breaking news
National
-
నానబెట్టిన మెంతుల నీళ్లతో డయాబెటిస్ నిజంగా తగ్గుతుందా?
రాత్రంతా నానబెట్టిన మెంతుల నీళ్లను పరగడుపున తాగితే ఆరోగ్య ప్రయోజలున్నాయా? ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందా? బరువు, ఆకలిని అదుపులో ఉంచుతుందా? పదండి దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో డయాబెటిస్కు సహాయపడుతుందని ఆయుర్వేదం వైద్య విధానం ఇటీవలి అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మెంతి నీరు అత్యంత విస్తృతంగా సిఫార్సు చేస్తున్న సహజ నివారణలలో ఒకటి. సాంప్రదాయ వైద్యం, కొన్ని పరిశోధనలు కూడా ఇదే సూచిస్తున్నాయి.ఆరోగ్య ప్రయోజనాలు మెంతి గింజలలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.మెంతిలో ఒక అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది క్లోమం నుండి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుందని తేలింది. ఇది హైపోగ్లైసీమిక్ చర్యకు నేరుగా దోహదం చేస్తుంది.కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండే మెంతి గింజలు ఒక రకమైన కరిగే ఫైబర్ను కలిగి ఉంటాయి, ఇది పేగులో జెల్ లాంటి పదార్థాన్ని సృష్టించి చక్కెర , కార్బోహైడ్రేట్ల శోషణను గణనీయంగా నెమ్మదిస్తుంది. ఇది భోజనం తర్వాత పదునైన, ఆకస్మిక రక్తంలో చక్కెర స్పైక్లను నివారిస్తుంది.HbA1c తగ్గింస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల HbA1c స్థాయిలు(మూడు నెలల్లో సగటు ) అదుపులో ఉంటాయి ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది.ఖాళీ కడుపుతో మెంతి నీటిని తీసుకోవడం గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది.మెంతులులోని ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది.మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది . వమెంతి గింజలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి తద్వారా గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడుతుంది. మెంతి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు లేదా మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి.అంతేకాదు ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే మెంతి గింజల నీళ్లు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.నోట్: సూపర్ ఫుడ్ మెంతి నీటిని రోజువారీ దినచర్యలో తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ మీ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ అవసరం. కనీసం వ్యాయాయం, సమతుల ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర, నీళ్లు తాగడం చాలా కీలకమైంది. ఏమైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించితగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. కానీ శ్రద్ధ వహించండి మరియు సరైన మార్గదర్శకత్వం కోసం విశ్వసనీయ వైద్య సలహా తీసుకోండి -
పుతిన్తో అధికారిక విందుకు శశిథరూర్కు ఆహ్వానం!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్కు రాష్ట్రపతి భవన్లో ఇచ్చే అధికారిక విందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఆహ్వానం అందింది. ఇరు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలను బలపరచడానికి ఇచ్చే ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు(శుక్రవారం) రాత్రి పుతిన్తో కలిసి శశిథరూర్ విందలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జన ఖర్గేలక ఆహ్వానం అందలేదట. కేవలం కాంగ్రెస్ నుంచి శశిథరూర్ను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్ల తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీతో ప్రధాని నరేంద్ర మోదీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్న శశిథరూర్.. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. పుతిన్తో విందుకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడికి ఇచ్చిన మర్యాదను తన ఆహ్వానం ప్రతిబింబిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ (External Affairs)కి శశి థరూర్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బయట శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ ఇదొక సాంప్రదాయం. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వమే మాత్రమే ఫాలో అవుతూ వస్తుంది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయ్ దీన్ని ప్రారంభించింది. ఏ దేశం నుంచైనా అధ్యక్షులు ఇక్కడకు(భారత్) వస్తే ప్రతిపక్షం నుంచి ఒకరు హాజర కావడం జరగుతుంది. కానీ ప్రస్తుత రోజల్లో విదేశీ నేతల్ని.. ప్రతిపక్ష నేతలు కలవ కూడదని కూడా కొన్ని ప్రభుత్వాల ఆంక్షలు విధించాయి’ అని అని స్పష్టం చేశారు. -
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ : ఉన్నత స్థాయి విచారణ
ఇండిగో సంక్షోభం కేంద్రం సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదనకమిటీ విచారణఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. -
ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదన
ఇండిగో ఎయిర్లైన్స్లో నెలకొన్న సంక్షోభం ఎంతో ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దేశవ్యాప్తంగా విమానాల అంతరాయాలు వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఒక టెకీ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్ను వీడియో కాల్తో సరిపెట్టుకోవాల్సింది. మరో సంఘటన తన బిడ్డకు అధిక రక్తస్రావం అవుతోంది, కనీసం శ్యానిటరీ ప్యాడ్లు ఇవ్వండి అని వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముందస్తు నోటిఫికేషన్ లేకుండా విమానాల్ని రద్దు చేయడం ఒకెత్తు అయితే, ఈ గంగరదోఠం మధ్య మానసిక ఆందోళనతోపాటు, గమ్య స్థానాలకు చేరుకునేందుకు, అక్కడి ఖర్చులు మరింత భారంగా మారడం మరో ఎత్తు. ఇదే అదును ఇతర విమానయాన సంస్థలు తమ ధరలను విపరీతంగా పెంచేయడం దారుణం.బెంగళూరుచెందిన ఒక మహిళది మరో హృదయ విదారక గాథ. వేలాది మంది ప్రయాణీకులలో ఒకరైన నమిత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. తండ్రి అస్థికలను పుణ్య నదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్కు బయలుదేరిన నమిత మహిళ బెంగళూరులో చిక్కుకుంది. చేతుల మధ్య కలశం పట్టుకుని, చితాభస్మాన్ని అత్యవసరంగా నిమజ్జనం చేయాలి, హరిద్వార్ చేరుకోవడానికి సాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంది."నా తండ్రి చితాభస్మాన్ని నాతో తీసుకెళ్తున్నాను. బెంగళూరు నుండి ఢిల్లీకి విమానంలో డెహ్రాడూన్కు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుండి నా తండ్రి చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి హరిద్వార్కు వెళ్లాలి" అని నమిత చెప్పింది. అంతేకాదు మరో విమానం టికెట్ బుక్ చేయాలంటే ఒక్కొక్కరికీ 60 వేలుఅవుతుంది. తాము ఐదుగురం ఉన్నామని వాపోయింది. ఇప్పుడు రైలు లేదా బస్సు టిక్కెట్లు అందుబాటులో లేవని కూడా నమిత పేర్కొంది. మరోవైపు నుంచి హరిద్వార్ నుండి తన స్వస్థలమైన జోధ్పూర్కు రిటన్ ఇప్పటికే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంది. విమానాల ఆలస్యం కారంగా అవి కూడా రద్దయ్యే పరిస్థితి.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన తరుణంలో కేంద్రం దృష్టి సారించింది. ఇండిగో విమానాల రద్దుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ పరిస్థితిన సమీక్షిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు. పైలట్ల రోస్టర్ సిస్టమ్ పూర్తిగా నిలిపివేసిన కేంద్రం.. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రయాణికుల కొరకు కంట్రోల్ రూమ్ నంబర్ 011 2461 0843 2469 3963 ఏర్పాటు చేసింది కేంద్రం.ఇదిలా ఉంచితే, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలురద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.ఏమి జరిగింది?గత కొన్ని రోజుల్లో 1,000కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.డీజీసీఏ కొత్తగా అమలు చేసిన Flight Duty Time Limit (FDTL) నియమాలు పైలట్ల అలసటను తగ్గించేందుకు కఠినంగా అమలు చేయడం వల్ల, ఇండిగోలో క్రూ షెడ్యూలింగ్ పూర్తిగా దెబ్బతింది. -
టిట్ ఫర్ టాట్ పడిందా?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచీ అన్ని వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.. ప్రధానంగా ప్రతీదేశం తమ అదీనంలో ఉండాలని ఆకాంక్ష ట్రంప్లో బలంగా నాటుకుపోయినట్లుంది. అందుకే ఆ దేశం, ఈ దేశం అని లేదు.. అన్ని దేశాలను తన చర్యలతో భయపెడుతున్నారు. తమది అగ్రరాజ్యమనే అహంకార భావనలో ఉన్న ట్రంప్ చేస్తున్న చేష్టలు కొన్ని దేశాలకు విసుగుతెప్పిస్తూనే ఉంది.అలా ట్రంప్ చర్యలతో ఎక్కువగా విసుగుపోయిన దేశాలలో రష్యా ఒకటి, భారత్ మరొకటి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. అదే సమయంలో భారత్కు ఆంక్షలు కూడా విధించారు. ‘ మీరు రష్యా ఆయిల్ కొనడానికి వీల్లేదనే హుకుం జారీ చేశారు. ఇది రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికని శాంతి ప్రవచనాలు కూడా చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఎంతవరకూ నియంత్రించారో తెలీదు కానీ, రష్యా మాత్రం మళ్లీ భారత్కు చమురు సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్కు చమురు కొనసాగిస్తాం.. : పుతిన్ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. మీడియా సాక్షిగా భారత్కు అన్ని రకాల చమురు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అమెరికా భయపెడితే భయపడిపోవడానికి తామేమీ చిన్న పిల్లలం(చిన్న దేశం) కాదనే సంకేతం ఇచ్చారు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఇరు దేశాల మధ్య ఒప్పందాల గురించి వివరించే క్రమంలో చమురును భారత్కు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అసలే పుతిన్ భారత్ పర్యటనపై ఫుల్ ఫోకస్ పెట్టిన ట్రంప్.. ఈ మాట అనేసరికి నోట్లో వెలక్కాయపడినట్లు అవ్వడం ఖాయం. పుతిన్-మోదీలు ఏం చెబుతారా అనే ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పుతిన్ మాటలకు చిర్రెత్తుకొచ్చినట్లు అయ్యి ఉంటుంది. గతంలో వైట్హౌస్ వేదికగా పుతిన్-ట్రంప్ల మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ కూడా సజావుగా సాగలేదు. తమ ఆంక్షలకు కట్టుబడి ఉండాలనే ఒత్తిడితో ఆ భేటీ సఫలం కాలేదు. ‘శాంతి’ చర్యలు అంటూ పలు దేశాలకు తలనొప్పివేరే దేశాన్ని నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంతటి అగ్రజుడు అయినా తమ అధీనంలో అంతా ఉండాలని అనుకోవడం అవివేకం. వీటికి ఎన్నో కథలు, ఉదాహారణలు, సామెతలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే. ఇప్పటి వరకూ ట్రంప్ చేసింది ఏదైనా ఉందంటే అది తన ‘శాంతి’ చర్యలతో మిగతా దేశాలని నొప్పించడమే జరుగుతుంది. ఇక్కడ తమ మాట వింటే ఒక రకంగా, మాట వినకపోతే మరో రకంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ‘కశ్మీర్’ అంశాన్ని తాను పరిష్కరిస్తానని ట్రంప్ చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు గుర్తే. ఆ మాటలకు భారత ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్గానే సమాధానం ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ట్రంప్ను పరోక్షంగా హెచ్చరించారు. అంటే పుతిన్-మోదీలిద్దరూ ట్రంప్ను అంతగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నారు. స్నేహ ధర్మంలో హద్దులు దాటి ‘సరిహద్దులు’ వరకూ వస్తే ఊరుకోమని సంకేతాలు పంపుతూనే ఉన్నారు. అందుకే మోదీ-పుతిన్ల భేటీపై ట్రంప్ సీరియస్ లుక్ వేసి ఉంచారు. ప్రస్తుతం పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్కు వినబడ్డాయా.. లేదా అనే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి:పాక్తో ఇంకా సంబంధాలెందుకు?: అమెరికా ఎంపీల డిమాండ్ -
విమానాల రద్దు.. ఇండిగో కీలక ప్రకటన
ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలు-రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.-క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.-ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.-అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.-వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది. -
ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..
దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.మార్గదర్శకాల్లోని వివరాలునివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్పై కచ్చితమైన పరిమితిని విధించింది.నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకోవచ్చు.వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ -
పెళ్లిలో రసగుల్లా గోల : పిడిగుద్దులతో మల్లయుద్ధమే వైరల్ వీడియో
బిహార్లోని బోధ్ గయలో జరిగిన వింత ఘటన నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి విందులో వడ్డించిన స్వీట్ సరిపోకపోవడం దుమారం రేగింది. వధూవరుల కుటుంబ సభ్యుల వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద యుద్ధమే జరిగింది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డైంది. అసలు ఏం జరిగిందంటే..ఒక వివాహం సందర్బంగా జరిగిన పెళ్లి విందులో రసగుల్లా కొరత వచ్చింది. దీంతో వధువు, వరుడి కుటుంబాలు ఘర్షణకు దిగడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలూ విచక్షణ మర్చిపోయి కొట్టుకున్నారు. నెట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. ఈ దృశ్యాలు వివాహం జరుగుతున్న హోటల్లోని సీసీటీవీలో రికార్డైనాయి. A chaotic scene unfolded in a wedding in #Bihar's #BodhGaya after the bride and the groom's families exchanged blows over a shortage of rasgulla.The incident was caught on CCTV installed inside the hotel where the wedding was taking place, and the video surfaced online.… pic.twitter.com/As6vU9WXSZ— Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2025 ఈ సంఘటన నవంబర్ 29న జరిగింది. పెళ్లి వేడుక కోసం వధూవరుల కుటుంబాలు ఒకే హోటల్లో బస చేశాయి. ప్రీవెడ్డింగ్ వేడుకల తరువాత పెళ్లి మంటపానికి వెడుతుండగా వివాదం మొదలైంది. అది తీవ్రమై కొట్టుకునే దాకా వచ్చింది. రసగుల్లా కొరత కారణంగా జరిగిన గొడవ కారణంగా వివాహం రద్దయింది. తరువాత వధువు కుటుంబం వరుడి తరపు వారిపై వరకట్న కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా, ఒక గ్రూపు గొడవకు దిగి, కుర్చీలు, ప్లేట్లతో దాడికి దిగారు. దీంతో రెండు వైపుల నుండి చాలా మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ బుధవారం రసగుల్లా లేకపోవడం వల్ల గొడవ జరిగిందని ధృవీకరించారు. వరుడి కుటుంబం వివాహాన్ని కొనసాగించడానికి అంగీకరించగా, వధువు కుటుంబం ముందుకు సాగకూడదని నిర్ణయించుకుంది.వరుడి తల్లి మున్నీ దేవి, గొడవ జరుగుతుండగా, వధువు కుటుంబం తాను బహుమతిగా తెచ్చిన ఆభరణాలను తీసుకుందని ఆరోపించింది. హోటల్ బుకింగ్ కూడా తామే చేశామని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం జరగాలని వధువు కుటుంబంతో సర్ది చెప్పాలని ప్రయత్నించాం. కానీ ఫలించలేదని వరుడి బంధువు సుశీల్ కుమార్ తెలిపారు. మొత్తానికి సర్దుకుపోవాల్సిన స్వల్ప విషయానికి ఒక శుభకార్యం ఆగిపోయింది. పంతాలు, పట్టింపులతో ఇరువైపు అవమానాలు, ఆర్థిక నష్టం తప్ప మరేమీ మిగల్లేదు. ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ: భారత్-రష్యాలమధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వివిద రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సహకారం వలస విధానంపై ఒప్పందంతో పాటు, ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందం, కెమికల్ ఫెర్టిలైజర్స్ సరఫరాపై ఇరు దేశాల మధ్య ఒప్పందం, సముద్ర ఆహార ఉత్పత్తులపైనా ఒప్పందాలు జరిగాయి.దీనిలో భాగంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షడు పుతిన్ల సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలపై కీలక సంతకాలు జరిగాయన్నారు. ‘పుతిన్ నేతృత్వంలో భారత్-రష్యాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. గత ఎనిమిది దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం.భారత్-రష్యాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుంది. రష్యా ఎప్పట్నుంచో మనకు మిత్రదేశం. 2030 వరకూ ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు శిఖరాగ్రానికి చేరతాయి’ అని స్పష్టం చేశారు.అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. ‘ నాకు అపూర్వ స్వాగతం పలికిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. భారత ఆతిథ్యం సంతోషాన్ని ఇచ్చింది. భారత్-రష్యాల మధ్య సహృద్భావ వాతావరణం. నేను మోదీతో అంతర్జాతీయ అంశాలను షేర్ చేసుకున్నా. ఆర్థిక, భద్రత తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. భారత్, రష్యాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం. మేకిన్ ఇండియాకు మా మద్యతు ఉంటుంది. భారత్కు చముర సరఫరాను కొనసాగిస్తాం’ అని తేల్చి చెప్పారు పుతిన్. -
ఇండిగోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గగనతల ప్రయాణాలపై గందరగోళం కొనసాగుతున్న వేళ.. ఇండిగోకు భారీ ఊరట దక్కింది. పైలట్లకు వారాంతపు విశ్రాంతి ఇచ్చే ఏవియేషన్ న్యూ రూల్స్ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడి ప్రయాణాలు సాఫీగా సాగే అవకాశం కనిపిస్తోంది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(FDTL) పేరిట.. పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసింది డీజీసీఏ. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్లైన్స్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటికే పైలట్ల కొరతలో ఉన్న ఇండిగోకు ఇది మరింత చిక్కుల్ని తెచ్చి పెట్టింది. పైలట్ల కొరత కారణంగా గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేసింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో..డీజీసీఏ ఇండిగో నుంచి వివరణ కోరింది. అయితే పరిస్థితుల ప్రభావం, ఇండిగో నుంచి వివరణ.. రూల్స్ విషయంలో మినహాయింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.నాలుగు రోజుల్లో..నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనల్లో.. పైలట్లు రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని డీజీసీఏ ఆదేశించింది. రోజులో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. రాత్రి పూట ఫ్లైయింగ్, ల్యాండింగ్ విషయంలోనూ కఠిన నిబంధనలు తెచ్చింది. వీటితో పాటు ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. కానీ, రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో ఎయిర్లైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రూల్స్ను తక్షణమే ఉపసంహరించుకుంది.డీజీసీఏ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం విమాన పైలెట్లకు వారంలో కనీసం 48 గంటల విశ్రాంతినివ్వాలి. దీన్ని సెలవులకు ప్రత్యామ్నాయంగా వాడటం కుదరదు. అయితే ఇండిగో విమానాల మూకుమ్మడి కేన్సిలేషన్ నేపథ్యంలో డీజీసీఏ ఈ నిబంధనను సడలించింది. కాకపోతే నెల రోజుల్లో ఒక పైలెట్ గరిష్టంగా విమానం నడపగల గంటలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. విమాన సిబ్బందిపై పని ఒత్తిడిని అంచనా వేసేందుకు విమానయాన సంస్థలు తగిన పద్ధతులను అభివృద్ధి చేయాలని కూడా డీజీసీఏ తన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది.వరుస నైట్డ్యూటీలను తప్పించేలా రోస్టర్లను తయారు చేయాలని సూచించింది. పైలెట్ల విషయానికి వస్తే వీరి ఒత్తిడిని గుర్తించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు ఇండియో విమానాలు రద్దయ్యాయి. లేదంటే వాయిదా పడ్డాయి. చౌక విమానయాన సంస్థ కావడంతో సిబ్బందిని అతి తక్కువగా ఉంచుకుందీ సంస్థ. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్గుఆ తాము కొత్త నిబంధనలను రూపొందించినట్లు డీజీసీఏ చెబుతూండగా.. అకస్మాత్తుగా వీటిని అమలు చేయాల్సి రావడం సమస్యలకు దారితీసిందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. -
భారత్కు అండగా రష్యా.. పుతిన్పై ట్రంప్ ఫుల్ ఫోకస్?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. 2021 తర్వాత భారత పర్యటనకు పుతిన్ రావడం ఇదే తొలిసారి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యటనకు పుతిన్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా, పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణంగా భారత్కు రష్యా మిత్ర దేశం కావడమే.రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పుతిన్ హయాంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రష్యా నేతలు భారత్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేశారని గతంలో ఒకసారి పుతిన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి భారత పర్యటన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. ఆ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బాటలు వేసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.ఆయుధాలు రష్యావే.. భారత్ రష్యా రక్షణ పరిశ్రమకు పెద్ద మార్కెట్గా ఉంది. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్లో పాక్ దాడుల నుంచి భారత్కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్డేటెడ్ వర్షనైన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక, మిగ్–29, బ్రహ్మోస్ క్షిపణులు, అణు జలాంతర్గాములు వంటి కీలక వ్యవస్థలు రష్యా సహకారంతోనే నడిచాయి. మరోవైపు.. చైనా సైతం భారత్-రష్యా సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవి, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లకు లోబడనిది అని పేర్కొంది.కీలక ఒప్పందాలు ఇలా.. 1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం- 2021లో 2+2లో సంతకం.- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.3. సుఖోయ్–30 MKI ఒప్పందం- 1996లో మొదటి ఒప్పందం.- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.5. మిగ్–29 అప్గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్గ్రేడ్.6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం- 2018లో సంతకం.- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం- భారత్లో తయారీకి ఒప్పందం (Make in India).9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం- ఉత్తరప్రదేశ్లో సంయుక్త ఉత్పత్తి.10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.11. సంయుక్త సైనిక విన్యాసాలు- ఇండ్రా (INDRA)- అవియాడ్రిల్- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.12. అంతరిక్ష–రక్షణ సహకారం- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.- అంతరిక్ష–రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు పుతిన్ పర్యటనలో చర్చించబడ్డాయి.రష్యా-ఉక్రెయిన్ అంశం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఎంతో సంయమనం పాటించింది. రెండు దేశాల శాంతి కోసమే ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరుపుతూనే.. రష్యా దూరం కాకుండా ముందుకు సాగింది. రష్యా నుంచి చమురు విషయంలోనూ భారత్ ప్లాన్ ప్రకారం నడుచుకుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోలా ఉంది. 50 శాతం దిగుమతి సుంకాలతో భారత్ను లొంగదీసుకోవచ్చని ఆయన భావించారు. కానీ అది జరగలేదు. అమెరికాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి చెప్పేయండి అంటూ భారత్కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అయినా రష్యాతో స్నేహ బంధాన్ని భారత్ తెంచుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ఎక్కువని గతంలో భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ పర్యటన వేళ కూడా ఇదే దిశగా ఒప్పందాలు, నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రష్యాతో వాణిజ్యం.. 2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ.. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవనం ఉన్న రష్యా.. వాటిని భారత్కు ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.ట్రంప్ రియాక్షన్? ఒకవేళ రష్యాతో చమురు అనుబంధాన్ని, రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, అమెరికా సీరియస్గా స్పందించే ఛాన్స్ ఉంది. ట్రంప్ మరోసారి భారత్పై సుంకాలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కోపాన్ని తెప్పించే నిర్ణయాలు, ఒప్పందాల దిశగా భారత్ ప్రస్తుతానికి అడుగులు వేయకపోవచ్చని వారు అంటున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఆపద కాలంలో ఆదుకునే రష్యాతో చెలిమిని నిలుపుకునే దిశగా లౌక్యంగా భారత్ ముందుకు సాగుతుందని విశ్లేషిస్తున్నారు.డాలర్కు చెక్ పెట్టే ప్లాన్భారత్, రష్యాలు ప్రస్తుతం అమెరికా డాలరుతో పాటు తమ తమ దేశాల కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరిపేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అంశంపై పుతిన్, మోదీ చర్చించనున్నారు. అందుకే పుతిన్ వెంట రష్యాకు చెందిన స్పర్ బ్యాంక్ సీఈఓ ఇవాన్ నోసోవ్ కూడా వచ్చారు. వాణిజ్య లావాదేవీల ద్వారా రష్యాకు పెద్దమొత్తంలో భారత రూపాయలు చేరాయి. వాటితో భారత్లోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని స్పర్ బ్యాంక్ యోచిస్తోంది. భారత్తో వాణిజ్య లావాదేవీలు జరిపే క్రమంలో రష్యా వ్యాపారులకు రూపాయి విలువ కలిగిన లెటర్ ఆఫ్ క్రెడిట్ను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ఈ బ్యాంకు ప్రారంభించింది. ఒకవేళ దీనిపై భారత్-రష్యాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా, భారత్పై ట్రంప్ మరోసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. -
భారత్కు రష్యా నిజమైన స్నేహితుడు: మోదీ
ఢిల్లీ: భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మోదీ-పుతిన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇరుదేశాల సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగింది.పుతిన్కు ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు. ఇది శాంతియుగం.. భారత్ శాంతిపక్షమేనన్నారు. భారత్-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయని మోదీ అన్నారు. భారత్కు రష్యా నిజమైన స్నేహితుడన్న ప్రధాని మోదీ.. పుతిన్ విజన్ను అభినందించారు.వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా సాగుతోంది. పుతిన్కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలికాయి. పుతిన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో సదస్సులో పాల్గొన్నారు. ఇదే భవనంలో పుతిన్కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఏర్పాటు చేశారు.సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. -
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం పట్టి కుదిపేస్తోంది. ఉన్నట్టుండి టికెట్లు బుక్ చేసుకున్న విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరికి ఉద్యోగం, మరొకరికి అనారోగ్యం, మరొకరికి వేరొక అత్యవసర పరిస్థితి కారణంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటే, చివరి నిమిషంలో విమానాల రద్దుతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒక కొత్త జంట సొంత రిసెప్షన్కు హాజరు కాలేని పరిస్థితి. వేరే దారి లేక ఆన్లైన్లో రిసెప్షన్కు హాజరయ్యారంటే ఈ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.కొత్త ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తన రోస్టర్ ప్లానింగ్లో తగినంత మార్పులు, పైలట్ల కొరత కారణంగా ఈ వారం భారతదేశం అంతటా వందలాది విమానాలను రద్దు చేసింది. దీంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. నూతన వధూవరులు తమ సొంత రిసెప్షన్కు వర్చువల్గా హాజరు కావాల్సి వచ్చింది. A newly wed techie couple forced to attend their own reception online after their Indigo flights from Bhubaneswar-Hubbali were cancelled. The bride’s parents having already invited relatives decided to broadcast their live feed on a big screen. #IndigoDelay #FlightCancellations pic.twitter.com/jO7lTgm8lZ— Deepak Bopanna (@dpkBopanna) December 5, 2025 బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్సాగర్ , ఒడిశా భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్ నవంబర్ 23న భువనేశ్వర్లో వివాహం చేసుకున్నారు. బుధవారం వధువు స్వస్థలంలో అధికారిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్లో జరగాల్సి ఉంది.వీరు భువనేశ్వర్ నుండి బెంగళూరుకు అక్కడినుంచి హుబ్బళ్లికి వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 2న భువనేశ్వర్ నుండి బెంగళూరుకు , తరువాత హుబ్బళ్లికి టిక్కెట్లు బుక్ చేసుకున్న వధూవరులు, మంగళవారం ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు విమానాలు పదేపదే ఆలస్యం కావడంతో చిక్కుకుపోయారు. చివరికి డిసెంబర్ 3న విమానం రద్దైంది. వీరితోపాటు భువనేశ్వర్-ముంబై-హుబ్బళ్లి మీదుగా ప్రయాణించే అనేక మంది బంధువులకు ఇదే ఇబ్బంది తప్పలేదు. మరోవైపు రిసెప్షన్ వేదిక వద్ద చుట్టాలు, పక్కాలు అందరూ విచ్చేశారు. సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో విమానాల రద్దు వార్త అశనిపాతంలా తాకింది. ఇక చేసేదేమీ లేకవధువు తల్లిదండ్రులు రంగంలోకి దిగి ఆన్లైన్లోనే తంతు ముగించారు. రిసెప్షన్ కోసం సిద్ధం చేసుకున్న దుస్తులతో వధూవరులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిసెప్షన్లో చేరారు. టీవీ స్క్రీన్మీదే ఆన్లైన్లోనే నూతన దంపతులను ఆశీర్వదించారు.వారు వస్తారని ఆశించాం కానీ వారు రాలేకపోయారు. బంధువులందర్నీ పిలుచుకున్నాం, కానీ ఇలా జరగడం బాధనిపించింది. అలాగని అన్నీ ఏర్పాట్లు చేశాక, ఈవెంట్ను రద్దు చేయలేం. అందుకే అందరితోనూ చర్చించి రిసెప్షన్కు ఆన్లైన్లో హాజరు కావాలని వారి భాగస్వామ్యాన్ని స్క్రీన్పై ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నామని వధువు తల్లి చెప్పారు.ఇండిగో విమానాలు రద్దుఢిల్లీ, జైపూర్, భోపాల్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలలో ఇండివిమాన కార్యకలాపాలు స్థంభించి పోయాయి. వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గురువారం, రోజుకు దాదాపు 2,200 విమానాలను నడుపుతున్న ఇండిగో గురువారం 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది, ఇది దాని 20 సంవత్సరాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలు పూర్తిగా స్థిరీకరించే అవకాశం ఉందని అంచనా. విమాన విధి నిబంధనలలో తాత్కాలిక సడలింపులను కోరిందని ఏవియేషన్ వాచ్డాగ్ DGCAకి తెలిపింది. -
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ సంక్షోభానికి ‘గుత్తాధిపత్య మోడల్’ ఫలితమంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్గా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విమానాల ఆలస్యం, కాన్సిలేషన్ వల్ల బాధపడేది సామాన్యులేనంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చర్యలు కారణంగా సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలి. న్యాయమైన పోటీ ఉండాలన్న రాహల్... మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కిందటి ఏడాది ఆయన చేసిన ఓ ట్వీట్ను ప్రముఖంగా ప్రస్తావించారు.IndiGo fiasco is the cost of this Govt’s monopoly model. Once again, it’s ordinary Indians who pay the price - in delays, cancellations and helplessness.India deserves fair competition in every sector, not match-fixing monopolies. https://t.co/sRoigepFgv— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2025దేశవ్యాప్తంగా ఇండిగో కష్టాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 220పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయాల్లో ఒకే రోజు 70కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. -
మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. మడావి హిడ్మాని స్పెషల్ ఆపరేషన్లో పట్టుకోలేదని.. పక్కా సమాచారంతో పట్టుకుని దారుణంగా హత్య చేశారని ఓ లేఖ విడుదల చేసింది. అంతేకాదు.. మావోయిస్టు అగ్రనేతలే దీని వెనుక ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పడన్నది అవాస్తవం. అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి మాతోనే ఉన్నారు. వీళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం. హిడ్మా హత్యకు కోసాల్ అనే వ్యక్తి ప్రధాన కారణం. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఇందుకు కారకులు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారు. ఈ హత్యలను కప్పప్పుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లని కట్టు కథలు అల్లారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకం. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తాం’’ అని వికల్ప్ పేరిట విడుదలైన ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. -
పుతిన్తో మోదీ సమావేశం..
Putin India Tour Updates..పుతిన్తో మోదీ సమావేశం..భారత్ శాంతి వైపే ఉందన్న ప్రధాని మోదీ భారత్ తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని మోదీ వెల్లడిహైదరాబాద్ హౌస్లో ఇరుదేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని స్పష్టీకరణనమ్మకం ఆధారంగా భారత్-రష్యా సంబంధాలు కొనసాగుతున్నాయని పుతిన్ వెల్లడి.#WATCH | In his meeting with PM Narendra Modi, Russian President Vladimir Putin says, "Over the past years, you have done a great deal of work to develop our relationship...We open additional areas for cooperation, including hi-tech aircraft, space exploration and artificial… pic.twitter.com/OH5WuWVgP2— ANI (@ANI) December 5, 2025#WATCH | Delhi | PM Narendra Modi and Russian President Vladimir Putin held bilateral talks at the Hyderabad House. EAM Dr S Jaishankar, NSA Ajit Doval, Principal Secretary to the Prime Minister, Shaktikanta Das, and other top officials were present.Source: DD pic.twitter.com/AqQYHAjsjF— ANI (@ANI) December 5, 2025రాజ్ఘాట్లో పుతిన్ నివాళులు.. రాజ్ఘాట్లో గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించిన రష్యా అధినేత పుతిన్అంతకు ముందు రాజ్ భవన్ వద్ద త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్#WATCH | Delhi | Russian President Vladimir Putin lays a wreath at the Rajghat and pays tribute to Mahatma Gandhi.(Video: DD) pic.twitter.com/BsAyDTlKRr— ANI (@ANI) December 5, 2025👉విజిటర్స్ బుక్లో పుతిన్ సంతకం..#WATCH | Delhi | Russian President Vladimir Putin signs the visitors' book at the Rajghat, where he paid tribute to Mahatma Gandhi. pic.twitter.com/x6q74a6P6T— ANI (@ANI) December 5, 2025రాష్ట్రపతి భవన్కు పుతిన్రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు.పుతిన్కు స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్. #WATCH | Delhi | Russian President Vladimir Putin and President Droupadi Murmu shake hands at the forecourt of Rashtrapati Bhavan. The Russian President and PM Narendra Modi also shake hands. pic.twitter.com/Uuv9d3dCuq— ANI (@ANI) December 5, 2025 #WATCH | Russian President Vladimir Putin receives a Guard of Honour at the Rashtrapati Bhawan.Source: DD pic.twitter.com/ZcHc5EMI6y— ANI (@ANI) December 5, 2025 👉 రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ప్రధాని మోదీరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన మోదీ. కాసేపట్లో రాష్ట్రపతి భవన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ #WATCH | Delhi | PM Narendra Modi arrives at the Rashtrapati Bhawan ahead of the ceremonial welcome that is to be accorded to Russian President Vladimir Putin. EAM Dr S Jaishankar welcomes him. pic.twitter.com/SPjlY4YIyE— ANI (@ANI) December 5, 2025 #WATCH | PM Narendra Modi welcomes President Droupadi Murmu to the Rashtrapati Bhawan forecourt ahead of the ceremonial welcome that is to be accorded to Russian President Vladimir Putin. pic.twitter.com/EYAVYcatVR— ANI (@ANI) December 5, 2025👉భారత్ చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నేడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.షెడ్యూల్ ఇలా..ఉదయం 11 గంటలకు పుతిన్కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం11:30 గంటలకు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధికి నివాళి అర్పించనున్న పుతిన్ఉదయం 11:50 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్లో పుతిన్ సమావేశంమధ్యాహ్నం 1.50 గంటలకు మోదీ, పుతిన్ మీడియా సమావేశంమధ్యాహ్నం 3:40కి భారత రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న పుతిన్రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో పుతిన్కు విందు ఇవ్వనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాత్రి 9:30 గంటలకు తిరిగి మాస్కో వెళ్లిపోనున్న పుతిన్#WATCH | Delhi: All preparations in place at Rajghat where Russian President Vladimir Putin will arrive this morning, to pay tribute to Mahatma Gandhi. pic.twitter.com/jyhRaoP3bE— ANI (@ANI) December 5, 2025కీలక చర్చలు..రక్షణ, వాణిజ్య, పౌర అణు ఇంధనం, ముడిచమురు తదితర రంగాలలో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్న దేశాధినేతలుఎస్-400, 5 జనరేషన్ ఫైటర్ జెట్స్, సబ్మెరైన్స్, ఆయుధాల తయారీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ముడి చమురు దిగుమతులపై మరింత సబ్సిడీని రష్యా ఆఫర్ చేసే అవకాశంఅమెరికా ఆంక్షలు నేపథ్యంలో రష్యా ముడిచమురు దిగుమతిని కొంతమేర తగ్గించిన భారత్ -
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్పల ధర్నా
పళని(తమిళనాడు): శబరిమలో యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి జరిగిన ఉదంతమిది. తోటి అయ్యప్పలు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తూ.. మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి క్షేత్రానికి చేరుకుంది.ఈ క్రమంలో ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్డ్రింక్స్ కొనుగోలుకు వెళ్లారు. గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్పీ) రూ.30గా ఉండగా.. దుకాణుదారుడు రూ.40 డిమాండ్ చేశాడు. అదేంటని భక్తుడు నిలదీయగా.. తమిళంలో తిట్ల పర్వం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా.. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగని సదరు వ్యాపారి, బాధిత భక్తుడి మెడలోని అయ్యప్ప దీక్షామాలను తెంచేశాడు.ఈ సమాచారం అందుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరుగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన దుకాణుదారుడిని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి, వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే తెలుగు భక్తులు పెరిగిపోయారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే ఆందోళన నిర్వహించారు.తమ ఆందోళనపై స్పందన లేకపోవడంతో.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఓ దశలో వ్యాపారికి సపోర్ట్ చేస్తూ.. తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
ఎయిర్పోర్టులలో గందరగోళం.. ప్రయాణికుల ఆగమాగం
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాల ఎయిర్పోర్టుల్లో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో తన చెత్త రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. ఇవాళ ఒక్కరోజే 600కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 220 విమానాలు ఉండడం గమనార్హం. అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్ చేసింది. ఇటు హైదరాబాద్లోనూ దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. నేటి అర్ధరాత్రి దాకా ఈ రద్దు ఉంటుందని ఎయిర్లైన్స్ ప్రకటించింది.My IndiGo flight was cancelled today with zero proper communication and my checked-in luggage never came back. Hundreds stranded, families crying, people missing important commitments. This isn’t a “delay issue”, it’s a complete collapse of operations. Passengers deserve better. pic.twitter.com/dak5J7p7CI— Varun Kumar (@Varun2829) December 5, 2025ప్రయాణికుల తీవ్ర అవస్థలుసిబ్బంది కొరతే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలతో పైలెట్ల కొరత నెలకొంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలపైనా ఈ ప్రభావం పడింది. అయితే ఇండిగో దేశంలోనే అత్యధికంగా విమానాలు నడిపే సంస్థ కావడం, అప్పటికే అక్కడి సిబ్బంది కొరత ఉండడంతో ఎఫెక్ట్ ఈ స్థాయిలో కనిపిస్తోంది. इंडिगो की 500 फ्लाइट रद्द, एयरपोर्ट पर यात्री भड़के#Indigo #IndigoDelay #IndigoFlightsCancelled pic.twitter.com/f8coTKnWqk— Buland Bharat TV (@Bulandbharattv) December 5, 2025आज इंडिगो की 550 से ज़्यादा उड़ानें रद्द कर दी गईं। हज़ारों लोग रास्ते में फँसे हुए हैं, एक पिता अपनी बेटी के लिए सैनिटरी पैड की भीख माँगता हुआ दिखाई दिया। क्या हमारे पास कोई विमानन मंत्रालय भी है? मंत्री जी क्या कर रहे हैं?#Indigo #DGCA #IndigoDelay pic.twitter.com/uUpuAM5Dm8— Gems of Viral (@GemsofViral) December 5, 2025India’s air travel chaos deepens as new pilot safety rules and strict FDTL norms trigger mass IndiGo cancellations, long delays & stranded passengers nationwide. Crew shortages & regulatory pressure highlight India’s need for stronger aviation planning. Follow @bharat24by7 pic.twitter.com/bM9jz1EUwd— bharat24by7 (@Bharat24by7) December 5, 2025 ఈ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాలు ఎప్పుడు ఎగరతాయో.. తమను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఎదురు చూస్తున్నారు. ఎయిర్పోర్టులలో తమకు సరైన సదుపాయాలు అందించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటు.. వాళ్లకు సరైన సమాచారం అందించలేక ఇండిగో క్షమాపణలు చెబుతోంది. వెరసి.. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులలో గందరగోళం కొనసాగుతోంది.ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అటు మిగిలిన విమాన సంస్థలు దోపిడీకి దిగాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధరలను పెంచేశాయి. ఏకంగా 40వేలు ఛార్జ్ చేస్తున్నాయి.శంషాబాద్లో ఉద్రిక్తత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు.షెడ్యూల్ ప్రకారం.. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కేరళకు వెళ్లే ఇండిగో విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. -
మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు కల్పించండి
న్యూఢిల్లీ: రాష్ట్ర బార్కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బార్ కౌన్సిల్ ఆ‹ఫ్ ఇండియా (బీసీఐ)కి సుప్రీంకోర్టు సూచించింది. ‘రాష్ట్ర బార్కౌన్సిల్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా బీసీఐ నియమాలను రూపొందిస్తుందని ఆశిస్తున్నాం. కొన్ని ఆఫీస్ బేరర్ పోస్టులు కూడా అందుబాటులో ఉండాలి ’ప్రదాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టి‹స్ జోయ్ మాల్యా బాగి్చలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర బార్ కౌన్సిల్లలో మహిళా ప్రాతినిధ్యం తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం అటువంటి రిజర్వేషన్లను అమలు చేయడానికి అడ్వకేట్స్ చట్టానికి సవరణలు అవసరమని బీసీఐకి తెలిపింది. అయితే రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, తక్షణ మార్పులు కష్టమని బీసీఐ తరపు న్యాయవాది గురుకుమార్ ధర్మాసనానికి తెలిపారు. అంతేకాదు.. మహిళా న్యాయవాదులు పోటీ చేయడంపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా.. మహిళా న్యాయవాదుల సర్వే ఆధారంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వర్క్షా‹ప్ను ధర్మాసనం ప్రస్తావించింది. 83 మంది శాతం మహిళా న్యాయవాదులు బీసీఐలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారని వెల్లడించింది. ఒక ఆఫీ‹స్ బేరర్ పదవిని మహిళా న్యాయవాదులకు రిజర్వ్ చేయాలని సూచించింది. -
బీఎల్వోలపై పనిభారం తగ్గించండి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో పాల్గొనే బూత్ లెవల్ అధికారు(బీఎల్వో)లపై పని ఒత్తిడి తగ్గించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిపై పనిభారం తగ్గించేందుకు వీలుగా మరింత మంది సిబ్బందిని కేటాయించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది. ఎస్ఐఆర్ను గడువులోగా పూర్తి చేయాలంటూ బీఎల్వోలపై ఈసీ ఒత్తిడి పెంచుతోందని, అలా చేయని వారిపై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకుంటోందని, ఈ పరిస్థితుల్లో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఎల్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు, అంగన్ వాడీ సిబ్బంది వంటి వారిపై ఒత్తిడి చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఆపేలా ఈసీని ఆదేశించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ కోరారు. ‘రాష్ట్రాలు ఎస్ఐఆర్ కోసం ఈసీకి అదనంగా సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుంది. పనిగంటలు తగ్గి, బీఎల్వోలపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. ఎస్ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలు అవసరమైన మేరకు అదనంగా సిబ్బందిని నియమించుకోవాలి’అని ధర్మాసనం పేర్కొంది. ‘సిబ్బంది ఎవరైనా ప్రత్యేక కారణాలతో మినహాయింపు కోరిన పక్షంలో సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారి అలాంటి కేసులను పరిస్థితులను బట్టి డీల్ చేయాలి. వేరొకరిని ఆస్థానంలో నియమించాలి’అని ధర్మాసనం వివరించింది. అలా ప్రత్యామ్నాయం ఇవ్వలేనప్పుడు, ఆ ఉద్యోగిని బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవాలనడం తమ ఉద్దేశం కాదని కూడా ధర్మాసనం స్పష్టతనిచి్చంది. విధుల్లో మరణించిన బీఎల్వోల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం వంటి అంశాలపై తర్వాత వేరుగా ఆదేశాలిస్తామని తెలిపింది. -
ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ సస్పెన్షన్
బహరాంపూర్: పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు వంటి మసీదు నిర్మాణాన్ని ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తానంటూ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ 6వ తేదీని పురస్కరించుకుని దీని నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొనడాన్ని అధికార టీఎంసీ సీరియస్గా తీసుకుంది. ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే, కబీర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేయాలని చూసినా తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతానన్నారు. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కబీర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ద్రోహిగా అభివరి్ణంచారు. ప్రతి మతంలోనూ ద్రోహులున్నారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించడమే వీరి పని అని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సీనియర్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు పాల్పడుతున్న కబీర్పై టీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇక నుంచి ఆయనతో టీఎంసీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మసీదును ఎవరైనా నిర్మించొచ్చు. అదే సమయంలో మత పరంగా రెచ్చగొట్టడం తగదు. బాధ్యతాయుతంగా వ్యవహరించే మా పార్టీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు’అని ఆయన తెలిపారు. -
ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీబాబుకు బెయిల్
ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబు.. విచారణ లేకుండానే ఐదేళ్లకు పైగా జెలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో ఈ కేసులో విచారణ పూర్తి చేసిన జస్టి‹స్ ఎ.ఎస్.గడ్కరీ, ఆర్.ఆర్.¿ోంస్లేలతో కూడిన డివిజన్ బెంచ్, ఆయనను విడుదల చేయాలని, లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ను సమరి్పంచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి ఈ ఉత్తర్వును నిలిపివేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైకోర్టును కోరింది. బాబు ఇప్పటికే విచారణలేకుండానే సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారని, విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేనందున ఎన్ఐఏ అప్పీలును తిరస్కరించింది. ఆయన పూర్తి పేరు హనీబాబు ముసలియారీ్వట్టిల్ తరయిల్. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్కు చెందిన వ్యక్తి. 2017 డిసెంబర్ 31న పూణేలోని శనివార్వాడలో కబీర్కళా మంచ్ నిర్వహించిన ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2020 జూలైలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిషేధిత సీపీఐ(ఎంఎల్) నాయకుల సూచనల మేరకు మావోయిస్టు కార్యకలాపాలు, భావజాలాన్ని హనీబాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. 59 ఏళ్ల హనీ బాబు అప్పటి నుంచి తలోజా జైలులో ఉన్నారు. -
నా గుండె పగిలింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తన సితార్ ధ్వంసం కావడంపై అంతర్జాతీయ సంగీతకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో తన ప్రియమైన సితార్ ధ్వంసం కావడంతో ఆమె భగ్గుమన్నారు. ‘ఒక భారతీయ వాయిద్యానికి కూడా ఈ దేశపు విమాన సంస్థలో భద్రత లేదా?’.. అంటూ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. పదిహేనేళ్ల తన కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం, తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసిన వీడియో సంగీత ప్రియులను కలచివేసింది. విలువైన సితార్ దిగువ భాగంలో ఏర్పడిన లోతైన పగులును ఆమె చూపించారు. ‘నా సితార్ శృతి తప్పిందేమోనని ముందు భావించాను. వాయించడానికి తీసుకున్నప్పుడే ఈ దారుణం తెలిసింది’.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చాలా కాలం తర్వాత ఎయిర్ ఇండియాను ఎంచుకున్నాను. నా వాయిద్యానికే ఇలా ఎందుకు జరిగింది? ప్రత్యేక హార్డ్–కేసులు ఉన్నా, హ్యాండ్లింగ్ రుసుములు వసూలు చేసినా ఇంత దారుణమైన నిర్లక్ష్యమా?’.. అని ఆమె నిలదీశారు. పరిశీలిస్తున్నామన్న ఎయిర్ ఇండియా అనౌష్క తన విమాన వివరాలను, ఎక్కడ దిగారనేది చెప్పనప్పటికీ, ఎయిర్ ఇండియా ప్రతినిధి గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘మా అతిథి అనుభవించిన బాధకు చింతిస్తున్నాం. ఈ వాయిద్యం సాంస్కృతిక ప్రాధాన్యం మాకు తెలుసు’.. అని పేర్కొన్నారు. నష్టానికి గల కారణాలను నిర్ధారించలేకపోతున్నామని చెప్పిన సంస్థ, ఢిల్లీ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీతో సహా సమగ్ర విచారణ ప్రారంభించినట్లు తెలిపింది. భారత్ పర్యటనకు ముందే.. జనవరి 30న హైదరాబాద్తో ప్రారంభం కానున్న తన భారత పర్యటనకు అనౌష్క శంకర్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పలువురు కళాకారుల్ని కలచివేసింది. ఈ సంఘటన హృదయ విదారకమని ప్రముఖ కళాకారులు జాకిర్ ఖాన్, విశాల్ దడ్లాని పేర్కొన్నారు. గాయకుడు పాపోన్ స్పందిస్తూ, ‘ఈ రోజుల్లో శ్రద్ధ కరువైంది. అసలు శ్రద్ధ అనే భావమే కనుమరుగైందేమో! ఇది విచారకరం’.. అంటూ ఎయిర్ ఇండియా తీరుపై మండిపడ్డారు. గతంలోనూ ప్రయాణ సమస్యలు 44 ఏళ్ల శంకర్ గత ఏడాది కూడా ప్రయాణ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె తన యూరోపియన్ టూర్ చివరి షో కోసం బెర్లిన్లో ఉన్నప్పుడు, దుస్తులు, వాయిద్యానికి అవసరమైన ’మిజ్రాబ్స్’ (వేళ్లకు ధరించే ఫిక్సŠడ్ పికర్స్) ఉన్న లగేజీని పోగొట్టుకున్నారు. పదేపదే తప్పిదాలా? సంగీత కళాకారులకు ఇలాంటి చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. 2010లో సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ వాయిద్యం ఎయిర్ ఇండియాలో దెబ్బతినగా, 2019లో పండిట్ శుభేంద్ర రావు సితార్ కూడా ఈ సంస్థ విమానంలోనే దెబ్బ తింది. తాజా ఘటనతో, విమానయాన సంస్థలు కళాకారుల విలువైన వాయిద్యాల భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. -
మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందని, అందుకే విదేశాల అధినేతలు, ప్రముఖులు మన దేశానికి వచి్చనప్పుడు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడొద్దంటూ వేడుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్లో పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఒక సంప్రదాయమని గుర్తుచేశారు. ప్రధాని మోదీ గానీ, విదేశాంగ శాఖ గానీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో విదేశీ అతిథులు ప్రతిపక్ష నాయకుడిని కలిసి మాట్లాడే సంప్రదాయం చక్కగా కొనసాగిందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మారిపోయిందని ఆక్షేపించారు. -
ఏడాదిలోగా ఎలక్ట్రానిక్ టోల్
న్యూఢిల్లీ: దేశంలో రహదారులపై అత్యాధునిక ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ అందుబాటులోకి రాబోతోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమల్లోకి ఉన్న వ్యవస్థ ఏడాదిలోగా ముగిసిపోనుందని తెలిపారు. మల్టీ–లేన్ ఫ్రీ ఫ్లో ఎలక్ట్రానిక్ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగకుండా ముందుకు దూసుకెళ్లొచ్చని వెల్లడించారు. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత పరిజ్ఞానం ఉంటాయని వివరించారు. ఆయన గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన టోల్ వసూలు వ్యవస్థ ఇప్పటికే పది చోట్ల అమల్లో ఉందని, ఏడాదిలోగా దేశమంతటా విస్తరింపజేయబోతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ రాకతో టోల్ ఫీజుల కోసం ఎవరూ ఆపబోరని, రోడ్లపై ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదని అన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని, రుసుముల చెల్లింపుల్లో ఆలస్యాన్ని నివారించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని నితిన్ గడ్కరీ వివరించారు. హైడ్రోజన్ కారు వాడుతున్నాదేశంలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. కాలుష్య నివారణలో భాగంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే టయోటా ‘మిరాయ్’ వాహనాన్ని తాను ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఆయన గురువారం లోక్సభలో మాట్లాడారు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కారు తరహాలోనే అంతే సౌలభ్యాన్ని ఇస్తోందని అన్నారు. మిరాయ్ అంటే జపాన్ భాషలో భవిష్యత్తు అని వెల్లడించారు. భవిష్యత్తు ఇంధనం హైడ్రోజన్ కాబోతోందని స్పష్టంచేశారు. శిలాజ ఇంధనాల దిగుమతి విలువ రూ.22 లక్షల కోట్లకు చేరిందని గడ్కరీ చెప్పారు. ఇలాంటి ఇంధనాలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టక తప్పదని వివరించారు. ఆధునిక ఇంధనాల ఎగుమతి విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవ ఇంధనాలను ఉపయోగించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. -
కాలుష్యంపై విపక్షాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా పరవుమాసినా మోదీ ప్రభుత్వంలో ఇంచు కూడా చలనం లేదంటూ విపక్ష పార్టీలు పార్లమెంట్ వేదికగా ఆందోళనకు దిగారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని, నల్ల మాస్క్లు ధరించిన విపక్ష పార్టీల సభ్యులు మకరద్వారం వద్ద నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఆక్సిజన్ మాస్క్లు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చేసిన ‘‘ శీతాకాల సుందర ప్రకృతిని ఆస్వాదించండి’ వాక్యాలను పెద్ద బ్యానర్పై రాసి ఎంపీలంతా ప్రదర్శించారు. ‘‘ఓవైపు పిల్లలు కాలుష్య వాయువు కారణంగా చనిపోతుంటే ఇకనైనా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి. నాలాంటి వృద్ధులు సైతం ఎంతో బాధపడుతున్నారు’’ అని సోని యాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీవాసులంతా ఎందుకింతగా కష్టపడాలి? అని మోదీని ప్రశ్నిస్తే ఆయనేమో శీతాకాలం ఎంత బాగుందోకదా అని మాట్లాడుతున్నారు. వాయుకాలుష్యంపై బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై పార్లమెంట్ వేదికగా నిలదీస్తాం’’ అని ఖర్గే అన్నారు. ‘‘ రాజకీయంగానీ ఈ వాయుకాలుష్యం సమస్యపై తక్షణం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంశం పార్లమెంట్లో చర్చకు రావాలి. చర్యల విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతిస్తాం’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు. -
వ్యవస్థను అపహాస్యం చేయడమే
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ వైఖరి వ్యవస్థను అపహాస్యం చేయడమేనంటూ తప్పుబట్టింది. పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను నాలుగు వారాల్లోగా తమ ముందుంచాలని అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడి కేసుల సత్వరణ విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విషయం కూడా తమ పరిశీలనలో ఉందని తెలిపింది. యాసిడ్ దాడుల బాధితులను దివ్యాంగుల జాబితాలో చేర్చి వారికి సంక్షేమ పథకాలను వర్తింప జేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ షహీన్ మాలిక్ అనే బాధితురాలు వేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రోహిణి కోర్టులో 2009లో బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన కేసు 16 ఏళ్లుగా పెండింగ్లో ఉండటంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. బాధితురాలు ధర్మాసనం ఎదుట స్వయంగా హాజరై తన వాదన వినిపించారు. తనపై జరిగిన యాసిడ్ దాడిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని తెలిపారు. 2013 వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికి తుది దశకు చేరుకుందని ఆమె వివరించారు.‘దేశ రాజధాని పరిస్థితులే ఇలాగుంటే బాధితుల గోడు పట్టించుకునేదెవరు..? ఈ పరిస్థితి మన వ్యవస్థకు, జాతికే సిగ్గుచేటు’అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కేసును సుమోటో తీసుకుంటున్నామని, విచారణ ఇకపై రోజువారీగా జరపాలని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో, యాసిడ్ను బలవంతంగా శరీరంలోకి ఇంజెక్షన్ చేసిన, తాపించిన ఘటనలు కూడా ఉన్నాయని బాధితురాలు షహీన్ మాలిక్ తెలిపారు. యాసిడ్ శరీరంలోకి వెళ్లిన బాధితులకు కృత్రిమ ఆహారాన్ని ట్యూబుల ద్వారా అందించేంతటి తీవ్ర పరిస్థితులున్నాయని, కొందరు అంగవికలురయ్యారని కూడా ఆమె పేర్కొన్నారు. ఇది విని సీజేఐ సూర్యకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి కూడా జరిగినట్లు ఇప్పటి వరకు తమకు తెలియదన్నారు. అత్యంత ఘోరమైన, బాధితులపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి దారుణాలపై ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ‘ఇది వ్యవస్థను అపహాస్యం చేయడమే. ఇందుకు బాధ్యులైన వారిపై దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన పనిలేదు. వారికి తగిన విధంగా శాస్తి చేయాల్సిందే’అని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ హైకోర్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను నాలుగు వారాల్లోగా అందజేయాలని సంబంధిత రిజి్రస్టార్ జనరల్స్ను ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా, యాసిడ్ దాడుల బాధితులు సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం కింద వికలాంగుల నిర్వచనంలో చేర్చే విషయమై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రంతోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో, రోహిణి కోర్టులో ఇన్నేళ్లపాటు ఈ కేసు పెండింగ్లో ఉండటానికి దారి తీసిన కారణాలపై వచ్చే వారం విచారణ చేపడతామని కూడా ధర్మాసనం ప్రకటించింది. -
ఇండిగో చరిత్రలో చెత్త రికార్డు.. ఒక్కరోజే 550 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు పరంపర గురువారం సైతం కొనసాగింది. బుధవారం 200 విమానాలు రద్దుకాగా గురువారం ఒక్కరోజే మరో 550కుపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, విమాన విధుల సమయ కాలపరిమితి(ఎఫ్డీఐఎల్) నిబంధనల అమలు వంటి సమస్యల ధాటికి ఇండిగో విమాన సర్వీసులను కంపెనీ రద్దుచేయక తప్పలేదు. సిబ్బంది కొరత, మెరుగైన జీతభత్యాల కోసం కొందరు పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టి వేరే చోట్ల ఇంటర్వ్యూలకు హాజరవడం వంటి మరెన్నో కారణాలు జతకలిసి ఇండిగో విమానసర్వీసులను మరింత ఆలస్యంచేస్తున్నాయి. దీంతో గురువారం దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. సమయానికి రాకపోకలను సూచించే ఆన్టైమ్ పంక్చువాలిటీ(ఓటీపీ) విషయంలో ఇండిగో డిసెంబర్ మూడో తేదీన కేవలం 19.7 శాతాన్ని మాత్రమే చేరుకోగల్గిదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 172 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో తలెత్తిన సమస్యకు పైలట్ల కొరత సైతం కారణమన్న వార్తల నేపథ్యంలో ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్పీఏ) ఘాటుగా స్పందించింది. ‘‘ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ పూర్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ‘కొత్త ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్’ నిబంధనల ప్రకారం పైలట్ మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పైలట్ విశ్రాంతి/సెలవులో ఉంటే అదనపు పైలట్లతో విమాన సర్వీసుల్ని కొనసాగించాలి. అంతమంది పైలట్లు ఇండిగోలో లేరు. ఇటీవల ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోవడం ఆపేసింది. దీంతో పైలట్ల కొరత ఏర్పడి విమానాలను రద్దుచేయాల్సి వస్తోంది’’ అని ఏఎల్పీఏ వ్యాఖ్యానించింది. ఇండిగో రోజుకు సగటున 2,300 విమానసర్వీసులను నడుపుతోంది.ఫిబ్రవరి 10దాకా ఇంతేసమస్య పూర్తిగా సద్దుమణగాలంటే ఫిబ్రవరి పదో తేదీదాకా ఆగక తప్పదని ఇండిగో గురువారం మరో బాంబు పేల్చింది. అంటే అప్పటిదాకా సమయానికి ఇండిగో విమాన రాకపోకలు సవ్యంగా ఉండకపోవచ్చని సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఈ మేరకు ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు వివరణ ఇచ్చింది. ‘‘ రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తాం. గతంలో మాదిరి విమానసర్వీసులు యథాతథ స్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి10దాకా వేచి ఉంచాల్సి రావొచ్చు. రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య భారీగా ఉండొచ్చు’’ అని ఇండిగో స్వయంగా ప్రకటించింది. -
‘మూసీ ప్రాజెక్టు’కు ప్రపంచ బ్యాంకు రుణం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిధుల సేకరణలో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికకు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖకు చెందిన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల శాఖకు సిఫార్సు చేసినట్లు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహూ వెల్లడించారు. గురువారం లోక్సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు .అప్పు దొరకాలంటే డీపీఆర్ ఇవ్వాల్సిందే..: అయితే, ఈ రుణ ఒప్పందం ఖరారు కావడానికి కేంద్రం ఒక షరతు విధించింది. రుణ ఒప్పందంపై సంతకాలు చేసే ముందే.. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, స్టార్మ్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ (సీపీహెచ్ఈఈఓ)కు సమర్పించి, వారి నుంచి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.అమృత్ 2.0 కింద రూ.3,849 కోట్లు..: కాగా అమృత్ 2.0 పథకం కింద జీహెచ్ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధి కోసం రూ.3,849.10 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి పేర్కొన్నా రు. ఈ నిధులతో 972 ఎంఎల్టీల మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 4.92 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మూసీ సుందరీకరణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోందని కేంద్రం తన సమాధానంలో పేర్కొంది. -
ఎక్సైజ్ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: పొగాకు, పొగాకు సంబంధ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర ఎక్సైజ్ (సవరణ), బిల్లు–2025కు గురువారం పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం లోక్సభలో ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక కోవిడ్ కాలంలో రాష్ట్రాలు కోల్పోయిన రెవెన్యూ ఆదాయాన్ని భర్తీచేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ పరిహార సెస్ ముగిసిపోయాక ఈ కొత్త అత్యధిక ఎక్సైజ్ సుంకాలను విధిస్తారు. అధిక ఎక్సైజ్ సుంకం కారణంగానైనా రైతులు పొగాకు సాగును వదిలేసి ఇతర పంటల వైపు మళ్లుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానంగా నిర్మల మాట్లాడారు. ‘‘ పొగాకు సాగును రైతులు భారీగా తగ్గించుకుని ఇతర పంటల వైపు దృష్టిసారించడమే ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రైతులు ఇప్పటికే అదే బాటలో నడిచారు. దాదాపు లక్ష ఎకరాలకుపైగా సాగు భూమిలో పొగాకు సాగును వదిలేసి ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. జీఎస్టీ పరిహార సెస్ ముగిసేదాకా పొగాకు ఉత్పత్తులను అయోగ్య ఉత్పత్తుల కేటగిరీలో 40 శాతం పన్నులే వసూలుచేస్తాం’’ అని ఆమె అన్నారు. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపం దాల్చాక కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, నమిలే పొగాకు, చుట్టలు, హుక్కా, గుట్కా, ఖైనీ, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపై అధిక ఎక్సయిజ్ డ్యూటీ విధించనుంది. ముడి పొగాకుపై 60 నుంచి 70 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. చుట్టలు, సిగరెట్లపై 25 శాతం లేదా ప్రతి 1,000 సిగరెట్లు/చుట్టలపై గరిష్టంగా రూ.5,000 ఎక్సైజ్ డ్యూటీ వసూలుచేస్తారు. ఆయా సిగరెట్లు, చుట్టలకు ఫిల్టర్, నాణ్యత, పొడవు ఆధారంగా ప్రతి 1,000 చుట్టలు/సిగరెట్లపై కనిష్టంగా రూ.2,700, గరిష్టంగా రూ.11,000 ఎక్సయిజ్ సుంకం విధిస్తారు. నమిలే పొగాకుపై కేజీకి రూ.100 వసూలుచేస్తారు. నిత్యావసర వస్తువులపై ఆరోగ్య, జాతీయభద్రతా సెస్ ఉండదు నిత్యావసర వస్తువులపై కొత్తగా ప్రతిపాదించిన ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ను విధించబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. పాన్ మసాలా వంటి అయోగ్య(డీమెరిట్) వస్తువులపై మాత్రమే కొత్త సెస్ను వసూలుచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఇలా వచ్చిన రెవెన్యూను రాష్ట్రాల్లో ఆరోగ్య పథకాల కోసం ఖర్చుచేసేందుకు రాష్ట్రాలతో పంచుకుంటామని ఆమె చెప్పారు. గురువారం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల ఈ విషయాన్ని వెల్లడించారు. అవగాహన కంటే ఆదాయంమీదే దృష్టిపెట్టారుపొగాకు ఉత్పత్తుల అతి వినియోగాన్ని తగ్గించేందుకు, జనాల్లో దురలవాట్లపై దుష్ప్రభావాలపై అవగాహన పెంచడంపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం అధిక ఆదాయంపై దృష్టిసారించిందని విపక్ష పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందడానికి ముందు బిల్లుపై జరిగిన చర్చలో పలువురు ఎంపీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. -
నాసిరకానికి మందు
ఫార్మసీలో అడుగు పెట్టగానే మందులు, న్యూట్రాస్యూటికల్స్, కొన్ని రకాల జనరల్ ఐటమ్స్ దర్శనమిస్తాయి. ఇక నుంచి ఓ క్యూఆర్ కోడ్ కూడా ప్రత్యక్షం కానుంది. క్యూఆర్ కోడే కదా అని తీసిపారేయకండి. భారత ఔషధ భద్రతా వ్యవస్థలో ఇదొక పెద్ద ముందడుగు. ఔషధాల వల్ల ఆరోగ్య సమస్య తలెత్తితే ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలు, హోల్సేల్ మందుల దుకాణాల్లో అందరికీ కనిపించేలా ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్తోపాటు టోల్ఫ్రీ నంబర్ 1800–180–3024 ప్రదర్శించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆదేశించింది.ఔషధం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే.. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వినియోగదారులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య, ఆ మందు తాలూకా బ్యాచ్, కంపెనీ వివరాలు అందిస్తే చాలు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిట రింగ్ సిస్టమ్ ఈ ఫిర్యాదులను స్వీకరించి సదరు బ్యాచ్లో తయారైన ఔషధాల నాణ్యతను పరీక్షి స్తుంది. లోపం ఉందని తేలితే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటారు.నేరుగా ప్రజల నుంచే..మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు ఇటీవల 23 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఔషధ తయారీలో ఫార్మా –గ్రేడ్కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే ముడిపదార్థాలను ఉపయోగించినట్టు ఈడీ తేల్చింది. ఔషధ రంగ పరిమాణంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో నాసిరకమైన మందులు, నకిలీలు పెద్ద ముప్పుగా నిలిచాయి. ఔషధాల వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాలపై ఫిర్యాదులను నేషనల్ ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ కింద 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది.నకిలీలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే టాప్–300 బ్రాండ్స్ ఔషధాలపై కంపెనీలు క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నాయి. అన్ని టీకాలు, యాంటీమైక్రోబయాల్స్, నార్కోటిక్, సైకోట్రోపిక్ మందులకు దశలవారీగా ఈ విధానం అమలు చేయనున్నారు. అయితే ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఉత్పాదన గుర్తింపు సంఖ్య, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీ చూపిస్తుంది. ఈ వివరాలు చూపించలేదంటే నకిలీ అన్నట్టు.ఒక్క ఫిర్యాదు సైతం..ఆరోగ్య రంగంలో ఉన్న నిపుణుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. సీడీఎస్సీఓ తాజా నిర్ణయం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, నేరుగా వారి నుంచే ఫిర్యాదులు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో ఔషధాల వల్ల తలెత్తే హానికర సంఘటనలను ట్రాక్ చేసే విధానంలో క్యూఆర్ కోడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు.‘వాస్తవానికి ప్రాణాలకు హాని జరిగితే తప్ప ఇటువంటివి బయటి ప్రపంచానికి తెలియవు. చాలా మంది రోగులు మందుల వల్ల దుష్ప్రభావాలు సహజమని లేదా తాత్కాలికమైనవని భావిస్తారు. సంబంధిత అధికారులను ఎప్పుడూ అప్రమత్తం చేయరు. దీంతో నాసిరకమైన మందుల గుర్తింపు జరగడం లేదు. సమస్యను ముందుగానే గుర్తించడంలో, వందలాది మందికి ఎదురయ్యే హానిని నివారించడంలో ఒక్క ఫిర్యాదు సైతం సహాయపడుతుంది’ అని సీడీఎస్సీఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.మూడు గంటలకు ఒకటి..దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 32,000 కంటే ఎక్కువ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 2,500కుపైగా శాంపిల్స్ నకిలీ, కల్తీ అయ్యాయని నిర్ధారణ అయింది. సగటున ప్రతిరోజూ ఎనిమిది మందులు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టుల్లో విఫలమవుతున్నాయి. అంటే దాదాపు ప్రతి మూడు గంటలకు ఒకటి అన్నమాట.ముప్పు ఉందని భావిస్తే..తయారీ సంస్థలపై తనిఖీలు నిరంతరంచేపడుతు న్నాం. ప్రధానంగా దగ్గు మందుల వంటి ముప్పు ఉండే ఔషధ తయారీ యూనిట్లలో నాణ్యతను పరీక్షిస్తూనే ఉన్నాం. ఫార్మసీల్లో క్యూఆర్ కోడ్ అమలైతే తయారీ సంస్థల్లో జవాబుదారీ, నాణ్యత విషయంలో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా జనవరి నుంచి గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) కొత్త రూల్స్ రానున్నాయి. – పి.రాము, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణప్రజలకే ప్రయోజనం..దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మందుల దుకా ణాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం అమలైతే ప్రజలకే ప్రయోజనం కలుగుతుంది. అసోసియే షన్ తరఫున క్యూఆర్ కోడ్స్ ముద్రించి అన్ని దుకా ణాలకు సరఫరా చేస్తున్నాం. నాసిరకం, నకిలీలకు మేం వ్యతిరేకం. ఔషధాన్ని పరీక్షిస్తేనే నాణ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మందుల తయారీ విషయంలో పటిష్ట జీఎంపీ, లైసెన్సింగ్ విధానాలు అమలు కావాలి. – డాక్టర్ ఘీసూలాల్ జైన్, ప్రెసిడెంట్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ -
భారత్–రష్యా బంధం ఎవరికీ వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: భారత్, రష్యా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చిచెప్పారు. జాతీయ ప్రయోజనాల కోసమే ఇరుదేశాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం సహకరించుకుంటున్నాయని వెల్లడించారు. తమ ప్రయోజనాల పరిరక్షణే రెండు దేశాల ధ్యేయమని ఉద్ఘాటించారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 సుంకాలు విధించడాన్ని ట్రంప్ పరోక్షంగా తప్పుపట్టారు. భారత్–రష్యా స్నేహాన్ని, అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ ప్రాబల్యం పెరుగుతుండడాన్ని కొందరు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. రాజకీయ కారణాలతోనే భారత్కు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో కృత్రిమ అవరోధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భారత పర్యటన నేపథ్యంలో పుతిన్ ‘ఇండియా టుడే’ వార్తా చానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పశి్చమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ భారత్తో తమ ఇంధన బంధం ఎలాంటి ప్రభావానికి లోను కాలేదని స్పష్టంచేశారు. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచినా తాను గానీ, మోదీ గానీ ఇతర దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సొంత ఎజెండా, సొంత లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తమకు మాత్రం సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఉద్ఘాటించారు. భారత ప్రధాని మోదీ బలమైన నాయకుడు అంటూ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒత్తిళ్లకు మోదీ సులువుగా లొంగబోరని చెప్పారు. మోదీ ప్రధానమంత్రిగా ఉన్నందుకు భారతీయులు గరి్వంచాలని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా ఘర్షణపైనా పుతిన్ స్పందించారు. ఈ సంక్షోభానికి అమెరికా ప్రభుత్వం ఒక శాంతియుత పరిష్కార మార్గాన్ని సూచిస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ధమైన హక్కులు కాపాడుకుంటాం.. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొంటున్నందుకు అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని పుతిన్ ఖండించారు. రష్యా నుంచి చమురు కొనే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు అదే హక్కు భారత్కు ఉండకూడదా? అని ప్రశ్నించారు. అమెరికా తమ దేశం నుంచి అణు ఇంధనం కొంటూనే ఉందని గుర్తుచేశారు. దాంతో అమెరికా అణు విద్యుత్ ప్లాంట్లతో ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇండియా కొంత తగ్గించుకున్నట్లు చెప్పారు. ఇది స్వల్పంగానే ఉందని పేర్కొన్నారు. భారత్లో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వాణిజ్యం సజావుగానే సాగుతోందని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. -
బీజేపీకి.. ‘ఈశాన్యం’ పోటు..!
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్రాలపై బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఒడిశా లాంటి రాష్ట్రాలను సైతం కైవసం చేసుకున్న కాషాయదళం.. పశ్చిమ బెంగాల్ మాదే అంటోంది..! అయితే.. ఈశాన్యంలో వాస్తు దోషమో.. వ్యూహాత్మక తప్పిదాలో తెలియదు కానీ, నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లో విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఉనికి అనేది లేకుండా బీజేపీ చేసింది. కానీ, ఇప్పుడు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసలు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే రాజకీయ వేడి రాజుకుందా? ఎవరిది పైచేయిగా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? ఈ వివరాలు తెలియాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం అత్యంత కీలకమైన రాష్ట్రం. 2016లో అనూహ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని.. రెండో సారి కూడా విజయలక్ష్మి వరించింది. నిజానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయడం 2016లోనే మొదటిసారి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తూనే.. బహుభార్యత్వ నిరోధక చట్టం.. అక్రమ చొరబాటు దారుల నిరోధం వంటి అంశాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు సమయంలో విద్యార్థి సంఘాల నిరసనను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం జెన్-జీ ఉద్యమాలు బీజేపీని గద్దెదింపే స్థాయిలో ఉధృతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణంతో అభిమానుల ప్రవాహం ఉప్పొంగి కనిపించగా.. షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఆరు ఓబీసీ వర్గాలను చేర్చాలంటూ హిమంత సర్కారు చేసిన సిఫార్సు ఇప్పుడు ఎస్టీల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలకు కారణమవుతోంది. ఇప్పటికే శక్తిమంతమైన బోడో తెగలోని విద్యార్థి నాయకులు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ఖండించారు. అదే సమయంలో.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్.. ఈ అంశాలను ఎజెండాగా మలచుకుని, ప్రజావ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతోంది. హిమంత సర్కారు ఎస్టీ జాబితా అనే తేనెతుట్టెను కదలించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఓబీసీలుగా ఉన్న థాయ్ అహోమ్, టీ తెగలు, కుచ్ రాజ్ బంశీ వంటి వర్గాలను ఎస్టీల్లో చేర్చాలని అస్సాం సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 27శాతం. ఈ నిర్ణయంపై అస్సాంలో రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వర్గాలను ఎస్టీల్లో చేర్చడంతో తనకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గాలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. అదేసమయంలో ఈ జాబితాపై ఎస్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో ఎస్టీల జనాభా 13శాతం. వీరిలో బోడోలాండ్, కర్బీ అంగ్లాంగ్, దిమహాసావోలోని స్వయంప్రతిపత్తి ప్రాంతాల్లో ఉంటున్నారు. నిజానికి బీజేపీ అస్సాంలో పాగా వేయడానికి దోహదపడ్డ ప్రాంతాలు ఇవే. ఇప్పుడు ఈ తెగల వారు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో.. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణం కూడా హిమంత సర్కారును చిక్కుల్లో పడేసింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు జుబిన్ది హత్యేనని ముఖ్యమంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే 8 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే.. బెంగాలీ మాట్లాడే ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐయూడీఎఫ్ ఈ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అదే జరిగితే.. ఇండియా కూటమికి ఓట్ల చీలిక పోటు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.అసోంతో పాటు.. ఈశాన్యంలో మరో కీలక రాష్ట్రం మణిపూర్. కుకీలు-మైటీలకు మధ్య వివాదాలతో జరిగిన అల్లర్లు మణిపూర్ను అట్టుడికించాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తప్పించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో బీజేపీ అధిష్ఠానం రాజీనామా చేయించింది. ఫలితంగా రాష్ట్రపతి పాలన మొదలైంది. ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పాలనను స్వయానా బీజేపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మరో ఆర్నెల్లపాటు రాష్ట్రపతి పాలనను పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. 2027లో మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తాజా పరిణామాలు బీజేపీని చిక్కులోకి నెట్టేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక మేఘాలయ, త్రిపురలో కూడా రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్కు చెందిన రోనీలింగ్డో నేషన్ పీపుల్స్ పార్టీలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీ మేఘాలయ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే..! అయితే.. మాజీమంత్రి ముకుల్ సంగ్మా కాంగ్రెస్లో చేరారు. అయితే.. ఎన్పీపీ నేతృత్వంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతోంది. 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ(వీపీపీ)తో పొత్తుతో అధికారపీఠాన్ని చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అదే జరిగితే.. ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అటు త్రిపురలో రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య నేతృత్వంలోని టీఎంపీ బలాన్ని పుంజుకుంటోంది. అస్సాం, త్రిపురలో నిరసనలు.. మణిపూర్ అల్లర్లు, మేఘాలయలో పరిణామాలు మారుతున్న నేపథ్యంలో.. ఈశాన్యంలో బీజేపీకి చిక్కులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
రూ. 25 లక్షల ఉద్యోగాన్ని వదిలేశాడు, ఎందుకో తెలిస్తే షాక్!
గిగ్ వర్కర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎవరైనా మెరుగైన ఉద్యోగం కావాలని కోరుకుంటాడు. నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే కార్పొరేట్ ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తాడు కదా. కానీ ఏడాదికి 25 లక్షల రూపాయల వేతనం ఇచ్చే ఉద్యగాన్ని వదిలిపెట్టేశాడు. విచిత్రంగా ఫుడ్ డెలివరీ రైడర్గా పని చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేమిటీ అంటే..బెంగళూరులో ఒక వ్యక్తి తన సంవత్సరానికి రూ.25 లక్షల కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలనే కల సాకారం కోసం ఫుడ్ డెలివరీ బాయ్ అవతార మెత్తాడు. ఎంజి వి (@original_ngv) అనే ఎక్స్ యూజర్ పోస్ట్తో ఈ వైనం వెలుగులోకి వచ్చింది. ఆయన కథనం ప్రకారం తన స్నేహితుడి ఆకస్మిక కెరీర్ మార్పు వ్యూహం అతని కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతుండటం, కొత్తగా కారు కొనడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబం, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు స్నేహితులు అతణ్ని ఎగతాళి చేశారు. డెలివరీ బాయ్గా అనేక అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. అయినా వెనక్కి తగ్గలే. కుటుంబం, సన్నిహితుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, తన కలను కొనసాగించాలని నిశ్చయించుకున్నాడుA friend of mine left his 25 lpa+ job to become a Swiggy / Rapido driver. And no I'm not joking.His parents called me asking me to talk sense into him, crying literally. He was going to get married next year. And just bought a car.I spoke with him, and the reason shocked me.…— enji vi (@original_ngv) December 3, 2025 సొంత క్లౌడ్కిచెన్ను ప్రారంభించాలని యోచిస్తున్నాడు. కస్టమర్ ప్రాధాన్యతలను స్వయంగా అర్థం చేసుకోవాలనేది అతని ప్లాన్. విశ్వవిద్యాలయం పక్కనే ఉన్న ప్రాంతంలో ఏ మెనూ ఐటెమ్స్కు డిమాండ్ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారం ఏంటి? ఏ ధరలకు, , ఏ ప్రదేశాలు అధిక-వాల్యూమ్ ప్రాంతాలు అనే దాని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాఏం సాధించాడుతను అనుకున్నది సాధించడంకోసం మార్కెట్ను బాగా పరిశీలించాడు. తన అనుభవం ద్వారా, తక్కువ ధరకే కానీ అధిక పరిమాణంలో విక్రయించగల 12 సంభావ్య స్టాక్ కీపింగ్ యూనిట్లను (SKUలు) అతను గుర్తించాడు, వీటిని అతను తన క్లౌడ్ కిచెన్లో ప్రదర్శించాలని యోచిస్తున్నాడు.ఈ మోడల్తో 3-4 నెలల్లోనే లాభాలు సాధించగలనని అతను ధీమాగా ఉన్నాడు. డెలివరీ బాయ్ అనేచులకన భావంతో, వాచ్మెన్ కూడా తనపై ఎలా అరుస్తారో స్నేహితుడు కథలు కథలుగా చెబుతాడని, అయినా కానీ, వ్యాపారంలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడని తన పోస్ట్లో చెప్పుకొచ్చాడు. అతనికి తన సపోర్ట్ వంత శాతం ఉంటుందని, అంతా మంచే జరుగుతందని ఆశిస్తున్నానని తన ట్వీట్లో పేర్కొన్నాడు. దీంతో ఆల్ ది బెస్ట్ బ్రో అంటున్నారు నెటిజన్లు. ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా! -
పుతిన్కు ఘన స్వాగతం
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. రష్యా నుంచి గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న పుతిన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచి్చన పుతిన్ను చిన్నారులు సంప్రదాయనృత్యాలతో స్వాగతించారు. పుతిన్, మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ఇరువురూ ఒకే కారులో మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ప్రధానమంత్రి ప్రైవేట్ విందు ఇచ్చారు. పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం మూడు నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాంజిన్ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్ చిరకాల మిత్రదేశమైన ఇండియాలో పర్యటిస్తుండడం విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రోటోకాల్ను పక్కనపెట్టి మరీ పుతిన్ కోసం ఎయిర్పోర్టుకు స్వయంగా రావడం విశేషం. తన మిత్రుడు పుతిన్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయనతో చర్చల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్–రష్యా బంధం ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచిందని ఉద్ఘాటించారు. మోదీ నివాసంలో విందు సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. అనంతరం పుతిన్ ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. నేడు వరుస భేటీలు వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ శుక్రవారం బిజీబిజీగా సాగిపోనుంది. పుతిన్కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలుకుతాయి. అనంతరం ఆయన రాజ్ఘాట్ను సందర్శించి, మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో జరిగే 23వ ఇండియా–రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఇవ్వబోతున్నారు. సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. కీలక ఒప్పందాలు? ఇండియా–రష్యా సదస్సులో ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరుగనున్నాయి. #WATCH | Russian President Vladimir Putin lands in Delhi; Prime Minister Narendra Modi receives him at the airportPresident Putin is on a two-day State visit to India. He will hold the 23rd India-Russia Annual Summit with PM Narendra Modi in Delhi on December 5(Source: DD) pic.twitter.com/wFcL9of7Eg— ANI (@ANI) December 4, 2025 TWITTER HAS UPDATED THE ❤️ LIKE BUTTONTO CELEBRATE PRESIDENT VLADIMIR PUTIN’S VISIT TO INDIA!Heartfelt thanks for the grand welcome of President Putin in India.#PutinInIndia #VladimirPutin #IndiaRussia #ModiPutinSummit 🇮🇳🇷🇺 pic.twitter.com/lVVkXTkDWI— LOKESH YOGI (@YKumar_Lokesh) December 4, 2025కారు పూలింగ్ ఆలోచన నాదే: పుతిన్ చైనాలోని తియాంజిన్లో సెపె్టంబర్ 1న భారత ప్రధాని మోదీతో కలిసి ఒకే కారులో ప్రయాణించాలన్న ఆలోచన తనదేనని పుతిన్ తెలిపారు. ఇది తమ స్నేహానికి గుర్తు అని వివరించారు. ఇండియా టుడే వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ముందస్తు ప్రణాళికతో జరిగిన ఘటన కాదని అన్నారు. సదస్సు వేదిక నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తన కారు సిద్ధంగా ఉందని, కలిసి వెళ్దామని తాను కోరడంతో మోదీ అంగీకరించారని చెప్పారు. షాంఘై సహకార సదస్సు ఎజెండాతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. పుతిన్కు భగవద్గీత బహూకరణ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహూకరించారు. భగవద్గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం
న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్ మాజీ విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి. లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం ప్రకటించింది. కౌశల్కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.VIDEO | Delhi: Swaraj Kaushal, senior BJP leader and husband of the late former External Affairs Minister Sushma Swaraj, passed away on Thursday. Visuals from the cremation ground show his daughter and BJP MP Bansuri Swaraj performing rituals.(Full video available on PTI Videos… pic.twitter.com/bMzs5Nxaz8— Press Trust of India (@PTI_News) December 4, 2025తిరిగి అమ్మ దగ్గరికేబన్సూరి స్వరాజ్ తన తండ్రి మరణంపై ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.पापा स्वराज कौशल जी, आपका स्नेह, आपका अनुशासन, आपकी सरलता, आपका राष्ट्रप्रेम और आपका अपार धैर्य मेरे जीवन की वह रोशनी हैं जो कभी मंद नहीं होगी।आपका जाना हृदय की सबसे गहरी पीड़ा बनकर उतरा है, पर मन यही विश्वास थामे हुए है कि आप अब माँ के साथ पुनः मिल चुके हैं, ईश्वर के सान्निध्य… pic.twitter.com/imqpUb2DMS— Bansuri Swaraj (@BansuriSwaraj) December 4, 2025ఎవరీ స్వరాజ్ కౌశల్ జూలై 12, 1952న సోలన్లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. -
ఇండిగోకు ఏమైంది? మరో బాంబు బెదిరింపు కాల్
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పలు కష్టాలు ఒక్ సారిగా చుట్టుముట్టాయి. ఇండిగో విమానాలకు గురువారం కొన్ని గంటల్లోనే రెండు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో మదీనా-హైదరాబాద్ విమానాన్ని దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ అయిందో లేదో మరో బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 300కి పైగా విమానాల రద్దుతో విమాన ఆలస్యాన్ని, ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది ఇండిగో. తాజాగా మరో బాంబు బెదిరింపు కాల్ రావడంతో షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం షార్జా నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా, గాలిలో ఉండగానే బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ,ముంబై విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి సహాయం చేశారు. రెండవ బాంబు బెదిరింపుపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.గురువారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు రావడంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సౌదీ అరేబియాలోని మదీనా నుండి హైదరాబాద్కు వెళ్తున్న విమానం అహ్మదాబాద్కు మళ్లించాల్సి వచ్చింది. విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. #WATCH | Ahmedabad, Gujarat: Atul Kumar Bansal, DCP Zone-4, Ahmedabad City, says, "Today, an Indigo flight from Medina to Hyderabad made an emergency landing at Ahmedabad Airport. This was because a threatening email about the flight was received at Hyderabad Airport. All… https://t.co/MtCKwk7fCv pic.twitter.com/TxPdRdDVfC— ANI (@ANI) December 4, 2025 -
రూ.41 లక్షలు : లాయర్ ముసుగులో ఐఎస్ఐ గూఢచారి!
అమృత్సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్కు రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్ అలియాస్ పర్వేజ్ పోలీసులకు తెలిపాడు. 2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు రిజ్వాన్తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్ కారులో అమృత్సర్ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్సర్ వెళ్లారని ముషారఫ్ చెప్పాడు.ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్యరూ.41 లక్షలు సేకరించి..రిజ్వాన్ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్సర్ వెళ్లాడు. రిజ్వాన్కు తౌరులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా, సోహ్నాలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్ ల్యాప్టాప్, ఫోన్లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్ పోలీసు బృందాలు పంజాబ్ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి. -
‘ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎక్సైజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..‘ ఏపీలో పొగాకు, పత్తి, వరి, మామిడి, అరటి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంట నష్టం వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఏపీ పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. పొగాకు ఉత్పత్తి పెరగడంతో ధరలు పడిపోయి రైతులు కష్టాలు పడుతున్నారు. పొగాకు రైతులు కనీసం తమ పంట ఖర్చును కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వేలాదిమంది రైతులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. రకరకాల కారణాలతో పొగాకును బోర్డు తిరస్కరిస్తుంది. పొగాకు బోర్డు తగిన చర్యల వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏపీ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు రైతులపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేయాలి. పొగాకు ఉత్పత్తి , మార్కెట్ స్థిరీకరణ అంశాలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఉపాధిని దెబ్బతీసేలా ఎక్సైజ్ పన్నులు ఉండొద్దు’ అని పేర్కొన్నారు. -
శబరిమల: అయ్యప్పస్వాముల కారులో మంటలు
పతనంతిట్ట: శబరిమల యాత్రికులకు తృటిలో ప్రమాదం తప్పింది. శబరిమల యాత్రికులతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. పంపా చలకాయం సమీపంలో కారు నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తయ్యారు.కారును నిలిపివేసి భక్తులను అలర్ట్ చేయడంతో వారు కారు నుంచి వెంటనే బయటకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది కారులో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ కారులో హైదరాబాద్ భక్తులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రైళ్లలో కర్పూరం వెలిగిస్తే.. మూడేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో కర్పూరం వెలిగిస్తే కఠిన శిక్షలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లే యాత్రికులు రైలులో పూజ సందర్భంగా కర్పూరం వెలిగించకూడదని సూచిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం ఇది నేరమని వివరించారు. రైళ్లలో కర్పూరం వెలిగిస్తే.. రూ.1,000 వరకు జరిమానా, లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.శబరిమల రైళ్లలో భక్తులు కర్పూరం వెలిగిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లలో కర్పూరాన్ని వెలిగించడం నిషేధమన్నారు. రైలులో అగ్గిపుల్ల వెలిగించినా నేరమేనని చెప్పారు. ఇలాంటి చర్యలపై ప్రయాణికులు టోల్ఫ్రీ నంబరు 182కు ఫోన్ చేసి, సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు. -
‘ఏపీలో అరటి రైతులను తక్షణమే ఆదుకోవాలి’
ఢిల్లీ: ఏపీలో అరటి రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. కేంద్రాన్ని కోరారు. ఏపీలో అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారిని వెంటనే ఆదుకోవాలన్నారు. లోక్సభ జీరో అవర్లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్రెడ్డి. ‘టన్ను 25 వేల రూపాయల ఉండే అరటి...ఇప్పుడు కిలో 50 పైసలకు ధర పడిపోయింది. 50 పైసలకు ఒక బిస్కెట్ ఒక అగ్గిపెట్ట కూడా రాదు. అరటి కోత ధర కూడా కనీసం రైతుకు దక్కడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ، ప్రత్యేక రైళ్లతో అరటి సరఫరా చేశాం. తక్షణమే ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంటల బీమా ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అరటి పండ్ల సరఫరాకు ఎక్కువ రైళ్లను ఏర్పాటు చేయాలి. అరటి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. నా నియోజకవర్గంలోని కోడూరు అరటి పంటకు కేంద్రంగా ఉంది. కేంద్ర బృందాలు ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతుల కష్టాలను స్వయంగా చూడాలి . భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది. నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా! -
‘యాసిడ్’ కేసుల నిర్లక్ష్యంపై ‘సుప్రీం’ కన్నెర్ర
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒక కేసును ‘జాతీయ అవమానం’గా ధర్మాసనం అభివర్ణించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసులను నాలుగు వారాల్లోగా విచారణ జరిపి, వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోహిణి కోర్టులో 2009 నుండి పెండింగ్లో ఉన్న బాధితురాలి కేసులో పదేపదే జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మాలిక్ తన కేసు ఎందుకు ఇంకా ముగియలేదో వివరిస్తూ, ఒక దరఖాస్తును దాఖలు చేయాలని కోర్టు కోరింది. అవసరమైతే కోర్టు స్వయంగా విచారణను కూడా చేపట్టవచ్చని కూడా సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ, ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరిస్తామని, నేరస్థులు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.తక్షణ న్యాయం అందించేందుకు, యాసిడ్ దాడి కేసులను ప్రత్యేక కోర్టులు విచారించడం ఉత్తమమని ప్రధాన న్యాయమూర్తి కాంత్ సూచించారు. అంతేకాకుండా యాసిడ్ దాడి బాధితులను వైకల్యం ఉన్న వ్యక్తులుగా వర్గీకరించాలని, వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు వీలు కల్పించాలని మాలిక్ చేసిన విజ్ఞప్తిపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నిరంతర వైద్య సంరక్షణలో ఉంటూ, బాధితులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను మాలిక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇది కూడా చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక.. ఢిల్లీలో హై అలర్ట్.. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక.. ఢిల్లీలో హై అలర్ట్..
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా గురువారం రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్)బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ-స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకూ ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నారు. రాజధాని నగరంలో మోదీ-పుతిన్ చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక వ్యూహాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.ఈ సమావేశం కేవలం దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహపడనుంది. ఈ అధికారిక చర్చలకు ముందు, ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా పుతిన్ సమావేశం కానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం అజెండా విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక సహకారం, పారిశ్రామిక సహకారం, వినూత్న సాంకేతికతల బదిలీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. శాంతియుత అంతరిక్ష అన్వేషణ, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, కార్మిక వలస కార్యక్రమాలలో కొత్త 'ఆశాజనక ప్రాజెక్టులు' కూడా చర్చల జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నప్పటికీ, ఈ పర్యటన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంచడానికి ఒక వేదికగా ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: స్మార్ట్ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం -
గ్యాస్ మాస్క్లతో ఎంపీలు.. కాలుష్యంపై గగ్గోలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్షాలు ప్రధానంగా రెండు కీలక సమస్యలను లేవనెత్తాయి. అవి ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్య సంక్షోభం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడం. ప్రతిపక్షాల ఎజెండాలో వాయు కాలుష్యంపై చర్చ ప్రధానాంశంగా నిలవగా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్క్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సమస్యను జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ఉత్తర భారతదేశంలోని నెల రోజుల నుంచి తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చ నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. మాణికం ఠాగూర్, మనీష్ తివారీ, విజయకుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్న ఈ సంక్షోభాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ తీర్మానం నోటీసులో ప్రభుత్వం సమన్వయంతో కూడిన జాతీయ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమైందని, పక్షవాతానికి గురై, చర్యలకు బదులుగా సలహాలు మాత్రమే ఇస్తోందని" తీవ్రంగా విమర్శించారు.వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ప్రతిపక్ష ఎంపీలు బుధవారం, గురువారం పార్లమెంట్కు గ్యాస్ మాస్క్లు ధరించి వచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వాయు కాలుష్యం వంటి ముఖ్యమైన ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ కాలుష్య సంక్షోభంపై స్పందిస్తూ, ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ విఫలమయ్యిందని ఆరోపించారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అధికార పార్టీపై పదునైన విమర్శలు చేశారు. గురువారం ప్రారంభ వాణిజ్యంలో యూఎస్ డాలర్తో రూపాయి విలువ 28 పైసలు క్షీణించి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా ₹90.43 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు."కొన్ని సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, వీరంతా ఏమన్నారు? ఇప్పుటి పరిస్థితికి వీరు చెప్పే సమాధానం ఏమిటి? వారినే అడగండి, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు," అని ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ వెలుపల విలేకరులను ప్రశ్నించారు. రూపాయి విలువ పతనంపై అధికార పక్షం గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేస్తూ, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పతనం గురించి ప్రశ్నించడానికి ప్రయత్నించారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాలుగవ రోజు (గురువారం) కేవలం చట్టసభ చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య , ఆర్థిక సంక్షోభాలకు వేదికగా నిలిచింది. ప్రతిపక్షాల గ్యాస్ మాస్క్ నిరసన ఢిల్లీలోని కాలుష్య సంక్షోభ తీవ్రతను జాతీయ వేదికపైకి తీసుకువచ్చింది. రూపాయి పతనంపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తాయి. కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలనే డిమాండ్పై కేంద్రం స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నారు. #WATCH | Delhi: Opposition MPs protest in front of Makar Dwar on Parliament premises over air pollution issue. pic.twitter.com/BoEeQQPdkH— ANI (@ANI) December 4, 2025 -
చాట్జీపీటీ సాయంతో స్కామర్నే బోల్తా కొట్టించి..
డిజిటల్ అరెస్టులు.. ఆన్లైన్ స్కాములు నిత్యం వింటున్నాం. ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తారు? ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారు లేదా ఆ సైట్లోకి వెళ్లడం మానేస్తారు. అయితే ఒక యువకుడు ఈ తరహా స్కామ్ను ఏఐ చాట్ జీపీటీ పవర్తో తిప్పికొట్టాడు. తనను మోసం చేయాలని చూసిన స్కామర్ను ట్రాక్ చేసి, అతని వివరాలు సేకరించి, చివరకు ‘నన్ను వదిలేయండి.. మహా ప్రభో’ అని వేడుకునేలా చేశాడు. ఈ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఆన్లైన్ మోసగాడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తన కాలేజీ సీనియర్గా, ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్న ఒక స్కామర్ తక్కువ ధరలకు ఫర్నిచర్ అమ్ముతున్నానని చెబుతూ, డబ్బు కొట్టేయాలని ప్రయత్నించాడు. ఈ మెసేజ్లో ఏదో తేడా ఉందని గ్రహించిన బాధితుడు, ఈ స్కామర్ను టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని ఒక ఏఐ ఆధారిత ఆపరేషన్గా మార్చి, చివరకు ఆ స్కామర్ను తన ట్రాప్లో పడేలా చేశాడు. ఇందుకోసం ఆ యువకుడు చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. స్కామర్కు నగదు పంపడానికి వీలుగా, చెల్లుబాటు అయ్యే విధంగా ఒక నకిలీ చెల్లింపు పోర్టల్ను రూపొందించాలని ఏఐకి ఆదేశించాడు. అయితే, ఈ వెబ్పేజీ ముఖ్య ఉద్దేశ్యం డబ్బు స్వీకరించడం కాదు.. అది క్లిక్ చేసిన వారి జియో లొకేషన్, ఐపీ అడ్రస్, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాతో వారి ఫొటోను రహస్యంగా సంగ్రహించడం. ఏఐ కొద్ది నిమిషాల్లోనే ఈ మోడల్కు అవసరమైన కోడ్ను రూపొందించింది. ఇది ఆన్లైన్ దొంగను పట్టుకోవడానికి వేసిన ఒక తెలివైన డిజిటల్ వలగా మారింది.ట్రాకర్ పేజీ సిద్ధమైన తర్వాత బాధితుడు స్కామర్కు ఆ లింక్ను పంపాడు. క్యూఆర్ కోడ్ను అప్లోడ్ చేయడం ద్వారా చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని నమ్మబలికాడు. అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో స్కామర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ లింక్పై క్లిక్ చేశాడు. అంతే ఆ నకిలీ పోర్టల్కు స్కామర్ ఉంటున్న ఖచ్చితమైన స్థానం, ఐపీ అడ్రస్, స్పష్టంగా' ఉన్న అతని సెల్ఫీ అందాయి. వెంటనే బాధితుడు ఆ వివరాలను తిరిగి స్కామర్కే పంపడంతో కథ ఊహించని మలుపు తిరిగింది.తన వివరాలు బయటపడటంతో స్కామర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే, వేర్వేరు నంబర్ల నుండి బాధితుడికి పదేపదే కాల్స్ చేసి.. ఈ పనిని ఇకపై చేయను అంటూ క్షమాపణలు కోరడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు షేర్ చేసిన స్క్రీన్షాట్లు చూసి స్కామర్ వణికిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం గురించి సదరు యువకుడు ‘రెడిట్’లో పోస్ట్ చేస్తూ, చివర్లో.. ‘దొంగను బోల్తా కొట్టించడంలో ఆ తృప్తే వేరు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటన సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించింది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్ ఎయిర్లైన్స్.. గుంటనక్క చేతికే! -
కాళ్ల పారాణి ఆరకముందే అత్తింట్లో అల్లుడు..
జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ మధురానుభూతిని కల్గించే మహత్తర ఘట్టం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజున వరుడు అత్తవారింటికి తిరిగింపులకు రాగా బాజాభజంత్రీలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. అయితే పెళ్లి కుమార్తె కాళ్ల పారాణి ఆరకముందే వరుడు అత్తింట్లో గుండెపోటుతో మరణించడంతో అటు పెళ్లి కుమార్తె, ఇటు పెళ్లి కుమారుడి ఇళ్లలో తీవ్ర విషాదం, బాధ, కన్నీరు మిగిలాయి.సాక్షి బళ్లారి: పెళ్లయిన మరునాడే నవవరుడు గుండెపోటుతో మరణించిన ఘటన విజయనగర జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు..శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన రమేష్(30) అనే యువకుడికి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బండ్రి గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం నిశ్చితార్థం జరగగా నవంబర్ 30వ తేదీన పెళ్లి జరిగింది. అనంతరం మంగళవారం పెళ్లి కుమార్తె ఇంటికి వధువు, వరుడు తిరిగింపులకు రావడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపును కూడా నిర్వహించారు. వధువు ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కుమార్తె ఇంట్లో కాలు పెట్టగానే వరుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటనతో పెళ్లి కుమార్తె ఇంట ఆక్రందనలు మిన్నంటాయి. కాగా పెళ్లి కుమారుడు రమేష్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో తల్లి సొంత ఊరు హొసకుప్పె గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకొన్న మరుసటి రోజే మృతి చెందడంతో అటు అతని అమ్మమ్మ ఇంట్లో కూడా విషాదం నెలకొంది. ఈ ఘటనతో పెళ్లి సందడి ఆవిరై కన్నీటి పర్యంతంగా మారింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పెళ్లి కుమార్తె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. -
బీజాపూర్ ఎన్కౌంటర్.. మృతుల్లో ఆ అగ్రనేత కూడా?!
బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొత్తం 19 మంది మావోయిస్టులు మృతి చెందారని గురువారం అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మృతుల్లో ఓ అగ్రనేత ఉన్నట్లు సమాచారం అందుతోంది.ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో బుధవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు భద్రతా బలగాల సిబ్బంది కూడా అమరులయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు.. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.అయితే ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల లభ్యం.. కూంబింగ్ కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య 25 దాకా ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే.. మృతుల్లో పీఎల్జీఏ-2 కమాండర్ వెల్ల మోడియం కూడా ఉన్నారని భావిస్తున్నారు. వెల్ల మోడియం (Vella Modiyam) మావోయిస్టు పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేత. దక్షిణ బస్తర్లో టాప్ కమాండర్ కూడా. ఆయనపై భారీగానే రివార్డు ఉంది. హిడ్మా తరహాలోనే వ్యూహాత్మక దాడులకు ఆయన నేతృత్వం వహించేవారు. ఒకానొక టైంలో.. హిడ్మా కంటే కూడా పెద్ద మావోయిస్టు నాయకుడిగా పోలీసులు, భద్రతా దళాలు భావించేవి. మోడియం ఎన్కౌంటర్ నిజమే అయితే.. నక్సలైట్లకు పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కొనసాగుతున్న ‘ఇండిగో’ సంక్షోభం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో 33 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.ఢిల్లీ 30, బెంగళూరు ఎయిర్పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో పెద్ద ఎత్తున విమాన రద్దయ్యాయి. గురువారం మొత్తం 170కి పైగా ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యే అవకాశం ఉంది.బుధవారం నాలుగు నగరాల్లో కలిపి 200 విమానాలు రద్దయ్యాయి. కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయనిఅని ఇండిగో అంగీకరించింది. శీతాకాల షెడ్యూల్ మార్పులు, వాతావరణం, సాంకేతిక లోపాలు కారణమని ఇండిగో చెబుతోంది. కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలతో పైలట్ల కొరత తీవ్రమైంది. షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ కార్యకలాపాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యం అని ఇండిగో ప్రకటించింది.ఇదీ చదవండి: భారీ సంఖ్యలో విమానాల రద్దుకు కారణం ఏంటంటే..నవంబరులో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. 755 ఫ్లైట్లు క్రూ/FDTL కారణంగా రద్దయ్యాయి. 258 విమానాలు ఎయిర్స్పేస్ పరిమితుల వల్ల రద్దయ్యాయి. 92 విమానాలు ATC వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై ఇండిగోను డీజీసీఏ వివరణ కోరింది. ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించినట్లు వివరించారు. -
‘బ్రేక్ఫాస్ట్ రారాజు’.. ఇంటర్నెట్లో ఆసక్తికర యుద్ధం
ఆహారం.. కేవలం ఆకలిని తీర్చుకునే పదార్థమే కాదు.. జీవితం, సంస్కృతి,చరిత్రల ప్రతిబింబం. ప్రపంచంలోని ప్రతి మూలనా ఆహారం ఒక భాషగా పరిణమించింది. తరతరాలుగా అందిన ఆహార కథలు సంప్రదాయాలను తెలియజేస్తాయి. పండుగలలో కుటుంబంతో పాటు పంచుకునే విస్తృతమైన విందుల నుండి, రోడ్ల పక్కన దొరికే అల్పాహారం వరకు.. మనం తినే ప్రతి వంటకం ఆ ప్రదేశపు గుర్తింపును,చరిత్రను తెలియజేస్తుంది. ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లను అధిగమిస్తూ బెంగళూరు ‘ఉత్తమ ఆహార నగరం’గా నిలిచింది. నెట్టింట మరో యుద్ధానికి దారి తీసింది.స్కాటిష్ కంటెంట్ సృష్టికర్త హ్యూ ఆన్లైన్లో ‘హ్యూ అబ్రాడ్’గా పేరొందారు. తన ఆహార రుచుల పరిశోధన తరువాత ఆయన బెంగళూరుకు పట్టంకట్టారు. బెంగళూరులో లభ్యమయ్యే అల్పాహారాలలో ముఖ్యంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల క్లాసిక్ కలయిక, తన హృదయాన్ని దోచుకుందని హ్యూ ఆనందంగా తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యూ భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాల మీదుగా వారాల తరబడి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలతో పాటు బెంగళూరులను సందర్శించారు. అల్టిమేట్ ఫుడ్ సిటీ?భారతదేశ పర్యటన ముగించుకున్న ఆయన పాకిస్తాన్కు కూడా వెళ్లారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఆయన ఈ రెండు దేశాల ఆహారాన్ని పోల్చుతూ నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్లో, ఒక అభిమాని భారతదేశంలో ‘అల్టిమేట్ ఫుడ్ సిటీ’ ఏదని అడిగారు. దీనికి సమాధానంగా హ్యూ.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార పర్యాటక ప్రాంతాలను పక్కన పెట్టి, బెంగళూరు పేరును వెల్లడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరులో లభ్యమైన అల్పాహారానికి ఫిదా అయిన ఆయన అల్టిమేట్ ఫుడ్ సిటీ కిరీటం బెంగళూరుకే దక్కుతుందన్నారు. అక్కడ తాను తాగిన ఫిల్టర్ కాఫీ, తిన్న దోసెలు, ఇడ్లీలు మరో ప్రపంచాన్ని చూపించాయని ఆయన అన్నారు. తన ఈ ప్రయాణంలో బెంగళూరులోనే తాను ఆహారాన్ని అమితంగా ఆస్వాదించానని స్పష్టం చేశారు.గుర్తుకొస్తే చాలు..దోసె వేసే తీరును, రుచిని ఆయన వర్ణిస్తూ ‘దోసెలు.. గ్లాస్ మాదిరిగా పారదర్శకంగా క్రిస్పీగా ఉంటాయి’ అని వివరించారు. అదేవిధంగా ఇడ్లీలు నోటిలో పెట్టుకోగానే కరిగిపోతాయని అభివర్ణించారు. ఆ వంటకాల గురించి ఆలోచిస్తుంటే మళ్లీ ఆకలిని పెరుగుతున్నదన్నారు. హ్యూ ఆహార తీర్పు వెలువడిన వెంటనే ఆన్లైన్లో అది చర్చకు దారితీసింది. బెంగళూరులో నివసించే కొందరు ఉత్తర భారతీయులతో సహా పలువరు ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు అల్పాహారం విషయంలో బెంగళూరు టాప్లో ఉంటుందని అంగీకరించారు. ఉత్తర భారతీయులు గరంగరంఒక యూజర్ తాను బెంగళూరులో నివసిస్తున్న ఉత్తర భారతీయుడినని.. దోసె, ఇడ్లీలు ఉత్తమ అల్పాహారం అని నేను అంగీకరిస్తున్నానని రాశారు. మరికొందరు ఈ వ్లాగర్ అందించిన తీర్పు కేవలం అల్పాహారం వరకే పరిమితమని రాశారు. ఆహార ప్రియులైన మరికొందరు హ్యూను భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఆహార కేంద్రాలను సందర్శంచాలని కోరారు. మరొక యూజర్ మీరు దేశవ్యాప్తంగా ఇతర ఆహారాలను కూడా ప్రయత్నించాలని, అల్పాహారం ఆధారంగా ఇలా చెప్పడం తప్పని హ్యూకు సూచించారు. మరొకరు.. పంజాబ్, యూపీలను మినహాయించి ఈ వ్యక్తి ఆహారంపై వీడియో చేశాడని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.హైదరాబాద్, ఢిల్లీ..మరో వినియోగదారు ఉత్తమ ఆహార నగరాలుగా లక్నో, హైదరాబాద్లను పేర్కొన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే హ్యూ అక్కడి కరాచీని తనకు ఇష్టమైన ఆహార నగరంగా ఎంచుకున్నారు. భారతదేశంలో బెంగళూరుకు కిరీటాన్ని పెట్టిన ఆయన ఢిల్లీని కూడా ప్రశంసించారు. అక్కడ లభ్యమైన జిలేబీ, రబ్డీని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ అంతిమంగా ఇడ్లీ, దోసె, ఫిల్టర్ కాఫీల కలయికతో బెంగళూరు అత్యుత్తమ ఆహార అనుభూతిని అందించిన నగరంగా నిలిచిందని హ్యూ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Pakistan: అప్పు కోసం విమానయాన సంస్థ బేరం -
గవర్నర్ మనవడిపై హత్యాయత్నం కేసు
భోపాల్: కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కుటుంబం వరకట్న వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంది. గవర్నర్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ భార్య దివ్య గెహ్లాట్, తన భర్తతో పాటు మామ, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, తన మైనర్ కుమార్తె అపహరణ తదితర ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్లోని రత్లాం పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్కు దివ్య లిఖితపూర్వకంగా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షల కట్నం డిమాండ్ చేస్తూ, తన అత్తమామలు కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.దివ్య ఆరోపణల ప్రకారం.. 2018, ఏప్రిల్ 29న వారి వివాహం జరిగింది. అయితే అంతకు ముందు తన భర్త దేవేంద్ర గెహ్లాట్ మద్యపానం, మాదకద్రవ్య వ్యసనంలో మునిగితేలేవాడని, ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, అయితే అవి తనకు తెలియకుండా దాచిపెట్టాడని దివ్య ఆరోపించారు. తమ వివాహం ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద సీనియర్ నేతలు మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, థావర్చంద్ గెహ్లాట్ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిందన్నారు. పెళ్లి తర్వాత కూడా దేవేంద్ర తన వ్యసనాలను మానుకోలేదని, ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగించాడని దివ్య ఆరోపించారు.2021లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, తనకు ఆహారం ఇచ్చేవారు కాదని, తీవ్రంగా కొట్లేవారని, మానసికంగా హింసించారని దివ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 26న తన భర్త తాగి వచ్చి, తనను దారుణంగా కొట్టి ‘ఈ రోజు డబ్బు తీసుకురాకపోతే చంపేస్తాను’ అని బెదిరించాడని, తరువాత పైనుంచి తోసేశాడని, దీంతో తన వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. పైగా ఆరోజు రాత్రంతా తనకు వైద్య సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.గాయాలతో బాధపడుతున్న తనను మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన పరిస్థితిని గుర్తించి, ఇండోర్లోని బాంబే ఆసుపత్రికి తరలించారని దివ్య తెలిపారు. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదని, పైగా తన వైద్య ఖర్చులు భరించాలని తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని దివ్య ఆరోపించారు. తన నాలుగేళ్ల కుమార్తెను తన అత్తమామలు వారితోనే ఉంచుకున్నారని, తాను తన కుమార్తెను కలుసుకునేందుకు పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన భర్త అడ్డుకొని, తన తల్లిదండ్రుల నుండి డబ్బు తీసుకువచ్చాకనే, కూతురిని చూడాలని హెచ్చరించాడని దివ్య ఆరోపించారు.దివ్య ప్రస్తుతం రత్లంలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ ఉదంతంలోని పలు సంఘటనలు ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో జరగడంతో, రత్లాం పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి, తదుపరి చర్యల కోసం ఉజ్జయిని అధికారులకు పంపారు. ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్ (దివ్య మామ) స్పందించారు. ఆరోపణలు ఎవరైనా చేయవచ్చని, తను అన్ని వాస్తవాలను మీడియా ముందు ఉంచుతానని అన్నారు.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
IndiGo: భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గగనతల ప్రయాణాల సంక్షోభం కొనసాగుతోంది. వివిధ ఎయిర్లైన్స్ విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇందుకు కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసా?.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వెల్లగక్కతున్నారు. రీఫండ్ విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇండిగో మీద ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. అయితే.. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. ఏంటా కొత్త రూల్స్.. ?FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్లైన్స్ తమ షెడ్యూల్లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది. ఇలాగే ఇంకొన్ని గంటలురెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. అయితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రూల్స్ నుంచి పశమనం కోరుతూ డీజీసీఏను ఆశ్రయించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
సుప్రీంలో మహిళా న్యాయవాది వీరంగం
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి కొలువుదీరిన సుప్రీంకోర్టులో బుధవారం ఒక మహిళా న్యాయవాది తీవ్ర రసాభాస సృష్టించడంతో, ఆమెను కోర్టు మార్షల్స్ బయటకు తీసుకెళ్లాల్సి వచి్చంది. ధర్మాసనం వారిస్తున్నా.. ఆ న్యాయవాది పదేపదే జాబితాలో లేని ఒక కేసును ప్రస్తావించి, విచారణకు అంతరాయం కలిగించారు. జాబితాలో లేని అంశంపై పట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కె.సింగ్లతో కూడిన ధర్మాసనం ముందు, ఆ మహిళా న్యాయవాది జాబితాలో లేని ఒక అంశాన్ని నోటిమాటగా ప్రస్తావించినప్పుడు ఈ సంఘటన జరిగింది. తొలుత ఆ మహిళా న్యాయవాది మాట్లాడుతూ, ముంబైలో ఉన్నప్పుడు తన స్నేహితురాలు ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్లో హత్యకు గురయ్యారని చెప్పారు. మొదట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసు అధికారిని, ఇప్పుడు అదే కేసులో దర్యాప్తు అధికారిగా నియమించారని ఆరోపించారు. డిప్రెషన్లో ఉన్నాను.. వినాల్సిందే నిరీ్ణత విధానంలో పిటిషన్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఆమెకు సూచించగా, ఆమె ‘నేను డిప్రెషన్లో ఉన్నాను, కచి్చతంగా దాఖలు చేస్తాను’.. అన్నారు. కానీ అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారు. కేసు దాఖలుకు ఆమెకు సహాయం చేయాలని అక్కడే ఉన్న ఒక న్యాయవాదికి ధర్మాసనం సూచించి తదుపరి కేసును పిలిచింది. అయినప్పటికీ, ఆ మహిళా న్యాయవాది తన వాదనతో పట్టుబట్టారు. నన్ను తాకొద్దు.. కోర్టులో ఆమె బిగ్గరగా అరుస్తుండటంతో పరిస్థితి చేయిదాటింది. దీంతో మహిళా కోర్టు మార్షల్స్ ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయతి్నంచగా, ‘గౌరవంగా ప్రవర్తించండి, నన్ను తాకవద్దు’.. అని ఆమె మరింత పెద్దగా అరుస్తూ ప్రతిఘటించారు. జస్టిస్ భూయాన్ సహా తోటి న్యాయవాది ఒకరు.. కోర్టు మర్యాదలు పాటించాలని సలహా ఇచ్చినా, ఆమె మొండిగా వ్యవహరించారు. తన భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని కోర్టుకు చెప్పాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ఆమె పెద్దగా అరుస్తుండటంతో.. కోర్టు కార్యకలాపాల ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం ఆడియో వినిపించకుండా చర్యలు తీసుకున్నారు. కాసేపయ్యాక ఎట్టకేలకు ఆమెను కోర్టు గది నుండి బయటకు పంపించారు. -
ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లను
మంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓ పెళ్లికి హాజరుకావ డంతోపాటు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. బుధవా రం ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళూరు వచ్చిన సిద్ధరామయ్యతో.. డీకే పర్యటన గురించి మీడియా ప్రశ్నించగా.. అధికారికం ఆహ్వానం లేకుండా ఢిల్లీకి వెళ్లబోనని స్పష్టం చేశారు. ‘ఆయనను వెళ్లనివ్వండి. ఎవరైనా ఆయనకు నో చెప్పారా? నేను ఆహ్వానించినప్పుడే వెళ్తాను. నన్ను ఆహ్వానించలేదు, కాబట్టి నేను వెళ్లడం లేదు.’అని స్పష్టం చేశారు. మంగళూరు విమానాశ్రయంలో డీకే డీకే అంటూ మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఆయన..‘ఇందులో తప్పేముంది? గత పదేళ్లుగా ప్రజలు ‘డీకే డీకే’అని నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ‘మోదీ మోదీ’అని అరుస్తారు. మరికొందరు ‘రాహు ల్ రాహుల్’, ఇంకొందరు ’సిద్దూ సిద్ధూ’అని జపిస్తారు. అందులో తప్పేమీ లేదు. వారు ప్రేమతో నినాదాలు చేస్తారు. దానిని మనం క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి’అని అన్నారు. -
నివురుగప్పిన నిప్పుగానే కర్ణాటకం..!
సాక్షి బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో అధికార మార్పిడి వివాదం ఇంకా సద్దుమణిగినట్లు కనబడటంలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘బ్రేక్ఫాస్ట్ చర్చలతో’ ఈ వివాదానికి బ్రేకులు పడ్డాయని సంకేతాలు ఇచ్చినా వారి మద్దతుదారులు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మంగళూరు విమానాశ్రయం ఇరువర్గాల బలప్రదర్శనకు వేదికగా మారింది. విమానాశ్రయం వేదికగా... కోణాజెలో నారాయణ గురు–మహాత్మా గాంధీ సంవాద శతమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంలో డీకే అనుచర నాయకుడు మిథున్ రై, వందలాది మందితో కలిసి ‘డీకే.. డీకే..’ అంటూ వేణుగోపాల్ వద్ద నినాదాలు చేస్తూ దూసుకువచ్చారు. అయితే వేణుగోపాల్ మౌనంగా ముందుకు సాగారు. కొన్ని నిమిషాల అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పలువురు మంత్రులతో కలిసి మంగళూరు చేరుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఐవన్ డిసోజా నేతృత్వంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకుని ముఖ్యమంత్రికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆసక్తి రేపిన సీఎం–కేసీ విందు చర్చలు కోణాజెలో కార్యక్రమం అనంతరం సిద్ధరామయ్య, వేణుగోపాల్ నడుమ మంగళూరు కావేరి గెస్ట్హౌజ్లో ‘లంచ్ మీటింగ్’ జరిగింది. అరగంట పాటు భోజనం చేస్తూ వారిద్దరూ పలు రాజకీయ, పార్టీ అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భోజనానికి ముందు కూడా 15 నిమిషాల పాటు హైఓల్టేజ్ చర్చ కూడా వీరిద్దరి మధ్య జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అల్పాహార సమావేశాల్లో శివకుమార్, తన మధ్య జరిగిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను వేణుగోపాల్కు సీఎం వివరించినట్లు తెలిసింది. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వేణుగోపాల్తో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని, తనను ఎవరైనా పిలిస్తే మాత్రం వెళతానని వెల్లడించారు. డీకే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న విషయంపై అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ, ‘అందులో తప్పేం ఉంది?’ అని ప్రశ్నించారు. అభిమానుల నినాదాలు సహజమే: డీకే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన డీకే.. మంగళూరు పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ‘వేణుగోపాల్తో తమ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడితే తప్పేంటి? వేణుగోపాల్, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఇలా ఎవరినైనా కలిస్తే తప్పేంటి?’ అని ప్రశి్నంచారు. అలాగే విమానాశ్రయంలో తనకు అనుకూలంగా మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఆయన మాట్లాడుతూ అభిమానులు తమ నాయకుడి పక్షాన నినాదాలు చేయడం చాలా సహజమన్నారు. -
భౌ భౌ...!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోకి కారులో కుక్కను తీసుకొచ్చి కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బుధవారం మీడియాకు మరింత పని పెట్టారు. తనపై సభలో హక్కుల తీర్మానం పెట్టాలని పాలక బీజేపీ ఎంపీలు యోచిస్తున్నారన్న వార్తలపై మీడియా ఆమెను ప్రశ్నించగా ‘భౌ భౌ...!’అంటూ విచిత్రంగా స్పందించారు. ‘‘ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు నన్ను?’’ అంటూ మీడియాకే ఎదురు ప్రశ్న కూడా వేశారు. ‘‘తీర్మానం పెట్టినప్పుడు చూసుకుందాం. అదేమన్నా పెద్ద సమస్యా? అదే జరిగితే సరైన సమాధానం సభలోనే ఇస్తా’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో కూడా ఈ ఉదంతంపై మారి్మక వ్యాఖ్యలు చేశారు. రేణుక ‘భౌ భౌ’ ఉదంతంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ఒకరు పాపులర్ సాంగ్ ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ ను ఎంపీ కామెంట్స్ తో రీమిక్స్ చేసి అలరించగా మరొకరు ‘ప్రాణికోటికి మన ఎంపీలు భలే సేవ చేస్తున్నారు’ అని రాసుకొచ్చారు. రాజకీయ రచ్చ సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు సందర్భంగా రేణుక ఒక కుక్కను భవన ప్రాంగణంలోకి తేవడం కలకలం రేపింది. అయితే, ‘దారిలో తారసపడ్డ ఒక వీధి కుక్కను తాను కాపాడి కార్లో తీసుకొచ్చా. దాన్ని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని అనంతరం ఆమె చెప్పారు. పైగా, ‘కరిచేది (సభ) లోపల కూచున్నవాళ్లే. బయటుండే ఇలాంటి శునకాలు కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఈ శునకోదంతం రాజకీయ రచ్చకు కూడా దారి తీసింది. కుక్కలను పార్లమెంటు ఆవరణలోకి అనుమతించడం లేదు గానీ లోనికి (సభ వైపు చూపుతూ) మాత్రం రానిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై పలువులు బీజేపీ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. -
ఉమ్మడి వ్యూహంపై విపక్షాల చర్చ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలు బుధవారం పార్లమెంట్లో ప్రాంగణంలోని మల్లికార్జున ఖర్గే చాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో చర్చించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, విపక్షాల భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 1వ తేదీన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. లేబర్ కోడ్స్పైపత్రిపక్షాల నిరసన కేంద్రం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్స్పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని తేల్చిచెప్పాయి. లేబర్ కోడ్స్ పట్ల విపక్షాలు బుధవారం పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ ముఖ్యనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కారి్మకులకు కక్షగట్టిందని, కేవలం ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కొత్త లేబర్ కోడ్స్తో కారి్మకులకు, ఉద్యోగులకు నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. లేబర్స్ కోడ్స్ను ప్రియాంకా గాంధీ సైతం తప్పుపట్టారు. -
32 వేల మంది టీచర్ల కొలువులు భద్రం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించింది. వారి నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ బుధవారం తోసిపుచ్చింది. టీచర్ల నియామక పరీక్షలో విజయం సాధించలేని కొందరు అభ్యర్థుల కారణంగా మొత్తం వ్యవస్థ ప్రభావితం కావడానికి వీల్లేదని స్పష్టంచేసింది. పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఇప్పటిదాకా నిరూపణ కాలేదని పేర్కొంది. తొమ్మిదేళ్లపాటు టీచర్లుగా కొనసాగిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది. పరీక్షల్లో అక్రమాల కేసులో కొనసాగుతున్న విచారణను ఆధారంగా చేసుకొని వారి నియామ కాలను రద్దు చేయలేమని వివరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వును సమర్థించేందుకు నిరాకరించింది. ఆ 32,000 మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పు పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తంచేశారు. వేలాది మంది టీచర్ల కుటుంబాలకు న్యాయస్థానం గొప్ప ఓదార్పును ఇచ్చిందని పేర్కొన్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం తప్ప వారి ఉద్యోగాలను తొలగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో ఆలోచించి, తీర్పు ఇచ్చారని తెలిపారు. -
రిజర్వేషన్ కేంద్రాల్లో బుకింగ్లకూ ఇక ఓటీపీ
న్యూఢిల్లీ: చివరి నిమిషం ప్రయాణాలకు వరప్రదమైన తత్కాల్ టికెట్ల దుర్వినియోగానికి చెక్ పెట్టే దిశగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజర్వేషన్ కేంద్రాల వద్ద తత్కాల్ టికెట్ల కొనుగోలు చేసేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వినియోగాన్ని తప్పనిసరి చేసింది. ప్రయాణికులు రిజర్వేషన్ ఫారంలో నింపే తమ మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీని వెల్లడించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే నవంబర్ 17వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసి చూస్తున్నాం. ప్రస్తుతం కొన్ని రైళ్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా దీనిని పరీక్షిస్తున్నాం. త్వరలో చాలా స్టేషన్లకు విస్తరిస్తాం. అనంతరం దేశమంతటా ఇదే విధానం అమల్లోకి వస్తుంది‘ అని రైల్వే శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఓటీపీ అనుసంధాన తత్కాల్ టికెట్ కొనుగోలు ప్రక్రియను అమల్లోకి తెచ్చిన కారణంగా తత్కాల్ టికెట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. తత్కాల్ టికెట్ల జారీలో పారదర్శకత మరింత పెరుగుతుంది’’ అని రైల్వేశాఖ పేర్కొంది. ఆన్లైన్లో తత్కాల్ బుకింగ్లకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ గత జూలైలో నిబంధన తెచ్చింది. బుకింగ్స్ మొదలైన తొలి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ ధ్రువీకృత యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ సైట్, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేలా నిబంధనలు మార్చిన విషయం విదితమే. -
మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అతి పెద్ద ఘనత సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)కు తుదిరూపు ఇచ్చింది. దాని ఆకృతీకరణ (కన్ఫిగరేషన్) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా దీన్ని కీలక మైలురాయిగా శాస్త్ర సాంకేతిక లోకం వేనోళ్ల కీర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ స్థాయి పరిశీలన కమిటీ బీఏఎస్ తుది రూపును పూర్తిస్థాయిలో పరిశీలించడం, ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ శుభవార్తను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో వెల్లడించారు. ఏమిటీ బీఏఎస్? ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానం సాయంతో రూపొందిస్తున్న మన సొంత అంతరిక్ష కేంద్రమిది. ఇందులో మొత్తం ఐదు మాడ్యూళ్లు ఉంటాయి. మరో పదేళ్లలో అంటే 2035 నాటికి దీన్ని ఆరంభించి కార్యకలాపాలు మొదలు పెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. బీఏఎస్– 01 పేరిట మన అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్ అభివృద్ధికి కేంద్రం 2024లో పచ్చజెండా ఊపింది. ఫౌండేషనల్ మాడ్యూల్ను 2028 కల్లా ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయిలో పరీక్షించి చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఏడాదిలోనే బీఏఎస్ నిర్మాణం పూర్తి చేయడం విశేషం. దాని తాలూకు విడి భాగాలు, ఉప వ్యవస్థలు తదితరాలన్నీ చక్కగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గగన్యాన్ ప్రాజెక్టులో అంతర్గతంగా బీఏఎస్కు నిధులు తదితరాలు సమకూర్చారు. దీనికి కేటాయింపులను ఏకంగా రూ.29,193 కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఎన్నెన్నో విశేషాలు... → బీఏఎస్ నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలన్నింటికీ అనుగుణంగా ఇస్రో పూర్తి చేసింది. → గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా భూ దిగువ కక్ష్య (ఎల్ఈఓ)లోకి మానవసహిత ఉపగ్రహాన్ని పంపాలన్న తొలి లక్ష్య సాధనలో బీఏఎస్ పాత్ర కీలకం కానుంది. → అంతరిక్షంలో పలు కీలక పరీక్షలు, ప్రయోగాలు కూడా బీఏఎస్ చేపట్టనుంది. → భారత్ సత్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత చంద్రయాన్లో కూడా ఇదే కీలకం కానుంది. → అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇతర అంతరిక్ష కేంద్రాలతో ఎప్పటికప్పుడు అనుసంధానం అయ్యేందుకు దీంట్లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. → బీఏఎస్లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రయోగించిన కొద్ది కాలంలోనే అన్ని అంతరిక్ష కేంద్రాలకూ అది సారథిగా ఎదిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. → ఇతర అంతరిక్ష కేంద్రాలతో భాగస్వామ్యం దిశగా ఇస్రో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టడం విశేషం – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.29 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బెంగళూరు(బనశంకరి): బెంగళూరులో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.29 కోట్ల విలువ చేసే 10.36 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 8 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేటేలోని పోస్టాఫీస్లో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చినట్లు తెలిసి పోలీసులు సోదాలు చేయగా 8 కిలోల హైడ్రో గంజాయి లభించింది. మరోఘటన.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుని నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
జీవుల ఇంటర్నెట్.. వైద్యం సూపర్ 'ఫాస్ట్'!
ఇంటర్నెట్ అంటే తెలుసు. మరి ‘జీవుల ఇంటర్నెట్’ అంటే? ఆరోగ్య సంరక్షణ కోసం మానవ శరీరాలను డిజిటలైజ్ చేయటం. ఇంకా చెప్పాలంటే.. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే. తద్వారా కేన్సర్ వంటి జబ్బుల్ని పుట్టుకలోనే గుర్తించి అప్పటికప్పుడు చికిత్స చెయ్యవచ్చు. వృద్ధాప్యాన్ని సైతం జయించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ అందమైన కల పీడకలగానూ మారే హ్యాకింగ్ ముప్పూ పొంచి ఉందనే అనుమానాలూ లేకపోలేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) నుంచే ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్ (ఐఓబీ) లేదా జీవుల ఇంటర్నెట్ మాట పుట్టింది. సాంకేతికత ద్వారా గణాంకాల సేకరణ, సత్వర పంపిణీలో మనిషి జోక్యాన్ని సాధ్యమైనంత తగ్గించటమే ఐఓటీతో ఒనగూడే ప్రయోజనం. రోజువారీ పనుల్లో వాడే గృహోపకరణాల దగ్గరి నుంచి ఆధునిక పారిశ్రామిక పరికరాల వరకు సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతికతల సహాయంతో నిరంతరం అనుసంధానమై ఉంటూ ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని, గణాంకాలను ఎప్పటి కప్పుడు పరస్పరం పంచుకోవటం ఐఓటీలో జరిగే పని.– సాక్షి, స్పెషల్ డెస్క్ఏంటి ఈ ఐఓబీ?» ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్.. మనుషుల దేహాలను ఇంటర్నెట్కు ఈ సాంకేతికత అనుసంధానిస్తుంది. అతి చిన్న, అత్యంత అధు నాతన సెన్సర్లు మన శరీరాల్లోకి ప్రవేశించటం ఐఓబీ ద్వారా సుసాధ్యమవుతుంది. సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతి కతల సహాయంతో మనిషి దేహంలో జరిగే ఆరోగ్యమార్పులను సూక్ష్మ స్థాయిలోనే గుర్తిస్తారు. అంతేకాదు, దేహం లోపలికి సూక్ష్మ రోబోలను పంపి చికిత్స చేయటానికీ ఐఓబీ దోహదం చేస్తుంది.ఇంటర్నెట్ మూడో దశ» డిజిటల్ యుగంలో ఇప్పుడు మూడో దశ నడుస్తోంది. మొదటి దశలో కంప్యూటర్లు వచ్చాయి. రెండో దశలో రోజు వారీ జీవితాన్ని ప్రభావితం చేసే వస్తువులను కంప్యూటర్తో అనుసంధానం జరిగింది. ఇంటర్నెట్ మూడో దశలో ‘జీవుల ఇంటర్నెట్’ వస్తోంది. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే దీని ఉద్దేశ మని ఇటలీ మిలన్ లోని బోకోని విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో అన్నారు. ‘జెల్ ఆధారిత ‘బయో రోబోలు’ దేహంలో ఉంటూ మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా, రక్తం గడ్డ కడుతున్నప్పుడు గుర్తించి సమాచారం అందిస్తాయి. అవసరమైతే ఆస్పిరిన్ మందును కూడా విడు దల చేస్తాయి. వైరస్లు దాడి చేసినప్పుడు టీకాలను సైతం అప్పటి కప్పుడు యాక్టివేట్ చేస్తాయి’ అని ఆయన అంటున్నారు.వైద్య పరిశోధనలో మేలిమలుపు‘జీవ ఇంటర్నెట్’.. మన అవయవాల నుంచి ఎప్పటికప్పుడు తాజా డేటాను సేకరించటం ద్వారా వైద్య పరిశోధనను సమూలంగా మార్చగలదు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని ఓడించడం.. పేద దేశాల్లోనూ ప్రతి ఒక్కరూ వ్యాధుల్లేకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడటం.. వంటి అద్భుత కలలను జీవుల ఇంటర్నెట్ నెరవేర్చుతుందని ఆశిస్తున్నారు. » నిశ్శబ్ద గుండెపోట్లను సకాలంలో గుర్తిస్తుంది» అవసరమైనప్పుడు మందులను విడుదల చేస్తుంది.» శరీరం లోపల నుంచే చికిత్సలను అందిస్తుంది» తద్వారా ప్రాణాలను కాపాడుతుంది మరణాలు నివారించవచ్చు..ఈ సాంకేతికత కొన్ని కొత్త పరిణామాలకు దారితీస్తుందని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో చెబుతు న్నారు. ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల వ్యాధులు అభివృద్ధి చెందకముందే వాటిని గుర్తించడం సులభం అవుతుంది. ఆహారంలో మార్పులు లేదా మరింత వ్యక్తిగతీకరించిన వ్యాయామ దినచర్యలను సూచించవచ్చు. సకాలంలో హెచ్చరికలు పంపడం ద్వారా మరణాలను నివారించవచ్చు. ఒక్క అమెరికాలోనే ప్రతి సంవత్సరం 8,05,000 మంది గుండె పోటుతో మరణి స్తుంటే.. సమస్యను గుర్తించలేక 1,70,000 మంది ‘నిశ్శబ్ద’ గుండెపోట్లతో చనిపోతున్నారు. జీవుల ఇంటర్నెట్ యుగంలో వైద్య పరిశోధన, ఔషధ ఆవిష్కరణ ఇప్పటిలా కాకుండా అత్యంత వేగవంతమవుతుంది. భారీ డేటాబేస్లు సమస్యకు ఏది పనిచేస్తుందో చూపించే నమూనాలను సూచిస్తాయి. ఔషధాలు చాలా త్వరగా, చౌకగానే కాకుండా కచ్చితత్వంతోనూ అభివృద్ధి అవుతాయి.పీడ కల కాకుండా..మన శరీరాలను డిజిటలైజ్ చేసే జీవుల ఇంటర్నెట్ను మనం జాగ్రత్తగా వినియోగించాలని నిపు ణులు సూచిస్తున్నారు. హ్యాకర్లు ‘ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్’ ను లక్ష్యంగా చేసుకుంటే ఎదురయ్యే విపరిణామాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. -
బెంగాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తేల్చిచెప్పారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, సరళంగా జరిగేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బెంగాల్ బీజేపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. బెంగాల్లో కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని, అందుకోసం కష్టపడి పని చేయాలంటూ ప్రధానమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని మాల్డాకు చెందిన లోక్సభ సభ్యుడు ఖగేన్ ముర్ము కూడా మోదీని కలిశారు. అక్టోబర్లో ముర్ముపై అల్లరిమూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ము ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి ఆరా తీశారు. -
200 ఇండిగో విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, అననుకూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. వారు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇండిగో సంస్థ దేశంలో 2,200 విమానాలను నడిపిస్తోంది. మంగళవారం 1,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. బుధవారం 200 విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు, ఇతర సిబ్బందికి మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలతో చెక్–ఇన్ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు. కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరారు. మరో 48 గంటలు ఇదే పరిస్థితి! రెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. మరో 48 గంటలపాటు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. డీజీసీఏ దర్యాప్తు ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోర చెప్పాలని సూచించినట్లు వివరించారు. ఈ మేరకు డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
పుతిన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: స్నైపర్లు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతా వ్యవస్థ. ఇవన్నీ ఏమిటో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! రష్యా నుంచి పుతిన్తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్విస్కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమెండోలు ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తమ్మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి! ముందే రంగంలోకి 40 మంది ఉన్నతాధికారులు → పుతిన్ పర్యటన తాలూకు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు. → వారు ఢిల్లీ చేరుకుని తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్నీ భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు. → పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్నీ ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. → అంతేగాక కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ కార్యాలయమే తెరిచారు! → పుతిన్ వెళ్లే మార్గాలన్నింటినీ ప్రత్యేక శిక్షణ పొందిన రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. → ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు. → కృత్రిమ మేధ(ఏఐ), ఫేషియల్ రికగి్నషన్ కెమెరాలు అంగుళం అంగుళాన్నీ వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి. → మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జీ కమెండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతారు. → మిగతా నాలుగు లోపలి అంచెలనూ రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. → పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. → పుతిన్ బస చేసే హోటల్ను రష్యా వేగులు ఇప్పటికే జల్లెడ పట్టేశారు. → ఆయన వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. బిజీ బిజీ! ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ గురువారం మన దేశానికి రానున్నారు. సాయంత్రం కల్లా ఆయన ఢిల్లీలో భేటీ అవకాశముంది. రాత్రి మోదీ ఆయనకు విందు ఇస్తారని సమాచారం. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో పుతిన్కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ ఘాట్లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ హౌస్లో శిఖరాగ్రంలో పాల్గొంటారు. రాత్రి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు. అసలు హైలెట్ ఆ కారే! ఆరస్ సెనట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలెట్ అదే. ఎలాంటి పెను దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకు ఉంది. వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇది అన్ని విధాలా శత్రు దుర్భేద్యం. అందుకే దీన్ని ముద్దుగా ‘నడిచే దుర్గం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లిమోజిన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్తో కలిసి విహరించడం విశేషం. → ఆరస్ సెనట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్లో చేర్చారు. → నాటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. → ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్ను తయారు చేశారు.రక్షణ మంత్రుల భేటీ నేడు భారత, రష్యా రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఆండ్రే బెలెసోవ్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మరిన్ని ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధ విమానాల ఆధునీకరణలతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెలోసోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్, మోదీ శిఖరాగ్రానికి ఒక రోజు ముందు రక్షణ మంత్రుల కీలక భేటీ జరుగుతోంది. అత్యంత అధునాతనమైన ఎస్–500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉంచవచ్చని సమాచారం. సుఖోయ్–57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారమే తెలిపారు. ఐదో తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయతి్నస్తున్న నేపథ్యంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
శబరిమల యాత్ర: అడవిలో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు
శబరిమలకు భక్తుల రద్దీ పెరిగింది. పెద్దఎత్తున స్వాములు ఇరుముడితో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ పారవేయడం తీవ్ర నేరమని కనుక స్వాములెవ్వరూ ప్లాస్టిక్ వస్తువులతో సన్నిధానానికి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ ఆదేశాల నేపథ్యంలో అక్కడి అలువా నది వద్ద స్వాముల వద్ద నున్న ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వాటి స్థానంలో పేపర్ బ్యాగులు స్వాములకు ఇస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో అటవీ ప్రాంతంతో పాటు పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని కనుక స్వాములెవరూ ప్లాస్టిక్ వస్తువులు స్వామివారి సన్నిధానానికి తీసుకురాకూడదని అధికారులు సూచించారు. ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
ఛత్తీస్గఢ్లో మైనింగ్ వద్దంటూ ఆందోళన
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణ అంశంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారి తీసింది. మైనింగ్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగి గిరిజనులు దాడి చేయడంతో 40మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.సుర్గుజా జిల్లా ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ "ఇక్కడ మైన్ కోసం 2016లోనే భూసేకరణ పూర్తయింది. దానికి పరిహారం కూడా అందజేశాం. కానీ ఇప్పుడు కొంతమంది పరిహారాన్ని నిరాకరించి మైనింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. మేము గ్రామస్థులతో మరోసారి మాట్లాడుతాం వారికి నచ్చజెప్పి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చేస్తాం" అని అడిషనల్ కలెక్టర్ సునీల్ నాయక్ అన్నారు. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు.మైనింగ్ పై గ్రామస్థులు మాట్లాడుతూ.. "మాగ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామాన్ని మేము ఏ కంపెనీలకు ఇవ్వదలచుకోలేదు. మేమెక్కడికి వెళ్లాలి? ఎంతోకాలంగా మా కుటుంబాలు ఇక్కడే పెరిగాయి, పనిచేశాయి, సంపాదించాయి. మేముకూడా ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు కంపెనీలకు భుమి ఇస్తే మా పిల్లల సంగతేంటి?" అని అక్కడి గ్రామస్తురాలు అన్నారు.అయితే ఈ ఘటనలో తొలుత పోలీసులే తమపై లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు అంటుండగా గిరిజనులే తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.అయితే ఈ వివాదంపై అమెరా ఓపెన్ కాస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం పర్సోడికల, అమెరా, పుహ్ పుత్ర, కట్ లోనా గ్రామాలలో ఈ భూమిని 2001 సంవత్సరంలో సేకరించి, 2011లో పనులు ప్రారంభించాము. 2019 కొంతమంది స్వార్థప్రయోజనాల కారణంగా మైన్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 2024లో తిరిగి ప్రారంభించినప్పడి నుంచి దశలవారిగా భూసేకరణ చేపడుతున్నామని ఇది వరకూ రూ.10 కోట్ల పరిహారం అందిచామని తెలిపారు. పర్సోడికల వైపు మైనింగ్ విస్తరిస్తున్న సమయంలో నిరసనలు రావడంతో నవంబర్ 8నుంచి మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. -
అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
బహుశా కథల్లో కూడా ఇలాంటి రాక్షసుల గురించి విని ఉండవేమో. ముద్దులొలికే చిన్నారులను దారుణంగా హత్య చేసిందో మహిళ. ఈ హత్యలకు కారణం తెలుసుకొని పోలీసులే నిర్ఘాంత పోయారు.హర్యానాలోని పానిపట్లోని ఒక గ్రామంలో బాజా భజంత్రీలు మోగుతున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లివేడుకకోసం అందంగా ముస్తామైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. జర్మన్ అద్భుత కథ స్నో వైట్లోని దుష్ట రాణిని మరపించిన పోలీసులు ఈ భయంకరమైన హత్యాకాండను ఛేదించారు.తన కంటే అందంగా ఉందనిపానిపట్లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్ అనేమహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు పూనమ్ 2023లో తన కొడుకు దారుణంగా హతమార్చిందంటే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు. హత్య ఎలా జరిగిందిసోనిపట్కు చెందిన విధి తన కుటుంబంతో కలిసి పానిపట్లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి బంధువుల వివాహానికి హాజరైంది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి, 10 నెలల తమ్ముడు వచ్చారు. పెళ్లిలో సీతాకోక చిలుకలా ముస్తామై, ఆనందంగా తిరుగుతున్న విధిపై పూనమ్ కన్నుపడింది. రాక్షసిలా మారిపోయింది.అకస్మాత్తుగా విధి అదృశ్యమైంది. విధి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, విధి అమ్మమ్మ ఓంవతి వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్రూమ్కి వెళ్లింది. బైట గడియ వేసి వున్న ఆ గదిని తెరిచినప్పుడు, విధి తల నీటి తొట్టిలో మునిగిపోయి, కాళ్ళు పైకి తేలి ఉన్నాయి. హుఠాహుఠిన చిన్నారిని NC మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. దీంతో విధి తండ్రి తరువాత కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పూనమ్ విధికి అత్త అని తేలింది. ఆమెను అరెస్ట్ చేశారు.పిల్లలను చంపే విధానంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకోవడంతో అసూయ ,ఆగ్రహంతో పిల్లలను నీటిలో ముంచి చంపే అలవాటు ఉంది. ప్రత్యేకంగా చిన్న, అందమైన అమ్మాయిలే ఆమెటార్గెట్ అని పోలీసులు తెలిపారు. ఇలా మొత్తంగా పూనమ్ నలుగురు పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలతోపాటు తన కొడుకుని కూడా ఇలాగే చంపినట్లు అంగీకరించింది.2023లో, పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే సంవత్సరం, అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ సంవత్సరం ఆగస్టులో, పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది ఎందుకంటే వీరంతా తనకంటే 'అందంగా' కనిపించారట ఆమెకు. విధి హత్య కేసులో విచారణ సమయంలో పూనమ్ నిజం స్వరూపం బైటపడింది. ఆమె స్వయంగా ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంది. అప్పటివరకు ఈ పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో -
రూ.2 వేల ప్రొజెక్టర్ : అమెజాన్కు రూ. 35వేల షాక్
చెన్నై,సాక్షి : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరో తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకుగాను కోర్టు జరిమానా విధించింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులోకి తిరుచ్చకి చెందిన ఐజాక్ న్యూటన్ జులై 9న ఒక మినీ ప్రొజెక్టర్ ఆమెజాన్ ద్వారా ఆర్డర్ చేశారు. కానీ జూలై 14న వచ్చిన పార్సిల్ చూసి ఐజాక్ నివ్వెరపోయాడు. రూ.2,707 ధర గల మినీ ప్రొజెక్టర్కి బదులుగా టీ-షర్టులు కనిపించాయి. అయితే, న్యూటన్ ఉత్పత్తిని మార్చాడని ఆరోపిస్తూ అమెజాన్ డబ్బును తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. అమెజాన్ చర్యతో నిరాశ చెందిన ఐజాక్ కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. అసలు మొత్తాన్ని తిరిగి ఇచ్చింది. అయినా చెప్పిన సమయానికిఈ-కామర్స్ సంస్థ డబ్బులు చెల్లించక పోవడంతో న్యాయపోరాటానికి దిగాడు. ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతోతనకు జరిగిన మోసం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఐజాక్ న్యూటన్ త్రిరుచ్చి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. రూ. 5 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన కోర్టు అమెజాన్ ,డెలివరీ ఏజెంట్ తప్పు చేసినట్లు గుర్తించింది. నవంబర్ 28న కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది, అమెజాన్ ఐజాక్ న్యూటన్కు రూ.25,000 పరిహారంగా రూ.10 వేల కోర్టు ఖర్చులకు చెల్లించాలని ఆదేశించింది. ఐజాక్కు మొత్తంగా రూ.35,000 చెల్లించాలని తీర్పు చెప్పింది.చదవండి: మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు?TN NEWS : Tiruchi court fines Amazon ₹35,000 for delivering t-shirts instead of ordered projector.On July 9, he ordered a mini projector priced at ₹2,707. The product was delivered on July 14, but when Isaac opened the package and he found T-shirts instead of the projector. pic.twitter.com/izbiHzMqQh— News Arena India (@NewsArenaIndia) December 2, 2025 -
పుతిన్ పర్యటనపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు భారత్ రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్- రష్యా 23వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశి థరూర్ భారత్ - రష్యా మధ్య మైత్రి ఎంతో ముఖ్యమైనదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్న సమయం నుంచే రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆకాలం నుంచే రెండు దేశాలు పరస్పర సహకారాలు అందించుకుంటూ వస్తున్నాయి. కాగా రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ పర్యటనపై మాట్లాడారు."రష్యా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైనది. ఈ స్నేహం చాలా పాతది, బలమైనది, అదే విధంగా అమెరికా, చైనాలతోనూ ద్వైపాక్షిక బంధాల్ని కొనసాగించాలి. భారత ఆర్థిక వ్యవస్థను వేరే ఏ దేశం కోసం తనఖా పెట్టకూడదు" అని శశి థరూర్ అన్నారు. ఈ మూడు దేశాలతో భారత్ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూతో పాటు అమెరికా పలు ఆంక్షలు విధించి ఏకాకిని చేసే యత్నం చేశాయి. భారత్ సైతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే వీటిని భారత్ లెక్కచేయకుండా మాస్కోతో మైత్రిని కొనసాగించింది. తన చిరకాల మిత్రునికి అండగా నిలిచింది. రష్యా నుంచి భారత్ రక్షణ రంగ సామాగ్రి , పెట్రోలియం, ఎరువులు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా జౌషదాలు, ఇతర రసాయనాలు, యంత్రాలు మాస్కోకు ఎగుమతి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. -
దేశవ్యాప్తంగా 70కిపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమాన సేవల్లో అవరోధం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సాంకేతిక సమస్యలతో ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 13 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.సాంకేతిక లోపాలు, రద్దీ, ఆపరేషనల్ సమస్యలు, సిబ్బంది కొరత కారణమని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం పరిస్థితి నెలకొంది. చెక్ ఇన్ సిస్టమ్ లో సాంకేతిక లోపంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్టుల్లో ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ సిస్టమ్స్ పనిచేయకపోవడంతో చెక్ఇన్, బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో
ధైర్యం, దృడ సంకల్పం, కృషి అన్నీ ఉన్నాయి. సాధించాలన్న పట్టుదలా మెండుగా ఉంది. కానీ ఫలితం కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించింది. చివరికి ఆమె సంకల్పం, కల ఫలించింది. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇంతకు ఏమిటా కల, ఆమె సాధించిన విజయం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.ప్రియాంక దల్వి పేదింటి బిడ్డ. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. ఆయన గుండె ఉప్పొంగేలా చేసిన ఆడబిడ్డ ప్రియాంక. నాన్నకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఎనిమిదేళ్లు కష్టపడింది. ఆ కల నిజమైన రోజు భావోద్వేగంతో కన్నీటి ప్రవాహమైంది. మహారాష్ట్రలో మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారిణి అయ్యింది. మారుమూల గ్రామంలో ఒక రైతుబిడ్డగా ఆమె సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) నవేఖేడ్ గ్రామంలో గుడ్డిదీపాల మధ్య మసక వెలుగులో చదువుకున్న ప్రియాంక మహారాష్ట్రను అగ్రస్థానంలో నిలిచింది. మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారి పదవిని సంపాదించింది. ఫలితాల రోజున, ప్రియాంక తల్లిదండ్రులు తమ కుమార్తె విజయానికి చూడటానికి వారి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఫలితాలు రాగానే తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇన్నేళ్ల పోరాటం నిశ్శబ్ద ప్రార్థనలు ఆమె కంట కన్నీరుగా ప్రవహించాయి. ఇదీ చదవండి: మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు? -
2028లో భారతీయ అంతరిక్ష స్టేషన్
2028 సంవత్సరం నాటికి స్పేస్ లో "భారతీయ అంతరిక్ష స్టేషన్" ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోనే దీని నిర్మాణం చేపడుతున్నామని పార్లమెంటులో బుధవారం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి మాడ్యూల్ ప్రక్రియ సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన కీలమైన డిజైన్ మైల్ స్టోన్ ను ఇస్రో పూర్తిచేసిందన్నారు. దీని నిర్మాణం పూర్తయితే భారత వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం, సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చాలా సులభతరమైతాయని వారు పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 1న భారతీయ అంతరిక్ష స్టేషన్ మెుదటి మాడ్యుల్ నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి రూ.20,193 కోట్ల నిధులు కేటాయించగా 2028 వరకూ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2035 నాటికి ఇది పూర్తిస్థాయిలో సేవలు అందించే అవకాశం ఉంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు పూర్తయితే అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత స్పేస్ లో స్వంత అంతరిక్ష స్టేషన్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ రికార్టు సృష్టిస్తుంది. -
సంచార్ సాథీ యాప్.. కేంద్రం యూటర్న్
ఢిల్లీ: సంచార్ సాథీ యాప్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. మెబైల్స్లో ప్రీ-ఇన్స్టాలేషన్ నిబంధనను కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో ప్రీ-ఇన్స్టాలేషన్ తప్పనిసరికాదని కేంద్రం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఇవాళ(డిసెంబర్ 3, బుధవారం) ప్రకటించింది.సంచార్ సాథీ యాప్ ప్రీ ఇనస్టాలేషన్ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా, కొత్త మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ని ప్రీ–ఇన్స్టాల్ చేయాలంటూ హ్యాండ్సెట్ కంపెనీలకిచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది కూడా.. యూజర్లు కావాలంటే దీన్ని అట్టే పెట్టుకోవచ్చని, వద్దనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.Government removes mandatory pre-installation of Sanchar Saathi AppThe Government with an intent to provide access to cyber security to all citizens had mandated pre-installation of Sanchar Saathi app on all smartphones. The app is secure and purely meant to help citizens from…— PIB India (@PIB_India) December 3, 2025సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే ఈ యాప్ గురించి చాలా మందికి ఇంకా తెలియదని, వారందరికీ దీన్ని చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టే ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ‘ఈ యాప్ని అందరికీ చేరువ చేయడం మా బాధ్యత. మీరు డిలీట్ చేయదల్చుకుంటే చేయొచ్చు. వాడకూడదనుకుంటే రిజిస్టర్ చేసుకోవద్దు. రిజిస్టర్ చేసుకుంటే యాక్టివ్గా ఉంటుంది. లేకపోతే ఇనాక్టివ్గా ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.మోసాలపై సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలని హ్యాండ్సెట్ల తయారీ సంస్థలను టెలికం శాఖ (డాట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. సంచార్ సాథీ యాప్కి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. -
మాస్క్తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్ని ఎందుకు కలిశాడు?
స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల మధ్య పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత పలాష్ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్ టాపిక్గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్లో ప్రేమానంద్ మహారాజ్ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని ఫోటోల వైరల్గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్ ఇక్కడ ముఖానికి మాస్క్తో, భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీకాగా మెహిందీ, సంగీత్ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్ పెళ్లి స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్ ప్రైవేట్ చాట్స్, స్క్రీన్షాట్లు అంటూ మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.ఇదీ చదవండి: రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం -
భోపాల్ గ్యాస్ బాధితుల ర్యాలీ : దిష్టిబొమ్మపై ఘర్షణ
భోపాల్ గ్యాస్ దుర్ఘటన 41వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం జరిగిన ర్యాలీ ఘర్షణకు దారితీసింది. ఈ ర్యాలీలో ఉపయోగించిన దిష్టిబొమ్మపై ఆర్ఎస్ఎస్ (RSS) బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.భోపాల్లోని భారత్ టాకీస్ అండర్బ్రిడ్జి నుండి JP నగర్ గ్యాస్ వరకు మెమోరియల్ గ్యాస్ బాధితుల సంఘాలు వార్షిక సంస్మరణ ర్యాలీ నిర్వహించాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, యూనియన్ కార్బైడ్ మరియు డౌ కెమికల్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే ప్రాణాలతో బయటపడిన వారికి సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశాయి. యూనియన్ కార్బైడ్, డౌ, 1984 విపత్తుతో సంబంధమున్నఇతర కంపెనీలను సూచించే దిష్టిబొమ్మలను ర్యాలీలో ఉపయోగించారు. శాంతియుత ర్యాలీగా ప్రారంభమైన ర్యాలీ తీవ్ర రాజకీయ ఘర్షణగా మారింది. దిష్టిబొమ్మపై ఆర్ఎస్ఎస్ అని రాశారని, నిర్వాహకులు మతపరమైన , సంస్థాగత భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు గ్యాస్ బాధితుల సంఘాలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. తాము ఏ సంస్థనుద్దేశించిరాయలేదని, కేవలం డౌ కంపెనీ గురించి పేర్కొన్నామనీ స్పష్టం చేశారు. డౌ కెమికల్ను రక్షించడమే బీజేపీ ప్రభుత్వం లక్ష్యమని, దోషులైన కంపెనీలను నిలదీసే ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. విపత్తు సంభవించి 41 ఏళ్లు గడిచినా, బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. యూనియన్ కార్బైడ్, డౌ కెమికల్, వాటి అనుబంధ సంస్థలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఖచ్చితమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరోసారి తుపాకీ గర్జించింది. పోలీసులు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థులను ఎదుర్కొంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి కల్లా భారత దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తానని ప్రకటించడంతో కేంద్ర సాయుధ బలగాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టి పెద్దఎత్తున నక్సల్స్ ని మట్టుబెట్టాయి. దీంతో కొంతమంది పార్టీ అగ్రనేతలు లొంగిపోయి మిగిలిన వారిని జన జీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నారు.ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడ్వి హిడ్మా సైతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆరుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు వదిలారు. హిడ్మా మృతి పట్ల కేంద్రం హోం మంత్రి స్పందిస్తూ మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయం అని వ్యాఖ్యానించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.కాగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలు లొంగిపోడమో లేదా ఎన్ కౌంటర్ లలో మరణించడమో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ భవితత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
‘సుప్రీం’ ఆదేశం.. బంగ్లాదేశ్ గర్భిణికి ఉపశమనం
న్యూఢిల్లీ: భారత్ నుంచి బహిష్కృతురాలై బంగ్లాదేశ్కు చేరిన గర్భిణీ సోనాలి ఖాటూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడికి సుప్రీంకోర్టు ఉత్తర్వుతో ఊరట లభించింది. న్యాయస్థానం ‘మానవతా దృక్పథం'తో తీసుకున్న ఈ నిర్ణయం.. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న ఒక నిస్సహాయ కుటుంబానికి స్వాంతన కల్పించింది. సోనాలి ఖాటూన్ బంగ్లాదేశీయురాలైనప్పటికీ, ఆమె పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్లో నివసిస్తున్నారనే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.మానవతా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, వారిద్దరినీ తిరిగి తీసుకువస్తామని, వారిని నిఘాలో ఉంచి, ఉచిత వైద్య సహాయం అందిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ప్రత్యేక దృష్టితో విచారించింది. ఒక గర్భిణీ పరిస్థితిని, ఆమె కుమారుడిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు/తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ఉత్తర్వుతో సోనాలికి అవసరమైన వైద్య సంరక్షణతో పాటు ఆమె కుమారుడికి రోజువారీ సంరక్షణ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఈ న్యాయపోరాటం సోనాలి తండ్రి భోడు సేఖ్తో ప్రారంభమైంది. తన కుమార్తె, అల్లుడు, మనవడిని మే 2025లో గుర్తింపు ధృవీకరణ డ్రైవ్ పేరుతో అక్రమంగా నిర్బంధించి, జూన్లో బంగ్లాదేశ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు పుట్టుకతో భారత పౌరులమని ఆయన వాదించారు. సెప్టెంబర్లో కలకత్తా హైకోర్టు వీరిని తిరిగి తీసుకురావాలని ఆదేశించినా, పౌరసత్వ ధ్రువపత్రాలు లేవనే కారణంతో ఆ తీర్పును సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ రుజువులు చూపడంలో విఫలమైనప్పటికీ, తల్లి, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. చట్టపరమైన నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, అత్యవసర సందర్భాల్లో మానవతా దృక్పథంపైచేయి సాధిస్తుందని ఈ కేసు నిరూపించింది.ఇది కూడా చదవండి: ‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్! -
పులిమేడు రూట్లో భక్తుల రద్దీ
సాక్షి శబరిమల: శబరిమలకు వెళ్ళే భక్తులకు ప్రత్యామ్నాయ మార్గం అయిన అటవీ మార్గం పులిమేడులో యాత్రికుల రద్దీ బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 1,500 మంది నుంచి రెండు వేల మంది దాక యాత్రికులు తరలివస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పెరియార్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లేఈ అటవీమార్గంలో భక్తుల సంరక్షణార్థం ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సత్రం నుంచి సన్నిధానం వరకు సుమారు 12 కి.మీ దూరం ఉంటుంది. అయితే అక్కడి వాతావరణాన్ని అనుసరించి యాత్రికులకు ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించేందుకు అనమతి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాత్రికులకు సత్రం నుంచి సన్నిధానం చేరుకోవడానికి అనుమతి ఉంది. అలాగే ఉదయం 8 నుంచి 11 గంటలలోపు యాత్రికులు తిరిగి సత్రానికి ప్రయాణించటానికి అనుమతి ఉంది. అలాగే దేవస్వం బోర్డు సత్రంలో కూడా స్పాట్ బుకింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి ఉన్న అనుమతిని ఆధారం ప్రయాణానికి అనుమతి ఉంటుంది. సత్రాన్ని వదిలి సన్నిధానం వరకు వెళ్లే యాత్రికుల బృందాలతో తమ శాఖ అధికారులు వెళ్తారని అటవీ శాఖ వెల్లడించింది. దీంతో పాటు యాత్రికులు భద్రతా, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సుమారు 35 మంది అటవీ శాఖ అధికారులు 35 మంది ఎకో గార్డులు ఉన్నారని పేర్నొంది. అలాగే అదనంగా ఈ మార్గంలో ఎలిఫెంట్ స్క్వాడ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏనుగులు, గేదెలు, అడవి జంతువులు లేవని నిర్థారించడానికి అటవీగార్డు బృందం సదా అప్రమత్తమై ఉండటమే గాక, జంతువులు లేవని నిర్ధారణ అయితేనే యాత్రికులను ప్రయాణించడానికి అనుమతిస్తామని అఝుతా రేంజ్ ఆఫీసర్ డి. బన్నీ తెలిపారు. వర్షం పడితే ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే కఝుతాకుళి నుంచి కొన్ని మైళ్ల తర్వాత అంతా బురదమయంగా ఉంటుంది. అందువల్ల ఈ మార్గం గుండా వెళ్లడం చాలా కష్టం. సత్రాన్ని సందర్శించే యాత్రికుల పత్రాలను ఉప్పుపారలోని పోలీసు అవుట్పోస్ట్లో తనిఖీ చేస్తారు. అలాగే ఈ అటవీ గార్డుల తోపాటు పోలీసు, ఆరోగ్య శాఖల సేవలను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. ఇవేగాక ఈ అటవీ మార్గంలో ఇరికప్పర, సీతకులం, జీరో పాయింట్ వద్ద పరిశుభ్రమైన నీరు , ఉప్పుపార బేస్ వద్ద టీ , స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ అటవీ మార్గం గుండా వచ్చే యాత్రికుల వివరాలను సన్నిధానం పక్కన ఉన్న అటవీ శాఖ, పోలీసు చెక్పోస్టులలో కూడా నమోదు చేస్తారు. (చదవండి: 16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే..) -
‘20 ఏళ్లుగా చావులే లేవు’..‘సర్’ డేటాలో భారీ గోల్మాల్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. ఎన్నికల డేటాలో కనిపించిన ఒక ఆశ్చర్యకర అంశం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘సర్’ తొలి నివేదికల్లో 2,208 పోలింగ్ బూత్లలో మరణాలు, తప్పిపోయిన, పునరావాసం పొందిన లేదా నకిలీ ఓటర్లు లేరని తేలింది. ఆయా బూత్లలోని ఓటర్ల జాబితా గత రెండు దశాబ్దాలుగా ‘పరిశుభ్రంగా’ ఉందని జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ)లు నివేదించడం అందరినీ కంగుతినేలా చేస్తోంది. అయితే ఈ డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) జిల్లాల నుండి వివరణాత్మక నివేదికలు కోరింది. ఆ విచారణ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఈ 'క్లీన్ బూత్ల' సంఖ్య 2,208 నుంచి కేవలం 480కి భారీగా తగ్గింది.ఈ డేటా మార్పుపై తలెత్తిన ప్రశ్నలు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. కేవలం ఒకే రోజులో 1,728 బూత్ల డేటాలో మార్పు రావడాన్ని బీజేపీ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తీవ్రంగా ఖండించారు. ‘2,200కు పైగా బూత్లలో ఎవరూ చనిపోలేదని చెప్పడం మాయాజాలమా? ఈసీ నివేదిక కోరగానే అకస్మాత్తుగా 480 బూత్లకు తగ్గించడం బెంగాల్లో మాత్రమే జరుగుతుంది’ అంటూ ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా వర్గాలు నిరంతర డేటా నవీకరణల వల్లే ఈ తేడా వచ్చిందని చెబుతున్నా, ఈ అసాధారణ తగ్గింపు వెనుక వాస్తవ కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త జాబితాలో అత్యధిక సంఖ్యలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రేదిఘి (66), కుల్పి (58), మాగ్రహత్ (15), పథర్ప్రతిమ (20) బూత్లు ఉన్నట్టు ఈసీవర్గాలు తెలిపాయి.మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ తరహా ధృవీకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఒక ప్రత్యేక జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో పెండింగ్లో ఉన్న అత్యధిక కేసులు ‘సంతాన మ్యాపింగ్’కు సంబంధించినవి. అంటే తల్లిదండ్రులు లేదా తాతామామల ద్వారా ఓటరు ధృవీకరణ జరగాల్సి ఉంది. ప్రత్యేకించి 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోని ఓటర్లు తిరిగి ధృవీకరణ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇది ఓటర్ల జాబితాలో తప్పులను తగ్గించడానికి కమిషన్ తీసుకుంటున్న కఠిన చర్యలలో భాగమని తెలుస్తోంది.మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి, మొత్తం 46.20 లక్షల గణన ఫారమ్లు దాఖలయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే, 22.28 లక్షల మంది మరణించిన ఓటర్లు కాగా, 6.41 లక్షల మంది తప్పిపోయిన ఓటర్లు, 16.22 లక్షల మందిని తరలించడం జరిగింది. 1.05 లక్షల డబుల్ ఎంట్రీలు గుర్తించారు. జిల్లాల వారీగా మరణించిన ఓటర్ల శాతంపై నివేదిక కూడా ఆసక్తికరంగా ఉంది: కోల్కతా నార్త్ 6.91%తో అత్యధికంగా ఉండగా, తూర్పు మెదినీపూర్ 1.4%తో అత్యల్పంగా ఉంది. ఈ లెక్కలు ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో అవకతవకలు పేరుకుపోయాయని సూచిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే! -
మూడేళ్లలో 2 లక్షల తీవ్ర కేసులు : ప్రభుత్వ షాకింగ్ డేటా
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం కాలుష్య కాసారంగా మారిపోతుంది. విషపూరితమైన వాయు కాలుష్యంపై ప్రభుత్వం షాకింగ్ డేటాను కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత కేసులు నమోదైనట్టు పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం వెల్లడించింది. దీర్ఘకాలిక వాయు కాలుష్య సంక్షోభ తీవ్రత, ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై చూపిస్తున్నప్రభావాన్ని ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బహుళ-నగర అధ్యయనంలో శ్వాసకోశ వ్యాధుల సంఖ్య చాలా తీవ్రంగా ఉందని పేర్కొంది. ఐదు ప్రదాన ఆసుపత్రుల్లలో కేవలం 3 సంవత్సరాలలో 6 ప్రధాన ఆసుపత్రులలో 2 లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఢిల్లీలోని ఆరు ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు 2022 మరియు 2024 మధ్య అత్యవసర విభాగాలకు 2,04,758 తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ARI) కేసులను నమోదు చేశాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో, 30,420 మంది రోగులు - దాదాపు 15శాతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీ డాక్టర్ విక్రమ్జిత్ సింగ్ సాహ్నే (నామినేట్ చేయబడిన) లేవనెత్తిన ప్రశ్న నం. 274 కు సమాధానంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ ఈ డేటాను సమర్పించారు. సాహ్నే అడిగిన ప్రశ్నలు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ వ్యాధుల మధ్య సంబంధాన్ని మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిందా?శ్వాసకోశ వ్యాధులలో వాయు కాలుష్యం పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ విధాన జోక్యాలను ప్లాన్ చేస్తుందా? సంవత్సరం వారీగా 6 ఆసుపత్రుల్లో AIIMS, సఫ్దర్జంగ్, LHMC గ్రూప్, RML, NITRD, VPCI) నమోదవుతున్న కేసులు, 2022-2025 నుండి మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో ఉబ్బసం, COPD , ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కారణంగా అవుట్ పేషెంట్ మరియు ఆసుపత్రిలో చేరేవారి పెరుగుదల వివరాలు? ప్రభుత్వం అందించిన డేటా2022: 67,054 అత్యవసర కేసులు. 9,874 అడ్మిషన్లు2023: 69,293 అత్యవసర కేసులు. 9,727 అడ్మిషన్లు2024: 68,411 అత్యవసర కేసులు. 10,819 మంది అడ్మిషన్లు2024లో మొత్తం ఎమర్జన్సీ కేసుల సంఖ్య స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అడ్మిషన్ అవసరమైన రోగుల సంఖ్య బాగా పెరిగింది, ఇది ఆసుపత్రులకు వచ్చే కేసులు, తీవ్రంగా పరిణమిస్తున్న వైనాన్నిసూచిస్తుంది. అయితే వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులు, సంబంధిత వ్యాధులకు ప్రేరేపించే కారకాల్లో ఒకటి అయినప్పటికీ, అని ఆహారం, వృత్తి, సామాజిక-ఆర్థిక స్థితి మరియు ముందుగా ఉన్న పరిస్థితులతో సహా బహుళ కారకాలు ఆరోగ్య ప్రభావాలను ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. -
పుతిన్ సెక్యూరిటీ: ల్యాబ్, టాయిలెట్.. అంతా రహస్యమే!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు, ఐదు తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కల్పించే భద్రతా ఏర్పాట్లు ప్రపంచ స్థాయిలో అత్యంత ఉన్నతమైనవిగా ఉండనున్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన ప్రత్యేక భద్రతా సంస్థ అధికారులు భారత్కు చేరుకొని, అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షిస్తున్నారు. పుతిన్ ప్రపంచంలోనే అత్యంత భారీ భద్రత కలిగిన నేతలలో ఒకరిగా పేరొందారు. 2012లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి తర్వాత పుతిన్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఆహారానికి ల్యాబ్లో పరీక్షలుపుతిన్ భద్రతా వలయంలో ‘అదృశ్య భద్రతా బృందం’ ఒక కీలకమైన అంశం. ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేక బృందం అధ్యక్షుడు పర్యటించే ప్రాంతానికి ఆయన కంటే ముందే చేరుకుంటుంది. స్థానికులతో ఎంతగా కలిసిపోతుందంటే, వారిని ఎవరూ గుర్తించలేరు. రష్యా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా, ఆయన భద్రతా బృందం ఒక పోర్టబుల్ ల్యాబ్ను తీసుకువెళ్తుంది. దీని ప్రధాన ఉద్దేశం.. ఆయన తీసుకునే ఆహారం, నీటిలో ఎలాంటి విషాలు లేదా హానికరమైన పదార్థాలు లేవని నిర్ధారించడం. ల్యాబ్ పరీక్ష లేకుండా ఆయనకు ఆహారం వడ్డించరు. పుతిన్ తాగే నీరు కూడా విదేశాల నుండి కాకుండా, రష్యా నుండే వస్తుంది.‘దాపరికానికి’ పోర్టబుల్ టాయిలెట్పుతిన్ ఆహారం విషయంలో అత్యంత కఠినమైన ప్రోటోకాల్లను అనుసరిస్తారు. ఆయన వ్యక్తిగత చెఫ్, వంట సిబ్బంది ఎల్లప్పుడూ ఆయనతో పాటు ప్రయాణిస్తారు. విదేశీ పర్యటనల్లో ఆయన హోటళ్లలో లేదా ఆతిథ్య దేశంలోని ఆహారాన్ని తీసుకోరు. ఆయన తన సొంత వంటగదిలో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అయినప్పటికీ భద్రతా తనిఖీలు తప్పనిసరి. మరింత గోప్యత కోసం పుతిన్ విదేశీ పర్యటనల సమయంలో తన వ్యక్తిగత పోర్టబుల్ టాయిలెట్ను కూడా వెంట తీసుకువెళ్లడం గమనార్హం. దీనికి కారణం ఏ దేశం లేదా ఏజెన్సీ తన ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని (జీవసంబంధమైన నమూనాలు) పొందకుండా నిరోధించడమే.పటిష్టమైన కాన్వాయ్రష్యా అధ్యక్షుడి కాన్వాయ్ అభేద్యంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఆర్మర్డ్ కారుతో పాటు, మెడికేర్ వ్యాన్, ఆహార పరీక్ష కోసం పోర్టబుల్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్ వాహనం, స్నిపర్ బృందం, సైబర్ సెక్యూరిటీ యూనిట్, శాటిలైట్ కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. పుతిన్ భారత పర్యటన సందర్భంగా, దేశీయ ఎస్పీజీ, ఎన్ఎస్జీ దళాలు.. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ)ఏజెన్సీతో కలిసి పనిచేస్తూ, అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తాయి.ఉమ్మడి భద్రతా వలయంపుతిన్ పర్యటన సందర్భంగా భారతదేశంలో భద్రతా ప్రోటోకాల్లు అత్యంత కట్టుదిట్టంగా ఉండనున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ హౌస్ చుట్టూ నో-ఫ్లై, నో-డ్రోన్ జోన్లుగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి రాకపోకల కోసం ప్రత్యేక వీఐపీ భద్రతా కారిడార్, ట్రాఫిక్ లాక్డౌన్ జోన్ అమలు చేస్తారు. జామర్లు, యాంటీ-డ్రోన్లు, స్నిపర్ల ద్వారా నిరంతర తనిఖీలు చేపడతారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, రష్యన్ ఏజెన్సీల ఉమ్మడి భద్రతా వలయం ఈ పర్యటనను మరింత పటిష్టం చేయనుంది.భారత్కు సదవకాశంఈ పర్యటన భారతదేశానికి ఒక ప్రధాన అవకాశంగా మారనుంది. వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక సహకారంతో పాటు, కార్మిక, సామాజిక సహకారంపై గణనీయమైన చర్చలకు అవకాశం ఏర్పడనుంది. రష్యన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో పెరుగుతున్న కార్మిక కొరతను తీర్చడానికి 2030 నాటికి సుమారు 31 లక్షల మంది కార్మికులు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రష్యా కనీసం పది లక్షల మంది విదేశీ కార్మికులను నియమించుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో భారతదేశం ప్రధాన వనరుగా మారే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, భారత యువతకు రష్యాలో చట్టబద్ధమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశ విదేశీ మారకం పెరుగుతుంది, రెండు దేశాల మధ్య సామాజిక, ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.ఇది కూడా చదవండి: బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు? -
బాబ్రీ మసీదు.. నాడు నెహ్రూ ప్రయత్నాన్ని ఆపిన పటేల్!
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు నిర్మించేందుకు చూశారని.. కానీ, గుజరాతీ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని అన్నారు. మంగళవారం గుజరాత్లో జరిగిన యూనిటీ మార్చ్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. ‘‘నాడు దేశ తొలి ప్రధానిగా ఉన్న నెహ్రూ ప్రజా ధనంతో బాబ్రీ మసీదు కట్టాలనుకున్నారు. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకున్నారు అంటే అది గుజరాత్ అమ్మ కడుపున పుట్టిన సర్దార్ వల్లభాయ్పటేలే. నెహ్రూ నిర్ణయానికి ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. ఆ సమయంలో సోమనాథ్ ఆలయ(గుజరాత్) ప్రస్తావనను నెహ్రూ తీసుకొచ్చారు. అయితే.. సోమనాథ్ ఆలయ అంశం పూర్తిగా వేరు అని.. అది పూర్తిగా ప్రజల విరాళంతో(ట్రస్ట్ ఏర్పాటు చేసి) నిర్మించిందని.. ఒక్క పైసా ప్రభుత్వం ఖర్చు చేయలేదని పటేల్ నెహ్రూకు గుర్తు చేశారు. సరిగ్గా ఇదే ఇప్పుడు అయోధ్య రామమందిర విషయంలో జరిగింది. రాముడి ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఇది నిజమైన సెక్యులరిజం అంటే’’ అని రాజ్నాథ్ అన్నారు. అదే సమయంలో.. 1946లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం సర్దార్ పటేల్కు వచ్చిందని.. మహత్మా గాంధీ సూచన మేరకే పటేల్ తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారని.. అలా నెహ్రూ ఆ టైంలో అధ్యక్షుడు అయ్యారని రాజ్నాథ్ అన్నారు. కొన్ని రాజకీయ దుష్టశక్తులు చరిత్ర నుంచి పటేల్ లెగసీని చెరిపేసే ప్రయత్నం చేశాయని.. కానీ, ప్రధాని మోదీ మాత్రం పటేల్ గొప్పదనం ఏంటో ప్రపంచానికి చాటి చెబుతున్నారని రాజ్నాథ్ అన్నారు. -
Delhi: మళ్లీ బీజేపీదే విజయం.. మిన్నంటుతున్న సంబరాలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ఉప ఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేసింది. బుధవారం ఎంసీడీ ఫలితాలు వెల్లడికాగా, భారతీయ జనతా పార్టీ 12 వార్డులకు గాను ఏడు స్థానాలను గెలుచుకుని, మెజారిటీని సాధించింది. ద్వారకా బీ, వినోద్ నగర్, అశోక్ విహార్, గ్రేటర్ కైలాష్, డిచాన్ కలాన్, షాలిమార్ బాగ్ బీ, చాందిని చౌక్ తదితర ముఖ్య వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. తద్వారా బీజేపీ తన కోటను నిలబెట్టుకుంది. ఈ ఫలితాలు అధికార బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి, కాంగ్రెస్కు ఒక కీలకమైన పరీక్షగా మారగా, దీనిలో బీజేపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 51 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో 26 మంది మహిళలు ఉన్నారు.ఎంసీడీ ఉప ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మూడు వార్డులను గెలుచుకోవడం ద్వారా తన ఉనికిని చాటుకుంది. ఆప్ గెలిచిన వార్డులలో నరైనా, ముండ్కా దక్షిణపురి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ 2022 ఎంసీడీఎన్నికలలో గెలిచిన తమ సిట్టింగ్ వార్డులైన సనగం విహార్ ఏ, నరైనాను కోల్పోయింది. ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాను తెరిచింది. సనగం విహార్ ఏ వార్డును కాంగ్రెస్ గెలుచుకుంది. మరో వైపు చాందిని మహల్ వార్డును ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ గెలుచుకోవడం విశేషం.ఈ ఉప ఎన్నికలు జరిగిన 12 వార్డులలో గ్రేటర్ కైలాష్, షాలిమార్ బాగ్ బి, అశోక్ విహార్, చాందిని చౌక్, చాందిని మహల్, డిచాన్ కలాన్, నరైనా, సంగం విహార్ ఎ, దక్షిణ్ పురి, ముండ్కా, వినోద్ నగర్, ద్వారకా బి ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలను 2022 ఎంసీడీ సాధారణ ఎన్నికల ఫలితాలతో పోల్చిచూస్తే.. 2022 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లతో (42.05% ఓట్లు) మెజారిటీ సాధించగా, భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో (39.09% ఓట్లు) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. ఆప్, కాంగ్రెస్లు కూడా తమ ఉనికిని నిలబెట్టుకున్నాయి.ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా.. -
'ప్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు'
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. అల్పాహార సమావేశాలు పూర్తి చేశారు. అధిష్టానం ఆదేశాలతో ఇరువురు నేతలు ఒకరికొకరు విందులు ఇచ్చుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మంగళవారం ఉదయం శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్కు వచ్చారు. బెంగళూరు సదాశివనగరలోని తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి డీకేశి సాదర స్వాగతం పలికారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నాన్వెజ్ వంటకాలతో అల్పహార విందు ఇచ్చారు. తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవన్న సందేశం ఇచ్చేందుకు ఇరువురు నేతలు ప్రయత్నించారు. తామిద్దరం "సోదరులం" అని పదే పదే చెప్పుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని నొక్కి చెప్పారు.కోడిగుడ్డు కూడా తినరా?దాదాపు గంటపాటు బ్రేక్ఫాస్ట్ భేటీ సాగింది. శివకుమార్ సతీమణి ఉష స్వయంగా తయారు చేసిన వంటకాలను సిద్ధరామయ్య రుచి చూశారు. సాంప్రదాయ మైసూరు శైలిలో చేసిన నాటుకోడి పులుసు, ఇడ్లీ ఆరగించారు. శివకుమార్ మాత్రం శాఖాహార వంటకాలతో సరిపెట్టుకున్నారు. కాగా, ఊరి నుంచి నాటుకోడి (Natu Kodi) తెప్పించాలని డీకేశిని తానే కోరినట్టు సిద్ధరామయ్య స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ వెజిటేరియన్ మహిళా విలేకరిపై సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో చేసిన వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది.''మీకు చికెన్ అంటే ఇష్టమా'' అని మహిళా విలేకరిని సిద్ధరామయ్యగా ప్రశ్నించగా.. తాను స్వచ్ఛమైన శాఖాహారిని (Pure Vegetarian) అంటూ సమాధానం ఇచ్చారు. "స్వచ్ఛమైన" అంటే ఏమిటి, కనీసం కోడిగుడ్డు కూడా తినరా అని మళ్లీ ఆయన ప్రశ్నించగా.. 'లేదు' అంటూ జవాబిచ్చారామె. అయితే ''మీరు జీవితంలో ఏదో కోల్పోతున్నారు'' అంటూ సిద్ధరామయ్య తనదైన శైలిలో సరదాగా కామెంట్ చేయడంతో అక్కడున్నవారంతా నవ్వేశారు.పిలిస్తే నేనూ వెళ్లేవాడిని: పరమేశ్వరసిద్ధరామయ్య, శివకుమార్ బ్రేక్ఫాస్ట్ భేటీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందించారు. తనను కూడా పిలిచివుంటే అల్పహార విందుకు వెళ్లేవాడినని అన్నారు. వారిద్దరికీ కలిపి తానే విందు ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రిని మార్చాలని అధిష్టానం భావిస్తే తాను కూడా రేసులో ఉంటానని పరమేశ్వర ఇంతకుముందు అన్నారు. గతంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.చదవండి: డీకే సీఎం అవుతారు.. అధిష్టానం నిర్ణయిస్తే!సిద్ధూ ప్రిపేర్ అయ్యారా?డీకేశితో బ్రేక్ఫాస్ట్ భేటీ (Breakfast Meeting) ముగిసిన తర్వాత సిద్ధరామయ్య మాటల్లో కొంచెం మార్పు కనిపించింది. అంతకుముందు వరకు ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఐదు బడ్జెట్లు తానే ప్రవేశపెడతానని దీమగా ప్రకటించిన ఆయన.. అధిష్టానం నిర్ణయించినప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతారని అన్నారు. పదవులు శాశ్వతం కాదన్న వేదాంత ధోరణిలోనూ ఆయన మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. Hosted the Hon’ble CM for breakfast at my residence today as we reaffirm our commitment to good governance and the continued development of our state under the Congress vision. pic.twitter.com/qmBxr50S64— DK Shivakumar (@DKShivakumar) December 2, 2025 -
పెళ్లయిన 24 గంటలకే... ఎంత దారుణం..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో అడుగుపెట్టింది. అయితే ఆమె కలలు 24 గంటలు ముగియకుండానే కల్లలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి, భర్త ఇమ్రాత్తో పాటు అతని కుటుంబ సభ్యులు లుబ్నాను బయటకు గెంటేశారు.లుబ్నా తన అత్తమామల ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ లేదా దానికి బదులుగా రెండు లక్షల నగదు ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. ‘నేను ఇంటికి వచ్చిన వెంటనే గొడవ మొదలైంది. మాకు బుల్లెట్ బైక్ ఇవ్వలేదు.. వెంటనే ఇంటికి వెళ్లి రూ. రెండు లక్షలు తీసుకురా అంటూ వారు తనను కొట్టడం ప్రారంభించారు’ అని లుబ్నా పోలీసులకు వివరించింది. అత్తామామలు తనను కొట్టడమే కాకుండా, తమ పుట్టింటివారు పెట్టిన నగలు, నగదును కూడా వారు బలవంతంగా తీసేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.లుబ్నా తల్లి మెహతాబ్ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి లక్షలు ఖర్చు చేశామని, తమ శక్తి మేరకు సోఫా సెట్, టీవీ, వాషింగ్ మెషిన్, కిచెన్ సామాగ్రి తదితర విలువైన బహుమతులు ఇచ్చామని తెలిపారు. పెళ్లికి ముందు బైక్ డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదని, ఒకవేళ ముందే అడిగి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తమ కుమార్తె కన్నీటితో ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించిందని మెహతాబ్ తెలిపారు.ఈ ఘటనపై లుబ్నా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ ఇమ్రాన్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లుబ్నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న దాహంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త కోడలిని వేధింపులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా.. -
ప్రధానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ఆహ్వానం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ప్రధానికి ఆయన ఆహ్వానం అందించారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు.సుమారు అరగంటపాటు ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. డిసెంబర్ 8,9వ తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే.. రీజినల్ రింగ్ రోడ్డు, బెంగళూరు చెన్నై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ బృందం.. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్లను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రులకు ఆహ్వానం అందించింది. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీల బృందం కలిసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు సదస్సు గురించి వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
పార్లమెంట్ సమావేశాలు డే-3: రేణుకా చౌదరిపై ఫిర్యాదు
Parliament winter session 2025 Updates..రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదుఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీదీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలుఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలుమూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలుసెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన..ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలువాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడావిపక్షాల ధర్నా..పార్లమెంట్లో లేబర్ కోడ్కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నాధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణలేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని నినాదాలు#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH— ANI (@ANI) December 3, 2025కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్ఐఆర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వండిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చచర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్పై కొనసాగనున్న చర్చచర్చకు 10 గంటల సమయం కేటాయింపుడిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చవందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ#WATCH | Delhi | Congress MPs Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at the Parliament for the third day of the #WinterSession2025 Congress MP Priyanka Gandhi Vadra says, "We should also discuss other things like pollution. We should discuss many other issues which are… pic.twitter.com/idFERZh21O— ANI (@ANI) December 3, 2025 -
బిహార్ ఎఫెక్ట్: జార్ఖండ్లో సోరెన్-బీజేపీ కొత్త సర్కారు?
రాంచీ: జార్ఖండ్లో రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ ఇటీవల ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక అగ్రనేతను కలవడం సంచలనంగా మారింది. బిహార్లో మహాఘట్బంధన్ ఓటమి పాలైన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం),బీజేపీ మధ్య కొత్త రాజకీయ అవగాహనకు పునాది కావచ్చని మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో భారీ రాజకీయ మార్పుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే..జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి 41 సీట్లు అవసరం. ప్రస్తుతం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 56 సీట్ల బలం ఉంది (జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ-ఎంఎల్ (ఎల్) 2). అయితే, సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) వైపు మొగ్గు చూపితే, సంఖ్యాబలం తక్షణమే మారిపోతుంది. జేఎంఎంకు చెందిన 34 స్థానాలు ఎన్డీఏ (బీజేపీ 21, ఎల్జేపీ 1, ఏజేఎస్యూ 1, జేడీయూ 1, ఇతరులు 1) స్థానాలతో కలిస్తే, కూటమి బలం ఏకంగా 58 సీట్లకు చేరుకుంటుంది. ఈ సంఖ్య మెజారిటీ మార్కును సునాయాసంగా దాటి, ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తుంది.అస్థిర భాగస్వామ్యం..జేఎంఎం- బీజేపీ మధ్య భాగస్వామ్యానికి చారిత్రక నేపథ్యం ఉంది. అయితే అది అస్థిరంగా ఉంది. 2010, 2014 మధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య మద్దతు ఉపసంహరణలు, తరచుగా జరిగిన అధికార మార్పులు రాష్ట్రంలో రాజకీయ అల్లకల్లోలానికి దారితీశాయి. రాజకీయ విశ్లేషకులు దీనిని రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో సోరెన్.. బీజేపీ తనపై ఈడీ దర్యాప్తులను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరిగి బీజేపీతో చేతులు కలపడం జార్ఖండ్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు కానుంది.కాంగ్రెస్, ఆర్జేడీలకు ఎదురుదెబ్బజేఎంఎం ఎన్డీఏలోకి చేరితే అది రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీలకు అతిపెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. కాంగ్రెస్ ప్రస్తుతం జేఎంఎం కూటమిలో 16 స్థానాలతో కీలక పాత్ర పోషిస్తోంది. సోరెన్ కూటమిని వీడితే, అధికారికంగా జార్ఖండ్లో మహాఘట్బంధన్ ప్రభుత్వం పతనమవుతుంది. ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారం కేవలం ఊహాగానాల చుట్టే తిరుగుతోంది. దీరిపై ముఖ్యమంత్రి లేదా జేఎంఎం నుండి బహిరంగ ప్రకటన వెలువడలేదు. ఈ ప్రచారం మధ్య, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. గవర్నర్ పర్యటన ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరగడం యాదృచ్ఛికం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.లోక్సభ ఎన్నికల్లో ప్రభావంహేమంత్ సోరెన్ బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకుంటే, జార్ఖండ్ రాజకీయాల్లో తక్షణమే పెను మార్పులు సంభవించనున్నాయి. పాలక కూటమి కూలిపోయి, రాష్ట్రంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ పరిణామం జార్ఖండ్ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఏదిఏమైనా సోరెన్ తీసుకునే నిర్ణయం జార్ఖండ్ రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, రాబోయే లోక్సభ ఎన్నికల్లో సమీకరణాలను కూడా ప్రభావితం చేయనుంది.ఇది కూడా చదవండి: ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత! -
టీవీకే విజయ్కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన విజయ్కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. దీంతో, విజయ్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.వివరాల ప్రకారం.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు.కాగా, డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు.కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. -
దేవన్న లొంగుబాటు అబద్ధం: బస్తర్ ఐజీ
రాయ్పూర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవన్న లొంగుబాటుపై బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాడ్సే దేవా లొంగుబాటు కేవలం ప్రచారం, ఊహాగానం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ తాజాగా మాట్లాడుతూ..‘బస్తర్లో పునరావాసం విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్నతో పలువురు మావోయిస్టులు పునరావాస విధానం ద్వారా జన జీవన స్రవంతిలోకి వచ్చారు. 570 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ, బార్సే దేవా, పాపారావులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నాం. వారు లొంగిపోవడానికి ఇదొక అనుకూలమైన సమయం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఆపరేషన్ కగార్లో.. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్వాంటెడ్ మడివి హిడ్మా కిందటి నెలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలను దేవన్న స్వీకరించారనే ప్రచారం ఒకటి ఉంది. అయితే దండకారణ్యంలో తీవ్ర నిర్బంధాన్ని ఆయన దళం భరించలేకపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం.. ఎన్కౌంటర్లలో మరణించడం.. జనవరి 1వ తేదీన భారీ సంఖ్యలో లొంగుబాటులు ఉంటాయని మావోయిస్టు నాయకత్వం నుంచి ప్రకటన వెలువడడం.. తదితర పరిస్థితుల నడుమ దేవన్న సైతం లొంగిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, దేవన్నపై కోటి రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. దేవన్నను లొంగిపోవాలని ఆయన తల్లి కూడా కోరుతోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బార్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా( ఛత్తీస్గఢ్) పూవర్తి గ్రామం. హిడ్మా దేవన్నలది ఒకే ఊరు.. పక్కపక్కనే నివాసాలు కూడా!. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచి ఈ గ్రూప్తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత ప్రైజ్మనీ ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత!
న్యూఢిల్లీ: దేశంలోని పలు మహానగరాలను వాయు కాలుష్యం వెంటాడుతూ, ప్రజలను తీవ్ర అనారోగ్యం బారినపడేలా చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడ నిత్యం పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా మారిందంటే, జనం ప్రతీరోజూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఆస్పత్రులను సందర్శించేలా చేస్తోంది.అత్యవసర కేసులు అధికం2022-2024 మధ్య కాలంలో ఢిల్లీలో రెండు లక్షలకు పైగా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఏఆర్ఐ)సంబంధిత అత్యవసర కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వెలువడ్దాయి. ఈ రెండు సంవత్సరాల కాలంలో లక్షల మంది ప్రజలు ఆస్పత్రులలో చేరాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం అందించిన డేటా వాయు కాలుష్య పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది.దీర్ఘకాలిక వ్యాధులుగా..ఢిల్లీలోని ఆరు కేంద్ర ఆసుపత్రులు ఇచ్చిన నివేదిక ప్రకారం 2022లో 67,054 ఏఆర్ఐ అత్యవసర కేసులు ఉంటే, 2024లో ఈ సంఖ్య 68,411కి పెరిగింది. అత్యవసర కేసుల సంఖ్యతో పాటు, ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇదే కాలంలో ఆస్పత్రులలో చేరేవారి సంఖ్య 9,878 నుండి 10,819కి పెరిగింది. ఇది కేవలం అత్యవసర చికిత్సతో తగ్గిపోయే సమస్య కాదని, చాలా మందికి దీర్ఘకాలిక సంరక్షణ అవసరమవుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుదల వాయు కాలుష్య స్థాయిల పెరుగుదలతో ముడిపడి ఉందని నిపుణులు అంటున్నారు.ముంబై, చెన్నైలలో కూడా..రాజ్యసభలో డాక్టర్ విక్రమ్జిత్ సింగ్ సాహ్నే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆరోగ్య మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. కలుషితమైన గాలి శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపించే ఒక అంశం అని ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగానే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అంగీకరించింది. పట్టణ కేంద్రాలలో గాలి నాణ్యత క్షీణతను పర్యవేక్షించడానికి జాతీయ నిఘా వ్యవస్థను విస్తరిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. ఈ ఆరోగ్య సంక్షోభం ఢిల్లీకే పరిమితం కాలేదు. భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, చెన్నైలలో కూడా ఇదే విధమైన పెరుగుదల నమోదైంది. ఈ నగరాల్లో తీవ్రమైన కాలుష్యం ఏర్పడినప్పుడు వేలాది మంది జనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడి, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయించారు. ఈ ఉదాహరణలు దేశవ్యాప్తంగా పట్టణ కాలుష్యం ఒక సామాన్య ఆరోగ్య ముప్పుగా మారుతోందని నిరూపిస్తున్నాయి.వీరికి మరింత హాని..ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కలుషితమైన గాలి ప్రభావం వ్యక్తిపై పడటానికి అనేక కారకాలు కారణమవుతాయి. ఆహారపు అలవాట్లు, వృత్తి, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, రోగనిరోధక శక్తి, మునుపటి వైద్య చరిత్ర వంటి అంశాలు కొందరిని ఇతరులకన్నా మరింత హానికి గురిచేస్తాయి. ఈ సంక్లిష్ట నమూనాలను నిర్ఱారించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 230కి పైగా సెంటినెల్ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆగస్టు 2023లో ప్రారంభమైన డిజిటల్ ఏఆర్ఐ నిఘా కూడా సమాచారాన్ని సేకరిస్తోంది.తక్షణ చర్యలు అవసరంఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కూడా దీనిపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఐదు ఆసుపత్రులలో శ్వాసకోశ లక్షణాలతో వచ్చిన 33,213 అత్యవసర రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడు, శ్వాసకోశ సమస్యలకు అత్యవసర చికిత్స కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచ పరిశోధనలకు అనుగుణంగా ఈ ఫలితాలు ఉన్నప్పటికీ, ఈ అధ్యయనం అధికారికంగా కారణాన్ని నిరూపించలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ డేటా ప్రభుత్వానికి వాయు కాలుష్యం నివారణపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రయాణికులకు చుక్కలు చూపిన ఎయిరిండియా!
ఎయిరిండియా విమానయాన సంస్థ తన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. పలు ఎయిర్పోర్టులలో పడిగాపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి వివరణ ఇస్తూ ఎయిర్లైన్స్ తర్వాత ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తర్వాత పలు ఎయిర్పోర్టులలో ఎయిరిండియా ప్యాసింజర్ల చెక్ ఇన్ను అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో క్యూ లైన్లలో ప్రయాణికులు చాలాసేపు ఎదురు చూశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది చోటు చేసుకుందని ఆ తర్వాత ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్ పార్టీ సిస్టమ్లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని.. ఆ సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడంతా సర్వసాధారణ పరిస్థితి నెలకొందని.. రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. #UpdateThe third-party system has been fully restored, and check-in at all airports is functioning normally. All our flights are operating as per schedule.We thank our passengers for their understanding.— Air India (@airindia) December 2, 2025ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. కిందటి నెలలోనూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ఇష్యూ తలెత్తి సుమారు 800 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి కొన్ని రోజులముందు జీపీఎస్ స్పూఫింగ్ (GPS spoofing) జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) మార్చేందుకు యత్నాలు జరిగినట్టు కేంద్రం ధ్రువీకరించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. సోమవారం రాజ్యసభలో పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.నేవిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా.. ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్లలో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నవంబర్ 2023- ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదైనట్లు అంచనా. -
మంచుకొండల్లో ‘సెగలు’
న్యూఢిల్లీ: ఇవి భూమికి నిజంగానే డేంజర్ బెల్స్! మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు కనీసం 50 శాతం ఎక్కువగా వేడెక్కుతున్నాయట. 1950 నుంచీ ఈ ధోరణి వేగం పుంజుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకంగా 100 కోట్ల మంది విషయంలో ఇది ప్రాణాంతక పరిణామాలకు దారి తీయగలదని అది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా 1980 నుంచి 2020 మధ్య 40 ఏళ్లలో సమతల ప్రాంతాలతో పోలిస్తే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శతాబ్దానికి సగటున 0.21 డిగ్రీల చొప్పున అధిక వేడిమి నమోదైంది.అలాగే వాతావరణం పొడిబారడం 11.5 మి.మీ. ఎక్కువగా జరిగింది. ఇక మంచు కరిగే వేగం శతాబ్దానికి ఏకంగా 25.6 మి.మీ. చొప్పున పెరిగిపోయింది! వెన్నులో చలి పుట్టించే ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్ రివ్యూస్ అర్త్ అండ్ ఎన్వైరాన్మెంట్లో ప్రచురించారు. బృందంలో మనవాళ్లు కూడా.. పరిశోధన బృందంలో భారత్ నుంచి ఉత్తరాంచల్, జవహర్లాల్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు కూడా భాగస్వాములుగా ఉండటం విశేషం. యూరప్లోని ఆల్ఫŠస్ మొదలుకుని ప్రపంయచంలోకెల్లా అత్యంత ఎత్తైన ఆసియాలోని టిబెట్ పీఠభూమి దాకా పర్వత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన వేడిమి గణాంకాలను వాళ్లు ప్రత్యేకంగా విశ్లేíÙంచారు. ప్రధాన పరిశోధనలో వెల్లడైన ప్రమాదకర వాస్తవాలనే వారి విశ్లేషణ కూడా ధ్రువీకరించం విశేషం. ‘‘ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మందికి పైగా ప్రజలు తమ తాగు, సాగు అవసరాలకు హిమానీనదాలు, మంచు కొండల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడ్డారు. వారి పరిస్థితి త్వరలోనే అతి దుర్భరంగా మారనుంది.అంతేకాదు, వీటి తాలూకు భయానక విపరిణామాలు కేవలం కొండ ప్రాంతవాసులకే పరిమితం కాబోవు. మైదాన ప్రాంతాలు కూడా ఇప్పటికే వాటిని చవిచూస్తున్నాయి. ఈ ధోరణి మున్ముందు మరింత వేగం పుంజుకుంటుంది’’అంటూ వారు భవిష్యద్దర్శనం చేశారు. ‘‘ముఖ్యంగా హిమాలయాల్లో మంచు మనం భావిస్తున్న దానికంటే కూడా శరవేగంగా కరిగిపోతోంది. ఇది భయానక వరదలకు, ఆ వెంటనే ఊహాతీతమైన కరువులకు దారితీయవచ్చు. పర్వత ప్రాంతాల్లోని పలు అరుదైన వృక్ష, జీవజాలం శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులు కూడా చాలా దగ్గర్లోనే ఉన్నాయి’’అంటూ హెచ్చరించారు. మంచు కరగడమే కారణం! బ్రిటన్లోని పోర్ట్స్మౌత్ వర్సిటీ నిపుణుల సారథ్యంతో కూడిన అధ్యయన బృందం ఈ పరిశోధన జరిపింది. ఎత్తు ఆధారిత వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా భూమిపై పడే రేడియో ధార్మికతతో పోలిసే ఉపరితలం నుంచి పైకి అది ప్రతిఫలించే రేటు, గాల్లో తేలాడే ఘన కణాల సాంద్రత తదితరాలను లెక్కగట్టింది. ఆర్కిటిక్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాలన్నీ మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా వేడెక్కుతూ వస్తున్నట్టు లెక్కగట్టింది. అక్కడ మంచు విపరీతంగా కరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణమని అధ్యయన బృంద సారథి నిక్ పెపిన్ చెప్పుకొచ్చారు. ‘‘ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో గాల్లో పైకి పయనించే ఘన కణాల సాంద్రత మంచు కరిగే వేగాన్ని మరింత పెంచేస్తోంది. ఇది నిజంగా ఆందోళనకర పరిణామమే’’అని వివరించారు. -
చార్జీల భారం తగ్గించేలా భారత్ ట్యాక్సీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల రైడ్–ఆధారిత మొబైల్ యాప్ల అధిక చార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ యాప్ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీల అధిక చార్జీల మోత నుంచి ఇటు ప్రయాణికులకు విముక్తి కల్పిస్తూనే డ్రైవర్లకు సైతం అధిక లాభాలు ఒనగూరేలా యాప్ను డిజైన్చేస్తున్నట్లు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం వెల్లడించారు. ‘‘ సహకారసంస్థల దన్నుతో బైకులు, ఆటోలు, కార్లలో వినియోగించేలా రైడ్–ఆధారిత మొబిలిటీ యాప్ను తీసుకురావాలని ప్రతిపాదించాం.ప్రయాణికులు ఎంతో సులభంగా రైడ్ బుక్ చేసుకునేలా యాప్ డిజైన్ ఉంటుంది. చార్జీల్లో పారదర్శకత, వాహన ట్రాకింగ్, సందేహాలు నివృత్తిచేసేందుకు పలు భాషల్లో 24 గంటలూ సేవలందించే కస్టమర్కేర్ సౌకర్యం, భద్రత, సురక్షణల వంటి ఎన్నో ఫీచర్లతో యాప్ను సిద్ధంచేస్తాం. ఈ యాప్లో సంస్థ కమిషన్ అనేది సున్నా. అందుకే డ్రైవర్లకు ఎలాంటి కమిషన్ కోతలు లేకుండా నేరుగా భారీ ప్రయోజనం చేకూరుతుంది. కోఆపరేటివ్ సొసైటీకొచ్చే ఆదాయం నేరుగా డ్రైవర్లకే చేరుతుంది. తక్కువ చార్జీల కారణంగా ప్రయాణికులకు సైతం సొమ్ము ఆదా అవుతుంది.అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు లబ్ధిచేకూరేలా ధరల శ్రేణి ఉంటుంది’’ అని అమిత్ షా అన్నారు. ‘భారత్ ట్యాక్సీ’ డిజిటల్ యాప్ను సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ దన్నుతో పలు కేంద్ర, రాష్ట్ర, డ్రైవర్ల సహకార సంఘాలు ఇందులో వాటాదారులుగా ఉన్నాయి. రాష్ట్రాల సహకార సొసైటీల చట్టం–2002 కింద ఈయాప్ను 2025 జూన్ ఆరోతేదీన నమోదుచేశారు. డ్రైవర్లు సైతం ఈ సహకార్ ట్యాక్సీ కార్పొరేషన్లో భాగస్వాములుగా ఉండటం విశేషం. ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతలో భాగంగా ఈ ప్రాజెక్ట్ను తీసుకొస్తున్నట్లు సమాచారం. -
రాకెట్ స్లెడ్ పరీక్ష దిగ్విజయం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్ వ్యవస్థ తాలూకు రాకెట్ స్లెడ్ పరీక్షను దిగ్విజయంగా జరిపింది. ఈ ఘనత సాధించిన అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అత్యంత అపరిమిత వేగంతో కూడిన ఈ పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఓ) మంగళవారం విజయవంతంగా జరిపింది. ఎయిర్ క్రూ రికవరీతో పాటు పలు కీలక భద్రతా పరిమితులను విజయవంతంగా సాధించింది. ‘చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబోరేటరీ లో ఉన్న రైలు ట్రాక్ రాకెట్ స్లెడ్ వేదికగా గంటకు ఏకంగా 800 కి.మీ. నియంత్రిత వేగంతో ఈ పరీక్షను నిర్వహించారు.కనోపీ సెవెరెన్స్ ఎజెక్షన్ సీక్వెన్సింగ్ తో పాటు పూర్తిస్థాయిలో ఎయిర్ క్రూ రికవరీ వంటి అన్ని లక్ష్యాలనూ ఈ పరీక్ష సాధించింది‘ అని రక్షణ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల క్లబ్లో భారత్ సగర్వంగా నిలిచిందని తెలిపింది. డీఆర్ డీఓతో పాటు వాయు సేన, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందూస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. మన దేశీయ రక్షణ సామర్థ్యాల పెంపులో స్వావలంబన దిశగా కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాల్లో దీనిని ఒక మైలురాయిగా ఆయన అభివరి్ణంచారు. ఏమిటీ స్లెడ్ టెస్టు? విమానం గాల్లో అత్యధిక వేగంతో ఎగిరేటప్పటి పరిస్థితులను రాకెట్ స్లెడ్ పద్ధతిలో నేల మీదే కృత్రిమంగా సృష్టిస్తారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు పట్టాలపై రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. -
రెడ్కార్పెట్ పరుద్దామా?
న్యూఢిల్లీ: రోహింగ్యాల చొరబాట్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకాలా? అని మండిపడింది. ఇప్పటికే ఇక్కడ తిష్టవేసినవారిని ఎందుకు బయటకు పంపించకూడదు అని ప్రశ్నించింది. దేశంలో ఉండడానికి చట్టపరమైన అనుమతి లేనివారంతా చొరబాటుదారులేనని తేల్చిచెప్పింది. మన సొంత పౌరులు పేదరికంలో మగ్గిపోతున్నారని, పరాయి వ్యక్తులను భరించలేమని పరోక్షంగా స్పష్టంచేసింది. మానవ హక్కుల కార్యకర్త రీటా మన్చందా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగీ్చతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీలో కొందరు రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తర్వాత వారి జాడ తెలియడం లేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఆచూకీ బయటపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఒకవేళ రోహింగ్యాలను వెనక్కి పంపించాలనుకుంటే చట్టప్రకారం నడుచుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచి్చన ఉత్తర్వును ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. దేశంలో చొరబాటుదార్ల సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది. బయటకు పంపిస్తే సమస్య ఏమిటి? ‘‘చొరబాటుదార్లు సరిహద్దును దాటేసి మన దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారు. సొరంగం తవ్వుకొని లేదా కంచెను ఛేదించి అక్రమంగా అడుగుపెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వారిని ఇక్కడి పౌరులుగా గుర్తించాలని, స్థానిక చట్టాలను వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. ఆహారం, నివాసం, విద్య వంటి వసతులు కల్పించాలని అంటున్నారు. నిజంగా చొరబాటుదార్లకు రెడ్కార్పెట్ స్వాగతం పలకాలా? వారికి అన్ని రకాల వసతులు కల్పించాలా? ఇదెక్కడి చోద్యం? వారిని బయటకు పంపిస్తే వచ్చే సమస్య ఏమిటో చెప్పాలి? చొరబాటుదార్లను పక్కనపెట్టి మన దేశంలో పేదల బతుకులను బాగు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుంది.మన పౌరులకు ప్రభుత్వ ప్రయోజనాలు, వసతులు ఎందుకు కల్పించకూడదు? దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారి పట్ల థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించాలని మేము చెప్పడం లేదు’’ అని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసే అర్హత రీటా మన్చందాకు లేదని, పోలీసుల అదుపులో ఉన్న రోహింగ్యాలెవరూ కోర్టును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. శరణార్థులా? అక్రమ వలసదారులా? రోహింగ్యాల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు విచా రణ నిర్వహించింది. వారు శరణార్థులా? లేక అక్రమ వలసదారులా? అనేది మొదట తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో స్పష్టత వస్తే తదుపరి చర్యలు చేపట్టవచ్చని సూచించింది. రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తిస్తే వారికి ఎలాంటి రక్షణలు, ప్రయోజనాలు, హక్కులు కల్పించాన్నలది పరిగణనలోకి తీసుకోవచ్చని తెలియజేసింది. ఒకవేళ అక్రమ వలసదారులే అయితే వారిని వెనక్కి పంపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని వివరించింది. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రేవంత్.. మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు హాజరు కావాలని ఆహా్వనించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపైనా ఖర్గేతో చర్చించినట్లు తెలిసింది. ఈ సమ్మిట్ రాష్ట్రం తన అభివృద్ధి దృక్పథం, ప్రధాన మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక తెలంగాణ రైజింగ్–2047 రోడ్ మ్యాప్ను ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. బుధవారం పార్లమెంటులో పీఎం నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని కూడా సీఎం కలవనున్నారు. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తారు. -
పార్లమెంట్లో తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’(పీఎం–కిసాన్) పథ కం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలోని రైతులకు మొ త్తం రూ.14,236.18 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత నవంబర్ 19న విడుదల చేసిన 21వ విడతలో తెలంగాణలోని 29.96 లక్షల మంది రైతులకు రూ.599. 31 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలిపారు.ఐదేళ్లలో రూ.6.21 లక్షల కోట్ల యూరియా సబ్సిడీ దేశ వ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో (2020–21 నుంచి 2024–25 వరకు) యూరియా సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.6,21,944.29 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ కేఆర్.సురేశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సబ్సిడీ భారం2022–23 నాటికి గరిష్టంగా రూ.1,68,676 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఇది రూ.1,24,319 కోట్లుగా ఉంది. వరంగల్లో 15.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ వరంగల్ జిల్లాలో 2024–25 పంట కాలానికి సంబంధించి రైతుల నుంచి 15.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2.95 లక్షల బేళ్ల పత్తిని సేకరించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీఎస్ఆర్ వ్యయం రూ. 34,908 కోట్లు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీలు వెచి్చస్తున్న నిధులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 34,908.75 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ బి.పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 48,186 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి తెలంగాణలో 48,186 సహకార సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తుండగా, వాటిలో దాదాపు కోటి మందికి (1,00,60,281) పైగా సభ్యులు ఉన్నారని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్సభలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో (అక్టోబర్ 31 వరకు) మార్కెటింగ్, డెయిరీ, ఇతర రంగాలకు కలిపి మొత్తం రూ. 20,989.33 కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం గణాంకాలను బయటపెట్టింది. 2024–25లో తెలంగాణకు చెందిన 5,639 మందికి శిక్షణ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 4.77 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి హైదరాబాద్లో రూ. 47 కోట్లతో భారీ హోల్సేల్ ఫిష్ మార్కెట్ తెలంగాణలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4.77 లక్షల టన్నుల ఇన్లాండ్ చేపల ఉత్పత్తి జరిగిందని కేంద్ర మంత్రి రాజీవ్రంజన్ సింగ్ వెల్లడించారు. లోక్సభలో జహీరాబాద్ ఎంపీ సురేశ్కుమార్ షెటా్కర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ’ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’కింద 2020–21 నుంచి 2024–25 వరకు తెలంగాణకు రూ. 339.37 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, ఇందులో కేంద్ర వాటా రూ.108.73 కోట్లు కాగా, రూ.39.40 కోట్లు విడుదల చేశామన్నారు. మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు హైదరాబాద్లో రూ. 47.03 కోట్లతో అత్యాధునిక హోల్సేల్ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్లు తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేయడంలో భాగంగా మొత్తం 511 పీజీ వైద్య సీట్లను ఆమోదించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ (హైదరాబాద్)లో అత్యధికంగా 145 సీట్లు (మొదటి విడతలో 113, రెండో విడతలో 32), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్): 92 సీట్లు (89+3), గాంధీ మెడికల్ కాలేజీ (సికింద్రాబాద్): 91 సీట్లు (77+14), సిద్దిపేట మెడికల్ కాలేజీ: 80 సీట్లు, నల్లగొండ (30), సూర్యాపేట (25), ఆదిలాబాద్ రిమ్స్ (22), నిజామాబాద్ (16), మహబూబ్నగర్ (10) కాలేజీల్లో కూడా సీట్లు పెరిగాయి. నకిలీ మందులపై ఉక్కుపాదం.. 700 కంపెనీల ఆడిట్ దేశంలో నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలో దగ్గు మందు (కోల్డ్ రిఫ్ సిరప్) తాగి చిన్నారులు మరణించిన ఘటనపై విచారణ జరిపామని, ఆ మందులో ప్రమాదకరమైన ’డైథలిన్ గ్లైకాల్’46.28 శాతం ఉన్నట్టు తేలిందని మంత్రి వెల్లడించారు. ఈ మందును తయారు చేసిన తమిళనాడుకు చెందిన కంపెనీ లైసెన్స్ను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ కంపెనీల్లో ముమ్మర తనిఖీలు (ఆడిట్) నిర్వహించినట్టు కేంద్రం తెలిపింది. -
డీకే సీఎం అవుతారు.. అధిష్ఠానం నిర్ణయిస్తే!
సాక్షి బెంగళూరు: ‘‘డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు..! అది... హైకమాండ్ నిర్ణయించినప్పుడు’’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానం ఏం తీర్మానిస్తే ఆ ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ను కలుస్తానని... అయితే, ఇప్పటివరకు ఆహ్వానం అందలేదని తెలిపారు. అధికార మార్పిడి విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి తాను, డీకే కట్టుబడతామని వెల్లడించారు. మంగళవారం సీఎం సిద్ధరామయ్య బెంగళూరు సదాశివనగరలోని డీకే ఇంటికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు వెళ్లారు. ఇద్దరు నేతలు రెండు గంటలకు పైగా పలు అంశాలను చర్చించారు. కాగా, నాయకత్వ మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అల్ఫాహార భేటీ అనంతరం ఇద్దరు నేతలు మరోసారి స్పష్టం చేశారు. సిద్ధు ఆహ్వానంతో గత నెల 29న ఆయన ఇంటికి డీకే బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు డీకే కోరిక మేరకు మంగళవారం సిద్ధు ఆయన ఇంటికి వచ్చారు. రెండు సమావేశాల తర్వాత తామిద్దరం ఒక్కటేనన్న సందేశాన్ని ఇచ్చారు. మైసూరు మెనూతో... అల్పాహార విందులో తనకు పల్లె నుంచి నాటుకోడి తెప్పించాలని డీకేను కోరినట్లు సిద్ధు చమత్కరించారు. ఈ మేరకు మైసూరు శైలిలో నాటు కోడి పులుసు, ఇడ్లీ, సాంబార్ను డీకే సిద్ధం చేశారు. భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్డీ రంగనాథ్ పాల్గొన్నారు. విందు అనంతరం సిద్ధు మీడియాతో మాట్లాడుతూ తామెప్పుడూ ఒకటిగానే ఉన్నామని, ఎమ్మెల్యేలూ కలసికట్టుగా ఉన్నారని, ఒకే సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. 2028లో ఉమ్మడిగా పనిచేసి.. తాను, డీకే మళ్లీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. డీకేతో రాజకీయ, పార్టీ అంశాలు, 8 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడామన్నారు. 8న ఢిల్లీ వెళ్లి ఎంపీలతో మాట్లాడతామని, సమయం ఇస్తే హైకమాండ్ను కలుస్తానని సీఎం చెప్పారు. డీకే మాట్లాడుతూ... ఎమ్మెల్సీల ఎంపిక సహా సీఎం సిద్ధుతో రాజకీయ విషయాలను చర్చించానన్నారు. తమది ఒకటే గొంతుక అని, ఒకటే ఆచార వ్యవహారమని, ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. సాదర ఆహ్వానం..సీఎం సిద్ధును డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. సిద్ధుకు డీకే సురేశ్ పాదాభివందనం చేశారు. ఇద్దరు అన్నదమ్ములను సీఎం ఆత్మీయంగా పలకరించారు. సిద్ధు, డీకే ఇద్దరూ కార్టియర్ కంపెనీ వాచీలతో కనిపించారు. ఈ రెండూ ఒకేలా ఉన్నాయి. వీటి విలువ రూ.43 లక్షలని తెలిసింది. కాగా, సీఎం వాచీ విషయమై రాష్ట్ర బీజేపీ విమర్శలు గుప్పించింది. సర్వసాధారణమైన సమాజవాదినని చెప్పుకొనే సీఎం సిద్ధుకు ఇంత ఖరీదైన వాచీ ఎందుకని ప్రశ్నించింది. -
వచ్చే ఏడాది నుంచి జనగణన షురూ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ మొదలు వృద్ధాప్య పెన్షన్ల దాకా పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులను గణించడంతోపాటు దేశ జనాభా సరళిని తెలియజెప్పే అత్యంత కీలకమైన జనగణన క్రతువు ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆరంభంకానుంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. రెండు విడతల్లో జనగణనను పూర్తిచేస్తారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్దాకా తొలి విడత పూర్తిచేసి 2027 ఫిబ్రవరిలో మలివిడతతో ముగిస్తారు. తొలి విడతలో దేశంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, నివాస ప్రాంతాల్లో పక్కా గృహాలు ఎన్ని, ఎన్ని అంతస్తుల్లో భవనాలు నిర్మించారు? పూరి గుడిసెలు ఎన్ని? కాంక్రీట్ నిర్మాణాలు ఎన్ని? ఏఏ రకం ముడి పదార్థాలతో ఏ తరహా ఇల్లు నిర్మించారు? ఇలా ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో విడతలో ఆయా ఇళ్లలో ఉంటున్న కుటుంబాలెన్ని? కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? వారి పేరు, వయసు వంటి వివరాలు సేకరిస్తారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి 30 రోజులకు ఒక కాలావధిగా తీసుకుని లెక్కిస్తారు. 2027 మార్చి ఒకటోతేదీని రిఫరెన్స్ తేదీగా లెక్కలోకి తీసుకుంటూ 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు మొదలెడతారు. మంచు, అతి చలి, అననుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్లలో అనువైన సమయాల్లోనే జనగణన చేపట్ట నున్నారు. ఇక్కడ 2026 అక్టోబర్ ఒకటోతేదీని రెఫరెన్స్ తేదీగా తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే సలహాలు, సూచనలతోపాటు పాత డేటాను లెక్కలోకి తీసుకుని జనగణన ప్రశ్నావళిని ఖరారుచేశామని మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ కమిటీలో నిర్ణయించిన మేరకు ఈసారి కులగణన సైతం చేపట్టనున్నారు. స్వీయ జనగణనతోపాటు మొబైల్ యాప్ల సాయంతో ఈసారి డిజిటల్ రూపంలో జనగణన–2027 కొనసాగనుంది. -
రెండోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వేపై పార్లమెంట్లో చర్చకు విపక్షపార్టీల సభ్యులు పట్టుబట్టడంతో శీతాకాల సమావేశాల రెండోరోజు సభాకాలంసైతం నిరుపయోగంగా ముగిసింది. ఎస్ఐఆర్పై చర్చకు తామేమీ విముఖత చూపట్లేమని, కాలావధిపై పట్టుబట్టడం సరైన పద్ధతికాదంటూ కేంద్రప్రభుత్వం వ్యాఖ్యానాలతో విపక్షాలు ఏమాత్రం సంతృప్తిచెందలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జార్జియా ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ గ్యాలరీలోకి ఆహా్వనించి సభాకార్యక్రమాలు మొదలెట్టారు.ప్రశ్నోత్తరాల సమయం ఆరంభంకాగానే విపక్షసభ్యులు తమతమ స్థానాల నుంచి లేచినిలబడి ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనల నడుమే పలువురు మంత్రులు తమను అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయినా విపక్షసభ్యులు నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ ఆగ్రహంతో ‘‘ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. కానీ సభలో కొందరు సభ్యుల ప్రవర్తన ఏమాత్రం ఆమోదనీయంగా లేదు. సభ గౌరవాన్ని కాపాడండి. ప్రతి ఒక్క సభ్యునికి మాట్లాడే అవకాశమిస్తా. అప్పటిదాకా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యయుత పార్లమెంట్గా సభ అత్యున్నత ప్రమాణాలను పాటించండి’’ అని హితవు పలికారు.అయినా నినాదాలు సద్దుమణగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైన కేవలం 10 నిమిషాలకే నినాదాలు రెట్టించడంతో సభను వెంటనే 2 గంటలకు వాయిదావేశారు. లోక్సభ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ మొదలైనా విపక్షసభ్యుల నినాదాలతో హోరెత్తిపోయింది. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం సైతం సమాయత్తమవుతోందని, సభ సజావుగా సాగేలా సంయమనం పాటించాలని విపక్ష సభ్యులకు సభాధ్యక్షుడి స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా విజ్ఞప్తిచేశారు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదావేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల ధర్నాఎస్ఐఆర్తోపాటు ఎన్నికల సంస్కరణలపై ఉభయసభల్లో చర్చకు ప్రభుత్వం సమ్మతి తెలపకపోవడంతో నిరసనగా విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. నిరసనలోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. ‘‘ఎస్ఐఆర్ను అంతం చేద్దాం. ఓట్ల చోరీకి ముగింపు పలుకుదాం’, ‘ఎస్ఐఆర్ అంటేనే ఓట్ల చోరీ’, ‘వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల ఓట్లను తొలగించారు’’ అనే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు.ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రాసహా పలు విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ పార్లమెంట్ దేశ ప్రజలదని మోదీ పదేపదే అంటారు. తీరా ప్రజాసమస్యలపై చర్చిద్దామంటే జడుసుకుంటారు. చర్చించకుండా పారిపోతున్నారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటింగ్ హక్కుల కంటే పెద్ద సమస్య మరోటి ఉంటుందా?’’అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ చేశారు. డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్ బాలు, సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ తదితరులు సైతం పార్లమెంట్ మకరద్వారం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు -
భారత్ నావికా దళంలోకి ‘అరిదమన్’ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: భారత నావికా దళం నానాటికీ బలోపేతం అవుతున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి చెప్పారు. అణు శక్తిని సముపార్జించుకుంటూ తిరుగులేని దళంగా మారుతోందని వెల్లడించింది. దేశంలో మూడో స్వదేశీ అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిదమన్’ త్వరలో నావికా దళంలో లాంఛనంగా చేరనుందని ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన ‘నేవీ డే’ను నిర్వహించుకోనున్న నేపథ్యంలో దినేశ్ త్రిపాఠి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇండియన్ నేవీని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా తిప్పికొట్టగల సామర్థ్యం మనకు ఉందన్నారు. ప్రాజెక్టు 75 ఇండియా(పీ75–ఐ)లో భాగంగా ఆరు స్టీల్త్ సబ్మెరైన్లను సమకూర్చుకొనే ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చిందని వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్–ఎం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నామని, ఇందులో మొదటి నాలుగు విమానాలు 2028లో మనదేశానికి రాబోతున్నాయని చెప్పారు. పాకిస్తాన్కు భారీగా ఆర్థిక నష్టం ఆపరేషన్ సిందూర్లో భారత నావికా దళం కీలక పాత్ర పోషించిందని దినేశ్ కె.త్రిపాఠి గుర్తు చేశారు. మనం దూకుడుగా ముందుకెళ్లడంతో పాకిస్తాన్ నావికా దళానికి దిక్కుతోచలేదని, దాడులు జరుగుతాయన్న భయంతో అక్కడ వెంటనే ఓడరేవులను మూసివేశారని వెల్లడించారు. పశి్చమ అరేబియా సముద్రంలో ఎలాంటి ఆపరేషన్లకైనా సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ భారత్, పాకిస్తాన్ మధ్య గత ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఆపరేషన్ సిందూర్ ఆగలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్కు ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. విదేశీ వాణిజ్య నౌకలు పాకిస్తాన్కు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు. పాకిస్తాన్కు వెళ్లే నౌకల బీమా వ్యయం విపరీతంగా పెరిగిందన్నారు. సముద్ర గర్భం నుంచి అణ్వాయుధాల ప్రయోగం అణుశక్తి సంపన్న బాలిస్టిక్ మిస్సైల్ సబ్మెరైన్(ఎస్ఎస్బీఎన్) కార్యక్రమానికి భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గాములను అభివృద్ధి చేశారు. నావికా దళంలో ప్రవేశపెట్టారు. మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి.భూఉపరితలం, ఆకాశం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే శక్తిసామర్థ్యాలను భారత్ ఇప్పటికే సొంతం చేసుకుంది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించడంపై దృష్టి పెట్టింది. అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్ వంటి కొన్నిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. ⇒ ఐఎన్ఎస్ అరిదమన్ జలాంతర్గామిని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించారు. వచ్చే ఏడాది జనవరిలో నావికాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సబ్మెరైన్ పొడవు 112 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 10 మీటర్లు. ⇒ లాంగ్ రేంజ్ కె–4 క్షిపణులను మోసుకెళ్లగలదు. ⇒ ఇందులో అత్యాధునిక అండర్ వాటర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. ⇒ ఎనిమిది వరి్టకల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్స్ ఉంటాయి. 3,500 కిలోమీటర్ల దూరం వరకు క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 83 ఎండబ్ల్యూ కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్తో తనకు అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటుంది. ⇒ గంటకు 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. -
రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలా?
ఢిల్లీ: రోహింగ్యాల అంశంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమంగా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించాలా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇటీవల కస్టడీలో ఉన్న ఐదుగురు రోహింగ్యాల ఆచూకీ లేదని వారి సమాచారం ఇవ్వాలని పిటిషన్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది.భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు."మీరు అక్రమంగా దేశంలోకి చొరబడతారు. దాని కోసం ఫెన్సింగ్ ను తెంపుతారు, సొరంగం తవ్వుతారు. ఆ తర్వాత మేము మీ దేశంలోకి వచ్చాము. మీ చట్టాలు మాకు వర్తించాలి అంటారు. ఆ తర్వాత మాకు ఆహారం కావాలి, మాకు నివాసం కావాలి, మా పిల్లలకు చదువు కావాలి అంటారు. మేము ఇలా చట్టాలని సాగదీసుకుంటూ పోవాలా "అని రోహింగ్యాలను ఉద్దేశించి పిటిషనర్ ని ప్రశ్నించారు.మన దేశంలోనూ పేదవారు ఉన్నారు. వారు ఈ దేశ ప్రజలు వారికి కొన్ని సౌకర్యాలు, ప్రయోజనాలు లభించడం లేదు? మీరు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టరు. అని అడిగారు. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కస్టడీ న్యాయబద్ధమైనదా కాదా అనే విషయం న్యాయమూర్తి అప్పుడు నిర్ణయిస్తారు అని తెలిపారు. అయితే అక్రమంగా ప్రవేశించిన వారిపై సైతం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిషేధమన్నారు.అయితే భారత్ రోహింగ్యాలను శరణార్థులుగా ఇంకా ప్రకటించలేదని వారికి శరణార్థులకుండే చట్టబద్ధత హోదా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎవరైనా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం మనకు ఉందా అని అని అడిగారు. భారత్ కు ఉత్తర భారతంలో చాలా సున్నితమైన సరిహద్దు ఉందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వారు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.అయితే భారత్ వీరిని శరణార్థులుగా గుర్తించలేదు. అయినప్పటికీ దేశంలో అక్రమంగా చొరబడి నివసిస్తున్నారు. ఇండియాలో దాదాపు 40 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం. -
రిటైర్డ్ డాక్టర్ లక్ష్మీ బాయ్ రూ. 3.4 కోట్ల భారీ విరాళం
భారతదేశంలోని అత్యంత విశిష్ట గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ కె లక్ష్మీ బాయి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు నుంచి రూ. 3.4 కోట్లను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్కు విరాళంగా ఇచ్చారు. మహిళలకు క్యాన్సర్ సంరక్షణ సేవలకు గాను ఈ విరాళాన్ని అందించారు. డిసెంబర్ 5న ఆమె 100వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె దానం చేయడం విశేషం.100వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న డాక్టర్ కె లక్ష్మీ బాయి తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 3.4 కోట్లను ఒడిశా, క్యాన్సర్తో పోరాడుతున్న మహిళల కోసం గైనకాలజికల్ ఆంకాలజీ యూనిట్ను నిర్మించడానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, ఇది గైనకాలజికల్ ఆంకాలజీ కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయ పడుతుందని, భవిష్యత్ వైద్యులను రూపొందిస్తుందని, ఎంతోమంది మహిళల ఆశలను రెక్కలివ్వాలనేది తన కోరిక అని చెప్పారు. దీంతో పాటు యువతులలో క్యాన్సర్లను నివారించడంలో సహాయపడే కౌమార టీకా డ్రైవ్లకు మద్దతుగా డాక్టర్ బాయి బెర్హంపూర్ ప్రసూతి మరియు గైనకాలజీ సొసైటీకి రూ. 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. భావ్నగర్లోని డాక్టర్ బాయి నివాసంలో ఆమె పూర్వ విద్యార్థులు కొందరు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు హాజరవుతారని భావిస్తున్నారు.యాభై సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లక్ష్మీ బాయి తన క్లినికల్ ప్రావీణ్యం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవప్రదమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు కూడా విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.1926లో డిసెంబర్ 5, జన్మించిన డాక్టర్ లక్ష్మీ బాయి, కటక్లోని SCB మెడికల్ కాలేజీలో మొదటి MBBS బ్యాచ్లో ఉన్నారు. అక్కడినుంచే ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి DGO, MD (ప్రసూతి & గైనకాలజీ) పట్టాలు పుచ్చుకున్నారు. USAలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో MPHని అభ్యసించారు. 1950లో సుందర్గఢ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తిని ప్రారంభించారు. 1986లో బెర్హంపూర్లోని MKCG మెడికల్ కాలేజీలో O&G ప్రొఫెసర్గా పదవీ విరమణ చేశారు. -
అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు
వారణాసి, సాక్షి : మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది. వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిల్లో ఒకటిగా ఈ పారాయణాన్ని భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.19 year old Chi. Devavrat Mahesh Rekhe reciting Danda krama Parayana infront of elderly vidwans in kashi 😍🙏 https://t.co/Z7Tx2tTqWV pic.twitter.com/DIbPa6w8UI— Adarsh Hegde (@adarshahgd) December 2, 2025 ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య వారణాసి పులకించిపోయింది. భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమ పారాయణం చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్లో పోస్ట్ చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు 19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై జరగడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है। भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o— Narendra Modi (@narendramodi) December 2, 2025 -
బరిలో ‘సోనియాగాంధీ’ అయోమయంలో కాంగ్రెస్
కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9 - 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో మున్నార్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ (అవును మీరు చదవింది నిజమే) కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.ఎవరీ సోనియా గాంధీకేరళలోని నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు దివంగత దురే రాజ్ కుమార్తె సోనియా గాంధీ. సోనియా గాంధీ పట్ల అభిమానంతో, ఆమెకు ఆ పేరు పెట్టుకున్నారట.అయితే బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉన్న సుభాష్ను సోనియా వివాహం చేసుకున్నారు . ప్రస్తుతం పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు పాత మున్నార్ మూలక్కడ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో ఆమె బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తన భర్త రాజకీయ మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మళ్లీ బీజేపీ తరపున బరిలోకి దిగారు. చదవండి: జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీమరోవైపు మున్నార్లో సోనియా గాంధీ పోటీ కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్కు ఇక్కడ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే కాంగ్రెస్ అధినేతగా సోనియా గాంధీ పేరు అందరికీ సుపరిచితమే. ఆ పేరున్న వ్యక్తం పోటీ చేయడంతో సోనియా పేరు తక్షణమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో రమేష్ ఆందోళన పడుతున్నారు. డిసెంబర్ 13న లెక్కింపు జరుగుతుంది.ఇదీ చదవండి: అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు -
లారెన్స్ బిష్ణోయ్ స్నేహితుడిపై కాల్పులు
చండీగఢ్ లోని టింబర్ మార్కెట్ సమీపంలో ఇంద్రపీత్ సింగ్ (ప్యారీ) అనే గ్యాంగ్ స్టార్ ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ప్యారీ తన వాహనంలో ప్రయాణిస్తుండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండే వారని తెలిపారు.ఇంద్రపీత్ సింగ్ పై కాల్పులు జరిపిన అనంతరం వెంటనే అతడిని దగ్గర్లోని పీజీ మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు పేర్కొన్నారు. ఏదైనా గొడవ కారణంగానే బాధితుడిపై కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. కాగా కాల్పులు జరిగిన కొద్దిసేపటికి హరీ బాక్సర్ ఆర్జో బిష్ణోయ్ పేరుతో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ప్యారీ ( ఇంద్రప్రీత్ సింగ్) ను తామే చంపామని అతను లోకల్ క్లబ్స్ నుండి డబ్బులు వసూలు చేసి తమను చంపాడానికి ప్లాన్ చేస్తున్నాడని అందులో ఉంది. అయితే ఆ పోస్టును ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ స్టర్ ప్యారీ చంఢీగఢ్ లోని సెక్టార్ 36లో నివసిస్తారని అతనిపై గతంలోనూ అనేక క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు.ఇంద్రపీత్ సింగ్, గ్యాంగ్ స్టార్ బిష్ణోయ్ డీఏవీ కాలేజీలో పూర్వ విద్యార్థులు. వీరిద్దరూ 2010లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి రాజకీయాలలో ప్రవేశించారు. ఒక సందర్భంలో వీరిద్దరూ కలిసి చండీగఢ్ సెక్టార్ 40లో ఒకరిపై దాడి చేశారు. ఆ కేసులో బిష్ణోయ్, ఇంద్రప్రీత్ సింగ్ ఇద్దరూ ఒకేసారి అరెస్టయ్యారు.పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్ ఇతని గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం బిష్ణోయ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు బాబా సిద్ధీఖీ హత్య తరువాత ఇతని పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలోనూ ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కు ఈయన నుంచి బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ శిక్ష ఎదుర్కొంటున్నారు. అయితే కృష్ణ జింక బిష్ణోయ్ కమ్యూనిటికి చాలా పవిత్ర జంతువు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం బాలీవుడ్ స్టార్ కు భద్రత పెంచింది. -
జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీ
నూనూగు మీసాల విద్యార్థి దశలోనే ఉండగానే 18 ఏళ్ల వయసులో ఒక సంస్థకు సీఈఓ కాగలనని ఎవరైనా కలగంటారా? కానీ ఒకబ్బాయి కన్నాడు. పెద్ద సాహసమే చేశాడు. అభిరుచి, అభ్యాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించి తీరవచ్చని నిరూపించాడొక యువకుడు. కలలు కంటూ కూర్చోవడం కాదు, వాటిని సాకారం చేసుకోవడంలోనే ఉంటుంది కిక్కు. సూర్య వర్షన్ను చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తుంది. పదండి ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.తమిళనాడులోని తూత్తుకుడిలో ఒక చిన్న వంటింటి నుంచి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఆవిస్కృతమైన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. సూర్య వర్షన్ అద్భుతమైన నేకెడ్ నేచర్ (Naked Nature)ను స్థాపించాడు. కంపెనీ సీఈవోగా స్కిన్కేర్ అండ్ హెయిర్కేర్ బ్రాండ్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. View this post on Instagram A post shared by Surya Varshan (@zany_shan) ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన తూత్తుకుడి పట్టణంలో సూర్యకు చిన్నప్పటి నుంచి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా గాయాలకు ఉప్పు కాపడం పెట్టడం చూసి ఆశ్చర్యపోయేవాడు. అసలు ఉప్పులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. దానిగురించి స్టడీ చేశాడు. తద్వారా మెగ్నీషియం, కాల్షియం ఉప్పులో ఎక్కువగా ఉంటాయని, అవి కండరాల నొప్పులను తగ్గిస్తాయని లుసుకున్నాడు. అయితే ఉప్పుతో పాటు ఏదైనా పదార్థాన్నికలిపి మెడిసిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనాలు కలపకుండా సహజ ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గతల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ రూ.200 తో,600 చదరపు అడుగుల ఇంటిలో మందారం పువ్వు, బార్లీ, వేపాకుతో కలిపి బాత్ సాల్ట్ ను తయారు చేశాడు. దానికి హైబిస్కస్ బాత్ సాల్ట్ అని పేరుపెట్టాడు. దీని ధర రూ. 320. 12వ తరగతిలో సూర్య వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమై 2019లో ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్కు మారింది. దాదాపు అన్ని పనులూ సింగిల్ హ్యాండ్తోనే నడిపించాడు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ అవే ఈరోజు సూర్యను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!సేంద్రీయ, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు, పైగా దేశీ-ఆవు నెయ్యిని ఉపయోగించడంతో ముగ్ధుడైన ఆయుర్వేద వైద్యుడు బల్క్ ఆర్డర్ ఇవ్వడంతో సూర్య వ్యాపారం కీలక మలుపు మలుపు తిరిగింది. ఈ విజయంతో సూర్య తన చదువులను మధురైకి మార్చుకుని పూర్తిగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. వాటిని ఆన్లైన్లో బోధించి రూ. 2.2 లక్షలు సంపాదించాడు. దీన్ని తిరిగి నేకెడ్ నేచర్లో స్కేల్ ఆపరేషన్లకు పెట్టుబడి పెట్టాడు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ప్రస్తుతం నేకెడ్ నేచర్ చర్మ ,జుట్టు సంరక్షణ, బాత్ బేబీ కేర్ వర్గాలలో, 70 ఉత్పత్తులనుపైగా సహజ ఉత్పత్తులను అందిస్తుంది. 2021-22 నాటికి రూ. 10 కోట్ల విలువను చేరుకుంది. కంపెనీ ఆఫీసు 4ఏవేల చదరపు అడుగులకు మారింది. ఈ బ్రాండ్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 2023లో గ్లోబల్ స్టూడెంట్ ఆంట్రపెన్యూర్ అవార్డు దక్కించుకున్నాడు. -
రూ.58 వేలకోట్లు!.. విజయ్ మాల్యాతో సహా 15 మంది అప్పు
ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు.లోక్సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.అత్యధికంగా విజయ్ మాల్యావిజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే పలు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ ల పేరును కేంద్రం లోక్ భవన్ లుగా మార్చింది. ఈ నేపథ్యంలో మిగతా వాటి పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.దీనితో పాటు రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. రాజ్ భవన్ పేరు మార్చినట్లు నోటిఫికేషన్ రావడంతో హైదరాబాద్ లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రికార్డులన్నింటిలోనూ లోక్ భవన్ పేరును ప్రచురించబోతున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ భవనాలలోకి పీఏంఓతో పాటు ఇతర కీలకమైన శాఖల కార్యాలయాలను మార్చారు. పీఎంఓకు ప్రక్కనే క్యాబినెట్ సెక్రటేరియేట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియేట్, ఇండియా హౌస్ ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2016లో ప్రధాని నివాసం పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చారు. కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్ గా, రాజ్ పథ్ ని కర్తవ్యపథ్ గా నామకరణం చేశారు. -
16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే.
సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. గతేడాది ఇదే సీజన్తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. ఇక మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!) -
ఐఐటీ బాంబే విద్యార్థిని వీడియో వైరల్, అంతగానూ ఏముంది?
హర్యానాకు చెందిన ఐఐటీ బాంబే విద్యార్థిని షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. క్యాంపస్ మెస్ ఫుడ్ ఎలా ఉంది అనే విషయాలతో తన అనుభవాన్ని పంచుకుంది.భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో ఒకటైన ఐఐటీ బాంబే మెస్ గురించి అక్కడ చదువుకుంటున్న గరిమా తన యూ ట్యూబ్లో ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఇక్కడ మెస్ చాలా హైజీనిక్గా ఉంటుందని,ఫుడ్ కూడా చాలా బావుంటుందని వివరించింది. అంతే ఈ చిన్న యూట్యూబ్ వీడియో వైరల్ అయింది. "నేను హర్యానా నుండి వచ్చాను, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ఆహార సంస్కృతిని ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఐఐటీ బాంబే నాకు ప్రతిదీ పరిచయం చేస్తోంది."అని పేర్కొంది. ఇది 12 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. 4 లక్షలకు పైగా కామెంట్లువెల్లువెత్తాయి. 2024లో పోస్ట్ చేసిన ఈ వీడియో మళ్లీ ఇపుడు వైరలవుతోంది. 1300 కమెంట్స్ రావడంతో నెట్టింట ఇంట్రస్టింగ్గా మారింది.కాగా గరిమా @garimabagar పేరుతో యూట్యూబ్ ఛానెల్ను నిర్వహిస్తోంది. IIT బాంబే మెస్ టూర్లో ప్రతి పండుగ మెస్లో మా ప్లేట్లో కనిపిస్తుంది." అంటూ అక్కడ వడ్డించే ఆహారం గురించి మాట్లాడుతుంది.పొంగల్ సమయంలో, అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం,విద్యార్థులు నేలపై కూర్చుని తినడం గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. పొంగల్ రోజున, క్యాంటీన్ లోపల రంగోలి సాంప్రదాయ లేఅవుట్లో భోజనం వడ్డించారు. బియ్యం, సాంబార్, చట్నీ . స్వీట్లు వంటి వంటకాలను అరటి ఆకులపై వడ్డించాన్ని ఈ వీడియో చూడవచ్చు.అంతేకాదు ఈ సంప్రదాయంలో భాగంగా విద్యార్థులు నేలపై కూర్చుని తినడానికి ,,చెప్పులు తీసేసారని, తొలిసారి, సాంప్రదాయ దక్షిణ భారత పండుగ భోజనాన్ని ఆస్వాదిస్తున్నామని నిజంగా ఇది భిన్నమైన అనుభవం అని ఈ వీడియోలో వివరించింది. మరికొన్ని రోజుల్లో పొంగల్ సందడి రానున్న సందర్భంగా మళ్లీ ఇపుడు ఈ వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. -
వైకల్యాన్ని జయించిన సంకల్పం.. ఆ వైద్యుడి తదుపరి కల ఇదే!
విధి వెక్కిరించినా, సమాజం వెక్కిరించినా, తన కలను వదులకోలేదు. పట్టుదలగా తను అనుకున్నదిసాధించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే భారతదేశానికి చెందిన 3 అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య. తన కల సాకారం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదు. గుజరాత్లోని భావ్నగర్కు చెందిన మూడు అడుగుల గణేష్ ( 25) తాను పోరాడి సాధించిన MBBS కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య అధికారిగా నియమితుడయ్యారు. వికలాంగులకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి సివిల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పేరు దేశ మంతా మారిమోగిపోతోంది. గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా పుట్టుకనుంచి గణేష్ ఎదుగుదల సమస్య వచ్చింది. అందుకే ఆయన ఎత్తు మూడు అడుగులకే పరిమితం అయింది. మరుగుజ్జుత్వం కారణంగా 72శాతం లోకోమోటర్ వైకల్యంతో జన్మించిన గణేష్ బరయ్య కేవలం మూడు అడుగుల పొడవు , 20 కిలోల బరువు మాత్రమే. శారీరకంగా ఉన్న సమస్య కారణంగా చిన్నతనంనుంచే ఎన్నో అవమానాలు, అవహేళలను తప్పలేదు. 2018లో నీట్ యుజి పరీక్ష రాసిన సందర్భంగా అతనిలోని వైకల్యం కారణంగా భారత వైద్య మండలి ఆయన్ను తిరస్కరించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS కోర్సుకు అడ్మిషన్ తిరస్కరించడంతో గుజరాత్ హైకోర్టులో కేసు వేశారు. అక్కడా ఫలితం దక్కలేదు. అక్కడితో ఆగిపోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 2019లో మీకు సీటు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వైకల్యం కారణంగా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని గణేష్ బరయ్యకు హామీ ఇచ్చింది. చట్టపరమైన ఖర్చులను భరించడంలో సహాయపడిన గణేష్ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్భాయ్ కటారియా మద్దతుతో, బరయ్య సంకల్పం ఫలించింది.ఇదీ చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!రోగులు మొదట్లో చికిత్సను నిరాకరించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తను అలాంటి వాటి గురించి పట్టించుకోనని, దానికి బదులుగా తనతో సానుకూలంగా ఉన్న చాలా మంది రోగులపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. వైద్య అధికారిగా తనతదుపరి లక్ష్యం తన కుటుంబంకోసం ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది. భావ్నగర్ జిల్లాలోని గోర్ఖి గ్రామంలోని కచ్చా ఇంట్లోనే నివసిస్తోంది. వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇటుక ఇల్లు నిర్మించడం అనేది తన డ్రీమ్ అని చెప్పారు. #WATCH | Bhavnagar, Gujarat: Dr Ganesh Baraiya overcomes legal hurdles being differently abled and works as a medical officer in a civil hospital. He says, "... My primary education was from my village... I took the NEET UG exam in 2018 but at that time, the Medical Council of… pic.twitter.com/K2Ai2VeJ8c— ANI (@ANI) December 2, 2025 -
ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేసి..!
తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు. -
మోదీ.. పాత కేసులతో వేధించే ప్రయత్నం: ఖర్గే ఆగ్రహం
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.కేసు వివరాలు ఇలా.. దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలతోపాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. -
అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!
హీరోయిన్ సమంత రూతు ప్రభు, రాజ్ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్, ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టు కున్నారు. రాజ్ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్ శైలి పోట్రెయిట్కట్ డైమండ్ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్ కట్ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్, సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్ టాపిక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official)అరటి ఆకులో కమ్మటి భోజనంసమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం, పప్పు,కూరలతో కలర్పుల్గా కనిపించిన సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం, పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా ఈ ఫుడ్ను వడ్డించారు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది? -
విమర్శల వెల్లువ.. సంచార్ సాథీపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: సంచార్ సాథీ యాప్పై విమర్శలు వెల్లువెత్తున్న వేళ కేంద్రం స్పందించింది. సైబర్ మోసాలను నిరోధించేందుకు యాప్ తీసుకొస్తే, ప్రతిపక్షాలు గొంతెందుకు చించుకుంటున్నాయి? అని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రశ్నించారు. ఈ క్రమంలో.. సైబర్ఫ్రాడ్ నిరోధించేందుకే యాప్ రూపకల్పన జరిగిందని, అది 100కు వంద శాతం సురక్షితమైందని ప్రకటన చేశారు. సైబర్ ఫ్రాడ్ నిరోధించేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చాం. అది పూర్తిగా సురక్షితం. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అయితే ఇది అన్నింటిలాంటి యాపే. కచ్చితం ఏం కాదు. దీనిని ఉపయోగించడమా?.. లేదా?.. ఆక్టివేట్ చేయడమా ? డీయాక్టివేట్ చేయడమా ? అనేది వినియోగదారుల ఇష్టం. మా పని కేవలం యాప్ను అందరికీ పరిచయం చేయడం వరకే. ఇష్టం లేకుంటే వినియోగదారులు యాప్ డిలీట్ చేసుకోవచ్చు అని కేంద్రం తరఫున టెలికాం మంత్రి స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ యాప్ను తప్పనిసరిగా ఫోన్ల తయారీ సమయంలోనే ఇన్స్టాల్ చేయాలని.. అది యూజర్లు తొలగించడానికి కూడా వీలుగా ఉండకూడదని ఆదేశాలు జారీ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయంపై యాపిల్ లాంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాగా.. ఇటు వ్యక్తిగత గోప్యత విషయంలోనూ సందేహాలు వెలువెత్తాయి. అదే సమయంలో.. ప్రతీ పౌరుడి మొబైలోకి తొంగిచూడడం సరికాదని, డాటా చోర్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమంటూ విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ప్రకటనతో ఓ క్లారిటీ ఇచ్చినట్లైంది. -
ముంబైలో శంకర్ మహదేవన్ కొత్త రెస్టారెంట్ ప్రత్యేకతలివే!
సాక్షి, ముంబై: అద్భుతమైన గొంతుతో సంగీత ప్రియుల్ని ఉర్రూత లూగించిన సంగీత దిగ్గజం , గాయకుడు శంకర్ మహదేవన్ తన విభిన్నమైన రుచులు, దక్షిణ భారత వంటకాలతో ఆహార ప్రియుల్ని ఆకట్టు కుంటున్నారు. ముంబైలో శంకర్ మహదేవన్ రెస్టో-కేఫ్ ‘మాల్గుడి రెస్టారెంట్’ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ను ముంబైలో స్పెషల్గా ఎట్రాక్షన్గా నిలుస్తోంది. ముంబై నగరం దక్షిణ భారత ఆహారాన్నిబాగా ఇష్టపడతారు. క్లాసిక్ ఫిల్టర్ కాఫీ, మెత్తని ఇడ్లీలు, రకరకాల దోసెలు -స్టైల్ దోసెలు ఇవి నగరానికి స్పెషల్ ఆకర్షణ . ఈ నేపథ్యంలో శంకర్ మహదేవన్ ఫుడ్ బిజినెస్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ రెస్టారెంట్ల చెయిన్ పేరు మాల్గుడి డేస్. ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన "మాల్గుడి డేస్" అనే పుస్తకమే దీని ప్రేరణ. ప్రస్తుతం బోరివాలీలో ఒక రెస్టారెంట్ ప్రారంభం కాగా, చెంబూర్లో సౌత్ ఇండియన్, శంకర్ మహదేవన్, కొత్త అవుట్లెట్, ఫ్యామిలీ డైనింగ్, రెస్టో కేఫ్, ప్యూర్ వెజ్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇది ఉదయం 11 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకు అందుబాటులో ఉంది. ఇద్దరికి సుమారు రూ.850 ఖర్చవుతుంది. View this post on Instagram A post shared by MALGUDI SOUTH INDIAN RESTO-CAFÉ (@malgudi.ind)శంకర్ మహదేవన్, కె. ఎస్. రామకృష్ణన్ సహభాగస్వామ్యంతో ఈటోపియా హోల్డింగ్స్ మధ్య సహకారంతో మాల్గుడి రూపు దిద్దుకుంది. వచ్చే ఏడాది 2026లో దుబాయ్లో కూడా మాల్గుడి రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ కానుంది. ఈ రెస్టారెంట్ను ఇంటీరియన్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం విశేషం. ఇండిగో, టెర్రకోట రంగులు, ఇత్తడి లైటింగ్, కేన్ కుర్చీలు, టేకు టేబుళ్లతో పాటు, తీరప్రాంత గృహాలు, టెంపుల్ టౌన్స్ ప్రతిబింబించేలా ఉంటాయి. హ్యాండ్ పెయింటింగ్స్, చెట్టినాడ్-శైలిటైల్వర్క్, ఓపెన్ కిచెన్ లాంటివాటితో డైనమిక్ లుక్తో ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by MALGUDI SOUTH INDIAN RESTO-CAFÉ (@malgudi.ind)మాల్గుడి రెస్టారెంట్: ఫుడ్ మెనూకమ్మని వాసనతో సాంప్రదాయ ఫిల్టర్ కాఫీతో పాటు ఆధునికి కాపుచినో వెరైటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. శతాబ్దాల నాటి వంటకం ముల్బాగల్ లెగసీ నేతి దోస ఒక సిగ్నేచర్ ఆఫర్. ఇది ప్లెయిన్, మసాలా, చీజ్ మరియు చీజ్ మసాలా వైవిధ్యాలలో లభిస్తుంది. పోడి చీజ్ బాల్స్, అన్నా స్టైల్ క్రిస్పీ లోటస్ రూట్ ,బట్టర్ పెప్పర్ గార్లిక్ వాటర్ చెస్ట్నట్, కాకిస్ షీరా లభిస్తాయి. ఇంకా శంకర్ మహదేవన్కు ఎంతో ఇష్టమైన క్రీమీ శ్రీలంక తమిళ కర్రీని ఇడియప్పం ఉంటాయి. బిసి బెలే బిబింబాప్, పనీర్ నెయ్యి రోస్ట్ విత్ నీర్ దోస, వెన్ పొంగల్ అరన్సిని ,ఎలానీర్ పాయసం ఇలా ఎన్నో రుచులను ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది? -
వాయు కాలుష్యంపై వార్ ప్రకటించాలి: ఎంపీ అయోధ్య రామిరెడ్డి
ఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యంపై రాజ్యసభ జీరో అవర్లో వైఎస్ఆర్ సిపి ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పంధించారు. దీన్ని జాతీయ రాజకీయ, సామాజిక ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి. కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది ఆరోగ్య ఆర్థిక పరమైన సమస్య. వాయు కాలుష్యంతో మన దేశం ప్రతి ఏడాది మూడు శాతం జీడీపీని కోల్పోతుంది. ప్రజలపై వైద్య చికిత్సల భారం పడి ఉత్పాదకతను కోల్పోతున్నారు. కాలుష్యంతో తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు.ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంది. కాలుష్య నియంత్రణకు తగిన పాలసీ రూపొందించి కఠిన చర్యలు అమలు చేయాలి. వ్యర్ధాల నిర్వహణ, పవర్ ప్లాంట్ కంట్రోల్ , ఎయిర్ క్వాలిటీ, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలి. జాతీయ సామాజిక, రాజకీయ ప్రాధాన్యత అంశంగా దీన్ని తీసుకోవాలి. కాలుష్యం నియంత్రణకు రియల్ టైం డేటాతో తగిన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఇక్కడ ప్రతి ఏడుగురిలో ఒకరు అకాల మరణ ముప్పును కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్నారు.గతేడాది 17 వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. వాహన కాలుష్యం ,పంట వ్యర్ధాల దహనం, నిర్మాణ పనుల వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంది. ఈ తరహాలోనే విశాఖపట్నంలో కూడా పీఎం 10 లెవెల్స్ గడిచిన ఏడేళ్లలో 32.9 శాతం పెరిగింది. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం కింద ఏపీకి 129.4 కోట్లు కేటాయిస్తే 39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కింది స్థాయిలో పర్యవేక్షణ లోపం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం,స్థానిక యంత్రాంగ పట్టించుకోకపోవడంతో కాలుష్యం పెరుగుతుందని అయోధ్య రామిరెడ్డి అన్నారు. -
మావోయిస్టు పార్టీకి బిగ్షాక్.. దేవన్న లొంగుబాటు?!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగలనుందనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత, పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోబోతున్నట్లు ప్రచారం ఉధృతంగా నడుస్తోంది. తన దళం.. భారీగా ఆయుధాలతో సహా ఆయన లొంగిపోతారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.ఆపరేషన్ కగార్లో.. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్వాంటెడ్ మడివి హిడ్మా కిందటి నెలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలను దేవన్న స్వీకరించారనే ప్రచారం ఒకటి ఉంది. అయితే దండకారణ్యంలో తీవ్ర నిర్బంధాన్ని ఆయన దళం భరించలేకపోతోందన్నది ఆ ప్రచార సారాంశం. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం.. ఎన్కౌంటర్లలో మరణించడం.. జనవరి 1వ తేదీన భారీ సంఖ్యలో లొంగుబాటులు ఉంటాయని మావోయిస్టు నాయకత్వం నుంచి ప్రకటన వెలువడడం.. తదితర పరిస్థితుల నడుమ దేవన్న సైతం లొంగిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బార్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా( ఛత్తీస్గఢ్) పూవర్తి గ్రామం. హిడ్మా దేవన్నలది ఒకే ఊరు.. పక్కపక్కనే నివాసాలు కూడా!. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచి ఈ గ్రూప్తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత ప్రైజ్మనీ ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర _రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. ఓ పక్క నేటి నుంచి పీఎల్జీఏ 25 వ వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ.. బార్సే దేవా లొంగుబాటు గనుక నిజమైతే మావోయిస్టు పార్టీకి ఇక ఏమాత్రం కోలుకోలేని దెబ్బ అనే చెప్పొచ్చు. -
టన్నెల్లో నిలిచిపోయిన మెట్రో రైలు.. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
చెన్నైలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న టన్నెల్లో అకాలంగా నిలిచిపోయింది. దీనితో ప్రయాణికులు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ప్రారంభ సమయంలో బ్లూ లైన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. రైలులో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు వెలుగు లేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడివారు రికార్డ్ చేసిన వీడియోల్లో ప్రయాణికులు హ్యాండ్రెయిల్ పట్టుకుని బయట పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.అయితే పది నిమిషాల తర్వాత హైకోర్టు స్టేషన్ వరకు (దాదాపు 500 మీటర్లు) నడుచుకుంటూ వెళ్లాలని మెట్రో సిబ్బంది ప్రయాణికులకు తెలిపింది. అనంతరం వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కాగా ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉండొచ్చని అంచనా. అయితే పరిస్థితిని త్వరగా సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు.అనంతరం ఎక్స్లో చెన్నై మెట్రో అధికారులు స్పందిస్తూ ఎయిర్పోర్ట్ విమ్కో నగర్ డిపో బ్లూ లైన్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. గ్రీన్ లైన్లోని సెంట్రల్ మెట్రో–సెంట్ థామస్ మౌంట్ మార్గంలో కూడా రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.జరిగిన ఘటన వల్ల ఉదయం ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించడంతో మెట్రో సేవలు మళ్లీ సవ్యంగా కొనసాగుతున్నాయి. -
ఎస్ఐఆర్పై ఆగని రగడ.. లోక్సభ వాయిదా
Parliament Winter Session Updates..లోక్సభ వాయిదా.. లోక్సభలో ఎస్ఐఆర్పై రగడలోక్సభ మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా.. Lok Sabha adjourned to meet again at 12:00 Noon, after Opposition MPs entered the well of the House demanding a discussion on SIR pic.twitter.com/K2S4Pcu8FX— ANI (@ANI) December 2, 2025పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.రెండో రోజు సందర్భంగా ఎస్ఐఆర్ ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. #WATCH | Delhi | Opposition leaders, including Congress MP Sonia Gandhi, LoP Lok Sabha Rahul Gandhi and LoP Rajya Sabha, Mallikarjun Kharge, hold a protest against SIR in Parliament premises, on the second day of the winter session pic.twitter.com/wJDWl8tk5t— ANI (@ANI) December 2, 2025ఉభయ సభల్లో నిరసనలు.. ఎస్ఐఆర్పై చర్చించాలని రాజ్యసభలో విపక్షాల పట్టు.సభలో విపక్ష నేతల నినాదాలు.ఓట్ చోరీ ప్రభుత్వం అంటూ లోక్సభలో విమర్శలు. పార్లమెంట్ లోపల, వెలుపల సభ్యుల నినాదాలు.నిరసనల్లో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ప్రతిపక్ష నేతలు. అయితే, ఎన్నికల సంస్కరణలపై సిద్ధమన్న కేంద్రం. #WATCH | Opposition MPs raise slogans of "Vote chor, gaddi chhor", raising the issue of SIR and demanding a discussion on it in Lok Sabha, as the House proceedings begin on the second day of the winter session of the Parliament(Video source: Sansad TV/ YouTube) pic.twitter.com/SCr37YmlXh— ANI (@ANI) December 2, 2025 -
‘సీమ’ అరటి రైతులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలో.. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతులు తీవ్రసంక్షోభంలో ఉన్నారని, ధరలు భారీగా పతనం కావడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పులివెందుల ప్రాంతంలో అరటి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించారని, ఆయన సూచన మేరకు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. కరవు ప్రాంతమైనప్పటికీ రైతులు ఆధునిక టిష్యూ కల్చర్ (జీ9/కావెండిష్ రకం) ఎకరాకు 60–70 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారన్నారు. ప్రధాన సాగుప్రాంతమైన పులివెందులలో ఇటీవల వరకు టన్ను రూ.22 వేలు పలికిన అరటి ధర నెలరోజుల్లోనే టన్ను వందల రూపాయలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడి వచ్చినా గిట్టుబాటుధర లేకపోవడంతో పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గెలలు చెట్ల మీదే పండి కుళ్లిపోతున్నాయని, కొన్నింటిని పారవేస్తున్నారని తెలిపారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులు, కరవు కారణంగా 2025 ఖరీఫ్ సీజన్లో సాగు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ సాగుతో పోలిస్తే 19–35 శాతం మాత్రమే సాగు జరిగిందని చెప్పారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముంబై, కోల్కతా వంటి ప్రాంతాలకు రైలుమార్గం ద్వారా అరటిని తరలించాలని సీఎం ఆదేశించారని, అయితే ఇంతటి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతులకు ఇది ఏమాత్రం సరిపోదని తెలిపారు. కేవలం అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ పద్ధతులను ప్రోత్సహిస్తే సరిపోదని, మార్కెట్ కుప్పకూలినప్పుడు, ప్రకృతి సహకరించనప్పుడు రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ తక్షణమే స్పందించి రాయలసీమ అరటి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కడప విమానాశ్రయానికి రూ.606.4 కోట్లువైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు వైఎస్సార్ కడప జిల్లాలోని కడప విమానాశ్రయానికి ఉడాన్ పథకం కింద 2024–25లో రూ.606.4 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈ నిధులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేసినట్లు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ఈ విమానాశ్రయాన్ని 2017 మార్చి 30న రూ.99.36 కోట్లతో రీజనల్ కనెక్టివిటీ స్కీం కింద గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం కడప నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్కు ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు.జీపీఎస్ స్ఫూఫింగ్ నిజమేఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్ఫూఫింగ్ జరిగినమాట వాస్తవమేనని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ స్ఫూఫింగ్కు గురైనట్లు చెప్పారు. దేశంలో 15 విమానాశ్రయాలు ఉడాన్ పథకం కింద పనిచేయడంలేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ నిరంజన్రెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. పరిశ్రమలకు సకాలంలో ఆర్థిక సహాయాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిరంజన్రెడ్డి ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరన్దాల్జే చెప్పారు. దేశంలో సింగిల్ స్క్రీన్లు తగ్గుతున్నాయని, వాటి నిర్మాణం, పునరుద్ధరణ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాలని నిరంజన్రెడ్డి జీరో అవర్లో కోరారు. థియేటర్ ఫుడ్, బేవరేజెస్ ధరలపై నియంత్రణ తేవాలన్నారు.విశాఖ మెట్రోకు ప్రతిపాదనలురాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సమాన భాగస్వామ్య నమూన కింద 46.23 కిమీ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సవరించిన ప్రతిపాదనలను సమర్పించినట్లు కేంద్ర పట్టణాభివృది్ధశాఖ సహాయమంత్రి టోకాన్ సాహు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మెట్రో రైలు విధానం–2017 ప్రకారం అంచనా అవసరం, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యతపై ఆమోదం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందువల్ల మంజూరు కోసం ఎటువంటి సమయం పేర్కొనలేమని తెలిపారు. -
సంచార్ సాథీ యాప్.. భగ్గుమన్న విపక్షాలు
సాక్షి, ఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ కోసం కేంద్రం తీసుకువచ్చిన సంచార్ సాథీ యాప్పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించడమేనని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు.. అన్ని ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని ఫోన్ తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సైబర్ నేరాలను నిరోధించేందుకు పౌరుల భద్రత కోసం సంచార్ సాథీ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనిపై ప్రతిపక్షాలు వ్యతిరేకించడం గమనార్హం. -
సంచార్ సాథీ.. ‘వద్దు ప్లీజ్!’
దేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్న వేళ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం కోసం కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్తగా విక్రయించే అన్ని స్మార్ట్ఫోన్లలో.. ప్రభుత్వ యాప్ అయిన సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ(డాట్) అన్ని ప్రైవేట్గా మొబైల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్స్టాల్ చేయాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది.దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi App) చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. అయితే, ప్రభుత్వ యాప్ ఉండటం పట్ల కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు గోప్యతా హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. తమతో సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంపై మొబైల్ తయారీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యాపిల్, శామ్సంగ్, షియోమీ వంటి సంస్థలు యాప్పై స్పందించలేదు. సెల్ఫోన్లను విక్రయించడానికి ముందే ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్లను ఇన్స్టాల్ చేయడాన్ని సాధారణంగా యాపిల్ కంపెనీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తాజాగా కేంద్రం నిర్ణయం కారణంగా ఇది యాపిల్ సంస్థతో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే, కేంద్రం తీసుకువచ్చిన సంచార్ సేథీ యాప్ను డిలీట్ చేయలేని విధంగా తప్పనిసరి చేయడం అంటే గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది వినియోగదారుల స్వేచ్ఛను తగ్గిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై డిజిటల్ హక్కుల సంఘాలు సైతం స్పందిస్తూ.. నెటిజన్లపై ఇది అధిక నియంత్రణగా అభివర్ణిస్తున్నారు. వినియోగదారులు తమ పరికరంపై పూర్తి నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడనుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కాగా, సంచార్ సాథీ యాప్పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది పౌరుల గోప్యతకు భంగం కలిగించడమేనని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫోన్లలో ఈ యాప్ ఉండటం వల్ల అది ఫోన్ ట్యాపింగ్కు కూడా సహాయపడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో యాప్ విషయంలో కేంద్రం ఏదైనా సవరణ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. సైబర్ సెక్యూరిటీ అంటే?స్మార్ట్ ఫోన్ సైబర్ సెక్యూరిటీ (Cyber Security) అంటే మీ మొబైల్ పరికరాన్ని హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్, డేటా లీక్ల నుండి రక్షించడం. ఇది వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఫోటోలు, కాంటాక్టులు వంటి డేటా సురక్షితంగా ఉండేందుకు కీలకం.సెక్యూరిటీ చిట్కాలుబలమైన పాస్వర్డ్లు, బయోమెట్రిక్ లాక్లు (ఫింగర్ప్రింట్, ఫేస్ ఐడీ) వాడటం ముఖ్యం. మల్టీ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (MFA) ఉపయోగించి బ్యాంకింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలను సేఫ్గా చూసుకోండి.సాఫ్ట్వేర్ అప్డేట్స్ క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేయండి.పాత వెర్షన్లు హ్యాకర్లకు సులభంగా లక్ష్యం అవుతాయి.పబ్లిక్ Wi-Fi వాడేటప్పుడు VPN ఉపయోగించండి.అనుమానాస్పద లింకులు లేదా యాప్లు డౌన్లోడ్ చేయకండి.యాంటీ-వైరస్ లేదా మొబైల్ సెక్యూరిటీ యాప్లు వాడటం ద్వారా మాల్వేర్ దాడులను నివారించవచ్చు.ఎందుకు ముఖ్యమైంది?స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు వాలెట్, వర్క్స్టేషన్, వ్యక్తిగత అసిస్టెంట్లా మారాయి. బ్యాంకింగ్, ఆరోగ్య సమాచారం, వ్యక్తిగత ఫోటోలు ఇవన్నీ ఒకే పరికరంలో ఉండటం వల్ల సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారాయి. సైబర్ క్రైమ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ఫొటోలు మార్ఫింగ్ చేయడం పెరిగింది.అయితే ఈ సంచార్ సాథి యాప్ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించింది. అప్పటి నుంచి.. ఈ సంచార్ సాథి యాప్ ద్వారా 37 లక్షలకు పైగా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశారు. ఈ యాప్ ఇప్పటికే పోగొట్టుకున్న 7 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేయడంలో సహాయపడింది. ఇక, ఫోన్లో ఈ యాప్ ఉండటం వల్ల దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కేంద్ర రిజిస్ట్రీ ద్వారా బ్లాక్ చేయవచ్చు. -
భారత్లోని విమానాశ్రయాలపై సైబర్ దాడి
భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇది దేశ విమానయాన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలను పెంచుతూ, డిజిటల్ భద్రతా లోపాలను మరోసారి హైలైట్ చేసింది.ఏడు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజ్యసభలో ఇచ్చిన వివరణ ప్రకారం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్పూఫింగ్ జరిగినట్లు చెప్పారు. దాంతో జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్) ప్రభావితం అయినట్లు తెలిపారు. ఈ దాడుల కారణంగా నావిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక అవరోధాలు తలెత్తినప్పటికీ, విమాన కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్పార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏమిటి?తప్పుడు సిగ్నల్స్ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను ప్రభావితం చేసే ఒక సైబర్ దాడి. ఇది వాస్తవ స్థానం, ఎత్తు వంటి ముఖ్య సమాచారాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది భద్రతా ప్రమాదాలకు దారితీయవచ్చు. 2023 నవంబర్లో డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) జీఎన్ఎస్ఎస్ వ్యవస్థ ప్రభావితం చెందడంపై అడ్వైజరీ జారీ చేసినప్పటికీ, ఈ తరహా ఘటనలు 2025లో కూడా కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే దాడుల మూలాలను గుర్తించేందుకు ప్రభుత్వం వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO) సహాయంతో పరిశోధన ప్రారంభించింది. ప్రభావిత విమానాశ్రయాలు ప్రస్తుతం హై అలర్ట్లో ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలు నిరంతర భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ..‘ఈ దాడుల వల్ల విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదు. అయినా ఆకస్మిక చర్యలు, మెరుగైన సైబర్ ప్రతిచర్యలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్ -
దంపతులను బలిగొన్న పొగమంచు
కర్ణాటక: పొగమంచులో దారి కనిపించక కారు డివైడర్ను ఢీకొని అదుపు తప్పి పల్టీలు కొట్టింది, ఈ దుర్ఘటనలో కారులోని భార్యాభర్తలు అక్కడే మరణించారు. జిల్లాలోని మధుగిరి తాలూకాలోని జడగొండనహళ్ళి వద్ద బెంగళూరు హైవేలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పొరుగునే ఏపీలో ఉన్న మడకశిర తాలూకాలోని గుండంపల్ళివాసులు కృష్ణారెడ్డి (45), జ్యోతి (42) చనిపోగా, కుమారుడు మధుసూదన్రెడ్డి (17), బంధువు చిదంబరెడ్డి (45) తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నగరంలోని డాన్బాస్కో పాఠశాలలో జ్యోతి ఉద్యోగి. భర్త కూడా బెంగళూరులోనే ఉండేవారు. ఓ జాతరకు సొంతూరికి వెళ్లి కుటుంబంతో కలిసి తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ముందు దారి కనిపించక ప్రమాదం జరిగింది. కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైఎస్సార్సీపీ వార్డుమెంబరు కావడంతో మృతదేహాలకు పెద్దసంఖ్యలో నేతలు, జనం నివాళులు అరి్పంచారు. -
వీడు మనిషి కాదు.. భార్యను చంపి సెల్ఫీ..
తమిళనాడు: నెల్లై జిల్లాలో మహిళా హాస్టల్లో చొరబడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన వ్యక్తి బాలమురుగన్. అతని భార్య శ్రీప్రియ(32). వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమురుగన్, శ్రీప్రియల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి టౌన్హాల్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఆమె ఉంటోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలిసేందుకు బాలమురుగన్ నెల్లై నుంచి వచ్చాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీప్రియ బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలమురుగన్, తాను దాచి ఉంచిన కత్తిని తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. కత్తి వేటు మెడపై బలంగా పడడంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ మృతి చెందింది. భార్య రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతూ మృతి చెందింది. శ్రీప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహం పక్కన ఒక కుర్చీ వేసి అందులో కూర్చుని సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ద్రోహానికి జీతం మరణం అని పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలమురుగన్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శ్రీప్రియ ఒక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, అందుకే హత్య చేశానని బాలమురుగన్ పోలీసులకు తెలిపాడు. శ్రీప్రియను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆదివారం వచ్చానని, సముదాయించినట్లు నటించి ఆమెను హత్య చేశానని తెలిపాడు. -
డీకే విందులో సిద్దరామయ్యకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు
ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్ఫాస్ట్ భేటీలు. అందరికీ నోరూరేలా పలు రకాల వంటకాలతో వారి సమావేశాలు జరుగుతూ రచ్చను చల్లార్చే ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి.బెంగుళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మూడురోజుల కిందట అల్పాహార విందును ఆతిథ్యమిచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఇప్పుడు తానే అతిథిగా మారారు. ఈదఫా డీకే విందు ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్దుకు ఇష్టమైన నాన్ వెజ్ ఉండే వీలుంది. మంగళవారం ఉదయం సదాశివనగరలోని డీసీఎం నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం ఉత్కంఠ పుట్టిస్తోంది. సిద్దరామయ్య ఇంట విందులో ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించి, కుర్చీ రగడకు విరామం ఇచ్చినట్లు చాటుకున్నారు. ఇది ఫలించినట్లుగా ఉందనుకున్న హైకమాండ్ తిరుగు విందు ఇవ్వాలని డీకేశిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని సువర్ణసౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలకు కుర్చీ మారి్పడి గందరగోళం ఆయుధం కాకూడదని సీఎం, డీసీఎం తీర్మానించారు. హైకమాండ్ ఆవరణలో బంతి.. గత 15 రోజుల నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో సీఎం సీటు తగాదా తారాస్థాయికి చేరింది. హైకమాండ్ మనసులో ఏముందో బయట పెట్టకుండా సామరస్య పరిష్కారానికి సూచనలు చేస్తోంది. మీరిద్దరే కూర్చొని చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చి ఆ తరువాత ఢిల్లీకి రండని సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎం విందు భేటీల ద్వారా తమ టాసు్కలను పూర్తి చేస్తుండగా, ఢిల్లీలో హైకమాండ్ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సోనియాగాం«దీ, రాహుల్గాందీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇక్కడి పరిణామాలను వివరించి, త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. సోనియా, రాహుల్ త్వరలోనే ఇద్దరినీ పిలిపించుకొని కార్యాచరణను తెలియజేస్తారని కాంగ్రెస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వారంలో మొదలవుతాయి, ఆ తరువాత హైకమాండ్ నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం. -
డీకే సీఎం అయ్యేది అప్పుడే: సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్లో అధికార పంపిణీపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్కు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎంకు డీకే, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అల్పాహారంలో నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు.బ్రేక్ ఫాస్ట్ అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం మార్పుపై అధిష్టానానిదే తుది నిర్ణయం. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే శివకుమార్ అప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. హైకమాండ్, రాహుల్ గాంధీ ఆదేశాలను మేము పాటిస్తాం. రేపు డీకే, నేను కేసీ వేణుగోపాల్ను కలుస్తాం. మేము కలిసే ఉన్నాం. మా మధ్య విభేదాలేమీ లేవు. మేమంతా కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah says, "There are no differences. DK Shivakumar and I are united. We are running the government. In the future also, we will run the government unitedly..." pic.twitter.com/uM4cjTNDL7— ANI (@ANI) December 2, 2025ఇక, అంతకుముందు.. సీఎం సిద్దరామయ్యను మంగళవారం బ్రేక్ ఫాస్టుకు ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్బంగా డీకే శివకుమార్..‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం, మరింత సమన్వయంతో కలిసి పనిచేయడం గురించి మాట్లాడటానికి, ముఖ్యమంత్రిని రేపు బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించాను’ అని రాసుకొచ్చారు. డిప్యూటీ సీఎం ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య సదాశివనగర్లోని నివాసానికి రాగా.. బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్ ఆయన్ను సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఓ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది. పార్టీ దీనిని పదేపదే ఖండిస్తున్నా.. ఈ అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.అయితే, గత శనివారమే వీరిద్దరూ సిద్ధరామయ్య ఇంట్లో సమావేశం అయిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ప్రకటించారు. అధిష్ఠానం ఏం చెబితే తామిద్దరం అదే పాటిస్తామని తెలిపారు. #WATCH | Bengaluru, Karnataka | Dy CM DK Shivakumar and his brother DK Suresh welcome CM Siddaramaiah at their residence. pic.twitter.com/g5f1dWMzvo— ANI (@ANI) December 2, 2025 #WATCH | Bengaluru | Karnataka CM Siddaramaiah reaches Dy CM DK Shivakumar's residence, at his invitation for a breakfast meeting (Visuals from outside Dy CM DK Shivakumar's residence) pic.twitter.com/OmWK5dpwmT— ANI (@ANI) December 2, 2025 -
హైదరాబాద్: ముంబైలో ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ‘మానవ బాంబు’ బెదిరింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. కువైట్ నుంచి శంషాబాద్కు ఈ ఉదయం(మంగళవారం) రావాల్సిన విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. గత అర్ధరాత్రి 1.30గం. కువైట్ నుంచి ఇండిగో ప్లైట్ 6ఈ1234 హైదరాబాద్కు బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.10గం.కి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే బాంబ్ బెదిరింపు మెయిల్తో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. అటు విమానం ముంబైలోనూ ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే కాసేపటికి సేఫ్ ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మానవ బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రయాణికులను ఒక్కొక్కరిగా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
బిజీ బ్యాంకులోకి అనుకోని అతిథి!
అదొక బిజీ బ్యాంకు. నిత్యం కస్టమర్ల వెయింటింగ్తో.. సిబ్బంది పిచ్చాపాటి కబుర్లతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బ్యాంకుకు అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు టేబుల్స్, బీరువాలు.. కనిపించినదానిపైకల్లా పైకి ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు.. అతిజాగ్రత్తగా ఆ అతిథిని బయటకు పంపించేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో దాటియా థారెట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓ పాము చొరబడింది. కానీ, ఎప్పుడు జరిగిందనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Snake in Punjab National Bank (PNB) Branch in Tharet, Datia near Gwalior, Madhya Pradesh. Work disrupted, staff in Panic!! @pnbindia pic.twitter.com/8wpiC1yHRQ— Hellobanker (@Hellobanker_in) November 29, 2025 -
ఇండియా సాయం కోరిన పాక్.. భారత్ గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్ అనుమతించలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్ క్లారిటీ ఇచ్చింది.వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్.. భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఈ సందర్బంగా భారత్.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పోలీసులే అన్నను ఎగదోశారు
నాందేడ్: వేరే కులం అనే కారణంగా యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆ యువతి తాజాగా ఆరోపించింది. దీంతో పోలీసుల పాత్రపై అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు మొదలెడతామని ఎస్పీ అబినాశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆన్చల్ మమిద్వార్ అనే యువతిని సక్షమ్ తాటే అనే వేరే కులం అబ్బాయి ప్రేమించడం, ఇది నచ్చని ఆమె తండ్రి, సోదరులు యువకుడిని సోమవారం చంపేయడం తెల్సిందే. సక్షమ్ అంత్యక్రియలు జరుగుతుండగా అక్కడికొచ్చిన ఆన్చల్ అతడి మృతదేహంతోనే వివాహమాడిన విషయం విదితమే. ఈ హత్యోదంతంపై ఆన్చల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘సోమవారం సక్షమ్ను చంపేయడానికి ముందే నన్ను నా సోదరుడు హిమేశ్ స్థానిక ఇటా్వరా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. సక్షమ్పై తప్పుడు ఫిర్యాదుచేయాలన్నాడు. అందుకు నేను ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో కోపంతో అక్కడి ఇద్దరు పోలీసులు హిమేశ్ను హత్య కు పురిగొల్పారు. వాళ్లతో వీళ్లతో గొడవపడే బదులు నేరుగా వెళ్లి సక్షమ్ను చంపేసెయ్ అని హిమేశ్ను ఉసిగొల్పారు. అప్పుటికే హిమేశ్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. సక్షమ్ను చంపేశాక పోలీస్స్టేషన్కు వస్తా అనుకుంటూ వెళ్లిపోయాడు. అనుకున్నట్లే సక్షమ్ను చంపేశాడు. దమ్ముంటే నువ్వు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చెయ్ అని నాతో సవాల్ చేశాడు’’అని మహిళ రోదిస్తూ చెప్పింది. ‘‘నా డిమాండ్ ఒక్కటే. సక్షమ్ను చంపేసిన నా తండ్రి, సోదరులు సైతం అదే రీతిలో శిక్షను అమలుచేయాలి. హత్యతో సంబంధం ఉన్న వాళ్లందరీన ఉరితీయాలి. ప్రాణాలు వదిలినా సరే సక్షమే నా భర్త. ఇకపై అతని కుటుంబంతోనే అతని ఇంట్లోనే ఉంటా. సక్షమ్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటా’’అని ఆమె తెలిపింది. ఆన్చల్ ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. ‘‘హత్యోదంతంలో పోలీసుల పాత్ర ఉందనేది తీవ్రమైన ఆరోపణ. ఈ విషయంపై దర్యాప్తు చేస్తాం. వాస్తవానికి మృతుడు సక్షమ్, నిందితుడు హిమేశ్ ఇద్దరికీ నేరచరిత్ర ఉంది. గతంలో ఇద్దరూ మంచి మిత్రులు. హత్య, దాడిసహా భారతీయ న్యాయసంహిత, ఎస్సీ/ఎస్టీ(వేధింపుల నిరోధక)చట్టం, భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టాల కింద ఆరుగురిపై కేసు నమోదుచేశాం’’అని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిని మూడ్రోజులపాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
రుబయ్యా సయీద్ కిడ్నాప్ కేసు..
న్యూఢిల్లీ: 1989లో అప్పటి కేంద్ర హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా కిడ్నాప్ కేసులో కుట్రధారుగా భావిస్తున్న షఫత్ అహ్మద్ షంగ్లూను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. నిషేధిత జేకేఎల్ఎఫ్తో ప్రమేయమున్న ఈ కిడ్నాప్ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తాజాగా పట్టుబడిన షంగ్లూ జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్కు సన్నిహితుడు. రుబయ్యా సయీద్ కిడ్నాప్కు షంగ్లూ, యాసిన్ మాలిక్ కలిసి కుట్ర పన్నారు. 35 ఏళ్లుగా ఇతడు తప్పించుకు తిరుగుతున్నాడు. వీరిపై రణ్బీర్ పీనల్ కోడ్తోపాటు 1989నాటి టాడా చట్టం కింద కేసులున్నాయని సీబీఐ తెలిపింది. షంగ్లూ తలపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉందని పేర్కొంది. ఇతడిని జమ్మూలోని టాడా కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించింది. జేకేఎల్ఎఫ్ ఆర్థిక వ్యవహారాలన్నీ షంగ్లూ యాజమాన్యంలోనే సాగేవని అధికారులు చెప్పారు. శ్రీనగర్లోని నిషాత్ ప్రాంతంలోని తన నివాసంలో ఉన్న షంగ్లూను సీబీఐ, కశీ్మర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారని వివరించారు. జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ 2019 నుంచి తిహార్ జైలులో ఉండటం తెల్సిందే. రుబయ్యా సయీద్ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. జైలులో ఉన్న ఐదుగు రు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, అప్పట్లో బీజేపీ మద్దతుతో కేంద్రంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం అందుకు తలొగ్గడంతో కథ సుఖాంతమైంది. -
లోపల ఉన్న వాళ్లే కరుస్తారు
న్యూఢిల్లీ: శీతాకాల సమా వేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వెంట కారులో ఒక వీధిశునకాన్ని తీసుకురావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా రేణుకా దీటుగా బదులిచ్చారు. సోమవారం ఉదయం ఒక వీధిశునకాన్ని ఆమె కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వెటర్నరీ వైద్యునికి చూపించేందుకు బయల్దేరారు. డ్రైవర్ ఈమెను మార్గమధ్యంలో పార్లమెంట్ వద్ద దింపేసి వెటర్నరీ ఆస్పత్రికి వెళ్తామనుకున్నాడు. ఈలోపే పార్లమెంట్ వద్ద రేణుక కారులో కుక్క ఉండటం చూసి బీజేపీ నేతలు విమర్శలు మొదలెట్టారు. పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలు ఎంత ముఖ్యమైనవో కాంగ్రెస్ నేతలకు బోధపడటం లేదు. ఇలా కుక్కలను తీసుకొచ్చి తమాషా చేస్తున్నారు. ఈ అంశాన్ని రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లాలి ’’ అని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అన్నారు. దీంతో రేణుకాచౌదరి తీవ్రంగా స్పందించారు. ‘‘ ప్రభుత్వానికి అసలు కుక్కలంటే గిట్టదనుకుంటా. జంతువులు సమస్యలు చెప్పుకోలేవు. అయినా ఈ శునకం నా కారులో ఉందికదా. బయటకు రాలేదు. అయినా ఇది చాలా చిన్న కుక్క. ఇవేమీ కరవవు. కరిచే వాళ్లు వేరే ఉన్నారు. వాళ్లు పార్లమెంట్ లోపల ఉన్నారు. వీధిశునకాలను కాపాడకూడదని ఏ చట్టంలో రాసి ఉంది? ’’అని రేణుక వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వెటకారంగా స్పందించారు. ‘‘ ఆమె చెప్పింది నిజమే. కుక్కలు అస్సలు కరవవు. విపక్ష సభ్యులు ముఖ్యంగా ఆమె సొంత పార్టీ నేతలే ఇరుసభల్లో హంగామా సృష్టించి కరిచినంత పనిచేస్తారు. పార్లమెంట్కు మీరు కుక్కలను వెంట తీసుకొస్తే మేం అధికారాన్ని వెంట తీసుకొస్తాం’’ అని అన్నారు. -
మసాలా బాండ్ కేసులో కేరళ సీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: మసాలా బాండ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ న్కు, మాజీ మంత్రి థామస్ ఇస్సాక్కు, సీఎం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహాంకు సోమవారం ఈడీ నోటీసులు పంపింది. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ బోర్డ్ అధికారులు రూ.466.91 మేర విదేశీ మారకద్రవ్య నియంత్రణ నిబంధనలను, ఆర్బీఐ షరతు లను ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి జూన్ 27వ తేదీన కేసు నమోదు చేసింది. కేఐఐఎఫ్బీకి కేరళ సీఎం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. -
10న సహ చట్టం ప్రధాన కమిషనర్ ఎంపిక
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ ఎంపిక, నియా మకంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు స్పష్టత నిచ్చింది. ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశ మయ్యే కమిటీ ప్రధాన కమిషనర్తోపాటు కమిషనర్ల పోస్టులకు పేర్లను పరిశీలించనున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ఈ విషయం తెలిపారు. ప్రధాని సారథ్యంలోని ఎంపిక కమిటీలో ప్రతిపక్ష నేత, ఒక కేంద్ర మంత్రి ఉంటారు. ఈ కమిటీ ప్రధాన సహ కమిషనర్ను, ఇతర కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుంది. రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్లలో ఖాళీల వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఎస్ఐఆసీలను ఆదేశించింది. -
చలి తీవ్రత ఎక్కువే
న్యూఢిల్లీ: డిసెంబర్ 2025– 2026 ఫిబ్రవరి వరకు మూడు నెలల సీజన్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. మధ్య భారత, వాయవ్య ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ భారతంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హరియాణా, పంజాబ్తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం ఈసారి నాలుగైదు రోజులపాటు అదనంగా ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా డిసెంబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో ఆరు రోజులపాటు శీతల గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. ఈ సీజన్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువగానే ఉష్ణోగ్రతలుంటాయని పేర్కొన్నారు. నవంబర్8–18వ తేదీల మధ్య మొదటిసారి శీతల గాలుల ప్రభావం రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందన్నారు. అదేవిధంగా, ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్య, వాయవ్య ప్రాంతాల్లో శీతలగాలుల ప్రభావం ఉండొచ్చని వివరించారు. -
లక్ష్మణరేఖను దాటొద్దు
న్యూఢిల్లీ: ఇటీవల ఉపరాష్ట్రపతిగా ప్రమాణంచేసిన సీపీ రాధాకృష్ణన్ సోమవారం మొదలైన పార్లెమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిసారిగా రాజ్యసభ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలుకాగానే సభ్యులను ద్దేశించి రాధాకృష్ణన్ మాట్లాడారు. ‘‘రాజ్యాంగబద్ధ సంస్థలను సభ్యులంతా గౌరవించాలి. దేశానికి సంబంధించిన తమ బాధ్యతలను సభ్యులు గుర్తెరగాలి. దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా అవతరింపజేయడంలో మీ వంతు కృషిచేయండి. ఈసారి సిట్టింగ్లో చాలా ఎక్కువ అంశాలపై రాజ్యసభలో చర్చించాల్సి ఉంది. సమయం చాలా తక్కువ ఉండటంతో ఇది నాకూ, మీకూ ఎంతో సవాల్తో కూడిన విషయం. రాజ్యసభ ఛైర్మన్గా నాకు సాదరస్వాగతం పలికి సభాధ్యక్ష స్థానందాకా వెంట నడిచిన ప్రధాని మోదీ, అన్ని పార్టీల సభ్యులకు నా కృతజ్ఞతలు. ప్రధాని మోదీ నా గురించి మాట్లాడేటప్పుడు క్రీడాకారునిగా ఉన్నప్పటి నా గతకాలపు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. క్రీడాకారుడంటేనే కచ్చితమైన నిబంధనలను పాటించాలి. అలాగే ఈ సభలోని సభ్యులు సైతం రాజ్యసభ పార్లమెంటరీ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలి. లక్ష్మణరేఖ దాటకూడదు. లక్షణరేఖకు లోబడే ప్రతి ఒక్క సభ్యుని హక్కులకు విలువ లభిస్తుంది. న్యాయబద్ధమైన అభ్యంతరాలను పరిశీలిస్తా. కర్షకులు, కార్మికులు, వీధి వ్యాపారులు, మహిళలు, యువత, నిరుపేదల ఆకాంక్షలను పార్లమెంట్ ప్రతిబింబించాలి. సమాజంలో ఎస్సీ, ఎస్టీలు, వెనకబడిన, అణచివేతకు గురైన వర్గాల సామాజికన్యాయం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ రాజ్యాంగంపట్ల మన నిబద్ధతను చాటుదాం. సభ్యులు రాజ్యసభలో ఉన్నంతసేపు తమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకన్కాలాన్ని అర్ధవంతమైన చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పటిష్టంచేసేందుకు సద్వినియోగం చేయాలి ’’ అని రాధాకృష్ణన్ అన్నారు.


