‘పాకిస్తాన్‌ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’ | Its Jay Shah vs Pakistan Match Congress MP Sukhjinder Singh | Sakshi
Sakshi News home page

‘పాకిస్తాన్‌ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’

Feb 15 2026 7:07 PM | Updated on Feb 15 2026 7:07 PM

Its Jay Shah vs Pakistan Match Congress MP Sukhjinder Singh

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని  ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్‌ ఎంపీ సుఖిందర్‌ సింగ్‌  రంధావా. పాకిస్తాన్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటూ అభివర్ణించారు. ఇది భారత్‌-పాకిస్తాన్‌ల మ్యాచ్‌ కాదని,  కేవలం జై షా-పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ మాత్రమేనన్నారు. యావత్‌ భారతావని.. పాకిస్తాన్‌తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. 

‘ పాకిస్తాన్‌ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్‌ దుశ్చర్యలు బాగా తెలుసని  ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఇది భారతావని కోరుకునే మ్యాచ్‌ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్‌తో మ్యాచ్‌ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్‌గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్‌ జరుగుతుంది. భారత్‌కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement