండాఫ్ మిడిల్ నుంచి కథ ఎంతకూ సాగదు. వాళ్లిద్దరూ కలిసిపోతారా? విడిపోతారా? అని బాగా సాగదీసి చూపించారు. అక్కర్లేకపోయినా క్లైమాక్స్ ని బాగా ల్యాగ్ చేసారు. అయితే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా క్లైమాక్స్ గుర్తుకు రావడం ఖాయం. ఆ క్లైమాక్స్ కి కొనసాగింపుగా ఉంటుంది ఈ కన్యాకుమారి ముగింపు.లవ్ స్టోరీని మాత్రం క్యూట్ గా బాగానే రాసుకున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఆ యాసతో లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది. అక్కడక్కడా కామెడీ కాస్త వర్కౌట్ అయింది. అలాగే ఆడపిల్ల చదవాలి, ఎదగాలి అనే కాన్సెప్ట్ తో పాటు రైతు, వ్యవసాయం విలువ ఇంటర్నల్ గా చూపించారు. లవ్ స్టోరీలు చూసే వాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చొచ్చు. ఎవరెలా చేసారంటే.. కన్యాకుమారి టైటిల్ పాత్రలో గీత్ సైని పర్ఫెక్ట్ గా సెట్ అయింది. విలేజ్ అమ్మాయిలా, లైఫ్ లో ఎదగాలి అని గోల్ ఉన్న అమ్మాయి పాత్రలో, బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా, లవ్ స్టోరీలో క్యూట్ గా బాగా నటించి మెప్పించింది. హీరో శ్రీచరణ్ ఒక రైతుగా మంచి మెసేజ్ ఇస్తూనే ప్రేమ కథలో కూడా పర్వాలేదనిపించాడు. భద్రం కాస్త నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు కొత్తవాళ్లు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. సాంగ్స్ ఒక్కసారి వినొచ్చు. రొటీన్ ప్రేమ కథ అయినా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ కలిగేలా రాసుకున్నాడు దర్శకుడు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్ లో కొంత కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. -
ఒకే డైరెక్టర్..ఒకే హీరో..వరుసగా 10 సినిమాలు!
ఒక సినిమా హిట్ అయితే కొన్నాళ్ల తర్వాత ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది కూడా హిట్టయితే మూడోసారి కలిసి చేస్తారు. కానీ ఈ హీరో, డైరెక్టర్లు మాత్రం వరుసగా 10 సినిమాలు కలిసి చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సదరు హీరోనే వెల్లడించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వంలో బొంత రాము హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ రాము. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో "మిస్టర్ రాము" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ - నాకు హీరోగా నటించాలని కల ఉండేది. దర్శకుడు అజయ్ కౌండిన్య నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కథ నచ్చి తప్పకుండా చేద్దామని ముందుకు వచ్చాను. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ రోల్ లో నటించాను. మిస్టర్ రాము తో పాటు నేను, డైరెక్టర్ అజయ్ కౌండిన్య కాంబినేషన్ లో మరో 9 చిత్రాలు చేయబోతున్నాం. మొత్తం మా కాంబినేషన్ లో 10 సినిమాలు రాబోతున్నాయి. మిస్టర్ రాము సినిమా రిలీజైన వెంటనే మా కొత్త సినిమాను ప్రకటిస్తాం. మాకు సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు, సన్నిహితులు అందరికీ థాంక్స్. అన్నారు.దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాను మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ అంశాలు కలిపి రూపొందించాం. మా ప్రొడ్యూసర్ రాము ఈ చిత్రంలో హీరోగానూ నటించారు. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. పుష్ప సినిమా విలన్ అజయ్ ఘోష్ మా మీద అభిమానంతో ఈ చిత్రంలో విలన్ గా నటించారు. అలాగే జబర్దస్త్ అప్పారావు అడిగిన వెంటనే నటించేందుకు ఒప్పుకున్నారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా రూపకల్పన సమయంలో హీరో, ప్రొడ్యూసర్ రాము దగ్గర నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. నేను చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడి నిలబడ్డాను. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండటం లేదు. చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలి. అలా పేరు తెచ్చుకునే సినిమాల్లో దర్శకుడిగా నా మూవీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.నటి అవంతిక మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో నేను ఓ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను చేసిన స్పెషల్ సాంగ్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో డైరెక్టర్ అజయ్ గారు నాకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశించానో అలాంటి మంచి క్యారెక్టర్ ఈ చిత్రంలో నాకు దక్కింది. మా మిస్టర్ రాము మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు -
విజయ్తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత
దళపతి విజయ్(Vijay)పై ఆయన మాజీ మేనేజర్, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్ మాత్రం డబుల్ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్ ఈ సినిమాపై స్పందించారు.రిలీజ్కి ముందే కుట్ర..ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్కి ఒక్క రోజు ముందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా. నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.మధ్యలో బయటకు వచ్చేశారుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్కి తీసుకొచ్చాం. తొలి రోజు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్ వర్క్పై ఫ్యాన్స్ సైతం ఫైర్ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.విజయ్ దూరం పెట్టాడు.. సినిమా అపజయం చెందడంతో విజయ్ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్ కెరీర్పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్లో సెల్వకుమార్ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు. -
‘బిగ్బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే
బుల్లితెరపై ‘బిగ్బాస్’రియాల్టీ షోకి ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాకుండా అంతటా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక హిందీలో అయితే ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా 19వ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం అయింది. మనుషుల ఎమోషన్తో సాగే ఈ షో.. కొంతమందికి జీవిత భాగస్వాములను కూడా వెతికిపెట్టింది. ఈ షోలో పాల్గొని, ప్రేమలో పడి..పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. ‘బిగ్బాస్’కలిపిన జంటలపై ఓ లుక్కేద్దాం.సారా ఖాన్- అలీ మర్చంట్ బిగ్బాస్ షో ద్వారా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తొలి జంట సారా ఖాన్, అలీ మర్చంట్. హిందీ బిగ్బాస్ 4లో పాల్గొన్న వీరిద్దరు.. షోలో ఉన్నప్పుడే ప్రేమలో పడి వివాహం(2010లో) చేసుకున్నారు. అయితే, వీరి ప్రేమ కథ సుఖాంతం కాలేదు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు.మోనాలిసా- విక్రాంత్ సింగ్ రాజ్పూత్భోజ్పురి హీరోయిన్ మోనాలిసా (అంతరా బిస్వాస్) బిగ్బాస్ 10లో పాల్గొన్నప్పుడు, ఆమె బాయ్ఫ్రెండ్ విక్రాంత్ సింగ్ రాజ్పూత్ షోలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి, జాతీయ టెలివిజన్లో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఆ క్షణం అభిమానులకు ఎమోషనల్ మూమెంట్గా నిలిచింది. 2017లో వీరు బిగ్బాస్ హౌస్లోనే వివాహం చేసుకున్నారు, ఇది షో చరిత్రలో అరుదైన సంఘటన. తర్వాత వారు సాంప్రదాయ వివాహ వేడుకను కూడా జరుపుకున్నారు. వీరి బంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది.యువికా చౌదరి-ప్రిన్స్ నరులాహిందీ బిగ్బాస్ 9లో పాల్గొన్న ప్రిన్స్ నరులా, యువికా చౌదరితో స్నేహంగా మొదలైన బంధం క్రమంగా ప్రేమగా మారింది. షోలో ప్రిన్స్ యువికా కోసం హార్ట్ ఆకారంలో చపాతీ చేసి ప్రపోజ్ చేసిన సన్నివేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు దీన్ని గేమ్ స్ట్రాటజీ అనుకున్నప్పటికీ, షో తర్వాత వీరి ప్రేమ నిజమని నిరూపితమైంది. 2018 అక్టోబర్ 12న వీరు గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. యువికా ప్రిన్స్ కంటే ఏడేళ్లు పెద్దవారైనప్పటికీ, వారి బంధం అభిమానులకు స్ఫూర్తిగా నిలిచింది.సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్సుయాష్ రాయ్-కిష్వర్ మర్చంట్ బిగ్బాస్ 9లో పాల్గొన్నారు. వీరు 2011 నుంచి డేటింగ్లో ఉన్నప్పటికీ, షోలో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, షో ఒత్తిడిలో కూడా వారి బంధం బలపడింది. 2016లో వీరు సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి నిర్వైర్ అనే కుమారుడు జన్మించాడు.పాయల్ రోహత్గీ- సంగ్రామ్ సింగ్బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ, రెజ్లర్ సంగ్రామ్ సింగ్ బిగ్బాస్ 7లో కలుసుకున్నారు. వీరి సంబంధం షో తర్వాత కూడా కొనసాగింది, దాదాపు 12 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు.2022 జులై 9న ఆగ్రాలో వీరు వివాహం చేసుకున్నారు. -
రవితేజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!
రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదల వాయిదా పడుతున్నట్లు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లే నిజమయ్యాయి. ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదల కావాల్సింది. కానీ ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారుమాస్ జాతర విషయానికొస్తే.. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. -
లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం
హీరోల విషయంలో లావా?సన్నమా? పొట్టా? బట్టా? జుట్టా? విగ్గా? ఇవేవీ సమస్యలుగా కనిపించవు. కానీ అదే హీరోయిన్ విషయానికి వచ్చేసరికి అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలని ఆశిస్తారు. శరీరపు కొలతల దగ్గర నుంచి ప్రతీ ఒక్కటీ బాగుంటేనే ఆమె కధానాయిక అని లేకపోతే పనికిరాదు అంటూ ఈసడిస్తారు. ఆడైనా, మగ అయినా అభినయమే ప్రధాన అర్హతగా కొనసాగాల్సి ఉన్నా దానిని మహిళల విషయానికి వచ్చేసరికి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు అవకాశాలు ఇచ్చే నిర్మాతలు, దర్శకుల నుంచి మాత్రమే బాడీ షేమింగ్ ఎదుర్కున్న సినీ పరిశ్రమకు చెందిన యువతులు... ఇప్పుడు ఏ సంబంధం లేనివారు సైతం తమను, తమ శరీరాన్ని కామెంట్ చేస్తుంటే భరించాల్సిన పరిస్థితిని సోషల్ మీడియా సృష్టించింది. మొన్నటి విద్యాబాలన్ దగ్గర నుంచి నిన్నటి నిత్యా మీనన్ దాకా ప్రతీ ఒక్కరూ ఎదుర్కున్న సమస్య ఇది. ఇప్పుడు ఈ జాబితాలో మరో అందమైన నటి కూడా చేరారు. ఆమె మంజిమా మొహన్(Manjima Mohan ).తెలుగులో సాహసమే శ్వాసగా సాగిపో, కధానాయకుడు వంటి సినిమాల్లో నటించిన మంజిమా మోహన్ పలు మళయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితులు. మళయాళ సినీతార మన్జిమా మొహన్,ఐదేళ్ల చిన్న వయసులోనే నటన ప్రారంభించి 2001 దాకా వరుసగా నటించారు. ఆ తరువాత ఒరు వేదక్కన్ సెల్ఫీ అనే చిత్రంతో 2015లో లీడ్ పాత్రలో తిరిగి కనిపించారు. ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అయితే తర్వాత చిత్రాల్లో కూడా నటనకు ప్రశంసలతో పాటే దురదృష్టవశాత్తూ ఆమె శరీరపు బరువు కూడా ఎగతాళికి నోచుకుంది.మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై తన బరువును ఉద్ధేశ్యించి పలువురు చేసిన క్రూర వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు ఆమెను భావోద్వేగాలను సంక్షోభం లోకి నెట్టాయని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపారు. ‘బరువు తగ్గించడం వల్ల మరి కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో; కానీ అది ముఖ్యం కాదు. నిజానికి సినిమా రంగం దాటితే నా బరువు ఎవరికీ ఒక విషయమే కాదు. అవును...సినిమా నా జీవితంలో ఒక భాగమే. అయితే నా లక్ష్యాలు స్క్రీన్ కు మించినవి ఎన్నో ఉన్నాయ్‘ అని ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల్ని తట్టుకోవడం తన వల్ల కావడం లేదని ఆమె అంగీకరించారు. అధిక బరువు అనే సమస్య వల్ల శారీరకంగా భావోద్వేగపరంగా సంక్లిష్టమైన దశను తాను అనుభవించానని, చివరకి బరువు తగ్గేందుకు డాక్టర్లను సంప్రదించానని కూడా ఆమె వెల్లడించారు. ఏదో రకంగా బరువు తగ్గాలని అనుకున్నా. అవసరమైతే సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నా ‘‘ అని ఆమె అన్నారుతనకు పిసిఓడి సమస్య ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని తాను తన ఆరోగ్య పరమైన మార్పు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. తాను బరువు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలేవీ లేనప్పుడు దాని గురించి చింతించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. నటుల అభినయమే ప్రధానం కావాలని వారి రూపు రేఖలు కాదని అంటున్న ఈ 32ఏళ్ల మహిళ ఆవేదన ఈ సోషల్ జమానా అర్ధం చేసుకుంటుందా? -
ఆ రెండు సినిమాల్లో ఒక్క చోట కూడా బోర్ కొట్టదు..ఇది నా సవాల్: నిర్మాత
‘‘త్రిబాణధారి బార్బరిక్’ చాలా కొత్త కథ.. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది’’ అని నిర్మాత విజయ్పాల్ రెడ్డి అడిదల అన్నారు. సత్య రాజ్, ఉదయ భాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. విజయ్పాల్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మోహన్ చెప్పిన ‘త్రిబాణధారి బార్బరిక్’ కథ నచ్చడంతో సినిమా ఆరంభించాం. నేను ఇండస్ట్రీ కొత్త.. దీంతో డైరెక్టర్ మారుతిగారు అండగా నిలిచారు. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వారు మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. రమేష్ రెడ్డి విజువల్స్ మెప్పిస్తాయి. నైజాంలో మైత్రీవారు మా సినిమా రిలీజ్ చేస్తున్నారు. వరంగల్లో ప్రదర్శించిన మా చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోలో ఓ జంట ఉచితంగా చూశారు. అయితే, ఇది ఫ్రీగా చూడాల్సిన చిత్రం కాదంటూ వాళ్లు తిరిగి డబ్బులు ఇచ్చారు.. అది చూసిన తర్వాత నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. ‘త్రిబాణధారి బార్బరిక్’ తో పాటుగా ‘బ్యూటీ’ సినిమా నిర్మించాను. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చోట కూడా బోర్ కొట్టదు.. ఇది నా సవాల్’’ అని చెప్పారు. -
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. బాలీవుడ్ అది మర్చిపోయి..: సిమ్రాన్
హీరోయిన్ సిమ్రాన్ (Simran) ఇండస్ట్రీకి వచ్చి నేటి(ఆగస్టు 25)కి 30 ఏళ్లు పూర్తవుతుంది. హర్జై అనే హిందీ చిత్రంతో 1995లో కెరీర్ ప్రారంభించింది సిమ్రాన్. బాలీవుడ్లో కన్నా సౌత్లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీలో నేను గుల్మొహర్ అనే సినిమా చేశాను. ఆ మూవీ టీమ్ అంతా కూడా చాలామంచివారు. అదే సమయంలో మరో ప్రాజెక్ట్ కూడా చేశాను. కానీ, అక్కడ ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోయాను.వీడియో క్లిప్స్ పంపాలా?పైగా ఇక్కడ పాత్రకు నేను సూట్ అవుతానా? లేదా? అని లుక్ టెస్ట్ చేస్తుంటారు. అందుకు నేను అభ్యంతరమేమీ చెప్పను. ఓకే కానీ, కొందరు నాగురించి తెలియక.. పాత్రకు సరిపోతానో? లేదోనని వీడియో చేసి పంపించమంటారు. అంతేకాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యునరేషన్లో పదో వంతు మాత్రమే చెల్లిస్తారు. అందుకే నా గురించి పూర్తిగా తెలుసుకున్నవారి దగ్గరే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు లేవ్టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత చిన్న, మధ్య తరహా సినిమా అవకాశాలు చాలానే వచ్చాయి. అందులోనూ మహిళా ప్రాధాన్యత ఉన్న స్క్రిప్టులే ఎక్కువ! కానీ, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, బడా దర్శకనిర్మాతల నుంచి మాత్రం ఒక్క ఆఫర్ కూడా రాలేదు. నా కెరీర్లో చాలా హిట్లు ఉన్నాయి. ఎంతోమంది యంగ్ టాలెంట్ నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది.సినిమాఈ ఏడాది సిమ్రాన్ ఫుల్ బిజీ. శబ్ధంతో అలరించిన ఆమె గుడ్ బ్యాడ్ అగ్లీలో అతిథి పాత్రలో మెరిసింది. టూరిస్ట్ ఫ్యామిలీతో సూపర్ హిట్టు అందుకుంది. ప్రస్తుతం ద లాస్ట్ వన్ అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. విక్రమ్ సరసన నటించిన ధ్రువ నక్షత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.చదవండి: క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ. -
క్యాన్సర్ బారిన పడ్డ నటి.. అన్నిటికంటే అదే దారుణమంటూ..
బాలీవుడ్ నటి తనిష్టా చటర్జీ (Tannishtha Chatterjee) క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇదే వ్యాధి కారణంగా తండ్రిని కోల్పోయిన ఆమె ఇప్పుడదే మహమ్మారితో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన జర్నీని సోషల్ మీడియాలో పంచుకుంది. గత 8 నెలలు ఎంతో కష్టంగా సాగాయి. క్యాన్సర్తో తండ్రిని కోల్పోయాను. ఇప్పుడదే మహమ్మారి నాకూ వచ్చింది. ఒలిగో మెటాస్టాటిక్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు 8 నెలల క్రితం తేలింది. ఇద్దరికి నేనే ఆధారంనా బాధ చెప్పుకోవడానికి ఈ పోస్ట్ చేయడం లేదు. ప్రేమ, ఆత్మస్థైర్యం గురించి మాట్లాడేందుకు పోస్ట్ చేశాను. నాపై 70 ఏళ్ల తల్లి ఆధారపడి ఉంది. నాకు తొమ్మిదేళ్ల కూతురుంది(తనిష్టాకు పెళ్లవలేదు, పాపను దత్తత తీసుకుంది). ఇద్దరికీ అన్నీ నేనే! వారిని చూసుకోవాల్సిన నేను క్యాన్సర్తో పోరాడుతున్నా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇటువంటి కష్టసమయంలో వారి ప్రేమే నాకు సాంత్వననిస్తోంది. ఒంటరితనం దరిచేరనీయకుండా నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎల్లప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉంటున్నారు. నా పెదాలపై చిరునవ్వును చెరిగిపోనివ్వడం లేదు.ఏదీ రీప్లేస్ చేయలేదుప్రపంచమంతా ఏఐ, రోబోలంటూ పరుగులు తీస్తోంది. కానీ నన్ను కాపాడుతున్న మానవుల ప్రేమను ఏదీ రీప్లేస్ చేయలేదు. వారి కరుణ, ప్రేమ, ఉనికి.. మానవత్వం.. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉంది అంటూ తన స్నేహితులను ట్యాగ్ చేసింది. ఓ ఫోటోను కూడా జత చేసింది. అందులో నటి దివ్య దత్త, లారా దత్తా, విద్యా బాలన్, షబానా అజ్మీ, కొంకణ సేన్ శర్మ తదితరులున్నారు. సినిమాతనిష్టా చటర్జీ.. రోడ్- మూవీ, దేఖ్ ఇండియన్ సర్కస్, గులాబ్ గ్యాంగ్, సన్రైజ్, ఐ లవ్ న్యూఇయర్, పార్చ్డ్, డాక్టర్ రక్మంభాయి, ఝల్కి, జోరమ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. బీబర్ అనే బెంగాలీ మూవీ, బ్రిక్ లేన్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ యాక్ట్ చేసింది. చివరగా ద స్టోరీటెల్లర్ చిత్రంలో కనిపించింది. ఓటీటీలో కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై, స్కూప్ సిరీస్లలో మెరిసింది. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) చదవండి: ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ -
భార్య, కూతురు వదిలేశారు.. నన్ను చూస్తేనే అసహ్యం: నటుడు ఎమోషనల్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పొమ్మంది, ప్రాణంగా చూసుకున్న భార్య తరిమేసింది. ఎక్కడికి వెళ్లాలో తోచని స్థితిలో కొంతకాలం వృద్ధాశ్రమంలో గడిపాడు ప్రముఖ మలయాళ నటుడు కొల్లం తులసి (Kollam Thulasi). తాజాగా ఈ విషయాన్ని గాంధీ భవన్ ఆశ్రమంలో జరిగిన ఓ ఈవెంట్లో బయటపెట్టాడు. కొల్లం తులసి మాట్లాడుతూ.. నేను ఈ ఆశ్రమంలో ఆరునెలలు ఉన్నాను. అందరూ ఉన్న ఒంటరివాడినై ఇక్కడ చేరాను. భార్య, కూతురు వదిలేశారునా భార్య నన్ను వదిలేసింది. నా కూతురు కూడా వదిలించుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డకు నేను పరాయివాడినైపోయాను. తనొక ఇంజనీర్. ఆస్ట్రేలియాలో సెటిలైంది. వాళ్లు నాకు కనీసం ఫోన్ కూడా చేయరు. నన్ను చూసి అసహ్యించుకుంటారు, ద్వేషిస్తారు. ఈ ఆశ్రమంలో నాతో పాటు పని చేసిన ఓ గొప్ప నటి కూడా ఉంది. ఎంతో కష్టపడి పిల్లలను చదివించింది. కుటుంబాన్ని పోషించింది. నటిగా రాష్ట్రస్థాయిలో అవార్డు గెల్చుకుంది. తల్లిని వదల్లేక కుటుంబాన్ని..కానీ, ఇప్పుడు తను కూడా ఇదే ఆశ్రమంలో ఉంటోంది. తనకు వయసుపైబడ్డ తల్లి ఉంది. ఆమెను వదిలించుకోమని ఇంట్లోవాళ్లు చెప్పారు. కన్నతల్లిని అనాథలా వదిలేసేందుకు ఆమెకు మనసొప్పలేదు. బయటకు వెళ్లి బతికేంత స్థోమత లేదు. అందుకే భర్తను, పిల్లల్ని వదిలేసి తల్లిని తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. మనుషులు ఎప్పుడెలా మారిపోతారో మనకు తెలియదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది అందరికీ ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చాడు. ఇది ఒక గుణపాఠంకొల్లం తులసి.. కిరీటం, జాగ్రత్త, అర్థం, గాడ్ ఫాదర్ (1991), ద కింగ్, సత్యం, రావణన్, ఆయుధం, ద్రోణ 2010, రింగ్ మాస్టర్.. వంటి పలు చిత్రాల్లో నటించాడు. థియేటర్ ఆర్టిస్ట్ లవ్లీ బాబు.. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, నలు పెన్నుంగళ్, భాగ్యదేవత, మేరిక్కుండోరు కుంజాడు, తన్మత్ర, పుతియ ముఖం, ప్రణయం వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తల్లిని చూసుకోవడం కోసం సినిమాలు కూడా మానేసింది. View this post on Instagram A post shared by Amal Gandhibhavan (@amalgandhibhavan) View this post on Instagram A post shared by Amal Gandhibhavan (@amalgandhibhavan) చదవండి: ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించా.. నాకు పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు! -
సునీల్ మలయాళ మూవీ 'కాటాలన్’ గ్రాండ్ లాంచ్..
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఇప్పుడదే బ్యానర్పై ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ కాటాలన్ను లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో జరిగింది. బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు పూజా కార్యక్రమంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లగ్జరీ కార్లు, బైక్లు కూడా ఈవెంట్ను మరింత స్పెషల్ చేశాయి. సినిమాలోని కథ లైన్ను దృష్టిలో పెట్టుకుని పూజా ప్రెజెంటేషన్ కూడా డిజైన్ చేశారు. హీరోయిన్గా రాజిషా విజయన్ నటించనున్నారు. తెలుగు నటుడు సునీల్, ‘మార్కో’ ఫేమ్ కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు, జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు ₹45 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 1, బాహుబలి 2, జవాన్, బాఘీ 2 వంటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్లు డిజైన్ చేసిన వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్ కేచా ఖాంఫక్డీ ఈ సినిమాలో కూడా స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Cubes Entertainments®️ (@cubesentertainments) -
‘నీలి నీలి ఆకాశం’ సీక్వెల్ సాంగ్ వచ్చేసింది
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ పాటకి సీక్వెల్ 'ఇలా చూసుకుంటానే' రిలీజ్ అయింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ కోసం ఈ పాటని కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు అనూబ్ రూబెన్స్. ఆస్కార్ విన్నర్, లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు.పాట రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ "ఈరోజు మా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంలో మొదటి పాట 'ఇలా చూసుకుంటానే' ను రానా దగ్గుబాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన మెలోడీ పాట. 'నీలి నీలి ఆకాశం' పాట సీక్వెల్ గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్ మరియు మలేషియా ప్రకృతి అందాలలో చిత్రీకరించాము. అనూప్ రూబెన్స్ అద్భుతమైన భాణీ అందిస్తే సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు.‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిగా వినోద భరిత చిత్రం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు. -
ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సెంచరీ
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ సేతుపతి- నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన సార్ మేడమ్ మూవీ (Sir Madam Movie) కూడా నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో తలైవాన్ తలైవి పేరిట జూలకై 25న విడుదలైంది. తెలుగులో సార్ మేడమ్ పేరిట ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెంచరీ క్లబ్లో మూవీబాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అయితే ఓటీటీలోకి వచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే సార్ మేడమ్ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సత్యజోతి ఫిలింస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.సినిమాసార్ మేడమ్ విషయానికి వస్తే.. యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్, శరవణన్, కాళి వెంకట్, ఆర్కే సురేశ్, మైనా నందిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ప్రదీప్ రాఘవ్ ఎడిటర్గా పని చేశాడు. భార్యాభర్తల మధ్య జరిగే కొట్లాటల సమూహారమే సార్ మేడమ్ సినిమా కథ! Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025 చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్బాస్లో ఛాన్స్, మా వాళ్లే.. -
జీవిత కోసం రాజశేఖర్ ఓవరాక్టింగ్.. కావాలనే గొడవ : డైరెక్టర్
రాజశేఖర్ హిట్ చిత్రాల్లో ‘ఎవడైతే నాకేంటి’ ఒకటి. 2007లొ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. అప్పటి వరకు వరుస ప్లాఫులతో సతమతమవుతున్న రాజశేఖర్కి.. ఎవడైతే నాకేంటి మూవీ బిగ్ రిలీఫ్ని ఇచ్చింది. వి. సముద్ర, జీవిత సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ ఈ చిత్రం మొత్తం నేనే తెరకెక్కించానని..చివరిలో గొడవ చేసి మరీ జీవిత తన పేరుని వేయించుకుందని అంటున్నాడు దర్శకుడు వి. సముద్ర.హిట్ అవుతుందని తెలిసే.. జీవిత-రాజశేఖర్ పేరు కోసం తనతో గొడవ చేశారని చెప్పారు. రాజశేఖర్ హీరోగా నటించిన ‘సింహరాశి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సముద్ర.. ఆ తర్వాత 2007లో మరోసారి రాజశేఖర్తో కలిసి ‘ఎవడైతే నాకేంటి’ సినిమా చేశాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ గొడవ వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పాడు సముద్ర. ఐదు సినిమాలు రిజెక్ట్ చేశాసింహరాశి (2001) విడుదల తర్వాత రాజశేఖర్ నాతో మరో సినిమా చేయాలకున్నాడు. ఆయనకు నచ్చిన కథలను నా దగ్గరకు పంపించేవాడు. నేను విని రిజెక్ట్ చేశా. అలా 2001-07 మధ్య కాలంలో ఐదు సినిమాలను రిజెక్ట్ చేశా. దీంతో రాజశేఖర్ హర్ట్ అయ్యాడు. ‘నేను పంపిస్తే రిజెక్ట్ చేస్తాడా’ అనుకున్నాడు. కానీ అవి ఆడవనే విషయం నాకు తెలుసు. నేను ఊహించినట్లే 2001-07 మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన ఏ చిత్రం కూడా విజయం సాధించలేదు. పరుచూరితో కబురుఆయన చెబితే రిజెక్ట్ చేస్తున్నానని తెలిసి చివరకు పరుచూరితో నాకు ఫోన్ చేయించి మలయాళ చిత్రం ‘లయన్’ కథ చెప్పించాడు. అది నాకు బాగా నచ్చింది. రాజశేఖర్తో ఈ చిత్రం చేస్తానని చెప్పి.. ఓ కండీషన్ పెట్టా. ఇందులో 60 శాతం మార్పులకు ఒప్పుకుంటే చేస్తానని పరుచూరితో చెప్పా. ఆయన అదే విషయాన్ని రాజశేఖర్తో చెబితే.. ‘సముద్ర చేస్తానని ఒప్పుకున్నాడు కదా..అది చాలు’ అన్నాడట. పేరు కోసం.. జీవిత, రాజశేఖర్ కూడా కథా చర్చల్లో కూర్చుంటారు. సలహాలు ఇస్తుంటారు. నేను చెప్పినట్లుగానే లయన్లో భారీ మార్పులు చేసి ‘ఎవడైతే నాకేంటి’ కథ రెడీ చేశాం. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాం. సినిమా బాగా వచ్చింది. దీంతో రాజశేఖర్, జీవిత నన్ను తొలగించి .. డైరెక్టర్గా వారి పేరు వేయించుకోవాలనుకున్నారు. ఈ విషయం ఒక రచయిత ద్వారా నాకు తెలిసింది. గొడవ కోసం ప్లాన్షూటింగ్ మధ్యలోకి వచ్చిన తర్వాత నన్ను తొలగించాలని వారిద్దరు భావించారు. అందులో భాగంగానే రాజశేఖర్ సెట్కి వచ్చి ‘ఈ సీన్ బాలేదు.. అది బాలేదు’ అంటూ ఓవరాక్టింగ్ చేశాడు. జీవిత ఆయనను కూల్ చేస్తున్నట్లు నటించింది. ఇదంతా చూసి.. ‘పేరు కోసం ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నారు? అదే కావాలంటే నాకు డైరెక్ట్గా చెప్పండి. మీరే తీసుకొని మీ పేరే వేసుకోండి. నేను ఇక చేయను’ అని బయటకు వచ్చేశా. తర్వాత ఇండస్ట్రీ పెద్దలు చెప్పడంతో మళ్లీ నన్ను రిక్వెస్ట్ చేశారు. దీంతో నేనే సినిమా మొత్తం కంప్లీట్ చేశా. ఇక చివరిలో మళ్లీ కావాలనే నన్ను ఇరిటేట్ చేశారు. రెమ్యునరేషన్ కూడా సగమే ఇచ్చారు. ఇదంతా తమకు పేరు రావాలనే చేశారు. వ్యక్తిగతంగా జీవిత, రాజశేఖర్ చాలా మంచొళ్లు. రాజశేఖర్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. కానీ పేరు కోసం అలా చేయడం నచ్చలేదు. ఇప్పుడు కూడా నేను రాజశేఖర్తో మాట్లాడతా. కలుస్తుంటా. నాకు ఎవరిపై కోపం ఉండదు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు. -
సీక్రెట్గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలంటూ ఎగబడిపోతుంటారు. వారు హడావుడిలో ఉన్నా, వద్దని చెప్తున్నా వినిపించుకోరు. కొందరైతే స్టార్స్కు తెలియకుండా వారిని ఫాలో చేసి సీక్రెట్గా ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) విషయంలో ఇప్పుడదే జరిగింది. కూతురు దువాతో కలిసి బయటకు వెళ్లిన దీపికను ఓ అభిమాని ఫాలో అయ్యాడు. దీపికా అసహనంముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వాళ్లను సీక్రెట్గా కెమెరాలో చిత్రీకరించాడు. ఇది దీపికా కంట పడటంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఇలా చేయడం తప్పని మందలించింది. వీడియో డిలీట్ చేయమని కోరింది. ఇప్పటివరకు దీపికా జంట.. కూతురి ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్) కూడా స్టార్స్ విన్నపం మేరకు దువా ఫోటోలను క్లిక్ చేయకుండా సహకరించారు.మందలించినా వినకుండా..దీపికా-రణ్వీర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే సదరు అభిమాని మాత్రం ఇలా వీడియో తీయడం.. అది వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పేరెంట్స్ అనుమతి లేకుండా దువా ఫేస్ను రివీల్ చేశాడని ఆగ్రహిస్తున్నారు. ఆమె వద్దని చెప్పినా వినకుండా వీడియో పోస్ట్ చేయడం తప్పని మందలించారు. ఆన్లైన్లో కూతురి ఫోటో ప్రత్యక్షం కావడంపై దీపికా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.దువాకాగా దీపికా, రణ్వీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్ 8న కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన పాపాయికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్.. ధురంధర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది. అలాగే డాన్ 3 సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు. దీపికా.. అల్లు అర్జున్- అట్లీ మూవీలో నటించనుంది. deepika herself requested not to click or post pictures or videos of dua yet people are still doing it please out of basic respect and privacy stop this behaviour— 🎀 (@mecoreeee) August 23, 2025baby dua is the cutest omggg 😭😭😭🤍🤍🤍🤍 i won't share the vid, dp is clearly bothered by whoever filmed it. it their choice to protect their daughter's privacy until they feel like sharing it with us. BUT BABYGIRL IS JUST TOO ADORABLE 🥹🫶🏼 bless her 🤍— srkdp (@srkdeepikaholic) August 23, 2025DELETE THE VIDEO, STOP SHARING AND SPREADING IT. It’s a breach of privacy, Deepika was asking the person to stop recording. They didn’t consent to Dua being clicked or recorded.— nikita💫 (@nikita1372) August 23, 2025 చదవండి: సిద్దిపేట మోడల్కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష! -
‘అన్నయ్య’ రెండు..‘అబ్బాయ్’ ఒకటి.. మెగా ఫ్యాన్స్కి పండగే
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. చివరిగా వచ్చిన భోళాశంకర్ (2023) కూడా డిజాస్టర్ అయింది. దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాకు లోనయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ బాధ నుంచి తేరుకొని ‘అన్నయ్య’ నుంచి సినిమా రాకున్నా పర్లేదు..‘అబ్బాయ్’ నుంచి వస్తుంది కదా అనుకొని ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా మిగిలింది. ఇలా ఈ ఏడాది అటు చిరు..ఇటు చరణ్ తమ అభిమానులను డిసప్పాయింట్ చేశారు. కానీ వచ్చే ఏడాది మాత్రం మెగా ఫ్యాన్స్కి పండగ అనే చెప్పాలి. 2026లో చరణ్ ఒక చిత్రంతో పలకరిస్తే.. మెగాస్టార్ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. పండగకి వచ్చేస్తున్నాడుమెగాస్టార్ చిరంజీవి ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయింది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చిరు స్థాయికి తగ్గ విజయమే లేదు. అందుకే 2026వ సంవత్సరాన్ని పక్కా ప్లాన్తో సెట్ చేసుకున్నాడు. సంక్రాంతి నుంచే అభిమానులను అలరించబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్కి అదిరిపోయే స్పందన వచ్చింది. చిరంజీవి నుంచి పుల్ ఫన్ మూవీ వచ్చి చాలా కాలమైంది. అనిల్ రావిపూడి మూవీ అంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సింది. ఇందులో కూడా చిరుతో కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. పండగ వేళ వస్తున్న చిత్రం... కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యతను మెగా అభిమానులు తీసుకోవడం గ్యారెంటీ. సమ్మర్ స్పెషల్ఇక ఇదే ఏడాది చిరంజీవి నుంచి మరో సినిమా రాబోతుంది. అదే విశ్వంభర. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సోషియో-ఫాంటసీ చిత్రమిది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. అయితే గతంలో విడుదైన టీజర్లోని వీఎఫెక్స్ సీన్లపై విమర్శలు రావడంతో రిలీజ్ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తో అబ్బాయ్.. ఇక 2026లో మెగా ఫ్యాన్స్కి ‘అబ్బాయ్’(రామ్ చరణ్) కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గేమ్ ఛేంజర్తో భారీ అపజయాన్ని అందుకున్న చరణ్.. ‘పెద్ది’తో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇదొక పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది చిరంజీవి రెండు, చరణ్ ఒక చిత్రంలో ఫ్యాన్స్ని అలరించబోతున్నారు. -
కామెడీ రాయడం కష్టం
నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్ నిమ్మలపూడి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నాకు ‘సుందరకాండ’ తొలి చిత్రం. పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ఈ రోజుల్లో ఓ అబ్బాయికి 30 ఏళ్ల వయసు దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయితీ అనుకుంటే, ఆ అబ్బాయి నాకు ఫలానా ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయే కావాలని పట్టుబడితే ఏంటి? అన్నదే ఈ సినిమా కథ. రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపు ఉన్న లవ్ స్టోరీ ఇది. హీరో పాత్రకు ఎక్కువ వయసు ఉన్న అమ్మాయి పాత్ర కోసం శ్రీదేవి విజయ్కుమార్గారిని, హీరో కంటే తక్కువ వయసున్న పాత్ర కోసం వృతి వాఘానిని తీసుకున్నాం. నాకు కామెడీ కథలంటే ఇష్టం. అయితే కామెడీ రాయడం కష్టం. ఈ సినిమాలో క్లీన్ కామెడీ ఉంటుంది. లక్కీగా ఈ సినిమాలో అందరూ కామెడీ బాగా చేయగలిగినవారే ఉన్నారు. బాగా చేశారు’’ అని అన్నారు. -
శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా!
స్ప్రింగులా బాడీని కదిలిస్తూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న తారక్.. డ్యాన్స్లోనూ టాప్ హీరోగా తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. అయితే డ్యాన్స్ ఇరగదీస్తున్న హీరోయిన్ శ్రీలీలకు తారక్ ఆదర్శమట! ఈ విషయాన్ని ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత చెప్పుకొచ్చింది. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి శ్రీలీల హాజరైంది. అప్పుడే డిసైడయ్యా..శ్రీలీల (Sreeleela) గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పేందుకు ఆమె తల్లి స్వర్ణలత కూడా వేదికపై వచ్చింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ప్రస్తావించింది. తారక్ చిన్నప్పుడు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన ఫోటోను జగపతిబాబు చూపించాడు. అది చూసిన స్వర్ణలత.. నాకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించాలని ఈ ఫోటో చూశాకే డిసైడ్ అయ్యాను.ఎన్టీఆర్తో మాట్లాడా..1997లో లాస్ ఏంజిల్స్లో తానా సభలు జరిగాయి. మేము అక్కడికి వెళ్లాం. అక్కడ తారక్ డ్యాన్స్ చేశాడు. అనంతరం తారక్తో మాట్లాడాను. నాకు అమ్మాయి పుడితే కచ్చితంగా నీలా డ్యాన్స్ చేయిస్తాను అని చెప్పాను. అనుకున్నట్లుగానే నా కూతురిని డ్యాన్సర్ చేశాను అని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే శ్రీలీల మంచి డ్యాన్సర్ అయిందని పేర్కొంది.సినిమాశ్రీలీల.. పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఈమె రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది. Im Saying N'th TimeYour Biggest Strength is Dance bro @tarak9999 Nee Dance Inspiration Valla TFI ki #Sreeleela lanti No.1 Lady Dancer Dorikindipic.twitter.com/0aIdnKpr5N— Saleem Tarak💙 (@Tarak_Holic) August 23, 2025 చదవండి: అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా? -
‘త్రిబాణధారి బార్బరిక్’లో కొత్తదనం ఇదే : దర్శకుడు
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ .ఎన్ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో దర్శక–నిర్మాత మారుతి సమర్పణలో అడిదెల విజయ్పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలని సంగీతం నేర్చుకుని, ఎన్నో ఈవెంట్స్లో పాటలు పాడాను. ఇన్ని రోజులు నాకు సంగీతమే తిండి పెట్టింది.దర్శకుడిగా ‘త్రిబాణధారి బార్బరిక్’ నా తొలి చిత్రం. నేను కథను అద్భుతంగా నరేట్ చేయగలను. అలా మారుతిగారికి చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. ఓ పాప చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఆగస్టు 15 సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంట్రవెల్, ఆగస్టు 15 తర్వాత పది రోజులకు జరిగే మరో కథతో సెకండాఫ్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ఈ సినిమాలో విలన్ అంటూ ఎవరూ ఉండరు. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది. ఈ సినిమా కొత్తదనం అదే. బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్ధం జరిగేలా చేస్తాడు. నార్త్లో బార్బరికుడికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు హైదరాబాద్లోనూ నాలుగు టెంపుల్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. నా తర్వాతి చిత్రం మారుతిగారి బ్యానర్లోనే ఉండొచ్చు’’ అన్నారు. -
ఆ సీన్ కోసం 28 టేకులు.. ఇప్పటికీ మర్చిపోలేను: విద్యాబాలన్
'పరిణీత' చిత్రంతో విద్యాబాలన్ (Vidya Balan) కెరీర్ మొదలైంది. ఈ సినిమా 2005 జూన్ 10న విడుదలైంది. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఇంత పరిచయమా? నాకు తెలీదుఈ సందర్భంగా విద్యాబాలన్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నాకు బాగా గుర్తు.. సైఫ్ అలీ ఖాన్ తల్లి, బాలీవుడ్ స్టార్ షర్మిల ఠాగూర్ (Sharmila Tagore) ఓరోజు సెట్కు వచ్చింది. తనను చూసేందుకు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మామధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్.. ఓహ్, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకింతవరకు తెలీదు అని సరదాగా జోక్ చేశాడు. ఎప్పుడు గుర్తు చేసుకున్నా..వెంటనే నేను నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని బదులిచ్చాను. సైఫ్ సరదాగా ఉంటూ ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. దాదా(ప్రదీప్ సర్కార్) వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్నవిషయాన్ని కూడా గుర్తించి సీన్ మళ్లీ చేయిస్తాడు. అవసరమైతే వంద టేకులైనా తీసుకుంటాడు.కన్నీటి చుక్క సరిగ్గా రావాలని..కేవలం మా పర్ఫామెన్స్ కోసమే కాదు, వెనకాల పావురాలు ఎగిరే క్షణాలు కూడా సరిగ్గా రావాలనుకుంటాడు. అన్నీ సరిగ్గా కుదరాలని భావిస్తాడు. ఒక పాటలో నేను ఏడవాల్సి ఉంటుంది. ఆ పాటలోని ఓ లైన్ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రదీప్ సర్కార్.. అనారోగ్యంతో 2023లో కన్నుమూశారు. -
తమన్, కార్తీక్ల మంచి మనసు.. అంధుడి కంటిచూపుకి హామీ!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman) తనది మంచి మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు. కళ్లు లేని వ్యక్తికి చూపు ప్రసాదిస్తానని మాటిచ్చాడు. ఇతడు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగింగ్ కాంపిటీషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ రాబోతోంది. ఆగస్టు 29న ఈ షో ప్రారంభం కానుంది. ఇందులో తమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా యాంకరింగ్ చేయనున్నారు.టాలెంట్కు ఫిదాఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఆడిషన్స్ నిర్వహించారు. వారిలో ఓ అంధుడు కూడా ఉన్నాడు. అతడి టాలెంట్కు జడ్జిలు ఫిదా అయ్యారు. చిన్నప్పటి నుంచే కంటిచూపు లేదా? అని తమన్ అడగ్గా.. పుట్టినప్పటినుంచే గుడ్డివాడిని అని తెలిపాడు. అందుకు తమన్.. నేను, కార్తీక్ కలిసి నీకు కళ్లు కనిపించేలా చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ మాటకు అంధుడు ఎంతగానో సంతోషించాడు. కళ్లు లేని వ్యక్తికి ఆపరేషన్ ద్వారా చూపు ప్రసాదించేందుకు ముందుకు వచ్చిన తమన్, కార్తీక్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే? -
ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
అటు థియేటర్లో ఈ మధ్య అన్నీ పెద్ద సినిమాలే రిలీజవ్వగా ఇటు ఓటీటీ (OTT)లో చిన్నాపెద్ద తేడా లేకుండా అన్నిరకాల చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయ్, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇన్స్పెక్టర్ జెండే (Inspector Zende). మనోజ్.. మధుకర్ జెండె అనే పోలీస్గా నటించగా జిమ్ సర్బ్.. కార్ల్ భోజ్రాజ్ అనే స్విమ్సూట్ కిల్లర్గా కనిపించనున్నాడు.ఓటీటీలోబాలచంద్ర కడం, సచిన్ ఖేడెకర్, గిరిజ, హరీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్మయి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలింది. ఈ మూవీని ఓం రౌత్, జే షెవక్రమణి నిర్మించారు. ఇకపోతే మనోజ్ బాజ్పాయ్ చివరగా డిస్పాచ్ మూవీలో నటించాడు. ఓటీటీలో కిల్లర్ సూప్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ చేస్తున్నాడు. జిమ్ సర్బ్ విషయానికి వస్తే.. ఇతడు చివరగా బ్లాక్బస్టర్ మూవీ కుబేరలో నటించాడు. ఇందులో విలన్గా నటించి మెప్పించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం -
బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: 'ఇంద్ర' నటుడి ఆగ్రహం
సోషల్ మీడియాను మంచికన్నా చెడుకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ప్రాణాలతో ఉన్న నటులు చనిపోయారంటూ ఫేక్ వదంతులు సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రజా మురద్ (Actor Raza Murad) గురించి ఇటువంటి ఫేక్ ప్రచారం చేపట్టారు. యాక్టర్ చనిపోయాడని ప్రకటిస్తూ నివాళులు అర్పించారు. సదరు పోస్ట్పై రజా మురద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు తాను బతికున్నానని నిరూపించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. అసత్య ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీరియస్ మ్యాటర్రజా మురద్ మాట్లాడుతూ.. నేను ఇంకా బతికున్నందుకు కొందరు చాలా బాధపడుతున్నారు. కారణమేంటో నాకర్థం కావట్లేదు. ఏకంగా నేను చనిపోయానంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు పనిచేశానని, కానీ నన్ను స్మరించుకోవడానికి కూడా ఎవరూ లేరని రాశారు. నా పుట్టినరోజు, అలాగే ఫేక్ డెత్ డెట్ కూడా ఆ పోస్ట్లో జత చేశారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. చాలా సీరియస్.చెప్పీచెప్పీ గొంతెండిపోయిందినేను బతికే ఉన్నానని చెప్పీచెప్పీ నా గొంతు, నాలుక, పెదాలు తడారిపోయాయి. చనిపోయానన్న వార్త అంతటా వైరలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి నాకు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి వదంతి సృష్టించినవారిది వక్రబుద్ధి అయి ఉండాలి. జీవితంలో ఏదీ సాధించడం చేతకాక ఇలాంటి నీచపు పనులు చేసి ఆనందిస్తున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి! పోలీసులు ఆ దుర్మార్గుడిని పట్టుకుంటానని హామీ ఇచ్చారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇక చాలుబతికుండగా ఎవరినీ చంపొద్దు.. ఇలాంటివి ఇకనైనా ఆపేయండి. నాగురించి మాత్రమే చెప్పడం లేదు. చాలామంది సెలబ్రిటీలను ఇలాగే సోషల్ మీడియాలో చంపేస్తున్నారు. అది పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. రజా మురద్.. జోధా అక్బర్, గోలియాకీ రాస్లీల రామ్లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో.. ఇంద్ర, జానీ, సుభాస్ చంద్రబోస్, రుద్రమదేవి చిత్రాల్లో నటించాడు. బుల్లితెరపై మేఘ బర్సేంగె సీరియల్లో నటించాడు.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ -
ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ
మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్’. ఓటీటీలో సూపర్ హిట్ మూవీఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్ పాండ్యరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్ యాక్షన్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). కథ‘మామన్’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. ఎలా ఉందంటే?అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు -
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
తెలుగు హీరో ధర్మ మహేశ్ (Dharma Mahesh) తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అతడి భార్య గౌతమి ఆరోపించింది. ఇన్నాళ్లూ మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని చెప్తోంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.గర్భంతో ఉన్నప్పుడు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ.. ధర్మ మహేశ్ నటుడయ్యాకే విశ్వరూపం చూపించాడు. సినిమాల్లో హీరో, కానీ నిజ జీవితంలో విలన్. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలు మాత్రం తీసుకుంటాడు. అతడి కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. చంపేస్తానని బెదిరింపులువాళ్లు వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ భరించలేకే పోలీసులను ఆశ్రయించాను. అయినప్పటికీ పోలీసులంటే ధర్మ మహేశ్కు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించాడు. ఇన్నాళ్లు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా.. ఇక నావల్ల కాదు! విడాకులివ్వను, ఇలాగే వేధిస్తానంటే ఊరుకోను. సామరస్యంగా విడిపోదాం అని చెప్పుకొచ్చింది.సినిమాకాగా ధర్మ మహేశ్, గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. గతంలో మహేశ్పై వరకట్న వేధింపుల ఆరోపణలు రాగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. మహేశ్.. సిందూరం, డ్రింకర్ సాయి చిత్రాల్లో నటించాడు.చదవండి: పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా! -
నువ్వు నా హీరో.. తండ్రి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన రామ్చరణ్
తండ్రే తనకు ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా హీరో రామ్చరణ్ (Ram Charan). నేడు (ఆగస్టు 22) చిరంజీవి (Chiranjeevi Konidela) 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కేక్ కట్ చేయించి, బర్త్డే సెలబ్రేట్ చేశాడు చరణ్. తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన్ను మనసారా హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవికి కేక్ తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.నా హీరో..నాన్నా.. ఈరోజు కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు. నీలాంటి మనిషిని సెలబ్రేట్ చేసుకునే రోజు. నా హీరో, నా గైడ్, నా ఇన్స్పిరేషన్.. అన్నీ నువ్వే! నా ప్రతి విజయం, నేను పాటించే విలువలన్నీ నీ నుంచి వచ్చినవే.. 70 ఏళ్ల వయసు వచ్చినా నీ మనసు మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతోంది. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మరెన్నో యేళ్లు గడపాలని కోరుకుంటున్నాను. ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ నాన్న.. అంటూ రామ్చరణ్ ఎమోషనల్ అయ్యాడు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
కారులో కూర్చుని ఏడ్చేశా..: అనుపమ పరమేశ్వరన్
‘‘సినిమా అంటే ఒక సెలబ్రేషన్. కమర్షియాలిటీ కూడా. అయితే ఈ తరహా చిత్రాలతో పాటు ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేసే ‘పరదా’లాంటి చిత్రాలు కూడా రావాలి. ‘పరదా’ చాలా కొత్త కథ. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన సినిమా ఇది’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) అన్నారు. అనుపమ సంగతులుఅనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, సంగీత, దర్శన, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సపోర్ట్తో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన సంగతులు. కనెక్ట్ అయ్యా..‘పరదా’లాంటి కథలు తెలుగులోనే కాదు... భారతీయ సినిమాలోనూ చాలా అరుదు. ఈ తరహా ఫ్రెష్ కాన్సెప్ట్తో కూడిన కథ నా దగ్గరకు రాలేదు. అందుకే దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. ‘పరదా’ ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది సక్సెస్గా భావిస్తాను. సవాల్గా తీసుకున్నా..ఈ చిత్రంలో చాలావరకు నేను పరదా ధరించిన సన్నివేశాల్లోనే కనిపిస్తాను. కొన్ని సీన్స్లో సైలెంట్గానే ఉంటాను. అయితే నా పరదా వెనక నా క్యారెక్టర్ తాలూకు భావోద్వేగం కనిపిస్తుంది. నా కళ్లతో, నా బాడీ లాంగ్వేజ్, నా వాయిస్తో నేను నటించగలిగానని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఓ సవాల్గా తీసుకుని ఈ సినిమా చేశాను. ‘పరదా’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కారులో కూర్చుని ఏడ్చేశా..నిజానికి నేను స్విచ్చాన్, స్విచ్చాఫ్ యాక్టర్ని. అయితే ‘పరదా’ మాత్రం వెంటాడింది. నా పాత్రకు ఆత్మహుతి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీన్లో వచ్చే మ్యూజిక్ అవన్నీ నన్ను కదిలించేశాయి. కారులో కూర్చుని ఏడ్చేశాను. సోషల్ మీడియాలో ‘పరదా’ సినిమా పురుషులకు కాస్త వ్యతిరేకంగా ఉందన్నట్లుగా ఎవరో పోస్ట్ చేశారు. అది చూసి బాధగా అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఏదైనా మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. విద్యాబాలన్పై ముద్రఓ హీరోయిన్ నటించిన ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. గతంలో మోహన్లాల్గారితో విద్యాబాలన్గారు చేయాల్సిన సినిమా ఒకటి ఇలాంటి కారణం (ఐరన్ లెగ్) వల్లే క్యాన్సిల్ అయ్యిందట. ఆ తర్వాత విద్యాబాలన్ చేయాల్సిన తొమ్మిది సినిమాల నుంచి ఆమెను తప్పించారట. ఇది ఎంతవరకు కరెక్ట్?అదెందుకు పట్టించుకోరు?‘పరదా’లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ‘డీజే టిల్లు 2’ సినిమాలో మరో విభిన్నమైన పాత్ర చేశాను. ‘డీజే టిల్లు 2’లో నేను గ్లామరస్గా కనిపించిన విషయాన్నే మాట్లాడుతున్నారు. కానీ, అందులో నేను గన్ పట్టుకుని, యాక్షన్ చేశాను. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఈ అంశాలు హైలైట్ కావడం లేదు. ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్ -
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ యాక్షన్కు సై అంటున్నారు. అలాంటి మెగాస్టార్కు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun).. తన మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారికి హ్యాపీ బర్త్డే అని ట్వీట్ చేశాడు. దీనికి చిరుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో జత చేశాడు. మెగాస్టార్పై తనకున్న అభిమానం, గౌరవాన్ని ఇలా ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు బన్నీ. వెంకటేశ్, సాయిదుర్గ తేజ్, తేజ సజ్జా, నారా రోహిత్.. ఇలా తదితరులు మెగాస్టార్కు సామాజిక మాధ్యమాల్లో బర్త్డే విషెస్ చెప్పారు. Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X— Allu Arjun (@alluarjun) August 22, 2025 Happy Birthday, dear @KChiruTweets! Wishing you abundant health, happiness, and many more wonderful years ahead✨ pic.twitter.com/5QO1ZKOpgj— Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2025 View this post on Instagram A post shared by Teja Sajja (@tejasajja123) Happiest b’day to the one & only Megastar @KChiruTweets garu ❤️🎊 A true crowd-puller & legend who inspires on & off screen 😊 Best wishes for #Vishwambhara, #Mega157 & all upcoming projects 🔥 #HBDMegastarChiranjeevi pic.twitter.com/qj7XBFHSz7— Vijaya Durga Productions (@VijayaDurgaProd) August 22, 2025 చదవండి: నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన -
నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు
ప్రముఖ మలయాళ యాంకర్, నటి ఆర్య (Arya Babu) రెండో పెళ్లి చేసుకుంది. నటుడు, కొరియోగ్రాఫర్ సిబిన్ బెంజమిన్తో మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. అతడికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది. 12 ఏళ్ల కూతురితో మండపానికి..తన జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆర్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి.. తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది. తల్లి మెడలో మూడు ముళ్లు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతుండగా అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఫ్రెండ్స్ భార్యాభర్తలుగా..కుంజిరమయనం, పవ, ఉల్టా, మెప్పడియాన్, క్వీన్ ఎలిజబెత్ వంటి పలు మలయాళ చిత్రాల్లో ఆర్య నటించింది. అక్కడి బుల్లితెరపై టాప్ యాంకర్గా రాణిస్తోంది. మలయాళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది. నటి అర్చన సోదరుడు, ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ను పెళ్లాడింది. వీరికి రోయ అనే కూతురు పుట్టింది. 2019లో భర్త నుంచి విడిపోయినట్లు ఆర్య ప్రకటించింది. డీజే సిబిన్.. మలయాళ బిగ్బాస్ ఆరో సీజన్లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతడిక్కూడా గతంలో పెళ్లయి పిల్లలున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమలో పడటంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: సైలెంట్గా కార్తీకదీపం సీరియల్ నటి కూతురి పెళ్లి -
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
'బంగారుకోడిపెట్ట వచ్చెనండి..' వంటి పలు స్పెషల్ సాంగ్స్లో డ్యాన్స్తో అలరించింది డిస్కో శాంతి (Disco Shanti). మొదట్లో సహాయనటిగా యాక్ట్ చేసినా ఐటం సాంగ్స్తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 1996లో టాలీవుడ్ హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి ఫ్యామిలీకే సమయం కేటాయించింది. బుల్లెట్ మూవీలో..2013లో శ్రీహరి అనారోగ్యంతో కన్నుమూయగా.. ఆ తర్వాత డిస్కో శాంతి ఎన్నో ఇబ్బందులు పడింది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తోంది. రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న బుల్లెట్ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. మద్యానికి బానిసఅందులో డిస్కో శాంతి మాట్లాడుతూ.. బావ(శ్రీహరి) చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలాను. సరిగా తినకపోయేదాన్ని. తాగుడుకు బానిసయ్యాను. నువ్వు కూడా వదిలేసి వెళ్లిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు అడిగారు. ఆ మాట నన్ను కదిలించింది, అప్పటినుంచి తాగుడు మానేశాను. ఐదేళ్లుగా దాని జోలికి పోలేదు. నా కొడుకు ఓ సినిమా చేశాడు. యాక్టింగ్ బాగా చేశాడు. కానీ మూవీ అస్సలు బాగోలేదు.డైరెక్టర్ పారిపోయాడుఆ సినిమా చూసినప్పుడు డైరెక్టర్ ఎక్కడ? అని అడిగాను. అప్పటికే అతడు పారిపోయాడు, నా ముందుకు రాలేదు. అదొక సినిమానా? థూ.. నాకు వారం ముందు చెప్పినా ఏవైనా మార్పులుచేర్పులు చేసేదాన్ని. బావ సినిమాలకు కూడా చాలా కరెక్షన్స్ చేశాను అంటూ కుమారుడి సినిమాపై డిస్కో శాంతి అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీహరి- శాంతి పెద్ద కుమారుడు మేఘాంశ్ రాజ్ధూత్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. 2019లో రిలీజైన ఈ సినిమా పరాజయం పాలైంది.చదవండి: తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా -
భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన దిల్ రాజు... వీడియో వైరల్
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు తన బ్యానర్లో రాబోతున్న సినిమా పనులు, మరోవైపు ఎఫ్డీసీ చైర్మన్ బాధ్యతలతో నిత్యం బిబీ బిబీగా ఉండే దిల్ రాజు.. ఖాలీ సమయం దొరికితే మాత్రం ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటాడు. ఆయనకు దైవభక్తి కాస్త ఎక్కువే. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి అంటే ఆయనను చాలా ఇష్టం. అందుకే సొంతూరిలో గుడిని సైతం నిర్మించాడు. వీలు ఉన్నప్పుడల్లా భార్య,కొడుకుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాడు. తాజాగా తన కొత్త ఇంట్లో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాడు దిల్ రాజు. పూజ అనంతరం సతీమణి తేజస్వినితో కలిసి సంప్రదాయం ప్రకారం నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దిల్ రాజు, తేజస్వినిల వివాహం 2020లో జరిగింది. దిల్రాజుకు ఇది రెండో వివాహం. మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. 2020లో తేజస్వీని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022 బాబు పుట్టాడు. పేరు అన్వీరెడ్డి. View this post on Instagram A post shared by IDream Media (@idreammedia) -
తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా
బుల్లితెర నటి, కార్తీకదీపం సీరియల్ విలన్ భావనా రెడ్డి ఇంట శుభకార్యం జరిగింది. భావన కూతురు రేష్మ పెళ్లిపీటలెక్కింది. తేజ అనే యువకుడితో రేష్మ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణు-సిద్ధు, జ్యోతిరెడ్డి, ప్రియతమ్ చరణ్, ప్రీతమ్, ప్రభాకర్.. ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సైలెంట్గా పెళ్లి చేసిన నటిసోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకునే భావన.. కూతురి పెళ్లిని మాత్రం గోప్యంగా ఉంచింది. కూతురి వెడ్డింగ్కు సంబంధించి ఒక్క ఫోటో, వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయలేదు. సైలెంట్గా పెళ్లి చేయాలనుకుందో లేక సడన్ సర్ప్రైజ్ ఇద్దామనుకుందో తనకే తెలియాలి. భావనా రెడ్డి.. బుల్లితెరపై ముద్ద మందారం, త్రినయని, మావారు మాస్టారు.. ఇలా పలు సీరియల్స్లో నటించింది. కార్తీకదీపం ఫస్ట్ పార్ట్లో రుద్రాణిగా విలనిజం పండించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపించింది.చదవండి: Bigg Boss Agnipariksha: ప్రోమో సూపర్.. కానీ టైమింగే తేడా! -
నాలో మార్పు వచ్చింది..ఇకపై అలా చేయను : సమంత
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన సమంత..ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ సామ్.. దాన్ని నుంచి పూర్తి కోలుకొని మళ్లీ మునుపటి అందంతో కనిపిస్తూ, కెమెరా ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరి ఒకేసారి ఐదారు చిత్రాలు మాత్రం చేయనని చెబుతోంది ఈ బ్యూటీ. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ (Grazia India) లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిసిన సామ్.. ఆ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్పై ఆసక్తిక విషయాలను పంచుకుంది.‘ఇకపై సినిమాలతో పాటు అరోగ్యంపై కూడా దృష్టిపెడతాను. గతంలో పోలిస్తే నాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇకపై సినిమాలతో పాటు ఫిట్నెస్పై కూడా ఎక్కువ దృష్టిపెడతాను. మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. గతంలో మాదిరి ఒకేసారి ఐదారు సినిమాలు చేయను. తక్కువ సినిమాలు చేసినా..ప్రేక్షకులకు మనసుకు నచ్చే నచ్చే వాటితోనే పలకరిస్తాను. ప్రాజెక్ట్ల సంఖ్య తగ్గింది.. కానీ, వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుంది’ అతని సమంత చెప్పుకొచ్చింది.సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఇటీవల ప్రేక్షకుల ముందుక వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్లో నటిస్తూంది. రాజ్-డీజే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్లో ఆదిత్యారాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
బాలీవుడ్లో కొన్నేళ్ల పాటు నెం1 అందాల నటిగా యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మనీషా కొయిరాలా(Manisha Koirala ). సుభాష్ ఘయ్ తీసిన 1942 ఎ లవ్ స్టోరీ సినిమా, అందులోని పాటల్లో మనీషా కొయిరాలా అందాన్ని మర్చిపోవడం అంత తేలిక కాదు అంటారు బాలీవుడ్ సినీ ప్రేమికులు. నాగార్జున సరసన క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ నేపాలీ సుందరి. అద్భుతమైన విజయాలను చవిచూసినా, విధి ఆమె పట్ల చిన్న చూపు చూడడంతో క్యాన్సర్ బారిన పడింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తన వయసుకు తగిన పాత్రలతో తిరిగి బాలీవుడ్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీషా.. పలు విషయాలను పంచుకుంది. అందాల నటిగా తెరపై గ్లామర్ను గుబాళింపజేసిన మనీషా బాలీవుడ్లో అనేక అఫైర్స్ వార్తలకు కూడా కేరాఫ్గా నిలిచింది. ‘అగ్ని సాక్షి’ (1996) సినిమాలో కలిసి నటించినప్పుడు సహ నటుడైన నానా పటేకర్తో సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయిన నానా పటేకర్ ప్రతీ తెల్లవారుఝామున మనీషా ఇంటి నుంచి తిరిగి రావడం అనేకమార్లు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా సౌదాగర్ లో నటించిన వివేక్ ముష్రాన్తోనూ ఆమెకు సంబంధం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక మార్కెట్ సినిమా సమయంలో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న మనీషా కి ఆర్యన్ వేద్ ప్రేమ ఓదార్చింది.. సినిమా రంగంలో మాత్రమే కాదు సినీయేతర రంగాల వారితో కూడా ఆమె సంబంధాలు అప్పట్లో బాగా వెలుగు చూశాయి. నానా పటేకర్తో బ్రేకప్ బాధలో ఉండగా, హుస్సేన్ బాబాయ్గా పేరొందిన డిజె హుస్సేన్, నేపాల్లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కొన్రాయ్, లండన్కు చెందిన నైజీరియన్ వ్యాపారి సిసిల్ ఆంథోనీ, అమెరికన్ స్పోర్ట్స్ కౌన్సిలర్ క్రిస్టోఫర్ డోరిస్...ఇలా పలువురితో ఆమె సంబంధాలు పెట్టుకుందని అప్పట్లో వెల్లడైంది. వీటన్నింటినీ వదిలించుకుని నేపాల్కు చెందిన సామ్రాట్ దహాయ్ని 2010లో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించినప్పటికీ ఆ బంధం కూడా రెండేళ్లోనే బెడిసి కొట్టింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత మనిషా కోయిరాలా చాలా మారిపోయింది. ‘‘ఆ వ్యాధి నాకు జీవితం విలువ తెలిసివచ్చేలా చేసింది, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకూడదని నేర్పింది. ఆ ఎదురుదెబ్బకు ముందు నేను అనేక చెత్త పనుల్లో, చెత్త సంబంధాల్లో చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను,’’ అని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె అంటోంది. ‘‘ఇకపై నేను నిరర్థకమైన సంబంధాలేవీ పెట్టుకోను. ఒంటరితనం నుంచి రక్షించడానికి ఎవరైనా మగవాడు రావాలని కూడా ఎదురు చూడను. నేను సింగిల్నే కానీ ఒంటరిగా లేను. ఇప్పుడు నా సహవాసాన్ని నేనే ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకు లాంగ్ ట్రెక్కింగ్లు చేయడం ఇష్టం. దీర్ఘ ధ్యాన విరామాలు తీసుకుంటాను. అయితే నాలాగా జీవనశైలిని మార్చుకోవడానికి ఏదో పెద్ద నష్టం, కష్టం వచ్చే వరకూ ఎదురు చూడవద్దు. ఇప్పుడే మార్చుకోండి’’ అంటూ మనీషా తోటి మహిళలకు సలహా ఇస్తోంది. అనుభవం నేర్పిన పాఠాలతో ఒకనాటి సిల్వర్ స్క్రీన్ బ్యూటీ... భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటోంది. తన జీవితాన్ని ఓ పాఠంగా తీసుకోవాలని యువతులకు సూచిస్తోంది. -
‘విశ్వంభర’ రిలీజ్పై చిరు అప్డేట్.. వామ్మో అంత లేటా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాల్లో విశ్వంభర ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సింది కూడా. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తకాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటి నుంచి రిలీజ్ డేట్పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. సమ్మర్, దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ నెట్టింట చర్చలు జరిగినా..మేకర్స్ మాత్రం విడుదల తేదిపై స్పందించలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రం విడుదల అవుతుందని చెప్పారు. ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు(Vishwambhara Update) ‘విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్తుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్లో ఎంజాయ్ చేయండి’ అని చిరంజీవి తెలిపారు.విశ్వంభర విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ఇది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. MEGASTAR @KChiruTweets shares a personal note to his fans and the audience about #Vishwambhara ❤️Check out the MEGA BLAST ANNOUNCEMENT now ⚡-- https://t.co/RQ9is0OQCcLet us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM ❤🔥MEGA MASS BEYOND… pic.twitter.com/dtJ2Jo0l1m— UV Creations (@UV_Creations) August 21, 2025 -
ఏంటి..నన్ను మిస్ అవుతున్నారా? : నాగవంశీ
ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే హీరోహీరోయిన్లు రంగంలోకి దిగాల్సిందే. వాళ్లు ప్రచారం చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎక్కువగా నటీనటులతోనే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు పెడుతుంటారు. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. కానీ వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అంతగా వైరల్ కావు. కానీ ఈ నిర్మాత మాత్రం కాస్త స్పెషల్. ఆయన ఏం మాట్లాడినా.. ట్వీట్ చేసిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. పక్కన ఆయన ఉంటే మీడియా ఫోకస్ అంతా అటువైపే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్లో ఆయన చెప్పే విషయాలు, ఇచ్చే హైప్ మామలుగా ఉండదు. కొన్నిసార్లు అవసరానికి మించిన హైప్ ఇచ్చి.. ట్రోలింగ్కి కూడా గురవుతుండాడు. ఆయనే యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi ).సితారఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వరుస సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. మొన్నటి వరకు వరుస విజయాలను చూసిన నాగవంశీకి ఇటీవల మాత్రం దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. ఆయన బ్యానర్ నుంచి భారీ అంచనాలతో రిలీజైన ‘కింగ్డమ్’ మూవీకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన వార్ 2 చిత్రం కూడా నాగవంశీకి నష్టాలనే మిగిల్చింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వంశీ... వార్ 2 రిలీజ్ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నా స్పందించలేదు. ఒకనొక దశలో సోషల్ మీడియాను దూరం పెట్టాడనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనను ట్రోలింగ్ చేస్తున్నవారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇంకో 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. ' ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.Enti nannu chala miss avthunattu unnaru.. 😂Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.At the cinemas… for the cinema,…— Naga Vamsi (@vamsi84) August 20, 2025 -
నాన్న సంపాదించిన డబ్బంతా అటే వెళ్తుంది : శ్రుతీ హాసన్
జయాపజయాలు సహజం. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన నటుడు కమలహాసన్ అయినా, మరచిపోలేని చిత్రాలను అందించిన దర్శకుడు మణిరత్నం అయినా సరే. నటుడు కమలహాసన్ ఇటీవల కథానాయకుడిగా విక్రమ్, నిర్మాతగా అమరన్ వంటి సంచలన విజయాలను సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎంజీఆర్ వంటి ప్రఖ్యాత నటుడు చేయాలని ఆశించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని దర్శకుడు మణిరత్నం తెరకెక్కించి సక్సెస్ను సాధించారు. అలాంటిది ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన థగ్లైఫ్ చిత్రం నిరాశ పరిచింది. అదేవిధంగా హీరో కమలహాసన్(Kamal Haasan )కు థగ్లైఫ్తో పాటూ ఇండియన్– 2 చిత్రం పరాజయాలను చవి చూశాయి. అయితే ఇదంతా పట్టించుకోని మణిరత్నం ప్రస్తుతం ఒక యూత్ పుల్ లవ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇక కమలహాసన్ స్టంట్ మాస్టర్స్ అన్భరివ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ భారీ చిత్రాన్ని నిర్మిస్తూ , కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ వారసురాలు, నటి శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మనస్థత్వం గురించి పేర్కొన్నారు. థగ్లైఫ్ చిత్ర అపజయం అనంతరం కమలహాసన్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ బదులిస్తూ ఆ చిత్ర అపజయం తన తండ్రిని ఎలాంటి బాధింపునకూ గురి చేయలేదన్నారు. ఆయన ఎప్పుడూ సంపాదించిన తన డబ్బునంతా మళ్లీ సినిమాల్లోనే పెడతారన్నారు. ఆయన ఆ డబ్బుతో రెండో ఇల్లు కొనడానికో, మూడో కారు కొనడానికో ఇష్టపడరన్నారు. అంతా సినిమాలకే పోతుందన్నారు. ప్రజలు అనుకుంటున్నట్లు ఈ నెంబర్ గేమ్ అనేది తన తండ్రిని బాధించదని శృతిహాసన్ పేర్కొన్నారు. కాగా ఇటీవల నటించిన కూలీ చిత్రంలోని నటనకు గానూ శ్రుతిహాసన్ ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం విజయ్సేతుపతికి జంటగా ట్రెయిన్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మరో తెలుగు చిత్రంలో శృతిహాసన్ నటించనున్నట్లు తాజా సమాచారం. -
రాసుకుపూసుకుని తిరగను, అందుకే నో సక్సెస్..
చాలా సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయంటోంది నటి దీక్షా పంత్ (Diksha Panth). ఇటీవల వచ్చిన ఓ పెద్ద మూవీలో కూడా తాను నటించాల్సిందని, కానీ చెప్పాపెట్టకుండా సైడ్ చేశారని వాపోయింది. ఇలా తన కెరీర్ జర్నీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. దీక్షా పంత్ మాట్లాడుతూ.. మాది ఉత్తరాఖండ్. నాన్న రైల్వే ఉద్యోగి కావడంతో ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. అలా నేను పుట్టింది విజయవాడలో, పెరిగింది కాకినాడలో!మొదట నో చెప్పా..ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓ ఈవెంట్లో కొరియోగ్రాఫర్ నన్ను చూసి మోడలింగ్ ట్రై చేయొచ్చుగా అని చెప్పారు. మా ఇంట్లో చంపేస్తారంటూ నో చెప్పాను. రెండేళ్ల తర్వాత అతడే మళ్లీ కాల్ చేసి అడిగాడు. ఇంతలా అడుగుతున్నాడని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇంట్లో ఒప్పించి ఫోటోషూట్, ర్యాంప్ షోస్ చేశాను. అలా మోడలింగ్లో బిజీ అయ్యాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. పెద్ద మూవీలో ఆఫర్మొదట్లో అవకాశాలిస్తాం కానీ మాకు మరేదో కావాలని అడిగేవారు. నేను ముఖం మీదే నో చెప్పేదాన్ని. నన్ను రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం మరీ అందరితో రాసుకుపూసుకు తిరగను. అందుకే సక్సెస్ఫుల్ కాలేదు. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన ఒక పెద్ద డైరెక్టర్ ఈ మధ్య ఓ పీరియడ్ డ్రామా సినిమా రిలీజ్ చేశారు. 2017లోనే ఈ మూవీ చేయమని ఆఫర్ చేశారు. అలా ఎన్నో ఆఫర్స్ మిస్అంతా బానే ఉందనుకున్న సమయంలో సడన్గా నన్ను వద్దనుకున్నారు. ఆ విషయం నాకు చెప్పనేలేదు. అంత మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లే వచ్చి చేజారడం కాస్త బాధేసింది. అలా చాలా ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేతికందకుండా పోయాయి అని చెప్పుకొచ్చింది. రచ్చ, వరుడు, ఒక లైలా కోసం, గోపాల గోపాల చిత్రాల్లో అలరించింది నటి దీక్షా పంత్. మంగమ్మ అనే ప్రైవేట్ సాంగ్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చదవండి: ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
నిశ్చితార్థం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక పూజలు
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఆగస్టు 17న హరిణ్య రెడ్డి అనే యువతికి ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో రాహుల్ జంట డ్యాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు. ఎంగేజ్మెంట్ తర్వాత..కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ వేదికపై రాహుల్.. కాబోయే భార్యకు కాస్ట్లీ హ్యాండ్బ్యాగ్ను బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను హరిణ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే తాజాగా రాహుల్ కన్యాకుమారి వెళ్లాడు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.సింగర్గా..1989 ఆగస్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. చిన్నప్పటినుంచే అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తిని తండ్రి గమనించాడు. గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. ఓపక్క సంగీతం నేర్చుకుంటూ, మరోపక్క తండ్రికి బార్బర్ షాప్లో సాయం చేసేవాడు. రానురానూ కోరస్ పాడే అవకాశాలొచ్చాయి. జోష్ మూవీలో కాలేజీ బుల్లోడా పాట పాడే అవకాశం వచ్చింది. వాస్తు బాగుందే.. (దమ్ము), ఈగ టైటిల్ సాంగ్, సింగరేణుంది (రచ్చ), రంగా రంగా రంగస్థలానా (రంగస్థలం) ఇలా అనేక సాంగ్స్ పాడాడు. యూట్యూబ్లో మంగమ్మ, పూర్ బాయ్, గల్లీ కా గణేశ్, దావత్.. ఇలా అనేక ప్రైవేట్ సాంగ్స్తో తెగ వైరల్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్గా నిలిచాడు. ఆర్ఆర్ఆర్లో పాడిన నాటునాటు సాంగ్కు ఆస్కార్ రావడంతో బస్తీ కుర్రాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Flashoot (@weareflashoot) చదవండి: కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు -
హిట్టు మూవీ.. నేను హీరోయిన్ ఏంటని అసహ్యకర కామెంట్లు!
దర్శనా.. హృదయం సినిమాలోని ఈ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. పాటే కాదు సినిమా కూడా సూపర్ హిట్టు. 2022లో వచ్చిన హృదయం మూవీలో ప్రణవ్ మోహన్లాల్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ చాలామంది తనను తిట్టుకున్నారంటోంది హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ (Darshana Rajendran).హీరోయిన్గా సూటవ్వలేదంటూ..దర్శన కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ఈ సినిమా ప్రమోషన్స్లో దర్శన మాట్లాడుతూ.. హృదయం చూసిన చాలామంది నన్నెలా హీరోయిన్గా తీసుకున్నారని ప్రశ్నించారు. హీరో ప్రణవ్ పక్కన హీరోయిన్గా సెట్ అవలేదని విమర్శించారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినప్పటికీ నాపై వచ్చిన నెగెటివిటీ చూసి మొదట్లో భరించలేకపోయాను. నిజానికి సినిమా ఫ్లాప్ అయితే జనాలు కచ్చితంగా తమ ప్రతాపం చూపిస్తారు.లైట్ తీసుకున్నా..అంతా నెగెటివ్గానే మాట్లాడతారు. కానీ హృదయం హిట్టయినా నన్ను మాత్రం అందంగా లేనని తిట్టుకున్నారు. ఇలా నా గురించి ఏం కామెంట్ చేసినా ప్రతీది చదివేదాన్ని. ఆ కామెంట్లు చూసి నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. నవ్వి లైట్ తీసుకున్నాను. కొందరైతే మరీ అసహ్యంగా కామెంట్లు చేస్తుంటారు. యాక్టర్స్ను దారుణంగా ట్రోల్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన పరదా చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది.చదవండి: ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్ -
ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్
ప్రతి ఆడపిల్లకు ఓ వయసు రాగానే నెలసరి ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే బాలిక కౌమార దశలోకి అడుగుపెడుతుంది. అయితే తన ఫ్రెండ్స్ కంటే తాను ఆలస్యంగా మెచ్యూర్ అయ్యానని, దానికే అమ్మ కోప్పడిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకున్నారు. ఎటు చూసినా రక్తమే..కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరికీ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి మధ్యలోనే పీరియడ్స్ మొదలయ్యాయి. నా ఫ్రెండ్స్ మెచ్యూర్ అవుతుంటే నేనింకా బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పటికే నెలసరి రావట్లేదని కంగారుపడుతూ ఉంటే నేనేమో ఇలా బొమ్మలతో ఆడుకుంటున్నానని అమ్మ కోప్పడింది. ఆ బొమ్మల వల్లే ఇంకా పీరియడ్స్ రావడం లేదేమోనని కోపంతో వాటన్నింటినీ బయట పడేసింది. ఒకరోజు నేను నిద్రలేచేసరికి బెడ్షీట్ అంతా రక్తం.. ఎటు చూసినా రక్తమే కనిపించడంతో భయపడిపోయాను. కానీ, అమ్మ మాత్రం నాకు నెలసరి మొదలైందని సంతోషపడింది అని పేర్కొన్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. 2006లో గ్యాంగ్స్టర్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఏక్ నిరంజన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చివరగా ఎమర్జెన్సీ మూవీలో నటించారు. ఈ సినిమాలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి స్వయంగా కంగనాయే దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.చదవండి: స్నేహితుడి కోసం నాడు పూజలు.. ఫోటోతో గుడ్న్యూస్.. -
సినీకార్మికుల సమ్మె.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సినీకార్మికుల సమ్మె (Tollywood Cinema Workers Strike) విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకుంది. 17 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమా పాలసీపై పడుతుందని ప్రభుత్వ అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.సమ్మె ఎఫెక్ట్హైదరాబాద్ను సినిమా హబ్గా చేయాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె అడ్డంకిగా మారింది. నగరంలో జరుగుతున్న తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమా షూటింగ్స్ నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించిన ఉన్నతాధికారులు ఈరోజు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో ఫెడరేషన్ నాయకులతో డీజీపీ సమావేశం కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం మూడు గంటలకు నిర్మాతలతో, నాలుగు గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ కీలక చర్చలు జరపనుంది.చదవండి: ‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్ -
‘నీలి నీలి ఆకాశం’ పాటకి సీక్వెల్.. బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించిన దర్శకుడు!
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని ‘నీలి నీలి ఆకాశం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాటే సినిమాపై బజ్ని క్రియేట్ చేసింది. యూట్యూబ్లో సంచలనం సృష్టించిన ఆ పాటకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా కోసమే ‘నీలి నీలి ఆకాశం’ పాట సీక్వెల్ని రెడీ చేశాడు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్. మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ సంగీత అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. 'ఇలా చూసుకుంటానే' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి విడుదల అయిన ప్రీ టీజర్ దూసుకుపోతుంది, ఈ ప్రీ టీజర్ లో చంద్ర బోస్ గారు కూడా యాక్టింగ్ అద్భుతంగా చేశారు . త్వరలోనే ఈ పాట విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మున్నా ధూళిపూడి మాట్లాడుతూ ఇప్పుడు 'ఇలా చూసుకుంటానే' అనే పాట ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్ర బోస్ అందించిన లిరిక్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వర పరిచిన పాట మరియు సిద్ శ్రీరామ్ పాడిన పాట 'నీలి నీలి ఆకాశం' పాట కంటే గొప్పగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ అనేది పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’" అని తెలిపారు. -
‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.ఆడియో ప్రమోషన్స్లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. -
నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి?
‘100% లవ్’ సినిమాలో బొద్దుగా ఉండే ఓ బుడ్డొడు గుర్తున్నాడా..? చదువు.. చదువు అంటూ బాలు(నాగచైతన్య) పెట్టే టార్చర్ భరించలేక మహాలక్ష్మీ(తమన్నా)తో చేతులు కలుపుతాడు. మహాలక్ష్మీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత బాలు ముద్దే చికెన్ తింటూ..‘ఎవడ్రా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయదని చెప్పింది?’ అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఆ బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. గడ్డం, మీసాలు పెంచి హీరోలా మారిపోయాడు. అతని పేరు నిఖిల్ అబ్బూరి. #90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మౌళి.. నిఖిల్ని పరిచయం చేశాడు. 100% సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడంటూ మౌళి చెప్పేవరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్ అని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ సినిమా నిర్మాత బన్నీవాసు సైతం నిఖిల్ని గుర్తుపట్టలేకపోయాడు. అంతలా మారిపోయాడు మనోడు. టీజర్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన అనిల్ రావిపూడి సైతం నిఖిల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘100% లవ్ సినిమాలో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేకపోయాను నాన్న.. ’ అంటూ నిఖిల్ని స్టేజ్పైకి పిలిచి అభినందించాడు. ప్రభాస్ ‘మిర్చి’, రామ్ ‘గణేశ్’తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన నిఖిల్..ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రని పోషించాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. #100%Love లో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేదు నాన్న నిన్ను.... pic.twitter.com/AzUhCTxHCh— Rajesh Manne (@rajeshmanne1) August 19, 2025 -
‘లవ్ యూ రా’ కడుపుబ్బా నవ్వించేస్తుంది: హీరో చిన్ను
చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో..హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
బతకొద్దు అనుకున్నా.. శ్రీముఖి హెల్ప్ చేసింది: తమన్నా సింహాద్రీ
బిగ్బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి. విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా..తెలుగు బిగ్బాస్ సీజన్ 3లో పాల్గొని తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ షో ద్వారానే యాంకర్ శ్రీముఖితో స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతుంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్లో తమన్నా కూడా ఉంటుంది. బిగ్బాస్ హౌస్లో రెండు వారాలు మాత్రమే కలిసి ఉన్న వీరిద్దరి మధ్య అంత స్నేహం ఎలా ఏర్పడింది? నా నిజాయితీకీ శ్రీముఖి ఫిదా అయిందని అంటోంది తమన్నా. తన జీవితంలో శ్రీముఖి లాంటి ఫ్రెండ్ని చూడలేదని, ఆమెలో తన కూతురిని చూసుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చింది.అందుకే నాతో స్నేహంశ్రీముఖి ఎదుటివాళ్లను చదివేస్తుంది. వాళ్లు ఎలాంటివాళ్లు? పైకి ఎలా మాట్లాడతారు? లోపల ఎలా ఉంటారు? ఇవన్నీ ఈజీగా పసిగట్టగలదు. బిగ్బాస్ హౌస్లో మేం రెండు వారాలే కలిసి ఉన్నాం. నాలో ఉన్న నిజాయితీని మెచ్చి శ్రీముఖి స్నేహం చేసింది. ‘తమన్నా నమ్మితే.. ప్రాణాలను సైతం ఇస్తుంది’ అని తెలుసుకొని నాకు క్లోజ్ అయింది. నేను అంటే ఆమెకు చాలా నమ్మకం. శ్రీముఖి తల్లి నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది. శ్రీముఖి, ఆమె తమ్ముడు ఇద్దరూ నాకు పిల్లలు లేని లోటు తీర్చారు. వారిద్దరు నా పిల్లలే అనుకుంటాను.శ్రీముఖి దత్తత తీసుకుందినా బంధువులు, రక్త సంబంధీకులు అంతా దూరం పెడితే.. శ్రీముఖి నన్ను తన ఫ్యామిలీ మనిషిలా చూసుకుంది. నేను ఏ టైంలో ఏం ఆలోచిస్తాను? ఎం తినాలనుకుంటాను? ఇవన్నీ తెలుసుకొని తెప్పిస్తుంది. ఇలా ఎవరు అడుగుతారు? ఒకరకంగా చెప్పాలంటే నన్ను శ్రీముఖి దత్తత తీసుకుంది. కరోనా తర్వాత అన్ని షోస్ ఆగిపోయాయి. డబ్లుల్లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. శ్రీముఖి ఫోన్ చేసి..‘విజయవాడలో ఒంటరిగా ఏం చేస్తావు? హైదరాబాద్కి వచ్చేయ్. నేను సంపాదిస్తున్నాను కదా. నిన్ను చూసుకుంటాలే’ అని చెప్పింది. నా బర్త్డేని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది. ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఆర్థిక సహాయం చేసింది. ఈ విషయం బయటకు చెపొద్దు అంటూ ఇంటి కోసం కొంత డబ్బు ఇచ్చింది. నాకే కాదు ఇలాంటి సహాయం చాలా మందికి చేసింది. బయటకు చెప్పుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. దటీజ్ శ్రీముఖి. ఆమె ఏంటో ఫ్రెండ్ సర్కిల్కి మాత్రమే తెలుసు’అంటూ తమన్నా ఎమోషనల్ అయింది. -
‘సంతోషం’ వేడుకలో మంచు ఫ్యామిలీ
హైదరాబాద్ వేదికగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేశ్ కొండేటి నిర్వహించారు. ఈ వేడుకలో మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు (మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్) తో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, మురళీ మోహన్, కాట్రగడ్డ ప్రసాద్, నటీనటులు మాలాశ్రీ, బాబు మోహన్ వంటి పలువురు పాల్గొన్నారు. ఈ వేదికపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు అవ్రామ్తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేశారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు. కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు బాబు మోహన్ అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్ కు కూడా ఘన సన్మానం జరిగింది., అనంత శ్రీరామ్, (కన్నడ) ఆరాధన రామ్, మాలాశ్రీ గారి కుమార్తె (తమిళం) నిధిలం స్వామినాథన్ గార్లు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యాదు వంశీ, మధుప్రియ, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు. -
కోలీవుడ్ మూవీలో విలన్గా సుహాస్.. లుక్ అదిరింది!
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సూరి హీరోగా నటించగా, సుహాస్ తొలిసారి విలన్ పాత్ర పోషించాడు. సుహాస్ బర్త్డే సందర్భంగా నేడు(ఆగస్ట్ 19) కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన ఈ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది.సూరి, సుహాస్లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నారు. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. -
టాలీవుడ్ సమ్మె.. ‘మెగా’ ప్రయత్నం ఫలించేనా?
వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్య చివరకు అగ్రహీరో చిరంజీవి(Chiranjeevi) ఇంటికి చేరింది. (చదవండి: భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్)పరిష్కారం చూపాలంటూ అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ నాయకులు చిరంజీవిని కలిశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తో పాటు 20 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మందితో చిరంజీవి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో అన్ని సమస్యలపై చర్చించారు. యూనియన్ నాయకులు చెప్పిన సమస్యలను ఓపికతో వినడమే కాకుండా స్వయంగా వాటిని నోట్ చేసుకున్నాడు. తన దృష్టికి వచ్చిన విషయాలను ఫెడరేషన్ నాయకులతో చర్చించి, క్లారిటీ తీసుకున్నారు. ఇక త్వరలో మరోసారి చిరంజీవి అటు నిర్మాతలు, ఇటు కార్మిక సంఘాల నాయకులతో కలిసి భేటి కానున్నారు. ఈ సమావేశంతో ఈ సమస్యకు ముగింపు పలకాలని చిరంజీవి భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్దన్న కాదని చిరంజీవి చెబుతున్నప్పటికీ.. దాసరి నారాయణ మరణం తర్వాత ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందరూ చిరంజీవి దగ్గరకే వెళ్తున్నారు. చిరంజీవి కూడా తాను పెద్దన్నను కాదంటూనే సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆ పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ సమ్మె విషయంలోనూ అందరి చూపు చిరంజీవి వైపే వెళ్లాయి. ఆయన రంగంలోకి దిగడంతో అటు నిర్మాతలు, ఇటు కార్మికులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ చెప్పింది. నేడో , రేపో చిరంజీవి ఇరు వర్గాలతో సమావేశం నిర్వహించి, సమ్మెకు ముగింపు పలకాలని భావిస్తున్నాడట. మరి ‘మెగా’ ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? చూడాలి. -
మహేశ్బాబు అన్న మూవీలో సెకండ్ హీరోగా.. ఆ సినిమా వల్లే..
ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం యూనివర్సిటీ. పేపర్ లీక్ అనేది ట్యాగ్లైన్. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా నారాయణ మూర్తి (R Narayana Murthy) ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది? ఏంటనే విషయాలను పంచుకున్నారు.రూ.70తో చెన్నై..ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాది కాకినాడలో మల్లంపేట అనే కుగ్రామం. టూరింగ్ టాకీస్కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. సినిమా యాక్టర్ అయిపోవాలని రూ.70తో చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక నాలా లక్షలాది మంది ఉన్నారని చూశాను. జూనియర్ వేషాలు వేశాను. అప్పుడు మహానటులను చూశాను. నాకు బొమ్మలు వేసే అలవాటుండేది. నేను వేసిన ఏఎన్నార్ బొమ్మ చూసి డైరెక్టర్, నా గురువు దాసరి నారాయణరావుగారు మెచ్చుకున్నారు. పొంగిపోయాను. డిగ్రీ పూర్తి చూసి వస్తే వేషం ఇస్తానన్నారు. సెకండ్ హీరోగా..డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి దాసరిగారిని కలిశా.. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్బాబు అన్న రమేశ్బాబు నీడ సినిమాలో వేషం ఇచ్చారు. సెకండ్ హీరోగా చేశాను. తర్వాత సంధ్య సినిమాలో నన్నే హీరోగా పెట్టి మూవీ తీశారు. ఆ తర్వాత నాకు వేషాలొచ్చాయి. కానీ, నటుడిగా బిజీ కాలేకపోయాను. హీరో వేషాలు రాలేదు. చిన్న వేషాలే వస్తున్నాయి. చాలా స్ట్రగుల్ అయ్యా.. నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నావాళ్లందరికీ ఎలా చూపించుకోగలను? అని మానసిక వేదన చెందాను. ఆ పాటతోనే ధైర్యంఅన్ని రకాల బాధలు పడుతున్న సమయంలో ఘంటసాల పాడిన 'కల కానిది.. విలువైనిది..' పాట నాలో ధైర్యం నింపింది. నాకెవరూ హీరో వేషం ఇవ్వట్లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలనుకున్నాను. హీరో కావాలంటే డబ్బులు కావాలి. అప్పుడు నా స్నేహితుల సహకారంతో స్నేహ చిత్ర పిక్చర్స్ పేరిట బ్యానర్ ప్రారంభించాను. నా బ్యానర్లో తీసిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్ర్యం. సినిమా పిచ్చితో కథ, డైరెక్షన్, స్క్రీన్ప్లే, యాక్షన్.. అన్నీ నేనే చేసుకున్నాను. జనం దగ్గర సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.చదవండి: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం -
చిరంజీవికి మా సమస్యలు చెప్పాం: ఫిలిం ఫెడరేషన్
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు కొద్దిరోజులుగా సమ్మె (Tollywood Film Worker Strikes) చేస్తున్నారు. జీతాలను 30% మేర పెంచేవరకు షూటింగ్స్లో పాల్గొనేదే లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. పద్నాలుగు రోజులుగా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 వేల లోపు జీతాలున్నవారికి 25% జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొన్ని కండీషన్లున్నాయంటూ మెలిక పెట్టారు. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అటు నిర్మాతలతో, ఇటు యూనియన్స్తో భేటీఈ క్రమంలో ఆదివారం నాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్లోని కొందరు నిర్మాతలు చిరంజీవి (Chiranjeevi Konidela)ని కలిసి మాట్లాడారు. ఈ భేటీ అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవిగారు చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అని తెలిపారు. సోమవారం (ఆగస్టు 18న) ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి సమావేశమయ్యారు. త్వరలోనే పరిష్కారంఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. భేటీ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మాపై నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారు. మేము బాగుండాలి, అలాగే నిర్మాతలూ బాగుండాలి.చిరంజీవికి అన్నీ చెప్పాంనిర్మాతలు పెట్టిన 2 కండీషన్స్కు ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవిగారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పాం. మాకు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రమ్మని చిరంజీవి గారు చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. ఛాంబర్తో కూడా సమావేశం కానున్నాం. చర్చలకు పిలిచారు కాబట్టి మేము నిరసన కార్యక్రమం ఆపేశాం. మేం అడిగినట్లుగా మాకు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం అన్నారు.నిర్మాతల మీటింగ్మరోపక్క నిర్మాతలు ఫిలిం ఛాంబర్లో సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలందరూ సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్కే అప్పగించారు. ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం
సాక్షి, హైదరాబాద్: దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి (Kota Rukmini) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం (ఆగస్టు 18న) తుదిశ్వాస విడిచారు. కాగా కోట శ్రీనివాసరావు నెల రోజుల క్రితమే పరమపదించారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై 13న కన్నుమూశారు. ఆయన మరణించిన నెల రోజులకే భార్య మరణించడం విషాదకరం! కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.విలక్షణ నటుడుతెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. విలన్గా, తండ్రిగా, కామెడీ విలన్గా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన కోట.. అన్నిరకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై ఆల్రౌండర్గా నిలిచారు.చదవండి: అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే? -
మహావతార్ నరసింహ అద్భుతాలు.. సెట్స్పైకి పరశురామ్
మహావతార్ నరసింహ.. వెండితెరపై ఇప్పటికీ అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది. ప్రమోషన్లు లేవు, హైప్ లేదు, బడ్జెట్ కూడా తక్కువే.. అందులోనూ భారీ సినిమాలతో పోటీ.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. యానిమేషన్ మూవీ అయినా రికార్డులు భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతవారం క్రితమే రూ.200 కోట్ల మైలురాయిని దాటేసింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్ చిత్రాల పోటీని తట్టుకుని బలంగా నిలబడింది.నవంబర్లో సెట్స్పైకిఇటీవలే రిలీజైన వార్ 2, కూలీ సినిమాల కాంపిటీషన్ను సైతం తట్టుకుని ఇంకా వెండితెరపై మ్యాజిక్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రదర్శకుడు తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా సినిమాలు తెరకెక్కనున్నాయని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే! అందులో భాగంగా తన రెండో సినిమా మహావతార్ పరశురామ్ను నవంబర్లో సెట్స్పైకి తీసుకెళ్తున్నట్లు ప్రకటించాడు. నాకంటూ క్లారిటీ ఉందివ్యవస్థ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని సరిదిద్దేందుకు నిలబడ్డ హీరో పరశురామ్. ఇది చాలా శక్తివంతమైన కథ. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. నరసింహ సినిమా సక్సెస్తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజల ప్రేమను చూస్తుంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనిపిస్తోంది. నాపై ఒత్తిడి ఉంది. కాకపోతే ఇంకా ఏడు సినిమాలు తీయాలన్న క్లారిటీ కూడా ఉంది. అయితే అన్నీ యానిమేషన్స్ తీయాలనుకోవడం లేదు. కనీసం రెండు చిత్రాలైనా లైవ్ యాక్షన్ ఫిలింస్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.పరశురామ్పై రెండు సినిమాలుఇదిలా ఉంటే పరశురామ జీవితకథపై హిందీలో మహావతార్ టైటిల్ పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఛావాతో ప్రేక్షకుల్ని మెప్పించిన విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రెండు పరశురామ్ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నెగ్గుతుందో చూడాలి! -
అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే?
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (42) జూన్ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది. వెడ్డింగ్ యానివర్సరీఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు. ప్రేమకు పదేళ్లు 'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్ సింగ్ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది. View this post on Instagram A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi) చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్ -
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్బాస్ మానస్
చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన మానస్ (Maanas Nagulapalli) తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్తో బాగా పాపులర్ అయ్యాడు. అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్గా ఆడి, నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది. మానస్కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ, డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది.గృహప్రవేశంతాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది. కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.సినిమానరసింహ నాయుడు, వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్.. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం వంటి చిత్రాలు చేశాడు. కొన్నాళ్లకు తెలుగులో బిగ్బాస్ 5వ సీజన్లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విజేత కాలేకపోయాడు. బిగ్బాస్ నుంచి రాగానే కార్తీకదీపం సీరియల్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7) చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి -
ఈ హీరోయిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? వీడియో వైరల్
కృష్ణాష్టమి అనగానే అందరూ రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) కూడా అందంగా ముస్తాబైంది. అయితే చేతిలో వేణువు పట్టుకుంది. ఊరికే ఫోటో కోసమే అలా స్టిల్ ఇచ్చిందనుకునేరు. కానే కాదు, ఫ్లూట్తో అద్భుతంగా ఓ పాట ట్యూన్ వినిపించింది. ఇది చూసిన అభిమానులు.. మీరు మల్టీటాలెంటెడ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా అదా శర్మ.. లాక్డౌన్లో ఫ్లూట్ నేర్చుకుంది.సినిమాల విషయానికి వస్తే..అదా శర్మ.. 1920 అనే హారర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, సీ.డీ: క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో నటించింది. ద కేరళ స్టోరీ మూవీతో సెన్సేషన్ అయిన అదా చివరగా తుమ్కో మేరీ కసమ్ మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
59 ఏళ్ల వయసులో జిమ్లో వర్కవుట్స్.. ఎవరో గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న నటి వయసు 59. ఈ ఏజ్లో కూడా ఆమె జిమ్లో చెమటలు చిందిస్తోంది. చిన్నపాటి వ్యాయామాలే కాకుండా డంబుల్స్ ఎత్తుతూ కష్టమైన వర్కవుట్స్ కూడా అవలీలగా చేస్తోంది. ఇంతకీ ఆ ఫేమస్ నటి ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. సౌత్ ఇండస్ట్రీకి బాగా పరిచయమున్న పేరు. ఆవిడే నదియా (Nadiya Moidu).. ఇప్పటికీ అందంగా, ఫిట్గా కనిపించే ఆమె వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమా1984లో వచ్చిన నూకెత్త దూరతు కన్నుం నట్టు అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్లో అమ్మ, అత్త పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. తెలుగులో.. అత్తారింటికి దారేది, దృశ్యం, దృశ్యం 2, నా పేరు సూర్య, అఆ, అంటే సుందరానికి వంటి పలు చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Nadiya Moidu (@simply.nadiya) చదవండి: 11 ఏళ్ల బంధానికి స్వస్తి? భార్యకు కన్నడ హీరో విడాకులు! -
కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్గా..
బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన అసలు పేరు మధు నెక్కంటి (Madhoo Singer Nekkanti). ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. గలగలా మాట్లాడే ఈమె తొలివారమే ఎలిమినేట్ అయింది.కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్కతాజాగా బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి అంటూ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు బేబక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్ సహా తదితరులు అతిథులుగా విచ్చేశారు.పిల్లి కోసం ప్రత్యేకంగా..'నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇకపోతే.. అపార్ట్మెంట్లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఓ గోడను డిఫరెంట్గా డిజైన్ చేయించింది. పూజగదిని నీట్గా, అందంగా కట్టించుకుంది. View this post on Instagram A post shared by Madhoo Singer Nekkanti (@bezawada_bebakka) చదవండి: -
‘నీకు కూతురు ఉందా? ‘పెద్దమనిషి’ అయిందా?’ అని అడిగేవాళ్లు.. : సౌమ్య రావు
చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. బయటకు మాత్రం అందంగానే కనిపిస్తుంది. కానీ లోపలకు తొంగి చూస్తే.. అక్కడ కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. తెర ముందు ముఖానికి రంగు వేసుకొని జనాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న చాలా మంది నటీనటులు తెర వెనుక చాలా కష్టాలను అనుభవించినవాళ్లే. తినడానికి తిండిలేని పరిస్థితులను ఎదుర్కొని ఉన్నవాళ్లు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ నటి, యాంకర్ సౌమ్యరావు(Sowmya Rao) కూడా ఒకరు. ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ కన్నడ బ్యూటీ.. రియల్ లైఫ్లో చాలా కష్టాలను అనుభవించింది. తినేందుకు తిండిలేక పస్తులు ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయట. తాజాగా ఓ టీవీ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెబుతూ సౌమ్య ఎమోషనల్ అయింది.అప్పుల బాధలు తట్టుకోలేక.. నా చిన్నప్పుడు నాన్న బాగా అప్పులు చేశాడు. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలియదు కానీ అప్పు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి గొడవ చేసేవాళ్లు. నాన్న చేసిన అప్పులకు అమ్మ మాటలు పడాల్సి వచ్చేంది. కొంతమంది అయితే వల్గర్గా మాట్లాడేవాళ్లు. ‘నీకు కూతురు ఉందా? పెద్దమనిషి అయిందా?’ అంటూ అసభ్యకరంగా మాట్లాడేవాళ్లు. వారి బాధలు తప్పుకోలేక ఓ రోజు రాత్రి మా అమ్మ నన్ను, బ్రదర్ని తీసుకొని తిరుపతి వచ్చింది. అప్పుడు అమ్మ చేతిలో కేవలం రూ. 100 మాత్రమే ఉన్నాయి. రాత్రంతా బస్టాండ్లో నిద్రపోయాం. ఉదయం గుడిలో పెట్టే అన్న కోసం చాలా ఎదురు చూశాం. దేవుడి దర్శనం కంటే అక్కడ పెట్టే అన్నంపైనే మా దృష్టి ఉండేది. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. చుట్టు పక్కల వాళ్లు తలుపులు వేసుకునేవాళ్లు. ఎందుకంటే చుట్టాలకు టీ లేదా అన్నం పెట్టాలన్నా.. పక్కింటివాళ్లనే అడిగేవాళ్లం. అందుకే బంధువులు వస్తే.. అంతా తలుపులు మూసుకునే వాళ్లు.టైపింగ్ నేర్పిస్తానంటూ మిస్ బిహేవ్ చేశాడునేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా ఓ సారి ఓ లాయర్ దగ్గర పని చేశాను. ఆయన ఇంట్లోనే వర్క్ ఉండేది. పని కోసం వెళ్తే..ఆయన నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. టైపింగ్ నేర్పిస్తా అంటూ నాపై చేతులు వేసేవాడు. ఆయన భార్య, తల్లి బయటకు వెళ్లగానే నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. నా పరిస్థితి ఆయనకు తెలుసు. దాన్న ఆయన అలుసుగా తీసుకున్నాడు. అందుకే మన కష్టాలను, బాధలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. మనకు కష్టం ఉంది, పరిస్థితి బాలేదు అని తెలిస్తే మనతో ఆడుకుంటారు.స్టార్ హీరో ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదంన్యూస్ రీడర్గా కన్నడలో నా కెరీర్ ప్రారంభం అయింది. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాను. ఒకేసారి మూడు చానళ్లలో పని చేశాను. ఒక రోజు ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నా కాలికి తీవ్రంగా గాయం అయింది. అందరూ ఆస్పత్రికి వెళ్దాం.. అంటే నేను షూట్కి వెళ్లాను. స్టూడియోలో నన్ను చూసి అందరూ భయపడ్డారు. కాలికి తీవ్రంగా గాయం అయిందని.. ముందు ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. కానీ నాకేమో నొప్పి కంటే ఎక్కువగా ఇంటర్వ్యూ మిస్ అయితే డబ్బులు రావు కదా అనే బాధే ఎక్కువగా ఉంది. నేను జీరో నుంచి వచ్చాను .అందుకే సెలెబ్రిటీ అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఇప్పటికే ఏదైనా ఈవెంట్ ఉంటే ఆటోలో కూడా వెళ్తుంటాను’ అని సౌమ్యరావు చెప్పుకొచ్చింది. -
11 ఏళ్ల బంధానికి స్వస్తి? భార్యకు కన్నడ హీరో విడాకులు!
కన్నడ హీరో అజయ్ రావు (Ajay Rao) వైవాహిక బంధానికి బీటలు వారిందంటూ కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. 11 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య స్వప్న విడాకుల కోసం దరఖాస్తు చేసిందని టాక్ నడుస్తోంది. కొద్ది నెలలుగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా గృహ హింస కింద భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని రూమర్లు వినిపిస్తున్నాయి.తెలీదంటూనే..తాజాగా ఈ వ్యవహారంపై అజయ్ పెదవి విప్పాడు. నా భార్య కోర్టుకు వెళ్లిందా? ఏమో, నాకైతే తెలియదు. ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడతాను అన్నాడు. అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇలాంటి సున్నిత వ్యవహారంపై గోప్యత పాటించాలని కోరుతున్నాను. మా వ్యక్తిగత విషయాల గురించి ఎవరూ ఎటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విన్నపిస్తున్నాను. సమస్యలనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. దయచేసి మా ఫ్యామిలీ విషయాలను పబ్లిసిటీ చేయొద్దు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చాడు.ఈ మధ్యే గొడవలు?కాగా అజయ్-స్వప్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014 డిసెంబర్ 18న వీరి వివాహం జరిగింది. 2019లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు చెరిష్మా జన్మించింది. 2024లో అజయ్ బెంగళూరులో ఓ ఇల్లు కొనుక్కుని భార్యాకూతురితో సహా అందులోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ గృహప్రవేశ వేడుకకు కన్నడ సినీప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇటీవలే అజయ్ నిర్మాతగా మారాడు. యుద్ధకాండ 2 అనే సినిమాను నిర్మించడంతో పాటు అందులో హీరోగా నటించాడు.సినిమాతో భారీ నష్టాలుఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ గొడవలు పెద్దవి కావడంతో ఇన్స్టాగ్రామ్లోనూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో చూడాలి! ఇకపోతే అజయ్ రావు.. ఎక్స్క్యూజ్మీ (2003) సినిమాతో హీరోగా మారాడు. తాజ్ మహల్, ప్రేమ్ కహానీ, కృష్ణ లవ్ స్టోరీ, కృష్ణ-లీల వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. రొమాంటిక్ హీరో ఇమేజ్ కారణంగా అతడికి సాండల్వుడ్ కృష్ణ అనే బిరుదు దక్కింది. ఇతడు చివరగా యుద్ధకాండ చాప్టర్ 2 చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Krishna Ajai Rao (@krishna_ajai_rao) చదవండి: DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా? -
ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగజీవాలపై దయ చూపించాలని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్ సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హ.. ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు.కుక్క కోసం కన్నీళ్లా?సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా.. అంటూ బోరున ఏడ్చేసింది. ఇలాంటివారిపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? అని మండిపడ్డాడు. అదే సమయంలో జంతుప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.🐶 పేద ప్రజలను దత్తత తీసుకుని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి. అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి.🐶 శునకాలు మీ కుటుంబసభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా!🐶 శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందిగా!🐶 మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు పంపించండి.🐶 వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు. మరి మీ బ్రీడ్ డాగ్స్ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం.🐶 పిల్లలతో సమానంగా కుక్కలకూ సమానహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి.🐶 మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్కు వెళ్లొద్దు, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోండి.🐶 మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి.🐶 మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి.🐶 'కుక్కలను దత్తత తీసుకోండి- పిల్లల్ని చంపండి' పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి.🐶 వీధికుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే.. మురికివాడలో ఉన్నవాళ్లందరినీ మీ విల్లాలోకి పంపించండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి.🐶 పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటికోసం సంతాపసభ నిర్వహించండి. HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS 1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS 1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳https://t.co/9RLkoJdqOE can love your pets in your…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025చదవండి: అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున -
ఓటీటీ సిరీస్లో లెస్బీయన్ లిప్లాక్.. అవసరమా?
సినిమాల్లో ఇప్పుడు లిప్లాక్ సీన్స్ కామన్ అయిపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చిత్రాల్లో ముద్దు సన్నివేశాలను జోడిస్తున్నారు. ఇక వెబ్ సిరీస్లలో అలాంటి సన్నివేశాలకు అడ్డూ అదుపే లేదు. ప్రేక్షకులు కూడా వాటిని రొటీన్ సీన్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఒకప్పటిలా ఆ సన్నివేశాలపై చర్చించడం.. ఖండించడం జరగట్లేదు. కానీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓ ముద్దు సీన్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ వెబ్ సిరీస్లో లెస్బియన్ మధ్య కిస్ సీన్ పెట్టడం అవసరమా అని ఓ వర్గం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అంధేరా’ ఆగస్ట్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో ప్రియా బాపట్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్తా కోలి, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాఘవ్ ధర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్కి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య వచ్చే లెస్బియన్ ముద్దు సన్నివేశంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కథలో భాగంగా సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య ముద్దు పెట్టుకోవాలి. ఇద్దరూ ఈ సీన్లో అద్భుతంగా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా నేచురల్గా నటించారని కొంతమంది వారిపై ప్రశంసలు కురిపిస్తుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఆ సీన్ అనవసరంగా పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు.