breaking news
National
-
విభాగాల వారీగా టాపర్లు వీరే
జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన బీఈ, బీటెక్ పేపర్ 1 ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. 13,04,653 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 96.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. 326 నగరాల్లోని 658 సెంటర్లలో జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 పరీక్ష నిర్వహించారు. ఇందులో ఇండియా వెలుపల నిర్వహించిన 15 సెంటర్లు కూడా ఉన్నాయి. కాగా ఈసారి పేపర్ 1లో 12 మంది 100 పర్సంటైల్ సాధించారు. బాలికలు ఎవరూ 100 పర్సంటైల్ సాధించలేకపోయారు. గతేడాది రెండు సెషన్లలో కలిసి మొత్తం 24 మంది 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. జనరల్- ఈడబ్ల్యూఎస్శ్రేష్ట్ జసోరియా (రాజస్థాన్)బాలికల విభాగంఆషి గ్రేవాల్ (హరియాణా)పీడబ్ల్యూబీడీహర్ష్ జైన్ (మధ్యప్రదేశ్)ఎస్టీ విభాగందక్ష్ షెహ్రా (రాజస్థాన్)ఎస్సీ విభాగందేవ శ్రీవేద్ (ఆంధ్రప్రదేశ్)ఓబీసీ- ఎన్సీఎల్నరేంద్రబాబుగారి మహిత్ (ఆంధ్రప్రదేశ్)100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే1. శ్రేయస్ మిశ్రా (ఢిల్లీ)2. నరేంద్రబాబు గారి మోహిత్ (ఆంధ్రప్రదేశ్)3. శుభమ్ కుమార్ (బిహార్)4. కబీర్ చిల్లర్ (రాజస్థాన్)5. చిరాన్జిబ్ కార్ (రాజస్థాన్)6. భవేశ్ పత్రా (ఒడిశా)7. అనయ్ జైన్ (హరియాణా)8. అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్)9. పసల మోహిత్ (ఆంధ్రప్రదేశ్)10. మాధవ్ విరాదియా (మహారాష్ట్ర)11. పురోహిత్ నిమయ్ (గుజరాత్)12. వివన్ శరద్ మహీశ్వరి (తెలంగాణ) -
JEE Mains Results: తెలుగు విద్యార్థుల సత్తా
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) సాయంత్రం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తాజా జేఈఈ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, ఒక తెలంగాణ విద్యార్థి ఉన్నారు. శరత్ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్ అనే తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించిన జాబితాలో ఉన్నారు. ఓపెన్ కేటగిరిలో పసల మోహిత్ అనే విద్యార్థి 100 పర్సెంటైల్ సాధించగా, ఓబీసీ కేటగిరిలో టాపర్గా నరేంద్ర బాబు నిలిచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షను 13.04 లక్షల మంది విద్యార్థులు రాశారు. కాగా, దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరు కాగా, రెండు సెషన్లలోనూ భారీగా పోటీ పెరిగింది. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించిన వారు వీరేశ్రేయస్ మిశ్రా-ఢిల్లీనరేంద్ర బాబు- ఆంధ్రప్రదేశ్శుభమ్ కుమార్-బిహార్కబీర్ చిల్లర్-రాజస్తాన్చిరాన్జిబ్ కార్-రాజస్తాన్భవేశ్ పత్రా-ఒడిశాఅనయ్ జైన్-హర్యానాఅర్నవ్ గౌతమ్-రాజస్తాన్పసల మోహిత్-ఆంధ్రప్రదేశ్మాధవ్ విరాదియా-మహరాష్ట్రపురోహిత్ నిమయ్-గుజరాత్వివన్ శరద్ మహీశ్వరి-తెలంగాణ -
పెళ్లికి ముందే అతడితో దుబాయ్ ఎందుకెళ్లావ్?
న్యూఢిల్లీ: వివాహానికి ముందే శారీరక సంబంధాలు కొనసాగించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. వివాహం చేసుకుంటానని ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మరొక మహిళను వివాహం చేసుకున్నాడని నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఈ కేసు చారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న (BV Nagarathna) మాట్లాడుతూ.. ''వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ప్రవేశించే యువత జాగ్రత్త వహించాలని హితవు పలికారు. బహుశా మనం పాతకాలపు వాళ్ళమే కావచ్చు. కానీ వివాహానికి ముందు.. ఒక అబ్బాయి, అమ్మాయి అపరిచితులు. వారి మధ్య ఎంత సఖ్యత ఉన్నా వివాహానికి ముందు వారు శారీరక సంబంధంలో ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. అందుకే ఎవరికి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడద''ని అన్నారు.ఇక కేసు విషయానికి వస్తే.. 2022లో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వెబ్సైట్ ద్వారా నిందితుడికి బాధితురాలు పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడితో సన్నిహితంగా మెలిగింది. వారిద్దరూ దుబాయ్కు కూడా వెళ్లారు. పెళ్లికి ముందే వారిద్దరూ చాలా దూరం వెళ్లిపోయారు. అయితే తాము ఏకాంతంగా కలుసుకున్నప్పుడు తనకు తెలియకుండానే నిందితుడు వీడియో తీసి, తనను బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనను మోసం చేసి.. 2024 జనవరిలో పంజాబ్లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని కోర్టుకు తెలిపింది.కాగా, బాధితురాలు పెళ్లికి ముందే నిందితుడితో దుబాయ్ (Dubai) ఎలా వెళ్లిందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అన్న ఉద్దేశంతో బాధితురాలు అతడితో సన్నిహితంగా మెలిగిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వివాహానికి ముందే తొందరపాటు పనికిరాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఇష్టపూర్వకంగానే సన్నిహితంగా మెలిగినందున.. ఇది విచాణార్హమైన, దోషులుగా తేల్చదగిన కేసు కాదన్నారు. వారిని మధ్యవర్తిత్వానికి పంపుతామన్నారు. దీనిపై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. చదవండి: కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయను? -
ఆయనొక ఐఏఎస్.. మూడో భార్య కూడా ఐఏఎస్..!
ఐఏఎస్ ఆఫీసర్.. మరో ఐఏఎస్ను పెళ్లాడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న వ్యక్తికి.. మూడో పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా ఐఏఎస్ అధికారిణే భార్యగా వస్తే అది అరుదైన విషయంగానే భావించాలి. చట్టపరంగానే ఇద్దరి భార్యలకు బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు మూడో వివాహం చేసుకున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయితే అంతకుముందు వివాహం చేసుకున్న ఇద్దరూ భార్యలు ఐఏఎస్ అధికారిణులే గాక, ఇప్పుడు తాజాగా చేసుకున్న ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ మూడోసారి వివాహం చేసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్. ఇప్పటివరకు వివాహం చేసుకున్న ముగ్గురు భార్యలూ IAS అధికారులే కావడం విశేషం. తాజా వివాహం ఫిబ్రవరి 11న కూనో నేషనల్ పార్క్లో జరిగింది. ఈసారి ఆయన 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకిత ధాక్రేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన ఐఏఎస్ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్కి చెందిన అవి ప్రసాద్.. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్లో చేరారు. ఆపై ఏడాదికి అఖిల భారత సర్వీస్లో 13వ ర్యాంకు సాధించి ఐఏఎస్ హోదా పొందారు. -
ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
కర్ణాటకాలో గతేడాది ఇజ్రాయెల్ మహిళతో పాటు మరోకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఘటనలో అరెస్టైన ముగ్గురిని నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణశిక్ష విధించింది. 2025 మార్చి 6న ఒక మహిళా ఇజ్రెయెల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమకాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు. -
తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్
మరో బిడ్డ రాబోతోందన్న ఆనందంలో ఉన్న ఒక తల్లి అనూహ్యంగా తీవ్ర విషాదంలో మునిగి పోయింది. రెండోసారి తల్లి కాబోతున్నమహిళ మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకుంటూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదటి బిడ్డ, మూడేళ్ల చిన్నారి నీటి కొలనులో పడి మరణించిన వైనం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన చరణ్ స్వాతి దంపతులు. వీరికి తొలి సంతానంగా ఒక కుమారుడున్నాడు. ప్రస్తుతం స్వాతి రెండోసారి ఎనిమిది నెలల గర్భవతి. ఈ క్రమంలో ఆమెకు మెటర్నిటీ ఫోటోషూట్ జరుగుతోంది. సమీపంలో ఆడుకుంటున్న లక్ష్మీర్ జారి అక్కడే ఉన్న చిన్ననీటి కొలనులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించి ఆ చిన్నారికి సాయం అందేలోపే ప్రాణాలొదిలేశాడు. ఆసుపత్రికి తరలించేటప్పటికి చిన్నారి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్న ఆ చిన్నారి తండ్రి బెంగళూరుకు రానున్నారని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరికకస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్ -
'నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'.. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు
హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.స్పందించిన త్రిష..'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.అసలేం జరిగిందంటే..అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. -
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ సుప్రీంలో వాదించింది. అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. -
పెళ్లికి వెళ్తున్నానని చెప్పి… ప్రియుడితో బిహార్కు పరార్!
శివాజీనగర(కర్ణాటక): హాసన్ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన ఓ మహిళను కుణిగల్ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్కు చెందిన వలస కార్మికుడు దేవిడ్ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహార్కు పారిపోవాలని పథకం వేశారు. ఆ మేరకు ఫిబ్రవరి 12న చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు మొబైళ్ల లొకేషన్ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.మహిళ ఆత్మహత్య కోలారు: ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముళబాగిలు తాలూకా భైరకూరు గ్రామానికి చెందిన చైత్ర (27) అనే వివాహిత ఆదివారం మృతి చెందింది. బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్కు చెందిన చైత్రను ముళబాగిలు తాలూకా భైరకూరుకు చెందిన బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భర్త మొదటి భార్య, అత్త వేధిస్తున్నారనే ఆవేదనతో ఈ నెల 10న పినాయిల్ తాగింది. ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. చైత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తల్లి, మొదటి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘శబరిమలకు మహిళలు’.. తుది విచారణకు ‘సుప్రీం’
శబరిమల: కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ప్రదేశాలలో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2026, ఏప్రిల్ 7వ తేదీ నుంచి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జారీ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వుల ఆధారంగా ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తన తుది వైఖరిని తెలియజేస్తూ, మార్చి 14 లోగా లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.గతంలో ఈ కేసును ప్రధాన ధర్మాసనానికి బదిలీ చేయడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల దశలో కూడా న్యాయపరమైన ప్రశ్నలను ప్రధాన ధర్మాసనానికి నివేదించే అధికారం కోర్టుకు ఉంటుందని 2020 ఫిబ్రవరిలోనే తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. దీనితో ఈ అంశంపై ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. 2020లో రూపొందించిన ఏడు ప్రధాన న్యాయపరమైన ప్రశ్నల ఆధారంగానే ప్రస్తుత విచారణ సాగనుంది.అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసు కోసం కోర్టు షెడ్యూల్ను ప్రకటించింది. ఏప్రిల్ 7 నుండి 9 వరకు రివ్యూ పిటిషన్లను సమర్థించే వారి వాదనలను వింటారు. అనంతరం ఏప్రిల్ 14 నుండి 16 వరకు ఆ పిటిషన్లను వ్యతిరేకించే వారి వాదనలు జరుగుతాయి. ఏప్రిల్ 21న ప్రత్యుత్తరాల విచారణ చేపట్టి, ఏప్రిల్ 22 నాటికి అమికస్ క్యూరీ తుది వాదనలతో ప్రక్రియను ముగించాలని కోర్టు భావిస్తోంది. ఈ కేసు అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.2018లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శబరిమలలో మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేరళలో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. తాజా విచారణ కేవలం శబరిమలకే పరిమితం కాకుండా.. మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్తులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, దావూదీ బోహ్రా కమ్యూనిటీలోని వివాదాస్పద ఆచారాల వంటి కీలక అంశాలను కూడా ప్రస్తావించనుంది.ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు -
ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం
భారత ప్రభుత్వ ఆహార సబ్సిడీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. దీనితో పాటు 24x7 సేవలందించే ‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంను కూడా ఆయన ఆవిష్కరించారు.ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ఎలా పనిచేస్తుంది?ప్రస్తుతానికి గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు..లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో ఆర్బీఐ (ఆర్బీఐ) ద్వారా ‘ఈ-రూపీ’ క్రెడిట్ అవుతుంది. ఇందులో సరకు రకం, పరిమాణం, రాయితీ ధర ముందే పరిగణలోకి తీసుకుంటారు. ఈ డిజిటల్ టోకెన్లను కేవలం అధీకృత రేషన్ షాపుల్లో తమకు కేటాయించిన సరుకుల కోసం మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వీటిని ఖర్చు చేయడం సాధ్యపడదు. స్మార్ట్ఫోన్ ఉన్నవారు క్యూఆర్ కోడ్ ద్వారా, సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయవచ్చు.సాధారణంగా పాత పద్ధతిలో డీలర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి సమయం పట్టేది. కానీ ఈ-రూపీ విధానంలో లబ్ధిదారుడు వౌచర్ను రిడీమ్ చేయగానే ఆ టోకెన్ విలువకు సమానమైన నగదు డీలర్ బ్యాంక్ ఖాతాలో తక్షణమే జమ అవుతుంది. ప్రతి కిలో ధాన్యం ఎవరికి అందింది, ఏ సమయంలో అందింది అనే సమాచారం రియల్ టైమ్లో ప్రభుత్వానికి అందుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. తూకంలో మోసాలకు తావుండదు.‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంసామాన్యులకు రేషన్ సేకరణను మరింత సులభతరం చేస్తూ ‘అన్నపూర్తి’ పేరుతో ఆటోమేటెడ్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషీన్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎంలు రోజులో 24 గంటలు పనిచేస్తాయి. కేవలం 35 సెకన్లలో 25 కిలోల ధాన్యాన్ని పంపిణీ చేయగలవు. మార్చి 2026 నాటికి ఈ యంత్రాల ద్వారా గోధుమలు, బియ్యంతో పాటు (25 కిలోల వరకు), ఒక కిలో ప్యాకెట్లలో కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును లబ్ధిదారులు పొందవచ్చు. ఈ ఏటీఎం యంత్రాలను పూర్తిగా గుజరాత్లోనే తయారు చేయడం విశేషం.ఈ ఏటీఎంలను ఉపయోగించడానికి ‘స్మార్ట్ రేషన్ కార్డ్’ లేదా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక డిజిటల్ కార్డ్ అవసరం ఉంటుంది. లబ్ధిదారుడు తన రేషన్ కార్డును ఏటీఎం మిషీన్ వద్ద ఉన్న రీడర్ ద్వారా స్కాన్ చేయాలి. కార్డుతో పాటు భద్రత కోసం వేలిముద్ర లేదా కంటిపాప(ఐరిస్) స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డు వేరే వారు దొంగిలించినా ధాన్యం తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో కార్డు లేకపోయినా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా లావాదేవీ పూర్తి చేయవచ్చు.ఏటీఎం పనిచేసే విధానంపైన చెప్పినట్లుగా కార్డ్ లేదా బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుడిని మిషీన్ గుర్తిస్తుంది. ఆ నెలలో వారికి ఎంత కోటా మిగిలి ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీకు కావాల్సిన వస్తువును (ఉదాహరణకు: బియ్యం లేదా గోధుమలు) పరిమాణాన్ని ఎంచుకోవాలి. ఈ మిషీన్లలో సెన్సార్లు ఉంటాయి. ఇవి ధాన్యాన్ని గ్రాములతో సహా అత్యంత కచ్చితంగా తూకం వేస్తాయి. మాన్యువల్ తూకంలో జరిగే మోసాలకు ఇక్కడ తావుండదు. మీరు ఎంచుకున్న వస్తువు కింద ఉన్న అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది. పప్పులు, ఉప్పు వంటివి అయితే సీల్డ్ ప్యాకెట్ల రూపంలో వస్తాయి.దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికఈ పైలట్ ప్రాజెక్ట్ గుజరాత్లో విజయవంతమైన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టును చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ సీబీడీసీ ఆధారిత రేషన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సామాజిక సంక్షేమ పథకాల్లో ‘ప్రోగ్రామబుల్ డిజిటల్ కరెన్సీ’ని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని అగ్రగామి దేశంగా భారత్ నిలవనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం!
భివాడీ: రాజస్థాన్లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బయటపడలేక ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు.పోలీసులు గస్తీలో ఉండగా ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏఎండీ) సుమితా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఖుష్ఖేరా, భివాడీ రీకో ఫైర్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. భివాడీ ఎస్పీ, ఏడీఎం సహా ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు -
‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు
వారిది అరవై ఏళ్లకు సమీపించిన వైవాహిక జీవితం.. ముగ్గురు పిల్లలు.. మనవలు.. మనవరాళ్లు.. ఇన్ని దశాబ్దాల ప్రయాణం తర్వాత వారు విడిపోతామంటే కోర్టు ఒప్పుకుంటుందా? ‘భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజం.. వాటిని క్రూరత్వం అని పిలవలేం’ అంటూ రాజస్థాన్ హైకోర్టు ఒక వృద్ధ దంపతుల విడాకుల పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.భరత్పూర్కు చెందిన ఈ జంటకు 1967, జూన్ 29న వివాహం జరిగింది. దాదాపు 46 ఏళ్ల పాటు (2013 వరకు) ఎలాంటి తగాదాలు లేకుండా వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఆస్తి పంపకాలు, వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో 2014లో భర్త విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఫ్యామిలీ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు.తన భార్య తనపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. అలాగే, ఆస్తిని పెద్ద కొడుకుకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతోందని, తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ, మానసికంగా వేధిస్తోందని పేర్కొన్నారు.అయితే తన భర్త .. అతని తమ్ముడి మాటలు విని ఆస్తిని వృథా చేస్తున్నారని భార్య వాదించింది. ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉందని, అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. వివాదంలో ఉన్న ఆస్తిని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.జస్టిస్ సుదేష్ బన్సాల్, జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నిశితంగా పరిశీలించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దశాబ్దాల పాటు కలిసి ఉన్న దంపతుల్లో వయస్సుతో పాటు సహనం, అవగాహన పెరగాలి కానీ ఇలాంటి చిన్న కారణాలతో విడిపోకూడదు. కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం సహజం, అంతమాత్రాన అది విడాకులు ఇచ్చేంత ‘క్రూరత్వం’ కిందకు రాదు. ఈ వయస్సులో విడాకులు మంజూరు చేస్తే కేవలం ఆ దంపతులకే కాకుండా, వారి పిల్లల గౌరవానికి భంగం కలుగుతుంది అని పేర్కొంది. చిన్నపాటి మనస్పర్థలను విడాకుల వరకు తీసుకెళ్లడం సరికాదని చెబుతూ, భర్త దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు తోసిపుచ్చింది. 58 ఏళ్ల బంధాన్ని గౌరవించాలని ఆ వృద్ధ దంపతులకు హితవు పలికింది.ఇది కూడా చదవండి: ప్రియంకా చోప్రా భారత్కు గర్వకారణం: శశి థరూర్ -
ప్రియంకా చోప్రా భారత్కు గర్వకారణం: శశి థరూర్
కేంబ్రిడ్జి: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఇండియా కాన్ఫరెన్స్ 2026’ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ బ్యాక్స్టేజ్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోలను ‘ఎక్స్’వేదికగా షేర్ చేస్తూ, ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘భారతీయులు అరుదుగా కనిపించే అంతర్జాతీయ వేదికలపై, దేశం గర్వపడేలా ప్రియాంక రాణిస్తోంది. ఆమె అద్భుతంగా కనిపిస్తోంది. ఎంతో హుందాగా, విజ్ఞతతో మాట్లాడుతోంది. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది?’ అని థరూర్ తన ట్వీట్లో రాశారు. Caught up with @priyankachopra (after more than a decade) in the wings at @Harvard backstage, just before her appearance as the closing keynote of the @HarvardIndConf. Remarkable to see (and hear) how well she is doing! She has made India proud by conquering a stage on which… pic.twitter.com/wCTAYPJugT— Shashi Tharoor (@ShashiTharoor) February 15, 2026హార్వర్డ్ వేదికగా జరిగిన ఈ సదస్సులో ‘మనం ఊహించే భారతదేశం’ (The India We Imagine) అనే ఇతివృత్తంపై చర్చలు సాగాయి. గ్లోబల్ అఫైర్స్ నిపుణురాలు మహిమా కౌల్తో పాటు యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక చోప్రా కూడా ఈ వేదికపై ప్రసంగించారు. భారతదేశానికి అంతర్జాతీయంగా వస్తున్న ఖ్యాతి, భవిష్యత్ అవకాశాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శశి థరూర్ కుమారుడు ఈశాన్ థరూర్, కోడలు భూమి థరూర్ కూడా పాల్గొనడం విశేషం. యువతలో దేశంపై ఉన్న ఆసక్తి, భవిష్యత్తుపై ఉన్న తపన తనను ఎంతగానో ప్రభావితం చేశాయని థరూర్ పేర్కొన్నారు. నెటిజన్లు థరూర్ వ్యాఖ్యలకు రకరకాల మీమ్స్తో స్పందిస్తున్నారు.ఇది కూడా చదవండి: కారు మీద కూలిన భారీ కరెంట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి -
పెళ్లి చేసుకోనన్నంత మాత్రాన...అత్యాచారంగా పరిగణించలేం
డెహ్రాడూన్: మేజర్లు పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసిన అనంతరం పురుషుడు వివాహానికి అంగీకరించనంత మాత్రాన దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు తేల్చిచెప్పింది. వారి బంధం విఫలమైనంత మాత్రాన అది క్రిమినల్ కేస్ కాదని అభిప్రాయపడింది. ఆ హామీ మొదటి నుంచీ అబద్ధమని తేలితేనే నేరమవుతుందని పేర్కొంది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ముస్సోరీకి చెందిన మహిళ వేసిన కేసును కోర్టు కొట్టేసింది. సూరజ్ బోరా అనే వ్యక్తి 45 రోజుల్లో తనను వివాహం చేసుకుంటానని చెప్పాడని, తర్వాత అందుకు తిరస్కరించాడని సదరు మహిళ ఫిర్యాదు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ ఆశిష్ నైథానీ విచారించారు. ఇద్దరు మేజర్లని, నిందితుడు సంబంధం ప్రారంభం నుంచి మోసం చేసే ఉద్దేశంతో ఉన్నట్టు నిరూపించడానికికచ్చితమైన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. ‘‘దీర్ఘకాలిక సంబంధం పరస్పర అంగీకారాన్ని సూచిస్తుంది. కనుక ఈ దశలో నిందితునిపై క్రిమినల్ చర్యలు కొనసాగించడం వేధించడమే అవుతుంది’’ అని స్పష్టం చేశారు. 2023 జూలై 22న ఈ మేరకు దాఖలైన ఛార్జ్షిట్ను కూడా పూర్తిగా కొట్టేశారు. -
కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్
బ్యాంకులో అందులోనూ ప్రభుత్వరంగ బ్యాంకులో ఉంటే మన సొమ్ము, భద్రం అనుకుంటాం. తాజాగా ఆన్లైన్ జూదం (Gambling)కోసం కస్టమర్ల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని తస్కరించిన వైనం ఆందోళన రేపింది. బెంగళూరులో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలుఇలా ఉన్నాయి.బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (34), కస్టమర్ల లాకర్ల నుండి సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్లైన్ జూదానికి వినియోగించాడు. జనవరి 2న కొంతమంది కస్టమర్లు తమ లాకర్లను తనిఖీ చేసినప్పుడు తమ ఆభరణాలు కొన్ని మాయమైనట్లు గుర్తించారు. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.వినియోగదారుల ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీలో మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమైనట్టు తేలింది. బ్రాంచ్ మేనేజర్ లేని సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో లాకర్లను తెరిచి ఈ మోసానికి పాల్పడ్డాడు. 2025 జూన్ - 2026 జనవరి మధ్య కాలంలో నిందితుడు కిరణ్ తక్కువ మొత్తంలో బంగారాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. అలా క్రమంగా మొత్తం 2,793 గ్రాముల బంగారం (దాదాపు రూ. 4 కోట్లు) మాయం చేశాడు. ఇలా కొట్టేసిన బంగారాన్ని ప్రైవేట్ రుణదాతలకు తనఖా పెట్టి, ఆడబ్బును బెట్టింగ్లో వాడేవాడు. ఇందులో 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అవ్వగా, 21 ప్యాకెట్లలో కొంత మేర బంగారం పోయింది.దొంగిలించిన బంగారాన్ని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మిగిలిన బంగారాన్నిరికవరీ చేసేందుకు పోలీసులుప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ జగలసర్ అన్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!నోట్: బంగారాన్ని తాకట్టు పెట్టే కస్టమర్లు బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని డిసిపి కోరారు. తమ లాకర్ పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలనీ బ్యాంకు లావాదేవీల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని, ఇదే మోసాలనుంచి కస్టమర్లను రక్షిస్తుందని డిసిపి లోకేష్ జగలాసర్ సూచించారు. -
కారు మీద కూలిన భారీ స్తంభం.. ఎస్పీ నేత మృతి
ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా, అంటు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. సుమారు 1000 కిలోల బరువున్న హై మాస్ట్ లైటింగ్ స్తంభం ఒకటి కదులుతున్న కారుపై ఒక్కసారిగా పడింది. ఈ దుర్ఘటనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత లాల్ బహదూర్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంప్ వద్ద కార్మికులు హై మాస్ట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Disturbing video.Lal Bahadur Yadav was driving his car when a pole installed at a petrol pump suddenly collapsed onto his vehicle. He died on the spot.Just yesterday in , a portion of a metro pillar fell onto a busy road, crushing one person to death.How are such fatal… pic.twitter.com/tfv16OD7Ng— Satyendra Kumar Behera (@imskbehera) February 15, 2026ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్తంభాన్ని అమర్చుతున్న సమయంలో అది అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ (47) తన కారులో నగరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ స్తంభం పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. లాల్ బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన 2022లో అంటు నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషాద వార్త తెలియగానే పార్టీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లైటింగ్ స్తంభం ఏర్పాటు చేస్తున్న సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్గఢ్ ఎస్పీ దీపక్ భూకర్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇది కూడా చదవండి: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు. यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz— Narendra Modi (@narendramodi) February 16, 2026న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు! -
‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ విధులలో నిర్లక్ష్యం, అధికారాల దుర్వినియోగానికి పాల్పడిన ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ)హోదాలో ఉన్న ఈ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.సస్పెన్షన్కు గురైన అధికారులలో సంషేర్గంజ్, ఫరక్కా, మైనాగురి, సూతి, కానింగ్ పూర్బో, డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఏఈఆర్ఓలు ఉన్నారు. ముర్షిదాబాద్ జిల్లా సంషేర్గంజ్ ఏఈఆర్ఓ సెఫౌర్ రెహమాన్, ఫరక్కా ఏఈఆర్ఓ నితీష్ దాస్, మైనాగురి ఏఈఆర్ఓ డాలియా రాయ్ చౌదరి, సూతి ఏఈఆర్ఓ ముర్షీద్ ఆలంలపై వేటు పడింది. అలాగే కానింగ్ పూర్బో నియోజకవర్గానికి చెందిన సత్యజిత్ దాస్, జయదీప్ కుందు, డెబ్రా ఏఈఆర్ఓ దేబాశిష్ బిస్వాస్లను ఈసీ విధుల నుంచి తొలగించింది.ఓటర్ల జాబితా తుది ప్రచురణకు ముందు చేపట్టిన పరిశీలనలో ఈ అధికారులు తీవ్రమైన అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. అవసరమైన పత్రాలు సమర్పించకపోయినా, మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఓటర్ల అర్హతపై అనుమానాలు ఉన్నా కూడా వీరు అనేక కేసులను క్లియర్ చేశారని తేలింది. అనర్హులకు ఓటు హక్కు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీరు అధికారాలను దుర్వినియోగం చేశారని విచారణలో వెల్లడైంది.తప్పులను సరిదిద్దడంలో విఫలమైనందుకు వీరిని బాధ్యులుగా చేస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ (ఆరపీ) యాక్ట్ 1950లోని సెక్షన్ 13సీసీ కింద తమకు ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఎటువంటి జాప్యం లేకుండా ఈ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని, ఆ వివరాలను తమకు నివేదించాలని ఈసీ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘ఐదేళ్లలో ఐటీ, బీపీఓలు..’ బాంబు పేల్చిన వినోద్ ఖోస్లా -
‘ఐదేళ్లలో ఐటీ, బీపీఓలు..’ బాంబు పేల్చిన వినోద్ ఖోస్లా
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా తాజాగా ఐటీ, బీపీఓ రంగాలకు సంబంధించి తన అంచనాలను వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో రాబోయే ఐదేళ్లలో ఐటీ సర్వీసెస్, బీపీఓ రంగాలు దాదాపుగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు. ఇండియా ఏఐ సమ్మిట్ 2026 సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే 15 ఏళ్లలో నైపుణ్యం ఆధారిత వృత్తులన్నీ ఏఐకి ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. అయితే ఇదే సాంకేతికత అటు వైద్యం, ఇటు విద్యా రంగాలను సామాన్యులకు మరింత చేరువ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో అకౌంటెంట్లు, వైద్యులు, ఇంజనీర్ల కంటే ఏఐ నిపుణులు మెరుగ్గా పనిచేస్తారని ఖోస్లా విశ్లేషించారు. మేధోపరమైన పనుల తర్వాత రోబోటిక్స్ రంగం పుంజుకుంటుందని, దీనివల్ల శారీరక శ్రమతో కూడిన పనులు కూడా యంత్రాలే చేస్తాయని చెప్పారు. ఫలితంగా వస్తువుల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2035 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయని, అప్పటికి యువతకు ఉద్యోగాలు లభించడం కష్టతరమవుతుందని ఆయన తెలిపారు.ఐటీ సర్వీసుల స్థానంలో భారత్ ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసే కేంద్రంగా ఎదగాలని ఖోస్లా సూచించారు. దేశంలోని 25 కోట్ల మంది యువత ఐటీ సేవలపై కాకుండా ఏఐ ఉత్పత్తుల సృష్టిపై దృష్టి సారించాలని కోరారు. అమెరికా, చైనా వంటి దేశాల ఆధిపత్యాన్ని తట్టుకోవడానికి భారత్ సొంతంగా ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఆయన సూచించారు. తద్వారా సామాన్యులకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించవచ్చని ఆయన అన్నారు.ఇదిలావుండగా ఖోస్లా ప్రస్తుత అమెరికా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ (H-1B) వీసాలపై ఆంక్షలు విధించడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల ద్వారా వచ్చే జీడీపీ వృద్ధిని డొనాల్డ్ ట్రంప్ గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. చట్టబద్ధమైన వలసలు దేశానికి మేలు చేస్తాయని, కానీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు దీర్ఘకాలంలో నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. భారత్ నుండి వెళ్లిన నిపుణులు తిరిగి స్వదేశానికి రావడం భారతదేశ అభివృద్ధికి మంచి పరిణామమని ఖోస్లా అన్నారు.ఇది కూడా చదవండి: తారిఖ్ రెహ్మాన్.. ఈ సవాళ్లకు జవాబేది? -
దేశంలోనే తొలి ‘గో మ్యూజియం’!
మధుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో దేశంలోనే మొట్టమొదటి నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం (జాతీయ ఆవు సంస్కృతి ప్రదర్శనశాల) ఏర్పాటు కానుంది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియం ఆవుల సాంస్కృతిక, ఆధ్యాతి్మక, శాస్త్రీయన ప్రాముఖ్యతను తెలియజేస్తుందని, గో సంరక్షణపై సమగ్ర అవగాహనను పెంపొందిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు సంబంధించిన భూమికోసం బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ ఉపాధ్యక్షుడు శైలజాకాంత్ మిశ్రా, ఆగ్రా డివిజనల్ కమిషనర్ నాగేంద్ర ప్రతాప్, జిల్లా కలెక్టర్ సీపీ సింగ్, మధుర బృందావన్ డెవలప్మెంట్ అథారిటీ ఉపాధ్యక్షులు ఎన్ లక్ష్మీ వెటర్నరీ యూనివర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు రూపురేఖలపై చర్చించారు. మ్యూజియంలో సు మారు 100 డిజిటల్, సింబాలిక్ ఆవుల నమూనాలు ప్రదర్శించనున్నట్టు కమిషనర్ నాగేంద్ర ప్రతాప్ తెలిపారు. ఆవు వారసత్వ గొప్పతనం గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కలి్పంచేందుకు దేశంలో అన్ని ప్రధాన ఆవుల జాతులు, అలాగే అంతరించి పోతున్న జాతులు అందులో ఉంటాయన్నారు. ఆవు పాలు, పెరుగు, జున్ను, నెయ్యి వంటి ఉత్పత్తుల ప్రదర్శనతోపాటు, అవి అందించే ఆయుర్వేద ప్రయోజనాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. సందర్శకులకు స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించే ఒక డైరీ పార్లర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
బ్రిటన్తో వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది జూలై 24న ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)పై సంతకం చేశాయి. 2030 నాటికి 56 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇది అమల్లోకి వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. అంతేకాదు స్కాచ్ విస్కీపై 150 శాతం ఉన్న సుంకం 75 శాతానికి తగ్గనుంది. 2035 నాటికి 40 శాతానికి తగ్గిస్తారు. ప్రస్తుతం 110శాతం ఉన్న సుంకాలను రానున్న ఐదేళ్లలో 10శాతానికి తగ్గించనున్నారు. ఇవన్నీ దశలవారీగా అమలు కానున్నాయి. ఇక భారత్కు చెందిన వ్రస్తాలు, పాదరక్షలు, రత్నాలు–నగలు, క్రీడా సామగ్రి, బొమ్మలు వంటి ఉత్పత్తులను యూకేకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులను కూడా పన్నుల సుంకాలు లేకుండా ఎగుమతి చేసే లభించనుంది. ఈ ఒప్పందంతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. యూకే పార్లమెంట్ ఆమోదం తర్వాతే... అయితే ఈ ఒప్పందం అమలు కావడానికి ముందు యూకే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఇటీవల యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఈ ఒప్పందంపై చర్చించింది. ఈ సందర్భంగా వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ మాట్లాడారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక విజయమన్నారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ముందు రెండు సభల్లో చర్చలు, సమీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. -
ఒకే ఒక్కడు..!
ఢిల్లీ.. దేశ రాజధాని! మెరిసిపోయే మెట్రోలు, రాజప్రసాదాల్లాంటి భవనాలు.. కానీ వాటి వెనుకే వికృతమైన మురికి కూపాలు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు, బస్టాండ్ల దగ్గర దుర్గంధాలు అలవాటైపోయాయి. చూసీచూడనట్టు ముక్కు ముడుచుకుని వెళ్లిపోవడం నగరజీవి దైనందిన చర్య అయిపోయింది. కానీ, ఆ మురికిని చూసి ఒక సామాన్యుడి రక్తం మరిగింది. అతనే మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ ‘ఆసిఫ్ హిందుస్తానీ’. తన చేతిలోని కెమెరాను ఆయుధంగా, చీపురును ధ్వజంగా మార్చుకుని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాలకుల నిర్లక్ష్యంపై ఆసిఫ్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. నలుగురికి 62 పార్కుల బాధ్యత ఆసిఫ్ చేసేది కేవలం వీధులు ఊడ్చడం కాదు.. ప్రభుత్వ అసమర్థతను నిలదీయడం.. ఢిల్లీలోని రోహిణిలో ఒక మురికి బస్టాండ్ను స్వయంగా శుభ్రపరచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఆయన నిగ్గు తేలి్చన వాస్తవాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. పశి్చమ ఢిల్లీలో కేవలం నలుగురు పారిశుధ్య కార్మికులు కలిసి 62 పార్కులను నిర్వహించాలట! ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? పారిశుధ్య కారి్మకులకు పని చేయాలనే ఉన్నా, వారి దగ్గర సరైన పరికరాలు లేవు. కాలం చెల్లిపోయి, కనీసం చెత్తను లోడ్ చేయడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిన వాహనాలు అధికారుల దౌర్భాగ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నిర్లక్ష్యపు గోడలు బద్దలు కొడుతూ.. ‘పరిశుభ్రత.. అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది వ్యక్తిగత జవాబుదారీతనం’.. అని ఆసిఫ్ గట్టిగా నమ్ముతున్నాడు. చిప్స్ ప్యాకెట్ లేదా ప్లాస్టిక్ స్ట్రా రోడ్డుపై పారేసే ముందు ‘ఒక్క క్షణం ఆగి ఆలోచించండి’అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం చేసే ఆలోచనే నగరాన్ని మారుస్తుందన్నది ఆయన వాదన. మౌలిక వసతుల కన్నా మనుషుల మైండ్సెట్ మారడమే నిజమైన పరిష్కారమని నిరూపిస్తున్నాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, పౌర బాధ్యతను గుర్తు చేస్తున్న ఆసిఫ్ పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది. రేపటి కల.. సంయుక్త పోరాటం ఆసిఫ్ లక్ష్యం కేవలం ఒక్క రోజు నిరసన కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. యువతలో చైతన్యం తీసుకురావడం ద్వారా పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ‘ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేసే ఒక పటిష్టమైన నమూనా రావాలి’.. అని ఆయన గొంతెత్తుతున్నాడు. అధికారుల ఏసీ గదుల వెనుక దాగున్న ఉదాసీనతను కడిగేయాలంటే, సామాన్యుడు ఇలా వీధిలోకి రాక తప్పదని ఆసిఫ్ తన ప్రతి అడుగుతోనూ చాటి చెబుతున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాల్దీవుల్లో తేలిన... ఇస్రో రాకెట్ శకలాలు!
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లోగోతో కూడిన భారీ రాకెట్ శకలం మాల్దీవ్స్ దేశానికి సంబంధించిన దీవిలో కనిపించడం కలకలం సృష్టించింది. సముద్రంలో మరో ఇద్దరితో కలిసి చేపల వేట సాగిస్తున్న ఓ మత్స్యకారుడు దీన్ని తొలుత గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. అనంతరం అధికారులకు సమాచారం చేరవేశాడు. ఇది తెల్ల రంగులో వంపు తిరిగిన ఆకారంలో కనిపిస్తోంది. రాకెట్లో ఇదొక అంతర్భాగమని గుర్తించారు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత ఉపగ్రహాలు భద్రంగా విడిపోయేలా ఇది రక్షణ కలి్పస్తుంది. ఈ శకలం ఫోటోలను ఎల్.కునాహందూ దీవిలోని స్థానిక ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక మీడియాలో ఇవి దర్శనమిచ్చాయి. ఇందులో శకలంపై ఇస్రో లోగోతో పాటు భారత అధికారిక చిహ్నం కూడా ఉంది. ఈ రాకెట్ను 2025లో తయారు చేసినట్లు కొన్ని అక్షరాలు సైతం ఉన్నాయి. శకలం బరువు తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. శకలంపై కొన్నిచోట్ల పెయింట్ చెదిరిపోయింది. దక్షిణ మాల్దీవ్స్లోని ఎల్.కునాహందూ దీవి సాధారణంగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ జనావాసాలు లేవు. అయితే, శకలం ఆకాశం నుంచి పడిందా? లేక సముద్రంలో నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిందా? అనే దానిపై చర్చ మొదలైంది. ఇస్రో రాకెట్లను భారత్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తుంటారు. ప్రయోగం పూర్తయ్యాక రాకెట్లు సముద్రంలో కూలిపోతుంటాయి. శకలాలు సైతం సముద్రంలో పడిపోతాయి. మాల్దీవ్స్లో కనిపించిన రాకెట్ శకలం శ్రీహరికోట నుంచి ఇక్కడికి వచి్చనట్లు అంచనా వేస్తున్నారు. బలమైన ఈదురు గాలులకు తోడు సముద్ర నీటి ప్రవాహ దిశకు అనుగుణంగా ప్రయాణిస్తూ ఇక్కడిదాకా కొట్టుకొచి్చనట్లు చెబుతున్నారు. తొలుత అర్థం కాలేదు మత్స్యకారుడు ఇచి్చన సమాచారంతోనే ఈ శకలం గురించి తమకు తెలిసిందని కునాహందూ కౌన్సిల్ అధ్యక్షుడు ఇబ్రహీం షకీబ్ చెప్పారు. అందులోని విడిభాగాలు మళ్లీ ఉపయోగపడుతాయన్న ఉద్దేశంతోనే ఒడ్డుకు చేర్చాడని అన్నారు. మొదట దాని గురించి ఏమీ అర్థం కాలేదని చెప్పారు. ఈ నెల 13వ తేదీన పోలీసులు క్షుణ్నంగా పరిశీలించారని, అది భారత్కు సంబంధించిన వస్తువుగా నిర్ధారించారని వెల్లడించారు. 2025 డిసెంబర్లో శ్రీలంక సముద్ర తీరంలోనూ ఇలాంటి శకలమే కనిపించింది. ఇస్రో సాధారణంగా ఎల్వీఎం3, పీఎస్ఎలవీ రాకెట్లను ప్రయోగిస్తుంది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత సముద్రంలో కూలిపోతాయి. చాలావరకు నీటిలో మునిగిపోతాయి. తేలికైన భాగాలు ముక్కలుగా విడిపోయి నీటిపై తేలుతుంటాయి. నీటిలో ముందుకు కొట్టుకుపోతుంటాయి. తీరానికి చేరుకుంటాయి. అయితే, శ్రీహరికోట నుంచి మాల్దీవ్స్ దాకా సుదీర్ఘదూరం ప్రయాణించడం అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో అదృశ్యమైన కర్నాటకకు చెందిన విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందారు. 22 ఏళ్ల సాకేత్ మృతదేహం శనివారం పోలీసులకు లభించినట్లు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. సాకేత్ బర్కిలీ యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చదువుతున్నారు. ఆయన ఫిబ్రవరి 9 నుంచి కనిపించకుండా పోయారు. మంగళవారం టిల్టెన్ రీజనల్ పార్క్లోని లేక్ అంజా దగ్గర కనిపించినట్టు పోలీసులు తెలిపారు. పార్క్ హిల్స్ పరిసరాల్లోని ఒక ఇంటి సమీపంలో ఆయన పాస్పోర్ట్, ల్యాప్టాప్తో కూడిన బ్యాక్పాక్ పోలీసులకు లభించింది. -
రాహుల్ చెప్పేవన్నీ అసత్యాలు
గాంధీనగర్: అమెరికా, యూకే, ఈయూతో వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాహుల్ రైతులను తప్పుదోవ పట్టించడంతో పాటు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చా వేదికను ఆయనే నిర్ణయించుకోవచ్చన్నారు. మన రైతులు, డెయిరీ ఉత్ప త్తులకు కేంద్రం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘‘వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు హాని చేస్తాయన్న కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదం. ప్రజలను తప్పుదోవపట్టించడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజానికి యూపీఏ హయాంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటిలోని ప్రమాదకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం రాగానే తొలగించింది’’ అని అమిత్ షా చెప్పారు. -
అమెరికాతో ఒప్పందం మాటున ద్రోహం
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో రైతులకు మోదీ సర్కారు తీవ్ర ద్రోహం తలపెడుతోందని ఆదివారం ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఇంపోర్ట్ డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్ (డీడీజీ) అంటే ఏమిటి? అమెరికాలో మద్యం తయారీ తర్వాత మిగిలే జన్యుపరివర్తిత (జీఎం) మొక్కజొన్న వ్యర్థాలను మన పశువులకు దాణాగా వేస్తారని దాని అర్థమా? అదే జరిగితే మన పాల ఉత్పత్తులు పూర్తిగా అమెరికా వ్యవసాయ రంగంపై ఆధారపడవా? జీఎం సోయా నూనె దిగుమతులకు అనుమతిస్తే ఆ ప్రభావం మన సోయా రైతులపై పడదా? సోయా ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గితే వారు తట్టుకోగలరా? ఒప్పందంలో అదనపు ఉత్పత్తులనే ప్రస్తావన ఉంది. మున్ముందు పప్పు ధాన్యాలు, ఇతర పంటలను కూడా దిగుమతి చేసుకోవాలని అమెరికా మనపై ఒత్తిడి పెంచుతుందని దీనర్థమా? వాణిజ్య అవరోధాలను తొలగించడమంటే ఏమిటి? జీఎం పంటలు, పంటల సేకరణను తగ్గించడం, కనీస మద్దతు ధర, బోనస్లు వంటివాటిని తగ్గించడమా? అమెరికా వ్యవసాయోత్పత్తులకు ఒక్కసారిగా తలుపులు తెరిస్తే, ఏటికేడు మరింతగా ఒత్తిడులు పెరుగుతాయి. వాటిని అడ్డుకుంటామా, లేక లొంగిపోతామా? మన సాగు రంగంపై విదేశీ పెత్తనానికి అనుమతిస్తున్నామా?’’ అని రాహుల్ ప్రశ్నించారు. -
జమ్మూకశ్మీర్లో భారీ హవాలా రాకెట్
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భారీ హవాలా రాకెట్ వ్యవస్థను అధికారులు ఛేదించారు. ప్రపంచవ్యాప్త స్కామ్ నెట్వర్క్లకు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తూ, జమ్మూకశ్మీర్లో విస్తరిస్తున్న ’మ్యూల్ అకౌంట్స్’ దందాను బయటపెట్టారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న 8 వేలకు పైగా మ్యూల్ ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. మనీలాండరింగ్ నేరగాళ్లు ఈ వ్యవస్థను మూడేళ్లుగా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా మళ్లించిన నిధులను వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఇతరుల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడమే ’మనీ మ్యూలింగ్’. ఈ ఖాతాలను నిర్వహించే వారిని ’మనీ మ్యూల్స్’ అంటారు. ఖాతాదారులకు తెలియకుండా లేదా వారికి కొంత కమీషన్ ఆశచూపిన నేరగాళ్లు తమ గుర్తింపు బయటపడకుండా ఈ ఖాతాలను నిర్వహిస్తున్నారు. 2017లో ఎన్ఐఏ కశ్మీర్లోని ఉగ్రవాద సంస్థల నిధుల సేకరణ నెట్వర్క్ను బట్టబయలు చేయడంతో అక్రమార్కులు ఈ ‘డిజిటల్ హవాలా’మార్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. ఈ ఖాతాలను సైబర్ నేరాల గొలుసులో అత్యంత బలహీనమైన, అత్యంత కీలకమైన లింక్ అని వారు చెబుతున్నారు. ఎందుకంటే నకిలీ ఖాతాలు లేకుండా, దోచుకున్న సొమ్మును జాడ దొరకని క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చడం అసాధ్యమని పేర్కొంటున్నారు. డబ్బు ఆశతో నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అప్పగించే వారు బాధితులు మాత్రమే కాదు, నేరగాళ్లకు వంతపాడుతున్నట్లేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు
న్యూఢిల్లీ: విద్యుత్ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, డీప్మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబీస్, ఆంత్రోపిక్ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 2025లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్లో, 2023లో బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం విని్పస్తున్నాం. ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. ఏఐ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.భారతీయ ఏఐపైనే దృష్టి ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్ మోడల్ పిల్లర్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్, మల్టీ లింగ్వల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం), స్పీచ్–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్ కోసం జనరేటివ్ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్ సిములేషన్, మెటీరియల్ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్ ఎక్స్పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్పోలో 600కుపైగా కీలక స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. డేటా కేంద్రంగా మార్చండి‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్ఫా మ్లు, డివైజ్ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.సరైన వేదిక భారత్: గుటెరస్ ‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్పవర్ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. -
రోదసిలో నిఘా యుద్ధం!
జేమ్స్బాండ్ సినిమాల్లో హీరో అలవోకగా ఖండాలన్నీ చుట్టేస్తుంటాడు. చట్టవ్యతిరేక, విద్రోహ సంస్థల గుట్టుమట్లు రట్టుచేసి భారీ ఉపద్రవాలను అడ్డుకుంటాడు. శత్రువుల రహస్య స్థావరాలను నేలమట్టం చేస్తుంటాడు. ఈ నిఘా పోరు 21వ శతాబ్దపు వాస్తవిక ప్రపంచంలో భూమిని దాటేసి ఏకంగా అంతరిక్షానికి చేరింది! ఇంతకాలం నేలల తేమ శాతం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు తదితరాలపై అధ్యయం చేస్తూ వచి్చన ఉపగ్రహాలు నిఘా కార్యకలాపాల్లో తలమునకలు అవుతున్నాయి. వైరి దేశాల ఉపగ్రహాలపై కన్నేస్తున్నాయి. ఏ సమయంలో ఏ దేశంపై ఎందుకు తిరగాడుతున్నాయో కూపీ లాగుతున్నాయి. ప్రధాన దేశాలన్నీ దాదాపుగా ఇదే బాటపట్టడంతో ఇప్పుడు అంతరిక్షంలో సరికొత్త శాటిలైట్ నిఘా యుద్ధానికి తెర లేచింది. బెంగళూరుకు చెందిన దిగంతర సంస్థ ఒకటి ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్్కకు చెందిన స్టార్లింక్ శాటిలైట్ల జాడను విజయవంతంగా కనిపెట్టడం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన అజిస్టా స్పేస్ సంస్థ ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) ఎప్పుడు, ఎక్కడ తిరుగుతోందో కనిపెట్టి ఔరా అనిపించింది. వీటిని ఒకరకంగా ఇతర ఉపగ్రహాలపై నిఘా ఘటనలుగానే చెప్పొచ్చు. శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు సరికొత్త ‘స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్’ (ఎస్ఎస్ఏ) పరిజ్ఞానం ఇప్పుడు కీలకంగా మారింది. రెండు ఉపగ్రహాలు పొరపాటున ఢీకొనే ఆస్కారాన్ని తప్పించడమే గాక వాటి సిగ్నళ్లను జామ్ చేయడం, శాటిలైట్ను ధ్వంసం చేయడాన్ని నిలువరించడం కోసం ముందు ప్రత్యర్థి ఉపగ్రహాలు ఎక్కడున్నాయో కనీసం పక్కాగా తెలిసి ఉండాలి. ఈ కారణంగా కూడా నింగిలో నిఘా నేత్రాన్ని తెరవాల్సిన అనివార్యత దేశాలకు ఏర్పడిందని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఏకే భట్ అన్నారు. ఈ నేపథ్యంలో ‘స్పైయింగ్ ఇన్ స్కై’ ఇప్పుడిక ఎంతమాత్రమూ సైన్స్ఫిక్షన్ స్థాయికి పరిమితం కాలేదు. భూమిపై జేమ్స్బాండ్ చేసి పనినే ఇప్పుడు ఆకాశంలో కృత్రిమ ఉపగ్రహాలు విస్తృతస్థాయిలో చేయబోతున్నాయి. ఇందులో ఆధిపత్యం ఎవరితో భవిష్యత్తులో తేలిపోనుంది. ఎవరు గమనిస్తున్నారో తెలిసుండాలి ‘‘కమ్యూనికేషన్, సైనిక, పౌర, పరిశోధనావసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నా అవి రహస్య పనులనూ చేస్తున్నాయి. ఇతర దేశాల ఉపగ్రహాలు భారత్లోని ఏఏ భూభాగాలపై ఎందుకు తిరుగుతున్నాయో కచి్చతంగా మనకు తెల్సి ఉండాల్సిందే. ఇది నిఘా, వ్యూహాత్మక ఆపరేషన్లకు అత్యంత కీలకం. అందుకే శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది’’ అని అజిస్టా స్పేస్లో స్పేస్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భరత్ సింహా రెడ్డి చెప్పారు. ‘‘ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలు ఆపరేషన్ సిందూర్దాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధా్దలకు కీలక సమాచారం ఉపగ్రహాల నుంచే అందింది. కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, నేవిగేషన్, టార్గెట్ ఇలా అన్ని విభాగాలను పటిష్టంచేయడంలో శాటిలైట్లే కీలక పాత్ర పోషించాయి’’ అని దిగంతర సీఈఓ, వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ అన్నారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ (ఎస్ఎస్ఏ)లో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తూ భారత్ అంతర్జాతీయ నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఏటా ఆరు నుంచి పది ఉపగ్రహాలను తయారు చేసేలా అజిస్టా సంస్థ కొత్త ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్ తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఇది 2027 ద్వితీయార్ధంలోపు ప్రారంభం కావచ్చు. శత్రువులు ప్రయోగించే క్షిపణుల జాడను శాటిలైట్ ద్వారా గుర్తించే కొత్త ఉపగ్రహాన్ని 2027లోపు ప్రయోగిస్తామని ఈ సంస్థ తెలిపింది. అంతరిక్షంలో అర్లీ వారి్నంగ్ సిస్టమ్ను ఇది మరింత పటిష్టపరచనుంది. సాంప్రదాయకంగా భూతలంపై రాడార్ వ్యవస్థలు, ఆకాశంలో చక్కర్లు కొట్టే నిఘా విమానాలకు తోడుగా ఇప్పుడు అంతరిక్షంలోనూ నిఘా ఉపగ్రహాల రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తదుపరి దశాబ్దిలోకి... త్రికరణ శుద్ధితో!
న్యూఢిల్లీ: పదేళ్లకు పైగా తమ ప్రభుత్వం తలపెట్టిన పలు సంస్కరణలతో సామాన్య పౌరులకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం పీటీఐ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘నిర్మాణాత్మక సంస్కరణలు, మరింత విస్తృత ఆవిష్కరణలు, మరింత సులభతర పాలన. వచ్చే దశాబ్దంలో ఈ మూడు కీలక సంస్కరణలకు కట్టుబడతా. సంస్కరణల్లో పోటీతత్వాన్ని, ఉత్పాదకతను పెంచాలి. తర్వాత సాంకేతికత, తయారీ, సేవల రంగంల వినూత్న ఆవిష్కరణలను సుసాధ్యం చేయాలి. పౌరులు, ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం సాధించాలి. అప్పుడే పరిపాలన అత్యంత సులభతరం అవుతుంది. ప్రజల విశ్వాసమూ బలపడుతుంది. ఇప్పటికే మేం తెచి్చన సంస్కరణలతో దళారీ వ్యవస్థ దోపిడీ తగ్గిపోయింది. మౌలిక వసతుల విస్తరణతో రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరిగి రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి. సంస్కరణలనే పదం వినగానే ఆర్థిక, పరిశ్రమలకే పరిమితమవుతాం. వాస్తవానికి సంస్కరణలు సామాజిక రంగంలో కీలకమైనవి. ఒకప్పుడు వెనకబాటుకు గురైన ప్రాంతాలు ఇప్పుడు ఆశావహ (ఆస్పిరేషనల్) జిల్లాలు, బ్లాకులుగా అభివృద్ధి చెందాయి. గతంలో అభివృద్ధికి నోచుకోని గిరిజనులకు పీఎం–జన్మన్ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. సంస్కరణల ఎక్స్ప్రెస్తో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. దేశాన్ని, ప్రజలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే బలమైన కాంక్ష నాలో రగులుతోంది’’ అని అన్నారు. అందుకు గర్విస్తున్నా ‘‘నత్తనడకన సాగే దశలవారీ సర్దుబాట్ల స్థాయి నుంచి వ్యవస్థీకృత సంస్కరణల దిశలోకి భారత్ను తీసుకొచ్చాం. ఈ విషయంలో ఎంతగానో గర్విస్తున్నా. ఉదాహరణకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వచ్చాక రెండు శ్లాబుల పన్నులతో కుటుంబాలు మొదలు సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల, అధిక కార్మిక ఆధారిత రంగాల కష్టాలు తీరాయి. చిన్న కంపెనీల నిర్వహణ వ్యయాలు తగ్గాయి. బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో నచి్చన బీమా కంపెనీని పోర్టబుల్గా ఎంచుకునే వెసులుబాటు సగటు భారతీయునికి అందుబాటులోకి వచి్చంది. అభివృద్ధికి నోచుకోని రంగాలకు మంత్రిత్వ శాఖలను ఏర్పాటుచేశాం. దాంతో నైపుణ్యాభివృద్ధి, ఫిషరీ, సహకార సంఘాలు, ఆయుష్ వంటివి వేగంగా వృద్ధి చెందుతున్నాయి. యూపీఐ చెల్లింపులతో భారత్ డిజిటల్ లీడర్గా ఎదుగుతోంది. స్టార్టప్ల్లోనూ దూసుకెళ్తోంది. మన యువతరం కొత్త ఆర్థికవ్యవస్థను సృష్టిస్తోంది’’ అన్నారు. సంస్కరణల ఫలాలు సిందూర్ వేళ చేతికి‘‘భద్రతా సవాళ్లను అన్ని వేళలా సర్వసన్నద్ధంతో ఎదుర్కోవాలి. ఆ మేరకు దశాబ్దం క్రితం చేపట్టిన రక్షణ రంగ సంస్కరణల ఫలాలు ఆపరేషన్ సిందూర్ వేళ చేతికొచ్చాయి. రక్షణ రంగం ఆధునీకరణలో భాగంగా బడ్జెట్లో దానికి కేటాయింపులు ఏకంగా 15 శాతం పెంచాం. రక్షణరంగంలో స్వయంసమృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోంది’’ అని మోదీ అన్నారు.యూపీఏ ఉండుంటే వాణిజ్య చర్చలు హుళక్కే‘‘అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూటమితో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీంతో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల వంటి అధిక కార్మికుల ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లోకి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ మన పోటీతత్వమున్న స్థానిక పరిశ్రమలు, విశ్వసనీయ ధోరణితో సాధ్యమయ్యాయి. గతంలో యూపీఏ ప్రభుత్వాలు సైతం విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు ప్రయతి్నంచి ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్థికనిర్వహణలో అసమర్థతే దీనికి అసలు కారణం. ఇంకా యూపీఏ సర్కార్ ఉండి ఉంటే వాణిజ్య ఒప్పందాలు కలగానే మిగిలిపోయేవి’’ అని మోదీ అన్నారు. పనిపై ఎప్పుడూ సంతృప్తి చెందను ప్రజాజీవితం అంటేనే విశ్రాంతిలేకుండా పని చేయడమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘సంస్కరణల ఎక్స్ప్రెస్తో ఒనగూరిన అభివృద్ధి, చేసిన పని విషయంలో నేనెప్పుడూ సంతృప్తి చెందలేదు. ఇంకా బాగా పని చేయాలనుకుంటా. మరింత వేగంగా, మెరుగ్గా పని చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటా. ప్రజల కోసం ఎంతో సాధించాలన్న బలమైన కోరిక నాలో రగిలిపోతుంటుంది. ఎందుకంటే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి’’ అని చెప్పారు. -
స్పామ్ కాల్స్.. ఇక బ్లాక్!
అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు ప్రపంచానికి సవాల్గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95% మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సిద్ధమవుతోంది. కస్టమర్ అందుకున్న కాల్, మెసేజ్ను టెలికం కంపెనీ స్పామ్గా గుర్తిస్తే ఆ నంబర్ను బ్లాక్ లిస్టులోకి చేర్చాలని భావిస్తోంది. అలాగే అధికారిక ఫిర్యాదు లేకపోయినా స్పామ్ మెసేజ్లు పంపే మొబైల్ నంబర్ను డిస్కనెక్ట్ చేయాలన్న ప్రతిపాదనపై ట్రాయ్ కసరత్తు చేస్తోంది. టెలికం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తోంది. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో ఐదు ప్రత్యేక ఫిర్యాదులను స్వీకరిస్తే స్పామర్పై చర్య తీసుకుంటున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక నంబర్ను వరుసగా 10 రోజులపాటు అనుమానిత స్పామ్గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే.. ఆ నంబర్కు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్య తీసుకోవచ్చు. ఇది అమల్లోకి వస్తే స్పామ్ కాల్స్, మెసేజెస్ కట్టడికి టెలికం కంపెనీలు చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచి్చనట్టు అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్రియల్ టైమ్లో విశ్లేషించి.. ప్రస్తుతం దేశంలో ఏదైనా అవాంఛిత సమాచారాన్ని స్పామ్గా గుర్తించడానికి నిర్దిష్ట నియమాలు లేవు. కాల్స్, సందేశాలు పంపినవారి రోజువారీ వినియోగ తీరు, కాల్స్ ఎంత సమయం మాట్లాడుతున్నారు, ఎన్ని సందేశాలు పంపిస్తున్నారు, ఎవరెవరికి, ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఈ కాల్స్ చేస్తున్నారు వంటి అంశాలను టెల్కోలు ఉపయోగిస్తున్న ఏఐ సాంకేతికత రియల్ టైమ్లో విశ్లేషించి.. అవాంఛిత కాల్స్, మెసేజెస్ను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. కాల్ను అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది కస్టమర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అనుమానిత స్పామ్గా గుర్తించిన అనేక కాల్స్ నిజమైన కాలర్ల నుంచి వచి్చనవే ఉంటున్నాయి. వాటిలో గిగ్ వర్కర్లతోపాటు ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి.వ్యవస్థీకృతంగా మోసాలు.. 2024 సెపె్టంబర్ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్ కాల్స్, 290 కోట్ల స్పామ్ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. 8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు.⇒ టెల్కోలు ఏఐ సొల్యూషన్స్ సాయంతో ప్రతి నెలా సుమారు 40 కోట్ల కాల్స్, సందేశాల ను అనుమానిత స్పామ్గా గుర్తిస్తున్నాయి. ⇒ నమోదు కాని టెలీమార్కెటర్ల నుంచి వస్తున్న వాటిలో 7.5 కోట్ల కాల్స్, ఎస్ఎంఎస్లు ప్రతిరోజూ బ్లాక్ అవుతున్నాయి. ⇒ స్పామర్లపై టెల్కోలకు రోజుకు సగటున 10,000 ఫిర్యాదులు మాత్రమే అందుతున్నాయని సమాచారం. ⇒ 2025 ఫిబ్రవరిలో 1,16,213 స్పామ్ ఫిర్యాదులు టెల్కోలకు అందగా 2025 డి సెంబర్లో ఆ సంఖ్య 3,34,317కు చేరింది. ⇒ ఫిర్యాదులలో ఎక్కువ భాగం నమోదు కాని టెలిమార్కెటర్లపైనే ఉంటున్నాయి. ⇒ టెలిమార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు సాధారణంగా 10 అంకెల మొబైల్ నంబర్ ద్వారా కాల్స్ చేస్తున్నారు. ⇒ భారత్లో 116 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారిలో అవాంఛిత కాల్స్ను నివారించేందుకు ట్రాయ్ తీసుకొచి్చనడు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) సేవలను 22 కోట్ల మంది మాత్రమే ఎంపిక చేసుకున్నారు. -
‘పాకిస్తాన్ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా. పాకిస్తాన్తో టీ20 వరల్డ్కప్లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ అభివర్ణించారు. ఇది భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ కాదని, కేవలం జై షా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రమేనన్నారు. యావత్ భారతావని.. పాకిస్తాన్తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. ‘ పాకిస్తాన్ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్ దుశ్చర్యలు బాగా తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది భారతావని కోరుకునే మ్యాచ్ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్తో మ్యాచ్ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్తో మ్యాచ్ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.#WATCH | Jaipur, Rajasthan: On India vs Pakistan #ICCT20WorldCup, Congress MP Sukhjinder Singh Randhawa says, "... Pakistan is the enemy of our country, and it should be treated like that only. We have no dealings with them. Those who are on the border know how Pakistan is… pic.twitter.com/3FlPP06UIX— ANI (@ANI) February 15, 2026 -
దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం
అస్సాంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా నిలవనుంది.ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. -
మహాశివరాత్రి వేళ.. ఆసక్తికర ఆచారాలివే..
మహాశివరాత్రి.. కోట్లాది మంది భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ పవిత్ర సమయంలో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, మహా శివునికి అభిషేకాలు చేస్తారు. జాగరణ చేస్తూ ఆ పరమశివుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. ఆధ్యాత్మిక రాజధాని కాశీలో విశ్వేశ్వరునికి గంగాజలం, బిల్వపత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తారు.హిమాచల్ ప్రదేశ్లోని మండిలో జరిగే ‘శివరాత్రి మేళా’లో దేవతలు పల్లకీల్లో భూత్ నాథ్ ఆలయానికి తరలిరావడం ఒక అద్భుత ఘట్టం. ఇక కశ్మీరీ పండిట్లు ‘హేరత్’ పేరుతో శివరాత్రిని పండుగను జరుపుకుంటారు, అక్కడ నిర్వహించే ‘వటుక్ పూజ’ ప్రత్యేక వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ వద్ద ‘వీరగాసె’ నృత్య ప్రదర్శనలు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో 14 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణ భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తాయి.శివారాధన కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేపాల్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ దేవాలయం వేలాది సాధువుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. మారిషస్లో హిందూ భక్తులు ‘గంగా తలావ్’ అనే పవిత్ర సరస్సు వరకు పాదయాత్ర చేస్తారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ‘మెలుకత్’ అనే ఆత్మశుద్ధి ప్రక్రియ ద్వారా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ధ్యానముద్రలో శివరాత్రిని గడుపుతారు. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్, టొబాగోలో కూడా భారతీయ సంతతి వారు రాత్రంతా శివ నామస్మరణతో ఆలయాల్లో జాగరణ చేస్తారు. -
శివయ్య భక్తులకు శుభవార్త
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. శీతాకాలం విరామం తర్వాత బాబా కేదార్నాథ్ దర్శనం పునఃప్రారంభం కానుండటంతో ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.ఆలయ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 22 ఉదయం 8:00 గంటలకు వృషభ లగ్నంలో కేదార్నాథ్ ఆలయ తలుపులు శాస్త్రోక్తంగా తెరుచుకోనున్నాయి. ఉఖిమఠ్లోని శీతాకాల నివాసమైన ఓంకారేశ్వరాలయంలో ఈ ప్రారంభ తేదీ , సమయాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా టీ గంగాధర్ లింగ్ను నియమించారు. ఆలయంలో జరిగే పవిత్ర పూజా కార్యక్రమాలను, ఆచారాలను ఈయన పర్యవేక్షించనున్నారు.కేదార్నాథ్తో పాటు ఉత్తరాఖండ్లోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల (చార్ ధామ్) ప్రారంభ తేదీలను కూడా అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు 2023, ఏప్రిల్ 23న ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుంటాయి. అంతకుముందే ఏప్రిల్ 7 నుండి వార్షిక యాత్ర ప్రారంభం కానుంది. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని 2026, ఏప్రిల్ 19న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి.కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానుండటంతో హిమాలయాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు తమ ప్రయాణం, వసతి, ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాలలో ఉండే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో ఆధ్యాత్మిక యాత్రను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. -
FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్హెచ్ఏఐ తాజా హెచ్చరిక!
ఫాస్టాగ్ FASTag యాన్యువల్ పాస్కు భారీ ఆదరణ లభించింది. దీన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే 50లక్షలకుపైగా వినియోగదారులను అధిగమించింది. దీంతో ఇక్కడ కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే FASTag వార్షిక పాస్ సేవకు సంబంధించిన పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ గురించి పౌరులను హెచ్చరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక హెచ్చరిక జారీ చేసింది. నకిలీల బారిన పడకుండా కేవలం అధికారిక FASTag పోర్టల్లను మాత్రమే ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఒకసారి చూద్దాం.నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతున్న FASTag మోసాల పట్ల NHAI వాహనదారులను హెచ్చరించింది. మోసగాళ్లు అధికారిక వెబ్సైట్లను పోలి ఉండే నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను నిలువునా ముంచు తున్నారని వెల్లడించింది. అధికారిక NHAI ప్లాట్ఫారమ్లలాగానే నటించి, నకిలీ వార్షిక పాస్ల కోసం చెల్లింపులు చేయడానికి వినియోగదారులను మోసగిస్తున్న అనేక ఘటనల నేపథ్యంలో ఎన్హెచ్ఆర్ఐ ఈ హెచ్చరిక జారీ చేసింది.ఇదీ చదవండి: బోట్ రైడ్లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్వినియోగదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యలుఈ మోసపూరిత పోర్టల్లలో చెల్లింపులు చేసిన తర్వాత అనేక మంది బాధితులు తక్షణ ఆర్థిక నష్టాలను నివేదించారు. కొంతమంది వినియోగదారులు కస్టమర్ సపోర్ట్గా నటిస్తూ, నకిలీ పాస్ను "యాక్టివేట్" చేయడానికి OTPలు లేదా అదనపు ఛార్జీలను అడుగుతూ ఫాలో-అప్ స్కామ్ కాల్స్ కూడా చేస్తారు.ఈ స్కామ్లు అధికారిక బ్రాండింగ్, లోగోలు , లేఅవుట్లను కాపీ చేయడం వలన వినియోగదారులు చూడగానే తేడాను గుర్తించడం కష్టతరం చేస్తాయని సైబర్ అధికారులు గుర్తించారు.ఈ మోసం ఎలా జరుగుతుంది?సెర్చ్ ఇంజన్లలో (Google వంటివి) ప్రకటనల ద్వారా మోసపూరిత లింకులు పైన కనిపించేలా చేస్తారు.వినియోగదారులు ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, వాహన వివరాలు మరియు పేమెంట్ వివరాలను అడుగుతారు.మీరు చేసే పేమెంట్ నేరుగా నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తుంది. చెల్లింపు తర్వాత ఎలాంటి పాస్ రాదు, పైగా మీ బ్యాంక్ వివరాలు కూడా వారి చేతికి చిక్కుతాయి.సేఫ్టీ టిప్స్FASTag-సంబంధిత సేవలను ఆన్లైన్లో యాక్సెస్ చేస్తున్నప్పుడు రహదారి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఈ సలహాను పంచుకున్నారు.వినియోగదారులు వెబ్సైట్ URLలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి .ఆన్లైన్లో శోధించేటప్పుడు స్పాన్సర్ చేసిన లింక్లు లేదా తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకూడదు.మోసగాళ్ళు చట్టబద్ధమైన NHAI చెల్లింపు పేజీలను పోలి ఉండేలా వెబ్సైట్లను సృష్టిస్తారు. వినియోగదారులు ఈ లింక్లపై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ నంబర్లు, వాహన సమాచారం , చెల్లింపు ఆధారాలు వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయమని కోరతారు.చెల్లింపు ఇంటర్ఫేస్ ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మనఖాతాలోని సొమ్మును డిజిటల్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ అధికారిక NHAI వెబ్సైట్ లేదా మీ బ్యాంక్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలి.వెబ్సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.కస్టమర్ కేర్ అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి OTP లేదా పిన్ అడిగితే చెప్పకండి.ఒకవేళ మీరు మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి.డిజిటల్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే అవగాహన అనేది బలమైన రక్షణ అని అధికారులు నొక్కిచెప్పారు, భారతదేశం అంతటా ఆన్లైన్ ఆర్థిక మోసాలు పెరుతున్నందున వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యంకాగా 2025 ఆగస్టు 15న ప్రారంభించినప్పటి నుండి యాన్యువల్ పాస్కు భారీ స్పందన లభిస్తోంది. దీనికి తోడు జాతీయ రహదారులపై ప్రయాణించే, ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..
ప్రయాగ్రాజ్: శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటివరకూ పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ‘హర హర మహాదేవ శంభో’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో గంగా తీరం మార్మోగిపోయింది. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందని మాఘమేళా అధికారి రిషి రాజ్ మీడియాకు తెలిపారు. #WATCH | Prayagraj, UP | Magh Mela officer Rishi Raj says, "Today is the last 'snan parv' of the Magh Mela and devotees are coming in large numbers to take a holy dip on the occasion of #Mahashivratri2026...10 lakh devotees have already taken a holy dip so far...The… https://t.co/fM1jArups0 pic.twitter.com/tYKQJis8yW— ANI (@ANI) February 15, 2026భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ (ఏటీఎస్) మొబైల్ పెట్రోలింగ్ బృందాలు మేళా ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తున్నాయి. ఘాట్ల వద్ద తొక్కిసలాట జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ బృందాలను రంగంలోకి దించారు. నెల రోజుల పాటు సాగిన మాఘమేళా వేడుక ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. #WATCH | Belagavi, Karnataka: Devotees throng the Dakshina Kashi Kapileswara Temple and offer prayers on the occasion of #Mahashivratri2026. pic.twitter.com/FMnrZWGctj— ANI (@ANI) February 15, 2026శివరాత్రి సందడి కేవలం ప్రయాగ్రాజ్కే పరిమితం కాలేదు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం వెలుపల భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. అలాగే అహ్మదాబాద్లోని మినీ సోమనాథ్ ఆలయం, రియాసీలోని ఆప్ శంభు మహాదేవ్ గుడి, అయోధ్యలోని నాగేశ్వరనాథ్ ఆలయాల్లో ప్రత్యేక హారతులు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రంతా జాగరణ చేస్తూ శివయ్యను కొలుస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి అంటే శివ-పార్వతుల కళ్యాణం జరిగిన రోజని భక్తుల నమ్మకం. దేవతలు, గంధర్వులు, పశుపక్షాదులు, భూతగణాల సాక్షిగా పార్వతీ దేవిని శివుడు వివాహం చేసుకున్నాడని చెబుతారు.ఇది కూడా చదవండి: మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే.. -
రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా చెప్పిన సంగతి తెలిసిందే.. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అయితే, ఈ క్రమంలో చమురు కోనుగోలుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవన్నారు. దేశ ప్రయోజనాలు, ధర, నష్టభయాలను పరిగణనలోకి కుంటామని ఈ విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు.జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న జై శంకర్.. భారత్ తన ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్నే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధన సమస్యల ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి సంక్లిష్టంగా ఉందన్నారు. చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం.‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు.మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్లో మృతదేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకున్న దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియాకు, భోపాల్కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న సమీర్తో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్పై ఉన్న నమ్మకంతో మూడు నెలల క్రితం సియా తన ఇంటిని విడిచిపెట్టి, భోపాల్లోని కమలా నగర్లో ఉన్న అతని ఇంటికి వచ్చేసింది.సమీర్ ఇంట్లోనే సియా నివాసం ఉంటుండటంతో, అతని భార్యకు, సియాకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సమీర్ భార్య.. జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇసే సమయంలో సియా.. తనను వివాహం చేసుకోవాలని లేదా తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సమీర్పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.ఈ నేరంలో అతడి తల్లి, సోదరులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సియాను హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు సమీర్ తన కుటుంబ సభ్యుల సహాయంతో సియా మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కాడు. తరువాత ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిషాత్పురా ప్రాంతంలోని ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. అయితే గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు అక్కడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు, లోపల ఏదో ఇనుప పెట్టె తేలుతున్నట్లు గమనించారు.వెంటనేవారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ నుండి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు -
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రేమికుల రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారులో యువతీ యువకుల జంట విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లోపల నుండి లాక్ చేసి ఉన్న కారులో బుల్లెట్ గాయాలతో ఉన్న ఇద్దరిని గుర్తించారు. వెంటనే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సాయంతో ఆధారాలు సేకరించారు.ఈ ఘటనలో మృతిచెందిన వారిని నోయిడా సెక్టార్ 58కి చెందిన రేఖ (26), ఢిల్లీ త్రిలోక్పురికి చెందిన సుమిత్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వీరి సంబంధం గురించి ఇరు కుటుంబాలకు ముందే తెలుసని సమాచారం. అయితే, ఈ ఘటనకు ముందు రోజు నుండే వీరు ఎవరికీ కనిపించకుండా పోవడంతో, కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో సుమిత్ చేతిలో ఒక పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సుమిత్ తన ప్రియురాలు రేఖను కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యంగా సుమిత్ పంపిన ఒక వాట్సాప్ సందేశం లభించింది. ‘నేను, సుమిత్.. ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి రేఖే కారణం. ఆమె 15 ఏళ్లుగా నాతో ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోబోతోంది. ఆమె నన్ను మోసం చేసినందునే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, సుమిత్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. కులం పేరుతో రేఖ కుటుంబం తమను అవమానించిందని, తమకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వారు పోలీసులకు తెలిపారు. కారు దొరికిన ప్రాంతం రేఖ ఉండే గ్రామానికి అతి సమీపంలో ఉండటంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుల వివక్ష కారణంగానే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని వారు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం -
సరిహద్దుల్లో పాక్ డ్రోన్.. పార్సిల్ జారవిడిచి..
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల వెంట పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి దొంగచాటుగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్మీ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఆర్ఎస్పురా సెక్టార్లో శనివారం రూ.40 కోట్లకు పైగా విలువ చేసే 6.5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13వ తేదీ రాత్రి వేళ అనుమానాస్పద డ్రోన్ కదలికలపై ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది.అదేవిధంగా, పాక్ భూభాగం వైపు నుంచి వచ్చిన డ్రోన్ ఒకటి ఏదో వస్తువును జార విడిచిపెట్టిందంటూ అందిన సమాచారంతో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ మేరకు బస్పూర్ ప్రాంతంలోని నయీ బస్తీ కరోతానా గ్రామం వద్ద పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని పంట పొలాల్లో 6.582 కిలోల బరువున్న హెరాయిన్ ప్యాకెట్లను జవాన్లు కనుగొన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సరిహద్దులకు సమీపంలోని కథువా జిల్లాలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల్లోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. -
మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..
వారణాసి: నేడు(ఆదివారం) మహాశివరాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఈ ఏడాది మహాదేవుని సన్నిధిలో 26 గంటల పాటు నిరంతర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండితులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు కాశీకి తరలివస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారణాసి జిల్లా యంత్రాంగం ఆలయ కమిటీ హై అలర్ట్ ప్రకటించాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. గంగా ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘాను పెంచిన అధికారులు.. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. आज दिनांक 14.2.2026 को महाशिवरात्रि की पूर्व संध्या पर श्री काशी विश्वनाथ धाम की अद्भुत छटा । #banaras #kashivishwanath #HarHarMahadev #bholenath pic.twitter.com/TdOntP4VU5— Shri Kashi Vishwanath Temple Trust (@ShriVishwanath) February 14, 2026గంగా నది తీరాన కొలువై ఉన్న పురాతన కాశీ నగరాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసంగా, మోక్ష ప్రాప్తికి ప్రధాన కేంద్రంగా భక్తులు విశ్వసిస్తారు. హిందూ సంస్కృతిలో మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినమే సృష్టి ఆరంభమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పౌరాణిక కథల ప్రకారం పరమశివుడు ఇదే రోజున మహాగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరిగిన అద్భుత ఘట్టం కూడా ఈ రోజేనని చెబుతుంటారు. అందుకే శివభక్తులు ఈ రాత్రంతా జాగరణ చేస్తూ, అభిషేకాలతో భోళాశంకరుడిని కొలుస్తారు.ఉజ్జయినిలో వైభవంగా భస్మ హారతిమధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకే అర్చకులు పవిత్ర పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం, గంధం, సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆపై మహాకాళుడికి తెల్లని వస్త్రాలను ధరింపజేసి, అత్యంత ప్రీతిపాత్రమైన ‘విజయ’ అలంకారం చేశారు. శంఖారావాల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ‘భస్మ హారతి’ని కళ్లారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ తలుపులను 44 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా సుమారు 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, క్యూ లైన్ల నిర్వహణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉజ్జయినిలో మహాశివరాత్రికి ముందు తొమ్మిది రోజుల పాటు ‘శివ నవరాత్రి మహోత్సవాలు’ అత్యంత వైభవంగా నిర్వహిస్తునన్నారు. శివరాత్రి మరుసటి రోజున స్వామివారికి ‘సెహ్రా’ అలంకరించి భస్మ హారతిని నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం -
Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ నెల 17వ తేదీన ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ఈ వేడుకను అంతర్జాతీయ వేదికగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ సహా మొత్తం 13 దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక దౌత్య సంబంధాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫిబ్రవరి 17న ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బంగ్లాదేశ్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.బంగ్లాదేశ్లో బీఎన్పీ పార్టీ అధికారికంగా మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్లోని సదరన్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అదే రోజు ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్.. తారిఖ్ రెహమాన్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.దక్షిణాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర పొరుగు దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కాగా బంగ్లాదేశ్లో బీఎన్పీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, భారత్తో ఆ దేశ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్పీ హయాంలో భారత్తో సంబంధాలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వంపై సానుకూల ప్రకటనలు చేసింది. -
నింగి నుంచి నేల గురించి..
బెంగళూరు: భారత్, అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఇస్రో, నాసాల మానసపుత్రికగా తయారై గగనతలంలో చక్కర్లు కొడుతున్న నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నైసర్) ఉపగ్రహం నుంచి ప్రతి 12 రోజులకు ఒకసారి యావత్ భారతదేశ పర్యావరణ, జీవావరణ, హిమానీ నదాలు, జలరాశులకు సంబంధించిన సమస్త తాజా సమాచారం అందనుంది. ఈ వివరాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ఎస్–బ్యాండ్, ఎల్–బ్యాండ్ల మేలు కలయికగా జంట ఫ్రీక్వెన్సీల సింథటిక్ అపర్చర్ రాడార్లను నైసర్ ఉపగ్రహంలో అమర్చారు. వీటి సాయంతో నేలలో తేమ వంటి అత్యంత కీలక వివరాలు సైతం 100 గీ 100 మీటర్ల అత్యధిక రెజల్యూషన్తో ఛాయాచిత్రాల రూపంలో అందనుంది. 100 మీటర్ల రెజల్యూషన్ చిత్రపటం అంటే అందులోని ఒక్కో పిక్సెల్ లేదా డేటా అనేది భూమిపై 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నేల సమాచారాన్ని పట్టిచూపుతుంది. నేలలో తేమ అనేది నీటిపారుదల, కరువుల సమస్యకు పరిష్కారాలు చూపిస్తూ భారత సాగు, నీటి నిర్వహణ విధానంలో కీలకభూమిక పోషిస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షం, పొగమంచు, మేఘాల వంటి పరిస్థితుల్లోనూ నేల ఫొటోలను అత్యంత స్పష్టంగా తీసి పంపుతుంది. దీంతో నీటిపారుదల సదుపాయం ఉన్న ప్రాంతాలతోపాటు వర్షాధార నేలలు, వర్షాభావ ప్రాంతాలు, అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో ప్రతి రోజూ నేలలో తేమ ఎంతశాతముందనే వివరాలు తెలుస్తాయి. దీంతో సాగునేలకు ఎంత మేర నీరు అవసరం, ఏస్థాయిలో నీటిని సరఫరా చేయాలి? అనే వివరాలపై రైతలకు ఒక స్పష్టత వస్తుంది’’అని ఇస్రో తన ప్రకటనలో పేర్కొంది. నేల సమస్త సమాచారం అందుబాటులోకి.. ‘‘నేలపై సెంటీమీటర్ పరిధిలో కూడా నిశితమైన ఫొటోలను తీసి పంపుతాయి. నైసార్కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో, మరోటి ఎస్–బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. నేలతేమను పట్టిచూసే భౌతికశాస్త ఆధారిత అల్గారిథమ్ను స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎస్ఏసీ–ఇస్రో)లో అభివృద్ధిచేశారు. ఇది శాస్త్రీయంగా నేల ఆరోగ్యాన్ని కనిపెడుతూ అత్యంత ఖచ్చిత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది. రెండు బ్యాండ్ల కారణంగా 12 రోజులకు ఒకసారి రాడార్లు భూమిని చుట్టేస్తూ నేల స్వభావ, స్వరూపాల సమస్త సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఈ సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఐఎంజీఈఓఎస్/ఎన్ఆర్ఎస్సీ) సేకరిస్తుంది. ఈ డేటాను భూనిధి పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ సమాచారంతో రైతులు, విధాన రూపకర్తలు, పరిశోధకులు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వేతర కంపనీలు తమ పరిధి మేర నిర్ణయాలు తీసుకునే సువర్ణావకాశం దక్కుతుంది’’అని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్య భారతదేశం మొదలు సింధూ–గంగా మైదాన ప్రాంతాల్లోని పంటభూముల దాకా ప్రతిచోటా నేలలో తేమ శాతం ఎంత ఉంది? ఎంత ఉండాలి? ఏంత మేర అదనంగా నీటి సరఫరా అవసరం? అనే వివరాలు అందటంతో ఆ మేరకు విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం చిక్కుతుంది. ఎల్–బ్యాండ్ రాడార్ అనేది అడవీప్రాంతాలు, ఎడారులు, మంచుమయ ప్రాంతాల్లోని నేల స్వభావాన్ని విశ్లేíÙస్తుంది. భూగర్భంలో మార్పులనూ పసిగట్టగలదు. ఎస్–బ్యాండ్ రాడార్ అనేది పంట పొలాలు, నీటి వనరుల తాజా స్థితిని తెలియజెప్తుంది. సమిష్టిగా ఈ రెండు బ్యాండ్లు కలిసి భారతీయ నేలల ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ నీటి వనరుల లభ్యతపై పరిశోధకులకూ స్పష్టమైన అవగాహన పెంపొందిస్తాయి. భారతదేశం అంతటా ఒకేలా వర్షాలు పడవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వాతావరణం ఉంది. ఒక్కోసారి జిల్లా జిల్లాకు మధ్య వాతావరణ వ్యత్యాసం ఉంది. దీంతో చిన్న చిన్న క్లస్టర్లుగా విభజిస్తూ వేర్వేరుగా డేటాను సమీకరించాల్సి వస్తోంది. అందుకోసమే నైసర్ను నింగిలోకి పంపారు. నీటి నిర్వహణతోపాటు వాతావరణ మార్పుల వంటి అంశాలూ స్పష్టంగా తెలియనున్నాయి. గత ఏడాది జీఎస్ఎల్వీ 16 ప్రయోగం ద్వారా నైసర్ను నింగిలోకి పంపిన విషయం విదితమే. -
నిత్యం అబద్ధాలేనా?
కారైకల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్ ప్రారంభించాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గొంతు చించుకొని గట్టిగా అబద్ధం చెప్పడం, దాన్ని పునరావృతం చేయడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని చూడడం రాహుల్ విధానంగా మారిపోయిందని విమర్శించారు. రాహుల్ అబద్ధాల ఫ్యాక్టరీ వెనకున్న అసలు బాగోతాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. యూకే, ఈయూ, అమెరికాలతో కుదుర్చున్న వాణిజ్య ఒప్పందాలతో మన రైతులకు, మత్స్యకారులకు, పాడి పరిశ్రమకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయినప్పటికీ రాహుల్ తప్పుడు ప్రచారంతో వారిని భయోత్పాతానికి గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తప్పనిసరిగా కాపాడుందన్నారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి క్షుణ్నంగా తెలుసుకొని మాట్లాడాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. మన ప్రయోజనాలు 100 శాతం కాపాడుకొనేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన ఘనత మోదీ నిర్ణయాత్మక నాయకత్వానిదేనని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్తో ముష్కర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి జరగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఆయన ‘నరేంద్ర సరెండర్ మోదీ’
న్యూఢిల్లీ: దేశంలో పత్తి రైతులు, జౌళి ఎగుమతిదారులను మోదీ ప్రభుత్వం నిలువునా దగా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల ఆయా రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఇది అమల్లోకి వస్తే మనదేశంలో పత్తి సాగు పూర్తిగా నిలిచిపోతుందని, ఎగుమతులు ఆగిపోతాయని, కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా ప్రభుత్వం మన ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్లు ప్రకటించిందని, మోదీ సర్కార్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సున్నా టారిఫ్లకు అంగీకరించిందని వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన రైతులు, ఎగుమతిదారులు కచి్చతంగా నష్టపోతారని తేలి్చచెప్పారు. అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలన్న షరతుతో బంగ్లాదేశ్ వ్రస్తాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సున్నా టారిఫ్లు ప్రకటించిందని గుర్తుచేశారు. భారతీయ వ్రస్తాలపై 18 శాతం టారిఫ్లను ఖరారు చేసిందని పేర్కొన్నారు. మన వ్రస్తాలపై కూడా సున్నా టారిఫ్లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మన వ్రస్తాలపై సున్నా టారిఫ్లు కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలని, దానివల్ల మన రైతులు నష్టపోతారని తెలిపారు. అమెరికా ఎదుట ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రిని ‘నరేంద్ర సరెండర్ మోదీ’గా అభివరి్ణంచారు. -
రష్యా చమురు కొనబోమని భారత్ హామీ: రూబియో
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా పునరుద్ఘాటించింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శనివారం మ్యూనిక్లో సెక్యూరిటీ సదస్సు సందర్భంగా ఆయన ఈ మేరకు పేర్కొన్నట్టు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. అయితే, చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం. ‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
పట్టణాలకు మహర్దశ
సాక్షి, న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాలను ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్లుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, వాటి అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం శనివారం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి కేంద్ర సాయంగా ఏకంగా రూ.లక్ష కోట్లను కేటాయించింది! ఈ పథకం 2025–26 నుంచి 2030–31 ఆరి్ధక సంవత్సరం దాకా ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అనంతరం అవసరాన్ని బట్టి మరింతకాలం పొడిగిస్తారు. అప్పు తెస్తే కేంద్రం సాయం! నగరాలు తమ కాళ్లపై తాము నిలబడేలా, మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకునేలా యూసీఎఫ్ను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టే పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో 25% నిధులను యూసీఎఫ్ కింద కేంద్రం ఇస్తుంది. ఇందుకోసం ప్రాజెక్టు నిధుల్లో కనీసం 50 శాతాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి సమీకరించాల్సి ఉంటుంది. మున్సిపల్ బాండ్లు, బ్యాంక్ రుణాలు లేదా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వాటిని సమకూర్చుకోవాలి. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానిక సంస్థలు భరించాలి. యూసీఎఫ్తో రాబోయే ఐదేళ్లలో దేశ పట్టణాభివృద్ధి రంగంలో ఏకంగా రూ.4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. పట్టణాభివృద్ధిలో గ్రాంట్ ఆధారిత విధానం స్థానంలో మార్కెట్, సంస్కరణల ఆధారిత విధానానికి ఇది నాంది పలుకుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. చిన్న పట్టణాలకు రూ.5,000 కోట్ల నిధి యూసీఎఫ్ పథకంలో భాగంగా పోటీతత్వానికి కేంద్రం తెర తీసింది. పారదర్శకంగా, సంస్కరణలు అమలు చేసే నగరాలకే ప్రాధాన్యమిస్తారు. పాలనలో డిజిటల్ విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, అర్బన్ ప్లానింగ్ సంస్కరణలు అమలు చేసే నగరాలు రేసులో ముందుంటాయి. అంతేగాక టైర్2, టైర్3 నగరాలు, ముఖ్యంగా లక్ష లోపు జనాభా ఉన్న చిన్న పట్టణాల కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాలు మార్కెట్ రుణాలు పొందడానికి కేంద్రం ‘క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ’ఇస్తుంది. దీనికింద తొలిసారి రుణాలకు రూ.7 కోట్లు లేదా రుణ మొత్తంలో 70% దాకా కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది.మూడు రంగాలపై ఫోకస్ యూసీఎఫ్ ద్వారా మూడు రకాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తారు... → నగరాల విస్తరణ, ఆర్థిక కారిడార్లు, రవాణా వ్యవస్థ మెరుగుదల → పాత బస్తీలు, హెరిటేజ్ ప్రాంతాల ఆధునీకరణ, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులు, విపత్తుల నుంచి రక్షణ → తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణ (స్వచ్ఛత), నీటి వనరుల రక్షణ ఎవరికి వర్తిస్తుంది? → 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు → రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు → లక్ష జనాభా దాటిన పారిశ్రామిక నగరాలు → చిన్న పట్టణాలు (గ్యారెంటీ స్కీమ్ కింద)కేబినెట్ ఇతర నిర్ణయాలుప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేల కోట్ల రూపాయలతో కూడిన పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వాటిని మీడియాకు వెల్లడించారు... → తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో రూ.11 వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు అనుమతి → అస్సాంలో రూ.18,662 కోట్లతో బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలి అండర్ వాటర్ రైల్, రోడ్డు ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు. దీన్ని గోహ్పూర్–నుమాలిగఢ్ నడుమ 34 కి.మీ. పొడవున నిర్మించనున్నారు → కసారా–మన్మాడ్, ఢిల్లీ–అంబాలా, బళ్లారి–హోస్పేట నడుమ మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం రూ.18,509 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులు → రూ.10 వేల కోట్లతో తలపెట్టిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం → నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టు 11.56 కి.మీ. మేరకు విస్తరణ. → ప్రధాని కార్యాలయాన్ని రైసినా హిల్స్లోని సౌత్ బ్లాక్ నుంచి నూతనంగా నిర్మించిన సేవా తీర్్థలోకి మార్చడం పట్ల కేంద్ర మంత్రివర్గం హర్షం వెలిబుచి్చంది. శుక్రవారం సౌత్బ్లాక్ కార్యాలయంలో జరిగిన చివరి మంత్రివర్గ భేటీలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ‘‘సేవా తీర్థ్ చరిత్ర, భవిష్యత్తుల కూడలి. గతకాలపు బానిసత్వం నుంచి భవిష్యత్ వికసిత భారత్ దిశగా వేసిన ముందడుగు’’అని అభివరి్ణంచింది. -
ఇండియా ఏఐ సదస్సు రేపటి నుంచే
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, ముఖ్య నేతలతో పాటు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొంటున్నారు. సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ కానున్నారు. వీరిలో శామ్ ఆల్టమన్ (ఓపెన్ఏఐ), బిల్ గేట్స్, డేరియో అమొదెయ్ (ఆంత్రోపిక్) తదితరులున్నారు. భారత్లో పెట్టుబడి ప్రణాళికలను గురించి వీరంతా తమ ఆలోచనలను ప్రధానితో పంచుకోనున్నారు. ఈ సదస్సు సందర్భంగా పలు రంగాల్లో ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు ఏఐ పెట్టుబడులకు ఒప్పందాలు కుదురతాయని అంచనా. వచ్చే నాలుగేళ్లలో భారత్లో ఏకంగా రూ.15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి ప్రణాళికలను మైక్రోసాఫ్ట్ గత డిసెంబర్లో ప్రకటించడం తెలిసిందే. ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ సామర్థ్య పెంపు, అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాల్లో లక్షలాది మంది యువతకు శిక్షణ తదితరాలపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏఐ సదస్సులు పారిస్, సియోల్ తదితర నగరాల్లో జరిగాయి. -
ఈశాన్యంలో చొరబాట్లు... కాంగ్రెస్ పుణ్యమే!
గువాహటి: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈశాన్య భారతదేశంలో అభివృద్ధిని దశాబ్దాలుగా కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేగాక ఈ ప్రాంతంలో చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహించింది’’అంటూ దుయ్యబట్టారు. చొరబాటుదారులను కాపాడిన, కాపాడుతున్న చరిత్ర ఆ పార్టీదేనని ఆక్షేపించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పారు. అస్సాంలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తన హయాంలో దేశ భద్రతను నిత్యం ప్రమాదంలో నెట్టిందంటూ మండిపడ్డారు. ఆ పార్టీ పాలనలో అస్సాంలో నిత్యం భయం, అభద్రతలే రాజ్యమేలాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ నిత్యం సమాజంలో విభజనను ప్రోత్సహించింది. ఓటుబ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలింది. దేశ భద్రతను గాలికొదిలేసింది. చివరికి ఆయుధాల కొనుగోళ్లలో కూడా భారీ కుంభకోణాలకు పాల్పడింది. గతంలో ముస్లిం లీగ్ వల్ల దేశ విభజన జరిగింది. కానీ ఇప్పుడు మావోయిస్టులు, ముస్లిం లీగ్, కాంగ్రెస్ (ఎంఎంసీ)లతో దేశానికి ముప్పు పొంచి ఉంది. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’అని ప్రధాని సూచించారు. ‘డబుల్ ఇంజన్’కే ఓటెయ్యండి వచ్చే ఐదేళ్ల కాలం అస్సాంకు చాలా కీలకమని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారును కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఒక్కటే బీజేపీ లక్ష్యం కాదని, ప్రజల హృదయాలు గెలవడం తమకు ముఖ్యమని చెప్పారు. ‘‘70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేం పదేళ్లలోనే ఐదు బ్రిడ్జిలు కట్టి చూపించాం. మా ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోంది. అస్సాంను వేగంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అస్తిత్వాన్ని, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. 2014 నుంచి ఈశాన్యానికి చెందిన 125 మంది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు’’అని మోదీ చెప్పారు. బీజేపీకి కార్యకర్తలే ప్రాణవాయువని, పార్టీకి ఎనలేని బలమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రతి పౌరునికీ చేరువ కావాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘మేం విశ్వసించేది వ్యవస్థాగతమైన బలాన్నే. నేను బీజేపీ కార్యకర్తను. అది నాకు గర్వకారణం. అదే నా అతి పెద్ద అర్హత. అస్సాం ప్రజలు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. దానికి అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా బదులు చెల్లించుకుంటాను’’అని ప్రకటించారు. పలు ప్రాజెక్టులు ప్రారంభంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో రూ.5,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీటిపై బ్రహ్మపుత్రా నదిపై భారీ వంతెన, ఐఐఎం, డేటా సెంటర్ తదితరాలున్నాయి. ఐఐఎం–గువాహటిని గువాహటి సమీపంలోని పలాస్బరిలో, హైటెక్ డేటా సెంటర్ను కామరూప్ జిల్లాలోని అమీన్గావ్లో నిర్మించారు. వీటితో పాటు పీఎం–ఇబస్ సేవా పథకం కింద మంజూరైన 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మపుత్రపై భారీ బ్రిడ్జి బ్రహ్మపుత్రా నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. అనంతరం బ్రిడ్జిపై నడుస్తూ దాన్ని పరిశీలించారు. అప్రోచ్ రోడ్లు, ఫ్లై ఓవర్లతో కలిపి ఇది 7.75 కి.మీ. పొడవుంటుంది. సువిశాలమైన ఈ ఆరు లేన్ల బ్రిడ్జి వల్ల గువాహటి, ఉత్తర గువాహటి నడుమ ప్రయాణ సమయం ఇకపై కేవలం ఏడు నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం సరాయ్ఘాట్ బ్రిడ్జి మాత్రమే వాటిని అనుసంధానిస్తోంది. దానిపై బ్రహ్మపుత్రను దాటేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కొత్త బ్రిడ్జిని భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఎక్స్ట్రా డోస్డ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్తో నిర్మించారు. ఈశాన్య భారతదేశంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. దీని నిర్మాణానికి 2019లో మోదీయే శంకుస్థాపన చేశారు. 2020 లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. -
ఈఎల్ఎఫ్పై ల్యాండైన మోదీ
గువాహటి/మోరాన్: ఈశాన్య భారతదేశంలో నిర్మితమైన తొలి హైవే–రన్వేను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మోరాన్ సమీపంలో నేషనల్ హైవే 37పై సిద్ధం చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)పై వాయుసేనకు చెందిన సీ–130జె రవాణా విమానంలో ప్రధాని దిగారు. అనంతరం దాన్ని లాంఛనంగా జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతదేశానికి తొలి ఈఎల్ఎఫ్ సదుపాయం అందుబాటులోకి రావడం నిజంగా గరి్వంచదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రాకృతిక విపత్తులు తదితర సమయాల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వెలిబుచ్చారు.అబ్బురపరిచిన ఏరియల్ షో మోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ఆయన చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్, రాష్ట్ర మంత్రులు తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం సీ–130జె హెర్క్యులస్ విమానంలో ఆయన ఈఎల్ఎఫ్కు చేరుకున్నారు. రన్వేపై దిగాక సమీపంలో సిద్ధం చేసిన వేదికకు చేరుకున్నారు. అనంతరం ఈఎల్ఎఫ్పై వాయుసేన నిర్వహించిన ప్రత్యేక ఏరియల్ షోను వీక్షించారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ షో ఆహూతులకు కనువిందు చేసింది. యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పైలట్లు ఈఎల్ఎఫ్పై కచి్చతత్వంతో ల్యాండింగ్, టేకాఫ్తో పాటు పలు విన్యాసాలు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో వాటిని వీక్షించారు. తొలుత సుఖోయ్ –30 ఎంకేఐ, దాని వెనకే రఫేల్ ఈఎల్ఎఫ్ నుంచి టేకాఫ్ అయ్యాయి. తర్వాత ఏఎన్–32 హెలికాప్టర్ టచ్ అండ్ గో విన్యాసాలు ప్రదర్శించింది. తర్వాత మూడేసి చొప్పున తొలుత సుఖోయ్, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలతో అలరించాయి. విపత్తుల వేళ చేపట్టే సహాయక చర్యల సన్నద్ధతను ప్రత్యేకంగా తయారు చేసిన అధునాతన దేశీయ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్) కళ్లకు కట్టాయి. అనంతరం ప్రధాని గువాహటి చేరుకున్నారు.ఎన్నోవిధాలుగా కీలకం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన ఈఎల్ఎఫ్ వ్యూహాత్మకంగా ఎన్నోవిధాలుగా అత్యంత కీలకమైనది. ఈ ఈఎల్ఎఫ్ చైనాకు 300 కి.మీ., మయన్మార్కు కేవలం 200 కి.మీ. దూరంలో ఉంటుంది. 4.2 కి.మీ. పొడవైన ఈ హైవే–రన్వేను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించారు. సైనిక, పౌర అవసరాలు రెండింటికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా వాయుసేన సహకారంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పొరుగు దేశాలతో ఘర్షణల వేళ ప్రత్యర్థులు సమీపంలోని వైమానిక స్థావరాలపై దాడులు చేస్తే బలగాల తరలింపు తదితరాలకు తక్షణ సదుపాయంగా ఈఎల్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుంది. విపత్తులు, ఎమర్జెన్సీ సమయాల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కూడా పని చేస్తుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారి–37పై నిర్మించిన ఈఎల్ఎఫ్పై అన్నిరకాల యుద్ధ, రవాణా విమానాలనూ సులువుగా దించవచ్చు. రఫేల్, సుఖోయ్తో పాటు పలు భారీ రవాణా విమానాలు కూడా దీనిపై విజయవంతంగా ట్రయల్ రన్స్ నిర్వహించాయి. 40 టన్నుల బరువైన యుద్ధ విమానాలతో పాటు ఏకంగా 74 టన్నుల రవాణా విమానాలు కూడా దీనిపై సునాయాసంగా దిగవచ్చు. భారత్లో తొలి ఈఎల్ఎఫ్ రాజస్తాన్లోని బార్మేర్ జిల్లాలో 2021లో నిర్మితమైంది. అనంతరం మధ్య, ఉత్తర భారతంలో కూడా పలు ఈఎల్ఎఫ్లు అందుబాటులోకి వచ్చాయి. -
శాంతిభద్రతలను పరిరక్షిస్తా
ఢాకా: దాదాపు 18 నెలలుగా కొనసాగుతున్న అరాచకత్వ, అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతిభద్రతకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ప్రకటించారు. తాజాగా జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను కైవసంచేసుకుని ఘనవిజయం సాధించిన బీఎన్పీ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెహ్మాన్ శనివారం ఢాకాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో శాంతిభద్రతల స్థాపన కోసం ఎందాకైనా వెళ్తాం. ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. అప్పుడే మేం సురక్షితమైన, మానవీయ బంగ్లాదేశ్ను సాకారంచేయగలం. ఎంతటి భారీమూల్యం చెల్లించైనాసరే శాంతిభద్రతలను పరిరక్షిస్తాం. అందరి భాగస్వామ్యంతో ఫాసిజంరహిత దేశ ప్రగతి ప్రయాణం ఆరంభమైంది. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువనిస్తాం. సుస్థిర బంగ్లాదేశ్ను నిర్మిస్తాం’’అని అన్నారు.4 రోజుల్లో ప్రమాణస్వీకారంప్రధానిగా తారిఖ్తో పాటు కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం మరో నాలుగు రోజుల్లో జరగే అవకాశం ఉందని బీఎన్పీ నేత మొహమ్మద్ షాహబుద్దీన్ చెప్పారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్(బంగభవన్)లో తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి షేక్ అబ్దుర్ రషీద్ చెప్పారు. ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీన ప్రమాణస్వీకారం ఉండొచ్చని బీఎన్పీ సీనియర్ నేత ఒకరు అన్నారు. భారత్తో బంధంపై.. తారిఖ్ తల్లి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కాలంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ నేపథ్యంలో త్వరలో ప్రధాని హోదాలో ఆయన భారత్లో ఎలా మెలగాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. ‘‘మా దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూనే భారత్తో విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద శక్తులైన భారత్, చైనా, పాకిస్తాన్లతో సమస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తాం. వీటిల్లో ఏ ఒక్క దేశాన్ని మాకు గురువుగా పరిగణించబోం. దేశ అత్యుత్తమ ప్రయోజనాలు, దేశ ప్రజల మార్గదర్శకత్వంలోనే మా విదేశాంగ విధానం రూపుదిద్దుకోబోతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీలో తలదాచుకున్న మా దేశ మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించడం అనేది చట్టపరమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సార్క్ పునరుజ్జీవానికి కృషి చేస్తా’’ అని అన్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం!భారత్, బంగ్లా సంబంధాల మెరుగుదల కోసం బీఎన్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకు తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవ సందర్భాన్ని సది్వనియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానిగా తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని బీఎన్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, పాకిస్తాన్ అగ్రనేతలకూ ఆహ్వానాలు పంపాలని పార్టీ ఉన్నత వర్గాలు యోచిస్తున్నాయి. షేక్ హసీనా కాలంలో భారత్–బంగ్లాదేశ్ బంధం బలంగా ఉండేది. ఆ బంధం చిరకాలం పటిష్టంగా కొనసాగాలంటే తారిఖ్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడమే ఉత్తమమనే మాటా వినవస్తోంది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది
బటిండా: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని చంపేసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన పంజాబ్లోని బటిండాలో జరిగింది. జస్సీ కౌర్ అనే మహిళకు సుఖ్ప్రీత్ కౌర్ (8) కూతురు, ఫతేవీర్ (6) కుమారుడు ఉన్నారు. జస్సీ కౌర్కు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగా.. పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.అక్రమ సంబంధం మత్తులో ఉన్న జస్సీ కౌర్ తన పిల్లలను హత్య చేయడానికి కుట్ర పన్నింది. రెండు వారాల క్రితం కుమార్తె సుఖ్ప్రీత్ కౌర్కు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. దీంతో ఆ చిన్నారి.. తన తల్లి ఇచ్చిన ఆహారం తిని మృతిచెందింది. ఆ పాప అనారోగ్యం కారణంగానే చనిపోయిందని, చుట్టుపక్కల వారిని, బంధువుల్ని నమ్మించింది. ఆ తర్వాత రెండు వారాల తర్వాత ఆరేళ్ల కొడుకు ఫతేవీర్ కౌర్కు కూడా ఎలుకల మందు కలిపిన ఆహారం పెట్టింది.శనివారం ఆ బాలుడు కూడా మరణించాడు. ఈ విషాదకర ఘటన రెండు వారాల వ్యవధిలో జరిగింది. 15 రోజుల క్రితం ఎనిమిదేళ్ల బాలిక సుఖ్ప్రీత్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించగా, శుక్రవారం రాత్రి ఆమె ఆరేళ్ల తమ్ముడు ఫతేవీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వరుస మరణాలతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఫూల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. కన్నతల్లే హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలు జస్సీ కౌర్ తన నేరాన్ని అంగీకరించిందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు."మొదట 8 ఏళ్ల సుఖ్ప్రీత్ కౌర్ మరణించింది. నిన్న 6 ఏళ్ల ఫతేవీర్ చనిపోయాడు. ఒక పథకం ప్రకారం జస్సీ కౌర్ తన పిల్లలిద్దరినీ చంపేసింది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకుందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. జస్సీ కౌర్కు సహకరించిన ఆమె సోదరి మోటో కౌర్తో పాటు, లాఖీ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వామ్మో.. వీడు నిజంగానే భలే స్మార్ట్ దొంగ..!
ఇప్పుడు దొంగతనాల ట్రెండ్ కూడా మారిపోయినట్లు ఉంది. ముసుగులు వేసుకుని రాత్రి పూట కన్నాలకు వెళుతూ ఉంటారు కదా.. వారినే సాధారణంగా దొంగలు అనుకుంటాం. ఇప్పుడు దొంగలు కూడా ముదరిపోయినట్లే ఉన్నారు.. వాడు దొంగ అని ముఖం మీద ఏమీ రాసుండదు కాబట్టి వారు కూడా మనలోనే కలిసిపోతున్నారు. మనతో పాటు ఉన్నట్లే ఉండి వారికి కావాల్సింది దోచుకుపోతున్నారు. ఇటీవల జరిగిన పెళ్లి రిసెప్షన్లో జరిగిన చోరీ చూస్తే వీడు నిజంగానే భలే దొంగ అనక తప్పదు. దొంగల్లో భలే దొంగలు ఉండరు.. కానీ చోరీ చేసిన విధానం.. వాడు భలే దొంగ అని కచ్చితంగా అనుకుంటాం. వారం రోజుల క్రితం రాజస్థాన్లోని జగత్పురాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జరిగిన చోరీ చూస్తే ఔరా అనిపిస్తోంది. పెళ్లి విందు సందర్భంగా వధువు స్టేజ్పై ఉంచిన బ్యాగ్ను దొంగ దొంగిలించాడు. ఆ బ్యాగ్లో సుమారు రూ. 4 లక్షల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా దొంగ ఆ బ్యాగ్ను తీసుకెళ్లాడు. పెళ్లి కొడుకు, వధువు స్టేజ్పైకి వచ్చిన వారితో మాట్లాడుతున్న సమయంలో వధువు పక్కనే ఉన్న బ్యాగ్ను ముందే పసిగట్టిన ఆ దొంగ.. దాన్ని వెనకాల నుంచి అతిథిలా వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. VIDEO: शादी में मेहमान बनकर आया शातिर, ब्लेजर में छिपाकर ले गया नगदी और ज्वेलरी से भरा बैग pic.twitter.com/TZ6TbjFYhp— Purnea Mirror News (@mirrorpurnea) February 13, 2026 -
కేరళ విద్యార్థుల ఘనత...మొక్కల కోసం యాప్
మీ స్కూల్ గ్రౌండ్లో ముక్కులున్నాయా? వాటి పేర్లేంటి? ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలుంటే బాగుంటుంది? అక్కడ ఏయే మొక్కల ద్వారా ఏయే ప్రయోజనాలున్నాయి? వాటిని రక్షించుకోవడం ఎలా? ఇలాంటివి తెలుసుకునేందుకు కేరళలోని కార్యవట్టం ప్రభుత్వ కళాశాల బీఎస్సీ భౌగోళిక శాస్త్ర విద్యార్థుల బృందం ఓ వెబ్ అప్లికేషన్ను తయారు చేసింది. ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలమైనది. సెకండరీ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్లలో మొక్కల వైవిధ్యాన్ని మ్యాప్ చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. యాండ్రాయిడ్ ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీనికి ఇన్స్టాలేషన్ కూడా అవసరం లేదు. ఇదీ చదవండి: డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమంఈ యాప్ అందరూ వాడొచ్చు. సాధారణ ఫీల్డ్ సర్వేలను నిర్వహించడానికి ప్రాథమిక కార్టోగ్రాఫిక్ అంశాలతో జీవవైవిధ్య మ్యాప్లను తక్షణమే రూపొందించడానికి ఈ యాప్ పనికొస్తుందని దీన్ని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. భౌగోళిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతీప్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధనను ప్రోత్సహించే కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (ఓఐఖీఉ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాప్ తయారు చేశారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉన్న పాఠశాల విద్యార్థులంతా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.పాఠశాల విద్యార్థులలో డిజిటల్ విద్య, పర్యావరణ అభ్యాసం, జియోస్పేషియల్ నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలాంటి యాప్స్ తయారీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా? -
‘Need Ten Minutes’ : సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి గెలిచిన 19 ఏళ్ల అథర్వ్
ఢిల్లీ: ఫోమో, గోట్, వైబ్, బెట్..ఇవి జెన్జీలు తరచుగా వినియోగించే పదాలు. కానీ వాటికి బదులుగా ‘మై లార్డ్, విత్ డ్యూ రస్పెక్ట్, లెర్న్డ్ కౌన్సిల్, జ్యూరిస్డిక్షన్’ అనే పదాలతో ఓ 19 ఏళ్ల యువకుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో తన కేసును తానే వాదించాడు. ‘Need ten minutes’ అంటూ కేసులో విజయం సాధించాడు. న్యాయశాస్త్రంలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు సైతం కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయడానికి వెనుకాడుతారు. అలాంటి పిటిషన్ను తానే స్వయంగా దాఖలు చేసి, తన వాదనలతో న్యాయమూర్తులను ఒప్పించాడు.సుప్రీంకోర్టు హాలు న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు, అసోసియేట్ లాయర్లు, జూనియర్ లాయర్లు, వాదులు, ప్రతివాదులతో కిక్కిరిసిపోతున్న సమయంలో, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఎదుట టెన్ మినిట్స్ మోర్ అనే గొంతు వినిపించింది. ఆ గొంతు నిష్ణాతులైన న్యాయమూర్తి గొంతు అని అనుకుంటే పొరబడినట్లే.. 12వ తరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలని కలలు కంటున్న 19 ఏళ్ల అథర్వ్ చతుర్వేది గొంతు. సరిగ్గా పది నిమిషాల తర్వాత అతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అథర్వ్తో పాటు అర్హులైన Economically Weaker Section (EWS) అభ్యర్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ్, నీట్ పరీక్షలో ఒకసారి కాదు రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాడు. 530 మార్కులు సాధించినప్పటికీ ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందలేకపోయాడు. కారణం ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అదే సమయంలో ఇతర కోటాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్ పొందినట్లు అతను గమనించాడు.ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఎస్ఎల్పీ దాఖలు చేశాడు. విచారణలో కోర్టు, విధానపరమైన లోపాల కారణంగా అథర్వ్ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని గుర్తించింది. వాదన సమయంలో తగిన సమయం లేదని భావించిన అథర్వ్ పది నిమిషాలు అదనంగా కావాలి’ అని చీఫ్ జస్టిస్ను కోరాడు. ఆ పది నిమిషాల తర్వాతే అతనికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో 2025-26 సెషన్లో అతనికి ఎంబీబీఎస్ సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన కేసును తానే వాదించి విజయం సాధించిన అథర్వ్, ఇప్పుడు వైద్య విద్యను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.ఇదే అంశంపై జబల్పూర్ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినిపించాడు. అథర్వ్ వాదనలతో ముగ్ధులైన జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తి సైతం అతనిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు డాక్టర్ కాదు, న్యాయవాదిగా రాణించాలి. నువ్వు ఎంచుకున్న రంగం తప్పేమో అంటూ ప్రోత్సహించారు’ అని పలు జాతీయా మీడియా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం
బిహార్లో జరిగిన ఘటన ఒకటి తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్న మహిళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.బిహార్లోని భోజ్పూర్లో చంద్వా తోలా ప్రాంతంలో జరిగిన స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. వేలాదిమంది గుమిగూడిన జనం మధ్యం వేదికపై న్యృత్య ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో డ్యాన్స్ చేస్తున్న నృత్యకారిణిపట్ల కొంతమంది ఆకతాయిలు నీచంగా ప్రవర్తించారు. ఆమె డ్యాన్స్ చేస్తుండగా కొంతమంది నాణేలు విసిరారు. మరికొంతమంది అంతటితో ఆగలేదు. నాణేలను బలవంతంగా నోటిలోకి దూర్చి, మింగించారు. దీంతో ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో పరిస్థితి అదుపు పోలీసులు జోక్యం చేసుకుని, అత్యవసర చికిత్స కోసం ఆమెను అరా సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గొంతు నుండి నాణేలను తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడవాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుతన భార్య వేదికపై నృత్యం చేస్తుండగా, కొంతమంది ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టడంతో మింగేసిందనీ, వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని బాధితురాలి భర్త రాజు కుమార్ వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులు, ఇతర జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షులు , ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.ఇదీ చదవండి: బెంగళూరులో తొలి స్టోర్ : ఆటోలో స్టైలిష్గా ‘నథింగ్’ సీఈవో -
బెంగళూరులో తొలి స్టోర్ : ఆటోలో స్టైలిష్గా ‘నథింగ్’ సీఈవో
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ నథింగ్ భారతదేశంలో తన మొట్టమొదటి ఫ్లాగ్షిప్ స్టోర్ను అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరులో తన తొలి స్టోర్ను లాంచ్ చేసింది. ఈ ప్రారంభోత్సవం సందర్బంగా ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.నథింగ్ సిగ్నేచర్ బ్రాండింగ్తో సరిపోలేలా అద్భుతమైన తెల్లటి ఆటోలో సీఈవో CEO కార్ల్ పీ స్టోర్కు రావడం అభిమానులకు ఆకట్టుకుంది. ఆటోలో ఆయన్ని చూడగానే అక్కడ గుమిగూడిన అభిమానుల హర్ష ధ్వానాలు చేశారు. వారి కరతాళ ధ్వనుల మధ్య స్టోర్లోకి బెంగళూరు స్టైల్లో కాలు పెట్టారు పీ. ఫ్లాగ్షిప్ అవుట్లెట్ వెలుపల భారీ జనసమూహం క్యూలైన్లలో వేచి ఉన్నారు.ఆయన రాకతో,అప్పటివరకూ క్యూలో వేచి ఉన్న వేలాదిమంది అభిమానుల ఉత్సాహానికి అంతులేకుండాపోయింది.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుI heard there was "Nothing" happening today, but then I showed up and saw all this! My mind is officially blown by this store opening. Who knew Nothing could be so exciting? 🤯✨😂@nothingindia #nothingstore #nothingindia pic.twitter.com/sxUZ8OasKW— Entertainment & Trendz (@mktrendz) February 14, 2026"> ఇండియాలో ప్రత్యేకంగా బెంగళూరునే తమ తొలి అవుట్లెట్ కోసం ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నథింగ్ అతిపెద్ద మార్కెట్లలో దేశం ఒకటి అని, తమ వినియోగదారులు చాలా మంది భారతదేశంలో మరీ ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ బలమైన టెక్ కమ్యూనిటీ కూడా ఉంది, కాబట్టి ఇక్కడ ప్రారంభించడం సహజంగా అనిపించిందన్నారు. ఈ సందర్బంగా ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసిన బెంగళూరు వాసులకు పీ ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. దీంతో నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నథింగ్ బ్రాండ్కు కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, మరికొంతమంది లాంచ్ స్థాయిని చూసి ఆశ్చర్య పోయామన్నారు. భారతదేశ టెక్ రాజధాని బెంగళూరులో నథింగ్ బ్రాండ్కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు -
విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ జోన్కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.విదేశీ నివాస కాలం కీలకంమీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.బంగారం నిబంధనలుభారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.గోల్డ్ బార్లు.. కాయిన్స్ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.మద్యం, నగదు పరిమితులువిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీనగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?కస్టమ్స్ క్లియరెన్స్లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్గా పర్సనల్ యూజ్ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.సురక్షిత ప్రయాణం కోసం సూచనలుకస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్పోర్ట్లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.-దవనం శ్రీకాంత్ -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: దేశ రాజధాని అభివృద్ధికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి రూ.2,254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది. నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.అదే విధంగా 61 కిలోమీటర్ల మేర నోయిడా గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో నెట్వర్క్ నిర్మాణానికి కేటాయింపులు చేపట్టనున్నట్లు తెలిపింది. రూ. లక్ష కోట్ల కేంద్ర సహాయంతో రూ. 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ సెక్టార్ సహకారంతో ఫైనాన్స్ మార్కెట్ క్రియేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. స్టార్టప్ ఇండియా ఫండ్ కోసం పదివేల కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు దేశంలో రెండు లక్షల స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాలు, మున్సిపల్ సంస్థలకు కేంద్రం మరింతగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. -
ఎస్ఎంఎస్ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు
టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితాఎస్ఎంఎస్ అలర్ట్ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14కెనరా బ్యాంక్506.28పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89బ్యాంక్ ఆఫ్ బరోడా202.42 గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 2020 నుంచి ఎస్ఎంఎస్ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్ఎంఎస్కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్ఎంఎస్ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.కేవలం ఎస్ఎంఎస్లే కాదు.. ఏటీఎంలు కూడా!గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్ఎంఎస్లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
Mumbai: కుప్పకూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్
మహరాష్ట్ర: ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. నలుగురికి గాయాలు కాగా..బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
పెళ్లివేడుకలో గన్ ఫైర్.. బాలుడి ఛాతిలోకి బుల్లెట్
భోపాల్: మధ్యప్రదేశ్లో జరిగిన ఓ వివాహ వేడుక ఒక పేదవారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. పెళ్లి సందర్భంగా నిర్వహించే బారత్ ఊరేగింపులో ఒక వ్యక్తి గన్ను పేల్చారు. దురదృష్టవశాత్తు అది 15 ఏళ్ల బాలుడికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.భోపాల్లో గురువారం రాత్రి పెళ్లి సందర్భంగా ఓకుటుంబ సభ్యులు వేడుక నిర్వహించారు. దీంతో బ్యాండు బాజా నిర్వహించి డ్యాన్సులు చేశారు. ఓవరాక్షన్తో ఆ ఊరేగింపు వేడుకలో ఆ పెళ్లికి సంబంధించిన గుర్తుతెలియని వ్యక్తి పిస్తోలు కాల్చారు. అయితే ఆ తూటా పక్కనే ఉన్న వివేక్ అనే15ఏళ్ల బాలుడి ఛాతిలోకి వెళ్లడంతో ఆ తీవ్రగాయాల పాలయ్యాడు.అయితే వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం పక్కనే ఉన్న బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజ్కి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆ యువకుడిని పరిక్షీంచిన డాక్టర్లు అప్పటికే వివేక్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే వారి ఇంటిలో ఆ యువకుడు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నారని ఇప్పుడు అతని మరణంతో ఆ కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని వివేక్ తరపు బంధువులు రోధిస్తున్నారు.యువకుడి మరణ వార్త విని ఆసుపత్రి ఎదుటకు పెద్దఎత్తున బాధితుడి బంధువులు చేరుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నామని మరోకరి కోసం గాలింపులు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే ఘటనపై సీసీకెమెరాలతో పాటు డ్రోన్ చిత్రాలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హతం?.. వీడియో వైరల్
భారత మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ ఖాసీం గుజ్జర్/ సల్మాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బైక్పై వెళుతున్న గుజ్జర్ను వెనుకనుంచి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశారు. అయితే మరణించిన వ్యక్తి ఆయన కాదా అని స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.2024లో భారత ఉగ్రవాద నియంత్రణ చట్టం (UAPA) కింద మహ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈయనకు నిషేదిత ఉగ్రసంస్థ LETతో సంబంధాలున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పీవోకేలో ఆయన టెర్రరస్టు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.భారత్ ప్రస్తుతం టెర్రరిస్టులను ఊక్కుపాదంతో అణిచివేస్తోంది. పాక్తో సరిహాద్దు పంచుకుంటున్న ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. ఆధునాతన కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పహల్గామ్ అటాక్ అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్లోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.BREAKING: India-wanted terrorist Mohammad Qasim Gujjar alias Salman/Suleman has reportedly been shot dead by unknown gunman in Peshawar, Pakistan. The Reasi (J&K) native was linked to LeT and based in PoK. After Op Sindoor ,he was tasked to set up a terror camp in KPK. (Sources) pic.twitter.com/IcfwhlXS25— Baba Banaras™ (@RealBababanaras) February 14, 2026 -
అస్సాంలో మోదీ.. రోడ్డుపైనే ల్యాండయిన విమానం
దిస్పూర్: ప్రధాని మోదీ అస్సాం చేరుకున్నారు. దిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ రోడ్డుపై.. మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ల్యాండయ్యింది. అనంతరం ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని తిలకించారు. ఇటీవల నిర్మించిన 4.2 కిలోమీటర్ల ఈ రహదారిపై రఫెల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాల ల్యాండింగ్ ప్రదర్శన చేయవచ్చు.దానితో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సైనిక, పౌర విమానాల ల్యాండింగ్కు ఇది ఉపయోగపడుతుంది. ఈశాన్య భారతంలో ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈశాన్య ప్రాంతాలలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భాస్కర వర్మ సేతు ప్రాజెక్టును మోదీ ప్రారంభించనున్నారు. దాని తర్వాత దాదాపు రూ. 5,450 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి హిమంత బిశ్వశర్మతో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికారు. -
మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు
తమిళనాడు: డీఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు వేయడంతో మహిళలు రెట్టింపు ఉత్సాహం చెందారు. ఎన్నికల వేల డీఎంకే వ్యూహానికి సానుకూల స్పందనతో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ మహిళలను ఆకర్షించే విధంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు నెలలకు రూ.3వేలు, మే నెల వేసవి ఎండలకు అదనంగా రూ.2వేలతో కలిపి రూ.5లచొప్పున మహిళ హక్కు పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకే నగదు జమ చేశారు. మహిళల చేతికి డబ్బులు అందాలని శుక్రవారం ఉదయం 7 గంటలకల్లా అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీంతో మహిళలు నగదు విత్డ్రా కోసం బ్యాంకుల వద్దకు పోటెత్తారు. తిరుత్తణిలోని మపోసీ ప్రదాన రోడ్డు మార్గంలోని ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుల వద్ద క్యూకట్టారు. రెండు గంటల పాటు బ్యాంకు వద్ద వేచివుండి బ్యాంకు ఏజెంట్లు, సరీ్వసు కేంద్రాల్లో డబ్బులు విత్డ్రా చేశారు. -
చేపల కోసం వల వేస్తే శవం పడింది!
అన్నానగర్: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్కోయిల్ సుంగాన్ కడైలోని అంబేడ్కర్ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు కొలనులో చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఆ యువతి మృతదేహాన్ని తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది. హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థునా? ఎవరైనా విద్యార్థుని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క ఓటు రాదు.. విజయ్పై బీజేపీ సంచలన కామెంట్స్
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్.. టీవీకే అధినేత విజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార DMKకు విజయ్ పార్టే ప్రధాన ప్రతిపక్షం అన్నది విజయ్ అవగాహనా రాహిత్యం అన్నారు. ఇంటిమీద కోడిని పట్టుకోలేనోళ్లు.. ఆకాశం ఎగురుతా అని కలలు కనకూడదని హితవు పలికారు.తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ అస్త్ర శస్త్రాలు తీసి ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నాయి. విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీకే చీఫ్ విజయ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు గట్టిపోటీ ఇచ్చేది తన పార్టీనేనని తమ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇదే వెల్లడైందన్నారు. అయితే తాజాగా దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ స్పందించారు."విజయ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఇంటిపైకెక్కి కోడినిపట్టుకోనోళ్లు.. ఆకాశం పైకి ఎగిరారట. ఆయన ప్రజల్లోకి వస్తే వాస్తవ పరిస్థితులేంటో ఆయనకు అర్థం అవుతోంది. గొప్ప నాయకులతో సంభాషించి రాజకీయం తెలుసుకోవాలి. కుండలో ఏదుంటో గరిటలోకి అదే వస్తుంది" అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే అధికారం సాధించడం కాదు కదా ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి రాదన్నారు.అయితే అంతకు ముందు ఒక ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ టీవీకేకు ఇండియా కూటమితో గాని, బీజేపీతో గాని పొత్తు ఉండదని ఆ పార్టీ ఒంటరిగానే అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. దీనిపై బీజేపీ లీడర్ కౌంటరిచ్చారు. -
ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
ప్రేమకు భాషతో పనిలేదు అంటారు. అది వాస్తవమే అయినా భాషలకు అతీతంగా యువతీ యువకుల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నా చెల్లల ప్రేమనా.. మార్కెట్తో కనెక్ట్ అవ్వాల్సిందే. నేటి కాలంలో ప్రేమకు ‘మార్కెట్’తో విడదీయలేని ముడిపడి ఉంది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే ఇప్పుడు కేవలం ఒక భావోద్వేగపూరితమైన రోజుగా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఒక భారీ కమర్షియల్ ఈవెంట్గా అవతరించింది. భారత్లో ఈ ఒక్క రోజున జరిగే వ్యాపారం విలువ సుమారు రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాల అంచనా.విందులు.. వినోదాలువాలెంటైన్స్ డే ప్రభావం అత్యధికంగా కనిపించేది హోటళ్లు, రెస్టారెంట్లపైనే. క్యాండిల్ లైట్ డిన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కపుల్ మెనూ’లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ఈ రోజు రెస్టారెంట్ల ఆదాయం 40-50% పెరుగుతుంది. నగరాల్లోని ఫైవ్స్టార్ హోటళ్లు లవ్ ప్యాకేజీల పేరుతో బస, స్పా, డిన్నర్ కలిపి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.బహుమతుల్లో కొత్త పోకడలువస్తువుల క్రయవిక్రయాల్లో ఈ సీజన్లో మెరుగైన వృద్ధి కనిపిస్తుంది. గులాబీ పూల ఎగుమతి, దిగుమతులు ఈ వారంలో పీక్ స్టేజ్లో ఉంటాయి. కేవలం ఒక్క రోజులోనే కోట్లాది రూపాయల విలువైన గులాబీలు అమ్ముడవుతాయి. ప్రత్యేకంగా ఫొటోలు ఉన్న బహుమతులు, కస్టమైజ్డ్ జువెలరీ, గాడ్జెట్స్కు యువత ప్రాధాన్యత ఇస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేకంగా సేల్స్ నిర్వహించడం వల్ల ఆన్లైన్ షాపింగ్ వృద్ధి నమోదు చేస్తుంది.టూరిజంప్రేమికులు ఏకాంతంగా గడపడానికి పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడంతో ట్రావెల్ ఇండస్ట్రీకి లాభాలొస్తాయి. దేశీయంగా గోవా, ఉదయ్పూర్, కేరళ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ నెల రోజుల ముందే బుక్ అవుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో భాగంగా మాల్దీవులు, థాయిలాండ్, బాలి వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ సంస్కృతి నేడు భారత్లో ఒక బలమైన వాణిజ్య శక్తిగా మారింది. వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వెరసి వాలెంటైన్స్ డేని ఒక బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మార్చేశాయి.ఇదీ చదవండి: రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే.. -
బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అక్రమ మైనింగ్, బొగ్గు దొంగతనం ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. శాకాంబరీ ఇస్పాత్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ ఫెర్రోటెక్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన స్థిరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు సీజ్ చేసిన వాటిలో ఉన్నాయంది. దీంతో, రూ.2,742 కోట్ల మేర అవకతకలు జరిగాయని భావిస్తున్న ఈ కేసులో ఇప్పటి వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.322.71 కోట్లకు చేరిందని ఈడీ పేర్కొంది. బొగ్గు కుంభకోణం కేసు విచారణలో భాగంగా జనవరి 8వ తేదీన కోల్కతాలోని ఐ–ప్యాక్ అనే ఎన్నికల కన్సల్టెన్సీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్కు చెందిన కార్యాలయాల్లో ఈడీ చేపట్టిన సోదాలు వివాదాస్పదంగా మారాయి. జైన్ ఇంట్లో సోదాలు జరుపుతుండగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వచ్చి కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను తీసు కెళ్లారని ఈడీ ఆరోపించడం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా రావడం తెల్సిందే. -
అండమాన్ బ్యాంక్ మోసం కేసు
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏఎన్ఎస్సీబీఎల్)లో చోటుచేసుకున్న రూ.500 కోట్ల కుంభకోణానికి సంబంధించి రూ.200 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హోటళ్లు, రిసార్టులు, భూములు తదితర 51 స్థిరాస్తులున్నా యని, వీటికి ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధముందని పేర్కొంది. ఇవన్నీ నిందితులు, వారి కుటుంబీకులు, సన్నిహితులు, కంపెనీలు, సంస్థల పేర్లతో ఉన్నట్లు వివరించింది. అయితే, ఇవన్నీ ఎవరి ఆస్తులనే విషయాన్ని మాత్రం ఈడీ స్పష్టం చేయలేదు. అండమాన్ నికోబార్ పోలీసులు స్థానిక ఎంపీ, కాంగ్రెస్ నేత కుల్దీప్ రాయ్ శర్మ, బ్యాంకు ఎండీ కె.మురుగన్, బ్యాంకు అధికారి కె.కలైవానన్, హోటల్ యజమాని సంజయ్ లాల్ తదితరులపై దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వీరంతా నిబంధనలను ఉల్లంఘిస్తూ తప్పుడు పేర్లతో పెద్ద మొత్తాల్లో వందకు పైగా రుణాలను పొందినట్లు ఆరోపణలున్నాయి. -
ఆ విద్యార్థికి హాల్ టిక్కెట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల నుద్దేశిస్తూ అభ్యంతరకర మీమ్ను ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినట్లు ఆరోపణలున్న ఓ పదో తరగతి విద్యార్థిని పరీక్షలు రాయనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అతడికి వెంటనే హాల్ టిక్కెట్ జారీ చేయాలని కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సరి్టఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ)ని ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ విద్యారి్థ(13) గతేడాది తమ స్కూలు ఉపాధ్యాయులపై అభ్యంతరకరమీమ్ను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. విషయం స్కూలు యాజమాన్యం దృష్టికి వచి్చంది. ఈ విషయమై సారీ చెప్పేందుకు ఆ విద్యార్థి నిరాకరించడంతో అతడిని స్కూలు నుంచి బహిష్కరించింది. అతడి తండ్రి మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లగా, స్కూలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గతేడాది నవంబర్లో ఆదేశాలిచి్చంది. దీనిపై అతడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ విద్యార్థి ఇప్పటికే సీఐఎస్ఈఈలో నమోదై ఉన్నందున పరీక్షలు రాయనివ్వాలని సూచించింది. లేకుంటే అతడు విద్యా సంవత్సరం నష్టపోతాడని తెలిపింది. ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు గాను హాల్ టిక్కెట్ జారీ చేయాలని సీఐఎస్సీఈని ఆదేశించింది. ఆ బాలుడికి తోటి విద్యార్థులతో కాకుండా వేరే గదిలో పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయవచ్చని స్కూలు యాజమాన్యానికి సూచించింది. అంతేకాకుండా, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్యూపీడబ్ల్యూ (సామాజిక ఉపయోగకరమైన ఉత్పాదక పని) సబ్జెక్టులకు పాఠశాల స్థాయిలోనే అంతర్గత మూల్యాంకనాన్ని నిర్వహించాలని, ఆ మార్కులను బోర్డుకు సమరి్పంచాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. ‘ఆ విద్యారి్థని సంస్కరించేందుకు, అంతర్గత పరివర్తన తెచ్చేందుకు ప్రయతి్నంచాల్సిన పాఠశాల యాజమాన్యం, అతడిని తొలగించడం ద్వారా దూరంగా ఉంచాలని నిర్ణయించుకుంది. అతడిని సన్మార్గంలో పెట్టే బాధ్యత కలిగిన పాఠశాల..అతడిపై చెడ్డ బాలుడనే ముద్ర వేసింది’అంటూ ధర్మాసనం ఈ సందర్భంగా మౌఖికంగా వ్యాఖ్యానించింది. బాలలు సాధారణంగా ఇటువంటి ప్రవర్తనను తమ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నేర్చుకుంటారని ధర్మాసనం అభిప్రాయపడింది. మతపరమైన విద్వేషాలను, అందుకు సంబంధించిన అంశాలను ప్రేరేపించే మీమ్స్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని స్పష్టం చేసింది. -
మణిపూర్ హింసపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: మణిపూర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. అదేవిధంగా, సుప్రీంకోర్టుకు బదులుగా మణిపూర్ హైకోర్టు లేదా గౌహతి హైకోర్టు లేదా రెండు కోర్టులు కలిపి అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఇతర పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. మణిపూర్ హింసాత్మక ఘటనల బాధితుల పునరావాసం, సంక్షేమంపై ఏర్పాటైన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ సిఫారసులను తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జాతుల మధ్య వైరంతో 2023లో మణిపూర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి దాఖలైన 11 ఎఫ్ఐఆర్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘బాధితులకు న్యాయం చేకూర్చేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు 27 నివేదికలను కోర్టుకు అందజేశాయి. మా చేతికి ఒక్కటీ అందలేదు. అయితే, ఆ నివేదికల్లోని అత్యంత సున్నితమైన అంశాలు లీకవుతాయేమోనని ఆందోళన చెందుతున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. బాధితుల తరఫు లాయర్ గొన్జాల్వెస్ స్పందిస్తూ సున్నితమైన అంశాలను తొలగించడం లేదా నల్లటి గీతతో మూసివేయవచ్చని సూచించారు. అదేవిధంగా, గ్యాంగ్ రేప్నకు గురైన కుకీ వర్గానికి చెందిన బాధితురాలు ఇటీవలే చనిపోయారని సీనియర్ లాయర్ వృందా గ్రోవర్ తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్ వేసిన సీబీఐ అధికారులు బాధితురాలి కుమార్తెకు అందుకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘దిగువ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సీబీఐ ప్రతినిధి రాలేదు. ప్రధాన నిందితుడిని హాజరుపర్చలేదు. అధికారుల నిర్లక్ష్యం చూసి షాకవుతున్నాం’అని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. -
చైనా సరిహద్దు సమీపాన రన్వేగా హైవే!
న్యూఢిల్లీ: హైవేయే రన్వేగా మారితే? ఆ అద్భుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో రూపుదిద్దుకుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ. పొడవైన ప్రాంతం అత్యాధునిక రన్వేగా కొత్త రూపు సంతరించుకుంది. ఇలాంటి ‘హైవే–రన్వే’లను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)గా పిలుస్తారు. ఇది ఈశాన్య భారతంలో తొట్టతొలి ఈఎల్ఎఫ్గా రికార్డులకెక్కింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆయన ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ సమీపంలోని చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా మోరాన్ బైపాస్ సమీపంలోని ఈఎల్ఎఫ్పై దిగుతారు. అనంతరం అక్కడ జరిగే మెగా ఎయిర్ షోను ఆయన తిలకిస్తారు. రఫేల్, సుఖోయ్లతో పాటు వాయుసేనకు చెందిన మొత్తం 16 యుద్ధ విమానాలు ఈఎల్ఎఫ్పై ల్యాండవడమే గాక పలు విన్యాసాలతో అలరించనున్నాయి. అనంతరం మోదీ అస్సాంలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గువాహటి వద్ద బ్రహ్మపుత్ర నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల కుమార్ భాస్కర్వర్మ సేతు, కామపూర్ జిల్లాలో నేషనల్ డేటా సెంటర్, ఐఐటీ–గువాహటి తదితరాలు వీటిలో ఉన్నాయి. చైనాకు దగ్గర్లో... చైనా సరిహద్దుకు కేవలం 150 కి.మీ. సమీపంలో నిర్మించిన ఈ ఈఎల్ఎఫ్ రక్షణ అవసరాల దృష్ట్యా భారత్కు చాలా ముఖ్యమైనది. విపత్తు, ఎమర్జెన్సీ సమయాల్లో సాధారణ, యుద్ధ విమానాల రాకపోకలకు ఇది వీలు కలి్పస్తుంది. భారత వాయుసేన సహకారంతో దీన్ని నిర్మించారు. యుద్ధ విమానాలే గాక సీ–17 గ్లోబ్ మాస్టర్ వంటి భారీ రవాణా విమానాల ల్యాండింగ్కు కూడా అనువుగా దీన్ని రూపొందించారు. 40 టన్నుల బరువున్న యుద్ద విమానాలతో పాటు 74 టన్నుల బరువుండే రవాణా విమానాలు సైతం దీనిపై సులువుగా దిగగలవు. దేశ పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఈఎల్ఎఫ్లు అందుబాటులో ఉన్నాయి. -
‘సేవా తీర్థ్’లోకి మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయ చిరునామా మారిపోయింది. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్ నుంచి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’లోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. ఢిల్లీని దేశ ఆధునిక రాజధానిగా మార్చి 95 ఏళ్లయిన సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) నూతన భవనం సేవా తీర్థ్ను ప్రధాని మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ఇక్కడి నుంచే ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. మోదీ పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో కలిసి సేవా తీర్థ్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. సేవా తీర్థ్తోపాటు కర్తవ్య భవన్–1, 2లను ప్రారంభించారు. పీఎంఓలో గణేశుడి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. సేవా తీర్థ్ ఫలకాన్ని ఆవిష్కరించారు. ఫలకంపై దేవనాగరి లిపిలో సేవా తీర్థ్ అని లిఖించగా, దాని కింద నాగరిక్ దేవో భవ(పౌరుడే దేవుడు) అని లిఖించారు. సేవా తీర్థ్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ సైతం ప్రధానమంత్రి విడుదల చేశారు. కొత్త భవనంలో మోదీ తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించారు. మహిళలు, రైతులు, యువతతోపాటు వృద్ధుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి పౌరుడికి జీవన భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి అనుమతి ఇస్తూ ఫైల్కు సంతకం చేశారు. లఖ్పతీ దీదీల సంఖ్యను ఆరు కోట్లకు పెంచడానికి మరో ఫైల్పై సంతకం పెట్టారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం రాహత్ పథకం కింద.. ప్రమాదాలకు గురైనవారికి రూ.1.5 లక్షల దాకా నగదు రహిత చికిత్స అందిస్తారు. డబ్బు లేకపోయినా బాధితులకు అత్యవసర చికిత్స తప్పనిసరిగా అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మూడు కోట్ల మంది మహిళలను 2027 మార్చి నెల నాటికి లఖ్పతీ దీదీలుగా తీర్చిదిద్దాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే అది పూర్తయ్యింది. ఒక ఏడాది ముందే మూడు కోట్ల మంది లఖ్పతీ దీదీలుగా మారారు. 2029 మార్చి నెల నాటికి మొత్తం ఆరుకోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అధికారులకు టార్గెట్ విధించారు. మరోవైపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.2 లక్షల కోట్లకు పెంచారు. ఈ నిధికి గతంలో రూ.లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు రెట్టింపు చేశారు. అలాగే రూ.10,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్) 2.0’కు మోదీ అనుమతి మంజూరు చేశారు. ఈ నిధితో నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందించబోతున్నారు. బ్రిటిష్ ఆనవాళ్లకు మంగళం ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) సేవా తీర్థ్లో కొలువు దీరగా, కేబినెట్ సెక్రెటేరియట్ ఆఫీసు, జాతీయ భద్రతా మండలి సచివాలయ కార్యాలయంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖలను కర్తవ్య భవన్–1, 2లలోకి తరలిస్తున్నారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆయా కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరబోతున్నాయి. బ్రిటిష్ వలస పాలకుల ఆనవాళ్లను క్రమంగా వదిలించుకొనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2014 నుంచే ఆరంభించారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతులతో నూతన పార్లమెంట్ భవనంతోపాటు సేవా తీర్థ్ భవనం నిర్మించారు. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. బ్రిటిష్ పాలకులు మన మనసును బానిస మనస్తత్వంతో నింపేశారని, దాన్ని తప్పనిసరిగా వదిలించుకోవాలని మోదీ తరచుగా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇకపై సేవా తీర్థ్గా పిలవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన రేస్ కోర్స్ రోడ్ను కూడా లోక్ కల్యాణ్ మార్గ్గా ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు నివాసం ఉండే రాజ్ భవన్లను లోక్ భవన్లుగా, లోక్ నివాస్లుగా మార్చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో మైలురాయి: మోదీసేవా తీర్థ్, కర్తవ్య భవనాలు వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణంలో కీలకమైన మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. దేశ ప్రగతితోపాటు ‘పౌరులే కేంద్రంగా ప్రభుత్వ పాలన’కు ఇవి ప్రతీకలు అని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్–1, 2ల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రిమాట్లాడారు. ఇప్పటిదాకా పీఎంఓగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా సేవలందించిన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లు బ్రిటిష్ సామ్రాజ్య ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా నిర్మించినవేనని తెలిపారు. కానీ, నేడు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ధ్యేయంగా సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు నిర్మించామని చెప్పారు. ఇకపై ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పునాదిగా తోడ్పడుతాయని పేర్కొన్నారు. -
కొన్ని క్యాన్సర్లను నివారించొచ్చు
సాక్షి, స్పెషల్ డెస్క్: క్యాన్సర్.. ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధి. ఏటా ఒక కోటి మంది ఈ వ్యాధి బారినపడి కన్నుమూస్తున్నారంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కొత్త క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ నివారించదగినవే. అంటే ఏటా 71 లక్షల మందిని ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడవచ్చన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. 2022లో 1.87 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ సోకింది. ఇందులో సుమారు 38% కేసులు ఇన్ఫెక్షన్లు (అంటువ్యాధులు), జీవనశైలి అలవాట్లు, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల సంభవించాయని అంచనా. ఇవన్నీ నివారించదగినవే. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్లను సకాలంలో టీకాలు వేయడం ద్వారా అడ్డుకోవచ్చు. అలాగే స్మోకింగ్ వల్ల కలిగే అనేక కణితులను ధూమపానం మాన్పించడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడానికి ‘శక్తివంతమైన అవకాశం’ఉందని పరిశోధకులు అంటున్నారు. కొన్ని క్యాన్సర్లు అనివార్యం.. వయసు పెరిగే కొద్దీ మన డీఎన్ఏలో అనివార్యంగా జరిగే నష్టం లేదా వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యువులు వారసత్వంగా రావడం వల్ల కొన్ని క్యాన్సర్లు అనివార్యం. అయితే 10లో దాదాపు నాలుగు కేసులను నివారించవచ్చన్న అంశం జనంలో ఆసక్తి రేకెత్తిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 30 నివారించగల కారకాలను డబ్ల్యూహెచ్ఓలో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ విశ్లేషించింది. ధూమపానం, అతినీలలోహిత (అ్రల్టావయోలెట్) కిరణాలు వీటిలో ఉన్నాయి. ఇవి మన డీఎన్ఏను నేరుగా దెబ్బతీస్తాయి. ఊబకాయం, శరీరంలో వాపు, హార్మోన్లను మార్చే అతి తక్కువ శారీరక శ్రమ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. వాయు కాలుష్యం వల్ల నిద్రాణమైన క్యాన్సర్ కణాలు మేల్కొంటాయని ఏజెన్సీ వెల్లడించింది. ధూమపానం ప్రధాన కారణం క్యాన్సర్కు దారితీసే తొమ్మిది ఇన్ఫెక్షన్లను కూడా ఏజెన్సీ నివేదించింది. వీటిలో హెచ్పీవీ, కాలేయ క్యాన్సర్కు దారితీసే హెపటైటిస్ వైరస్లు, కడుపు నొప్పి, అల్సర్స్, తీవ్రమైన గ్యాస్ సమస్యలకు కారణం అయ్యే హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా ఉన్నాయి. పరిశోధన బృందం 2022 నుండి 36 రకాల క్యాన్సర్ కేసుల డేటాను.. అలాగే 185 దేశాలలో 2012–22 మధ్య ఈ వ్యాధికి మూలమైన 30 ప్రమాద కారకాల సమాచారాన్ని విశ్లేషించి నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ కేసులకు ధూమపానం ప్రధాన కారణమని వెల్లడించింది. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫెక్షన్లు, మద్యపానం ఉన్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రమాద కారకాలను నివారించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి అని పరిశోధన వెల్లడించింది. దేశాలకు అనుగుణంగా.. పురుషుల క్యాన్సర్లలో 45% నివారించదగినవిగా ఉండగా.. మహిళల్లో ఇది 30% ఉంది. నివారణ స్థాయి పురుషులలో అధిక స్థాయిలో ఉండడానికి కారణం.. ధూమపాన ప్రియులు పురుషుల్లో ఎక్కువగా ఉండడమే. యూరప్లో నివసించే మహిళల్లో క్యాన్సర్ దరి చేరకుండా ఫుల్స్టాప్ పెట్టే మొదటి మూడు కారణాల్లో ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం ఉన్నాయి. సబ్–సహారా ఆఫ్రికాలో మహిళల్లో నివారించగల క్యాన్సర్లలో ఇన్ఫెక్షన్ల వాటా దాదాపు 80% ఉంది. అంటే ఈ క్యాన్సర్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తీసుకునే చర్యలు ప్రతి ప్రాంతం లేదా దేశానికి అనుగుణంగా ఉండాలని నివేదిక వివరించింది. సగం వాటా వాటిదే.. నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం ధూమపానం, వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్తో ముడిపడి కడుపు క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్తో గర్భాశయ క్యాన్సర్.. నివారించగల మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి దాదాపు సగం ఉంటాయి. ధూమపానం నియంత్రణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేపట్టిన దేశాల్లో క్యాన్సర్ కేసులు తగ్గాయని నివేదిక తెలిపింది. ధూమపానం ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. మహిళల్లో 30% నివారించవచ్చు.. ⇒ నివేదిక ప్రకారం.. మహిళల్లో 92 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 30% నివారించవచ్చు. ⇒ సబ్ సహారా ఆఫ్రికా వంటి తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో సరై్వకల్ క్యాన్సర్ కేసులు అధికం. ⇒ అధిక ఆదాయ దేశాలైన ఉత్తర అమెరికా, యూరప్లో మహిళల్లో క్యాన్సర్కు స్మోకింగ్ ప్రధాన కారణం. ⇒ పురుషుల్లో 43 లక్షల నివారించదగ్గ క్యాన్సర్ కేసుల్లో 25% ధూమపానం కారకంగా నిలిచింది. ⇒ ఇన్ఫెక్షన్తో కూడిన క్యాన్సర్ కేసులు పురుషుల్లో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో ఎక్కువ. -
దేశంలో 40% మందిలో ఫ్యాటీ లివర్!
సాక్షి, స్పెషల్ డెస్క్: దేశంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దాదాపు 40 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఫ్యాటీ లివర్ (కొవ్వు పేరుకుపోయిన కాలేయం) సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతీయులలో తక్కువ బరువు ఉన్నప్పటికీ పొత్తికడుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటోందని.. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.అధ్యయనంలో తేలిన అంశాలివీ..లాన్సెట్ (ఆగ్నేయాసియా) జర్నల్లో ప్రచురితమైన ఫెనోమ్ ఇండియా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ మధ్య 27 నగరాల్లో జరిపిన పరిశోధనలో సుమారు 38.9 శాతం మందిలో ఆల్కహాల్తో సంబంధం లేని మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) ఉన్నట్లు తేలింది. కాలేయం గట్టిపడటం లేదా మచ్చలు పడటం (ఫైబ్రోసిస్) ముప్పు సాధారణ వ్యక్తుల్లో 1.7% మందిలో ఉంది. ఇప్పటికే ఎంఏఎస్ఎల్డీ సమస్య ఉన్నవారిలో లివర్ ఫైబ్రోసిస్ 6.3 శాతం మందిలో.. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తంగా 2.4 శాతం మందిలో ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపించాయి. సైలెంట్ కిల్లర్..గతంలో నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యను ఇప్పుడు ఎంఏఎస్ఎల్డీగా పిలుస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య ఉన్న వారిలో చాలా మందికి తమ కాలేయం దెబ్బతింటోందనే విషయం ప్రాథమిక దశలో తెలియదు. ఈ వ్యాధి కాలేయాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఎంఏఎస్ఎల్డీ కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తోంది. దేశ జనాభాలో గణనీయమైన శాతం మందిలో లివర్ ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కాలేయం గట్టిపడే (స్కారింగ్) ప్రక్రియకు ప్రారంభ దశ. దీన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే అది కాలక్రమేణా కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా ప్రాణాంతక కాలేయ కేన్సర్కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశ జనాభా విస్తృతిని, వేగంగా పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాటీ లివర్ రోగుల స్థాయి ఆందోళనకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి జీవక్రియ సంబంధిత సమస్యలే ఫ్యాటీ లివర్కు ప్రధాన మూలాలని పరిశోధకులు స్పష్టం చేశారు. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
వేదికపై మంత్రి, ఐపీఎస్ మధ్య గొడవ..‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’
చండీఘడ్: గ్రీవెన్స్ సెల్ ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక) వేదికపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాను ఆదేశిస్తున్న ఆదేశాల్ని ఓ ఐపీఎస్ అధికారిణి పట్టించుకోలేదని కోపంతో ఓ మంత్రి ఊగిపోయాడు. సదరు ఐపీఎస్ అధికారిణిపై చిర్రుబుర్రలాడారు. మంత్రికి ఐపీఎస్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వినలేదు. సదరు పోలీసు అధికారిణి ‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’ అంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది. హర్యానా రాష్ట్రంలో శుక్రవారం జరిగిన జిల్లా ఫిర్యాదు పరిష్కార సమావేశంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అనిల్ విజ్,కైతల్ జిల్లా పోలీసు అధికారి (SP) ఉపాసన ఐపీఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.మంత్రి అనిల్ విజ్ నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో టిట్రామ్ గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సందీప్పై ఫిర్యాదు చేశారు. ఎస్సై సందీప్ కబ్జాలతో పాటు ఇతర అనైతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తన స్థిరాస్తులపై ఎస్సై కన్నుపడినట్లు వాపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.బాధితుడి ఫిర్యాదుపై మంత్రి అనిల్ విజ్ స్పందించారు. వేదికపై ఎడమవైపు ఉన్న కైతల్ జిల్లా ఎస్పీ ఉపాసన (ఐపీఎస్)కు వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.అందుకు కైతల్ ఎస్పీ ఉపాసన.. ఆ ఎస్సై కురుక్షేత్ర జిల్లాకు చెందినవారని, తన పరిధిలో లేడని, అందువల్ల అతన్ని సస్పెండ్ చేసే అధికారం తనకు లేదన్నారు. ఎస్సైని సస్పెండ్ చేసే అధికారం కురుక్షేత్ర ఎస్పీ మాత్రమే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు డీజేపీకి లేఖ రాయండి. నేను అతన్ని సస్పెండ్ చేయమని చెబుతున్నాను. మీరు నా ఆదేశాలను అమలు చేయాలి’ అని మంత్రి అన్నారు. మీకు ఆ ఎస్సైని సస్పెండ్ చేసే అధికారం లేకపోతే ఇక్కడి నుండి వెళ్లిపోండి’ అని విజ్ అన్నారు. మీరు చెప్పినట్లుగా డీజీపీకి లేఖ రాస్తాను. కానీ నేను అతనిని నేనే సస్పెండ్ చేయలేను’ అని ఎస్పీ ప్రతిస్పందించారు.నేను చెప్పాను. మీరు నా ఆదేశాలను పాటించాలి. మీరు మీ సొంత ఆదేశాలు ఇవ్వకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. As I previously highlighted in my tweet regarding Haryana and the positive reforms introduced by the BJP in governance, the core issue of bureaucratic accountability to the political leadership persists. For instance, Mr. Vij, a seasoned politician who has served as a minister… pic.twitter.com/hPSdCX7uaI— Lt Col Sushil Singh Sheoran, Veteran (@SushilS27538625) February 13, 2026 -
PM RAHAT: ప్రమాద బాధితులకు వెంటనే 1.5 లక్షల క్యాష్లెస్ వైద్యం
ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్ అవర్స్లో సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడేందుకు కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎం రాహత్ పేరుతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో రూ.1.5లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. శుక్రవారం పీఎంవో నూతన కార్యాలయం సేవాతీర్థ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సేవాతీర్థ్ నుంచి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘సేవాతీర్థ్ కొత్త చరిత్రకు సాక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం సేవాతీర్ధ్. స్టార్టప్ ఇండియా 2.0 కోసం 10 వేల కోట్లతో కార్పస్ ఫండ్. సకాలంలో వైద్యం అందక ప్రాణం పోకూడదన్న ఉద్దేశ్యంతో 1.5లక్షల వరకు నగదు రహిత వైద్యం. పీఎం రాహత్, లక్పక్ దీదీలకు 6 లక్షలు పెంచేందుకు యత్నం. ప్రారంభం వ్యవసాయ మౌలిక సదుపాలయ నిధి రెట్టింపు’ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పీఎం రాహత్ ఎలా పని చేస్తోందిప్రధానమంత్రి రాహత్ (PM RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది. ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులు డబ్బు కోసం పరుగులు తీయకుండా బాధితుడు వెంటనే చికిత్స పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తగ్గుతుంది. ఈ పథకం వల్ల ‘డబ్బు లేకపోవడం వల్ల ప్రాణం కోల్పోవడం’ అనే పరిస్థితి తగ్గుతుంది. అంటే, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సహాయం అందుతుంది. -
వీటిది అచ్చమైన 'డేగకన్ను..!
ఇప్పడు మన భారత సైన్యం లోకి వేట పక్షులు రాబోతున్నాయి. వాటి వేగం తో ఎవర్నైనా ఆశ్ఛర్యపర్చగల .. వీటికి చాలా బాద్యతలను కూడా అప్పగిచింది మన సైన్యం ..శత్రు దేశాల డ్రోన్లని నేలకూల్చే బాద్యత వీరిదే.. రీసెంట్ గణతంత్ర దినోత్సవం లో కర్తవ్య పథ్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందరినీ ముక్కున వేలేయించిన ఈ సైనిక పక్షుల సంగతేంటో చూద్దామా..చొరబాట్లు మన దేశానికి కొత్తేమీ కాదు. మన సైనికులు కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ సరిహద్దుల్ని కాపలాకాస్తున్నాసరే .. ఇవి ఆగట్లేదు . పైగా శత్రువుల డ్రోన్లూ వచ్చాయి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు మన దేశం ఆథునిక పరికరాలను తయారుచేస్తూనే ఉంది .. అలాగే యుథ్థ వీరుల్ని సన్నథ్తం చేస్తుంది. అవే ఈగల్స్ . ఈ ఈగల్స ని , ఫాల్కన్లను, గరుడపక్షులను 6 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా వీటిని ఉత్తరాఖండ్ లో జరిగిన యుథ్త విన్యాసాల్లో ఈ వెల్ ట్రైన్డ్డ్ ఈగల్స్ ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. శత్రు డ్రోన్లు కనిపించగానే రివ్వున ఎగురుతూ వెళ్లి వాటిని కూల్చివేసిన ఆ పక్షుల తెగువా, వేగం చూపరుల్ని విస్మయానికి లోనుచేశాయి! వాటిల్లోనూ కరణ్, అర్జున్ అనే రెండు నల్లగద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్లని కూల్చి సత్తా చాటాయి.ఇక ఇలా పక్షుల్ని యుధ్దాలలో వాడటం కొత్తేమీ కాదు .రెండో ప్రపంచ యుధ్దంలో బ్రిటన్ , అమెరికా లాంటి దేశాలు పావురాల్ని వాడారు. అదే సమయంలో శత్రు దేశాల కు చెందిన పావురాలను వేటాడేందుకు జర్మనీ ఈగల్స్ ను ను ఉపయోగించింది. ఆ తర్వాత వీటిని ఎవరూ పట్టించుకోలేదు కానీ .. ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వల్ల చాలా తలనొప్పిగా మారాక . కొన్ని దేశాలు మళ్లీ ఈ ఈగల్స్ ని తమ సైన్యం లోకి చేర్చుతున్నాయి. ఇంతకీ ఈ పక్షుల్నే ఎందుకు ఎంచుకోవాలీ అంటారా... ఇవి వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి! ఏ పక్షినీ ఇవి నేరుగా వెళ్లి ఢీకొట్టవు...అందుకే, పక్కగా వెళుతూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కిందపడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన 'డేగకన్ను'... 'ఏ అత్యాధునిక కెమెరాకీ తీసిపోనంత నిశితంగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి.వీటికి ఏ ప్రమాదమూ జరగకుండా కాళ్లకి లెదర్ కవచాలూ తొడుగుతున్నారు. రెండు కేజీలకన్నా తక్కువ బరువున్న డ్రోన్ల కూల్చివేతకే వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్లని కూల్చివేసిన ఈ పక్షులకి ఇప్పటిదాకా ఏ ప్రమాదమూ జరగకపోవడం విశేషం. అందుకే ప్రతి పక్షిపైనా శిక్షణ, ఇతర అవసరాల కోసం ఏటా రూ.5 లక్షలదాకా ఖర్చుచేస్తున్నారు. అంత ఖర్చా... అనుకోకండి! కోట్ల రూపాయల యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువే! -
CJIకి సుప్రీం కోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై ఫిర్యాదుల వెల్లువ
న్యూఢిల్లీ: గడిచిన గత పదేళ్ల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ న్యాయవాదులపై సుమారు 8,360 చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా 1,170 ఫిర్యాదులు, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయిఅవినీతి, లైం**పరమైన, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు,హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? గత పదేళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది?’ అంటూ లోక్సభలో ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ మాథేశ్వరన్ వీఎస్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అందుకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరణ ఇచ్చారు.గడిచిన పదేళ్ల కాలంలో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని వెల్లడించారు.అనంతరం, న్యాయమూర్తులపై ఫిర్యాదులను సేకరించడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS) కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా? జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులను క్రమపద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందా? అని కూడా అడిగారు.ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్టు 'ఇన్-హౌస్ ప్రొసీజర్' ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా, సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? వంటి వివరాల్ని వెల్లడించలేదు. -
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ‘అక్కా కేఫ్’?‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్ల నెట్వర్క్ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.దశలవారీ అమలుప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.ఎక్కడెక్కడ?ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్లో రెండు, కార్వార్లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.మెనూలో ఏమేముంటాయంటే..‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.లక్ష మంది మహిళలకు శిక్షణకాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది. -
నెలకు రెండున్నర లక్ష : సొంత బిజినెస్, ఐటీ మేనేజర్ కంటే మేలే!
ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూచుంటే జీవితం ముందుకు సాగదు. అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకొని అడుగు ముందుకు వేయాలి. మన ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి వస్తే..ఇంకేముంది విజయం మనముందు సాగిల పడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.. ఒక మధ్య తరగతి జంట ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పు గొప్ప విజయానికి నాంది పలికింది. ఎవరా జంట? ఏమా బిజినెస్ తెలుసుకుందాం.నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా తాను క్రమం తప్పకుండా సందర్శించే డ్రై-క్లీనింగ్ దుకాణం యజమానితో జరిగిన సంభాషణను వివరించారు. డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని భార్యాభర్తలిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మరో ఇద్దరు అదనపు ఉద్యోగులున్నారు. ఇండియాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్తో సమానమైన నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నారని ఉనగర్ తన పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి వారికి ఖర్చులన్నీ పోను నెలవారీ లాభం రూ.2.37 లక్షల లాభం వస్తుంది. సగటున, వారు ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తారట.Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026నెటిజన్ల స్పందనహైదరాబాద్లోని ఇడ్లీ-దోస విక్రయించే అనేకమంది విజయగాథలను చూశాను. తన ఏరియాలో అలాంటి ఒక వ్యక్తి ఇంటి ఖరీదు కోటికిపైమాటేననీ, తాను గల్ఫ్లో దశాబ్దాలు కష్టపడినా అద్దె ఇల్లే. స్వంత వ్యాపారం చేయడం చాలా గ్రేట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. వైట్-కాలర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అనే చట్రంలో ఇరుక్కుపోయాం. కానీ ఇలాంటి కథలు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని కలిగి ఉండటం నిజమైన సంతృప్తితోపాటు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రతిఫలదాయకం కూడా అని ఒకరు, ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముంది అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉంటే చిన్న వ్యాపారమైనా, లాభాలు మెండు అని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ లెక్కలపై పెదవి విరిచిన వారు లేకపోలేదు. ‘‘నేను నా ఇంటి దగ్గర దుకాణం నడుపుతున్న నా డ్రై-క్లీనింగ్ భయ్యాతో కూడా మాట్లాడాను. అతను ఆ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పుదారి పట్టించేది అని చెప్పాడు. రూ. 2.37 లక్షల లాభం గురించి కలలు కనకండి. వాస్తవానికి, అన్ని ఖర్చుల పోనూ వాస్తవ లాభం నెలకు దాదాపు రూ. 60వేలు ఉంటుందని ఒక యూజర్ లెక్కలు చెప్పారు.ఇదీ చదవండి: ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!వైట్ కాలర్ జాబ్స్ అని, మంచి ఆదాయం అని మన గొప్ప వాళ్లం అని మురిసిపోవాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం, వ్యాపార మెళకువలు ఉంటే ఏ పనైనా గౌరవప్రదమే, లాభదాయకమే. భారీ ఆదాయం మాట ఎలా ఉన్నా.. ఉద్యోగ భయం. ఆందోళన, అధికార్ల వేధింపులు. శని, ఆదివారాలు కూడా లాప్టాప్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు..! -
సేవా తీర్థ్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్థ్లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.కర్తవ్య భవన్లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్బి శాఖ, వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
ఘోరరోడ్డు ప్రమాదం గాల్లోకి ఎగిరిన బైక్.. ఏడుగురు మృతి
సాక్షి బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం దొబ్బాస్పేట-హోస్కోట్ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ పై అతి వేగంతో వస్తున్న SUV, లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.బెంగళూరు అర్బన్ జిల్లా హోస్కోట్ తాలూకాలోని ఎం సత్యవారా గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు SUVలు, ఒక క్యాంటర్ ట్రక్ , మోటార్ సైకిల్ పరస్పరం ఢీకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఒక కాలేజ్ కు చెందిన ఆరుగురు యువకులు మహేంద్రా SUVలో అతివేగంగా వస్తున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ తొలుత బైక్ ను ఢీకొట్టి అదే స్పీడుతో అనంతరం ట్రక్కును ఢీకొట్టారు. SUV ఢీకొట్టిన వేగానికి బైకునడుపుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరిపడ్డాడు. అనంతరం అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆ ట్రక్కు సైతం బోల్తా పడింది.అధిక వేగంతో ఢీకొట్టడంతో SUV గుర్తుపట్టలేకుండా నుజ్జునుజ్జయ్యింది.ఇదిలా ఉండగా వెనుక వస్తున్న మరో కారు వెనక వస్తున్న మరో కారు SUVని ఢీకొట్టింది. మెుత్తంగా ఈ ప్రమాద ఘటనల SUVలో ప్రయాణిస్తున్న ఆరుగురితో పాటు బైక్ పై పయణిస్తున్న వ్యక్తి మెుత్తంగా ఏడుగురు మృతిచెందారు. గాయపడిన వారిని స్థానికంగా గల ఎంవీజే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విపరీతమైన వేగంతో ప్రయాణించడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. . Horrific chain #accident in #BengaluruSeven feared dead near Sathyawara on the Hoskote-Dabaspet STRR stretch.The crash involved a truck, 2 SUVs and a bike. The truck’s chassis got cut & the vehicle toppled. @timesofindia (FwD 📹: Part 1) pic.twitter.com/s6hapuFqvd— TOI Bengaluru (@TOIBengaluru) February 13, 2026 -
ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!
సినిమాలకు ప్రేరణ నిజ జీవిత గాథలు. కొన్ని విజయ గాథలకు ప్రేరణ సినిమాలు. అలా అచ్చం సినిమాలా సాగిన ఒక నిరుపేద జీవితం, ఆయన సక్సెస్ జర్నీ ఆ తరువాత సినిమాకు ప్రేరణగా నిలిచింది. పట్టుదల , కఠిన శ్రమతో, అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చనే స్పూర్తిని రగిలించింది. మరి ఆ విజయగాథ ఏంటో తెలుసుకుందాం పదండి.బిహార్లోని పాట్నాలోని విశున్పూర్ పక్రి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆదిత్య పాండే. ముగ్గురు సోదరీమణులలో అతను చిన్నవాడు. దృఢ సంకల్పంతో UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఈ విజయం వెనుక ఒక తిరస్కారం.. ఆ తిరస్కారంనుంచే విజయాన్ని వెదుకున్న తీరు గురించి తెలుసుకుంటే హృదయం ఉప్పొంగక మానదు.ఆదిత్య 8 , 9 తరగతులలో బాగానే చదివాడు. 10వ తరగతిలో ప్రేమ మొదలైంది. ఆ మైకంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. ఫలితాల్లో వెనుకబడ్డాడు. ఫలితంగా తండ్రి అతన్ని పాట్నాకు తిరిగి పంపాడు. అటు ప్రియురాలు కూడా అవమాన పర్చింది. అది అతణ్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఎదురుదెబ్బతో తన జీవితాన్నిదిద్దుకోవడానికి వాడుకన్నాడు. ఆదిత్య తన శక్తిని కొత్త లక్ష్యం వైపు మళ్లించాలని అపుడు ప్రతిన బూనాడు. తాను కచ్చితంగా తాను ఐఏఎస్ చదవాలని.ఇంజనీరింగ్ నుండి IAS వరకు12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయ కంకర్బాగ్లో విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత, ఆదిత్య బాగా రాణించాడు. పంజాబ్లోని LPU నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిగ్రీ పొందినప్పటికీ, తన నిజమైన అభిరుచి ఇంజనీరింగ్లో లేదని ఆదిత్య గ్రహించాడు. విడిపోవడం వల్ల కలిగే బాధ అతన్ని వెంటాడు తున్నప్పటికీ, తన కోరికతో 2018లో IIT రూర్కీ నుండి MBA పట్టా పొందాడు. ICICI బ్యాంక్లో ఉద్యోగంలో చేరాడు.2020లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. UPSC పరీక్షలో మూడుసార్లు విఫల మైనప్పటికీ, నిరాశపడలేదు. తత్వశాస్త్రం తన ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉండటంతో, అతను UPSC ఫలితం 2021లో కేవలం 2.5 మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఢిల్లీలో ఐచ్ఛిక సబ్జెక్టుల తయారీ కోసం మాత్రమే కోచింగ్పై ఆధారపడుతూ, ఇతర సన్నాహాల కోసం పూర్తిగా స్వీయ అధ్యయనంపై దృష్టి పెట్టాడు. అలా పూర్తి అంకితభావం, కృషి, దృఢ సంకల్పంతో తన మూడవ ప్రయత్నంలో UPSC పరీక్షలో 48వ ర్యాంకును సాధించగలిగాడు. అలా 2022లో కృషి, దృఢ సంకల్పం ఫలించింది.ఆదిత్య జీవితం స్ఫూర్తిదాయకమైన కథ. కష్టాలు,నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చినా కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పమే ధైర్యం. అదే గొప్ప విజయాలకు పునాదిని నిరూపించివాడు. అలాగే తన చదువుపై తండ్రికున్న ఎన్నో సందేహాలను పటా పంచలు చేసినవాడు. అంతేకాదు ఆదిత్య సీరియస్గా చదువితే.. మీసం గీసుకుంటానని సవాల్ చేసిన ఉపాద్యాయుడికి తన ఐఏఎస్ను సగర్వంగా చూపించాడు.షాదీ మే జరూర్ ఆనా2017లో విడుదలైన షాదీ మే జరూర్ ఆనా మూవీకి ఆదిత్య కథే స్ఫూర్తి. నటుడు రాజ్కుమార్ రావు సత్యేంద్ర మిశ్రా (సత్తు) పాత్రను పోషించారు, ఆర్తి శుక్లా (కృతి ఖర్బంద)తో విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత IAS అధికారి అవుతాడు. -
ఏనుగుల దాడి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
రాంచీ: జార్ఖండ్ లోని హజీరా బాగ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ( శుక్రవారం) ఏనుగుల దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మరణించిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు.ఆ రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏనుగుల దాడులు తీవ్రతరమయ్యాయి. ఏనుగుల గుంపులు గ్రామంలోనికి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక ఎనుగుల గుంపు చుర్చూ బ్లాక్ ప్రాంతంలోని గోండ్వార్ గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేశాయి. ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గాయపడ్డ ఆరుగురు ఈ రోజు ఉదయం మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇందులో ఒక చిన్నారి తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.గాయపడిన అధికారులలలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అక్కడి అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏనుగుల గుంపు దాడిలో ఆరుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు బోక్రో, రామ్ ఘర్, హాజ్రీబాగ్ జిల్లాలలో పర్యటిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. బోక్రో జిల్లాలోనూ కొంతమందిపై గజరాజులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. -
తారిఖ్ రెహ్మాన్కు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత రెహ్మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మోదీ.. ఈ విజయం తారిఖ్ రెహ్మాన్ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. పొరుగు దేశంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తన పోస్ట్లో స్పష్టం చేశారు. ‘ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’ అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, అనంతరం జరిగిన సాధారణ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ చారిత్రాత్మక మార్పు నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బంగ్లాదేశ్లోని మొత్తం 299 నియోజకవర్గాలకు గాను, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీఎన్పీ, దాని మిత్రపక్షాలు 177 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నాయి. మొత్తం 237 స్థానాల లెక్కింపు పూర్తి కాగా, మిగిలిన 62 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహ్మాన్ తిరిగి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. బీఎన్పీకి ప్రధాన పోటీదారుగా భావించిన జమాతే ఇస్లామీ, దాని మిత్రపక్షాలు కేవలం 53 స్థానాలకే పరిమితమయ్యాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో, ప్రధాన పోరు బీఎన్పీ, జమాతే ఇస్లామీ మధ్యే నెలకొంది. అయితే, బంగ్లాదేశ్ ఓటర్లు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీకే పట్టం కట్టారు. I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh. This victory shows the trust of the people of Bangladesh in your leadership.India will continue to stand in support of a democratic,…— Narendra Modi (@narendramodi) February 13, 2026 -
రష్యాతో రక్షణ ఒప్పందం.. ఇక శత్రు దేశాలకు చుక్కలే..
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) రష్యా నుండి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ (ఏఓఎన్) కింద పచ్చజెండా ఊపింది. సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వినియోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడంతో పాటు, వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందపు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ (ఎఫ్టీపీ) ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.గత ఏడాది పాకిస్తాన్తో తలెత్తిన ఉద్రిక్తతల (ఆపరేషన్ సిందూర్) సమయంలో ఎస్-400 వ్యవస్థ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసి రికార్డు సృష్టించింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో మోహరించిన ఈ వ్యవస్థకు భయపడి పాక్ తన యుద్ధ విమానాలను అఫ్గానిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. తాజాగా కొనుగోలు చేయబోయే 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కి.మీ శ్రేణి క్షిపణులు భవిష్యత్తులో డ్రోన్ దాడులను, శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సహకరించనున్నాయి.భారత వైమానిక దళం క్షిపణి రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న ఎస్-400 వ్యవస్థలతో పాటు, రష్యాకు చెందిన 'పాంత్సిర్' (Pantsir) స్వల్ప శ్రేణి వ్యవస్థలను కూడా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఈ రెండు వ్యవస్థల కలయికతో సరిహద్దుల్లో 'టూ-లేయర్' రక్షణ కవచం ఏర్పడనుంది. ఇది ముఖ్యంగా కామికాజ్ డ్రోన్లు, ఇతర వైమానిక దాడుల నుండి భారత గగనతలాన్ని కాపాడుతుంది. ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో భారత్ కు మరిన్ని ఎస్-400 వ్యవస్థలు అందనున్నట్లు సమాచారం.కేవలం క్షిపణులే కాకుండా, త్రివిధ దళాల ఆధునీకరణ కోసం మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ), రాఫెల్ యుద్ధ విమానాలు, హై-ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. వీటిలో మెజారిటీ యుద్ధ విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారత్లోనే తయారు చేయనున్నారు. అదేవిధంగా నౌకాదళం కోసం పి-8ఐ విమానాలు, ఆర్మీ కోసం విభవ్ యాంటీ-ట్యాంక్ మైన్లు, టీ-72 ట్యాంకుల ఆధునీకరణకు కూడా నిధులు కేటాయించారు.ఇది కూడా చదవండి: ‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం! -
‘ప్రేమ’ ఎంత మధురం.. ‘వ్యాపారం’ అంత కపటం!
ప్రేమ అంటే రెండు మనసుల కలయిక అనే నిజమైన అర్థం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో ప్రేమ అంటే ‘వ్యాపార ధోరణి’ అనే కొత్త అర్థాన్ని కొన్ని కంపెనీలు సృష్టించాయి. రాబోయే ఫిబ్రవరి 14న ప్రేమికులు జరుపుకోబోయే ‘వాలంటైన్స్ డే’కి వ్యాపార సరంజామాను అంటగడుతూ కొన్ని సంస్థలు మార్కెట్లో తమ హవాను చాటుకుంటున్నాయి.ప్రేమకు మార్కెటింగ్ వ్యూహంనిజానికి ప్రేమలోని మాధుర్యం ఒక అందమైన భావోద్వేగం. దీనికి సాహిత్య సృజనతోడయితే ప్రేమ మరింత పరిమళిస్తుంది. అయితే ఇప్పుడది మార్కెటింగ్ వ్యూహాల మధ్య చిక్కుకు పోయింది. ఒకప్పుడు పరస్పర అనురాగాన్ని వ్యక్తపరిచే ప్రశాంతమైన సందర్భంగా ఉన్న ప్రేమికుల రోజు ఇప్పుడు భారీ వాణిజ్య ఈవెంట్గా రూపాంతరం చెందింది. నేటి కాలంలో ప్రేమను ఖర్చు చేసే సామర్థ్యం, సామాజిక మాధ్యమాల్లో కనిపించే ఆడంబరం, ట్రెండ్స్ను అనుసరించడం ద్వారా కొలుస్తున్నారు. ఈ మార్పు ప్రేమకున్న అర్థాన్ని తగ్గించిందని, ఖరీదైన వస్తువులను గిఫ్ట్లుగా ఇస్తేనే ప్రేమ బంధం బలపడుతుందనే అపోహలో యువత ఉన్నారని పలువురు అంటున్నారు.అంతర్జాతీయ వాణిజ్య వేడుకఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల రోజుతో ముడిపెట్టడం అనేది మధ్యయుగంలో ఐరోపా కవిత్వంగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా జెఫ్రీ చోసర్ రచనల ద్వారా ఇది ప్రారంభమైంది. శతాబ్దాలు గడిచేకొద్దీ ఈ సాహిత్య భావన ఒక సాంస్కృతిక ఆచారంగా, తరువాత అంతర్జాతీయ వాణిజ్య వేడుకగా పరిణమించింది. నేడు మనం చూస్తున్న చాక్లెట్లు, గులాబీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్రాచీన సంప్రదాయాలు కావు. ఇవి వివిధ కంపెనీలు తమ మార్కెట్ను పెంచుకునేందుకు సృష్టించిన ఆధునిక కల్పనలు మాత్రమేనని చాలామంది చెబుతుంటారు.సోషల్ మీడియా ప్రభావంఇప్పుడున్న రోజుల్లో ప్రేమ అనేది ఒక వ్యక్తిగత ఇష్టం నుండి సామాజిక బాధ్యతగా మారిపోయింది. సాధారణ వస్తువులను భావోద్వేగ అవసరాలుగా పలు కంపెనీలు తమ ప్రకటనల్లో చిత్రీకరిస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ‘వాలెంటైన్స్ వీక్’, ‘లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్స్’ వంటి పేర్లతో కృత్రిమ గడువులను సృష్టిస్తూ, బహుమతి కొనకపోవడం అనేది ఒక వైఫల్యంగా భావించేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమ అనేది ప్రదర్శన వస్తువుగా మారిపోయింది. మరోవైపు ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాలు కూడా బ్రాండెడ్ వస్తువులతో ప్రేమను ముడిపెట్టేలా సాగుతున్నాయి. ఫలితంగా ప్రేమికులు ఆర్థిక పరిమితులకు మించి ఖర్చు చేస్తూ, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.ఒక బాధ్యత- దీర్ఘకాలిక నిబద్ధతఈ వాణిజ్య ధోరణి భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందని పలువురు అంటుంటారు. భారతదేశంలో ప్రేమ, అనురాగం, భక్తిని చాటేందుకు పలు మార్గాలు ఉన్నాయి. మన పండుగలు, సంప్రదాయాలు ప్రేమను ఒక బాధ్యతగా దీర్ఘకాలిక నిబద్ధతగా తెలియజేశాయి. ప్రేమ అనేది ఒక రోజు ప్రదర్శించే ఆడంబరం కాదని, అది నిరంతరం పాటించే ధర్మం అని పేర్కొన్నాయి. ప్రస్తుత వాలెంటైన్స్ డే సంస్కృతి కృత్రిమ భావోద్వేగాలను కలగుజేస్తున్నయని పలువురు అంటున్నారు.వస్తువుల కంటే విలువలకు..నిజమైన ప్రేమకు, వాణిజ్య ప్రేమకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నిజమైన ప్రేమ అనేది ఎదుటివ్యక్తి నిరంతర సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. అది జీవితాంతం ఉండే ఒక మధురమైన భావన. ప్రేమ అనేది మార్కెట్లో అమ్మే వస్తువు కాదని, అది చిత్తశుద్ధితో నిర్మించుకోవాల్సిన ఒక నిరంతర సాధన అని పెద్దలు చెబుతుంటారు. వస్తువుల కంటే విలువలకు, ఆడంబరం కంటే అనురాగానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ప్రేమకు సార్థకత చేకూరుతుందని అంటారు. ఇది కూడా చదవండి: లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి.. -
రోజ్డే సెలబ్రేట్ చేస్తే.. పోలీసుల విచారణ..!
పాట్నా: ఆ మహిళ తన భర్తకు రోజ్డే సందర్భంగా ఓ సర్ఫ్రైజ్ ప్లాన్ చేసింది. సెలబ్రేషన్స్ చేసి ఆ రోజును తనకు తీపి జ్ఞాపకంలా మలచుకోవాలని భావించింది. అనుకున్న విధంగానే చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె రోజ్డే కోసం చేసిన సెలబ్రేషన్స్ఇప్పుడు ఆమెకు చట్టపరంగా చిక్కులు తెచ్చిపెట్టాయి.బీహార్ ముంగూర్ జిల్లాకు చెందిన కంచనా దేవి అనే మహిళ రోజ్డేను తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా తన భర్తకు రోజాపూలను ఇచ్చింది. అయితే అంతకు ముందు తన భర్తకు గ్లాసులో మద్యం పోసి ఇచ్చింది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఆ వీడియోలలో ఆమె మద్యం ఇవ్వడం వివాదాస్పదమైంది. ఎందుకంటే అక్కడ 2016నుంచి మధ్యంపై బ్యాన్ విధించారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ముంగేర్ జిల్లా ఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఆ వీడియాలో పిస్తోల్ ఉన్నట్లు గుర్తించామని విచారణలో అది లైసెన్స్డ్ రివాల్వార్ అని తేలినట్లు పేర్కొన్నారు. రోజ్డే సందర్బంగా భర్తతో కలిసి సరదాగా గడుదామనుకుంటే ఇప్పుడు తనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రోజ్ డే (Rose Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకునే వాలెంటైన్ వారంలో మొదటి రోజు. ఇది ప్రేమ, ఆప్యాయత మరియు స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ మనసులోని భావాలను వ్యక్తపరుస్తారు. -
నిఫావైరస్ సోకిన నర్సు గుండెపోటుతో మృతి
ఇటీవల కోల్కతాలో ప్రమాదకర నిఫా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో ఒక నర్సు నిన్న (గురువారం) గుండెపోటుతో మృతిచెందారు. అయితే మరోకరు మాత్రం ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.పూర్బబర్ధమాన్ జిల్లా కట్వాకు చెందిన ఒక నర్సు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించగా జనవరి 31 వతేదీన ఆ నర్సు నిఫా వైరస్ బారినపడినట్లు తేలింది. అయితే ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స అందించగా నిఫా వైరస్ నుంచి ఆమె కోలుకున్నారు.కాగా అప్పటినుంచి ఇతర అనారోగ్య కారణాలతో ఆమె కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే డాక్టర్లు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురైన ఆనర్సు గురువారం మద్యాహ్నం తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆ నర్సు బరాసత్లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. అయితే డిసెంబర్లో నిఫా వైరస్ బారిన పడిన మరో పేషెంట్ మాత్రం ప్రస్తుతం కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. -
ఆరోగ్యాన్నలా.. డీప్ ఫ్రై చేయొద్దు!
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు, గారెలు, పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు, వడియాలు.. మనం ఇష్టంగా తినే ఇటువంటివి వండేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఆహారమే విషతుల్యంగా మారి అనారోగ్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక జబ్బులకూ కారణం కావొచ్చు. వేపుళ్లకు లేదా డీప్ ఫ్రైలకు నూనెలు, కొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వేపుళ్లకు ఏయే నూనెలు విడిగా వాడొచ్చు? ఏయే నూనెలను కలిపి వాడొచ్చు? అనే విషయాలూ ముఖ్యమే.. అవేమిటో చూద్దాం.. గుండె జబ్బులు, కేన్సర్ ముప్పు?నూనెలు, కొవ్వుల్లో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (పీయూఎఫ్ఏ– ‘పూఫా’లు) ఉంటాయి. ఒకసారి వేపుడుకు వాడితే ప్రమాదం లేదు. ఒక్కసారి వేపుడు లేదా డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మళ్లీ వేపుళ్ల కోసం వాడితే అవి హానికరంగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కొవ్వుల్లోని ‘పూఫా’లు వేపుడు కోసం రెండు అంతకన్నా ఎక్కువసార్లు అధికంగా వేడి చేసినప్పుడు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెందిన పూఫాలతో కూడిన ఆహారం తీసుకున్న వారు గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ మాజీ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు.వేపుళ్లకు ఏయే నూనెలు మేలు?కరకరలాడే వంటకాల తయారీ కోసం వంట నూనెలను ఎక్కువ మంటపై పొగలు కక్కేలా వేడి చేయాల్సి ఉంటుంది. స్మోక్ పాయింట్ను మాత్రమే చూడకుండా రసాయన స్థిరత్వాన్ని బట్టి వేపుళ్లకు నూనెను ఎంచుకోవాలి. ఇందుకు ఉపయోగపడే నూనెలు ఏవంటే.. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి లేదా వేరుశనగ నూనె, శుద్ధి చేసిన వరి తవుడు నూనె, అధిక ఓలిక్ పొద్దుతిరుగుడు (మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లం కలిగిన) నూనెలు ఆహారాన్ని వేయించడానికి మంచివని డాక్టర్ ప్రసాద్ వివరించారు.కలిపి వాడుకోదగినవిఇంట్లో రోజువారీ కూరల్లో లేదా డీప్ ఫ్రైలకు కూడా కనీసం రెండు రకాల వంట నూనెలు కలిపి వాడుకుంటే మేలని, నిలువ పచ్చళ్లకు నువ్వుల నూనె మంచిదని డా. ప్రసాద్ చెప్పారు. వాటిలో ఉండే పోషకాలను బట్టి కలిపి వాడుకోదగిన నూనెలు ఇవీ.. పామాయిల్ + సోయా నూనెపామాయిల్ + పొద్దుతిరుగుడు నూనె వరి తవుడు నూనె + నువ్వుల నూనెఆలివ్ నూనె + పొద్దుతిరుగుడు లేదా సోయా ఆయిల్మళ్లీ ఫ్రైలకు వాడొద్దు..మన ఇంట్లో వేపుళ్లకు ఒకసారి వాడిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ఆ నూనెను వడగట్టి కూరల తాలింపుల్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 3–4 రోజుల్లోనే (వేపుళ్లకు కాకుండా) కూరల్లో వాడుకోవాలి. నిల్వ ఉంచితే ఆ నూనె చెడిపోయే అవకాశం ఉంది. అయితే, డీప్ ఫ్రైలకు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేపుళ్లకు వాడితే ప్రమాదం. అవి తిన్న వారు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బుల పాలయ్యే ముప్పు ఉంది. –డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్, మాజీ చీఫ్ సైంటిస్ట్ -
మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: అధునాతన యుద్ధ విమానాలతో దేశ సరిహద్దులను, గగనతలాలను శత్రు దుర్భేద్యంగా చేసే లక్ష్యంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ అదనంగా 114 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.3.6 లక్షల కోట్లతో రూపొందించిన కొనుగోలు ప్రతిపాదనలను గురువారం రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ శాఖ మంత్రి పరిధిలోని ‘రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ)’ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 18 యుద్ధ విమానాలను ఫ్రాన్స్లోనే తయారుచేసి భారత్కు సరఫరాచేయనున్నారు. మిగతా 96 విమానాలను భారత్లో తయారుచేయనున్నారు. వీటిల్లో సగానికిపైగా విమానాలను దశలవారీగా దేశీయంగా తయారుచేసిన విడిభాగాలతో రూపొందించనున్నారు. ఇందుకోసం దేశీయంగా అనుబంధ కర్మాగారాలను నెలకొల్పడంతో దేశీయ రక్షణరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందనుంది. రఫేల్ విమానాలతో పాటు అత్యంత ఎత్తులో తిరిగే సూడో శాటిలైట్(ఏఎస్–హెచ్ఏపీఎస్)లనూ కొనుగోలుచేయనున్నారు. సూడో శాటిలైట్లు సౌరఫలకాలతో పనిచేస్తూ నిఘా, పర్యవేక్షణ, కమ్యూనికేషన్ సేవలను అందిస్తాయి. మరో నాలుగురోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన మొదలుకానున్న వేళ ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం కుదరబోతుండటం విశేషం. దసాల్ట్ సంస్థలో దాదాపు 10 నెలలపాటు విస్తృతస్థాయిలో చర్చలు జరిపాక ఈ ఏడాది చివరిలోపు సమగ్రస్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. విమానాలతోపాటు వాటిలోని విడిభాగాల తయారీకి సంబంధించిన సాంకేతికత బదిలీ వంటి అంశాలపై కూలంకషంగా చర్చిం చాల్సి ఉంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) ఆమోదం పొందాల్సి ఉంది. ‘‘అదనపు విమానాలతో భారతవాయుసేన.. సరిహద్దుల వంటి ఉద్రిక్త ప్రాంతాల్లో దాడి సామర్థ్యాలు ద్విగుణీకృతమవుతాయి. వీటితోపాటు కొనే శక్తివంత క్షిపణులు సుదూరాల్లోని శత్రు స్థావరాలపై అత్యంత కచి్చతత్వంతో దాడిచేసే సత్తాను పెంచుతాయి. ఒక సూడో ఉపగ్రహాలు అనేవి 30 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటో ఆవరణలో చక్కర్లు కొడుతూ శత్రు స్థావరాలపై నిఘా, పర్యవేక్షణ, ఎలక్ట్రిక్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తాయి’’అని రక్షణ శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ఆనాడు రూ.1.63 లక్షల కోట్లతో మొదలై.. 2015లో మోదీ ప్రభుత్వం భారత వాయుసేనలోని స్క్వాడ్రాన్ల సంఖ్య తగ్గిపోతోందని, వీటిని అత్యాధునిక యుద్ధవిమానాలతో భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు భారత్కు 36 రఫేల్ విమానాలను సరఫరాచేసింది. ఇవి ప్రస్తుతం భారత వాయుసేన స్క్వాడ్రాన్లో సేవలందిస్తున్నాయి. గతంలోనూ 114 బహుళ ప్రయోజనకర యుద్ధ విమానాలు(ఎంఆర్ఎఫ్ఏ)లు తమకు అవసరమని భావించి వాయుసేన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(టెండర్)ను జారీచేసింది. అప్పట్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల కొనుగోలు ఒప్పంద ప్రతిపాదనల్లో ఒకటిగా రికార్డ్కెక్కింది. ఈ ప్రాజెక్ట్ను దక్కించుకునేందుకు దసాల్ట్ ఏవియేషన్తోపాటు అమెరికాకు చెందిన లాక్హీల్డ్ మార్టిన్, బోయింగ్, యూరోఫైటర్ కంపెనీలు పోటీపడ్డాయి. భారత్కు రఫేల్ విమానాలు విక్రయించేందుకు దసాల్ట్, ఎఫ్–21లను అమ్మేందుకు లాక్హీల్డ్మారి్టన్, టైఫNన్ జెట్లను విక్రయించేందుకు యూరోఫైటర్ సంస్థలు ఆసక్తి చూపించాయి. గరిష్టంగా 42 స్క్వాడ్రాన్లకు అనుమతి ఉండగా 31 స్క్వాడ్రాన్లను కొనుగోలుచేయాలని రక్షణశాఖ భావించింది. సైన్యం, నేవీ కోసమూ కొనుగోళ్లు.. భారత సైన్యం కోసం దేశీయంగా తయారైన వైభవ్ ట్యాంక్ విధ్వంసక మందుపాతరలు, యుద్ధట్యాంక్లను తరలించే ఆర్మార్డ్ రికవరీ వెహికల్(ఏఆర్వీ), ఉభయచర ఫైటింగ్ వెహికల్(బీఎంపీ–2), టీ–72 ట్యాంక్లనూ కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకూ ‘రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ)’ఆమోదముద్ర వేసింది. భారతనావికాదళం కోసం పీ8ఐ రకం నిఘా, పర్యవేక్షణ విమానంతోపాటు దేశీయంగా తయారుచేసే నాలుగు ఎండబ్ల్యూ మెరైన్ గ్యాస్ టర్బైన్తో పనిచేసే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ల కొనుగోలు ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపారు. -
ఐఐఎం లక్నోలో 3 కొత్త ఏఐ కోర్సులు
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలను విద్యార్థులకు చేరువచేయాలనే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(లక్నో) గురువారం మూడు ఏఐ కొత్త కోర్సులను అందుబాటులోకి తెచి్చందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) ఇన్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, టెక్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ సైన్స్ + టెక్ ఎంబీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చారని ఆయన వెల్లడించారు. గురువారం ఢిల్లీలో జరిగిన భారత్ బోధన్ ఏఐ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘‘నైతిక ఏఐలో భారత్ను ప్రపంచ అగ్రగామిగా అవతరింపజేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. మేనేజ్మెంట్ విద్యతోపాటు ఆవిష్కరణలు, రియల్ వరల్డ్ సోషియాటిక్ అప్లికేషన్లలో ఏఐ కోర్సులను విస్తృతంగా అందించాలని బిజినెస్ స్కూళ్లకు సూచిస్తున్నాం. ఏఐ ఆధారిత భవిష్యత్తుకు తగ్గట్లుగా విద్యార్థులను తయారుచేయడంతోపాటు మానవీయ విలువలను పెంపొందిస్తూ జాతీయాభివృద్ధికి సాంకేతికత దోహదపడేలా చేయండి’’అని బిజినెస్ స్కూళ్లకు మంత్రి పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువ కారి్మకశక్తితో అలరారే భారత్లో దేశీయంగా ఏఐ మోడళ్లను తయారుచేసుకునే అద్భుత అవకాశం దాగి ఉంది. ఇది ప్రపంచ సమస్యలనూ తీర్చగలదు అని చెప్పారు. -
నేడు సేవా తీర్థ్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) చిరునామా మారబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ బ్లాక్ను విడిచిపెట్టి, ఇకపై కొత్త భవనం సేవా తీర్థ్ నుంచే అధికారిక విధులు నిర్వర్తించబోతున్నారు. నూతన పీఎంఓగా తీర్చిదిద్దిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ను మోదీ శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే కర్తవ్య భవన్–1, కర్తవ్య భవన్–2ను సైతం ప్రారంభించనున్నారు. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సెక్రెటేరియట్ కూడా సేవా తీర్్థలోనే కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కర్తవ్య భవన్–1, 2లలో కేంద్ర న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయ శాఖలతోపాటు ఇతర శాఖలను ఏర్పా టు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాలు లుటెన్స్ ఢిల్లీ రైసినా హిల్స్లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లో ఉన్నాయి. వాటిని ఖాళీ చేయబోతున్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా సౌత్ బ్లాక్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. నార్త్ బ్లాక్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని ఇప్పటికే కామన్ సెంట్రల్ సెక్రెటేరియెట్లోని 347 రూమ్ కాంప్లెక్స్కు తరలించారు. -
శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. ‘హైదరాబాద్–చెన్నై (778 కి.మీ.) కారిడార్ అమరావతి మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేస్తే, డ్రైపోర్టు నుంచి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుంది. హైదరాబాద్–బెంగళూరు (586 కి.మీ.), హైదరాబాద్–పుణే (556 కి.మీ.) కారిడార్లను కూడా శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుంది. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించండి..’అని సీఎం కోరారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి గురువారం పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. మూసీ పునరుజ్జీవం, రైలు మార్గాల మంజూరు, విమానాశ్రయాల పనులు వేగవంతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. ఆ మార్గం కేంద్ర నిధులతో చేపట్టండి కృష్ణా–వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రిని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయం మొత్తం తామే భరిస్తామని తెలిపారు. ఈ మార్గంలోని టేకల్కోడ్లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని..కొడంగల్, టేకల్కోడ్, దౌల్తాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సీఎం వినతులపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ‘గాంధీ సరోవర్’శంకుస్థాపనకు రండి హైదరాబాద్లోని ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి ఆ హ్వనించారు. 1948లో జాతిపిత మహత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూఘాట్ వద్ద ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. ఫిబ్రవరి నెలాఖరులో భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. మామునూరు విమానాశ్రయ పనులు ప్రారంభించండి రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్కు సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును సీఎం కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా మామునూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను పంపిస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 18 ఎల్ఎంటీల అదనపు ధాన్యం తీసుకోండి వానాకాలం పంటకు (2025–26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకునేలా ఆదేశించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో సీఎం కలిశారు. వానాకాలం పంటకు సంబంధించి 53.73 ఎల్ఎంటీల ధాన్యం సేకరణకు అనుమతించారని, కానీ వరి భారీగా పండటంతో తాము అదనంగా 18 ఎల్ఎంటీలు సేకరించామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అలాగే 2024–25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతించాలి. 2024–25 వానాకాలం పంటకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్కు ఈ నెల 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అయితే దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలి.2014–15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు ఎఫ్సీఐ బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పడిన రూ.343.27 కోట్లు కూడా విడుదల చేయాలి..’అని కేంద్ర మంత్రికి సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. రాహుల్, కేసీ వేణుగోపాల్తోనూ భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరును వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర పథకాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని వివరించారు. కాగా క్షేత్ర స్థాయి ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంపై సీఎంను రాహుల్, కేసీ వేణుగోపాల్ అభినందించారు. హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్పై సీఎం సూచనలు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను ‘రైట్స్’(ఖఐఖీఉ ) సంస్థకు రైల్వే శాఖ అప్పగించింది. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలైన్మెంట్లు, డీపీఆర్కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, కార్యదర్శి (కో ఆర్డినేషన్) డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ‘రైట్స్’ఈడీ లలిత్కుమార్ పాల్గొన్నారు. -
వైకల్య పింఛను రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: ఓ జవానుకు అందజేయాల్సిన వైకల్య పింఛనును ప్రభుత్వం నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వైకల్య (డిజెబిలిటీ పెన్షన్) పింఛను ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది కాదని స్పష్టం చేసింది. అది రాజ్యాంగబద్ధమైన హక్కని ప్రకటించింది. పింఛను అందజేయడంలో వివక్ష చూపడం లేదా తగ్గించడం వంటి చర్యలు సరికాదని తలంటింది. ఓ మాజీ సైనికోద్యోగికి వైకల్య పింఛను అందించాల్సిందేనంటూ సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. వైకల్య పింఛను ప్రభుత్వమిచ్చే దానం కాదు, అది దేశ సేవలో చేసిన త్యాగానికి దక్కిన గుర్తింపని తెలిపింది. ‘పింఛను ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా కాదు. గత సేవలకు ప్రతిఫలంగా చెల్లించే వాయిదా వేసిన వేతనం. నిర్ణీత నిబంధనలు పూర్తి చేసిన తర్వాత, అది ఒక స్థిరమైన, చట్టపరంగా అమలు చేయదగిన హక్కుగా మారుతుంది. పింఛను ప్రయోజనాలు ఆస్తి హక్కు వంటివి. చట్టపరమైన అధికారం లేకుండా వీటిని ఆపేయడం, తగ్గించడం, రద్దు చేయడం సాధ్యం కాదు’అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైన యజమానిగా ఉండాలని, దేశం కోసం పనిచేసిన వారికి ప్రయోజనాలు అందించే విషయంలో నిష్పక్షపాతంతో, సమానత్వంతో వ్యవహరించాలని ఉద్బోధించింది. ఒక ప్రయోజనాన్ని విధానం ద్వారా గుర్తించి, న్యాయస్థానం ధ్రువీకరించినప్పుడు, అమలు విషయంలో వివక్ష చూపరాదని పేర్కొంది. న్యాయపరమైన తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాల ద్వారా మాజీ సైనికులకు చెందాల్సిన పింఛనును నిరాకరించడమంటే ఆస్తిని లాక్కోవడమే అవుతుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 300ఏని ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. వైకల్య పింఛను హక్కు చాలా విలువైంది, ఒకసారి అది అర్హమైనదిగా తేలితే, బకాయిలు సహా చెల్లించాల్సిందేనని ఆదేశించింది. -
పాక్షికంగా ప్రభావం చూపిన సమ్మె
న్యూఢిల్లీ: కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికసంఘాలు గురువారం సమ్మె చేపట్టాయి. కార్మికులు, రైతులు, పలు రంగాల శ్రామికు లు కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే సమ్మె ప్రభా వం దేశవ్యాప్తంగా పాక్షికంగానే కన్పించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజా రవాణా, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ కార్యకలాపాలు యతాథతంగా కొనసాగాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వేలాది మంది కార్మికుల భారీ నిరసన ప్రదర్శనలతో జనజీవనం కాస్తంత స్తంభించింది. ఒడిశా, కేరళ, తమిళనాడు, గోవా, జార్ఖండ్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం అత్యధికంగా కన్పించింది. చాలా రాష్టాల్లో కార్మిక సంఘాలు ఆయా పని ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల ప్రధాన ద్వారాల వద్ద ధర్నాకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. అత్యంత వివాదాస్పద నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని కార్మికసంఘాలు డిమాండ్చేశాయి. ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, సస్టేనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్ఫార్మింగ్ ఇండియా(శాంతి) చట్టాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్చేశాయి. వీబీ జీ రాంజీ చట్టాన్ని పక్కనబెట్టి వెంటనే పాత ఎంజీనరేగా చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని కోరాయి. సమ్మె కు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు తమ కార్యాలయాలు, కర్మాగారాలకు ఆలస్యంగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో సమ్మె విజయవంతమైందని కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లతోపాటు సంయుక్త కిసాన్ మోర్చాలు, వ్యవసాయ కార్మికుల సంఘాల సంయుక్త వేదిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎస్ ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ సంఘాలు ఈ సంయుక్త ఫో రమ్లో భాగస్వాములుగా ఉన్నాయి. ఢిల్లీ లో అన్ని పారిశ్రామిక వాడల నుంచి పలు కార్మిక సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. జంతర్మంతర్ వద్ద సమావేశం నిర్వహించి కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక ముఖ్యనేతలు తూర్పారబట్టారు. తమ రాష్ట్రంలో బ్యాంకింగ్, బీ మా, బొగ్గు రంగంలో కార్యకలాపాలు పూర్తి గా స్తంభించిపోయాయని జార్ఖండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఉమేశ్ దాస్ ప్రకటించారు. కేరళలో కేఎస్ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ప్రైవేట్ బస్సులూ రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో మాత్రం జనజీవనానికి ఎలాంటా ఆటంకం కలగలేదు. -
వివాహమా?.. ఇప్పుడే వద్దులే!
న్యూఢిల్లీ: వివాహం చేసుకోవడానికి యువత తొందరపడడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటున్నారు. కెరీర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగంలో లేక వ్యాపారంలో నిలదొక్కుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. భారత్లో సగటు వివాహ వయసు పదేళ్ల క్రితం 27 ఏళ్లు కాగా.. అది ఇప్పుడు 29 ఏళ్లకు చేరుకుంది. అంటే సగటున 29 ఏళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి యువత ఆసక్తి చూపుతోంది. వివాహ పరిచయ వేదిక ‘జీవన్సాథీ’నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. వివాహాలపై 2016 నుంచి 2025 దాకా ప్రజల్లో మారిన ధోరణిని అధ్యయనం చేశారు. అలాగే ఈ ఏడాది 30 వేల మంది అభిప్రాయాలు సైతం సేకరించారు. ‘అతిపెద్ద మార్పు: జీవిత భాగస్వామి ఎంపిక, పెళ్లి విషయలో నిబంధనలు తిరగరాస్తున్న భారత్’ఒక నివేదికను జీవన్సాథీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. → పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. ఒక ఇంటివారు కావాలనే కోరుకుంటున్నారు. కానీ, అందుకోసం తొందర పడడం లేదు. 29 ఏళ్లు వచ్చాక తోడు కోసం అన్వేషిస్తున్నారు. → ఈ మార్పు రావడం వెనుక ఆర్థిక కోణమే కీలకంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కుదురుకొని ఆర్థికంగా స్థిరపడితే జీవిత భాగస్వామితో ఆనందంగా గడపొచ్చన్నది యువత ఆలోచన. సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాపురంలో కలతలు రేగుతుంటాయి. ఆ పరిస్థితి రావొద్దని నేటి యువత భావిస్తోంది. → పెళ్లిని వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా కొందరు భావిస్తున్నారు. అందుకే అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత పెళ్లి ఆలోచన తీసుకొస్తున్నారు. → జీవిత భాగస్వామి మృతిచెందడం లేదా తొలి వివాహం విఫలమైన సందర్భాల్లో మరో పెళ్లి కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్య దేశంలో పెరుగుతోంది. → 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు సాగించారు. ఇప్పుడు వారి సంఖ్య 16 శాతం పెరిగింది. → విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది భావిస్తున్నారు. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా అప్పటికే ఒకసారి విడాకులు తీసుకున్న వారిని వివాహమాడేందుకు ముందుకొస్తుండడం గమనార్హం. → సరైన జీవిత భాగస్వామి కోసం అన్వేషించే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. పెళ్లి విషయంలో వయసు, ఆదాయం వంటి వాటికి ప్రాధాన్యం లేదని, ‘రైట్ పర్సన్’కావాలని, అందుకోసం ఎన్నాళ్లయినా వేచి చూస్తామని అంటున్నారు. → కులం పట్టింపు తగ్గిపోతుండడం మరో శుభ పరిణామం. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని కొందరు చెబుతున్నారు. 2016తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ధోరణి అధికంగా ఉంది. → పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని, భార్య/భర్తను తామే ఎంపిక చేసుకుంటామని యువత వాదిస్తోంది. వీరి సంఖ్య 2016లో 67 శాత ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి కుదిర్చే పనిని తమ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. → భార్య తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ యువకులు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. ఎక్కువ సంపాదించే భార్య రావాలని 87 శాతం మంది కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. భర్త తమ కంటే తక్కువ సంపాదించినప్పటికీ తమకు అంగీకారమేనని 15 శాతం మంది యువతులు చెప్పారు. -
సినిమా పేరు మార్చండి.. లేదా రిలీజ్ చేయకండి!
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సరి్టఫికేషన్(సీబీఎఫ్సీ)కి, సినిమా నిర్మాత నీరజ్ పాండేకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయి నటించిన ‘ఘూస్ఖోర్ పండట్’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమా టైటిల్ తమ వర్గం ప్రజలను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ్ సమాజ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అతుల్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఆయన పిల్ వేశారు. సినిమా పేరుతోపాటు కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని సూచించే పండిత్ అనే పదాన్ని, అవినీతిని సూచించే ’ఘూస్ఖోర్(లంచగొండి)’తో కలిపి వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్పై గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘జాగృతం చేయడం, ప్రజలను కించపరుస్తూ అశాంతిని సృష్టించడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికే ఉన్న విభేదాలు చాలవన్నట్లు, మీరు కొత్తగా ఇలాంటి వాటితో మరింతగా అలజడులను ఎందుకు సృష్టిస్తున్నారు’అంటూ నిర్మాతపై మండిపడింది. ‘రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్యాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో దానికీ హద్దులున్నాయి. మీరు ఎవరినైనా ఎందుకు కించపర్చాలి? ఇటువంటి పేరుపెట్టి ఓ వర్గం వారిని ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు?’అని ప్రశ్నించింది. ‘దీనిని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించలేం. ఆ హక్కు ఇతరులను కించపరిచేందుకు ఇచి్చన లైసెన్సు కాదు. ఇలాంటివి నైతికతకు, సమాజానికి వ్యతిరేకం. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించం. సినీ నిర్మాతలు, జర్నలిస్టులు తదితరులు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాం’అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, చిత్రనిర్మాత తరపు న్యాయవాది.. కొత్త టైటిల్ను ఇంకా ఖరారు చేయలేదని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా టైటిల్ను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. సినిమా టైటిల్ వివాదంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా..ఆ పేరును మారుస్తామంటూ నెట్ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కథాంశాన్ని, ఉద్దేశాన్ని ప్రతిబించేలా మరో పేరు పెడతామంది. -
ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్ట షాకింగ్ విషయాలు
కోర్బా: ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన జర్నలిస్ట్ సల్మా సుల్తానా హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ రాజ్పుత్ చెప్పిన నిజాలతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఆ దారుణాన్ని ఆమె కోర్టులో వివరించారు.పాట పాడుతూ..2018లో తన లివ్-ఇన్ భాగస్వామిని గొంతు నులిమి చంపిన తర్వాత నిందితుడు మధుర్ సాహులో ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించలేదు.. సల్మాను హత్య చేసిన సమయంలో మధుర్ చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. అతను మృతదేహం పక్కనే కూర్చుని సిగరెట్ తాగుతూ, సల్మాకు ఇష్టమైన "తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై.’’ అనే పాటను పాడినట్లు కోర్టుకు కోమల్ సింగ్ రాజ్పుత్ తెలిపారు.ఆ రోజు ఏం జరిగింది?మధుర్ సాహు జిమ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే కోమల్ సింగ్.. ఘటన జరిగిన రోజున శారదా విహార్లోని సల్మా ఇంటికి తనను పిలిచారని చెప్పాడు. దంపతుల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం.. కాసేపటికే హింసాత్మకంగా మారిందన్నారు. వాగ్వాదం జరుగుతుండగానే మధుర్ మొదట సల్మా గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని.. ఘర్షణ తీవ్రం కావడంతో ఆమెను మంచంపైకి నెట్టి గొంతు గట్టిగా నొక్కినట్లు తెలిపారు. సల్మా అరవకుండా ఉండేందుకు మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్ ఆమె నోటిపై దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. కోమల్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. నోరు మూసుకుని ఉండు.. లేదంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది" అంటూ నిందితులు ఆమెను బెదిరించారు.నమ్మించేలా ప్లాన్..హత్య తర్వాత, సల్మా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపాలని మధుర్ తనను, ఇంట్లో పనిచేసే సవితను బలవంతం చేసినట్లు కోమల్ తెలిపింది. ‘‘నేను వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకకండి అంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆమె తనంతట తానుగా వెళ్ళిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశారు. నిందితుడు తన కంప్యూటర్లో పలువురు మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను దాచిపెట్టి, వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని కూడా కోర్టుకు కోమల్ సింగ్ తెలిపారు. తాను ఈ విషయం గురించి పోలీసులకు మరియు సల్మా బంధువులకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం నిందితుడికి తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.రోడ్డుకింద ఆస్థి పంజరం..హత్య అనంతరం సల్మా మృతదేహాన్ని భవానీ దబ్రీ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి కింద పాతిపెట్టారు. ఐదేళ్లపాటు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. కానీ దాని కింద ఒక జర్నలిస్ట్ శవం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. 2023లో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు రహదారిని తవ్వి అస్థిపంజరాన్ని వెలికితీశారు. డీఎన్ఏ పరీక్షలో అది సల్మాదేనని తేలింది.తుది దశలో విచారణప్రభుత్వ న్యాయవాది సునీల్ సోన్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 41 మంది సాక్షులను విచారించారు. మరో 10 మంది మిగిలి ఉన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్య తర్వాత నిందితుడు పాట పాడాడనే కోమల్ సింగ్ రాజ్పుత్ సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది. -
లంబోర్ఘిని ప్రమాదం : బిజినెస్ టైకూన్ కొడుకు అరెస్ట్, గంటల్లో బెయిల్
లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖరీదైన , హైస్పీడ్ కారు ఢీకొని ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.గత ఆదివారం రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివమ్ మిశ్రా కాన్పూర్లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు.శివం మిశ్రా అరెస్ట్ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్ను కోర్టు తిరస్కరించిందన్నారు. రూ.20,000 అండర్ టేకింగ్ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్పై విడుదలైనట్టు తెలిపారు. -
తెల్లారితే పెళ్లి : నేరగాడితో పారిపోయిన కానిస్టేబుల్
ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మధ్య జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వరుడు సహా బంధువులంతా హతాశులయ్యారు. వధువు కిడ్నాప్ అయ్యిందంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కథ అడ్డం తిరిగింది.ఇద్దరూ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. జోడీ బావుంది అని పెద్దలు వారిద్దరికి ఫిబ్రవరి 8న పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని, మీరట్లోని బహ్సుమా ప్రాంతంలోని అక్బర్పూర్ సదాత్ గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సపరివార సమేతంగా వివాహానికి ఆహ్వానిస్తూ బంధువులందరికి వెడ్డింగ్ కార్డ్స్ పంచారు. బంధువులతో సందడిగా ఉంది. సంధ్య చేతులను కాబోయే భర్త పేరుతో మెహందీ తీర్చి దిద్దారు. ముజఫర్ నగర్లోని మీరాపూర్ నుండి వచ్చే వివాహ ఊరేగింపును స్వాగతించడానికి అంతా బిజీగా ఉన్నారు. సరిగ్గా వివాహానికి ముందు రాత్రి పెళ్లి కూతురు 25 ఏళ్ల సంధ్య భరద్వాజ్ మాయమైంది. ఆమె ప్రస్తుతం అలీఘర్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది. వరుడు అతుల్ శర్మ ముజఫర్నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వధువు కనిపించకుండా పోవడంతో వధువు తండ్రి అంకిత్ ఠాకూర్ను అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే అతను గతంలో (ఫిబ్రవరి 5న) తన కుమార్తెను వివాహం చేసుకుంటే చంపేస్తానంటూ వరుడిని ఫోన్లో బెదిరించాడని శర్మ తన ఫిర్యాదులో హింట్ ఇచ్చాడు. అంకిత్ తన కుమార్తెను బెదిరించి కిడ్నాప్ చేశాడని , ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని తండ్రి ఆరోపించాడు.అసలు సంగతి ఏంటంటే..పోలీసులు ఎనిమిది గంటల్లోనే మీరట్ జిల్లాలోని బక్సర్లో వధువు భరద్వాజ్ను గుర్తించారు. వధువు కిడ్నాప్కు గురికాలేదని ఇష్టపూర్వకంగా ఇల్లు వదిలి ప్రేమికుడు అంకిత్ ఠాకూర్తో వెళ్లిపోయిందని గుర్తించారు.పోలీసుల ప్రకారం గత కొన్నేళ్లుగా భరద్వాజ్ -అంకిత్ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేకపోవడంతో అతని స్వస్థలం ధికోలి గ్రామంలోని ఇంటికి పారిపోయింది. తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. పోలీసు అధికారి మవానా సర్కిల్ ఆఫీసర్ పంకజ్ లావానియా చెప్పారు. ఇక చేసే దేమీ లేక వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. భరద్వాజ్ను కోర్టు ముందు హాజరుపరుస్తామని సీనియర్ ఎస్పి(గ్రామీణ) అభిజీత్ కుమార్ తెలిపారుఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావాకాగా అంకిత్కు నేర చరిత్ర ఉందని, దోపిడీ, హత్య అభియోగాలతో సహా కనీసం తొమ్మిది కేసులు నమోద య్యాయని పోలీసులు నిర్ధారించారు. గత సంవత్సరం ఒక మద్యం దుకాణంలో జరిగిన దోపిడీ కేసులో కూడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.మరోవైపు తన కూతురు ప్రేమ వ్యవహారం, పెళ్లి విఫలమవడం చూసి సంధ్య తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. ఫలితంగా బాజా భజంత్రీలు, విందుభోజనాలతో కళకళ లాడాల్సిన ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది.ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం -
ఆ గంభీరమైన గొంతు మూగబోయింది..ప్రముఖ న్యూస్ రీడర్ కన్నుమూత
దూరదర్శన్ ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి ఈ రోజు మృతి చెందారు. గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణతో మూడు దశాబ్దాల పాటు వార్తా రంగంలో ప్రముఖ న్యూస్రీడర్గా నిలిచారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976లో దూరదర్శన్లో అనౌన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. దాదాపు మూడు దశాబ్దాల పాటు మీడియా రంగంలో తన గంభీరమైన స్వరంతో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న సరళ మహేశ్వరి ఇక లేరు. న్యూస్ యాంకర్ అనే భావన సాధారణం కాకముందు హుందాగా స్పష్టమైన ఉచ్చారణతో వార్తలను చదువుతూ న్యూస్ రీడర్గా ప్రస్థానం ప్రారంభించాలనుకునే యువ యాంకర్లకు మార్గదర్శకంగా నిలిచారామె. 71 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సరళ మహేశ్వరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దూరదర్శన్ నేషనల్.. ‘X’ వేదికగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా వార్తా రంగంలో ఆమె సేవలను గుర్తు చేసుకుంది. 1984 వరకు దూరదర్శన్లోనే పనిచేశారామె.“దూరదర్శన్ కుటుంబం తరపున.. సరళ మహేశ్వరికి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. దూరదర్శన్ న్యూస్ రీడర్గా.. ఆమె సున్నితమైన స్వరం, కచ్చితమైన ఉచ్చారణ, గౌరవప్రదమైన డెలివరీతో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సింప్లిసిటీ, సంయమనం, వ్యక్తిత్వం.. ప్రేక్షకులలో లోతైన నమ్మకాన్ని కలిగించాయి” అని పోస్ట్ చేసింది. మహేశ్వరి మరణాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్.. “టెలివిజన్ జర్నలిజంలో స్వర్ణయుగం ముగింపు”గా అభివర్ణించింది. ఆమె విశ్వసనీయత, మర్యాద ఎల్లప్పుడూ రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటాయని పేర్కొంది. ప్రశాంతమైన అందమైన ముఖంతో ప్రేక్షకులను పలకరిస్తున్నట్లుగా అత్యంత నైపుణ్యంతో వార్తలు అందించేవారామె. ఆమె గొంతుకకు మాతమ్రేగాక ధరించే దుస్తులకు కూడా అభిమానులు ఉండేవారట. దూరదర్శన్కు ఆమె దుస్తుల గురించి వందలాది అబిమానుల లేఖలు వచ్చేవట. ఆమె ధరించే గుజరాతీ చీరలను హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుమణులు కూడా కాపీ చేసేవారట. అంతేగాదు ఆమె చీర కట్టు తీరు కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది, పైగా ఆ క్రెడిట్ని తన తల్లికే ఇచ్చేవారట ఆమె. నిజానికి టెలిప్రాంప్టర్లు లేని యుగం, న్యూస్ రీడర్లు పూర్తిగా వారి జ్ఞాపకశక్తిపై ఆధారపడవలసి వచ్చింది. దాంతో సరళ తరుచుగా ఇంటర్వ్యూలలో ఇలా అనేవారట. ఇది అపారమైన బాధ్యతతో కూడిన పని అని, దీన్ని బాగా చేయడానికి ఎంతో కొంత పరిణతి ఉండాలని చెప్పేవారట.(చదవండి: ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..) -
‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారు’
ఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. లోక్సభలో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పని చేస్తున్న కార్మికుల గురించి ప్రస్తావించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అకస్మాత్తుగా 5000 మంది కార్మికులను తొలగించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే వెయ్యి మందిని మళ్లీ నియమించుకున్నారు. అక్కడ కార్మికుల భవిష్యత్తు గందరగోళంలో పడేశారు. చట్టాలపై కార్మికులకు తగిన అవగాహన కల్పించాలి. కార్మికుల భవిష్యత్తును గందరగోళ పరిచేలా విధానాలు ఉండకూడదు. వివాదాల పరిష్కారానికి తగిన చట్టాలు అవసరం’ అని పేర్కొన్నారు. -
ప్యాకెట్ పాలల్లో కోలిఫామ్, సంచలన నివేదిక : రిస్క్స్ అండ్ టిప్స్
అమూల్ సహా కొన్నిప్రముఖ భారతీయ పాల ఉత్పత్తుల బ్రాండ్లపై జరిపిన పరీక్షల్లో అధిక కోలిఫాం బ్యాక్టీరియా , ఇతర వాటిలో TPC పెరుగుదల కనిపించిందన్న వార్త సంచలనం రేపుతోంది. అమూల్ ఉత్పత్తులైన తాజా అండ్ గోల్డ్ పౌచ్ (Taaza and Gold pouch) పాలలో ప్రమాదకర బ్యాక్టీరియా స్థాయి ఎక్కువగా ఉందన్న వార్త వైరల్గా మారింది. ట్రస్టీ ఫైడ్ అనే స్వతంత్ర పరీక్షా వేదిక =నిర్వహించిన బ్లైండ్ టెస్ట్లో కోలిఫామ్ స్థాయి ఎక్కువ ఉందంటూ ఒక వీడియో హల్హల్ చేస్తోంది.తాజా నివేదికల ప్రకారం అమూల్ ప్యాకెట్ పాల బ్రాండ్లలో కోలిఫాం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు పాల భద్రతపై ఆందోళనలు రేకెత్తించాయి. పాలలో కనిపించే కోలిఫామ్ స్థాయి FSSAI సూచించిన పరిమితుల కంటే 98 రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. అంతేకాదు మదర్ డైరీ, కంట్రీ డిలైట్ లాంటి ప్యాకెట్ పాల బ్రాండ్లలో కోలిఫాం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పాలలోని టోటల్ ప్లేట్ కౌంట్ (TPC) అనేది పాల నమూనాలోబ్యాక్టీరియా సంఖ్యను కొలవడానికి ఉపయోగించే ప్రయోగశాల పరీక్ష. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తనిఖీలు ముమ్మరం చేసింది.కోలిఫామ్ అంటే ఏమిటి?కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది నేల, నీరు, వృక్షసంపద, జంతువుల ప్రేగులు మరియు మానవ ప్రేగులలో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా సమూహం. పాలలో కోలిఫామ్ అంటే మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితం కావడమే. దీంతో సోషల్ మీడియా యూజర్లు పాల ఉత్పత్తుల్లోని పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను అమూల్ కంపెనీ ఖండించింది.అమూల్ స్పందనతన ఉత్పత్తులన్నీ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అమూల్ ప్రకటించింది. తయారీ వైఫల్యం లేదని, కానీ రిటైల్ లేదా పంపిణీ స్థాయిలో కోల్డ్ చైన్లో ఏదైనా విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉందని కంపెనీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఏం చేయాలి?ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కాలుష్యానికి గురికావడం ఉత్పత్తి , పాలు పితికే దశకు మాత్రమే పరిమితం కాదు, కానీ రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ లేదా రిటైల్ నిర్వహణ సమయంలో ఏదైనా కల్తీ జరిగే అవకాశం ఉంది. పేలవమైన ఉష్ణోగ్రత నియంత్రణ బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుంది. పాశ్చరైజేషన్ ద్వారా హానికరమైన జీవులు తగ్గినప్పటికీ, ప్రాసెసింగ్ తర్వాత తగినంత నిల్వ లేకపోవడం కూడా బ్యాక్టీరియాకు కారణమవుతుంది. అందుకే ప్యాకెట్ పాలను మరిగించ కుండా వాడకూడదు. ప్యాకెట్ పాలను సరైన శీతలీకరణలో ఉంచేలా రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.పాలను ఫ్రిజ్లోనే పెట్టాలి. ముఖ్యంగా వేడి వాతావరణంలో పాలను ఎక్కువసేపు బయట ఉంచవద్దు.లీక్ అవుతున్న, లేదా ఉబ్బిన ప్యాకెట్లును కొనుగోలు చేయవద్దు.టెట్రా ప్యాక్ (UHT) మిల్క్ ప్యాకెట్లు అల్ట్రా-హై టెంపరేచర్ ట్రీట్మెంట్కు లోబడి ఉంటాయి, తెరిచే వరకు స్టెరైల్గా ఉంటాయికాబట్టి కోల్డ్ చైన్ విశ్వసనీయత అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ ఇవి సురక్షితం ప్యాకెట్ ఓపెన్ చేసిన తరువాత 24-48 గంటల్లోపు వాడాలి. ఆ తర్వాత బ్యాక్టీరియా పెరుగుదల రేటు వేగవంతం అవుతుంది.అలాగే కలుషితమైన పాలను మరిగించకుండా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఉబ్బరం లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది.పాలు కల్తీ అయ్యాయో లేదో గుర్తించే చిట్కాలునీరు: ఒక చుక్క పాలు నునుపైన వంపుతిరిగిన ఉపరితలంపై ఉంచితే, స్వచ్ఛ మైన పాలు తెల్లగా మందంగా పారతాయి. అవే నీళ్లు కలిపినవైతే పలుచగా త్వరగా జారిపోతాయి.క్రీమ్ పరీక్ష: పాలను మరిగించి, చల్లబరచండి. దాని పైన క్రీమ్ పొర ఏర్పడకపోతే, పాలు పలుచబడినట్లు అర్థం.నురుగు పరీక్ష: పాలను ఒక సీసాలో నిల్వ చేసి, ఆపై దానిని కదిలించండి. చాలా నురుగు ఏర్పడితే, అది డిటర్జెంట్ కాలుష్యంతో ముడిపడి ఉండవచ్చు.కలుషితమైన పాలు, పరిశుభ్రత లేకపోవడం లేదా సురక్షిత నిర్వహణ లేమితో E.coli, Salmonella, Listeria, coliform లాంటి హానికరమైన బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయి. -
రఫేల్ యుద్ధ విమానాల డీల్కు కేంద్రం గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల డీల్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫ్రాన్స్తో రూ. 3 లక్షల 25 వేల కోట్లతో రఫేల్ యుద్ధ విమానాల డీల్కు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు Defence Acquisition Council (DAC) స్పష్టం చేసింది.ఈ నెల 18వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ .. భారత్కు రానున్నారు. అయితే మేక్రాన్ పర్యటనకు ముందే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ీడీల్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు.ఈ డీల్ ద్వారా భారత వాయుసేనకు ఆధునిక సాంకేతికతతో కూడిన శక్తిమంతమైన యుద్ధ విమానాలు లభిస్తాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది మరింత కీలకం కానుంది. మరొకవైపు భారత నేవీ కోసం, Scalp Cruise Missiles ఇతర రక్షణ సామగ్రిని కూడా కొనుగోలు చేయనున్నారు.కాగా, భారత్ ఇప్పటివరకు రెండు ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్ఫోర్స్ను మరింత పటిష్టం చేసేందుకు 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఫ్రాన్స్తో రూ. 59 వేల కోట్లతో ఈ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో మొదటి బ్యాచ్ భారత్కు చేరింది, 2022 నాటికి అన్ని విమానాలు ఐఏఎఫ్లో చేరాయి.ఇక నేవీ కోంస 2025 ఏప్రిల్లో భారత్ రూ. 63 వేల కోట్లతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. 22 సింగిల్ సీట్, 4 ట్విన్ సీట్, రఫేల్ మెరైన్ జెట్స్ను భారత్ కొనుగోలు చేసింది. ఇవి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాధిత్యా ఎయిర్క్రాఫ్ట్పై మోహరించబడతాయి. -
రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పనితీరుపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెరా సంస్థలు కేవలం బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కొనుగోలుదారుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.ఏమిటీ వివాదం?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రెరా కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ నోటిఫికేషన్పై స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయిమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.ధర్మాసనం ప్రధాన వ్యాఖ్యలువిచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ రెరా పనితీరును తప్పుబడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప, ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఇలాంటి సంస్థలను కొనసాగించడం కంటే రద్దు చేయడమే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది.కోర్టు ఆదేశాలురెరా కార్యాలయాన్ని, అప్పీలేట్ ట్రిబ్యునల్ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా కోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రెరా సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు! -
నరవణే పుస్తకం లీక్: ‘పెంగ్విన్’ను విచారించిన పోలీసులు
న్యూఢిల్లీ: మాజీ సైన్యాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన స్వీయ చరిత్ర (మెమోయిర్) ఇంకా ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఆరా తీసేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం నాడు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ప్రతినిధులను ఈ అంశంపై విచారించింది. పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై వివరణ కోరుతూ పోలీసులు అంతకుముందే పబ్లిషర్లకు నోటీసులు జారీ చేశారు.విచారణలో భాగంగా పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పబ్లిషర్లు కొంత సమయం కోరారు. జనరల్ నరవణే రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో తీవ్ర దుమారం రేపింది. 2020లో భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై ఒక మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ పుస్తక సారాంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే సదరు పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, అందుకే అందులోని అంశాలను కోట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ సోషల్ మీడియా వేదికగా కీలక వివరణ ఇచ్చింది. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని, అయితే ఈ పుస్తకం ఇంకా ప్రచురణ దశకే చేరుకోలేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో కానీ ఎక్కడా ఈ పుస్తకాన్ని పంపిణీ చేయలేదని, విక్రయించలేదని ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు పబ్లిషర్లు పేర్కొన్నారు.తన పుస్తకం చుట్టూ జరుగుతున్న చర్చపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే కూడా స్పందించారు. పబ్లిషర్లు ఇచ్చిన అధికారిక వివరణను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ప్రస్తుతం పుస్తకానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి ఇదేనని నొక్కి చెప్పారు. అసలు ప్రచురణ కాని పుస్తకంలోని సున్నితమైన అంశాలు ఎలా లీక్ అయ్యాయి? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణలో తేలే అంశాలను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. -
ఎయిరిండియా విమానం దోషి... పైలట్ సుమీత్ సబర్వాల్!
అది గత ఏడాది జూన్ 12న జరిగిన వైమానిక దుర్ఘటన.. ‘ఎయిరిండియా ఫ్లైట్ 171’ (బోయింగ్ డ్రీమ్ లైనర్ 787) అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరింది. టేకాఫ్ చేసిన 32 సెకండ్లకే రెండు ఇంజిన్ల నుంచి చోదక శక్తి లభించక విమానం కూలిపోయింది. విమాన సిబ్బంది 12 మంది, ప్రయాణికులు కలిపి మొత్తం 241 మంది మరణించారు. వీరు కాకుండా శకలాలు నేలపై కూలిపోయి వైద్య విద్యార్థుల హాస్టల్ వద్ద ఉన్న మరో 19 మంది కూడా చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. విమానంలోని ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యువును జయించి బతుకు జీవుడా అంటూ గాయాలతో బయటపడ్డాడు. ఇద్దరు పైలట్లలో ఒకరు ‘దాదాపుగా’ ఉద్దేశపూర్వకంగా ఇంధన స్విచ్చుల్ని ఆపివేయడం కారణంగానే విమానం కూలిపోయిందని, సదరు దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారతీయ ఇన్వెస్టిగేటర్లు ఆమేరకు ఆ అంశాన్ని పొందుపరుస్తూ తుది నివేదిక రూపొందిస్తున్నారని ఇటలీ వార్తాపత్రిక ‘కొరియరె డెల్లా సెరా’ బుధవారం ఓ సంచలన కథనం ప్రచురించింది. పాశ్చాత్య వైమానిక సంస్థల్లోని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ అది తాజా బాంబు పేల్చింది. పెదవి విప్పని పౌర విమాన శాఖ ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సాంకేతిక లోపం కారణం కాదని తనిఖీల్లో తేలిందని, ఇంధనం మీటల్ని కదిలించిన పైలట్ ఎవరనేది కూడా కాక్పిట్ వాయిస్ రికార్డింగ్స్ (సీవీఆర్) విశ్లేషణ సందర్భంగా ఇన్వెస్టిగేటర్లు గుర్తించారని ఇటలీ పత్రిక కథనం తెలిపింది. దీనిపై ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక మరిన్ని వివరాలు తెలుసుకుందామని విమాన దుర్ఘటన దర్యాప్తు బ్యూరో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సంప్రదించినప్పటికీ అవి స్పందించలేదు. విమానంలో ఇంధన సరఫరాకు వీలు కల్పించే స్విచ్చుల్ని ఉద్దేశపూర్వకంగా ఎలా ఆఫ్ చేశారు? లేదా బాధ్యత వహించేది ఎవరు? అనే అంశమై తుది నివేదికలో పూర్తి వివరాలు ఉంటాయో, ఉండవో ప్రస్తుతానికైతే తెలియరాలేదు. ఈ దుర్ఘటనలో మరణించిన విమాన పైలట్ (కమాండర్) సుమీత్ సబర్వాల్ వివాదానికి కేంద్ర బిందువుగా, ప్రధాన అనుమానితుడిగా నిలిచారని ‘కొరియరె డెల్లా సెరా’ కథనం తెలిపింది. సుమీత్ సబర్వాల్ కుటుంబం, భారతీయ పైలట్ల సంఘాలు మాత్రం అతడి వైపే నిలిచాయి. విమాన తయారీదారు, దాని ఆపరేటర్, ఇతర అంశాలపై మరింత లోతుగా పరిశీలన జరగాలని ఇండియన్ పైలట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేశాయి. తుది నివేదికపై రాజకీయ ప్రభావం?ఎయిరిండియా విమాన దుర్ఘటన దర్యాప్తులో అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. గత ఏడాది డిసెంబరులో ఏఏఐబీకి చెందిన భారతీయ దర్యాప్తు బృందం వాషింగ్టన్ వెళ్లింది. కూలిన ఎయిరిండియా విమానం ‘బ్లాక్ బాక్స్’ను దర్యాప్తు బృంద సభ్యులు అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి (నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు)కి చెందిన ప్రయోగశాలల్లో మరోసారి విశ్లేషించారు. ఇందులో ప్రత్యేకించి విమానం క్యాబిన్ ఆడియో రికార్డింగ్స్ మీద వారు దృష్టి పెట్టారు. పొరపాటు వల్ల దుర్ఘటన సంభవించలేదని, ఇంధన స్విచ్చులను ఏ పైలట్ ఆఫ్ చేశారో కూడా ఆడియో విశ్లేషణలో బయటపడిందని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘కొరియరె డెల్లా సెరా’ పేర్కొంది. అమెరికన్ ప్రయోగశాలల్లో జరిపిన ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ కూడా సబర్వాల్ వైపే తప్పు చూపిస్తోంది. ఇంజిన్లు పనిచేయని క్రమాన్ని పరిశీలిస్తే... తొలుత కెప్టెన్ (కమాండర్ సుమీత్ సబర్వాల్) కూర్చునే ఎడమ వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని, ఆ తర్వాత కుడి వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని తెలుస్తోంది. ఆ సమయంలో విమానాన్ని సబర్వాల్ పర్యవేక్షిస్తుండగా (మానిటరింగ్), ఫస్ట్ ఆఫీసర్ కుందర్ (కో-పైలట్/సెకండ్ ఇన్ కమాండ్) కుడి వైపు కూర్చుని విమానాన్ని (పైలటింగ్) నడుపుతున్నారు. విమానాన్ని పైకి, కిందికి, పక్కలకు తిప్పడానికి పైలట్లు తమ ఎదురుగా ఉండే ‘కంట్రోల్ యోక్’ ఉపయోగిస్తారు. చాలినంత ఇంధనం అందక, చోదక శక్తి లోపించి ఎయిరిండియా విమానం కిందికి కూలిపోబోతున్న ఆఖరి క్షణాల్లో... అది ప్రయాణించే ఎత్తును పెంచేందుకు ఫస్ట్ ఆఫీసర్ కుందర్ ప్రయత్నించారు. అందుకు ఆయన వాడిన ‘కంట్రోల్ యోక్’ ఉన్న పొజిషన్ ఓ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది కూడా చదవండి: పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’ఇక సబర్వాల్ ముందున్న కంట్రోల్ యోక్ మాత్రం ‘స్థిరమైన స్థితి’లో అలాగే ఉంది. అంటే... విమానం కిందికి కూలిపోతున్నప్పటికీ దాన్ని పైకి, ఎత్తుకు లేపడానికి సబర్వాల్ ప్రయత్నించలేదని ఇటలీ పత్రిక కథనం పేర్కొంది. అయితే ఈ ‘తుది నిర్ధారణలు’ రాజకీయ నాయకత్వ పరిశీలనకు వెళ్లవచ్చని, జాతీయంగా తీవ్ర వివాదాలకు తావివ్వకుండా మరింత జాగ్రత్తగా తుది నివేదిక రూపొందవచ్చని... పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికన్ ఇన్వెస్టిగేటర్లను ఉటంకిస్తూ ‘కొరియరె డెల్లా సెరా’ తన కథనం రాసింది. దర్యాప్తు ముగియలేదు: ఏఏఐబీ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు ముగిసిందని, బాధ్యులెవరో తెలిసిందని, పైలట్ ఉద్దేశపూర్వక చర్య వల్లనే విమానం కూలిపోయిందని కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న వార్తలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారికంగా స్పందించింది. అవి ఊహాగానాలేనని తోసిపుచ్చింది. దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా ‘అంతిమ నిర్ధారణ’కు రాలేదని స్పష్టం చేసింది. విచారణ పూర్తి కాకుండా వ్యక్తిగతంగా ఎవరినీ తప్పుపట్టడం సరికాదని పేర్కొంటూ దర్యాప్తు బ్యూరో గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.-జమ్ముల శ్రీకాంత్ (Credit: Hindustan Times). -
రాహుల్ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం కీలక అడుగు వేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లోక్సభలో ‘సబ్స్టాంటివ్ మోషన్’ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, ఆయన జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రివిలేజ్ మోషన్ కాదని, ఆయనపై ఉన్న తీవ్రమైన ఆరోపణల దృష్ట్యా ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానమని ఆయన పేర్కొన్నారు.రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, పలు అంతర్జాతీయ సంస్థలతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు గుప్పించారు. సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, యూఎస్ఏఐడి వంటి సంస్థలతో రాహుల్ సంబంధాలు కలిగి ఉన్నారని, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, అమెరికా పర్యటనల్లో ఆయన భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని దూబే ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ తాను దాఖలు చేసిన తీర్మానంలో వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు.బుధవారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వివాదానికి బీజం పడింది. కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ, భారత్-అమెరికా మధ్య జరిగిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని 'టోకు లొంగుబాటు'గా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా దేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతు ప్రయోజనాలను విస్మరించారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ విమర్శించారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యర్థిని ఎలాగైతే ఉక్కిరిబిక్కిరి చేస్తారో, అలాగే ఈ ఒప్పందం భారత్ను చిక్కుల్లో పడేసిందని ఆయన వ్యాఖ్యానించారు.సబ్స్టాంటివ్ మోషన్ అనేది అవిశ్వాస తీర్మానం లేదా అభిశంసన తీర్మానం లాంటి అత్యంత కీలకమైన ప్రక్రియ. ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నప్పుడు దీనిని సభలో ప్రవేశపెడతారు. దీనిని సభ చర్చకు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడు, తాను చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలను సభ ముందు ఉంచాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. -
లోక్సభలో నిరసనల హోరు.. సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేడు (గురువారం) లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న పీసీ మోహన్.. సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ‘మాకు న్యాయం కావాలి’ అంటూ విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళం మధ్యే 13 ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ, పరిస్థితి అదుపు తప్పడంతో సభ వాయిదా పడింది.ప్రతిపక్ష ఎంపీలు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ఇది భారత్ను ఇబ్బందుల్లోకి నెట్టే ‘ట్రాప్ డీల్’ అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ ఒప్పందంపై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, వ్యవసాయ రాయితీల విషయంలో కేంద్రం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ నిరసనల సెగ సభలో స్పష్టంగా కనిపించడంతో కార్యకలాపాలు సాఫీగా సాగలేదు.బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రవేశపెట్టిన తీర్మానం సభలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీకి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని దూబే డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనను ఉధృతం చేశారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోవడంతో సభలో ఒకానొక దశలో తీవ్ర గందరగోళం నెలకొంది, ఇది సభ వాయిదాకు ప్రధాన కారణంగా నిలిచింది. -
కొనసాగుతున్న భారత్ బంద్.. ఈ రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పది ప్రధాన కార్మిక సంఘాలు నేడు (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, అసంఘటిత రంగ నిపుణులు మద్దతు పలుకుతున్నారు. పారిశ్రామికరంగ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు బంద్కు మద్దతు ప్రకటించడంతో చాలా చోట్ల సమ్మె ప్రభావం కనిపిస్తోంది. కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఒడిశా, కేరళలో.. బంద్ ప్రభావం ఒడిశా, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అత్యధికంగా కనిపిస్తోంది. ఒడిశాలో దాదాపు పూర్తిస్థాయి షట్డౌన్ వాతావరణం నెలకొంది. హోల్సేల్ మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సేవలు స్తంభించాయి. కేరళలో కార్మిక యూనియన్ల బలం ఎక్కువగా ఉండటంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లు మూతపడ్డాయి. అస్సాంలో కూడా పట్టణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారగా, పశ్చిమ బెంగాల్లో బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కూడా పాఠశాలల మూసివేతపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే నిరసనల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పరిధిలోని కొన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి, ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించుకున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, ఇతర అత్యవసర వైద్య సేవలకు బంద్ నుండి మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటివరకు సేవల నిలిపివేతపై ఎటువంటి వార్తలు అందలేదు. -
లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి..
ఆ వైరస్ బారినపడినవారు బయటకు ఆరోగ్యంగానే కనిపిస్తారు.. రోజువారీ పనులన్నీ చురుగ్గానే చేసుకుంటారు.. కానీ వారి శరీరంలోని కాలేయం (Liver) మెల్లమెల్లగా క్షీణిస్తుంటుంది. అది పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కానీ అసలు విషయం బయటపడదు. అదే హెపటైటిస్ వైరస్ చేసే దారుణ మాయాజాలం. ప్రస్తుతం భారతదేశంలో హెపటైటిస్ బి (HBV), హెపటైటిస్ సి (HCV) ఇన్ఫెక్షన్లు ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తున్నాయి.కోటి మందికి పైగా..దేశంలో హెపటైటిస్ ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. దేశ జనాభాలో సుమారు మూడు నుంచి నాలుగు శాతం మంది హెపటైటిస్ బి (HBV) బారిన పడగా, మరో 0.5 నుంచి ఒక శాతం మంది హెపటైటిస్ సి (HCV)తో పోరాడుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, సుమారు కోటి మందికి పైగా భారతీయులు ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల ముప్పులో ఉన్నారని అంచనా.లక్షణాలు కనిపించకపోవడం..ఈ వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ ఎటువంటి బాహ్య లక్షణాలు కనిపించకపోవడం అత్యంత ప్రమాదకరమైన అంశమని నోయిడాలోని మెదాంత ఆస్పత్రి నిపుణులు డాక్టర్ సౌరదీప్ చౌదరి హెచ్చరిస్తున్నారు. దీని బారినపడినవారు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, వైరస్ లోపల కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ, చివరకు సిరోసిస్, కాలేయ వైఫల్యం లేదా క్యాన్సర్కు దారితీస్తుందని డాక్టర్ సౌరదీప్ తెలిపారు.హెపటైటిస్ వ్యాప్తికి కారణాలివే..హెపటైటిస్ వ్యాప్తిపై సమాజంలో పలు అపోహలు ఉన్నాయి. కాలేయ వ్యాధులు కేవలం మద్యం సేవించే వారికే వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అపరిశుభ్రమైన ఇంజెక్షన్లు, తనిఖీ చేయని రక్తం ఎక్కించడం, కలుషితమైన పరికరాలతో శస్త్రచికిత్సలు చేయడం లేదా పచ్చబొట్లు (టాటూలు) వేయించుకోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అలాగే ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. అయితే కౌగిలించుకోవడం, కలిసి భోజనం చేయడం లేదా దగ్గు ద్వారా ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల బాధితులు సామాజిక వివక్షకు గురవుతున్నారు. ఇదే వారు సకాలంలో పరీక్షలు చేయించుకోకుండా అడ్డుపడుతోంది.కాలేయ క్యాన్సర్కు ప్రధాన కారణంహెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్కు ప్రధాన కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్ 'సి' ని ప్రారంభ దశలో గుర్తిస్తే వైద్యం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైతే కాలేయం కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. హెపటైటిస్ 'బి' కి మాత్రం దీర్ఘకాలిక చికిత్స అవసరం. మద్యం సేవించడం, అనారోగ్యకర ఆహారం, ఊబకాయం, మధుమేహం తదితర అంశాలు కాలేయం దెబ్బతినే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్ ఉన్నవారు స్వల్పంగా మద్యం సేవించినా అది ప్రాణాంతక పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సాధారణ రక్త పరీక్ష ద్వారా వైరస్ ఉనికి..ప్రస్తుత కాలంలో హెపటైటిస్ పరీక్షలు, చికిత్స సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా వైరస్ ఉనికిని గుర్తించవచ్చు. హెపటైటిస్ ‘బి’ నివారణకు సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉండగా, హెపటైటిస్ 'సి' ని ఎనిమిది నుండి 12 వారాల పాటు మందులు వాడటం ద్వారా శాశ్వతంగా నయం చేయవచ్చు. గతంలో ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్న వారు, రక్తమార్పిడి జరిగిన వారు లేదా తెలియక అపరిశుభ్రమైన ఇంజెక్షన్లు తీసుకున్న వారు వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చేయడమే.. కాలేయాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం -
టీవీకే విజయ్పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈసారి తమిళనాడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార డీఏంకే ముందుకు సాగుతోంది. మరోవైపు.. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడులో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.బీజేపీ నేత అన్నామలై.. తాజాగా ఇండియా టుడే తమిళనాడు రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. టీవీకే విజయ్ను మేము తక్కువగా అంచనా వేయడం లేదు. తమిళనాడులోని జన్జెడ్ విజయ్ వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ప్రజాదరణ ఉంది. కానీ, విజయ్కు రాజకీయ అనుభవం లేదు. తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేలు మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన వారు ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేశారు. అలాంటి వారిపై విజయ్ ప్రభావం చూపించలేరు. ఉదాహరణకు బీహార్నే తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించారు. ప్రజాదరణ కూడా కనిపించింది. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. అదే విధంగా విజయ్ కూడా ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేరు. 2026 ఎన్నికలు మార్పు కోసం జరిగే ఎన్నికలు. తమిళ ప్రజలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు మార్పు కోసం ఆరాటపడుతున్నాయి. గత 50 సంవత్సరాలుగా మోదీకి గాంధీ అనే ఇంటి పేరు లేదు. గత 12 సంవత్సరాలలో ఆయన క్రమంగా తన మార్కు చూపించారు అని అన్నారు.కార్తీ కీలక వ్యాఖ్యలు..మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా టీవీకే విజయ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగత పార్టీ నిర్మాణం ఉండాలి. గ్రౌండ్ లెవల్ యంత్రాంగం అవసరం. విజయ్ ప్రస్తుతం అలాంటి యంత్రాంగాన్ని కలిగి లేరు. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అన్నారు. అలాగే, బీజేపీపై స్పందిస్తూ.. తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కిచెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. హిందూత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.విజయ్ పోటీ ఎక్కడ?ఇదిలా ఉండగా.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘వి’తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అదే అక్షరంతో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ఇప్పటికే ఖరారు చేయడంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విళుప్పురం జిల్లాలోని విక్రవాండి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వేడసందూర్ నియోజకవర్గాలను విజయ్ పరిశీలనలోకి తీసుకున్నారని సమాచారం. వాటిలో విరుగంబాక్కంలో తన తల్లిదండ్రులు నివసిస్తుండగా పనైయూర్ నివాసానికి, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి కొద్ది దూరంలో ఉన్నాయి. -
‘గగన్యాన్’పై మున్ముందుకే..
బెంగళూరు: మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’లో ఎన్ని అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే భారత్ మున్ముందుకే దూసుకెళ్లాలని గ్రూప్ కెప్టెన్, భారత వ్యోమగా మి, అశోక చక్ర అవార్డు గ్రహీత శుభాంశు శుక్లా అన్నారు. చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకోవాలని చెప్పారు. సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ ఉత్సాహంతో పనిచేస్తే అనుకున్నది సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లా డారు. మిషన్ గగన్యాన్ విజయవంతం అయి తే ఇలాంటి ఘనత సాధించిన దేశాల జాబితా లో భారత్ చేరుతుందని తెలిపారు. మనదేశ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. గగనయాన్ యాత్ర ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇదే మనదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మూడు రోజుల్లో క్షేమంగా వెనక్కి తీసుకురావాలన్నది గగన్యాన్ లక్ష్యం. 2027లో ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ అదే ఉత్సాహం శుభాంశు శుక్లా ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లొచ్చారు. గగన్యాన్ కోసం శుక్లాతోపాటు మరో ము గ్గురు వ్యోమగాములను ఇస్రో ఎంపిక చేసింది. గగన్యాన్ సాధారణమైన మిషన్ కాదని శుక్లా పేర్కొన్నారు. ఇది అత్యంత సంక్లిష్ట మైన, సవాళ్లతో కూడుకున్న కార్యక్రమమని వివరించారు. అయినప్పటికీ అధైర్యపడే ప్ర సక్తే లేదన్నారు. మొదటి రోజు ఎంత ఉత్సా హంతో ఉన్నామో ఇప్పటికీ అదే ఉత్సాహంతో పని చేస్తున్నామని స్పష్టంచేశారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, మళ్లీ భూమిపైకి తీసుకురావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నామని తెలిపారు. పెద్ద కార్యక్రమంలో కొన్ని అవరోధాలు, ఆలస్యా లు సహజమేనని వ్యాఖ్యానించారు. వాటిని ప్రతికూలతలుగా చూడొద్దని పేర్కొన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల్లో వేర్వేరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని శుక్లా తెలిపారు. ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కలిసి పనిచేయడంలో తప్పులేద న్నారు. తాను ఐఎస్ఎస్కు వెళ్లిరావడానికి అమెరికా కూడా సహకరించిందని గుర్తుచేశా రు. మన దేశంలో అంతరిక్ష కేంద్ర ప్రభుత్వం చక్కటి సహకారం అందిస్తోందని వివరించారు. సైన్స్, అంతరిక్ష ప్రయోగాల్లో పెట్టుబ డులు నానాటికీ పెరుగుతుండడం శుభ పరిణామం అని చెప్పారు. గగన్యాన్ కోసం అందరూ ఓపిగ్గా ఎదురు చూడాలని యా త్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ పేర్కొన్నారు. ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుందన్నారు. గగన్యాన్ యాత్ర విజయవంతమైతే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు కెక్కుతుందని స్పష్టంచేశారు. -
పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. -
దేశాన్ని అమ్మింది కాంగ్రెసే
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటి అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. పేదలు, రైతుల ప్రయోజనాలను వాటికి అమ్మేసింది. ఏకంగా దేశాన్నే అమ్మేసింది’’అంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండగా షెర్మెల్ షేక్ చర్చల సందర్భంగా దేశాన్ని దాయాది పాకిస్తాన్కు తనఖా పెట్టిన, ఏకంగా మన సార్వ¿ౌమత్వం విషయంలో రాజీ పడ్డ చరిత్ర కూడా కాంగ్రెస్దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ 2026–27పై లోక్సభలో జరిగిన చర్చకు నిర్మల బుధవారం సాయంత్రం బదులిచ్చారు. మన దేశాన్ని అమ్మగల, కొనగల వాడెవరూ పుట్టలేదంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆమె పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పని ఎప్పటికీ చేయబోరని స్పష్టం చేశారు. ఇంధన, ఆర్థిక, ఆహార, డేటా భద్రత తదితరాలపై రాహుల్ లేవనెత్తిన ఆందోళనలను కొట్టిపారేశారు. ఆ విషయాల్లో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుందని, బడ్జెట్లో వాటికి చాలినన్ని నిధులు కేటాయించిందని చెప్పారు. సంబంధిత గణాంకాలను సభకు చదివి వినిపించారు. రాహుల్ అసలు బడ్జెట్నే చదవకుండా నిరాధార ఆరోపణలకు దిగారని మండిపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ.53.47 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు నిర్మల సభకు తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.3 శాతానికి పరిమితం కావచ్చు’’అని అంచనా వేశారు. దేశంలో ఎరువుల కొరత ఉందన్న వార్తలను కొట్టిపారేశారు. వాటి దిగుమతికి బడ్జెట్లో ఏకంగా రూ.1.71 లక్షల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బెంగాల్లో బాంబుల రాజ్యం! కేంద్ర బడ్జెట్లో పశి్చమబెంగాల్కు కేటాయింపులే లేవన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ ఏలుబడిలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మంటగలిశాయంటూ మమతా బెనర్జీ సర్కారు పనితీరును దుయ్యబట్టారు. బెంగాల్లో ఎక్కడ చూసినా బాంబుల సంస్కృతే రాజ్యమేలుతోందని ఆరోపించారు. ‘బెంగాల్లో బాంబులే మాట్లాడతాయి, చట్టాలు కాదు’అంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. దాంతో విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాలు, స్టేషనరీ, విద్యపై జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు అభిõÙక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నిర్మల తీవ్రంగా ఖండించారు. ‘‘వాస్తవాలను ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా వక్రీకరించారు. పెన్సిళ్లు, షార్పనర్లపైనా జీఎస్టీ వేశామట! మరీ ఈ స్థాయిలో అబద్ధాలా? 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచీ పాలపై ఎన్నడూ జీఎస్టీ విధించలేదు. చావుపైనా జీఎస్టీ వేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. అంతిమక్రియలపై కూడా ఎప్పుడూ జీఎస్టీ లేదు. వింటున్న సభ్యులకు తెలివి లేదని అభిõÙక్ భావిస్తున్నారా?’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. బహుశా పశ్చిమబెంగాల్లో నడుస్తున్న సిండికేట్ మరణాలపైనా పన్నులు వసూలు చేస్తోందేమో అంటూ అధికార తృణమూల్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్యాయానికి గురయ్యామంటూ సానుభూతి కార్డు వాడటం, ప్రతిదానికీ సుప్రీంకోర్టు దగ్గరికి పరుగెత్తడం, చివరికి కోర్టుతో చీవాట్లు తినడం తృణమూల్కు అలవాటుగా మారిందన్నారు. -
భరతమాతనే... అమెరికాకు అమ్మేశారు
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కారును విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. ‘‘వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలనూ అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తిస్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా?’’అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కారు ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ‘‘పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కిపట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు. కేవలం అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారు. లేదంటే ఇలాంటి ఏకపక్ష ఒప్పందానికి ఆయనే కాదు, ఏ భారత ప్రధానీ అంగీకరించబోడు’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యర్థి మెడను దొరకబుచ్చుకున్నాక దాన్ని గట్టిగా నొక్కిపడతారు. దాంతో అతను అల్లాడిపోతాడు. లొంగిపోయానంటూ చేతులెత్తేస్తాడు. మోదీ చేసింది సరిగ్గా అదే’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాణిజ్య ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తిగా రాజీ పడింది. జౌళి రంగాన్ని నేలమట్టం చేశారు. మన డేటాను, రైతులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, మన శక్తియుక్తులను, చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ అమ్మేశారు. ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇకపై మనం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది అమెరికాయే తప్ప మన ప్రధాని కాదు! పైగా ఆ కొనుగోళ్లను అగ్ర రాజ్యమే నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. వారు చెప్పిన వాళ్ల దగ్గర కొనకపోతే మనపై మళ్లీ 50 శాతం టారిఫ్లు బాదుతారు. మన ఆర్థిక, ఇంధన రంగాలను మనపైకే ఆయుధాలుగా గురి పెట్టేందుకు అమెరికాను కేంద్రం అనుమతించింది’’అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రయోజనాల కోసమే... వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ సర్కారు అమెరికాకు దాసోహమన్న తీరు చాలా విషాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మోదీ కేవలం తాను మాత్రమే లొంగిపోలేదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తునే అమెరికాకు అప్పగించేశారు. అధికార బీజేపీ ఆర్థిక ఆయువుపట్లలో ఒకరిపై అమెరికాలో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం. సొంత పార్టీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే దేశాన్ని అగ్ర రాజ్యానికి మోదీ అమ్మకం పెట్టారు’’అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై నియంత్రణను కేంద్రం పూర్తిగా అమెరికాకు వదిలేసుకుంది. డేటా లోకలైజేషన్ను తొలగించేసింది. అమెరికా నుంచి డేటా వరదకు గేట్లెత్తేందుకు ఒప్పుకుంది. బడా టెక్ కంపెనీలకు 20 ఏళ్ల ట్యాక్స్ హాలిడేలు ప్రకటించేసింది. మొదట్లో మనపై కేవలం 3 శాతంగా ఉండే అమెరికా టారిఫ్లు ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికా వస్తూత్పత్తులపై భారత టారిఫ్లు మాత్రం 16 శాతం నుంచి ఎకాయెకి సున్నాకు పడిపోయాయి. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 146 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి’’అంటూ రాహుల్ మండిపడ్డారు. ‘‘కేంద్రం మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకు బార్లా తెరిచేసింది. దాంతో అక్కడి వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మన రైతులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మోదీకి ముందు ఏ ప్రధానీ ఇలాంటి సిగ్గుచేటైన పని చేయలేదు. ఇకముందు మరే ప్రధానీ చేయబోడు’’అన్నారు. అధికార పక్ష సభ్యులు పదేపదే లేచి రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చేతనైతే వాటికి రుజువులు చూపాలని సవాలు చేయగా అందుకు తాను సిద్ధమేనని రాహుల్ బదులిచ్చారు.మేమైతే ఇలా చేసేవాళ్లం ‘‘యుద్ధాల శకం ముగిసిందని మోదీ అంటున్నారు. కానీ నిజానికి మనమున్నదే యుద్ధాల శకంలో! ఇలాంటప్పుడు మన బలాలేమిటో అవగాహన ఉండాలి. ప్రజలే మన నిజమైన బలం’’అని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమే గనుక అధికారంలో ఉంటే వాణిజ్య ఒప్పందం విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించేది. డేటా మన అతి పెద్ద ఆస్తి. అది అమెరికాకు అందుబాటు ఉండాలంటే భారత్ను అమెరికా సేవకునిలా గాక సమాన భాగస్వామిగా పరిగణించాలని ట్రంప్కు కుండబద్దలు కొట్టేవాళ్లం. ఆ హోదాలోనే చర్చలు జరిపేవాళ్లం. దేశ ఇంధన భద్రతపై, మన రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, వాటిపై చర్చలకు తావు లేదని ఆయన ముఖం మీదే చెప్పేవాళ్లం. పాక్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ అల్పాహార భేటీ వంటి ఉదంతాలపై కచి్చతంగా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లం’’అని చెప్పుకొచ్చారు.ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ, పురీ అమెరికాతో పాటు పలు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఇండో పాక్ సరిహద్దుల్లో ఖాళీ సీసాలు, ఎందుకో తెలుసా?
భారతదేశ సరిహద్దుల గురించి మనం ఆలోచించినప్పుడు, సాధారణంగా గుర్తుకు వచ్చేది ముళ్ల తీగల కంచె. సినిమాలు, టీవీలలో ఈ దృశ్యాలనే చూస్తాం. కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే కంచె వెంట వేలాడుతున్న గాజు సీసాలుకూడా కనిపిస్తాయి. ఇవి ఎందుకు పెడతారు? వాటి వలన ప్రయోజనం ఏమిటి? తెలుసు కుందాం.నిజానికి ఇవి చూడటానికి సాధారణంగా కనిపించవచ్చు. కానీ అవి దేశాన్ని రక్షించడంలో కీలకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. సరిహద్దు గార్డులకు 'స్థానిక హెచ్చరిక'గా పనిచేస్తుంది, తరచుగా వారి ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) అనుసరించే అత్యంత ప్రభావవంతమైన 'లో-టెక్' భద్రతా పద్ధతుల్లో ఇది ఒకటి.దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే:శత్రువుల చొరబాటును గుర్తించడానికి (Intrusion Detection)సరిహద్దులో దట్టమైన పొగమంచు కురిసినప్పుడు లేదా పిచ్ చీకటిగా ఉన్నప్పుడు, అత్యాధునిక కెమెరాలు కూడా కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. అటువంటి సమయంలో, ఎవరైనా సరిహద్దు కంచెను కత్తిరించడానికి లేదా దాటడానికి ప్రయత్నిస్తే, ఆ కంచెకు ఉన్న గాజు సీసాలు ఒకదానికొకటి తగిలి శబ్దాన్ని చేస్తాయి. ఈ శబ్దం ద్వారా అలర్ట్ అయిన సైనికులు చొరబాటుదారులను వెంటనే పట్టుకుంటారు.పొగమంచు సమయాల్లో రక్షణముఖ్యంగా పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో చలికాలంలో పొగమంచు (Fog) చాలా ఎక్కువగా ఉంటుంది. కంటికి ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించని ఆ సమయంలో, ఈ సీసాలు 'అలారం'లా పనిచేస్తాయి. శత్రువు కంచెను తాకిన వెంటనే వచ్చే "కిణ కిణ" శబ్దమే సైనికులకు సిగ్నల్.ఖర్చు తక్కువ - ఫలితంఎక్కువథర్మల్ ఇమేజర్లు, సెన్సార్లు వంటి ఖరీదైన పరికరాలు లేని చోట లేదా అవి మొరాయించినప్పుడు, ఈ ఖాళీ సీసాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదు, విద్యుత్ అవసరం లేదు. కేవలం గాలికి ఊగకుండా, ఎవరైనా తాకితేనే శబ్దం వచ్చేలా వీటిని అమర్చుతారు. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు:ఈ సీసాలను సాధారణంగా శీతల పానీయాల (Soft Drinks) ఖాళీ బాటిల్స్ను సేకరించి ఉపయోగిస్తారు. కేవలం శబ్దమే కాదు, రాత్రిపూట టార్చ్ లైట్ వేసినప్పుడు ఈ గాజు సీసాలు కాంతిని పరావర్తనం (Reflection) చెందిస్తాయి, ఇది కూడా భద్రతకు అదనపు బలాన్నిస్తుంది. చాలా దేశాల సరిహద్దుల్లో అత్యాధునిక సెన్సార్లు ఉన్నప్పటికీ, మన జవాన్లు ఇప్పటికీ ఈ సంప్రదాయ పద్ధతిని నమ్ముతారు ఎందుకంటే ఇది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఇల్లు.. మనదేశంలోనే.. ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అతి పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడో విదేశాల్లో కాదు… మన భారతదేశంలోనే ఉంది. గుజరాత్లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్స్గా గుర్తింపు పొందింది. ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు, మ్యూజియం కూడా కాదు – రాజ గైక్వాడ్ కుటుంబం ఇప్పటికీ ఇక్కడే నివసిస్తోంది.లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉన్న ఈ మహల్ దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం దీని వైభవాన్ని చూపిస్తుంది. 1890లో బరోడా మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III ఈ అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు. ఆ కాలంలో ఇల్లు అనేది కేవలం నివాస స్థలం కాదు, శక్తి, సంపద, సంస్కృతికి ప్రతీక. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే దాదాపు 2.7 లక్షల పౌండ్లు ఖర్చు చేయబడ్డాయి.ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిషోల్మ్ దీనిని రూపకల్పన చేశారు. భారతీయ, ఇస్లామిక్, యూరోపియన్ శైలుల అద్భుత సమ్మేళనం ఈ నిర్మాణంలో కనిపిస్తుంది. ప్రతి మూలలో రాజ వైభవం ప్రతిబింబిస్తుంది. ప్యాలెస్ లోపలికి వెళ్లినప్పుడు దాని వైశాల్యం మనసును ఆశ్చర్యపరుస్తుంది. విశాలమైన దర్బార్ హాల్ బెల్జియం గాజుతో చేసిన ఫ్లోర్, ఇటలీ నుండి తెచ్చిన వెనీషియన్ మొజాయిక్ డిజైన్లతో అలరారుతుంది. ప్యాలెస్ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్టు, క్రికెట్ మైదానం, అందమైన తోటలు మాత్రమే కాదు, ఈ ప్యాలెస్ లో చిన్న జూ కూడా ఉంది. ఇది ఒక ఇల్లు కాదు, ఒక స్వంత ప్రపంచం లాంటిది. అప్పట్లోనే ఆధునిక సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి.1890లలోనే లిఫ్ట్ సౌకర్యం ఉండటం విశేషం.అత్యాధునిక ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలు కూడా అమర్చబడ్డాయి. అంతేకాదు, మహారాజా సాయాజీరావు గైక్వాడ్ కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. భారతదేశపు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మను ఆహ్వానించి అనేక అద్భుత తైలవర్ణ చిత్రాలను వేయించారు. నేటికీ ఆ అరుదైన కళాఖండాలు ఈ ప్యాలెస్ కే గర్వకారణంగా నిలుస్తున్నాయి. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. -
రూ.500 కోట్ల రియల్ స్కాం, సీఈవో అరెస్ట్
హరియాణాలోని గురుగ్రామ్లో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్ ‘32 అవెన్యూ’ CEO ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.500 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి పోలీసుల ప్రకారం, శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది విక్రయించాడు. భారీ మోసపూరిత ఆపరేషన్కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం రూ. 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారుల అంచనా. నకిలీ ఒప్పందాలు, తప్పుదారి పట్టించే హామీలు, లాభాల ఆశ జూపి విక్రయించాడనేది ఆరోపణ.అయితే కొనుగోలుదారులకు సంబంధిత ఆస్తిని స్వాధీనం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేయడం, యాజమాన్య పత్రాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో ఈ మెగా స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతి లావాదేవీని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి అనేక నకిలీ పత్రాలను సృష్టించి కొనుగోలు దారులను మోసం చేశాడు. ఈ విధంగా 2022 - 2023 మధ్యకాలంలో ఈ కాంప్లెక్స్లోని 3,000 చదరపు అడుగుల మొదటి అంతస్తు యూనిట్ను విక్రయించి, శర్మ వివిధ వ్యక్తుల నుండి సుమారు రూ. 500 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు అప్రా మోటెల్స్, 32 మైల్స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీసుల ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు బ్యాంకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన షెల్ ఎంటిటీలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు తర్వాత, ధ్రువ్ దత్ శర్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు చేసేఅవకాశంఉందని పేర్కొన్నారు. నిందితుడిని నగర కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు రూ.64 లక్షలు మోసం చేశారని ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక జంట ఆరోపించారు. వారి ఫిర్యాదుమేరకు డిసెంబర్లో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో సీఈఓ ధ్రువ్ శర్మ, అతని సోదరి, తల్లిదండ్రులు, ఇతరులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ లాంటి అభియోగాలు మోపడం గమనార్హం. అంతేకాదు 32వ అవెన్యూ ఉద్యోగి కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతం చెల్లించలేదట.గతంలో ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్న ధ్రువ్ శర్మ అవినీతి వ్యవహారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ గురించి ఆందోళనలను మరింత పెంచింది. -
రైల్లో శాండ్విచ్...నెటిజన్లరియాక్షన్స్ వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటివి ఎదురౌతూనే ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే 24-28 గంటలకు మించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేవారు సరిపడా భోజనాలు చేసుకుని వెంట తీసుకెళతారు. తాజాగా ఓ ఫ్యామిలీ రైలులో శాండ్విచ్లు తయారు చేసుకున్న వైనం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దివ్య జైన్ అనే ఇన్స్ట గ్రామ్ యూజర్ ‘రైల్వేలు ఇలాంటి వారిని నిషేధించాలి, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ప్రమాదకరం’ అంటూ చేసిన పోస్ట్ ప్రకారం కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎంతో సంతోషంగా బ్రెడ్, టమోటా, కీర లాంటి కూరగాయలతో శాండ్విచ్లు తయారు చేసుకున్నారు. ఒకరు కూరగాయలను కట్ చేయడం, మరొకరు బ్రెడ్పై చాకుతోసాస్, చట్నీ పూస్తూ ఎంతో జాయ్ఫుల్గా బ్రెడ్ శాండ్విచ్లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. Railways should ban such people, they are menace in public places pic.twitter.com/m5F0XBcEfD— Ritik (@ThenNowForeve) February 8, 2026 fy"> నెటిజన్ల స్పందన ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేశారు. కొంతమంది వీరి వ్యవహారాన్ని ఖండించగా, రైలంటే సొంత కిచెన్ కాదని మరికొంతమంది ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. రైల్వేస్లోకి చాకుతో ఎలా అనుమతించారు ఒకరు ప్రశ్నించారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియోఫ్యామిలీతో ట్రైన్ జర్నీలో ఎంచక్కా శాండ్విచ్లు బావుంది.. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో దొరికే ఆహారంగా అంత శుభ్రంగా ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిదేగా అన్నట్టు వారిని సమర్ధించారు. ఏముందబ్బా, హ్యాపీగా చేసుకుని తింటారు. ఆ తరువాత ఆప్రాంతాన్నిశుభ్రం చేస్తారు..ఇందులో తప్పేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ రైలులో జరిగింది అనేదానిపై స్పష్టత లేదు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం -
'మొహమ్మద్ దీపక్' కష్టాలు!
'మొహమ్మద్ దీపక్' గుర్తున్నాడా? జనవరి 26న జరిగిన సంఘటనతో అతడు పేరు దేశం మొత్తం మారుమోగింది. 70 ఏళ్ల ముస్లిం వ్యక్తికి అండగా నిలబడి వార్తల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (video viral) కావడంతో అతడి గురించి అందరికీ తెలిసింది. అతడి ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. పలువురు రాజకీయ నాయకులు కూడా మెచ్చుకున్నారు.38 ఏళ్ల దీపక్ కుమార్ ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో హల్క్ పేరుతో జిమ్ నడుపుతున్నాడు. రిపబ్లిక్ డే నాడు బజరంగ్ దళ్కు చెందిన కొంతమంది.. దుకాణం పేరు మార్చాలంటూ ముస్లిం వృద్ధుడిపై ఒత్తిడి తెచ్చారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ముసలాయన కొంచెం సమయం కావాలని వారిని అభ్యర్థించాడు. అయినా వారు వినిపించుకోకుండా వాదనకు దిగడంతో అక్కడే ఉన్న దీపక్ కుమార్ కలగజేసుకున్నాడు. బజరంగ్ దళ్ కార్యకర్తలు తన పేరేంటని అడగడంతో మొహమ్మద్ దీపక్ (Mohammad Deepak) అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బీబీసీ సహా పలు వార్తా సంస్థలు అతడిని ఇంటర్వ్యూ చేశాయి. మానవత్వంతోనే ముస్లిం వృద్ధుడికి అండగా నిలబడ్డానని దీపక్ చెప్పాడు. మనుషులంతా సమానమేనని, మనమంతా సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించాడు.జనం చప్పట్లు కొట్టరుజనవరి 26 ఘటన తర్వాత దీపక్కు ప్రశంసలతో పాటు చిక్కులు ఎదురయ్యాయి. కోట్ద్వార్లో (Kotdwar) సంఘీభావంతో పాటు నిరసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. కొంత మంది అతడిని సమర్థించగా, మరికొంత మంది వ్యతిరేకించారు. జనవరి 31న, బజరంగ్ దళ్ సభ్యులు దీపక్ను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ''కోట్ద్వార్ పట్టణంలో సగం మంది నన్ను సమర్థిస్తారు, కానీ మీరు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టరు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి రావచ్చు" అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.150 నుంచి 15కు డౌన్మరోవైపు దీపక్ జిమ్ను వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకు 150 మంది వచ్చేవారని, ఇప్పుడు కనీసం 15 మంది కూడా రావడం లేదని దీపక్ వాపోయాడు. ''ఆ ఘటన తర్వాత నా జిమ్కు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. వాళ్ల భయం నాకు అర్థమైంది. నెలకు రూ. 40,000 అద్దెతో జిమ్ (Gym) నిర్వహిస్తున్నాను. అదీగాక ఈ మధ్యనే ఇల్లు కూడా కట్టుకున్నాను. దీనికి నెలవారీ రూ. 16,000 రుణాన్ని చెల్లిస్తున్నాను. నాకున్న ఆదాయమార్గం జిమ్ ఒకటే. సభ్యుల సంఖ్య బాగా తగ్గడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంద''ని దీపక్ వాపోయాడు.జాన్ బ్రిట్టాస్ సంఘీభావం దీపక్ కుమార్కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 8న కోట్ద్వార్ పట్టణానికి వచ్చి దీపక్తో పాటు మొహమ్మద్ బాబా డ్రెస్ షాప్ యజమాని వకీల్ అహ్మద్ను కలిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీపక్ జిమ్కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో తాను సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్స్లో వెల్లడించారు జాన్ బ్రిట్టాస్.చదవండి: మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?''మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ తరపున శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను కోట్ద్వార్ పట్టణానికి వెళ్లాను. దీపక్ను మాత్రమే కాకుండా అతడి తల్లి, భార్య, బిడ్డను కూడా కలిశాను. జీవనోపాధి కోసం టీ అమ్ముకునే అతని తల్లి అందించే వేడి అల్లం టీ తాగాను. మతపరమైన అంశాల బెదిరింపుల కారణంగా ఇప్పుడు నిర్జనమై ఉన్న అతని జిమ్ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నాను. ముహమ్మద్ బాబా వస్త్ర దుకాణాన్ని కూడా సందర్శించి కొన్ని కొనుగోళ్లు చేశాను. దీపక్పై కేసు నమోదు చేసిన కోట్ద్వార్ పోలీస్ స్టేషన్లో బలమైన నిరసన తెలియజేశాను. 'ముహమ్మద్' దీపక్గా రూపాంతరం చెందిన దీపక్ కుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతడు భవిష్యత్ విశ్వాసానికి వజ్ర-ప్రకాశవంతమైన కాంతి'' అంటూ జాన్ బ్రిట్టాస్ ఎక్స్లో పేర్కొన్నారు. "Deepak Kumar, now known as 'Muhammad' Deepak... is a beacon of hope in the struggle against the Hindutva communalism .Deepak Kumar entered the scene in Kotdwar, in the foothills of the Himalayas, when Bajrang Dal activists began harassing an elderly man named Muhammad. This… pic.twitter.com/ZVuA5VwgGb— John Brittas (@JohnBrittas) February 8, 2026 -
‘రైట్ టూ రీకాల్’పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో పనితీరు లేని ఎంపీలు,ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. రాజ్యసభ జీరో అవర్లో రాఘవ్ చద్దా ఓ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రజలకు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు పనితీరు బాగలేకపోతే వారిని తొలగించుకునే హక్కు కల్పించాలని కోరారు.ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నిక చేసే హక్కు ఇస్తుంది కానీ, ఎన్నికైన ప్రతినిధులను పనితీరు లేకపోవడం లేదా అవినీతి వంటి కారణాలతో పదవీ కాలం పూర్తికాకముందే తొలగించే ప్రత్యక్ష విధానం లేదు అని ఆయన అన్నారు. ‘రైట్ టు రీకాల్’ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను పనితీరు లేకపోతే లేదా అవినీతిలో చిక్కుకుంటే తొలగించే అవకాశం కలుగుతుంది అని పేర్కొన్నారు.ఈ హక్కు ఇప్పటికే ప్రపంచంలోని 24 దేశాల్లో అమలులో ఉందన్నారు. అదే సమయంలో పంచాయతీ స్థాయిలో మనదేశంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఈ ప్రతిపాదనపై సభలో కొంతమంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చద్దా మాత్రం ఈ హక్కు సాధారణ రాజకీయ విభేదాల కోసం కాకుండా, నిరూపితమైన అవినీతి, మోసం, లేదా విధులను నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడాలని స్పష్టం చేశారు.ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే, ప్రజలకు వారిని తిరస్కరించే శక్తి ఉండాలి అని ఆయన వాదించారు.మొత్తం మీద, రాఘవ్ చద్దా చేసిన ఈ ‘రైట్ టు రీకాల్’ ప్రతిపాదన భారత రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఇది అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావచ్చని భావిస్తున్నారు. -
రాహుల్ గాంధీపై కేంద్రం సీరియస్
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది. దీనిపై రాహుల్ సాయంత్రం 5గం లోపు స్పీకర్ కార్యాలయంలోకి హజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఆయన చేసినవన్ని నిరాధార ఆరోపణలని తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసలు వాస్తవం లేదని దానికి సంబంధించిన చాలా నిజాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటుచోరి అంటూ అంటూ రాహుల్ ఎలక్షన్ కమిషన్పై ఆయన చేసిన డ్రామా విఫలమయ్యిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.కాగా అంతకు ముందు రాహుల్ గాందీ పార్లమెంటులో మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని దానికి ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ అన్నారు.అయితే రాహుల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంశం ప్రస్థావించాలని ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ అదానీ, అంబానీ, హర్ధీప్ సింగ్ పేర్లను ప్రస్థావించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. -
బంపర్ ఆఫర్.. వైన్ కొంటే బీర్ ఉచితం
సాక్షి, చెన్నై : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్గా వైన్ కొంటే బీర్ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు తక్కువ. ఇక్కడ వివిధ రకాల బ్రాండ్లు లభిస్తుంటాయి. తమిళనాడుతో పోలిస్తే తక్కువ ధరలకు ఇక్కడ విస్తృత శ్రేణి మద్యం బ్రాండ్లు లభించడం జరుగుతుంది. అందమైన సాగర తీరప్రాంత నగరం కావడంతో పుదుచ్చేరికి నిత్యం పర్యాటకులు హోరెత్తుతుంటారు. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి మద్యపాన ప్రియులు తరచుగా పుదుచ్చేరికి వస్తుంటారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో మద్యం వ్యాపారం ఇక్కడ జోరుగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో పుదుచ్చేరిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పుదుచ్చేరి నిలవడంతో, మద్యం దుకాణాలు ఇప్పుడు పండుగ సీజన్కే పరిమితం కాకుండా ప్రత్యేక రోజుల సందర్భంగా కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో, వాలెంటైన్స్ డే సందర్భంగా ‘‘వైన్ కొనుగోలు చేస్తే బీరు ఉచితం’’ అంటూ కొన్ని మద్యం దుకాణాలు ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులను ఆకర్షించి, తర్వాత విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు వినియోగదారులు తాము మోసపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. అలాగే ఇక్కడి హోటల్స్, రిసార్ట్స్లు సైతం ప్రేమికుల దినోత్సవ ఆఫర్లు అంటూ సోమవారం నుంచి ప్రత్యేక ప్రకటనలను ఇచ్చుకునే పనిలో పడ్డాయి. ఫిబ్రవరి 14వ తేదీకి మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఇక్కడి ఆఫర్లపై దృష్టి పెట్టే వాళ్లు పెరిగారు. అదే సమయంలో మద్యం దుకాణాలలో ఆఫర్ల ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తేలితే, సంబంధిత మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్సభలో కేంద్ర బడ్జెట్పై జరుగుతున్న చర్చల్లో బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా స్థిరత్వం నుండి తీవ్రమైన అస్థిరత వైపు వేగంగా పయనిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సంబంధాలను గమనించకుండా.. ఆర్థిక ప్రణాళికలు రచించడం సాధ్యం కాదని రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తుతున్న అలజడులు భారత ఆర్థిక వ్యవస్థపై, దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దీనిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలని రాహుల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, అందులో తాను గమనించిన రెండు అత్యంత లోతైన అంశాలను సభకు వివరిస్తున్నానని అన్నారు. అందులో మొదటిది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా లాంటి శక్తులు సవాలు చేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. ఇక రెండవది ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఆయుధాలుగా మలుచుకుంటున్న తీరు అని అన్నారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా అంచనాలకు అందని స్థితికి నెట్టేస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అనే వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని రాహుల్ అన్నారు. ప్రపంచమంతా అస్థిరమైన, ఊహించని కొత్త ఒరవడిలోకి మారుతోందని విశ్లేషించారు. లోక్సభలో అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, డాలర్ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్ సూచించారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం తదితర అంతర్గత సమస్యలతో పాటు, ప్రపంచ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన ఉండాలని రాహుల్ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు. -
ఒంటరిగానే గెలుస్తాం.. స్టాలిన్
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ అంశంపైనే ఇటీవల DMK ఎంపీ MP కనిమెుళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సారి కాంగ్రెస్కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.డీఎంకే ఒంటరిగానే మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అంతేకాకుండా 2021 లో సాధించిన స్థానాల కంటే ఈ ఏడాది మరిన్ని అధిక సీట్లు గెలుస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ గతంతో పోలిస్తే మరిన్ని అధిక స్థానాలు కోరుతుందని తెలుస్తోంది. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ స్థానంకోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సీట్ల షేర్ అంశాలు ఈ నెల 22నుంచి ప్రారంభమవుతాయని డీఎంకే పార్టీ ప్రకటించింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సినీనటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. -
ముంబై మేయర్గా రీతూ తావ్డే ఏకగ్రీవం
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో కొత్తదనం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ముంబై నూతన మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. శివసేన (యూబీటీ) అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనితో బీఎంసీపై 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్కోపర్ వెస్ట్ నుండి మూడుసార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయి రాజకీయాలు, ప్రజా సంక్షేమ రంగాల్లో ఆమెకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. 2012లో వార్డు 127 నుండి తొలిసారిగా బీఎంసీలోకి అడుగుపెట్టిన ఆమె, 2017లో వార్డు 121 నుండి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జనవరి 15న జరిగిన ఎన్నికల్లో వార్డు 132 నుండి ఘనవిజయం సాధించి తన పట్టును మరోమారు నిరూపించుకున్నారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్పర్సన్గా కూడా సేవలందించారు.మొత్తం 227 స్థానాలు ఉన్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షమైన శివసేన 29 స్థానాలను దక్కించుకుంది. 118 మంది కార్పొరేటర్ల బలంతో బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. 1997 నుండి సుమారు 25 ఏళ్ల పాటు బీఎంసీని పాలించిన శివసేన (యూబీటీ) ఈసారి 65 స్థానాలకే పరిమితమైంది. వారి మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆరు స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నాయి. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ అభ్యర్థిని నిలబెట్టకూడదని శివసేన (యూబీటీ) నిర్ణయించుకుంది. -
‘తొలగింపు నోటీసు’లో లోపాలు.. మరో అవకాశం ఇచ్చిన స్పీకర్
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసులో సాంకేతిక, విధానపరమైన లోపాలు ఉన్నట్లు లోక్సభ సచివాలయం గుర్తించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫార్మాట్లో ఈ నోటీసు లేదని అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు నోటీసును తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ స్పీకర్ ఓం బిర్లా ఈ భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.ఈ నోటీసులో ప్రధానంగా కాలక్రమ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ నోటీసులో రాబోయే కాలానికి సంబంధించిన సంఘటనలను సుమారు నాలుగు సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం జరిగిన సంఘటనల ఆధారంగానే నోటీసు ఉండాలి తప్ప, భవిష్యత్తు తేదీలను పేర్కొనడం నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి పొరపాట్ల వల్ల ఈ నోటీసును రద్దు చేసే అధికారం సచివాలయానికి ఉన్నప్పటికీ, తదుపరి చర్యల కోసం స్పీకర్ సానుకూలంగా స్పందించారు.సాంకేతిక కారణాలతో నోటీసును తోసిపుచ్చకుండా, అందులోని లోపాలను సరిదిద్దుకునేలా విపక్షాలకు అవకాశం కల్పించాలని స్పీకర్ సచివాలయ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని, అవసరమైన సవరణలు చేయించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. సవరించిన నోటీసు అందిన వెంటనే, నిబంధనలకు లోబడి త్వరితగతిన పరిశీలించాలని సచివాలయానికి ఆదేశాలు జారీ చేశారు.సవరించిన నోటీసు తిరిగి సమర్పించిన తర్వాత, అది పార్లమెంటరీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో అధికారులు మరోసారి తనిఖీ చేయనున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగిసిన తర్వాత, రెండో విడత ప్రారంభంలో ఈ అంశాన్ని చర్చకు స్వీకరించే అవకాశం ఉంది. విపక్షాల ప్రతిపాదనపై తుది నిర్ణయం వారు సమర్పించే సవరణల పైనే ఆధారపడి ఉంటుందని సచివాలయ వర్గాలు తెలియజేశాయి. -
చండీగఢ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బాంబు బెదిరింపుల కాల్స్ ఈ మధ్య తరచుగా మారాయి. తాజాగా ఛండీగఢ్లోని పలు పాఠశాలలలో బాంబులు పెట్టామంటూ ఈ రోజు ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను ఖాళీ చేయించారు.ఛండీగఢ్తో పాటు పక్కనే ఉన్న మోహలీ ప్రాంతంలో పాఠశాలలో బాంబులు పెట్టామని బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. అదే విధంగా కొన్ని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో వెంటనే పోలీసులు పాఠశాలలకు చేరుకున్నారు. డాగ్స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో గాలింపు చేపట్టారు. అయితే ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు తరచుగా మారాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే ఇలా బెదిరింపు కాల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అలాంటి వాడింకా పుట్టలేదు!
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి బుధవారం లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ‘‘భరతమాతను ఎవరూ విక్రయించలేరు. ఆ ఆలోచన కూడా ఎవరూ చేయలేరు. అలా మన దేశాన్ని అమ్మేయగల, కొనగల వాడెవడూ ఇంకా పుట్టలేదు’’అంటూ రాహుల్ వ్యాఖ్యలను సభలోనే తిప్పికొట్టారు. దేశం ఇప్పటిదాకా చూసిన అత్యంత బలమైన ప్రధాని మోదీయేనని మంత్రి పేర్కొన్నారు. నిండు సభలో అబద్ధాలు చెప్పడం, వాటిపై సంబంధిత మంత్రి సమాధానం కూడా వినకుండా ని్రష్కమించడం రాహుల్కు అలవాటేనని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్ ఏ ప్రపంచంలో విహరిస్తుంటారో తెలియదు! విపక్ష నేతకు ఉండాల్సిన సీరియస్నెస్ ఆయనలో ఇసుమంతైనా లేదు. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తున్నప్పుడు సభలో ఉండాల్సిందిగా సూచించినా ఆగకుండా వెళ్లిపోయారు. ఒక సభ్యుడు తన ప్రసంగం పూర్తవగానే సభ నుంచి నిష్క్రమించడం నిబంధనలకు విరుద్ధం’’అని దుయ్యబట్టారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రిజిజు మీడియాతో కూడా మాట్లాడారు. విపక్ష నేత ప్రసంగం పూర్తిగా అబద్ధాలమయమంటూ దుయ్యబట్టారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్ను కోరతామని పేర్కొన్నారు. అంతేగాక సభలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ ధ్రువీకరించాలంటూ నోటీసిస్తామని కూడా చెప్పారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావిస్తానని రాహుల్ పట్టుబట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రధాని, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ నడుమ జరిగే సంభాషణలను బహిరంగంగా చర్చించడం నిషిద్ధం. అలా చేస్తే దేశ భద్రత పరిస్థితేమిటి? ఇలాంటి సున్నితమైన అంశంపై రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తించారు. దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోజూశారు. దీన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. తాను ఎంపీనని, దేశ ప్రజల పట్ల తనకు నిర్దిష్ట బాధ్యతలున్నాయని ఆయన గుర్తుంచుకుంటే మంచిది’’అన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని రిజిజు మండిపడ్డారు. స్పీకర్తో దుర్భాషలు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్లోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని రిజిజు ఆరోపించారు. కె.సి.వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ వాద్రా వంటి సీనియర్ నేతలు వాళ్లను వారించకపోగా మరింతగా ప్రోత్సహించారని ఆక్షేపించారు. ‘‘ఆ సమయంలో నేనూ అక్కడే ఉన్నా. బిర్లాపై కాంగ్రెస్ ఎంపీలు ఎలాంటి దారుణమైన పదాలు వాడారో చెప్పలేను! దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సహృదయుడు కాట్టి ఊరుకున్నారు గానీ లేదంటే వారిపై కఠిన చర్య తీసుకునేవారే’’అని చెప్పారు. #WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "... At least 20-25 Congress MPs entered the Lok Sabha Speaker's chamber and abused him. I was also there. The Speaker is a very soft person, otherwise strict actions would have been taken. Senior Congress… pic.twitter.com/4SQ8eGEZ3X— ANI (@ANI) February 11, 2026 -
బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!
యశవంతపుర(బెంగుళూరు): ఉత్తర కన్నడ జిల్లా కారవార సిద్ధాపురలో వసంత నాయక్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు కమలాకర భట్ను నిందితురాలు సుచిత్ర హనీట్రాప్ చేసి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ చేసిన విషయాన్ని భర్త మహేశ్ నాయక్ వెల్లడించారు. జ్యోతిష్యుడు కమలాకర భట్ను సుచిత్ర హనీట్రాప్ చేయటంతో పాటు ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు. కమలాకర్ భట్ సుచిత్రకు దగ్గర అయిన తరువాత ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది. పిల్లలు, తాను నీ జతలోనే ఉంటామని కమలాకర భట్తో చెప్పి, తమను బాగా చూసుకోవాలని డిమాండ్ చేసింది. బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతానంటూ కమలాకర భట్ను బెదిరించినట్లు సమాచారం. మర్యాద పోతుందనే భయంతో సుచిత్ర, ఆమె పిల్లలను కమలాకర భట్ తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని తన కుమార్తెలు చెప్పినట్లు మహేశ్ నాయక్ విలేకరులకు వెల్లడించారు. ఫస్ట్లుక్కు రూ.10 వేలు.. సుచిత్ర బుట్టలో పడిన కమలాకర్ భట్.. ఫస్ట్ లుక్లో రూ.36 వేలు చెల్లించాడు. ఫస్ట్లుక్లో రూ.10 వేలు వస్తే చాలు అనుకున్న సుచిత్రకు ఒక్కసారిగా 36 వేలు రావడంతో సంతోష పడింది. ఇందులో ఆమె వేతనం కింద రూ.25 వేలు, షాపింగ్కు రూ.10 వేలు తీసుకున్నట్లు సుచిత్రా భర్త మహేశ్ నాయక్ చెబుతున్నారు. -
‘జనగణమన’కు ముందే వందేమాతరం
న్యూఢిల్లీ: బంకించంద్ర చటర్జీ రచించిన దేశభక్తిని ఉప్పొంగించే జాతీయగేయం వందేమాతరాన్ని ఇకపై మొత్తం ఆరు చరణాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించాలని కేంద్ర హోం శాఖ దేశ పౌరులకు బుధవారం సూచించింది. దశాబ్దాల క్రితం తొలగించిన 4 చరణాలతో కలిపి పూర్తిగా ఆరు చరణాలనూ పాడాల్సిందేనని స్పష్టంచేసింది. జాతీయగీతం జనగణమన కంటే ముందుగా జాతీయగేయమైన వందేమాతరంను ఆలపించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు జాతీయగేయంను ఆలపించడంలో అనుసరించాల్సిన ప్రామాణిక నియమనిబంధనలను జనవరి 28వ తేదీతో రూపొందించిన ఒక ఉత్తర్వును కేంద్రం బుధవారం విడుదలచేసింది. అందులో అనుసరించాల్సిన పూర్తి ప్రొటోకాల్స్ను పొందుపరిచింది. ‘‘రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలు, త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించే సందర్భాలు, గవర్నర్ ప్రసంగాల వంటి పలు కీలక ప్రభుత్వ కార్యక్రమాల్లో కచ్చితంగా జాతీయగేయం వందేమాతరంను మూడు నిమిషాల 10 సెకన్లలో పూర్తిగా ఆరు చరణాలను ఆలపించాలి. మృదంగనాదం మొదలైన తర్వాత వందేమాతర ఆలాపన ఆరంభంకావాలి. కొన్ని కార్యక్రమాల్లో జాతీయ గేయం, జాతీయగీతం రెండూ పాడాల్సి వస్తే తొలుత జాతీయగేయమైన వందేమాతరం ఆలపించాలి. వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ కచ్చితంగా నిలబడాలి. ఎక్కడ జాతీయగేయాన్ని ఆలపిస్తున్నా, రికార్డింగ్ను ప్లే చేస్తున్నా అక్కడి ప్రేక్షకులంతా నిలబడాలి. అయితే సినిమా వంటి న్యూస్రీల్ లేదా డాక్యుమెంటరీని ప్లే చేసేటప్పుడు జనం పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి హఠాత్తుగా అందరూ నిల్చుని పాడాలంటే ఎగ్జిబిషన్/సినిమా హాల్లో కొంత గందరగోళం తలెత్తే ఆస్కారముంది. అందుకే ఈ చోట్లలో మాత్రం నిలబడటం తప్పనిసరేం కాదు. పాఠశాలల్లో మాత్రం రోజూ దినచర్యను తప్పకుండా జాతీయగేయంతోనే ఆరంభించాలి’’అని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. మోదీ సర్కార్ 150వ వందేమాతర వార్షికోత్సవాలను జరుపుతున్న వేళ ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ముద్రిత చరణాలను పంచండి ‘‘ఆడిటోరియం వంటి ఎన్క్లోజర్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జనం ఒకేసారి జాతీయగేయం పాడే సందర్భాల్లో ఒకే గొంతుకగా వందేమాతరం వినిపించేందుకు వీలుగా పబ్లిక్ ఆడిషన్ సిస్టమ్లో ప్లే చేయాలి. లేదంటే ఒక శ్రుతిలో అందరూ పాడేందుకు వీలుగా ప్రింట్ చేసిన చరణాలను అందరికీ అందజేయాలి. మంత్రులు పాల్గొనే అధికార కార్యక్రమాల్లో కుదిరితే వందేమాతరం ఆలపించొచ్చు. అన్ని పాఠశాలల్లో మాత్రం పనిదినాలను విద్యార్థులంతా కలిసి జాతీయగేయం పాడి మొదలెడితే సముచితంగా ఉంటుంది. జాతీయ గేయం, జాతీయగీతం, భరతమాత, జాతీయపతాకాలపై విద్యార్థుల్లో గౌరవం పెరిగేలా పాఠశాల యాజమాన్యాలు తగు నిర్ణయాలు తీసుకోవచ్చు’’అని కేంద్రం పేర్కొంది. అయితే జాతీయ చిహ్నం, జాతీయ గేయం, జాతీయ గీతం, రాజ్యాంగాలను బహిరంగంగా కించపరిచే వాళ్లను శిక్షించేందుకు అమలుచేసే ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్స్ యాక్ట్’ను జాతీయగేయంకు ఆపాదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఎవరైనా జాతీయగేయాన్ని కించపరిచినా, అవమానకరంగా మాట్లాడినా గరిష్టంగా మూడేళ్ల కారాగారశిక్ష పడే ఆస్కారముంది. -
దురంధర్ పాటకు గన్ డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత
కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రైవేట్ పార్టీకి వెళుతున్న సందర్భంలో చేతిలో పిస్తోలు పట్టుకొని ఇటీవల సూపర్ హిట్టైన దురంధర్ చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు అతనిపై విచారణ చేపట్టారు.మథీన్ పటేల్ అనే కాంగ్రెస్ నేత అక్కడి కల్బుర్గి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఫంక్షన్లోకి వస్తుండగా ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. గన్స్తో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మథీన్ పటేల్ సైతం చేతిలో రివాల్వార్తో ఫోజులిచ్చారు.ఇటీవల విడుదలై సూపర్ హిట్టైన దురందర్ చిత్రంలోనే ఓ ఫేమస్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలై పోలీసుల దాకా చేరడంతో ఆయనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కల్బుర్గి పోలీస్ కమిషనర్ శరణప్పా ఈ అంశంపై స్పందించారు.మథీన్ పటేల్ పట్టుకున్న ఆయుధాలు నకిలీవా లేదా లైసెన్స్డ్కు చెందినవా అనే విషయాలు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఆ ఫంక్షన్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారా అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఆ గన్స్ లైసన్స్ లేనివైతే ఆయనపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఆ వీడియోలో, మథీన్ పటేల్ బ్లాక్ కలర్ SUVలో ఎంట్రీ ఇస్తారు. ఆయన అనుచరులు గన్స్తో స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి గన్స్తో డాన్స్ చేస్తాడు. ఈ సన్నివేశం ఇటీవల రిలీజైన దురంధర్ చిత్రంలోని రెహమాన్ డకైట్ (అక్షయ్ ఖన్నే) ఎంట్రీ లాగానే ప్లాన్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A display of “gun culture” by a #Congress leader in #Kalaburagi district has now become a major topic of debate.A Congress leader named Mateen Patel, said to be a close associate of #Afzalpur Assembly constituency MLA #MYPatil, is at the center of the controversy after videos… pic.twitter.com/hFASTKkwuH— Hate Detector 🔍 (@HateDetectors) February 10, 2026 -
ముస్లిం దంపతుల ఔదార్యం
రాయచూరు(కర్ణాటక): ముస్లిం తల్లిదండ్రులు, తమ హిందూ దత్తపుత్రుని పెళ్లిని హిందూ సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ అపురూపమైన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా బస్తవాడిలో జరిగింది. వివరాలు.. మెహబూబ్ హసన్ నాయికోడి, నూర్జహాన్ దంపతులు ఈ ఔదార్యాన్ని చాటుకున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన శివానంద కాడయ్య దంపతులు అర్ధాంతరంగా చనిపోయారు. వారి కుమారులు సోమశేఖర్ (4), వసంత్ (2)లను మెహబూబ్ దంపతులు చిన్నప్పుడే దత్తత తీసుకుని పోషిస్తున్నారు. మెహబూబ్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైరయ్యారు. అప్పటికే వారికి ఇద్దరు చొప్పున మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నా భారంగా భావించకుండా చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేశారు. సోమశేఖర్ డిగ్రీ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తు పూనం అనే యువతిని ప్రేమించాడు. దీంతో కాడ సిద్ధేశ్వర మండపంలో ముస్లిం తల్లిదండ్రులు హిందూ సంప్రదాయ రీతిలో దత్త కుమారుని పెళ్లి వేడుకలను జరిపించారు. మత సమైక్యతకు ఈ సన్నివేశం అద్దం పట్టగా, మెహబూబ్, నూర్జహాన్లను గ్రామస్తులు అభినందించారు. -
సోషల్ మీడియా సెలబ్రిటీ రేష్మా ఆత్మహత్య!
బెంగుళూరు: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే విడాకులు అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్ను పోలీసులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి. View this post on Instagram A post shared by Real Time Malayali (@realtime_malayali) -
విషాదం.. ముగ్గురు పిల్లలని చంపి ఆపై వారు మృతి
ఉత్తరప్రదేశ్లో విషాదం జరిగింది. తీవ్ర మనస్థాపంతో ఒక పండంటి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముక్కుపచ్చలారని తమ ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపిన అనంతరం భార్యభర్తలిద్దరూ తనవు చాలించారు.మధురలో నివసించే మనిష్ కుమార్ అనే వ్యక్తికి 2018లో వివాహమయ్యింది. వారికి హానీ, ప్రియాంశ్, ప్రీతిక్ అనే ముగ్గురు పిల్లలు అయితే ఏం జరిగిందే తెలియదు కాని కుటుంబసభ్యలు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ముగ్గురిని గొంతు నులిమి హతమార్చిన అనంతరం భార్యభర్తలు తనువు చాలించారు.మనిష్ విద్యుదాఘాతంతో మరణించగా ఆయన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే వారి ఇంటి వద్ద సూసైడ్కు సంబంధించిన ఒక వీడియో లభించింది. అందులో తమ ఇష్టపూర్వకంగానే తాము చావాలనుకుంటున్నారని ఇందులో ఎవరి తప్పుగానీ బలవంతం గానీ లేదన్నారు. పోలీసులు సైతం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని లేఖలో పేర్కొన్నారు.అయితే తాను ఇటీవల ఒక స్థలాన్ని రూ.12 లక్షలకు అమ్మానని దానికి ఎటువంటి ఇబ్బందులు జరగలేదని వీడియోలో పేర్కొన్నారు.అయితే పిల్లలు ఆడుకోవడానికి బయిటకి రాకపోగా అనుమానం చెందిన గ్రామస్థులు తలుపులు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో గోడలు బద్దలు గొట్టి లోపలికి వెళ్లగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆసమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేప్టటారు. -
8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే
రాయచూరు( కర్ణాటక ): కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు. కళ్లుచెదిరే కట్న కానుకలు.. జిల్లాలోని సింధనూరులోని రామ్ కిశోర్ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు. నవంబరు నుంచి నరకం అయితే నవంబర్ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్ చేశామని తెలిపారు. -
మంచుకురిసే వేళలో.. ‘ఇగ్లూ విలేజ్’కి వెళితే..
సన్నగా మంచు కురుస్తుంటే దానిని చూసేందుకు ఇష్టపడని వారు ఎవరుంటారు? చుట్టూ తెల్లని మంచు దుప్పటి పరుచుకుంది.. ఆకాశం నుండి మంచు ముత్యాలు రాలుతున్నాయి... ఇటువంటి దృశ్యాలను తనివితీరా చూడటం ఒక ఎత్తయితే, ఏకంగా మంచుతో కట్టిన ఇంట్లోనే (ఇగ్లూ) ఉండటం మరో ఎత్తు. హిమాచల్ ప్రదేశ్లోని సేథన్ గ్రామం ఇప్పుడు ఆ కలను నిజం చేస్తోంది. సాహస యాత్రికుల నుండి ప్రకృతి ప్రేమికుల వరకు అందరినీ ఆకర్షిస్తున్న ఈ ‘ఇగ్లూ విలేజ్’ విశేషాలు మీకోసం..మనాలిలో సరికొత్త అద్భుతంహిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో, సముద్ర మట్టానికి సుమారు 2,700 మీటర్ల ఎత్తులో ఉంది సేథన్ గ్రామం. మనాలికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న గ్రామం ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ‘ఇగ్లూ విలేజ్’గా ప్రపంచ పటంలో నిలుస్తోంది. విదేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఇగ్లూలు ఇప్పుడు మన దేశంలోనే అందుబాటులోకి రావడం విశేషం. ఇవి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.గడ్డకట్టే చలిలోనూ వెచ్చదనంఇగ్లూలు మంచుతో కట్టినవే అయినా వాటి లోపల ఉష్ణోగ్రత ఆశ్చర్యకరంగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉన్నప్పటికీ, ఇగ్లూ లోపల మాత్రం బయటి కంటే దాదాపు 8∘C నుండి 10∘C వరకు ఎక్కువ వేడి ఉంటుంది. మంచు గోడలు బయటి గాలిని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడమే దీనికి మూల కారణం. పర్యాటకులు వెచ్చని స్లీపింగ్ బ్యాగుల్లో పడుకుని, ఈ వింత అనుభూతిని ఎంతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.ఆర్కిటిక్ అనుభూతి.. మన హిమాచల్లోనే!గతంలో మనం ఇగ్లూలను చూడాలంటే అలాస్కా లేదా ఫిన్లాండ్ వంటి దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సేథన్ గ్రామం ఆ లోటును తీరుస్తోంది. ఇక్కడి ఇగ్లూల నిర్మాణం అత్యంత నైపుణ్యంతో కూడుకున్నది. మంచు ఇటుకలను ఒక పద్ధతిలో పేర్చి, రూపొందించే ఈ ఇగ్లూలు, సందర్శకులకు ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నామనే భ్రమను కలిగిస్తాయనడంలో సందేహం లేదు.సాహసాలకు చిరునామా.. సేథన్కేవలం ఇగ్లూ బస మాత్రమే కాదు, సేథన్ గ్రామం సాహస క్రీడలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటకులు స్కీయింగ్ , స్నోబోర్డింగ్ తదితర క్రీడల్లో పాల్గొనవచ్చు. అలాగే రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద క్యాంప్ ఫైర్ వేసుకుని, వేడి వేడి ఆహారాన్ని ఆస్వాదించడం ఒక మరపురాని అనుభూతినిస్తుంది.సోషల్ మీడియాలో సెన్సేషన్ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సేథన్ ఇగ్లూ విలేజ్ వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. మంచు దుప్పటి కప్పుకున్న పైన్ చెట్లు, అద్భుతమైన పర్వత దృశ్యాలు ఫోటోగ్రాఫర్లకు పండగలా మారుతున్నాయి. ‘స్విట్జర్లాండ్ ఎందుకు? మన సేథన్ ఉండగా!’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.పర్యాటక రంగంలో సరికొత్త విప్లవంఈ ఇగ్లూ విలేజ్ రాకతో హిమాచల్ ప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఉత్సాహం వచ్చింది. స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, పర్యావరణానికి హాని కలగని రీతిలో ఈ పర్యాటకం సాగుతుండటం విశేషం. మంచు కురిసే జనవరి నుండి మార్చి వరకు ఈ ఇగ్లూలు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటాయి.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త.. ఇకపై మార్కుల్లో పొరపాట్లకు చెల్లు! -
మౌనం వీడిన జనరల్ నరవణే.. ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: తన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ప్రచురణకు సంబంధించి గత కొద్దిరోజులుగా సాగుతున్న వివాదంపై మాజీ సైన్యాధిపతి జనరల్ (రిటైర్డ్) ఎంఎం నరవణే ఎట్టకేలకు స్పందించారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ఇచ్చిన వివరణను ఆయన సమర్థించారు. ఒక పుస్తకాన్ని ప్రకటించడం లేదా ముందస్తు ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచడం అంటే అది పబ్లిక్ రిలీజ్ అయినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రచురణకర్త సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ను ఆయన షేర్ చేస్తూ, వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటు ఆవరణలో ఈ పుస్తకానికి సంబంధించిన కాపీని ప్రదర్శించడమే కాకుండా, 2023లో నరవణే చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ను ప్రస్తావించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన ప్రచురణ సంస్థ, పుస్తక ప్రచురణ ప్రక్రియ గురించి వివరించింది. ఒక పుస్తకాన్ని ప్రకటించడం అంటే భవిష్యత్తులో దానిని తీసుకురాబోతున్నామని చెప్పడమే తప్ప, అది అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదని స్పష్టం చేసింది. రిటైలర్లు, పాఠకుల సౌకర్యార్థం ముందస్తు ఆర్డర్లు తీసుకోవడం అనేది ప్రచురణ రంగంలో సాధారణ పద్ధతి మాత్రమేనని తెలిపింది. This is the status of the book. https://t.co/atLtwhJvl0— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాకముందే దాని మాన్యుస్క్రిప్ట్ డిజిటల్, ఇతర రూపాల్లో అక్రమంగా చలామణి అవుతుండటంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పుస్తకానికి సంబంధించి తమకు మాత్రమే ప్రచురణ హక్కులు ఉన్నాయని, అనుమతి లేకుండా పిడిఎఫ్ లేదా ముద్రిత రూపంలో పంపిణీ చేయడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రచురణకర్త హెచ్చరించారు.గత వారం పార్లమెంటులో రాహుల్ గాంధీ ఈ పుస్తక ప్రతిని చూపిస్తూ, చర్చకు ప్రయత్నించారు. ఫిబ్రవరి 2 నుంచి లోక్సభలో ఈ ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించాలని ఆయన భావించినప్పటికీ, పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదనే కారణంతో ఆయనను అడ్డుకున్నారు. పుస్తకం రిటైల్ ఛానళ్లలో అందుబాటులోకి వచ్చినప్పుడే అది ప్రచురితమైనట్లు పరిగణించాలని ప్రచురణ సంస్థ స్పష్టం చేయడంతో, రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.ఇది కూడా చదవండి: ‘మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పరు’: రాహుల్ గాంధీ -
పోలవరంపై రాజీపడొద్దు.. ఏపీని అప్పుల కుప్పగా మార్చొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. 2026–27 బడ్జెట్పై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా ఎండగట్టారు. తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరి్థకమంత్రిని అభినందిస్తూ.. 2026–27 మూలధన వ్యయాన్ని రూ.12.21 లక్షలకోట్లకు పెంచడాన్ని స్వాగతించారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.5 శాతం పెరుగుదల అని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పోలవరాన్ని 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్ ప్రసంగంలో దీన్ని 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 41.15 మీటర్ల వద్ద కేవలం 75 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలమని, దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని చెప్పారు. తద్వారా లక్షలాదిమంది రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55 వేలకోట్లు కాగా, సవరించిన వ్యయం రూ.30,436 కోట్లకు కుదించడం రాష్ట్ర రైతులకు చేసే ద్రోహమేనని మండిపడ్డారు. ఆఫ్ బడ్జెట్ అప్పులతో రాష్ట్రం ఎటు పోతోంది? ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మొత్తం అప్పులు రూ.3.32 లక్షలకోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3.20 లక్షలకోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేలకోట్లు, ఏపీఎస్సీఎల్ ద్వారా వేలకోట్లు అప్పులు చేస్తూ రాష్ట్ర ఖజానాను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెప్పారు. ఏపీఎండీసీ నిధులను ప్రైవేట్ వ్యక్తులు నేరుగా వాడుకునేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఇలాంటి ఆఫ్ బడ్జెట్ అప్పుల వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తుచేశారు. లక్షలకోట్లు అప్పులు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేలకోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోతోందని ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన వైద్యవిద్యను ప్రైవేట్పరం చేయడం వెనుక మర్మమేమిటని నిలదీశారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు, సామాన్య ప్రజలు వైద్యానికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక డిమాండ్లు రాష్ట్రానికి సంబంధించి ఆయన పలు డిమాండ్లు చేశారు. అవి.. » విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపేసి, దానికి ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి. » విభజన హామీ అయిన కడప స్టీల్ప్లాంట్ను త్వరితగతిన పూర్తిచేయాలి. » కడప–బెంగళూరు రైల్వేలైన్ పనులను 100 శాతం కేంద్ర నిధులతో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. » ఉపాధిహామీ పథకం స్థానంలో వచ్చిన వీబీజీ రామ్ పథకంలో రాష్ట్ర వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచడం వల్ల ఏపీ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఏపీకి కూడా 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి. » రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎగువ పెన్నార్ అనుమతులు రద్దయ్యాయి. కేంద్రం చొరవ తీసుకుని ఆ అనుమతులను పునరుద్ధరించాలి. -
నెట్టింట 'డీప్గా' నకిలీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల డీప్ఫేక్ ప్రకటనలు, క్లోన్డ్ వాయిస్లు, వీడియోలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. 2025లో ఏకంగా 80 లక్షల డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లోకి చొచ్చుకుపోయాయి. ఈ వీడియోల కారణంగా బాధితుల కీర్తిప్రతిష్టలకు భంగం కలగడంతోపాటు సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటువంటి కంటెంట్కు సోషల్ మీడియా వేదికలు ‘ఏఐతో రూపొందించినది’ అని యూజర్లకు కనిపించేలా ప్రసారం చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్సైబర్ నేరగాళ్ల లక్ష్యం ఎవరంటే..» ఫేక్ యాడ్స్, గౌరవానికి భంగం కలిగించే డీప్ఫేక్ వీడియోల్లో 40% సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారు.» వేధింపులు, మోసాలకు సంబంధించిన వీడియోలతో బాధితులుగా మిగిలిన వారిలో 35% మంది ప్రైవేట్ వ్యక్తులు.» ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, డీప్ఫేక్ కంటెంట్తో సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వారిలో 99% మంది మహిళలే.» వ్యాపారులు లక్ష్యంగా నకిలీ ప్రొఫైల్స్, బ్రాండ్ పేరుతో 40% మోసాలు జరుగుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ కంటెంట్ విస్తృతి ఇలా..» గతేడాది 80 లక్షలకుపైగా డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయని అంచనా.» ఏటా ఈ కంటెంట్ 900% అధికం అవుతోంది.» 2023తో పోలిస్తే డీప్ఫేక్ ఫైల్స్ గత ఏడాదికి 1,500% పెరిగాయి. » ఇటువంటి కంటెంట్ ఉత్తర అమెరికాలో ఏకంగా 1,740%, ఆసియా పసిఫిక్లో 1,530% పెరిగింది.» డీప్ఫేక్ కంటెంట్లో సింహభాగం వీడియోలు కైవసం చేసుకున్నాయి.డీప్ఫేక్తో అంతర్జాతీయంగా ఆర్థిక మోసాలు..» డీప్ఫేక్ కంటెంట్ను ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసాలు ఏడాదిలో 3,000% అధికం అయ్యాయి.» వాయిస్ క్లోనింగ్ విధానం సైబర్ నేరగాళ్ల మోసాల్లో సర్వసాధారణం» డీప్ఫేక్ కంటెంట్ కారణంగా గరిష్టంగా ఒక బాధితుడు నష్టపోయిన మొత్తం రూ.2.18 కోట్లు.» కంపెనీలు, ఫైనాన్స్ టీమ్స్, కుటుంబాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. డీప్ఫేక్ ఖాతాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా..సంవత్సరం సంఖ్య2019 15,0002022 5 లక్షలు2023 10 లక్షలుడీప్ఫేక్ దుర్వినియోగంపై అంతర్జాతీయంగా నమోదైన కేసులు..సంవత్సరం కేసుల సంఖ్య2024 1502025 జనవరిృమార్చి 179(ఆధారం: లాత్వియాకు చెందిన ఫోరెన్సిక్ డివైజెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్ సొల్యూషన్స్ కంపెనీ రెగ్యులా) -
మనసు బాగుంటే..మెరుపు గ్యారంటీ!
ఎన్ని క్రీములు వాడినా మొటిమలు తగ్గడం లేదా? అయితే సమస్య మీ చర్మంలో లేదు. మీ మైండ్లో ఉంది! ముఖానికి ఎన్ని మెరుగులు దిద్దినా ‘గ్లో’ రావటం లేదా? అందుకు కూడా కారణం మీ మెదడే అంటున్నారు వైద్య నిపుణులు. విషయం ఏంటంటే..మీ చర్మం కేవలం ఒక పొర మాత్రమే కాదు. అది మీ లోపల మసులుతున్న భావోద్వేగాలను ప్రదర్శించే ఒక పెద్ద డిజిటల్ బోర్డు కూడా. ఎంత కడిగి, ఎంత రుద్ది, ఎన్ని లేపనాలు పూసినా మీ ముఖ చర్మం కాంతి విహీనంగా ఉంటోందంటే.. దోషం మీ మేకప్ కిట్లో కాకుండా, మీ కోపతాపాల్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి!ఎమోషనల్ లగేజీఅందం అనేది చర్మంపై కనిపించేదే అనుకుంటాం. కానీ మానసిక ఒత్తిడి చర్మాన్ని మసకబార్చి, ఎముకల దాకా వెళ్తుంది. మీరు ఎప్పుడూ కోపంతో రగిలిపోతుంటే, మీ బాడీ ‘కార్టిసో ల్’ అనే హార్మోన్స్ ను విచ్చలవిడిగా విడుదల చేస్తోందని అర్థం. అది మీ మూడ్ని పాడు చేయడమే కాదు, ముఖాన్ని ఆయిలీగా మార్చేసి, మొటిమలకి ఘన స్వాగతం పలుకుతుంది.భయం కూడా అంతే!మీలోని భయం మీ శరీరాన్ని ఎప్పుడూ ‘యుద్ధం’ చేసే ఒత్తిడి మూడ్లో ఉంచుతుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. అంటే, పులి వచ్చి మీద పడబోతోందన్న భయంలో మీ శరీరం తత్తరపాటుగా ఉండి, అందాన్ని పట్టించుకోవడం మానేస్తుందన్నమాట!మీ లోపలే దివ్యౌషధాలు!అదృష్టవశాత్తూ మీలోనే ఒక ‘ల్యాబొరేటరీ’ ఉంది. అది మీ చర్మాన్ని కాంతివంతం చేసే హార్మోన్లను తయారు చేస్తుంటుంది. ఖరీదైన సౌందర్య సాధనాల అవసరం లేకుండానే, మీ శరీరం ఉత్పత్తి చేసే నాలుగు హ్యాపీ హార్మోన్లతో మీ చర్మం పదికాలాలు కాంతులీనుతుంది. నవ్వు రాకున్నా నవ్వండిమీకు అసలు నవ్వు రాకపోయినా, అప్పుడప్పుడు కావాలని నవ్వండి. మీరు నవ్వగానే మీ మెదడు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఫీలయ్యి డొపమైన్ను, సెరోటోనిన్ విడుదల చేస్తుంది. దీనికి కొంచెం కృతజ్ఞత, ఇంకొంచెం సంతృప్తి తోడైతే అది మీకు మీరు చేసుకునే ఒక ఉచిత ‘బయోలాజికల్ ఫేషియల్’ అవుతుంది. పది రకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అయ్యే కంటే, ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం సాధన చెయ్యండి. కడిగితే పోని ఏకైక మేకప్.. మీ ‘ప్రశాంతమైన మనసు’ మాత్రమే అని గుర్తించండి! ప్రశాంతంగా ఉండాలిఆందోళన, ఒత్తిడి, ఇతర మానసికమైన సమస్యలు ఏవైనా చర్మ సౌందర్యంపై తప్పక ప్రభావం చూపుతాయి. భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిజాల్, ఎడ్రినలిన్ వంటి రసాయనాలు వెలువడతాయి. అవి మన హార్మోన్ల అసమతౌల్యతకు కారణమవు తాయి. ఎమోషనల్ డిస్ట్రబెన్స్ల వల్ల జుట్టు రాలిపోవడం, చర్మంపై నల్లమచ్చలు రావడం వంటి ఇతర సమస్యలూ తలెత్తే అవకాశాలూ ఉంటాయి. అలాగే, చర్మంలో నిగారింపు తగ్గి, కాంతి విహీనం అవుతుంది. వ్యాధి నిరోధకత తగ్గడంతో ఇన్ఫెక్షన్లకూ ఆస్కారముంటుంది. అందుకే చర్మాన్ని సంరక్షించుకోవటానికి మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండడం, ప్రశాంతంగా గడపడం చాలా ముఖ్యం. – డాక్టర్ స్వప్న ప్రియ, సీనియర్ డెర్మటాలజిస్ట్నాలుగు ‘హ్యాపీ హార్మోన్’లుడొపమైన్: ఇదొక ‘గోల్–గెట్టర్’ (లక్ష్యసాధకుడు) లాంటిది. వ్యాయామం చేసినా, ఏదైనా చిన్న పని విజయవంతంగా పూర్తి చేసినా, మ్యూజిక్ విన్నా ఇది విడుదల అవుతుంది.ఎండార్ఫిన్లు: ఇవి శరీరం విడుదల చేసే సహజసిద్ధ నొప్పి నివారిణులు. (పెయిన్ కిల్లర్స్). నవ్వినా లేదా కొంచెం డార్క్ చాక్లెట్ తిన్నా ఇవి ఉబికి వస్తాయి. ఆక్సిటోసిన్: ఇది ప్రేమను పంచే హార్మోన్. ఎవరినైనా ఆత్మీయంగా హత్తుకున్నా, పెట్ యానిమల్స్తో ఆడుకున్నా ఇది ఉత్పత్తి అవుతుంది.సెరొటోనిన్: ఇది మీ మూడ్ మెకానిక్. సూర్యరశ్మి, మెడిటేషన్ ద్వారా దీన్ని సెట్ చేసుకోవచ్చు.మీ అందానికి శత్రువులు – వాటి ప్రభావాలు -
భారత్లో అవినీతి తగ్గుముఖం!
న్యూఢిల్లీ: భారత్లో అవినీతి కొంత తగ్గుముఖం పట్టినట్లు అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ అయిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)–2025 నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 182 దేశాల్లో అవినీతి నిర్మూలనపై అధ్యయనం చేయగా, భారత్కు 91వ స్థానం దక్కింది. గత ఏడాది 96వ స్థానంలో నిలిచిన భారత్ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆసియా పిసిఫిక్ దేశాల్లో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు క్రమంగా పెరుగుతున్నాయని, వాటి ఫలితాలు సైతం కనిపిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలియజేసింది. ప్రపంచంలో ప్రతిచోటా అవినీతి అనేది అతిపెద్ద జాడ్యంగా మారినట్లు ఆందోళన వ్యక్తంచేసింది. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత పాలకులు, రాజకీయ నేతలు చొరవ చూపాలని, వారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించింది. జవాబుదారీతనం లేని నాయకుల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు జరుగుతున్నాయని వెల్లడించింది. వారంతా వ్యవస్థల్లో సంస్కరణలు కోరుకుంటున్నారని తెలియజేసింది. వ్యవస్థల ప్రక్షాళనతో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ⇒ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 182 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతిని అధ్యయనం చేసి ర్యాంకులు ఇచి్చంది. సున్నా నుంచి 100 దాకా స్కోర్ కేటాయించింది. సున్నా స్కోర్ అంటే అత్యంత అవినీతి దేశమని అర్థం. 100 దాకా స్కోర్ వస్తే అక్కడ అవినీతి ఆనవాళ్లు పెద్దగా లేనట్లే. ⇒ పలుదేశాల్లో అవినీతిని బహిర్గతం చేస్తున్న జర్నలిస్టులకు హెచ్చరికలు ఎదురవుతున్నాయి. దాడులు జరుగుతున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ⇒ అవినీతిపై పరిశోధన చేసి, ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులకు హత్యకు గురవుతు న్నా, దాడులను ఎదుర్కొంటున్నా పాలకులు సరిగ్గా స్పందించడం లేదని కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ నివేదిక ఆక్షేపించింది. ⇒ 2012 నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 829 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అవినీతిని బయటపెట్టడమే వీరు చేసిన నేరం. ⇒ సీపీఐ స్కోర్ 50 కంటే తక్కువ ఉన్న దేశాలైన బ్రెజిల్, ఇండియా, మెక్సికో, పాకిస్తాన్, ఇరాక్లో ఎక్కువ మంది జర్నలిస్టులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ స్కోర్ 35, ఇండియా స్కోర్ 39, మెక్సికో స్కోర్ 27, పాకిస్తాన్ స్కోర్ 28, ఇరాక్ స్కోర్ 28గా ఉంది. ⇒ 31 దేశాల్లో 2012 నుంచి అవినీతి గణనీయంగా తగ్గిపోయింది. మిగిలిన దేశాలు అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యాయి. కొన్ని దేశాల్లో అవినీతి అదేస్థాయిలో ఉండగా, మరికొన్ని దేశాల్లో కొంత పెరిగింది. ⇒ ప్రపంచ సగటు సీపీఐ స్కోర్ 42గా నమోదైంది. మూడింట రెండొంతుల దేశాల స్కోర్ 50 కంటే తక్కువే ఉన్నట్లు తేలింది. ⇒ అవినీతి వల్ల ప్రజలకు భారీగా నష్టం జరుగుతోంది. వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. మౌలిక వసతులు అందడం లే దు. యువత ఆశలు సాకారం కావడం లేదు. ⇒ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ రిపోర్టులో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం స్కోర్ 89. అవినీతి నిర్మూలనలో ఫిన్లాండ్, సింగపూర్ కంటే డెన్మార్క్ ముందంజలో ఉంది. చిట్టచివరి స్థానాల్లో దక్షిణ సూడాన్, సోమాలియా, వెనెజులా నిలిచాయి. ⇒ అగ్రదేశం అమెరికాకు 29వ ర్యాంకు, యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు 20వ ర్యాంకు లభించింది. ⇒ ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, యూకే, న్యూజిలాండ్లో అవినీతి నిర్మూలన ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదని నివేదిక పేర్కొంది. అవినీతిని అంతం చేయాలన్న సంకల్పం అక్కడి పాలకుల్లో కనిపించడం లేదని వెల్లడించింది. ⇒ అవినీతి పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో పెచ్చరిల్లుతున్న అవినీతి సమాజానికి ముప్పుగా పరిణమిస్తోంది. పాలకులు అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ జర్నలిస్టులను, ఎన్జీఓలను కట్టడి చేయాలని చూస్తున్నారు. పాలకుల్లో పారదర్శకత గానీ, జవాబుదారీతనం గానీ లోపిస్తున్నాయి. అంతిమంగా ఇది అవినీతికి బాటలు వేస్తున్నట్లు కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ నివేదిక తేలి్చచెప్పింది. -
ఆ రెండు పుస్తకాలు ఒక్కటి కావు
న్యూఢిల్లీ: చైనా బలగాలతో భారత సైన్యం పోరాటానికి సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పుస్తకం చర్చనీయాంశం కావడంతో దాని ప్రచురణసంస్థ ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆ పుస్తకాన్ని ఇప్పటిదాకా ముద్రించలేదని, ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార కాపీ అని పెంగ్విన్ ర్యాండమ్ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ప్రీ–ఆర్డర్ అని పేర్కొన్నంత మాత్రాన అది ఇప్పటికే ముద్రితమై అమ్మకానికి సిద్ధంగా ఉందని కాదు. త్వరలో ప్రచురితంకావొచ్చు అని అర్థం. అంతేగానీ పుస్తకం ముద్రించామని మేం ఎక్కడా పేర్కొనలేదు’’అంటూ పుస్తకాలకు సంబంధించి తాము అనుసరించే 4 విధానాలను పెంగ్విన్ ర్యాండమ్ వివరించింది. అవి.. 1. కొత్త పుస్తకాన్ని ప్రకటించం: అంటే కొత్త రచన, నూతన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం జరిగిందని అర్థం. అంతేగానీ ఈ పుస్తకం ఇప్పటికే ముద్రితమైందని కాదు. అది ఇంకా ఆన్లైన్లోకి అందుబాటులోకికూడా రాదు. 2. ప్రీ–ఆర్డర్: ఇది ప్రచురణకు సంబంధించిన ప్రామాణిక అనుసరణీయ విధానం. నచి్చతే పాఠకులు లేదా రిటైల్ సంస్థలు త్వరలో ప్రచురితంకాబోయే ఈ పుస్తకం కోసం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ దశలోనూ పుస్తకం ముద్రితంకాదు. అందుబాటులో ఉండదు. 3. రాబోయే తేదీ ఖరారు: ఫలానా తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం జరిగిదంతే. అంతమాత్రాన ఆరోజుకల్లా పుస్తకం ముద్రితమైపోతుందని అర్థంకాదు. 4.ముద్రిత పుస్తకం: విక్రయాల కోసం రిటైల్ దుకాణాల్లోకి వచ్చాకే ఆ పుస్తకం అధికారికంగా ముద్రితమైందని భావించాలి. పుస్తకాన్ని ఏరకంగానూ విడుదల చేయలేదు: పెంగ్విన్‘‘నరవణె రాసిన ఈ పుస్తకాన్ని ప్రింట్ లేదా డిజిటల్ లేదా పీడీఎఫ్ ఇలా ఏ ఫార్మాట్లోనూ అందుబాటులోకి తేలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ముద్రించలేదు. ఎవరికీ విక్రయించలేదు. ఆన్లైన్ వేదికలపై ప్రత్యక్షమైనదంతా అనధికార వెర్షన్ మాత్రమే. దానితో మాకు సంబంధం లేదు. పుస్తకం ప్రచురణ హక్కులు మాకే ఉన్నాయి. పుస్తకాన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు. బహిర్గతంచేయలేదు. ప్రస్తుతం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ రూపాల్లో షేర్ అవుతుంటేగనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కులను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ అంశంలో మేం చట్టపర చర్యలు తీసుకుంటున్నాం’’అని సంస్థ స్పష్టం చేసింది. మౌనం వీడిన నరవణె పుస్తకం వివాదం కావడంతో ఎట్టకేలకు నరవణె మౌనం వీడారు. ఈ పుస్తకం ఇంకా ప్రచురితంకాలేదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం పెంగ్విన్ ఇండియా సంస్థ వెల్లడించిన ఒక ప్రకటనను నరవణే మంగళవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. ‘‘పుస్తకం తాజా స్థితి ఇదే’’అని దానికి ఒక క్యాప్షన్ పెట్టారు. పుస్తకమొచ్చిందని రెండేళ్ల క్రితమే చెప్పారు: రాహుల్పుస్తకం ప్రచురితంకాలేదన్న పెంగ్విన్ వాదనల్లో నిజంలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో రాహుల్ మాట్లాడారు. గతంలో నరవణే చేసిన ట్వీట్ను రాహుల్ అందరిఎదుట బయటకు చదివి వినిపించారు. ‘‘హలో ఫ్రెండ్స్. నేను రాసిన పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడున్న లింక్ను క్లిక్చేసి చదవండి. ఆనందంగా పఠనం పూర్తిచేయండి. జైహింద్ అని నరవణె రాసుకొచ్చారు. ఇది డిసెంబర్ 2023లో నరవణె ఆయన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. పుస్తకం అసలు ప్రచురితంకాలేదని పెంగ్విన్ చెబుతోంది. కానీ ఇప్పటికే ఈ పుస్తకం అమెజాన్లో ఉన్నట్లు తెలుస్తోంది’’అని రాహుల్ అన్నారు.


